breaking news
india vs west indies
-
ICC Rankings: సత్తాచాటిన కుల్దీప్ యాదవ్.. కెరీర్లోనే తొలిసారి
వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్కు చేరాడు. న్యూఢిల్లీ వేదికగా విండీస్తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ (683 పాయింట్లు) 7 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్కు చేరాడు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా (882 పాయంట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా... హైదరాబాదీ పేసర్ సిరాజ్ (726 పాయింట్లు) 12వ ‘ప్లేస్’లో ఉన్నాడు. బ్యాటింగ్లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (753 పాయింట్లు) రెండు స్థానాలు మెరుగు పరుచుకొని భారత్ తరఫున అత్యుత్తమంగా ఐదో ర్యాంక్ కు చేరుకున్నాడు. పంత్ (753 పాయింట్లు) 8వ స్థానంలో ఉన్నాడు.వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తిరిగి అగ్రస్థానానికి చేరాడు. ఇటీవల బంగ్లాదేశ్తో సిరీస్లో 11 వికెట్లతో సత్తా చాటిన రషీద్ ఖాన్ ఐదు స్థానాలు ఎగబాకి 710 పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్ అందుకున్నాడు. టీమిండియా కెప్టెన్ గిల్ (784 పాయింట్లు) ‘టాప్’లోనే ఉన్నాడు.చదవండి: IND vs AUS: ఆసీస్తో తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే! మ్యాచ్ విన్నర్కు నో ఛాన్స్? -
WTC: రెండో స్థానంలోకి దూసుకువచ్చిన పాక్
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. సొంతగడ్డపై సౌతాఫ్రికా (Pak vs SA)తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. స్పిన్కు అనుకూలించే పిచ్పై రాణించి.. పర్యాటక సఫారీ జట్టును 93 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో తొలి గెలుపు నమోదు చేసింది.రెండో స్థానానికి దూసుకువచ్చిన పాక్ఈ క్రమంలో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ రెండో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటికి ఆడిన ఒక్క మ్యాచ్లో గెలవడం ద్వారా.. వందకు వంద విజయ శాతం నమోదుతో ఊహించని రీతిలో టాప్-2లోకి చేరుకుంది. ఇక ఈ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది.ఆసీస్ వందకు వంద శాతండబ్ల్యూటీసీ 2025-27లో ఆసీస్ జట్టు తొలుత వెస్టిండీస్తో తలపడింది. విండీస్ వేదికగా జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆతిథ్య జట్టును 3-0తో వైట్వాష్ చేసింది. ఇక మూడో స్థానంలో ఉన్న శ్రీలంక.. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఒకటి డ్రా చేసుకుని.. రెండో మ్యాచ్లో గెలుపొందింది.అత్యధిక మ్యాచ్లు ఆడింది టీమిండియానే.. అందుకే ఇలాఇక ఈ సీజన్లో ఇప్పటికే ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తొలుత ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్న గిల్ సేన.. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు గెలిచి.. ఒకటి డ్రా చేసుకుంది. మరో రెండింటిలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడిన టీమిండియా.. 2-0తో విండీస్ను వైట్వాష్ చేసింది. తద్వారా ఇప్పటి వరకు నాలుగు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా ద్వారా 52 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక టీమిండియాపై రెండు టెస్టులు గెలిచిన ఇంగ్లండ్.. ఒకటి డ్రా చేసుకోవడం ద్వారా మొత్తంగా 26 పాయింట్లతో టాప్-5లో నిలిచింది.ఖాతా తెరవని విండీస్కాగా ఈ సీజన్లో ఇప్పటికి ఐదు టెస్టులు ఆడిన వెస్టిండీస్ మాత్రం ఇంత వరకు గెలుపు ఖాతా తెరవలేదు. కనీసం ఒక్క మ్యాచ్నైనా డ్రా కూడా చేసుకోలేకపోయింది. దీంతో సున్నా పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఇప్పటి వరకు న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ 2025-27 ప్రయాణం మొదలుపెట్టనే లేదు. పాయింట్లు ఇలాకాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం.. టెస్టు గెలిచిన జట్టుకు పన్నెండు పాయింట్లు వస్తాయి. ఒకవేళ ఇరుజట్ల మధ్య మ్యాచ్ డ్రా అయితే.. నాలుగు పాయింట్లు.. టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. ఇక 2017లో తొలిసారి డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టగా 2019 నాటి ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించి.. మొట్టమొదటి చాంపియన్గా అవతరించింది.ఇక 2019-23 ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాపై గెలుపొంది టైటిల్ సాధించగా.. 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఐసీసీ గద గెలుచుకుంది. ఇప్పటికి రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్తోనే సరిపెట్టుకున్న టీమిండియా.. కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలోనైనా పని పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది.పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టెస్టు👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 378👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 269👉పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 167👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 183👉ఫలితం: సౌతాఫ్రికాపై 93 పరుగుల తేడాతో పాక్ గెలుపు.PC: ICCచదవండి: ఇప్పటికీ అవే వాడుతున్నాడు.. వాటిని అస్సలు మార్చడు: సూర్య -
టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (అక్టోబర్ 15) ముగిసిన రెండో టెస్ట్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.ఈ సిరీస్ గెలుపుతో టీమిండియా వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. ఈ సిరీస్కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. ఈ సిరీస్ గెలుపుతో భారత్ ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి ఈ సంఖ్యను 61.90కి పెంచింది.విండీస్ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత భారత్ పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 52 పాయింట్లు సాధించింది.ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్ల్లో ఓ విజయం, ఓ డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.ఈ జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67), వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఉన్నాయి.కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా తదుపరి టాస్క్ నవంబర్లో ఎదుర్కొంటుంది. నవంబర్ 14 నుంచి సౌతాఫ్రికా భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్ ఫైర్.. బీసీసీఐ స్పందన ఇదే -
అన్ని ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాము.. సంతోషంగా ఉంది: గిల్
శుభ్మన్ గిల్.. టీమిండియా కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో గిల్ సారథ్యంలో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.ఢిల్లీ టెస్టులో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. యశస్వి జైశ్వాల్(175), శుభ్మన్ గిల్(129), సాయిసుదర్శన్(87) బ్యాటింగ్లో సత్తాచాటగా.. కుల్దీప్ యాదవ్( 8 వికెట్లు), జడేజా(4 వికెట్లు), జస్పీత్ బుమ్రా (4) బౌలింగ్లో మాయ చేశారు. ఇక విజయంపై మ్యాచ్ అనంతరం గిల్ స్పందించాడు. తన నాయకత్వ అనుభవం, జట్టు వ్యూహాలపై గిల్ మాట్లాడాడు."భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కెప్టెన్గా తొలి సిరీస్ విజయాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతీ ఆటగాడితో కలిసి పనిచేయడం, జట్టును నడిపించడం వంటివి నేను నేర్చుకుంటున్నాను.పరిస్థితులకు తగ్గ నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాను. కొన్ని సందర్భాల్లో ధైర్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి కొన్ని సార్లు ఎక్స్-ఫాక్టర్ ఆటగాళ్లను రంగం దించాల్సి వవస్తుంది. ఏ ఆటగాడైతే పరుగులు లేదా వికెట్లు అందించగలడో వారిని ఎక్స్-ఫాక్టర్గా ఉపయోగించుకోవాలి" అని గిల్ చెప్పుకొచ్చాడు.ఫాలో-ఆన్ నిర్ణయం గురించి మాట్లాడుతూ.. "విండీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మేము సుమారు 300 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. ఐదో రోజున వికెట్లు తీయడం కష్టం అవుతుందనే భావించి ఫాలో-ఆన్ ఆడించాము. మేము 500 పరుగులు చేసినా.. ఆఖరి రోజు ఆటలో వికెట్లు పడగొట్టడం కష్టమవుతుందని ఫాలో ఆన్ను అమలు చేశాము.నితీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ .. నితీష్కు ఈ మ్యాచ్లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. విదేశాల్లో మాత్రమే కాదు, ఇక్కడ పిచ్లపై కూడా అతడిని అలవాటు చేయాలని చూస్తున్నాము. విదేశీ గడ్డపై మ్యాచ్లను గెలవడంలో మాకు సహాయపడతారని భావించే కొంతమంది ఆటగాళ్లను మేము ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాము. ఎందకంటే అక్కడ గెలవడం మాకు ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. నేను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు కేవలం బ్యాటర్గానే ఆలోచిస్తాను. నేను 3-4 ఏళ్ల వయసు నుంచి బ్యాటింగ్ చేస్తున్నాను. క్రీజులోకి వెళ్లిన ప్రతీసారి జట్టును గెలిపించడమే నా లక్ష్యంగా పెట్టుకుంటా. ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రణాళికలు రచించలేదు. ఫ్లైట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు నవ్వుతూ గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు.. -
IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు..
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరింది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గిల్ సేన 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.121 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆఖరి రోజు తొలి సెషన్లోనే మ్యాచ్ ముగిసిపోయింది. భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ 58 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలవగా.. సుదర్శన్(39) రెండో ఇన్నింగ్స్లోనూ సత్తాచాటాడు. అంతకుముందు యశస్వి జైశ్వాల్, గిల్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 518/5 డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అయితే రెండో ఇన్నింగ్స్లో విండీస్ బ్యాటర్లు పోరాడారు. క్యాంప్బెల్, హోప్లు సెంచరీలతో సత్తాచాటడంతో సెకెండ్ ఇన్నింగ్స్లో కరేబియన్ జట్టు 390 పరుగులు చేయగల్గింది. దీంతో విండీస్ 121 పరుగుల టార్గెట్ను భారత్ ముందు ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఆడుతూ పాడుతూ చేధించింది.సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్లో అద్బుతమైన విజయం సాధించిన భారత్ ఓ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఒకే జట్టుపై వరుసుగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా సరసన టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా టీమ్ విండీస్(1998-24)పై వరుసగా 10 సార్లు టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది.భారత్ కూడా వెస్టిండీస్ (2002-25)పై 10 సార్లు టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాత ఆస్ట్రేలియా ఉంది. విండీస్పై ఆసీస్ ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్లలో పై చేయి సాధించింది.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ క్లీన్ స్వీప్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో గిల్ సేన క్లీన్ స్వీప్ చేసింది.63/1 ఓవర్ నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ సాయిసుదర్శన్(39), కెప్టెన్ గిల్(13) వికెట్ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(58 నాటౌట్), ధ్రువ్ జురెల్(6 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ ఛేజ్ రెండు, వారికన్ ఓ వికెట్ సాధించారు. కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం. సెంచరీలతో మెరిసిన హోప్, క్యాంప్బెల్..కాగా ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో అద్బుతమైన పోరాటం కనబరిచింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో కదం తొక్కారు. దీంతో కరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓ దశలో భారత్ ముందు మెరుగైన టార్గెట్ను ఉంచేలా కన్పించిన విండీస్ బ్యాటర్లు.. మరోసారి కుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి చిత్తు అయ్యారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ను ముగించింది.అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది.భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్మన్ గిల్(129) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 8 వికెట్ల పడగొట్టాడు. అతడితో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించారు.చదవండి: అర్జున్ టెండూల్కర్కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు -
IND VS WI: విండీస్ బ్యాటర్ల అనూహ్య ప్రతిఘటన.. ఫలితం చివరి రోజే..!
న్యూఢిల్లీ టెస్ట్లో భారత్ గెలుపు కోసం చివరి రోజు వరకు ఆగాల్సి వచ్చింది. చివరి సెషన్లో విండీస్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు (18 ఓవర్లు) చేసింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 58 పరుగులు చేయాల్సి ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (8) ఆదిలోనే ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (25 నాటౌట్), సాయి సుదర్శన్ (30 నాటౌట్) భారత్ను విజయం దిశగా తీసుకెళ్తున్నారు. జైస్వాల్ వికెట్ వారికన్కు దక్కింది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా 2 మ్యాచ్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.క్యాంప్బెల్, హోప్ వీరోచిత శతకాలుతొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది విండీస్కు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.దీనికి ముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.చదవండి: కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్!.. వీరి సీక్రెట్ ఇదే -
స్వల్ప ఛేదన.. టీమిండియాకు ఆదిలోనే షాక్
121 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (8) తొలి ఓవర్లోనే రెండు బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించినప్పటికీ.. ఆతర్వాతి ఓవర్లోనే ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో ఆండర్సన్ ఫిలిప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. జైస్వాల్ ఔటయ్యాక కేఎల్ రాహుల్ (14), సాయి సుదర్శన్ (17) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ టీమిండియాను లక్ష్యం దిశగా తీసుకెళ్తున్నారు.12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ వికెట్ నష్టానికి 39 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 82 పరుగులు చేయాల్సి ఉంది.విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటంఅంతకుముందు విండీస్ ఫాలో ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఆ జట్టు బ్యాటర్లు ఊహించని రీతిలో ప్రతిఘటించి భారత్ ముందు మూడంకెల టార్గెట్ను ఉంచారు.తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: World Cup 2025: వరుస ఓటములు.. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే... -
విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
న్యూఢిల్లీ టెస్ట్లో విండీస్ బ్యాటర్లు అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించారు. ఫాలో ఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్లో ఊహించని రీతిలో ప్రతిఘటించారు. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు.కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI 2nd Test: చెలరేగిపోతున్న మియా భాయ్..! -
IND VS WI: చెలరేగిపోతున్న మియా భాయ్..!
టీమిండియా ఆటగాడు, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) (మియా భాయ్) ఈ ఏడాది టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కొద్ది రోజుల కిందట ఇంగ్లండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో 5 మ్యాచ్ల్లో 23 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన సిరాజ్.. ప్రస్తుతం స్వదేశంలో విండీస్తో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ అదే తరహా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాడు.ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో 7 వికెట్లు తీసిన మియా.. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో తన మూడో వికెట్ (షాయ్ హోప్) తీసిన అనంతరం సిరాజ్ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ వికెట్తో సిరాజ్ ఈ ఏడాది (2025) టెస్ట్ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా అవతరించాడు. ప్రస్తుతం సిరాజ్ ఖాతాలో 37 వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డు సాధించే క్రమంలో సిరాజ్ జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీని (26) అధిగమించాడు. సిరాజ్, ముజరబానీ తర్వాత ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా మిచెల్ స్టార్క్ (29), నాథన్ లియోన్ (24) ఉన్నారు.భారత్-విండీస్ రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో విండీస్ ఫాలో ఆన్ ఆడుతూ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించింది. తొలుత జాన్ క్యాంప్బెల్ (115), షాయ్ హోప్ (103) వీరోచిత శతకాలు బాది తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించగా.. ఆఖర్లో జస్టిన్ గ్రీవ్స్ (50 నాటౌట్), జేడన్ సీల్స్ (32) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించి టీమిండియా ముందు 121 పరుగుల టార్గెట్ను ఉంచారు. గ్రీవ్స్, సీల్స్ చివరి వికెట్కు 79 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా తలో 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ ఆటగాళ్లు జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) ఓ అరుదైన ఘనత సాధించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఈ ఇద్దరూ.. 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు.1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీలు చేశారు. 51 ఏళ్ల తర్వాత క్యాంప్బెల్, హోప్ ఆ ఫీట్ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు.ఓవరాల్గా చూసిన భారత గడ్డపై (భారత్పై) ఓ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇద్దరు విండీస్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారే. 1974కు ముందు 1948-49లో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే ఆలౌటై, ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలవుతుందని అంతా అనుకున్నారు.అయితే క్యాంప్బెల్ (115), హోప్ (103) సూపర్ సెంచరీలతో అసమానమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. వీరిద్దరు మూడో వికెట్కు 187 పరుగులు జోడించి, టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగేలా చేశారు.నాలుగో రోజు టీ సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 ఆధిక్యంలో ఉంది. జస్టిన్ గ్రీవ్స్ (35), జేడన్ సీల్స్ (18) టీమిండియా బౌలర్ల సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు కుల్దీప్ 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇన్నింగ్స్లో విండీస్, కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. -
ఢిల్లీ టెస్టు.. భారత్కు ధీటుగా బదులిస్తున్న వెస్టిండీస్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా(Teamindia)తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్తో పోరాడుతోంది. ఫాలో ఆన్లో విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి కరేబియన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.ప్రస్తుతం ఫాలో ఆన్లో వెస్టిండీస్ ఇంకా 28 పరుగులు వెనకబడి ఉంటుంది. క్రీజులో షాయ్ హోప్(92), కెప్టెన్ రోస్టన్ ఛేజ్(23) ఉన్నారు. ఫస్ట్ సెషన్లో విండీస్ 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాన్ క్యాంప్బెల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115 పరుగులు చేసిన క్యాంప్బెల్.. రవీంద్ర జడేజా బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అంతకుముందు పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్ ఆన్ గండాన్ని విండీస్ తప్పంచుకోలేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 తీశారు. వీరిద్దరితో బుమ్రా, సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ.. -
జైస్వాల్తో ఓవరాక్షన్.. విండీస్ ప్లేయర్కు భారీ షాక్
న్యూఢిల్లీ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పట్ల దురుసుగా ప్రవర్తించిన వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్కు (jayden Seales) ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ తొలి రోజు టీమిండియా బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సీల్స్ ఓవరాక్షన్ చేశాడు. ఫాలో త్రూ చేసే క్రమంలో బంతిని జైస్వాల్పైకి ప్రమాదకరంగా విసిరాడు. బంతి జైస్వాల్ ప్యాడ్స్పై బలంగా తాకింది. దీన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ సీల్స్కు ఓ డీమెరిట్ పాయింట్ అలాట్ చేయడంతో పాటు అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.9 నిబంధన ప్రకారం ఓ ఆటగాడు బంతిని లేదా ఏదైన క్రికెట్ సమాగ్రిని ఇతర ఆటగాళ్లపైకి కానీ వారి సమీపంలోకి కాని విసరకూడదు. ఇలా చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన కిందికి వస్తుంది.సీల్స్ విషయంలోనూ ఇదే జరిగింది. పైగా సీల్స్ తాను చేసిన పనిని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని జైస్వాల్ పైకి విసరలేదని రిఫరీ పైక్రాఫ్ట్కు వివరించాడు. రనౌట్ చేసే ప్రయత్నంలో అలా జరిగిందని అన్నాడు. సీల్స్ వాదనను సైతం పరిగణలోకి తీసుకున్న ఐసీసీ పలుమార్లు సదరు సన్నివేశాన్ని పరిశీలించి, సీల్స్దే తప్పిదమని పేర్కొంది. జైస్వాల్ అప్పటికే క్రీజ్లో ఉన్నా సీల్స్ అనవసరంగా బంతిని విసిరాడని నిర్దారించింది. అందుకే అతనికి ఓ డీమెరిట్ పాయింట్తో పాటు మ్యాచ్ ఫీజ్లో కోత విధించింది. 24 వ్యవధిలో సీల్స్కు ఇది రెండో డీమెరిట్ పాయింట్. ఈ మధ్యలో అతను మరో తప్పు చేస్తే నిషేధానికి గురయ్యే ప్రమాదముంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పోరాడుతోంది. 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (87), షాయ్ హోప్ (66) అసమానమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5) చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
భారత్తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్నరైన్ చంద్రపాల్ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
కుల్దీప్ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్
వెస్టిండీస్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా తేలిపోయారు. భారత బౌలర్ల ధాటికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే కుప్పకూలింది.కనీసం ఫాల్ ఆన్ కూడా కరేబియన్ జట్టు దాటలేకపోయింది. 140/4 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఛేజ్ సేన అదనంగా 108 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు. అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు విండీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. మూడో రోజు ఆట ఆరంభం నుంచే యాదవ్ బంతితో మాయ చేశాడు. అతడితో పాటు రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరోసారి విండీస్ బ్యాటింగ్కు దిగనుంది. ఇన్నింగ్స్ తేడాతో భారత్ గెలిచేందుకు ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా టీమిండియాకు విండీస్ పోటీ ఇస్తుందో లేదో ఎదురు చూడాలి.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 518 పరుగుల భారీస్కోరు వద్ద క్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు.చదవండి: మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్: బ్రియన్ లారా -
మా బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్: బ్రియన్ లారా
ఢిల్లీ అరుణ్ జేట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఓ దశలో సులువుగా డబుల్ సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన జైశ్వాల్.. అనుహ్యంగా 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యి పెవిలియన్కు చేరాడు.ఈ మ్యాచ్లో విండీస్ బౌలర్లను జైశూ ఉతికారేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 22 ఫోర్లు ఉన్నాయి. కాగా ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను వీక్షించిన వెస్టిండీస్ దిగ్గజాలు బ్రియన్ లారా, సర్ వివ్ రిచర్డ్స్ జైశ్వాల్ బ్యాటింగ్కు పిధా అయిపోయారు. రెండో రోజు ఆట అనంతరం జైశ్వాల్ను లారా కలిశాడు.ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. లారా జైస్వాల్ను అభినందిస్తూ.. "బౌలర్లను మరి అంతలా కొట్టకు జైశ్వాల్ ష అంటూ సరదాగా అన్నాడు. దానికి జైస్వాల్ నవ్వుతూ "ట్రై చేస్తున్నా సర్!" అని సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది.కష్టాల్లో విండీస్..కాగా ఈ మ్యాచ్లో కూడా విండీస్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బౌలర్లు తేలిపోగా.. ఇప్పుడు బ్యాటర్లు కూడా తీవ్ర నిరాశపరిచారు. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. విండీస్ ఫాల్ ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 102 పరుగులు చేయాలి.Team's interests above all 🙌Two special partnerships 🤝High praise from Brian Lara 👏Yashasvi Jaiswal recounts a magnificent innings in Delhi and shares insights on his approach ✨ - By @Moulinparikh #TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ybj_19— BCCI (@BCCI) October 12, 2025చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి -
వెస్టిండీస్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా గుడ్ న్యూస్ అందింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) వైద్య బృందం అప్డేట్ ఇచ్చింది. అతడి గాయం అంత తీవ్రమైనది కాదని మెడికల్ టీమ్ వెల్లడించింది.సుదర్శన్ ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మూడో రోజు ఆటకు కూడా ఈ తమిళనాడు బ్యాటర్ దూరంగా ఉండనున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా సుదర్శన్ గాయపడిన సంగతి తెలిసిందే.అసలేమి జరిగిందంటే?రవీంద్ర జడేజా బౌలింగ్లో ఔట్సైడ్ ఆఫ్ దిశగా పడిని విండీస్ ఓపెనర్ క్యాంప్బెల్ బలంగా స్వీప్ చేశాడు. ఈ క్రమంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న సుదర్శన్ బంతి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ బంతి నేరుగా అతని చేతుల్లోకి వెళ్లడం , ఆ వేగంలో కూడా సుదర్శన్ విడిచిపెట్టుకుండా అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు.ఈ క్యాచ్ను అందుకునే క్రమంలో బంతి అతడి చిటికెన వేలు తాకింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి స్దానంలో సబ్స్ట్యూట్గా దేవదత్త్ పడిక్కల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే బ్యాటింగ్కు సుదర్శన్ వస్తాడో రాడో ఇంకా క్లారిటీ లేదు.అయితే వెస్టిండీస్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్కు చేరువైంది. 209 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే విండీస్ ఫాలో ఆన్ గండం తప్పించుకునేటట్లు కన్పించడం లేదు. విండీస్ ఫాల్ ఆన్కు ఇంకా 105 పరుగుల వెనుకంజలో ఉంది.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి
వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా జోరు కొనసాగుతోంది. రెండో రోజు ఆటలోనూ పర్యాటక జట్టుపై భారత్ ఆధిపత్యం చెలాయించింది. 318/2 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న యశస్వి జైశ్వాల్ అనుహ్యంగా రనౌటై తన వికెట్ను కోల్పోయాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, ధ్రువ్ జురెల్ కెప్టెన్ గిల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లు), జురేల్ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్(87) రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.భారత్ సరికొత్త రికార్డు..అయితే తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విశ్వరూపం ప్రదర్శించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. గత 65 ఏళ్లలో వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లో తొలి ఐదు వికెట్లకు వరుసగా 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్నర్షిప్స్ నెలకొల్పారు. తొలి వికెట్కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్కు జైస్వాల్-శుభ్మన్ గిల్ 69, నాలుగో వికెట్కు శుభ్మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్కు శుభ్మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.అప్పుడు ఆసీస్.. ఇప్పుడు భారత్1960లో గబ్బా వేదికగా వెస్టిండీస్తో జరిగిన అరుదైన టై టెస్ట్లో ఆస్ట్రేలియా తొలి ఐదు వికెట్లకు ఏభైకి పైగా పార్ట్నర్షిప్స్ను నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు భారత్ ఈ ఫీట్ సాధించింది.మూడో సారి..టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఈ ఘనతను సాధించడం ఇది మూడోసారి. 1993లో ముంబైలో ఇంగ్లండ్, 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ ఈ ఫీట్ సాధించింది. కానీ విండీస్పై మాత్రం ఇదే తొలిసారి.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా -
రెండో రోజు ముగిసిన ఆట.. జడేజా స్పిన్ మ్యాజిక్
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న సెకెండ్ టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ అటు బ్యాట్తో, ఇటు బంతితో అదరగొట్టింది. ఓవర్నైట్ స్కోరు 318/2తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 200 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది.భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్ (177) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(129) శతక్కొట్టాడు. వీరిద్దరితో పాటు ధ్రువ్ జురెల్ (44), నితీశ్ రెడ్డి (43), సాయిసుదర్శన్(87) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ 3 వికెట్లు తీయగా కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ పడగొట్టాడు.జడేజా మ్యాజిక్..అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ ఇంకా భారత్ కంటే 378 పరుగులు వెనుకంజలో ఉంది. క్రీజులో టెవిన్ ఇమ్లాచ్(14), షాయ్ హోప్(31) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs WI: శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్ -
శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్
ల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. వెస్టిండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన గిల్.. 177 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.గిల్కు ఇది తన కెరీర్లో పదో టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్పై నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్, ఇప్పుడు విండీస్పై కూడా అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అతడి సంచలన బ్యాటింగ్ ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 518 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అతడితో పాటు జైశ్వాల్(175) సూపర్ సెంచరీతో మెరిశాడు. కాగా సెంచరీతో సత్తాచాటిన గిల్ రికార్డుల మోత మోగించాడు.గిల్ రికార్డుల పంట..ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC)లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ హిస్టరీలో ఇప్పటివరకు 71 మ్యాచ్లు ఆడిన గిల్ 2826 పరుగులు సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్(2731) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో పంత్ను గిల్ అధిగమించాడు.కెప్టెన్గా అత్యంత వేగంగా 5 టెస్ట్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా శుబ్మన్ నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను అధిగమించాడు. బ్రాడ్మన్ ఈ ఫీట్ సాధించడానికి 13 ఇన్నింగ్స్లు అవసరమవ్వగా.. గిల్ కేవలం కేవలం 12 ఇన్నింగ్స్లలోనే నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో అలిస్టర్ కుక్(9), గవాస్కర్(10) తొలి రెండు స్దానాల్లో ఉన్నాడు.ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన టీమిండియా కెప్టెన్గా గిల్.. విరాట్ కోహ్లి (Virat Kohli) రికార్డు సమం చేశాడు. కోహ్లి 2017, 2018లో చెరో ఐదు సెంచరీలు చొప్పున చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిలో గిల్కు ఇది ఐదో టెస్టు సెంచరీ. 2025లో గిల్ మరో సెంచరీ సాధిస్తే కోహ్లి ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.చదవండి: IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్.. -
IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Teamindia) కు ఊహించని షాక్ తగిలింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్(Sai Sudharsan)కు గాయపడ్డాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తుండగా సుదర్శన్ చేతి వేలికి బంతి బలంగా తాకింది.7 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్లో రెండో బంతిని జాన్ క్యాంప్బెల్కు ఔట్సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని క్యాంప్బెల్ స్లాగ్ స్వీప్ ఆడాడు. షాట్ కనక్ట్ అయినప్పటికి బంతి షార్ట్ లెగ్లో ఉన్న సుదర్శన్ చేతిలోకి వెళ్లింది. బంతి చేతికి బలంగా తాకినప్పటికి సుదర్శన్ మాత్రం అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బ్యాటర్తో పాటు మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బంతిని అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో నొప్పితో అతడు విల్లవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగలేదు.ఆఖరికి ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. సుదర్శన్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.టీమిండియా భారీ స్కోర్..ఇక తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(175), శుబ్మన్ గిల్(129 నాటౌట్) అద్బుత సెంచరీలతో చెలరేగారు. సుదర్శన్(87, జురెల్ (44) ఔట్, నితీష్(43), రాహుల్(38) రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు.చదవండి: శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్మన్ గిల్What a grab by Sai Sudharsan! Unbelievable 🤯Sunil Gavaskar in the commentary background: 'He caught it, he caught iitttt!pic.twitter.com/7cVpUn48mo— GillTheWill (@GillTheWill77) October 11, 2025 -
డబుల్ సెంచరీకి చేరువలో జైశ్వాల్.. తొలి రోజు భారత్దే
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్ములేపుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.యశస్వికి ఇది 7వ టెస్టు సెంచరీ. జైశ్వాల్ 173 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 22 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో జైశ్వాల్తో పాటు కెప్టెన్ శుబ్మన్ గిల్(20) ఉన్నాడు. అంతకుముందు యువ ఆటగాడు సాయిసుదర్శన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసిన సుదర్శన్.. తృటిలో తన తొలి టెస్టు సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్లో వికెట్ల ముందు సుదర్శన్ దొరికిపోయాడు.వీరిద్దరితో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్(38) రాణిచాడు. అయితే రాహుల్ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో జైశ్వాల్-సాయిసుదర్శన్ రెండో వికెట్కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్శన్ ఔటయ్యాక జైశ్వాల్ గిల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక విండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. కాగా తొలి టెస్టులో విండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు -
విండీస్తో రెండో టెస్ట్.. అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతను అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 71 ఇన్నింగ్స్ల్లో ఈ అరుదైన మైలురాయిని తాకిన జైస్వాల్ భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) (68 ఇన్నింగ్స్లు) జైస్వాల్ కంటే వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని తాకాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 51 ఓవర్లలో తర్వాత వికెట్ నష్టానికి 198 పరుగులు చేసింది. జైస్వాల్ 145 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా సాయి సుదర్శన్ (58) క్రీజ్లో ఉన్నాడు.అంతకుముందు కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా -
విండీస్తో రెండో టెస్ట్.. చరిత్ర సృష్టించిన బుమ్రా
వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 10) మొదలైన రెండో టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) రంగంలోకి దిగకుండానే ఓ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్తో టెస్ట్ల్లో హాఫ్ సెంచరీ (50 మ్యాచ్లు) పూర్తి చేసిన అతను.. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడిన తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫాస్ట్ బౌలర్ మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్లు ఆడలేదు.31 ఏళ్ల బుమ్రా ఇప్పటివరకు భారత్ తరఫున 50 టెస్ట్లు, 89 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. 2016 జనవరిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లలో 467 వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ తొలిసారి టాస్ గెలిచాడు.లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 94 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి జైస్వాల్ 40, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రాహుల్ వికెట్ వార్రికన్కు దక్కింది. అతడి బౌలింగ్లో రాహుల్ స్టంపౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు రాహుల్, జురెల్, జడేజా సెంచరీలు చేశారు. సిరాజ్, జడేజా బంతితో రాణించారు. చదవండి: 'టీమిండియా'పై కేసు.. గట్టిగా అక్షింతలు వేసిన ఢిల్లీ హైకోర్టు -
విండీస్తో రెండో టెస్ట్.. ఎట్టకేలకు టాస్ గెలిచిన శుభ్మన్ గిల్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాల్టి నుంచి (అక్టోబర్ 10) భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా కెప్టెన్గా శుభ్మన్కు ఇది తొలి టాస్ విజయం. అతను టెస్ట్ కెప్టెన్ అయ్యాక వరుసగా ఆరు మ్యాచ్ల్లో టాస్లు ఓడాడు.ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా బరిలోకి దించింది. విండీస్ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కింగ్, జోహన్ లేన్ స్థానాల్లో టెవిమ్ ఇమ్లాచ్, ఆండర్సన్ ఫిలిప్ జట్టులోకి వచ్చారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తుది జట్లు..వెస్టిండీస్: జాన్ క్యాంప్బెల్, తేజ్నరైన్ చందర్పాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్(కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్(వికెట్కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, అండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..! -
విండీస్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..!
రేపటి నుంచి (అక్టోబర్ 10) వెస్టిండీస్తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్లో భారత తుది జట్టు ఇదే అంటూ అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే హింట్ ఇచ్చాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్లో భారత్ తరఫున ఎలాంటి మార్పులు ఉండవని సంకేతాలిచ్చాడు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపాడు.సుదూర అవసరాల దృష్ట్యా నితీశ్ కుమార్ రెడ్డికి మరిన్ని అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పాడు. నితీశ్ను నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపాడు. తొలి టెస్ట్లో విఫలమైనా సాయి సుదర్శన్తో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. పరుగులు సాధించలేకపోతే జట్టులో ఎవరి స్థానం సుస్థిరం కాదని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కరుణ్ నాయర్ పేరును ప్రస్తావించాడు.తొలి టెస్ట్లో జురెల్ సెంచరీ సాధించడం వల్ల సాయిపై ఒత్తిడి ఉంటుందంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదే సందర్భంగా జురెల్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్ గైర్హాజరీలో ఆ స్థానానికి న్యాయం చేశాడని అన్నాడు. జురెల్ మిడిలార్డర్లో సరిగ్గా ఫిట్ అవుతాడని ముందే ఊహించామని తెలిపాడు.డస్కటే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్లో కూడా పడిక్కల్, అక్షర్ పటేల్, జగదీసన్, ప్రసిద్ద్ కృష్ణ బెంచ్కు పరిమితం కావల్సిందే.కాగా, అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సత్ఫలితం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి విండీస్ను మట్టికరిపించారు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి సిరాజ్ 7 వికెట్లు తీయగా.. బుమ్రా 3, కుల్దీప్, జడేజా తలో 4, సుందర్ 2 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్లో భారత్ బ్యాటింగ్ చేయగా.. కేఎల్ రాహుల్, జురెల్, రవీంద్ర జడేజా శతకాలు బాదారు.విండీస్తో రెండో టెస్ట్కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్ -
విండీస్తో రెండో టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన రాహుల్, జడేజా
అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగబోయే రెండో టెస్ట్ మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఓ భారీ రికార్డుపై కన్నేశారు. ఈ మ్యాచ్లో రాహుల్ 111 పరుగులు, జడేజా 10 పరుగులు చేస్తే టెస్ట్ల్లో అరుదైన 4000 పరుగుల మైలురాయిని తాకుతారు.ప్రస్తుతం రాహుల్ 64 టెస్ట్ల్లో 11 సెంచరీలు, 19 అర్ద సెంచరీల సాయంతో 36.01 సగటున 3889 పరుగులు చేయగా.. జడేజా 86 టెస్ట్ల్లో 6 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 38.74 సగటున 3990 పరుగులు చేశాడు. రాహుల్తో పోలిస్తే జడేజాకు ఈ రికార్డును అందుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే అతను మరో 10 పరుగులు చేస్తే 4000 పరుగుల మైలురాయిని తాకుతాడు.ప్రస్తుతం రాహుల్ ఉన్న ఫామ్ను బట్టి చూస్తే.. ఇతనికి కూడా ఇదే టెస్ట్లో ఈ రికార్డును అందుకునే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా రాహుల్ 50 సగటుకు దగ్గరగా పరుగులు సాధిస్తున్నాడు. ఈ లెక్కన రాహుల్ రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసినా ఇదే టెస్ట్లో 4000 పరుగుల మైలురాయిని తాకవచ్చు.భారత్ తరఫున ఇప్పటివరకు 17 మంది టెస్ట్ల్లో 4000 పరుగుల మైలురాయిని తాకారు. ప్రస్తుత భారత జట్టులో ఈ విభాగానికి సంబంధించి రాహుల్, జడేజాకు దగ్గర్లో ఎవ్వరూ లేరు. రిషబ్ పంత్ ఒక్కడే 3000 పరుగుల (3427) పరిధిలో ఉన్నాడు.ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా విండీస్తో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ (100), రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలు చేశారు. వీరితో పాటు రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ (125) కూడా శతక్కొట్టాడు.ఈ మ్యాచ్లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 162, రెండో ఇన్నింగ్స్లో 146 పరుగులకు కుప్పకూలింది. భారత్.. రాహుల్, జురెల్, జడ్డూ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు కూడా సత్తా చాటారు. సిరాజ్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీయగా.. బుమ్రా తొలి ఇన్నింగ్స్లో 3, కుల్దీప్ తొలి ఇన్నింగ్స్లో 2, రెండో ఇన్నింగ్స్లో 2, వాషింగ్టన్ సుందర్ రెండు ఇన్నింగ్స్ల్లో తలో వికెట్, జడేజా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. చదవండి: IND vs AUS: చెలరేగిన భారత బౌలర్లు.. వైభవ్ సూర్యవంశీ స్కోర్ ఎంతంటే..? -
భారత్ దెబ్బకు విండీస్ ఢాం!
అహ్మదాబాద్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో ఎలాంటి సందేహం లేకుండా ఊహించిన ఫలితమే వచి్చంది. మ్యాచ్ పూర్తిగా మూడు రోజులు కూడా సాగలేదు. శనివారం ముగిసిన మొదటి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 140 పరుగుల తేడాతో వెస్టిండీస్పై ఘన విజయం సాధించింది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. 286 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విండీస్ ఈ సారి కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. 45.1 ఓవర్లలో 146 పరుగులకే విండీస్ ఆలౌటైంది. భారత బౌలర్ల దెబ్బకు శనివారం కనీసం రెండు సెషన్లు కూడా ఆడకుండానే విండీస్ కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్లో సరిగ్గా ఒక్క ఓవర్ మాత్రమే ఆ జట్టు అదనంగా ఆడగలిగింది. అలిక్ అతనజె (74 బంతుల్లో 38; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఒక దశలో జట్టు 46 పరుగులకే సగం వికెట్లు కోల్పోగా...అతనజె, గ్రీవ్స్ (25) ఆరో వికెట్కు 46 పరుగులు జోడించి కొద్ది సేపు ప్రతిఘటించారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, సిరాజ్కు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో సెంచరీ కూడా నమోదు చేసిన జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేయగా... ఈ నెల 10 నుంచి న్యూఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది. స్కోరు వివరాలువెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162; భారత్ తొలి ఇన్నింగ్స్ 448/5 డిక్లేర్డ్; వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: క్యాంప్బెల్ (సి) సుదర్శన్ (బి) జడేజా 14; చందర్పాల్ (సి) నితీశ్ (బి) సిరాజ్ 8; అతనజె (సి) అండ్ (బి) సుందర్ 38; కింగ్ (సి) రాహుల్ (బి) జడేజా 5; ఛేజ్ (బి) కుల్దీప్ 1; హోప్ (సి) జైస్వాల్ (బి) జడేజా 1; గ్రీవ్స్ (ఎల్బీ) (బి) సిరాజ్ 25; పైర్ (నాటౌట్) 13; వారికన్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; లేన్ (సి) సిరాజ్ (బి) జడేజా 14; సీల్స్ (సి) అండ్ (బి) కుల్దీప్ 22; ఎక్స్ట్రాలు 5; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–34, 4–35, 5–46, 6–92, 7–98, 8–98, 9–122, 10–146. బౌలింగ్: బుమ్రా 6–1–16–0, సిరాజ్ 11–2–31–3, జడేజా 13–3–54–4, కుల్దీప్ 8.1–3–23–2, సుందర్ 7–1–18–1. -
ముగ్గురు సెంచరీలు.. భారీ ఆధిక్యంలో భారత్..
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తమ జోరును కొనసాగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో గిల్ సేన తమ మొదటి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(100), ధ్రువ్ జురెల్(125), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. 121/2 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రాహుల్, గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. గిల్ సరిగ్గా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రాహుల్.. ధ్రువ్ జురెల్తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు.రాహుల్ తన సెంచరీ పూర్తి చేసిన వెంటనే పెవిలియన్కు చేరాడు. ఈ సమయంలో ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజాలు విండీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ క్రీజులోకి పాతుకుపోయి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. రిషబ్ పంత్ స్దానంలో జట్టులోకి వచ్చిన తన లభించిన అవకాశాన్ని సద్వినియోపరుచుకున్నాడు. 190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125 పరుగులు చేశాడు. అయిదో వికెట్కు జడేజాతో కలిసి 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జురెల్ ఔటయ్యాక జడేజా సైతం తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా పాటు వాషింగ్టన్ సుందర్(9) ఉన్నారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు, సీల్స్, వారికన్, ఖరీ పియర్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్ -
నో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్.. డీజే ఉన్నాడుగా
భారత టెస్టు జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటును ధ్రువ్ జురెల్ తీర్చాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో జురెల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పంత్ గాయపడంతో తన దక్కిన అవకాశాన్ని జురెల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.ఐదో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు తన సూపర్ బ్యాటింగ్తో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్ 190 బంతుల్లో తన తొలి టెస్టు సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 210 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125 పరుగులు చేశాడు. జురెల్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్కు 206 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడునో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్ధ్రువ్ జురెల్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్పై భారత తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్లో జురెల్ తన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ రిషబ్ పంత్ రెగ్యూలర్ వికెట్ కీపర్గా ఉండడంతో జురెల్ ఇప్పటివరకు టీమిండియా తరపున కేవలం 6 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు.బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్లకు జురెల్ జట్టుకు ఎంపికైనప్పటికి ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు కూడా భారత జట్టుతో పాటు జురెల్ వెళ్లాడు. నాలుగో టెస్టులో రిషబ్ పంత్ కాలికి గాయం కావడంతో సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా ధ్రువ్ బాధ్యతలు చేపట్టాడు. రెండు ఇన్నింగ్స్లలోనూ వికెట్ల వెనక తన సేవలను అందించాడు. ఆ తర్వాత ఐదో టెస్టుకు పంత్ దూరం కావడంతో జురెల్ తుది జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసిన జురెల్.. రెండో ఇన్నింగ్స్లో 34 పరుగులతో కీలక నాక్ ఆడాడు. ఇప్పుడు విండీస్తో సిరీస్తో మొత్తానికి పంత్ దూరం కావడంతో జురెల్ రెగ్యూలర్ వికెట్ కీపర్గా కొనసాగుతున్నాడు. విండీస్తో తొలి టెస్టులో జురెల్ వికెట్ల వెనక కూడా అద్బుతమైన క్యాచ్లను అందుకున్నాడు. అంతేకాకుండా తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో దాదాపు ఇరవైకి పైగా ఎక్స్ట్రా రన్స్ను సేవ్ చేశాడు. పంత్ జట్టుకు అందుబాటులో లేక పోయినా ధ్రువ్ జురెల్ రూపంలో భారత్కు అద్బుతమైన వికెట్కీపర్ ఉన్నాడనే చెప్పుకోవాలి. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గిల్ సేన ప్రస్తుతం 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బ్యాటర్లలో జురెల్తో పాటు కేఎల్ రాహుల్(100), రవీంద్ర జడేజా(104 నాటౌట్) సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్ దేవ్, ధోని రికార్డులు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన జడేజా.. దెబ్బకు కపిల్ దేవ్, ధోని రికార్డులు బ్రేక్
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన జడ్డూ.. ధ్రువ్ జురెల్తో కలిసి స్కోర్ను బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.59 పరుగులతో జడేజా తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. జడేజాకు ఇది టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. అదేవిధంగా జడేజా చివరి తొమ్మిది ఇన్నింగ్స్లలో ఇది ఏడో ఫిప్టీ కావడం విశేషం. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా జడేజా దుమ్ములేపాడు. మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో జడ్డూ సెంచరీ కూడా సాధించాడు.2025 ఏడాదిలో టెస్టుల్లో జడేజా సగటు 75పైగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 605 పరుగులు చేశాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ హిస్టరీలో జడేజా 45 మ్యాచ్లు ఆడి 43 సగటుతో 2451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన జడేజా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా జడేజా రికార్డు సృష్టించాడు. జడేజా ఇప్పటివరకు 28 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్(27) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్తో కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డును ఈ సౌరాష్ట్ర క్రికెటర్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వీవియస్ లక్ష్మణ్(40) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో ధోని(32), సౌరవ్ గంగూలీ(29) కొనసాగుతున్నాడు.అదేవిధంగా టెస్టుల్లో అత్యధిక సిక్సర్ల బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనిని జడేజా అధిగమించాడు. ధోని తన కెరీర్లో 78 టెస్టు సిక్సర్లు బాదగా.. జడేజా 79 కొట్టాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తొలి స్ధానంలో ఉన్నారు. సెహ్వాగ్ తన కెరీర్లో 91 సిక్సర్లు బాదగా.. పంత్ కూడా సరిగ్గా 90 సిక్సర్లు కొట్టాడు.టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..రిషబ్ పంత్ – 47 మ్యాచ్ల్లో 90 సిక్సర్లువీరేంద్ర సెహ్వాగ్ – 103 మ్యాచ్ల్లో 90 సిక్సర్లురోహిత్ శర్మ – 67 మ్యాచ్ల్లో 88 సిక్సర్లురవీంద్ర జడేజా – 86 మ్యాచ్ల్లో 79 సిక్సర్లుఎంఎస్ ధోని – 90 మ్యాచ్ల్లో 78 సిక్సర్లుచదవండి: IND vs AUS: ఆసీస్పై అభిషేక్ శర్మ ఫెయిల్.. తొలి బంతికే ఔట్ -
47 ఏళ్ల కిందటి రికార్డును రిపీట్ చేసిన శుభ్మన్ గిల్
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (India vs West Indies) భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ కెప్టెన్గా స్వదేశంలో తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ బాది, 47 ఏళ్ల క్రితం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) నెలకొల్పిన రికార్డును పునరావృతం చేశాడు.1978లో గవాస్కర్ భారత కెప్టెన్గా స్వదేశంలో తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీనే (205) బాదాడు. తిరిగి 47 ఏళ్ల తర్వాత శుభ్మన్ గిల్ స్వదేశంలో భారత కెప్టెన్గా తన తొలి ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు.ఈ మ్యాచ్లో గిల్ సరిగ్గా 50 పరుగులు (100 బంతుల్లో 5 ఫోర్లు) చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్ను 162 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 338 పరుగులుగా ఉంది. ప్రస్తుతం 176 టీమిండియా 176 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ధృవ్ జురెల్ (75), రవీంద్ర జడేజా (56) అర్ద సెంచరీలు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు.అంతకుముందు కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీనికి ముందే శుభ్మన్ గిల్ సరిగ్గా 50 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
రాహుల్ సెంచరీ.. గిల్, డీజే హాఫ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా (Team India) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 124 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 286 పరుగులుగా ఉంది. ధృవ్ జురెల్ (Dhruv Jurel) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రవీంద్ర జడేజా 30 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు.డీజే హాఫ్ సెంచరీరిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధృవ్ జురెల్ తనకు లభించిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగి అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 91 బంతుల్లో డీజే ఈ మార్కును తాకాడు. గ్రీవ్స్ బౌలింగ్లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును తాకాడు.రాహుల్ సూపర్ సెంచరీఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తైన వెంటనే రాహుల్ ఔటయ్యాడు. వార్రికన్ బౌలింగ్లో గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. టెస్ట్ల్లో రాహుల్కు ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.గిల్ హాఫ్ సెంచరీశుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (100 బంతుల్లో 5 ఫోర్లు) పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేశారు. జైస్వాల్ వికెట్ సీల్స్కు, సాయి సుదర్శన్ వికెట్ ఛేజ్కు దక్కాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: నిప్పులు చెరిగిన పంజాబ్ కింగ్స్ బౌలర్ -
కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ
వెస్టిండీస్తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్ట్లో (India vs West Indies) టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సూపర్ సెంచరీ సాధించాడు. 190 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ను చేరుకున్నాడు. రాహుల్కు టెస్ట్ల్లో ఇది 11వ శతకం. సొంతగడ్డపై మాత్రం ఇది రెండోదే. రాహుల్ స్వదేశంలో తన చివరి శతకాన్ని 2016లొ చెన్నైలో ఇంగ్లండ్పై చేశాడు.CUTE CELEBRATION BY KL RAHUL 2.0 🥺 pic.twitter.com/TZ8hknrli8— Johns. (@CricCrazyJohns) October 3, 202566 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 214/3గా ఉంది. రాహుల్కు జతగా ధృవ్ జురెల్ (10) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇవాళ (అక్టోబర్ 2, రెండో రోజు) రాహుల్తో పాటు ఇన్నింగ్స్ ప్రారంభించిన శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జేడన్ సీల్స్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: BAN Vs AFG: రషీద్ ఖాన్ తిప్పేసినా ఆఫ్ఘనిస్తాన్కు తప్పని ఓటమి -
గిల్ హాఫ్ సెంచరీ.. సెంచరీ దిశగా రాహుల్.. ఆధిక్యంలో టీమిండియా
గిల్ ఔట్శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 59 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 192/3గా ఉంది. ప్రస్తుతం భారత్ 30 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రాహుల్ 86, జురెల్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు తొలి సెషన్లోనే ఇది సాధించింది. 56 ఓవర్ల తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 188/2గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 26 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శుభ్మన్ గిల్ (50) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్ (84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ 36, సాయి సుదర్శన్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: World Cup 2025: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లాదేశ్ -
చెలరేగిన బౌలర్లు.. రాణించిన కేఎల్ రాహుల్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) మంచి స్కోర్ దిశగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (36; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (7) ఔట్ కాగా.. కేఎల్ రాహుల్ (Kl Rahul) (53), శుభ్మన్ గిల్ (18) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీశారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 41 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: రుతురాజ్, ఇషాన్ కిషన్ విఫలం.. పోరాడుతున్న రజత్ పాటిదార్ -
IND vs WI 1st Test: పర్వాలేదనిపించిన జైస్వాల్.. నిరాశపరిచిన సాయి
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 68 పరుగుల వద్ద జైస్వాల్ (Yashasvi Jaiswal) (36), 90 పరుగుల వద్ద సాయి సుదర్శన్ (Sai Sudarshan) (7) ఔటయ్యారు. జైస్వాల్ తన సహజ శైలిలో ధాటిగా ఆడి జేడన్ సీల్స్ బౌలింగ్లో షాయ్ హోప్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు బాదాడు. సాయి సుదర్శన్ విషయానికొస్తే.. మంచి ఫామ్లో ఉన్న ఇతను కేవలం 7 పరుగులే చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 26 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 92/2గా ఉంది. కేఎల్ రాహుల్ (40), శుభ్మన్ గిల్ (2) క్రీజ్లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు భారత్ ఇంకా 70 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా -
IND VS WI 1st Test: ఆల్టైమ్ రికార్డును సమం చేసిన బుమ్రా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (అక్టోబర్ 2) మొదలైన తొలి టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఓ ఆల్టైమ్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్లో 3 వికెట్లతో చెలరేగిన అతను.. స్వదేశంలో అత్యంత వేగంగా 50 టెస్ట్ వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్గా జవగల్ శ్రీనాథ్ (javagal Srinath) రికార్డును సమం చేశాడు. బుమ్రా, శ్రీనాథ్ తలో 24 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (25), ఇషాంత్ శర్మ (27), మొహమ్మద్ షమీ (27) బుమ్రా, శ్రీనాథ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో 162 పరుగులకే ఆలౌటైంది. సిరాజ్ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్ (6.1-0-25-2), వాషింగ్టన్ సుందర్ (3-0-9-1) ధాటికి విండీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది -
చెలరేగిన భారత బౌలర్లు.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న (India vs West Indies) తొలి టెస్టులో టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా పేసర్లు సిరాజ్ (Siraj), బుమ్రా (Bumrah) నిప్పులు చెరిగారు. వీరి ధాటికి వెస్టిండీస్ (West Indies) తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది.సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. బుమ్రా 14 ఓవర్లలో 42 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్లు కుల్దీప్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో ఏడో నంబర్ ఆటగాడు జస్టిన్ గ్రీవ్స్ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్ కాకుండా అలిక్ అథనాజ్ (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయ్ హోప్ (26), ఖారీ పియెర్ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో జాన్ క్యాంప్బెల్ 8, తేజ్నరైన్ చంద్రపాల్ డకౌట్, జోమెల్ వార్రికన్ 8, జోహన్ లేన్ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్లో భారత వికెట్కీపర్ ధృవ్ జురెల్ 4 క్యాచ్లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
వారెవ్వా బుమ్రా.. మిస్సైల్లా దూసుకొచ్చిన బంతి! ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్లకు పెట్టింది పేరు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్, ఐపీఎల్ ఏ ప్లాట్ఫామ్ అయినా బుమ్రాను మించిన బౌలర్ మరొకరు లేరు. అతడు సంధించే బంతులు మిస్సైల్లా దూసుకొస్తాయి. బుమ్రా బౌలింగ్ చేస్తుంటే స్ట్రైక్లో ఉన్న బ్యాటర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇప్పుడు ఆ అనుభవం వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్కు ఎదురైంది. అహ్మదాబాద్ వేదికగా విండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా మ్యాజిక్ చేశాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బుమ్రా వేసిన యార్కర్కు గ్రీవ్స్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.ఆ ఓవర్లో ఆఖరిని బంతిని బుమ్రా అద్బుతమైన యార్కర్గా సంధించాడు. ఆఫ్ స్టంప్ దిశగా పడిన బంతిని బ్యాట్తో ఆపడంలో గ్రీవ్స్ విఫలమయ్యాడు. అతడు బ్యాట్ కిందకు దించడంలో ఆలస్యం కావడంతో 142.7 కి.మీ వేగంతో పడిన బంతిని ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దెబ్బకు కరేబియన్ బ్యాటర్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.తొలి ఇన్నింగ్స్లో బుమ్రా మొత్తంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. సిరాజ్, బుమ్రాతో పాటు కుల్దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ సాధించారు. విండీస్ బ్యాటర్లలో గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు.Two fiery deliveries, two similar results 🔥🔥Jasprit Bumrah, you absolute beauty!#TeamIndia @IDFCfirstbank | @Jaspritbumrah93 pic.twitter.com/JNcPGJxK8I— BCCI (@BCCI) October 2, 2025 -
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్ అతడి బౌలింగ్ ధాటికి విండీస్ టాపార్డర్ కుదేలు అయ్యింది. ఆరంభంలోనే ఓపెనర్ తేజ్నారయన్ చంద్రపాల్ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. ఆ తర్వాత కింగ్, అథ్నాజ్, ఛేజ్ వంటి కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఇప్పటివరకు 11 ఓవర్లు బౌలింగ్ సిరాజ్ 34 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో బంతితో మ్యాజిక్ చేసిన సిరాజ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది డబ్ల్యూటీసీ జట్లలో అత్యధిక టెస్టు వికెట్లు వికెట్లు పడగొట్టిన బౌలర్గా సిరాజ్ చరిత్ర సృష్టించాడు.2025లో సిరాజ్ ఇప్పటివరకు 31 వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉండేది. స్టార్క్ ఈ ఏడాదిలో 29 టెస్టు వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్లో అథ్నాజ్ను ఔట్ చేసిన సిరాజ్ మియా.. స్టార్క్ను అధిగమించాడు. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో సిరాజ్(27) లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు 23 వికెట్లతో సత్తాచాటాడు.2025లో అత్యధిక టెస్ట్ వికెట్లు(డబ్ల్యూటీసీ జట్లలో)మహ్మద్ సిరాజ్-31మిచెల్ స్టార్క్- 29 షామర్ జోసెఫ్ -24నాథన్ లియాన్- 22జోష్ టంగ్ -21చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
నిప్పులు చెరిగిన సిరాజ్.. లంచ్ బ్రేక్కు విండీస్ స్కోరంతంటే?
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ తడబడుతోంది. తొలి రోజు లంచ్ సమయానికి కరేబియన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది.ఓపెనర్లు తేజ్నారయణ్ చందర్పాల్(0), జాన్ క్యాంప్బెల్(8) తీవ్ర నిరాశపరిచారు. ఆ తర్వాత బ్రాండెన్ కింగ్(13), అలిక్ అథనాజ్(12) కాసేపు నిలకడగా ఆడారు. కానీ వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ ఛేజ్(22), హోప్(26) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ బ్రేక్ ముందు హోప్ వికెట్ను విండీస్ కోల్పోయింది. కుల్దీప్ అద్బుతమైన బంతితో హోప్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్పాల్, జాన్ కాంప్బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్
వెస్టిండీస్ దిగ్గజం శివనారాయణ్ చందర్పాల్ తనయుడు తేజ్నారాయణ్ చందర్పాల్ తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. దాదపు 20 నెలల తర్వాత విండీస్ జట్టులోకి వచ్చిన చందర్పాల్ తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో తేజ్నారాయణ్ డకౌట్గా వెనుదిరిగాడు. విండీస్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్లను ఎదుర్కొవడానికి చందర్పాల్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో 11 బంతులు ఎదుర్కొన్న చందర్పాల్ సిరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్కు ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో తన రీ ఎంట్రీ మ్యాచ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్స్ చేరాల్సింది. చందర్పాల్ 2022లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు.ఆ తర్వాత జింబాబ్వేపై అద్బుతమైన డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఈ జూనియర్ చందర్ పాల్ ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత తన ఫామ్ను అతడు కోల్పోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టాడు. అతడు ఈ మ్యాచ్ కంటే ముందు చివరగా ఆస్ట్రేలియాపై గతేడాది జనవరిలో విండీస్ తరపున ఆడాడు.అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో సెలక్టర్లు అతడికి తిరిగి పిలుపునిచ్చారు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ సద్వినియోగపరుచుకోలేకపోయాడు. చందర్పాల్ ఇప్పటివరకు పది టెస్టు మ్యాచ్లు ఆడి 32.94 సగటుతో 560 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తడబడుతోంది. విండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టి కరేబియన్లను దెబ్బ తీయగా.. బుమ్రా ఓ వికెట్ సాధించాడు.చదవండి: IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
భారత్తో తొలి టెస్టు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్! తుది జట్లు ఇవే
అహ్మదాబాద్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో ఆడుతున్నాడు. అదేవిధంగా ఇంగ్లండ్ టూర్లో గాయం కారణంగా మధ్యలోనే వైదొలిగిన ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి తిరిగి జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు సాయిసుదర్శన్కు టీమ్ మెనెజ్మెంట్ మరో అవకాశమిచ్చింది. మరోవైపు విండీస్ తరపున ఖరీ పియర్, జోహన్ లేన్ టెస్టుల్లో అరంగేట్రం చేశారు.తుది జట్లువెస్టిండీస్ ప్లేయింగ్ ఎలెవన్: టాగెనరైన్ చందర్పాల్, జాన్ కాంప్బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, బి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (సి), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ -
ఆసియాకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీ.. షెడ్యూల్ ఇదే
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్లతో బిజీబిజీగా గడపనుంది. టీమిండియా 3 నెలలపాటు మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో 2025 ఏడాదిలో టీమిండియా మిగిలిన షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.వెస్టిండీస్తో రెడ్ బాల్ సమరం..ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అక్టోబర్ 2 నుంచి ఈ రెడ్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.🔹వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్2వ టెస్ట్: అక్టోబర్ 10–14, ఈడెన్ గార్డెన్స్, కోల్కతావిండీస్ సిరీస్ ముగిసిన 5 రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20ల్లో తలపడనుంది. ఈ వైట్బాల్ సిరీస్లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.టీమిండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే..వన్డే సిరీస్:అక్టోబర్ 19: పెర్త్(తొలి వన్డే)అక్టోబర్ 23: అడిలైడ్(రెండో వన్డే)అక్టోబర్ 25: సిడ్నీ(మూడో వన్డే)టీ20 సిరీస్:అక్టోబర్ 29: మనుకా ఓవల్(తొలి టీ20)నవంబర్ 2: మెల్బోర్న్(రెండో టీ20)నవంబర్ 6: హోబర్ట్(మూడో టీ20)నవంబర్ 8: గోల్డ్ కోస్ట్(నాలుగో టీ20)నవంబర్ 10: బ్రిస్బేన్(ఐదో టీ20)ఆ తర్వాత భారత పురుషుల జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది.భారత్-దక్షిణాఫ్రికా మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..టెస్ట్ సిరీస్:నవంబర్ 14–18: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(తొలి టెస్టు)నవంబర్ 22–26: బర్సపారా స్టేడియం, గౌహతి(రెండో టెస్టు)వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీ(తొలి వన్డే)డిసెంబర్ 3: రాయ్పూర్(రెండో వన్డే)డిసెంబర్ 6: విశాఖపట్నం(మూడో టీ20)టీ20 సిరీస్:డిసెంబర్ 9: కటక్(తొలి టీ20)డిసెంబర్ 11: న్యూ చండీగఢ్(రెండో టీ20)డిసెంబర్ 14: ధర్మశాల(మూడో టీ20)డిసెంబర్ 17: లక్నో(నాలుగో టీ20)డిసెంబర్ 19: అహ్మదాబాద్(ఐదో టీ20)👉ఆసీస్, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్లు పొట్టి ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగనున్నాయి. -
తొలి టెస్టులో బుమ్రా ఆడతాడా? కెప్టెన్ గిల్ సమాధానమిదే
భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ గురువారం(ఆక్టోబర్ 2) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి టెస్టుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది.కెప్టెన్ శుబ్మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి వారు నేరుగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్కు చేరుకున్నారు. వీరంతా సెప్టెంబర్ 28న జరిగిన ఆసియాకప్-2025లో ఫైనల్లో భారత జట్టు తరపున ఆడారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. అయితే వర్క్లోడ్లో భాగంగా తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడా లేదా అన్నది? ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. ఆసియాకప్లో కూడా బుమ్రా కేవలం 5 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్లకు మాత్రమే జస్ప్రీత్ అందుబాటులో ఉన్నాడు. మరి ఇప్పుడు విండీస్తో అన్ని మ్యాచ్లు బుమ్రా ఆడుతాడో లేదో వేచి చూడాలి. తాజాగా ఇదే విషయంపై ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబనేషన్పై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని గిల్ చెప్పుకొచ్చాడు."జట్టు కాంబనేషన్పై మ్యాచ్ టు మ్యాచ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము. గేమ్ ఎంత సేపు సాగుతుంది, ఒక బౌలర్ ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలడు? ఇటువంటి ఆంశాలను పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేస్తాము. అంతే తప్ప ముందుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోము.తొలి మ్యాచ్లో మా జట్టు కాంబనేషన్ గురుంచి రేపు మీకు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు, పిచ్ కండీషన్ బట్టి మూడవ సీమర్ను ఆడించాలా వద్దా అన్నది రేపు నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ పేర్కొన్నాడు.అయితే బుమ్రా రెండు మ్యాచ్లు కూడా అడే అవకాశముంది. ఇదే విషయాన్ని జట్టు ప్రకటన సందర్భంగా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు. బుమ్రా వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టులు ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని అగార్కర్ తెలిపాడు. అదేవిధంగా బుమ్రాకు దాదాపు ఐదు వారాల విశ్రాంతి లభించందని అతడు వెల్లడించాడు.చదవండి: వెస్టిండీస్తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్ -
వెస్టిండీస్తో తొలి టెస్టు.. టీమిండియాకు ఊహించని షాక్
ఆసియాకప్-2025 అనంతరం తొలి సవాల్కు టీమిండియా సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్కు ముందు గిల్ సేనకు భారీ షాక్ తగిలింది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సుందర్ చేతి వేలికి గాయమైనట్లు సమాచారం.దీంతో అతడు ఫీల్డింగ్ డ్రిల్స్కు దూరంగా ఉన్నాడు. గాయం తర్వాత సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికి కాస్త అసౌకర్యంగా కన్పించినట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. అతడి చేతి వేలికి బీసీసీ వైద్య బృందం టేపింగ్ చేశారు. అయితే అతడి గాయం తీవ్రతపై ఇప్పటివరకు బీసీసీఐ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. కెప్టెన్ గిల్ మాత్రం సుందర్ వద్దకు వెళ్లి గాయం తీవ్రత గురుంచి తెలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సుందర్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ తమిళనాడు స్పిన్నర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆల్రౌండ్ షోతో సుందర్ అదరగొట్టాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్లో కూడా అతడు టీమిండియాకు కీలకం కానున్నాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి అతడి ఫిట్గా లేకపోతే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.వెస్టిండీస్ సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ , మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు -
భారత్తో సిరీస్కు ముందు విండీస్ మరో బిగ్ షాక్
అక్టోబర్ 2 నుంచి భారత్తో ప్రారంభంకాబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు (India vs West Indies) ముందు వెస్టిండీస్ జట్టుకు (West Indies) మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే యువ స్పీడ్ గన్ షమార్ జోసఫ్ (Shamar Joseph) (గాయం) సేవలను కోల్పోయిన విండీస్.. తాజాగా వారి ప్రధాన పేసర్ అల్జరీ జోసఫ్ను (Alzarri Joseph) కూడా మిస్ అయ్యింది. అల్జరీ వెన్నెముక సమస్య కారణంగా భారత్తో సిరీస్కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అల్జరీ స్థానాన్ని జెడియా బ్లేడ్స్తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత అల్జరీ స్థానంలో జేసన్ హోల్డర్తో భర్తీ చేయాలని విండీస్ బోర్డు భావించినప్పటికీ.. అతను నో చెప్పినట్లు తెలుస్తుంది. హోల్డర్ ముందుగానే ఓ మెడికల్ ప్రొసీజర్ను ప్లాన్ చేసుకున్నందున భారతతో సిరీస్ ఆడలేనని చెప్పినట్లు సమాచారం.అంతకుముందు షమార్ జోసఫ్ స్థానాన్ని విండీస్ బోర్డు 22 ఏళ్ల బార్బడోస్ ఆల్రౌండర్ జోహాన్ లేన్తో (Johann Layne) భర్తీ చేసింది.కాగా, ఆసియా కప్ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్లోనే భారత్, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. అనంతరం అక్టోబర్ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్ జరుగుతుంది.ఈ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్వెస్టిండీస్: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, తేజ్నరైన్ చంద్రపాల్, జాన్ క్యాంప్బెల్, జోహన్ లేన్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వారికన్, ఆండర్సన్ ఫిలిప్, జెడియా బ్లేడ్స్, జేడన్ సీల్స్, ఖారీ పియెర్చదవండి: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ -
బీసీసీఐ కీలక ప్రకటన
ఆసియా కప్ 2025 రసవత్తరంగా సాగుతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక తేదీని ప్రకటించారు. ఈ సిరీస్ కోసం భారత జట్టును సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. జట్టు ఎంపిక ఆన్లైన్ మీటింగ్ ద్వారా జరుగుతుందని తెలిపారు.విండీస్తో సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ అక్టోబర్ 2–6 మధ్యలో అహ్మదాబాద్లో.. రెండో టెస్ట్ అక్టోబర్ 10–14 మధ్యలో ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం విండీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు.ఎవరెవరు ఎంపికవుతారు..?విండీస్తో సిరీస్కు ఎవరెవరు ఎంపికవుతారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్లో సత్తా చాటే భారత-ఏ ఆటగాళ్లను ఈ సిరీస్ కోసం పెద్ద పీఠ వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో ధృవ్ జురెల్, దేవ్దత్ పడిక్కల్, ఎన్ జగదీసన్ సత్తా చాటారు.వీరితో పాటు ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ, అంతకుముందు జరిగిన బుచ్చిబాటు టోర్నీల్లో సత్తా చాటిన ఆటగాళ్ల పేర్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది. సీనియర్ బౌలర్ బుమ్రాను ఈ సిరీస్ కోసం పరిగణలోకి తీసుకోకపోవచ్చు. వర్క్ లోడ్ కారణంగా అతనికి విశ్రాంతి ఇస్తారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన కరుణ్ నాయర్ను కూడా పక్కన పెడతారని సమాచారం. ఆసీస్-ఏతో సిరీస్కు భారత-ఏ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ పేరు కూడా పరిశీలనకు రావచ్చు. శ్రేయస్ ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగుతాడు. సూర్యకుమార్ సేన దూకుడుఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో సత్తా చాటుతూ అజేయ జట్టుగా దూసుకుపోతుంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో జయకేతనం ఎగరవేసిన టీమిండియా.. ఇవాళ (సెప్టెంబర్ 21) గ్రూప్-4 దశలో పాకిస్తాన్తో తలపడనుంది. -
IND vs WI: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడికి చోటు
టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ (West Indies tour of India- 2025) క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు రోస్టన్ ఛేజ్ (Roston Chase) కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. వారిపై వేటుఇక ఈ టూర్లో భాగంగా మాజీ సారథి క్రెయిగ్ బ్రాత్వెట్పై వేటు వేసిన విండీస్ బోర్డు.. చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన కేసీ కార్టీ, జొహాన్ లేన్, మికైల్ లూయీస్లను కూడా జట్టు నుంచి తప్పించింది.వికెట్ల వీరుడికి చోటుఅదే విధంగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఖారీ పియరికి తొలిసారిగా టెస్టు జట్టులో చోటు ఇచ్చింది. వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్తో కలిసి పియరి స్పెషలిస్టు స్పిన్నర్గా బరిలో దిగనున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ చాంపియన్షిప్లో 41 వికెట్లతో సత్తా చాటినందుకు గానూ పియరీకి ఈ అవకాశం దక్కింది. ఇక అలిక్ అథనాజ్, తగెనరైన్ చందర్పాల్కు వెస్టిండీస్ సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు.చందర్పాల్ రాకతో టాపార్డర్లో తమ జట్టు మరింత పటిష్టం అవుతుందని.. అదే విధంగా అథనాజ్ కూడా స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడని తెలిపారు. కాగా అథనాజ్ చివరిసారిగా జనవరిలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో ఆడాడు. సీమర్ల కోటాలో వీరేఅయితే.. పేసర్ గుడకేశ్ మోటికి మాత్రం విశ్రాంతినిచ్చినట్లు విండీస్ బోర్డు తెలిపింది. పరిమిత ఓవర్ల సిరీస్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపఖండ పిచ్లపై మ్యాచ్ నేపథ్యంలో స్పిన్ విభాగానికి వారికన్ నాయకత్వం వహించనుండగా.. ఖారీ పియర్రి, రోస్టన్ ఛేజ్ అతడికి సహాయకులుగా ఉండనున్నారు.ఇక సీమర్ల కోటాలో అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ స్థానం దక్కించుకున్నారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా వెస్టిండీస్ టీమిండియాతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అక్టోబరు 2- 14 వరకు ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్, ఢిల్లీ వేదికలుగా ఈ రెండు మ్యాచ్లు జరుగనున్నాయి.టీమిండియాతో టెస్టు సిరీస్కు వెస్టిండీస్ జట్టురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్బెల్, తగెనరైన్ చందర్పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియర్రి, జేడన్ సీల్స్.చదవండి: మ్యాక్స్వెల్ కీలక నిర్ణయం -
వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం.. మళ్లీ ఇంగ్లండ్కు
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ తమిళనాడు స్టార్ క్రికెటర్ ఇంగ్లండ్ కౌంటీల్లో మరోసారి ఆడనున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.ఈ టోర్నీలో భాగంగా సోమర్సెట్, సర్రేతో జరిగే చివరి రెండు హాంప్షైర్ మ్యాచ్ల్లో సుందర్ భాగం కానున్నాడు. ఈ విషయాన్ని హాంప్షైర్ క్రికెట్ క్లబ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. "భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మా చివరి రెండు మ్యాచ్ల్లో ఆడేందుకు మాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. వెలకమ్ వాషీ" అంటూ హాంప్షైర్ ఓ పోస్ట్ చేసింది. సుందర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడడం ఇది రెండో సారి. ఇంతకుముందు లంకాషైర్ క్రికెట్ క్లబ్ తరపున సుందర్ ఆడాడు. ఈ రెండు కౌంటీ మ్యాచ్లు (15 సెప్టెంబర్ వర్సెస్ సొమర్సెట్, 24 సెప్టెంబర్ వర్సెస్ సర్రే) వెస్టిండీస్ సిరీస్కు ముందు సన్నాహకంగా ఉపయోగపడనుంది.వాస్తవానికి స్వదేశంలో ఆసీస్-ఎతో జరిగే అనాధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరపున వాషీ ఆడుతాడని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం సుందర్కు ఛాన్స్ ఇవ్వలేదు. మానవ్ సుతార్, తనుష్ కోటియన్, హర్ష్ దుబే వంటి యువ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లకు అవకాశమిచ్చారు.కాగా ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టూర్లో సుందర్ ఏడు వికెట్లు, 284 పరుగులతో సత్తాచాటాడు. అంతకుముందు న్యూజిలాండ్ సిరీస్లో కూడా మొత్తంగా 16 వికెట్లు సాధించాడు. ఇప్పుడు సుందర్ తిరిగి విండీస్తో సిరీస్లో ఆడనున్నాడు. భారత్-విండీస్ మధ్య రెండు మ్యాచ్ల సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. -
టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్.. శ్రేయస్ రీ ఎంట్రీ?
ఆసియాకప్-2025 తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ రెడ్ బాల్ క్రికెట్ సిరీస్ ఆక్టోబర్ 2 నుంచి 16 వరకు జరగనుంది. వెంటనే ఆక్టోబర్ 19 భారత్-ఇండియా వైట్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది. దీంతో రాబోయో రెండు నెలల పాటు భారత జట్టు వరుస సిరీస్లతో బీజీబీజీగా గడపనుంది.కెప్టెన్గా రాహుల్..?వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు మరో పది రోజుల్లో ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు దూరమయ్యే అవకాశముంది. గిల్ ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీలో బిజీగా ఉన్నాడు. గ్రూపు-ఎలో ఉన్న భారత్ ఫైనల్కు చేరడం దాదాపు ఖాయమనే చెప్పుకోవాలి. ఈ ఖండాంతర టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. అక్కడికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో తొలి టెస్టు మొదలు కానుంది. దీంతో మొదటి టెస్టుకు సెలక్టర్లు గిల్కు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే తొలి టెస్టులో భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించవచ్చు. రాహుల్ ఆసియాకప్ జట్టులో సభ్యునిగా లేని సంగతి తెలిసిందే.ఓపెనర్లగా రాహుల్, జైశ్వాల్..ఇక ఇంగ్లండ్ టూర్లో అద్బుతంగా రాణించిన యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లగా కొనసాగనున్నారు. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ మరోసారి రిజర్వ్ ఓపెనర్గా ఉంటాడు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లగా ఎంపిక కానున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది.పంత్కు గాయం, జగదీశన్కు చోటు..ఇక ఇంగ్లండ్ టూర్లో గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్.. విండీస్ సిరీస్కు దూరమయ్యే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ మరోసారి వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే తమిళనాడుకు చెందిన నారయణ్ జగదీశన్ సెకెండ్ వికెట్ కీపర్గా ఉండనున్నాడు.అయ్యర్ ఎంట్రీ?ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత టెస్టు జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ కారణంతోనే అతడిని ఆసీస్-ఎతో సిరీస్కు భారత-ఎ జట్టు కెప్టెన్గా అయ్యర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయస్కు భారత టెస్టు జట్టులో చోటు దక్కితే మరోసారి సర్ఫరాజ్ ఖాన్పై వేటు పడే అవకాశముంది.ఇక ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,నితీష్ కుమార్ రెడ్డి తమ స్దానాలను పదిలం చేసుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చోటు దక్కించుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నాడు. అయితే ఆసియాకప్లో కెప్టెన్ గిల్తో భాగమైన బుమ్రా, కుల్దీప్ యాదవ్లు తొలి టెస్టుకు అందుబాటులో ఉంటారో లేదో వేచి చూడాలి.వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు (అంచనా)యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్.చదవండి: #Babar Azam: 6 లగ్జరీ కార్లు.. పాక్ రిచెస్ట్ క్రికెటర్గా! బాబర్ ఆజం నెట్ వర్త్ ఎంతంటే? -
సెమీ ఫైనల్లో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఫెయిల్
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించిన నాటి నుంచి రెండు పేర్లు చర్చనీయాంశమయ్యాయి. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), యశస్వి జైస్వాల్. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో జైసూ కేవలం స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైతే.. శ్రేయస్ అందుకు కూడా నోచుకోలేదు.సెమీ ఫైనల్లో ఇద్దరూ విఫలంఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ముంబైకర్లకు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలిచారు. శ్రేయస్, జైసూలకు ఆసియా కప్ జట్టులో చోటు ఇవ్వాల్సిందంటూ బీసీసీఐ తీరును విమర్శించారు. ఇలా చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న ఈ ఇద్దరు.. తాజాగా దులిప్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ సందర్భంగా మైదానంలో తిరిగి అడుగుపెట్టారు.వెస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్.. దులిప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో నిరాశపరిచారు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ఈ క్రమంలో హర్విక్ దేశాయ్తో కలిసి ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ బాది.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక హర్విక్ ఒక్క పరుగు చేసి దీపక్ చహర్కు వికెట్ సమర్పించుకున్నాడు.25 పరుగులు చేసిన అయ్యర్వన్డౌన్లో వచ్చిన ఆర్య దేశాయ్ 39 పరుగులతో రాణించగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన శ్రేయస్ అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. 28 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు సాధించాడు. షమ్స్ ములానీ 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శనఅయితే, నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అద్భుత అర్ధ శతకం (94 నాటౌట్)తో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ నేపథ్యంలో 45 ఓవర్ల ముగిసే సరికి వెస్ట్ జోన్ ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇక సెంట్రల్ జోన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, దీపక్ చహర్, సారాంశ్ జైన్, హర్ష్ దూబే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.విండీస్తో ఆడే జట్టుకు ఎంపిక అవ్వాలంటేకాగా స్వదేశంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో దులిప్ ట్రోఫీ-2025లో సత్తా చాటాలని.. శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, తొలి ఇన్నింగ్స్లో నిరాశజనక ప్రదర్శనతో అతడి అవకాశాలు సన్నగిల్లినట్లే. రెండో ఇన్నింగ్స్లోనైనా రాణిస్తే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం గురించి అయ్యర్ ఆశలు పెట్టుకోవచ్చు. మరోవైపు.. యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా!
ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్పై వేటు పడనుందా? అంటే అవును అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఒక్క ఛాన్స్ అంటూ ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో నాయర్ మొత్తంగా నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసేందుకు అజిత్ అగర్కారర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిద్దమైనట్లు తెలుస్తోంది.శ్రేయస్ రీ ఎంట్రీ.. అతడి స్ధానంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆక్టోబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్తో అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్ చివరగా టెస్టుల్లో భారత తరపున 2024లో ఇంగ్లండ్పై ఆడాడు.ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్ధానాన్ని అయ్యర్ కోల్పోయాడు. అయితే దేశవాళీ టోర్నీలో అద్బుతంగా రాణించి తిరిగి జాతీయ జట్టులోకి ఈ ముంబైకర్ వచ్చాడు. కానీ కేవలం వన్డే జట్టులో మాత్రమే అతడికి చోటు దక్కింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో అయ్యర్ది కీలక పాత్ర. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం అయ్యర్ బదులుగా కరుణ్ నాయర్కు అవకాశమిచ్చారు. కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. ఈ క్రమంలో సెలక్టర్లు మళ్లీ అయ్యర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయ్యర్ లాంటి ప్లేయర్ కావాలి..భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అయ్యర్ లాంటి అనుభవజ్ఞుడైన మిడిలార్డర్ బ్యాటర్ అవసరం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో మాకు లోటు స్పష్టంగా కన్పించింది. స్పిన్నర్లను శ్రేయస్ అయ్యర్ అద్బుతంగా ఆడగలడుజ స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్లో స్పిన్ బాగా ఆడిగలిగే ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. దీంతో అయ్యర్ను కచ్చితంగా సెలక్టర్లు ఎంపిక చేస్తారని" ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు ఐదు ఆర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: టీమిండియా స్టార్ ప్లేయర్కు గాయం.. కీలక టోర్నీకి దూరం? -
యువరాజ్, రాయుడు విధ్వంసం..సెమీస్కు చేరిన టీమిండియా
అంతర్జాతీయ మాస్టర్స్ లీగ్ టీ20-2025 టోర్నీలో ఇండియన్ మాస్టర్స్ టీమ్ మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాయ్పూర్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 7 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా తమ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత మాస్టర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో సౌరబ్ తివారీ(37 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్లతో 60), అంబటి రాయుడు(35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 63) హాఫ్ సెంచరీలతో మెరవగా.. ఆఖరిలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు.విండీస్ బౌలర్లను యువీ ఉతికారేశాడు. కేవలం 20 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 49 పరుగులు చేసి ఆజేయగా నిలిచాడు. వీరితో పాటు గుర్క్రీత్ సింగ్ మానన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 46) తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో బెన, కార్టర్, టేలర్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్య చేధనలో విండీస్ ఆఖరి వరకు పోరాడింది. 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో డ్వైన్ స్మిత్(34 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 79), విలియమ్ పెర్కిన్స్(52) హాఫ్ సెంచరీలు సాధించాడు.లెండల్ సిమిన్స్( 13 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్లతో 38) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో వెస్టిండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ మూడు వికెట్లు పడగొట్టగా.. పవన్ నేగి రెండు, ఇర్ఫాన్ పఠాన్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: Champions Trophy final: 'అతడు 20 ఓవర్లు ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ భారత్దే' -
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆరు వికెట్లతో విజృంభించగా.. రేణుకా ఠాకూర్ నాలుగు వికెట్లు నేలకూల్చింది.నిప్పులు చెరిగిన రేణుకాఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నిప్పులు చెరిగింది. తొలి బంతికే ఓపెనర్ క్వియానా జోసఫ్ను ఔట్ చేసిన రేణుకా.. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ను క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం రేణుకా ఐదో ఓవర్లో మరో వికెట్ పడగొట్టింది. ఈసారి ఆమె స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో వెస్టిండీస్ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దీప్తి శర్మ మాయాజాలంవిండీస్ పతనానికి రేణుకా సింగ్ పునాది వేయగా.. ఆతర్వాత పనిని దీప్తి శర్మ పూర్తి చేసింది. దీప్తి ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. మధ్యలో షెమెయిన్ క్యాంప్బెల్ (46), చిన్నెల్ హెన్రీ (61) నిలకడగా ఆడినప్పటికీ.. ఈ ఇద్దరిని దీప్తి స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు పంపింది. విండీస్ ఇన్నింగ్స్లో క్యాంప్బెల్, హెన్రీతో పాటు ఆలియా అలెన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.సిరీస్ సొంతంమూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ భారీ తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఈ రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు నమోదు చేసింది. వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్ను సైతం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 115 పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగులు వరద పారించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జోరుమీదున్న ఓపెనర్ స్మృతి మంధాన (53; 7 ఫోర్లు, 2 సిక్స్లు), మరో ఓపెనర్ ప్రతీక రావల్ (76; 10 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా వన్డేల్లో భారత్ తమ అత్యధిక స్కోరును సమం చేసింది. 2017లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ భారత జట్టు 358 పరుగులే సాధించింది. అంతేకాకుండా మరో అరుదైన రికార్డు కూడా భారత్ తమ ఖాతాలో వేసుకుంది.తొలి జట్టుగా..మహిళల వన్డే క్రికెట్లో వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2011లో లీసెస్టర్ వేదికగా విండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డును మన అమ్మాయిలు బ్రేక్ చేశారు.మాథ్యూస్ సెంచరీ వృథా..359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (109 బంతుల్లో 106; 13 ఫోర్లు) శతకం సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి శర్మ, టిటాస్, ప్రతీక తలా 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 27న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్? -
రెండో వన్డేలో వెస్టిండీస్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
వడోదర వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో టెస్టులో 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.డియోల్ సూపర్ సెంచరీ.. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా వన్డేల్లో భారత్ 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్పై కూడా సరిగ్గా 358/5 స్కోరు చేసింది. ఇక విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ తలో వికెట్ తీశారు.మాథ్యూస్ ఒంటరి పోరాటం..అనంతరం భారీ లక్ష్య చేధనలో వెస్టిండీస్ మహిళల జట్టు 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ హీలీ మథ్యూస్ విరోచిత పోరాటం కనబరిచింది. మథ్యూస్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 109 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మాథ్యూస్ 106 పరుగులు చేసింది.అయితే మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో విండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తీ శర్మ, ప్రతికా రావల్,టిటాస్ సాదు తలా రెండు వికెట్లు సాధించారు. -
భారత బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 358 పరుగులు
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు.విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన బ్యాటర్లు తమపని తాము చేసుకుపోయారు.భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో డొటిన్, ఫ్లెచర్, జేమ్స్, జోషఫ్ తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళ జట్టు 358 పరుగులు చేయడం ఇది రెండో సారి. అదనంగా మరో పరుగు చేసి ఉంటే భారత్కు అత్యధిక వన్డే స్కోర్ను నెలకొల్పేది. గతంలో 2017లో ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.చదవండి: WI vs PAK: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు -
T20 World CUP 2025: భారత జట్టు ప్రకటన
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ జట్టును ప్రకటించింది. ఇందుకు సంబంధించి పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం వెల్లడించింది. మలేషియా వేదికగా జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.ఈ టోర్నమెంట్లో భారత జట్టుకు నికీ ప్రసాద్(Niki Prasad) కెప్టెన్గా వ్యవహరించనుండగా.. సనికా చాల్కే వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. వికెట్ కీపర్ల కోటాలో జి. కమలిని, భవికా అహిరే చోటు దక్కించుకున్నారు.ఇక నిక్కీ సారథ్యంలోని భారత జట్టులో ముగ్గురు తెలుగమ్మాయిలు గొంగడి త్రిష(G Trisha), కేసరి ధృతి, ఎండీ షబ్నమ్ కూడా స్థానం సంపాదించారు. మరోవైపు.. స్టాండ్ బై ప్లేయర్లుగా నంధాన ఎస్, ఐరా జె, టి అనధి ఎంపికయ్యారు.పదహారు జట్ల మధ్య పోటీకాగా మలేషియాలో జరిగే అండర్-19 మహిళల ప్రపంచకప్ టోర్నీ(U19 Women’s T20 World Cup)లో మొత్తం పదహారు జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్- ‘ఎ’లో భారత్తో పాటు మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో జనవరి 19న వెస్టిండీస్తో తలపడుతుంది.డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి భారత్అనంతరం.. జనవరి 21న మలేషియా, 23న శ్రీలంకతో మ్యాచ్లు ఆడుతుంది. ఇక నాలుగు గ్రూపులలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ స్టేజ్లో అడుగుపెడతాయి. ఈ దశలో రెండు గ్రూపులలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. కాగా 2023లో తొలిసారి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ నిర్వహించగా.. భారత జట్టు చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం చేయాలని డిఫెండింగ్ చాంపియన్ పట్టుదలగా ఉంది.అండర్ -19 మహిళల ప్రపంచకప్ 2025కి భారత జట్టునికీ ప్రసాద్(కెప్టెన్), సనికా చాల్కే(వైస్ కెప్టెన్), గొంగడి త్రిష, జి. కమలిని(వికెట్ కీపర్), భవికా ఆహిరే(వికెట్ కీపర్), ఈశ్వరి అవసారే, మిథిలా వినోద్, జోషిత వీజే, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుశి శుక్లా, ఆనందితా కిషోర్, ఎండీ షబ్నమ్, వైష్లవి ఎస్.స్టాండ్ బై ప్లేయర్లు: నంధాన ఎస్, ఐరా జె, టి అనధి.చదవండి: IND W Vs BAN W: ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్నేను బతికి ఉన్నానంటే.. అందుకు కారణం అతడే: వినోద్ కాంబ్లీ -
నిప్పులు చెరిగిన టీమిండియా పేసర్.. తొలి వన్డేలో విండీస్ ఘోర పరాజయం
వడోదరా వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.సెంచరీ చేజార్చుకున్న మంధనఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.నిప్పులు చెరిగిన రేణుకా సింగ్.. తొలి ఐదు వికెట్ల ఘనత315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. రేణుకా సింగ్ (10-1-29-5) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్కు కెరీర్లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత. భారత్ బౌలర్లలో రేణుకా సింగ్తో పాటు టైటాస్ సాధు (7-2-24-1), ప్రియా మిశ్రా (4.2-0-22-2), దీప్తి శర్మ (3-0-19-1) కూడా రాణించారు. విండీస్ ఇన్నింగ్స్లో క్యాంప్బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 నాటౌట్), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. -
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్కు పనిచెప్పింది. ఈ మ్యాచ్లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బేట్స్ ఆల్టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్లో భారత మహిళా జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్తో వెస్టిండీస్ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
మంధన మెరుపు అర్ద శతకం.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది. వికెట్కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనుంది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది. -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్లు వదిలేశారు. బౌలింగ్లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్పై వేటు
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్కు ఫామ్లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ మిస్ -
కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లి, రవిశాస్త్రి తనకు పునర్జన్మను ప్రసాదించారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వారిద్దరి వల్లే తన రెండో ఇన్నింగ్స్ మొదలైందని.. తనను టాపార్డర్కు ప్రమోట్ చేసి ఓపెనర్గా అవకాశమిచ్చింది కూడా వారేనంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా 2013లో కోల్కతా వేదికగా వెస్టిండీస్తో సిరీస్ సందర్భంగా ముంబై బ్యాటర్ రోహిత్ శర్మ టెస్టుల్లో అడుగుపెట్టాడు.అరంగేట్రంలోనే అద్భుత శతకంతొలి మ్యాచ్లో ఆరో స్థానంలో బరిలోకి దిగి అరంగేట్రంలోనే అద్భుత శతకం(177)తో ఆకట్టుకున్నాడు. విండీస్తో నాటి సిరీస్లో జరిగిన ఈ తొలి టెస్టులో ధోని సేన ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తన రెండో టెస్టులోనూ శతక్కొట్టి వారెవ్వా అనిపించాడు. కానీ టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు.దాదాపు ఆరేళ్ల పాటు చోటే కరువుఅరంగేట్రం తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు భారత టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మకు స్థానమే కరువైంది. అయితే, 2018-19లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడిన జట్టులో రోహిత్ చోటు దక్కించుకోగలిగాడు. ఈ సిరీస్లోనూ అతడు ఆరో స్థానంలోనే బరిలోకి దిగాడు.అలా రీఎంట్రీఇక ఆ తర్వాత వన్డే వరల్డ్కప్-2019లో వరుసగా ఐదు సెంచరీలు బాదినా.. టెస్టుల్లో మాత్రం రోహిత్ రాత పెద్దగా మారలేదు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత వెస్టిండీస్తో ఆడిన టెస్టు సిరీస్లో అతడిని బెంచ్కే పరిమితం చేసింది మేనేజ్మెంట్. అయితే, నాడు ఓపెనర్గా ఉన్న కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టడంలో విఫలం కావడంతో.. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి రోహిత శర్మను ఓపెనర్గా బరిలోకి దించారు. ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్అప్పటి నుంచి రోహిత్కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టీమిండియా ఓపెనర్గా జట్టులో పాతుకుపోయిన హిట్మ్యాన్ కెప్టెన్గా ఎదగడమే గాకుండా.. భారత్ను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)కు చేర్చిన సారథిగానూ ఘనత సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్తో సొంతగడ్డపై టీమిండియాను గెలిపించి.. మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వేటలో జట్టును నిలిపాడు.వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారుఈ నేపథ్యంలో కామెంటేటర్ జతిన్ సప్రూనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టెస్టు కెరీర్ రెండో ఇన్నింగ్స్లో రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలకు నేను చాలా రుణపడిపోయాను. నన్ను టాపార్డర్కు ప్రమోట్ చేసింది వాళ్లే. టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపడం అంత సులువు కాదు. అయినా, వాళ్లిద్దరు నాపై నమ్మకం ఉంచారు.తొలి బంతికే అవుటయ్యానునా ఆటను పరిశీలించేందుకు ఓ ప్రాక్టీస్మ్యాచ్ ఆడమని చెప్పారు. అయితే, అప్పుడు నేను తొలి బంతికే అవుటయ్యాను. ఇక నాకు ఓపెనర్గా ఎలాంటి అవకాశం లేదని నిరాశచెందాను. టెస్టుల్లో ఐదు లేదంటే ఆరో స్థానంలోనైనా.. లేదంటే లోయర్ఆర్డర్లోనైనా బ్యాటింగ్కు వెళ్లాల్సిందేనని ఫిక్సయ్యాను.నమ్మకం నిలబెట్టుకుంటూకానీ రవి భాయ్ టెస్టుల్లో నన్ను ఓపెనర్గా పంపాలని భావించాడు. 2015లోనే నాకు ఈ అవకాశం వస్తే బాగుంటుందని చెప్పాడు. అయితే, అప్పుడు అది సాధ్యం కాలేదు. కానీ తర్వాత రవిభాయ్, కోహ్లి వల్ల టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోట్ అయ్యాను’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రవిశాస్త్రి, విరాట్ కోహ్లి పట్ల ఈ సందర్భంగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా రోహిత్ తదుపరి స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్తో బిజీ కానున్నాడు. చదవండి: రిస్క్ అని తెలిసినా తప్పలేదు.. అతడొక అద్భుతం: రోహిత్ శర్మ While @ImRo45 Rohit’s legacy in test cricket is being discussed - Here’s a little story of his comeback into test cricket .. Also a sneak peek into how @RaviShastriOfc and @imVkohli planned India’s ascendancy in tests. pic.twitter.com/LO0jVtqP7O— Jatin Sapru (@jatinsapru) October 1, 2024 -
గొప్ప మనసు చాటుకున్న ధోని
రాంచీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని గత కొద్ది రోజులగా నిలకడలేమి ఆటతో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ తరహా ఆటతో చివరకు టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు. మరోవైపు ధోని బ్యాట్ ఝుళిపించకపోయినా అతని క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అతను ఆడకపోయినా ఆటలోని అతని వ్యూహాలు... మార్క్ కీపింగ్తో అభిమానులు తమ గుండెల్లో పదిలంగా ఉంచుకుంటున్నారు. వారి అభిమానాన్ని ఒక్కోలా వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్తో చివరి వన్డే సందర్భంగా కేరళ గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్ను ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. (చదవండి: 35 అడుగుల ధోని కటౌట్..) ధోని కూడా వారి అభిమానులను అలరిస్తూ సంతోషపరుస్తుంటారు. ఈ నేపథ్యంలో ధోని తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లొస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని కనిపించాడు. వెంటనే ప్రొటోకాల్ను సైతం పక్కన పెట్టి ధోని కారులో నుంచే ఆ అభిమానితో ముచ్చటించాడు. షేకాండ్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ధోని భాయ్ గొప్ప మనసంటూ.. అతని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని వన్డేల్లో 10వేల పరుగుల మైలు రాయి అందుకోవడానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో ధోని 10,174 పరుగులు చేయగా.. ఇందులో వరల్డ్ ఎలెవన్ జట్టు తరపున చేసిన 174 పరుగలున్నాయి. (చదవండి: ధోని ఇక.. కబడ్డీ కబడ్డీ!) ఈ ఏడాది ధోని దారుణంగా విఫలమయ్యాడు. 12 ఇన్నింగ్స్లాడిన ధోని కేవలం 252 పరుగులు మాత్రమే చేశాడు. ఈ తరహా ఆటతోనే టీ20ల్లో చోటు కోల్పోయాడు. ఇక ధోనిని జట్టుకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అతని అభిమానులు ఆరోపిస్తుండగా.. ధోనిని పక్కనే పెట్టే ఉద్దేశం లేదని, ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ కోసమే అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు సెలక్టర్లు పేర్కొన్నారు. ధోని లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటేనని హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ( చదవండి: ధోని లేకపోవడం లోటే) RT msdfansofficial: Man with Golden Heart. Just look at the way, he is adoring his little fan. msdhoni SaakshiSRawat#MSDhoni #Dhoni #mahiway pic.twitter.com/WpByIlp0hi — DASA🚩🚩 (@dasa_____) November 13, 2018 -
పాకిస్తాన్ను వెనక్కునెట్టిన భారత్
చెన్నై: వెస్టిండీస్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా పొట్టి ఫార్మాట్లో తన విజయాల సంఖ్యను భారత్ మరింత పెంచుకుంది. ఈ క్రమంలోనే టీ20 విజయాల శాతంలో పాకిస్తాన్ను వెనక్కునెట్టిన భారత్ రెండో అత్యుత్తమ జట్టుగా నిలిచింది. గత పుష్కరకాలం నుంచి చూస్తే భారత్ ఇప్పటివరకూ 107 టీ20 మ్యాచ్లు ఆడగా, అందులో 68 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. మరో 36 మ్యాచ్ల్లో ఓటమి చూడగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరో రెండు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. దాంతో టీమిండియా విజయాల శాతం 65.23గా నమోదైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ను అధిగమించింది టీమిండియా. విండీస్తో చెన్నై మ్యాచ్లో విజయం తర్వాత పాక్ను వెనక్కునెట్టింది భారత జట్టు. టీ20ల్లో పాక్ విజయాల శాతం 65.10గా ఉండగా, దాన్ని టీమిండియా బ్రేక్ చేసింది. గత కొంతకాలంగా టీ20ల్లో పాకిస్తాన్ తిరుగులేని జట్టుగా ఎదిగిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగానే ఆ జట్టు ప్రస్తుతం నంబర్వన్ ర్యాంకులో కొనసాగుతోంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా సాధిస్తున్న విజయాలు టీమిండియాలో నిలకడను చాటిచెబుతున్నాయి. అంతర్జాతీయ 20ల్లో విజయాల శాతంలో అఫ్గానిస్తాన్ టాప్ ప్లేస్లో ఉంది. అఫ్గానిస్తాన్ టీ20లు ఆడటం మొదలు పెట్టిన దగ్గర్నుంచీ చూస్తే విజయాల శాతం 67.24గా ఉంది. -
పరుగుల వీరుల్లో ధావన్ పైపైకి..!
చెన్నై: వెస్టిండీస్తో జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ శిఖర్ ధావన్.. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు(అంతర్జాతీయ మ్యాచ్ల్లో) సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.. విండీస్తో మూడో టీ20లో ధావన్ 92 పరుగులతో మెరిశాడు. ఫలితంగా ఈ ఏడాది అంతర్జాతీయ టీ20ల్లో ధావన్ 572 పరుగులతో మూడో స్థానానికి ఎగబాకాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి(641) టాప్ ప్లేస్లో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లి ఈ మార్కును చేరాడు. ఆ తర్వాత స్థానంలో ఫకార్ జమాన్(576-2018) రెండో స్థానంలో ఉండగా, ధావన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను అధిగమించాడు ధావన్. ఈ ఏడాది ఇప్పటివరకూ టీ20ల్లో రోహిత్ సాధించిన పరుగులు 560. ఇక టీ20 సిరీస్ను 3-0 తేడాతో అత్యధిక సార్లు గెలిచిన జాబితాలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్ జట్టు మూడుసార్లు 3-0తో టీ20 సిరీస్ను గెలవగా, పాకిస్తాన్ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ అప్ఘానిస్తాన్తో కలిసి భారత్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, యూఏఈ,వెస్టిండీస్లు ఒక్కోసారి మాత్రమే 3-0తో టీ20 సిరీస్లను గెలిచాయి. -
‘డబుల్ సెంచరీ’ క్లబ్లో రోహిత్
చెన్నై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల ఫోర్ల కొట్టిన ఆటగాడిగా రోహిత్ గుర్తింపు సాధించాడు. వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో రోహిత్ ‘డబుల్ సెంచరీ’ ఫోర్ల్ క్లబ్లో చేరిపోయాడు. నిన్న మ్యాచ్లో రోహిత్ ఫోర్ మాత్రమే కొట్టి పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక్కడ భారత తరపున విరాట్ ముందున్నాడు. విరాట్ కోహ్లి 214 ఫోర్లతో ఉండగా, రోహిత్ పేరిట 200 ఫోర్లు ఉన్నాయి. కాగా, ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్(223) ముందు వరుసలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో అఫ్గానిస్తాన్ ఆటగాడు మొహ్మద్ షెహజాద్(218) నిలిచాడు. ఆపై వరుస స్థానాల్లో కోహ్లి, మార్టిన్ గప్తిల్, రోహిత్ శర్మలు ఉన్నారు. ఇక్కడ గప్తిల్, రోహిత్లు సంయుక్తంగా నాల్గో స్థానంలో ఉన్నారు. చెన్నై టీ20లో భారత్ ఆఖరి బంతికి గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్ల తేడాతో ఛేదించి సిరీస్ను ఘనంగా ముగించింది. ఇక్కడ చదవండి: ఆఖరి బంతికి ముగించారు -
టి20 సిరీస్ భారత్ సొంతం
-
చెన్నై టీ20లో భారత్ విజయం
చెన్నై: చెన్నై వేదికగా వెస్టిండీస్తో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. అఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్లో విండీస్ నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించిన భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 2-0తో ఆధిక్యంతో సిరీస్ను సొంతం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ విజయంతో టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విండీస్ ధాటిగా ఆడింది. బ్రేవో(43 నాటౌట్), పూరన్ (53 నాటౌట్)లు చేలరేగడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో ఓవర్లో 13 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా17 పరుగులు చేసి థామస్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పంత్తో కలిసి ధావన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో భారత్ పంత్(38 బంతుల్లో 58 పరుగులు), ధావన్(62 బంతుల్లో 92 పరుగులు) వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరి బంతి వరకు సాగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. -
మ్యాచ్లో ధోని లేకపోయినా..
చెన్నై: ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిని అక్కడి అభిమానులు తమ వాడిగా ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. పలు నగరాల్లోని ధోని అభిమానుల్లో చాలా మంది ఐపీఎల్లో ఆయన సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలని కోరుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు తమ అభిమాన క్రికెటర్పై గల ఇష్టాన్ని పలు సందర్భాల్లో, పలు రూపాల్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా విండీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్కు హాజరైన ధోని అభిమానులు అతడిపై వారికి గల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మ్యాచ్ జరుగుతుంది చెన్నై కావడంతో.. నేటి మ్యాచ్లో ధోని లేకపోయినప్పటికీ.. చాలా మంది ధోని పేరుతో ఉన్న టీ షర్ట్లను ధరించి మ్యాచ్ను వీక్షించడానికి వచ్చారు. -
విండీస్తో టీ20: ధావన్ హాఫ్ సెంచరీ
సాక్షి, చెన్నై : భారత్, వెస్టిండీస్ మధ్య జరగునున్న చివరి టీ-20 మ్యాచ్లో విండీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0తో ఇది వరకే సొంత చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగింది. సిరీస్ క్లీన్స్వీప్ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విండీస్ చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అప్డేట్స్ : భారత ఆటగాళ్లు ధావన్, పంత్లు విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ధావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా, పంత్ కూడా ధాటిగా ఆడుతూ.. స్కోర్ను పరుగులు పెట్టిస్తున్నాడు. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే 36 బంతుల్లో 52పరుగులు చేయాల్సి ఉంది. ధాటిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ థామస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఫోర్లతో చెలరేగిన రాహుల్ 10 బంతుల్లో 17 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పాల్ బౌలింగ్లో జౌటయ్యాడు. 2.3 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది. చెన్నైలో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. గత రెండు మ్యాచ్లను ఓడి సిరీస్ కోల్పోయిన విండీస్ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓపెనర్ ఎస్డీ హోప్ 24 పరుగులు చేసి ఔటవ్వగా.. మరో ఓపెనర్ హెట్మెయర్ 26 పరుగులకు ఔటయ్యాడు. వన్ డౌన్లో వచ్చిన డీఎం బ్రావో ఒకవైపు నిలకడగా ఆడుతుండగా.. నాలుగో స్థానంలో వచ్చిన రామ్దిన్ 15 పరుగులు చేసి సుందర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజ్లోకి వచ్చిన నికోలస్ పూరన్ వస్తూనే ధాటిగా ఆడటం ప్రారంభించాడు. మరోవైపు బ్రావో కూడా జోరు పెంచాడు. పూరన్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లో 53 పరుగులు చేయగా.. బ్రావో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు కలిసి అజేయంగా ఐదో వికెట్కు 87 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా.. సుందర్ ఒక వికెట్ పడగొట్టాడు. చాహల్ ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. టీమిండియాకు 182 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చెలరేగి ఆడిన విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ 24 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఎన్ పూరన్, బ్రావో ధాటిగా ఆడుతుండటంతో విండీస్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. 17 ఓవర్లు ముగిసేసరికి కరేబియన్లు మూడు వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేశారు. ప్రస్తుతం బ్రావో 26 బంతుల్లో 30 పరుగులు, పూరన్ 14 బంతుల్లో 29 పరుగులు చేసి క్రీజ్లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన విండీస్.. 15 పరుగులు చేసిన రామ్దిన్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రావో 15 పరుగులు, ఎన్ పూరన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్రేవో 12 పరుగులతో, డీ రామ్దిన్ ఏడు పరుగులతో క్రీజ్లో ఉన్నారు. వెస్టిండీస్ కోల్పోయిన రెండు వికెట్లను చాహల్ తన ఖాతాలో వేసుకున్నాడు. 53 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన విండీస్, హోప్ (24) ఔట్ ఐదు ఓవర్లు ముగిసే లోపు విండీస్ స్కోర్ : 38/0. హోప్ (17), హెట్మేర్ (16) భారత్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తిక్, కృనాల్ పాండ్యా, సుందర్, భువనేశ్వర్ కుమార్, కలీల్, చహల్ విండీస్ : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. -
రోహిత్ను ఊరిస్తున్న టీ20 రికార్డు
చెన్నై:అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్ రికార్డును తన పేరిట లిఖించుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు సాధించడానికి రోహిత్ 69 పరుగుల దూరంలో ఉన్నాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా చెన్నై వేదికగా ఆదివారం వెస్టిండీస్తో జరగబోయే ఆఖరి టీ20లో రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్గా న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గఫ్తిల్(2271) అందరికంటే ముందు ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్(2203) కొనసాగుతున్నాడు. గత టీ20లో శతకం సాధించిన రోహిత్ శర్మ.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో గఫ్తిల్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలంటే.. విండీస్తో ఆఖరి టీ20లో రోహిత్కు మరో 69 అవసరం. భీకరఫామ్లో ఉన్న రోహిత్ శర్మ.. ఆ రికార్డును అందుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక్కడ చదవండి: రోహితారాజువ్వ కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’ -
మూడో టీ20: సిద్దార్థ్ కౌల్కు అవకాశం
ముంబై : వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్ సిద్దార్థ్ కౌల్కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేసింది. రంజీల్లో పంజాబ్ తరపున కౌల్ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్.. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్కు ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. UPDATE: Umesh Yadav, Jasprit Bumrah & Kuldeep Yadav rested for 3rd Paytm #INDvWI T20I in Chennai@sidkaul22 added to India's squad Details - https://t.co/hqzMTMT8rZ pic.twitter.com/tbdbLBfwEI — BCCI (@BCCI) November 9, 2018 -
ఉప్పల్ టెస్ట్.. టికెట్ డబ్బులు వాపస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే (అక్టోబర్–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వనుంది. ఈ మేరకు హెచ్సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్ టికెట్లు కొన్న వారు ఒరిజినల్ మ్యాచ్ టికెట్లతో పాటు బ్యాంక్ అకౌంట్ వివరాలతో కౌంటర్ వద్ద సంప్రదించాలి. ఆన్లైన్ ద్వారా కొన్న వారికి ఆన్లైన్ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్ వీక్షించేందుకు సీజన్ టికెట్ తీసుకున్న వారికి ఇది వర్తించదు. -
ఎయ్ పొలార్డ్.. ఏందీ తొండాట!
లక్నో: వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో విండీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత స్పీడ్స్టార్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 11 ఓవర్లో విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ కీరన్ పొలార్డ్ తన అతి తెలివిని ప్రదర్శించాడు. బుమ్రా వేసిన నాలుగో బంతిని పొలార్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. అది బ్యాట్ అంచుకు తగిలి అక్కడే గాల్లోకి లేచింది. (చదవండి: అద్భుతం.. ఒకే ఓవర్లో 43 పరుగులు!) ఈ క్యాచ్ అందుకోవడానికి బుమ్రా వెళ్లగా పొలార్డ్ అతని దృష్టిని మరల్చేలా చేయిని కదిపాడు. అయినా క్యాచ్ అందుకున్న బుమ్రా పొలార్డ్ వైపు ఆగ్రహంగా చూశాడు. అతను మాత్రం నవ్వుతూ క్రీజును వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పొలార్డ్ ఏందీ తొండాట అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ఐపీఎల్లో బుమ్రా, పొలార్డ్ ఒకే జట్టు ( ముంబై ఇండియన్స్) ఆటగాళ్లేనన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యచేధనలో తడబడ్డ విండీస్ 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రం చేయగలిగింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది. (చదవండి: నా పేరు కైఫ్... కైఫ్... కైఫ్!) pic.twitter.com/kIEUHDq3ye — Mushfiqur Fan (@NaaginDance) November 6, 2018 -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
-
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
లక్నో : భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ వెనకబడింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. కార్లోస్ బ్రాత్వైట్ 15, ఒషానే థామస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. (ఆపసోపాలతో... ఐదు వికెట్లతో) -
భారత్తో రెండో టీ20.. విండీస్ లక్ష్యం 196
లక్నో : భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్మెన్ చెలరేగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 111 (8x4, 7x6, బంతులు 61) పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్కు బాటలు వేశాడు. రోహిత్, ధావన్లు తొలి వికెట్కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్డౌన్లో వచ్చిన రిషభ్పంత్ 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. లోకేష్రాహుల్ 26 పరుగులతో రోహిత్తో పాటు నాటౌట్గా నిలిచాడు. (చదవండి : కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్) (చదవండి : మ్యాచ్కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు) -
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
లక్నో: భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. భారత జట్టులో ఉమేష్ యాదవ్కు బదులుగా భువనేశ్వర్ కుమార్ ఆడుతుండగా, వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్ చేరాడు. జట్ల వివరాలు : వెస్టిండీస్: షై హోప్, దెనెష్ రామ్దిన్(కీపర్), షిమ్రన్ హెట్మేర్, కీరన్ పొలార్డ్, డర్రెన్ బ్రావో, నికోలస్ పూరన్, కరోల్స్ బ్రాత్వైట్(కెప్టెన్), ఫబైన్ అలెన్, కీమో పాల్, ఖార్రే పిర్రే, ఓషెన్ థామస్. భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్(కీపర్), కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్. -
కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచేందుకు స్వల్ప దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు సిద్ధమవుతున్నాడు. మరో 11 పరుగులు చేస్తే కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమిస్తాడు. ప్రస్తుతం 2,092 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ.. వెస్టిండీస్ జరుగునున్న రెండో టీ20లో కోహ్లిని దాటే అవకాశం ఉంది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగునుంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, కోహ్లి నాల్గో స్థానంలో ఉన్నాడు. -
మ్యాచ్కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు
లక్నో: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగనుంది. అయితే మ్యాచ్కు ముందు రోజు సోమవారం సాయంత్రమే మ్యాచ్ జరగాల్సిన స్టేడియం పేరును మార్చేశారు. లక్నోలో కొత్తగా నిర్మితమైన ఇకానా అంతర్జాతీయ స్టేడియం పేరును దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరుమీదుగా ‘భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ అంతర్జాతీయ స్టేడియం’గా మార్చేశారు. స్టేడియం పేరు మార్పుపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ విమర్శలు చేస్తోంది. యోగి ప్రభుత్వం సొంతంగా ప్రజలకు ఏమీ చేయడం లేదని ఎస్పీ అధికార ప్రతినిధి సునిల్ సింగ్ ఆరోపించారు. ప్రజల కోసం ఏం చేయకుండా ప్రదేశాలు, నగరాల పేర్లు మారుస్తూ ఉన్నారని విమర్శించారు. -
‘మా సీనియర్ క్రికెటర్లకు సిగ్గుండాలి’
ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్కు పలువురు వెస్టిండీస్ సీనియర్ క్రికెటర్లు గైర్హాజరీ కావడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు కార్ల్ హూపర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఒక పటిష్టమైన జట్టును ఢీకొట్టేందుకు వెళ్లేటప్పుడు సీనియర్ క్రికెటర్లు డుమ్మా కొట్టడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు. చాలామందికి విండీస్ తరపున ఆడాలనే ఉద్దేశం లేకపోవడంతోనే వారు ఏదొక వంకతో దూరమవుతున్నారంటూ విమర్శించాడు. ‘వెస్టిండీస్ తరపున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్ని ఓడించడం భారత్కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టు భారత్తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాలనే శ్రద్ధే లేదంటూ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు. భారత్తో సిరీస్కు గేల్ దూరం -
20 పరుగుల దూరంలో ధావన్
లక్నో: ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 980 పరుగులు చేసిన ధావన్.. మరో 20 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా విండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్.. ఈరోజు(మంగళవారం) జరుగనున్న రెండో టీ20ల్లో వెయ్యి పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మలు మాత్రమే ఉన్నారు. ఇక భారత తరపున వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ముందువరుసలో ఉన్నాడు. ఓవరాల్గా కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ఫాస్టెస్ రికార్డును రెండు రోజుల క్రితం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించిన సంగతి తెలిసిందే. కోహ్లి 27 ఇన్నింగ్స్ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధిస్తే, బాబర్ అజమ్ 26 ఇన్నింగ్స్ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. -
కెప్టెన్సీలోనూ రో‘హిట్టే’
కోల్కతా: ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక ఆటగాడిగా తనదైన ముద్రవేసిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. కెప్టెన్సీలోనూ తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఇటీవల ఆసియాకప్ సాధించిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్.. తాజాగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో అరుదైన ఘనతను సాధించాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతినిచ్చిన క్రమంలో విండీస్తో మూడు టీ20ల సిరీస్కు సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ ఈ ఫార్మాట్లో అత్యధిక విజయాల ఘనతను అందుకున్నాడు. కెప్టెన్గా తొలి పది టీ20 మ్యాచ్లకు సారథ్య వహించిన జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. విండీస్తో జరిగిన మ్యాచ్లో భారత విజయం సాధించిన తర్వాత రోహిత్ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకూ రోహిత్ పది అంతర్జాతీయ టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా అందులో తొమ్మింది విజయాలు నమోదు చేశాడు. ఫలితంగా మొదటి పది టీ20 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన లిస్ట్ ప్రకారం చూస్తే అత్యంత సక్సెస్ ఫుల్ రేసులో రోహిత్ ముందువరుసలో నిలిచాడు. ఈ క్రమంలోనే షోయబ్ మాలిక్, మైకేల్ క్లార్క్, అస్కార్ అప్ఘాన్, సర్పరాజ్ అహ్మద్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఈ నలుగురు తొలి పది అంతర్జాతీయ టీ20లకు గాను ఎనిమిదేసి మ్యాచ్ల్లో విజయం సాధించిన కెప్టెన్లు కాగా, వారిని రోహిత్ అధిగమించాడు. మరొకవైపు తొమ్మిది వన్డేలకు కెప్టెన్గా చేసిన రోహిత్ ఏడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మరో రికార్డుకు చేరువలో రోహిత్.. -
తొలి టి20లో భారత్ విజయం
-
ఎంఎస్ ధోని తర్వాత దినేశ్ కార్తీకే
కోల్కతా: టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ అరుదైన ఘనతను సాధించాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రెండో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ నిలిచాడు. వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేశ్ కార్తీక్ మూడు క్యాచ్లను అందుకున్నాడు. ఫలితంగా టీ20ల్లో ఎంఎస్ ధోని తర్వాత అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా దినేశ్ గుర్తింపు సాధించాడు. రామ్దిన్, హెట్మైర్, రోవ్మాన్ పావెల్ క్యాచ్లను దినేశ్ కార్తీక్ పట్టాడు. దాంతో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కార(142) రికార్డును దినేశ్ కార్తీక్ బ్రేక్ చేశాడు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ 143 క్యాచ్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఎంఎస్ ధోని 151 క్యాచ్లలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కమ్రాన్ అక్మల్(123), దినేశ్ రామ్దిన్(120)వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.విండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దినేశ్ కార్తీక్(31 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), కృనాల్ పాండ్యా(21 నాటౌట్;9 బంతుల్లో 3 ఫోర్లు)లు విజయంలో ముఖ్యభూమిక పోషించారు. -
టీ20 చరిత్రలో విండీస్ ఆరోసారి
కోల్కతా: ధనాధన్ క్రికెట్కు మరో పేరు టీ20 ఫార్మాట్. ఈ ఫార్మాట్లో క్రికెటర్లు పరుగుల దాహంతో చెలరేగితే అది అభిమానుల్లో మంచి మజాను నింపుతోంది. మరి అటువంటి టీ20 మ్యాచ్ కాస్తా ఏదో పేలవంగా సాగితే మాత్రం ఫ్యాన్స్లో తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. ప్రధానంగా సిక్సర్లు కొట్టడంలో ఆటగాళ్లు సక్సెస్ కాలేకపోతే అది మరింత నిరుత్సాహపరుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ తరహాలోనే సాగింది కోల్కతాలోని ఈడెన్లో భారత్-వెస్టిండీస్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్. ఇరు జట్లు కలిసి కేవలం రెండు సిక్సర్లే కొట్టడంతో మ్యాచ్లో ఎటువంటి జోష్ను తీసుకురాలేదు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కేవల సిక్స్ మాత్రమే కొట్టింది. 20 ఓవర్లపాటు ఆడిన విండీస్ 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఇందులో 13 ఫోర్లు నమోదైతే, ఒకే ఒక్క సిక్స్ రావడం గమనార్హం. ఈ సిక్సర్ను పొలార్డ్ కొట్టాడు. ఇలా విండీస్ సిక్స్ మాత్రమే సాధించడం ఆ జట్టు టీ 20 చరిత్రలో ఆరోసారి మాత్రమే. అంతకుముందు న్యూజిలాండ్(2006), శ్రీలంక(2009(, జింబాబ్వే(2010), శ్రీలంక(2010), పాకిస్తాన్(2016)లతో జరిగిన టీ20 మ్యాచ్ల్లో విండీస్ ఒక్కో సిక్స్ మాత్రమే సాధించింది. కాగా, విండీస్తో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఇన్నింగ్స్లో కూడా సిక్స్ మాత్రమే కొట్టింది. -
వెస్టిండీస్ మరో చెత్త రికార్డు
కోల్కతా: ఇటీవల భారత్తో జరిగిన చివరివన్డేలో 104 పరుగులకే కుప్పకూలి చెత్త రికార్డును నమోదు చేసిన వెస్టిండీస్ మరో అపప్రథన మూటగట్టుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్లో విండీస్ ఎనిమిది వికెట్ల నష్టానికి 109 పరుగులే చేసింది. ఫలితంగా టీ20ల్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసి చెత్త రికార్డును సొంతం చేసుకుంది. 2014లో భారత్పై 129 పరుగులు చేసిన విండీస్.. తాజాగా దాన్ని సవరించింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్లో శుభారంభం చేసింది. అంతకముందు భారత్తో జరిగిన ఐదో వన్డేల సిరీస్లో భాగంగా ఆఖరి వన్డేలో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాడటంలో విఫలం కావడంతో విండీస్ 104 పరుగులకే ఆలౌటైంది. తద్వారా వన్డే ఫార్మాట్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్పై వన్డేల్లో విండీస్కు అత్యల్ప స్కోరుగా నమోదైంది. ఆ వన్డే జరిగిన నాలుగు రోజుల వ్యవధిలోనే విండీస్ మరోసారి తడ‘బ్యాటు’కు గురై చెత్త రికార్డును మూటగట్టుకోవడం గమనార్హం. ఇక్కడ చదవండి: ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్ డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు! ఆపసోపాలతో... ఐదు వికెట్లతో... -
ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టాడు: రోహిత్
కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్యాన్ని భారత్ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లతో పాటు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మనీష్ పాండేలు ఆశించిన మేర రాణించనప్పటికీ దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యాలు ఆదుకోవడంతో భారత్ చివరకు గట్టెక్కింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కృనాల్ పాండ్యా 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, భారత్ బౌలింగ్ చేసేటప్పుడు మాత్రం కృనాల్ అడిగి మరీ బౌలింగ్ తీసుకున్న విషయాన్ని మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘ విండీస్ కీలక ఆటగాడు పొలార్డ్ క్రీజ్లో ఉన్న సమయంలో నేను బౌలింగ్ చేస్తానని కృనాల్ అడిగాడు. ఆ వికెట్ కోసం కృనాల్ పట్టుబట్టీ మరీ బౌలింగ్ చేశాడు. అలా అడిగా బౌలింగ్ చేయడమే కాదు.. పొలార్డ్ వికెట్ను కూడా కృనాల్ ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడే పొలార్డ్ను కృనాల్ దగ్గర్నుంచి గమనించడం కూడా బౌలింగ్ చేస్తానని అడగటానికి ఒక కారణం. ఒక జట్టు ఏమైతే ఆశిస్తుందో అదే కృనాల్ చేసి చూపెట్టాడు. ఇలా ప్రతీ క్రికెటర్ తమ తమ చాలెంజ్లను సమర్ధవంతంగా నిర్వర్తించేటప్పుడు కెప్టెన్కు కావాల్సింది ఏముంటుంది’ అని రోహిత్ తెలిపాడు. -
‘కోహ్లి కొట్టే ఆ షాట్లకు పెద్ద అభిమానిని’
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. ప్రధానంగా కోహ్లి కొట్టే కవర్ డ్రైవ్స్కు తాను పెద్ద అభిమానినని సచిన్ తెలిపాడు. తాను పోలికల్ని అస్సలు ఇష్టపడనని తెలిపిన సచిన్.. ఇప్పటివరకూ కోహ్లి సాధించిన ఘనతలు అసాధారణమన్నాడు. ‘ ఒక్కో క్రికెటర్ ఏదొక షాట్తో ప్రత్యేకతను తెచ్చుకుంటాడు. ఇక్కడ విరాట్ కోహ్లి వరకూ వస్తే అతను కొట్టే కవర్ డ్రైవ్స్ చాలా అందంగా ఉంటాయి. ఆ షాట్లకు నేను పెద్ద అభిమానిని. కోహ్లిని ఎవరితోనూ పోల్చలేం’ అని సచిన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన భారత్కు చాలా ముఖ్యమైనదిగా సచిన్ అభిప్రాయపడ్డాడు. ప్రధానంగా ఆసీస్ టూర్ కోహ్లికి పెద్ద సవాల్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. ఆసీస్ ఎప్పటికీ కఠినమైన ప్రత్యర్థిగా పేర్కొన్న సచిన్.. వారి బ్యాటింగ్ లోతును అంచనా వేయడం కష్టమన్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్తో భారత్కు గట్టి పోటీ ఉంటుందన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా విజయవంతమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. ప్రస్తుత భారత జట్టు సమతూకంగా ఉన్న విషయాన్ని సచిన్ మరోసారి ప్రస్తావించాడు. -
కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్!
దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ అధిగమించాడు. ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన చివరి టీ20లో బాబర్ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్.. అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న క్రికెటర్గా గుర్తింపు పొందాడు. (చదవండి: సిరీస్ అందించాడు.. ర్యాంకు కొట్టేశాడు) భారత సారథి కోహ్లి 27 ఇన్నింగ్స్లో ఈ ఘనతను అందుకుంటే.. బాబర్ 26 ఇన్నింగ్స్ల్లోనే సాధించి అతని రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో పాక్ 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. విండీస్తో వన్డే సిరీస్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి రికార్డు సృష్టించిన కోహ్లి.. తాజా టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లి తిరిగి బరిలోకి దిగనున్నాడు. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) -
డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు!
కోల్కతా : వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆపసోపాలతో గట్టెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. విండీస్ వరుసగా వికెట్లను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన నాలుగో ఓవర్లో హెట్మైర్తో సమన్వయ లోపం కారణంగా షై హోప్ రనౌటయ్యాడు. హోప్ ఆడిన షాట్ను ఫార్వార్డ్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ అందుకున్నాడు. (చదవండి: ఆపసోపాలతో... ఐదు వికెట్లతో...) కానీ అతను విసిరిన త్రో కీపర్ పైనుంచి వెళ్లిపోయినా పక్కనే ఉన్న మనీశ్ పాండే దానిని చక్కగా అందుకున్నాడు. దీంతో అయోమయానికి గురైన బ్యాట్స్మెన్ ఒకేవైపుకు పరుగెత్తారు. అనంతరం పాండే సునాయాసంగా రనౌట్ చేయడంతో హోప్ పెవిలియన్ బాట పట్టాడు. ఈ ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. ఇక నెటిజన్లైతే దీనికి సంబంధించిన ఫొటోలపై వింత క్యాఫ్షన్స్ ఇస్తూ విండీస్ ఆటగాళ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ‘ఈ రేస్ హెట్మైర్ గెలిచాడోచ్.!, డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. (చదవండి: పోలా..! అదిరిపోలా.. ఈ క్యాచ్!) వీడియో కోసం క్లిక్ ఇక్కడ చేయండి Cricket pitch or a race track? #INDvWI pic.twitter.com/riepUJQEBm — Prasenjit Dey (@CricPrasen) 4 November 2018 HETMEYR WINS THE RACE....#INDvWI #Cricket pic.twitter.com/eC8VW8x7rK — 🅗 🅐 🅡 🅘 🅣 (@imharit) 4 November 2018 Dude it's cricket!! 100 metres sprint can follow. #INDvWI pic.twitter.com/iZmuplxKz5 — Ankur Nigam (@ankurnigam) 4 November 2018 ఇక ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అలెన్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ (3/13), కృనాల్ పాండ్యా (1/15) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం భారత్ 17.5 ఓవర్లలో 5 వికెట్లకు 110 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ముందుండి జట్టును విజయం దిశగా నడిపించాడు. మూడు టీ20ల సిరీస్లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపు లక్నోలో రెండో మ్యాచ్ జరుగునుంది. -
అంబటి రాయుడు సంచలన నిర్ణయం
హైదరాబాద్: వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాణించి తనదైన ముద్ర వేసిన టీమిండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కేవలం వైట్బాల్ గేమ్పై మాత్రమే దృష్టి పెట్టదల్చుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ కెరీర్కు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు లేఖ రాశాడు. ‘ నేను హైదరాబాద్కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడతాను’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. అంబటి రాయుడు ఆకస్మిక నిర్ణయంతో టెస్టు ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పినట్లయ్యింది. గురువారం నుంచి రంజీ ట్రోఫీ ఆరంభమైన తరుణంలో అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కల్గించింది. 2013-14 సీజన్లో భాంగా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లతో టెస్టు సిరీస్లకు రాయుడు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత టెస్టుల్లో చోటు సంపాదించలేకపోయాడు. దాంతో తన కెరీర్లో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా రాయుడు ఆడలేదు. కాగా, వన్డేల్లో కూడా నిలకడలేమితో జట్టులోకి వస్తూ పోతూ ఉన్న రాయుడు.. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో రాయుడు నాల్గో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఆకట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి కోహ్లి నుంచి కూడా భరోసా దొరికింది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్పైనే ఫోకస్ చేయదలుచుకున్న రాయుడు.. ఫస్ట్క్లాస్ క్రికెట్కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. -
అయోమయంలో విండీస్!
కోల్కతా: టీమిండియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం జరుగునున్న తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆడటం అనుమానంగా మారింది. గాయం కారణంగా వన్డేలకు ఎంపిక కాని రస్సెల్.. ఇప్పుడు మొదటి టీ20 మ్యాచ్లో ఆడటంపై సందిగ్ధత నెలకొంది. టీ 20ల కోసం ఆలస్యంగా భారత్కు వచ్చిన రస్సెల్ ప్రాక్టీస్ సెషన్కు హాజరుకాలేదు. దాంతో ఆరంభపు టీ20 మ్యాచ్కు దూరం కానున్నట్లు సమాచారం. టీ20ల కోసం రెండు రోజుల క్రితం కెప్టెన్ బ్రాత్వైట్తో సహా ఏడుగురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్కి వచ్చారు. అయితే వారితో కలిసి విమానంలో రాని రస్సెల్ దుబాయ్ మీదుగా.. ఈరోజు భారత్కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈడెన్ గార్డెన్స్లో జరిగిన వెస్టిండీస్ ప్రాక్టీస్ సెషన్లో అతను పాల్గొనలేకపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరపున మ్యాచ్లు ఆడిన రస్సెల్కు ఈడెన్ గార్డెన్స్ మైదానం కొట్టినపిండి. దాంతో తొలి టీ20లో అతను జట్టుకి అదనపు బలం అవుతాడని విండీస్ ఆశించింది. కానీ తాజాగా రస్సెల్ తీరుతో ఆ జట్టు ఇప్పుడు అయోమయంలో పడింది. గాయం నుంచి కోలుకున్న అతడ్ని కనీస ప్రాక్టీస్ లేకుండా ఆడించాలా? వద్దా? అని జట్టు మేనేజ్మెంట్ సమాలోచన చేస్తోంది. -
మరో రికార్డుకు చేరువలో రోహిత్..
కోల్కతా: వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో రెండు భారీ శతకాలు బాదిన రోహిత్ శర్మ.. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే హిట్మ్యాన్ రోహిత్ను మరో రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లోనూ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు రోహిత్. భారత్ జట్టు ఆదివారం నుంచి వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో తలపడనుండగా.. ఈ సిరీస్లో రోహిత్ శర్మ మరో 186 పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్మన్గా రికార్డుల్లో నిలవనున్నాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లను పరిశీలిస్తే.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) 2,171 పరుగులు, బ్రెండన్ మెక్కలమ్ (న్యూజిలాండ్) 2,140 పరుగులు, విరాట్ కోహ్లి (భారత్) 2,102 పరుగులతో టాప్-4లో కొనసాగుతున్నారు. ఇక ఐదో స్థానంలో 2,086 పరుగులతో కొనసాగుతున్న రోహిత్ శర్మ.. మూడు టీ20ల్లో కలిపి 186 పరుగులు చేయగలిగితే అగ్రస్థానంలో నిలుస్తాడు. టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లి నుంచి రోహిత్ శర్మకు పోటీ లేకుండా పోయింది. మరో 16 పరుగులు చేస్తే కోహ్లి టీ20 పరుగుల రికార్డుని రోహిత్ సమం చేస్తాడు.రేపు(ఆదివారం) భారత్-విండీస్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ మైదానంలో తొలి టీ20 జరుగనుంది. ఇక్కడ చదవండి: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.. -
‘ధోని లేకపోవడం రిషబ్కు మంచి అవకాశం’
కోల్కతా: వెస్టిండీస్తో ఆదివారం నుంచి ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్కు ఎంఎస్ ధోనికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ధోని స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు రిషబ్కు ఇదే చక్కటి అవకాశం అంటున్నాడు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ. ‘కొన్నేళ్లుగా భారత జట్టులో ధోని ఒక కీలక ఆటగాడు. అయితే విండీస్తో జరగబోయే టీ20 సిరీస్కు అతని అనుభవాన్ని మిస్సవుతున్నాం. అదే సమయంలో ఈ సిరీస్ కచ్చితంగా రిషబ్ పంత్కు మంచి అవకాశమనే చెప్పాలి. పంత్తో పాటు దినేశ్ కార్తీక్కు ఇది చాలా కీలకం. వచ్చే వరల్డ్కప్కు ఏదో పరిమితమైన మౌలిక వనరులతో సిద్ధం కాదల్చుకోలేదు. మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. వాటిని తగిన విధంగా వినియోగించుకోవడంపైనే ప్రస్తుత దృష్టి సారించాం. మా రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించడమే మా లక్ష్యం. ఆ క్రమంలోనే ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. మా జట్టులో చాలా కొత్త ముఖాలు న్నాయి. కేవలం 15 మందితో కూడిన జట్టే కాదు.. మరో 15 మందితో కూడిన బలాన్ని అట్టి పెట్టుకోవడమే మా ముందున్న కర్తవ్యం. ఎవర్ని అదృష్టం వరిస్తుందో వేచి చూడాలి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
‘వారు ధోనితో సరితూగలేరు’
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫామ్ గురించి అభిమానులు ఆందోళన చెందవద్దని, ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ లయ అందుకుంటాడని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. గత ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్తో ముగిసిన ఐదు వన్డేల సిరీస్లోనూ ధోని బ్యాట్తో పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా, ఆదివారం నుంచి వెస్టిండిస్తో ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరిస్ల నుంచి ధోనిని సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. ‘అవును.. ఇప్పుడు టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్ ఉన్నారు. వాళ్లు గత కొద్దిరోజులుగా బాగానే ఆడుతున్నారు. కానీ.. వారు ఎప్పటికీ ధోనితో సరితూగలేరు. ఇంకా చెప్పాలంటే కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేరు. మ్యాచ్లో ధోని వికెట్ కీపింగే బాధ్యతలే కాదు. చాహల్, కుల్దీప్, బుమ్రా లాంటి బౌలర్లకి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లికి వెలకట్టలేని సాయం చేస్తున్నాడు’ అని ఆశిష్ నెహ్రా అన్నాడు. -
ధోని వేటుపై సచిన్ ఏమన్నాడంటే..
ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై సెలక్షన్ కమిటీ ఛీఫ్ ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు ధోని టీ20 కెరీర్ ముగియలేదని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ అంశంపై స్పందించాడు. టీమ్మేనేజ్ మెంట్ మైండ్సెట్ ఎంటో అర్థం కావడం లేదన్నాడు. ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదు. డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలి.’ అని స్పష్టం చేశాడు. దేశానికి ధోని చేసిన సేవలను సచిన్ ఈ సందర్భంగా కొనియాడాడు. ‘ఏం జరగబోతుంది.. ఏ చేయాలనే’ విషయం ఈ మాజీ కెప్టెన్ తెలుసని అభిప్రాయపడ్డాడు. (చదవండి: ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!) ‘నేనెప్పుడు ఏ విషయంలోను ఎలాంటి తీర్పులివ్వలేదు. ప్రస్తుత సెలక్టర్ల నిర్ణయంపై కూడా తీర్పునివ్వను. అన్ని ఫార్మాట్లో ధోని అద్భుతంగా రాణించాడు. చాలా ఏళ్లుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తు వచ్చాడు. చాలా ఏళ్లుగా ఆడుతున్న ఆటగాళ్లకు ఏం జరగబోతుంది, ఏం చేయాలనే విషయం తెలుసుంటుంది. ఈ పరిస్థితుల్లో నేనైతే.. ఏం చేయాలో మొదలు తెలుసుకుంటాను. డ్రెస్సింగ్ రూంలో సహచర ఆటగాళ్లతో చర్చిస్తాను. కోచ్, కెప్టెన్ ఏం ఆశిసస్తున్నారో తెలుసుకుంటాను. ప్రస్తుతానికి ధోని చాలా రోజులు క్రికెట్ ఆడుతాడని నమ్ముతున్నాను.’ అని సచిన్ పేర్కొన్నాడు. ఇక ధోనిని వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ల నుంచి పక్కన పెట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్లు మాత్రం ధోనికి విశ్రాంతి ఇచ్చామని, ప్రత్యామ్నయ వికెట్ కీపర్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. అభిమానులు మాత్రం ధోనిని తొలిగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ధోని భాయ్ అది పక్కా ఔట్! ) వారెవ్వా.. టీ20ల్లోనూ డబుల్ సెంచరీ! చదవండి: టి20ల్లో ‘విన్’డీసే -
‘మూడు వన్డేల తర్వాత పెట్రోల్ అయిపోయింది’
తిరువనంతపురం: భారత్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా పేర్కొన్నాడు. అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన తమ జట్టు.. బలమైన భారత్కు వారి దేశంలోనే గట్టిపోటీ ఇచ్చిందన్నాడు. ఈ విషయం తొలి మూడు వన్డేలను చూస్తే అర్ధమవుతుందన్నాడు. కాగా, తొలి మూడు వన్డేల తర్వాత చివరి రెండు వన్డేల్లో విండీస్ ఘోరంగా వైఫల్యం చెందడంపై స్టువర్ట్లా చమత్కరించాడు. మూడు వన్డేలకే తమ ఆటగాళ్లలో పెట్రోల్ అయిపోయిందని సెటైర్ వేశాడు. ‘మా కుర్రాళ్లు తెలివైన వారు. నైపుణ్యం ఉంది. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అనుభవం వారికి రావాలి. నలభైవేల మంది అభిమానులు స్టేడియాన్ని హోరెత్తిస్తుంటే అత్యుత్తమ జట్టుతో తలపడడం అంత సులువు కాదు. ఆ పరిస్థితులను అనుభవిస్తే అలవాటవుతుంది. గెలవాలంటే నైపుణ్యం మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మూడు వన్డేల తర్వాత మా జట్టు వైఫల్యం చెందడానికి కారణం ఆటగాళ్లలో తగినంత అనుభవం లేకపోవడమే’ అని స్టువర్ట్ లా పేర్కొన్నాడు. ఈ సిరీస్ను భారత్ 3-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఇక్కడ చదవండి: ముగింపు అదిరింది ధోని భాయ్ అది పక్కా ఔట్! -
గంగూలీ, యువరాజ్ సరసన విరాట్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే పలు అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనత సాధించాడు. అద్భుతమైన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్న విరాట్.. వెస్టిండీస్తో జరిగిన అయిదు వన్డేల సిరీస్లో మూడు సెంచరీలు సాధించి (453 రన్స్) ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్లో 7 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సొంతం చేసుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. గతంలో ఈ ఘనత సాధించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, వివ్ రిచర్డ్ష్, రికీ పాంటింగ్, హషీం ఆమ్లా సరసన చేరాడు. (చదవండి : ముగింపు అదిరింది) కాగా, ఈ కేటగిరిలో 15 ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు సాధించి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో నిలవగా.. 11 అవార్డులతో సనత్ జయసూర్య, 9 అవార్డులతో షాన్ పొల్లాక్ తరువాతి స్థానాల్లో ఉన్నారు. తాజా వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి మొదటి మ్యాచ్లో 140, రెండో మ్యాచ్లో 157, మూడో మ్యాచ్లో 107 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం కేరళలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన చివరిదైన 5 వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్ను 3–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జేసన్ హోల్డర్ (33 బంతుల్లో 25; 2 ఫోర్లు), మార్లోన్ శామ్యూల్స్ (38 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడగా, జట్టులో ఎనిమిది మంది కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రవీంద్ర జడేజా (4/34) ముందుండి నడిపించగా, మిగతా నలుగురు బౌలర్లూ కనీసం ఒక మెయిడిన్ ఓవర్తో పాటు కనీసం ఒక వికెట్ తీయడం గమనార్హం. అనంతరం భారత్ 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. -
ధోని భాయ్ అది పక్కా ఔట్!
తిరువనంతపురం : వెస్టిండీస్తో జరిగిన చివరి వన్డేలో భారత్ దుమ్మురేపి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్లో జడేజా వేసిన 16వ ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్మన్ హెట్మైర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. జడేజా అప్పీల్ చేయగా.. తొలుత అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ఈ ఔట్పై నమ్మకంగా ఉన్న జడేజా రివ్యూ (డీఆర్ఎస్) కోసం ధోని, కోహ్లిలను.. ‘భాయ్ పక్కా ఔట్ భాయ్’ అంటూ పట్టుబట్టడంతో రివ్యూ కోరారు. (చదవండి: ముగింపు అదిరింది) రివ్యూలో హెట్మైర్ ఔట్ అని తేలడంతో జడేజా ‘చెప్పానా భాయ్’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే రివ్యూ కోరడంపై ధోని సుముఖంగా లేకపోవడంతో కోహ్లి తీసుకునే ధైర్యం చేయలేదు. కానీ జడేజా పట్టుబట్టడంతో తప్పక రివ్యూకెళ్లాడు. ఎందుకంటే ధోని డీఆర్ఎస్ నిపుణుడని అందరికీ తెలిసిందే. అతను రివ్యూ కోరితే అది పక్కా ఫలితాన్నిస్తోంది. చాలా మ్యాచ్ల్లో ఇది రుజువైంది. ఇక ఈ సిరీస్లో చెలరేగిన హెట్మైర్ వికెట్ను విండీస్ కోల్పోవడంతో ఆ జట్టు 104 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ను వైస్ కెప్టెన్ ( 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి ( 33 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు 14.5 ఓవర్లలో విజయాన్నందించారు. ప్రతీ మ్యాచ్లో గట్టి పోటినిచ్చిన విండీస్ చివరి మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. దీంతో భారత్ 3-1 సిరీస్ను సొంతం చేసుకుంది. వైజాగ్ వేదికగా జరిగిన రెండో వన్డే టై అయిన విషయం తెలిసిందే. (చదవండి: ఉలిక్కిపడిన రోహిత్) Dhoni was not sure but Sir Jadeja says it's out. Jaddu supersedes Dhoni and it's hitting the stumps. A reluctant review pays off. pic.twitter.com/IXdINbkqQ7 — This is HUGE! (@ghanta_10) November 1, 2018 -
టీమిండియా సెలబ్రేషన్స్.. ఉలిక్కిపడిన రోహిత్
తిరువనంతపురం: వెస్టిండీస్పై వన్డే సీరిస్ నెగ్గిన అనంతరం భారత జట్టు సంబరాలు చేసుకుంది. స్టేడియం నుంచి హోటల్ చేరుకున్న టీమిండియా అక్కడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొంది. ఈ పార్టీలో జట్టు సభ్యలంతా ఉల్లాసంగా గడిపారు. ఈ వేడుకల్లో భాగంగా రోహిత్ శర్మ కేక్ కట్ చేస్తుండగా.. ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో రోహిత్ వెనకాల నిల్చున్న మిస్టర్ కూల్ ధోని, రవీంద్ర జడేజాలు అతని చెవి దగ్గర్లో బెలూన్లను పగులకొట్టారు. దీంతో రోహిత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.. అప్పుడు రోహిత్ రియాక్షన్ చూసి అక్కడున్న ధోనితో పాటు ఇతర ఆటగాళ్ల ముఖాల్లో నవ్వులు విరిసాయి. ఆ తర్వాత టీమిండియా మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Back at the team hotel after an early wrap and it is time to celebrate.🏆 #TeamIndia #INDvWI pic.twitter.com/qW7mtAoXgq — BCCI (@BCCI) 1 November 2018 -
వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా
-
విండీస్ను కొట్టేసి.. సిరీస్ పట్టేశారు
తిరువనంతపురం: వెస్టిండీస్తో జరిగిన ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. గురువారం ఇక్కడ గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 3-1తో చేజిక్కించుకుంది. చివరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్ శర్మ( 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి ( 33 నాటౌట్; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు మరోసారి ఆకట్టుకున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్(6) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లిల జోడి మరో వికెట్ పడకుండా ఆడి భారత్కు విజయాన్ని అందించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. భారత బౌలర్ల దెబ్బకు 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. మార్లోన్ శామ్యూల్స్(24), జాసన్ హోల్డర్(25), రోవ్మాన్ పావెల్(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. ఆపై రోవ్మాన్ పావెల్-శామ్యూల్స్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్ మూడో వికెట్గా ఔట్ కావడంతో విండీస్ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్మెయిర్ నిష్క్రమించిన తర్వాత రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, హోల్డర్లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో విండీస్ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది. -
విండీస్ చెత్త రికార్డు
తిరువనంతపురం: టీమిండియాతో తొలి మూడు వన్డేల్లో బ్యాటింగ్ విభాగంలో విశేషంగా రాణించిన వెస్టిండీస్.. చివరి రెండు వన్డేల్లో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ క్రమంలోనే చివరిదైన ఐదో వన్డేలో విండీస్ చెత్త రికార్డును మూటగట్టకుంది. గురువారం ఇక్కడ గ్రీన్ఫీల్డ్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో విండీస్ 104 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా వన్డే ఫార్మాట్లో భారత్పై అత్యల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను విండీస్ సొంతం చేసుకుంది. ఇది భారత్పై వన్డేల్లో విండీస్కు అత్యల్ప స్కోరు. 1997లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో భారత్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. ఇది ఇప్పటివరకూ భారత్పై విండీస్కు అత్యల్ప స్కోరు కాగా, దాన్ని తాజాగా సవరించింది. ఈ మ్యాచ్లో విజృంభించిన టీమిండియా బౌలర్లు.. విండీస్ను పేకమేడలా కూల్చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. ఇదిలా ఉంచితే, తొలి మూడు వన్డేల్లో 926 పరుగులు చేసిన విండీస్. చివరి రెండు వన్డేల్లో కలిపి 257 పరుగుల్ని మాత్రమే సాధించి 20 వికెట్లను కోల్పోవడం గమనార్హం. -
విండీస్ను కూల్చేశారు..
తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి వన్డేలో వెస్టిండీస్ తడబాటుకు గురైంది. భారత బౌలర్ల దెబ్బకు విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లు మరోసారి చెలరేగి విండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. మార్లోన్ శామ్యూల్స్(24), జాసన్ హోల్డర్(25), రోవ్మాన్ పావెల్(16)లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటగా, బూమ్రా, ఖలీల్ అహ్మద్లు తలో రెండు వికెట్లతో మెరిశారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్లకు చెరో వికెట్ లభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు ఎంచుకున్న వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. ఆపై రోవ్మాన్ పావెల్-శామ్యూల్స్ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. అయితే శామ్యూల్స్ మూడో వికెట్గా ఔట్ కావడంతో విండీస్ మరోసారి కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 53 పరుగుల వద్ద హెట్మెయిర్ నిష్క్రమించిన తర్వాత రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, హోల్డర్లు స్వల్ప విరామాల్లో పెవిలియన్ చేరడంతో విండీస్ వంద పరుగుల్ని అతికష్టం మీద చేరింది. -
ఆదిలోనే విండీస్కు షాక్
తిరువనంతపురు: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఓవర్లోనే పావెల్ వికెట్ చేజార్చుకుంది. భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్లో హోప్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండు పరుగులకే రెండు ప్రధాన వికెట్లను విండీస్ కోల్పోయింది. అదే జట్టుతో టీమిండియా.. -
అదే జట్టుతో టీమిండియా..
తిరువనంతపురం: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపింది. గత వన్డేలో భారీ విజయం సాధించి ఊపు మీద ఉన్న టీమిండియా సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుండగా, వెస్టిండీస్ సిరీస్ను సమం చేయాలనే యోచనలో ఉంది. ఈ మ్యాచ్లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమవ్వగా, విండీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. గాయం కారణంగా మొత్తం పర్యటనకే దూరమైన ఆశ్లే నర్స్ స్థానంలో దేవెంద్ర బిషూ తుది జట్టులోకి రాగా, హెమ్రాజ్ స్థానంలో ఒషేన్ థామస్ను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్ను పటిష్ట పర్చుకుని, బౌలింగ్లో వైవిధ్యంతో ముంబై వన్డేలో దిగిన టీమిండియా ఘన విజయం సాధించింది. కాగా, ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం, మాజీ కెప్టెన్ ధోని తనదైన ఇన్నింగ్స్ ఆడలేకపోవడం జట్టును కలవర పరుస్తోంది. రెండు శతకాలతో రోహిత్శర్మ, మూడు సెంచరీలతో కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్లో ఉండగా, అర్ధ శతకం, శతకంతో నాలుగో స్థానానికి నిఖార్సైన బ్యాట్స్మన్నని అంబటి తిరుపతి రాయుడు చాటుకున్నాడు. కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఆర్డర్ లోతును పెంచారు. ప్రారంభంలో పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలను ఎదుర్కొనడం ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేయడం భారత్కు కలిసొచ్చే అంశం. ఈ సిరీస్లో అంచనాలు మించి రాణించిన విండిస్ను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తగా ఆడితేనే విరాట్ సేన సిరీస్ను కైవసం చేసుకుంటుంది. తుది జట్లు భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ , అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, బూమ్రా వెస్టిండీస్: జాసన్ హోల్డర్(కెప్టెన్), కీరన్ పావెల్, సాయ్ హోప్, మార్లోన్ శామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, ఫాబియన్ అలెన్, బిషూ, కీమో పాల్, రోచ్, థామస్ -
‘ఖలీల్ అహ్మద్ ఒక భరోసా’
తిరువనంతపురం: టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్పై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో భారత్కు ఒక భరోసా నింపుతాడనే నమ్మకం తమకుందని కొనియాడాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో మూడు వికెట్లు సాధించడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసిన ఖలీల్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం కూడా అతనికి కలిసొస్తుందన్నాడు. 'ఖలీల్ భవిష్యత్లో మంచి ప్లేయర్గా మారతాడు. అతను చాలా చురుకు, నైపుణ్యం బాగున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. భారత్ పేస్ బౌలింగ్ విభాగానికి ఖలీల్ ఒక భరోసా అవుతాడనే నమ్మకం ఉంది’ అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. -
35 అడుగుల ధోని కటౌట్..
తిరువనంతపురం: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. అయితే ధోనిపై ఉన్న అభిమానాన్ని కేరళ ఫ్యాన్స్ వినూత్నంగా చాటుకున్నారు. భారీ ఎత్తుగల కటౌట్ను రూపొందించారు. ‘ఆల్ కేరళ ధోని ఫ్యాన్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో వన్డే మ్యాచ్ జరగనున్న గ్రీన్ఫీల్డ్ స్టేడియం బయట 35 అడుగుల ఎత్తైన ధోని కటౌట్ను ఏర్పాటు చేశారు. కటౌట్ ఏర్పాటుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ‘తలైవా విశ్వరూపం రెడీ అవుతోంది’ అని ట్వీట్ చేసింది. ఈరోజు విండీస్-భారత్ జట్ల మధ్య ఆఖరిదైన ఐదో వన్డే తిరువనంతపురంలో జరుగనుంది. దీనిలో భాగంగానే ధోని కటౌట్ను స్టేడియం బయటం ఏర్పాటు చేశారు అభిమానులు. #Thala's Vishwaroopam getting ready at Trivandrum! #WhistlePodu #INDvWI 🦁💛 #Yellove from @AKDFAOfficial! pic.twitter.com/AL8hxZ6DWz — Chennai Super Kings (@ChennaiIPL) 31 October 2018 ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా! -
ధోని చితక్కొడితే ఎట్టా ఉంటాదో తెలుసా!
సాక్షి, హైదరాబాద్ : మహేంద్ర సింగ్ ధోని.. భారత్కు ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథి. ప్రస్తుతం నిలకడలేమి ఆటతో విమర్శకుల నోట అతని పేరు ఎక్కవగా వినిపిస్తోంది. కానీ.. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజు (అక్టోబర్ 31 2005) విధ్వంసం సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేసి విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి రుచిచూపించాడు. అంతకు ముందే వైజాగ్ వేదికగా పాకిస్తాన్పై 148 పరుగులు చేసి వెలుగులోకి వచ్చిన ధోని శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తన పవరేంటో చాటి చెప్పాడు. 7 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ధోని చెలరేగాడు. (ధోని ‘మెరుపు’ చూశారా?) ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. నాటి ఓపెనర్ సచిన్ వికెట్ను త్వరగా కోల్పోయింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ధోని.. సెహ్వాగ్తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సెహ్వాగ్తో 92, ద్రవిడ్తో 86, యువరాజ్తో 65 పరుగుల భాగస్వామ్యాలు జోడించి ఈ మ్యాచ్లో ఒంటి చేత్తో భారత్కు విజయాన్నందించాడు. ఈ విధ్వంసానికి భారత్.. నాటి మ్యాచ్లో 23 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటి వరకు ధోనికి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ భారీ ఇన్నింగ్స్ ను గుర్తు చేస్తూ బీసీసీఐ ట్వీట్ చేసింది. చదవండి: ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ Throwback - On this day in 2005, @msdhoni notched his highest ODI score. KaBOOM all the way 💪🏻💥💥😎 pic.twitter.com/UM3B3aTRJy — BCCI (@BCCI) 31 October 2018 -
‘రోహిత్ కాదు.. భారత్ అనాలి’
ముంబై : టీమిండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వెస్టిండీస్తో మంబై వేదికగా నాలుగోవన్డేలో జరిగిన ఓ ఘటనతో.. అతని అభిమానుల గర్వపడుతున్నారు. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ అద్భుత శతకంతో హిట్మ్యాన్ పవరేంటో మరోసారి చూపించాడు. ఈ దెబ్బకు భారత్ భారీ స్కోర్ చేయడం.. విండీస్ జట్టంతా కలిసి రోహిత్ అన్ని పరుగులు కూడా చేయకపోవడం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో విస్టిండీస్ ఇన్నింగ్స్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. (చదవండి : రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా) రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్లో ఉన్న అభిమానులు రోహిత్..రోహిత్..రోహిత్ అని అరవసాగారు. ఇది విన్న హిట్ మ్యాచ్ తన టీషర్టుపై ఉన్న ఇండియా అక్షరాలను చూపిస్తూ.. భారత్ అని అరవాలని సైగ చేశాడు. అతని సూచన మేరకు అభిమానులు భారత్ భారత్.. అని అరిచారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతని అభిమానులు.. ‘రోహిత్ అభిమానులమైనందుకు గర్వపడుతున్నాం’అని క్యాప్షన్గా పేర్కొంటున్నారు. (వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్) FEEL PROUD TO BE FAN OF RO-HITMAN SHARMA. RESPECT @ImRo45. 👏❤ pic.twitter.com/gbVFrvhGiy — TEAM RO-HITMAN SHARMA (@HitmanPlanet__) 30 October 2018 ఈ మ్యాచ్లో ఫీల్డింగ్లోను రోహిత్ అదరగొట్టాడు. ఫస్ట్ స్లిప్లో ఉండి ఏకంగా మూడు క్యాచ్లు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఈ క్యాచ్లపై మాట్లాడుతూ.. ‘ఈ రోజు స్లిప్ క్యాచ్లు అందుకున్నాను. అలాంటి క్యాచ్లు అందుకోవడం చాలా కీలకం. మాములుగా కుల్దీప్ బౌలింగ్లో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ అతన్ని చేతులను అర్థం చేసుకోవడం కష్టం. అదే నెట్స్లో సులువుగా అర్థమవుతోంది. అతను గూగ్లీ వేయబోతున్నాడని గ్రహించి స్లిప్ ఫీల్డర్గా సిద్దంగా ఉన్నాను.’ అని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లి అభిమానులు సైతం మ్యాచ్ జరుగతుండగా.. అతని సతీమణి, బాలీవుడ్ నటి అనుశ్క శర్మ పేరును ప్రస్తావిస్తూ అనుష్కా.. అనుష్కా అని అరవడంతో కోహ్లి థంప్సప్ సింబల్తో చూపించి ఆనందపరిచాడు.(ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ) -
ధోనిని తీసేయడంలో తప్పులేదు : గంగూలీ
కోల్కతా : టీ20లకు సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని దూరం పెట్టడంపై అతని అభిమానులు సెలక్టర్లపై భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని దూరం పెట్టడం తనకేం ఆశ్చర్యం అనిపించలేదని, అతన్ని తీసేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ.. ‘టీ20లకు ధోనిని ఎంపికచేయకపోవడం పట్ల నేనేమి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. ధోని 2020 టీ20 వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్లో ఉన్న రిషభ్ పంత్కు అవకాశం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తా. వెస్టిండీస్తో చివరి వన్డే అనంతరం ధోని ఆటకు చాలా గ్యాప్ వస్తుంది. అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడడు. మళ్లీ ఆసీస్, న్యూజిలాండ్లతో వన్డే సిరీస్ల్లోనే ఆడుతాడు. అతన్ని రంజీ ట్రోఫీలు ఆడామని సెలక్టర్లు సూచించాలి. దీంతో ఆటతో టచ్లో ఉంటాడు. ఇది అతని ఫామ్ తిరిగి సాధించడానికి ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్లకు ధోనిని పక్కకు పెడుతు భారత జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది! ధోని ‘మెరుపు’ చూశారా? -
ఐదో వన్డేకు ఫుల్ గిరాకీ!
తిరువనంతపురం : భారత్-వెస్టిండీస్ మధ్య చివరిదైన ఐదో వన్డే టికెట్లకు ఫుల్ డిమాండ్ ఉందని కేరళ క్రికెట్ ఆసోసియేషన్(కేసీఏ) తెలిపింది. రేపు(గురువారం) తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. దీంతో ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా కేసీఏ విద్యార్థులకు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. 40వేల సీటింగ్ కెపాసిటీ గల ఈ మైదానంలో మంగళవారానికే 30వేల టికెట్లు అమ్ముడుపోయాయని, మ్యాచ్ ప్రారంభమయ్యే రోజువరకు అన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కేసీఏ అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ఆటలో ‘అరటిపండు’!) టికెట్ల అమ్మకాల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చిందని, విద్యార్థులు ఆఫర్లో టికెట్లు కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా ఐడీకార్డులు తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఇరు జట్లు అక్కడి చేరుకోని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇది కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో మరోసారి భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో రోహిత్, రాయుడులు సెంచరీలతో చెలరేగి భారత్కు అతిపెద్ద విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. (చదవండి: భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!) ధోని ‘మెరుపు’ చూశారా? -
భారత యువ పేసర్ ఖలీల్కు మందలింపు
ముంబై: వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో అతిగా ప్రవర్తించిన టీమిండియా యువ పేసర్ ఖలీల్ అహ్మద్ను మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ మందలించారు. మార్లోన్ శామ్యూల్స్ వికెట్ తీసిన తర్వాత ఖలీల్ దూకుడుగా ప్రవర్తించాడు. వికెట్ తీసిన ఆనందంలో శామ్యూల్స్పైకి దూసుకెళ్లాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనలకు వ్యతిరేకం కావడంతో ఖలీల్ను మ్యాచ్ రిఫరీ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అతనికి ఒక డిమెరిట్ పాయింట్ను విధించారు. ఐసీసీ లెవల్-1 నిబంధనల్లో భాగంగా ఆర్టికల్ 2.5 కోడ్ను ఖలీల్ ఉల్లఘించాడు. ఈ ఆర్టికల్ ప్రకారం ఒక ఆటగాడిని మరొక ఆటగాడు అసభ్యంగా దూషించడం కానీ చర్యల ద్వారా కవ్వించడం కానీ చేయకూడదు. దీన్ని ఖలీల్ అతిక్రమించడంతో అతను హెచ్చరికకు గురయ్యాడు. భారత్ నిర్దేశించిన 378 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 14 ఓవర్ నాల్గోబంతికి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో రోహిత్ శర్మకు స్లిప్ క్యాచ్ ఇచ్చి శామ్యూల్స్ ఔటయ్యాడు. ఈ క్రమంలోనే ఖలీల్ అతిగా ప్రవర్తించినట్లు ఫీల్డ్ అంపైర్లు ఇయాన్ గౌడ్, అనిల్ చౌదరిలు రిఫరీకి ఫిర్యాదు చేశారు. దాంతో ఖలీల్కు ఒక డెమెరిట్ పాయింట్ విధించిన రిఫరీ.. హెచ్చరికతో సరిపెట్టాడు. తన తప్పిదాన్ని ఖలీల్ ఒప్పుకోవడంతో దీనిపై ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేదని రిఫరీ బ్రాడ్ తెలిపారు. విండీస్తో నాల్గో వన్డేలో ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన ఖలీల్ అహ్మద్ 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ 224 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
వాటి కోసం ఎప్పుడూ ఆలోచించను: రోహిత్
ముంబై:తాను క్రీజ్లోకి వెళ్లేటప్పుడు సెంచరీలు గురించి కానీ డబుల్ సెంచరీలు గురించి కానీ ఆలోచించనని, కేవలం సాధ్యమైనంత సేపు క్రీజ్లో ఉండాలనే ఆలోచనతోనే బ్యాటింగ్ చేస్తానని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో రోహిత్ శర్మ 162 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డే ఫార్మాట్లో అత్యధికసార్లు 150కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ తన రికార్డును మరింత సవరించుకున్నాడు. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ ఐదుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. విండీస్తో నాల్గో వన్డే తర్వాత మాట్లాడుతూ.. ‘సెంచరీలు,డబుల్ సెంచరీలు గురించి నేను ఎప్పుడూ ఆలోచించిన దాఖలు లేవు. జట్టుకు ఉపయోగపడే విధంగా బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే క్రీజ్లోకి వెళతా. నేను మూడు డబుల్ సెంచరీలు సాధించిన క్రమంలో కూడా వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ మ్యాచ్లో కూడా రాయుడు నా వద్దకు వచ్చి డబుల్ సెంచరీ సాధిస్తానని చెప్పాడు. కానీ నా ఫోకస్ అంతా బ్యాటింగ్పైనే ఉంచా. అంతేతప్ప ద్విశతకం గురించి ఆలోచించలేదు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మైదానంలో అంతర్జాతీయ వన్డే జరుతుండటంతో.. భారీ లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచాలని ముందే నిర్ణయించుకున్నాం. ఈ క్రమంలో ఒక మెరుగైన భాగస్వామ్యం రాయుడితో నాకు లభించింది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇక్కడ చదవండి: రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా -
ధోని ‘మెరుపు’ చూశారా?
ముంబై : టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని మరో సరికొత్త రికార్డు సృష్టించాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో తన మెరుపు కీపింగ్తో ఔరా అనిపించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో విండీస్ బ్యాట్స్మన్ కీమోపాల్ ముందుకొచ్చి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి మిస్సవ్వడంతో ధోనికి దొరికిపోయాడు. రెప్పాపాటులో పనిపూర్తి చేసిన ధోని.. స్టంపౌట్లో కొత్త రికార్డు నమోదు చేశాడు. ఈ స్టంపౌట్ను ధోని 0.08 సెకన్లలోనే పూర్తి చేయడం గమనార్హం. తొలుత నాటౌట్గా భావించిన జడేజా ధోని చిరునవ్వులను చూసిన బ్యాట్స్మన్ కథ ముగిసింధని గ్రహించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. (చదవండి: కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?) ఇక మూడో వన్డేలో అద్భుత క్యాచ్ వావ్ అనిపించిన ధోని తాజా స్టంపింగ్తో తన కీపింగ్లో పసతగ్గలేదని నిరూపించాడు. ఈ స్టంపౌట్పై క్రికెట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 0.08 సెకన్లలో స్టంపౌట్ చేసి తన రికార్డు (0.09)ను తిరగరాశాడని ఒకరంటే.. కీపింగ్లో ధోనిని మించినోడే లేడని మరొకరు కామెంట్ చేశారు. ఇక 2019 ప్రపంచకప్ లోపు ధోనిని పక్కకు పెట్టే ఆలోచనను మానేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి రాయుడుల శతకాలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండి: వారెవ్వా ధోని.. ఏం క్యాచ్) ధోని అరుదైన ఘనతకు చేరువలో.. ధోని రిటైర్మెంట్ తీసుకో Lightening stumping..💪@msdhoni 0.08 sec 😍 #MSDhoni #IndvsWi pic.twitter.com/oqk7eaX4Xt — TamilCRIC (@tamil_cric) October 29, 2018 MS dhoni is great wicketkeeper of the world Cricket ...run vi banege world cup 2019 me aur tum sab aalochna karna band karo — Vijay# Toppo (@VijayToppo17) October 29, 2018 -
అతడికి మా మద్దతు ఉంటుంది: కోహ్లి
ముంబై: వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో సెంచరీ సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడిపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అంబటి రాయుడు ఒక తెలివైన బ్యాట్స్మన్ అని కోహ్లి కొనియాడాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. అతనికి తమ మద్దతు అవసరమని పేర్కొన్నాడు. ప్రధానంగా నాల్గో స్థానంలో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయుడి బ్యాటింగ్పై టీమిండియా మేనేజ్మెంట్ చాలా సంతోషంగా ఉందన్నాడు. ‘ వచ్చిన అవకాశాన్ని రాయుడు రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. అతనికి మేము(జట్టు మేనేజ్మెంట్) అండగా ఉంటుంది. 2019 వరల్డ్కప్ వరకూ సాధ్యమైనన్ని మ్యాచ్లు ఆడే అవకాశాన్ని అతనికి కల్పిస్తాం. రాయుడు గేమ్ను అర్ధం చేసుకునే తీరు నిజంగా అమోఘం. నాల్గో స్థానంలో అతను బ్యాటింగ్ చేసిన విధానంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. మరొకవైపు యువ పేసర్ ఖలీల్ అహ్మద్లో కూడా అసాధారణ టాలెంట్ ఉందంటూ కొనియాడాడు. పిచ్ సహకరించిన ప్రతీసారి ఖలీల్ ప్రతిభ బయటపడుతూనే ఉందన్నాడు. రెండు వైపులకు బంతిని స్వింగ్ చేసే సత్తా ఖలీల్ అహ్మద్లో ఉందన్నాడు. కచ్చితమైన ఏరియాల్లో బంతిని సంధిస్తూ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్న ఖలీల్కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. వెస్టిండీస్తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ 224 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(162)కు జతగా అంబటి రాయుడు(100) శతకంతో మెరిశాడు. రోహిత్ ధమాకా.. రాయుడు పటాకా కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా? -
ధోని అరుదైన ఘనతకు చేరువలో..
తిరువనంతపురం: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనతకు చేరువయ్యాడు. భారత్ తరపున వన్డే ఫార్మాట్లో పది వేల పరుగుల మార్కును చేరేందుకు ధోని పరుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్తో ఐదు వన్డేల సిరీస్లో భాగంగా నాల్గో వన్డేలో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోని.. మరో పరుగు సాధిస్తే టీమిండియా తరపున పది వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు. ఇప్పటివరకూ ధోని వన్డే ఫార్మాట్లో చేసిన పరుగులు 10, 173 కాగా, భారత్ ఆటగాడిగా మాత్రం ఆ ఘనతను చేరుకోలేదు. 2007లో ఆఫ్రికా ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో ఆసియా ఎలెవన్ తరపున ఆడిన ధోని ఆ మూడు మ్యాచ్ల సిరీస్లో 174 పరుగులు సాధించాడు. దాంతో భారత్ తరపున పదివేల పరుగులు పూర్తి చేసేందుకు పరుగు దూరంలో నిలిచాడు ధోని. తిరువనంతపురంలో గురువారం జరుగనున్న చివరిదైన ఆఖరి వన్డేలో ధోని ఆ మార్కును చేరుకునే అవకాశం ఉంది. -
కోహ్లి సూపర్ ఫీల్డింగ్ చూశారా?
ముంబై : మ్యాచ్ ఏదైనా తనదైన ముద్ర ఉండేలా చూసే టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి... ముంబైలో తక్కువ స్కోరుకే ఔటైనా మెరుపు ఫీల్డింగ్తో తళుక్కుమన్నాడు. సోమవారం వెస్టిండీస్తో జరిగిన నాలుగో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్మన్ శామ్యూల్స్ కవర్స్ దిశగా కొట్టిన షాట్ను అడ్డుకున్న కోహ్లి... అంతే వేగంగా డైవ్తో బంతిని నాన్ స్ట్రయికింగ్ వైపు వికెట్లకేసి విసిరాడు. అది గురి చూసి వదిలిన బాణంలా తగలడం క్షణాల్లో జరిగి పోయింది. అప్పటికే చాలా ముందుకొచ్చిన కీరన్ పావెల్ తిరిగి క్రీజును చేరే అవకాశమూ లేకపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ రనౌట్కు పావెల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. (చదవండి: రోహిత్ ధమాకా రాయుడు పటాకా) కోహ్లి స్టన్నింగ్ ఫీల్డింగ్తో మైదానంలోని భారత ఆటగాళ్లు, అభిమానులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. ఇక నెటిజన్లు కోహ్లిని ఆకాశానికెత్తారు. ‘అరే ఏం ఫీల్డింగ్ అన్నా.. సూపర్’ అని ఒకరు.. బ్యాట్ ఝులిపించకుంటే.. ఫీల్డింగ్తో మైమరిపిస్తాడు దటీజ్ కోహ్లి అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ సిరీస్లో వరుసగా మూడు సెంచరీలతో రికార్డు సృష్టించిన కోహ్లి ఈ మ్యాచ్లో (16) నిరాశపరిచాడు. హిట్ మ్యాన్ రోహిత్, తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడుల శతకాలతో భారత్ 224 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. (చదవండి: ధావన్.. నేను కూడా తొడగొడతా!) If not with bat, then with his fielding! @imVkohli always makes his presence felt in the field. That run out was special. #INDvsWI #IndvsWestindies #INDvsWIN #INDvWI #BattleOfSixes #ViratKohli #Virat — prakhar sachdeo (@simplyparu) October 29, 2018 #KingKohli Wow👌🏻👌🏻👌🏻 What a Fielding🤭🤭🤭🤭 #ViratKohli # — Cricket Keeda❤️ (@Surana9Naveen) October 29, 2018 -
నాలుగో వన్డేలో భారత్ ఘన విజయం
-
నాలుగో వన్డే : విండీస్పై భారత్ భారీ విజయం
-
కదంతొక్కిన రోహిత్, రాయుడు
హిట్మ్యాన్ రోహిత్, అంబటి రాయుడు సెంచరీలతో చెలరేగిన వేళ.. బౌలింగ్లో ఖలీల్, కుల్దీప్ మెరిసిన సమయాన.. ఫీల్డింగ్లో జట్టు సమష్టి తత్వంతో.. నాలుగో వన్డేలో భారత్ జూలు విదిల్చింది. చాంపియన్ ఆటతీరుతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. 2–1తో సిరీస్లో ఆధిక్యం సంపాదించింది. ముంబై: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... ఓపెనర్ రోహిత్ శర్మ (137 బంతుల్లో 162; 20 ఫోర్లు, 4 సిక్స్లు), మిడిలార్డర్ బ్యాట్స్మన్ అంబటి తిరుపతి రాయుడు (81 బంతుల్లో 100; 8 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటితో పాటు ఫీల్డర్ల చురుకుదనంతో ఛేదనలో వెస్టిండీస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది 36.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. రోహిత్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్లో చివరిదైన ఐదో వన్డే గురువారం తిరువనంతపురంలో జరుగుతుంది. శుభారంభం... ఆపై అమోఘం మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కింది. రోహితే ముందుగా మొదలుపెట్టినా, కొద్దిసేపటికే జోరందుకున్న శిఖర్ ధవన్ (40 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కొన్ని చక్కటి షాట్లతో అతడిని మించిపోయాడు. అయితే, కీమో పాల్ ఓవర్లో పుల్ చేయబోయి మిడ్ వికెట్లో రావ్మాన్ పాల్కు చిక్కాడు. దీంతో 71 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హ్యాట్రిక్ సెంచరీల ఊపులో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (16) ఈసారి ఎక్కువసేపు నిలవలేకపోయాడు. దీంతో రోహిత్, రాయుడు బాధ్యత తీసుకున్నారు. కుదురుకున్న తర్వాత దూకుడు పెంచారు. ఈ క్రమంలో అలెన్ బౌలింగ్లో ఫోర్తో రోహిత్ 21వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే రాయుడు అర్ధశతకం చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి ఫోర్లు, సిక్స్లతో ఇద్దరూ ధాటైన ఆట కనబర్చారు. కావాల్సినన్ని ఓవర్లు ఉండటం, 150 మైలురాయి (131 బంతుల్లో) కూడా అధిగమించడంతో రోహిత్ డబుల్ సెంచరీ ఖాయమని అంతా భావించారు. కానీ నర్స్ బౌలింగ్లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని కట్ చేసే యత్నంలో షార్ట్ థర్డ్మ్యాన్లో క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్కు 211 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రోచ్ ఓవర్లో సిక్స్ బాది 90ల్లోకి చేరుకున్న రాయుడు... కాసేపటికే మూడో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రనౌటయ్యాడు. ధోని (15 బంతుల్లో 24; 2 ఫోర్లు), కేదార్ జాదవ్ (7 బంతుల్లో 16 నాటౌట్; 3 ఫోర్లు), జడేజా (4 బంతుల్లో 7; 1 ఫోర్ నాటౌట్) ఆఖర్లో తమవంతుగా జట్టు స్కోరును పెంచారు. విండీస్ ఏ దశలోనూ... అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్ చందర్పాల్ హేమరాజ్(14)ను ఔట్ చేయడం ద్వారా వికెట్ల పతనానికి భువనేశ్వర్ తెర తీశాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్ ధాటికి కీరన్ పావెల్(4), షై హోప్(0) వెంట వెంటనే వెనుదిరిగారు. బౌలింగ్ మార్పులో భాగంగా బంతి అందుకున్న ఖలీల్ తొలుత హెట్మైర్(13)ను ఎల్బీడబ్ల్యూగా, ఆ తర్వాత రోమ్మెన్ పావెల్ బౌల్డ్ చేసి పెవిలియన్కు చేర్చాడు. దీంతో 47 పరుగులకే విండీస్ సగం వికెట్ల కోల్పోయింది. ఆ తర్వాత అనుభవజ్ఞుడు శామ్యూల్స్ (18) సైతం వెనుదిరగడంతో విండీస్ 100కే ఆలౌట్ అవుతుందనిపించింది. అయితే కెప్టెన్ హోల్డర్(54 నాటౌట్) పోరాడడంతో చివరికి 153 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. జడేజా, భువనేశ్వర్ తలో వికెట్ సాధించారు. చదవండి: భారత్తో నాలుగో వన్డే : విండీస్ ముందు భారీ లక్ష్యం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భారత్తో నాలుగో వన్డే : విండీస్ ముందు భారీ లక్ష్యం
ముంబై : వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్ భారీ స్కోర్ను సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 377 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ 137 బంతుల్లో 162 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా.. తెలుగు తేజం అంబటి రాయుడు (100) సెంచరీతో కదంతొక్కాడు. గత మూడు వరుస మ్యాచ్ల్లో సెంచరీలతో చలరేగిన కెప్టెన్ కోహ్లి (16) స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. భారత్ బ్యాట్సమెన్స్లో ధావన్ (38) కోహ్లి (16), ధోని (23), జాదవ్ (16) నాటౌట్ జడేజా (6) నాటౌట్ రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్ రెండు, ఆశ్లే నర్స్, కీమో పాల్ తలో ఒక వికెట్ పడగొట్టారు. కాగా విండీస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. చదవండి : సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు.. చదవండి : ధావన్.. నేను కూడా తొడగొడతా! -
సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు..
ముంబై: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. వెస్టిండీస్తో నాల్గో వన్డేలో సెంచరీ సాధించడం ద్వారా తక్కువ ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా 19 సెంచరీలు పూర్తి చేసుకున్న టీమిండియా ఆటగాడిగా రికార్డు సాధించిన కొద్ది వ్యవధిలోనే మరో రికార్డును రోహిత్ నమోదు చేశాడు. వన్డే ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వన్డేల్లో సచిన్ 195 సిక్సర్లు కొట్టగా, ఇప్పుడు దాన్ని రోహిత్ సవరించాడు. పాల్ వేసిన 40 ఓవర్ ఐదో బంతిని సిక్స్ కొట్టడంతో సచిన్ సిక్సర్లు రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక్కడ ఎంఎస్ ధోని(211 సిక్సర్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ సరికొత్త రికార్డు -
రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
ముంబై: వెస్టిండీస్తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. బ్రాబోర్న్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ 98 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. సహచర ఓపెనర్ శిఖర్ ధావన్(38)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లి(16) తొందరగానే పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. మంచి బంతుల్ని ఆచితూచి ఆడుతూ చెడ్డ బంతుల్ని బౌండరీలుగా మలిచి సెంచరీ సాధించాడు. ఇది రోహిత్ శర్మ కెరీర్లో 21వ వన్డే సెంచరీ కాగా, ఓపెనర్గా 19వ సెంచరీ. ఇక్కడ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఓపెనర్గా 19వ సెంచరీ పూర్తి చేసుకున్న క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్లు ఆడిన భారత బ్యాట్స్మన్గా రోహిత్ రికార్డు సాధించాడు. ఓవరాల్గా రెండో స్థానంలో ఉన్నాడు. 107 ఇన్నింగ్స్ల్లోనే రోహిత్ ఓపెనర్గా 19వ సెంచరీ నమోదు చేశాడు. అంతకముందు సచిన్ టెండూల్కర్ 115 ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా 19 సెంచరీలు పూర్తి చేసుకోగా, రోహిత్ మాత్రం సచిన్ కంటే 8 ఇన్నింగ్స్లు ముందే ఈ ఘనత నమోదు చేశాడు. ఇక్కడ దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తొలి స్థానంలో ఉన్నాడు. ఆమ్లా 102 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కును చేరగా, ఆ తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు. ఇక తక్కువ ఇన్నింగ్స్ల్లో 21 సెంచరీలు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఆమ్లా(116), కోహ్లి(138), ఏబీ డివిలియర్స్(183) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ 186 ఇన్నింగ్స్ల్లో 21వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2013 నుంచి చూస్తే అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లి(25) తొలి స్థానంలో ఉండగా, రోహిత్(19) రెండో స్థానంలో ఉన్నాడు. -
ధావన్.. నేను కూడా తొడగొడతా!
ముంబై: వెస్టిండీస్తో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 38 వ్యక్తిగత పరుగుల వద్ద తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. కీమో పాల్ బౌలింగ్లో అనవసరపు షాట్ కోసం యత్నించిన శిఖర్ ధావన్ క్యాచ్ రూపంలో ఔటయ్యాడు. అయితే ధావన్ ఔటైన తర్వాత కీమో పాల్ తొడగొట్టడం అభిమానులతో పాటు ధావన్కు కూడా నవ్వులు తెప్పించింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ కీమో పాల్ వేసిన ఐదో బంతిని మిడ్వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా బ్యాట్కి కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పావెల్ చేతుల్లో పడింది. కాగా, ధావన్ తరహాలో తొడగొడుతూ బౌలర్ కీమో పాల్ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకోవడం అందరి సుపరిచితమే. కీమో పాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా.. ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్కి వెళ్లిపోయాడు. దాంతో భారత్ తొలి వికెట్ను 71 పరుగుల వద్ద కోల్పోయింది. pic.twitter.com/5PQeWmL2BP — This is HUGE! (@ghanta_10) 29 October 2018 చాహల్, పంత్ ఔట్ -
చాహల్, పంత్ ఔట్
ముంబై: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ బ్రాబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్తో జరుగుతున్న నాల్గో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. గత మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్లో గెలిచి ఆధిక్యం సాధించాలనే యోచనలో ఉంది. అదే సమయంలో మూడో వన్డేలో గెలిచిన వెస్టిండీస్ మంచి జోరు మీద ఉంది. నాల్గో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. యజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్లకు విశ్రాంతి నిచ్చిన టీమిండియా యాజమాన్యం.. రవీంద్ర జడేజా, కేదర్ జాదవ్లను తుది జట్టులోకి తీసుకుంది. గత వన్డేలో రోహిత్, ధావన్ విఫలం కావడం... మిడిల్, లోయర్ ఆర్డర్లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవడంతో భారత్ పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాలు కూడా చాలా కీలకం. కాగా, ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అతను ధనాధన్ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. జాదవ్, జడేజాల రాకతో భారత్ అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ మెరుగ్గా కనబడుతోంది. తుది జట్లు భారత్; విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, జస్ప్రిత్ బూమ్రా వెస్టిండీస్; జాసన్ హోల్డర్(కెప్టెన్), కీరన్ పావెల్, హెమ్రాజ్, సాయ్ హోప్, మార్లోన్ శ్యామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, పాబియన్ అలెన్, ఆశ్లే నర్స్, రోచ్, కీమో పాల్ కేదర్ జాదవ్ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ -
ఆ స్థాయి ఆల్ రౌండర్ కనిపించలేదు: చీఫ్ సెలక్టర్
ముంబై: వెస్టిండీస్తో టీ20 సిరీస్తో పాటు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టీ20, టెస్టు సిరీస్కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఇక్కడ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తప్పించారు సెలక్టర్లు. ఇదిలా ఉండగా ఈ మూడు సిరీస్లకు సంబంధించిన జట్టులో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు కూడా ఎక్కడా చోటు కల్పించలేదు. ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో హార్దిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ కారణం చేతనే హార్దిక్ను తప్పించారనే వాదన వినిపించింది. కాగా, గత నెలలో ఆసియాకప్లో భాగంగా లీగ్ మ్యాచ్లో హార్దిక్ గాయపడ్డాడు. దాని నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతోనే విశ్రాంతి అనివార్యమైందనేది ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యాల ద్వారా తెలుస్తోంది. ‘హార్దిక్ పాండ్య స్థాయిలో సామర్థ్యం గల ఓ పూర్తిస్థాయి ఆల్రౌండర్ మాకు కనిపించలేదు. పాండ్య బౌలింగ్తో పాటు, బ్యాట్తోనూ సత్తా చాటగలడు. కానీ ఈ సిరీస్లకు ఎంపిక చేసిన జట్టులో అతని స్థాయిలో ప్రదర్శన చేసే ఆల్రౌండర్ భారత జట్టులో ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. అతని సామర్థ్యాలకు సమానంగా ఉన్న ఆటగాడు దొరకడం కూడా ప్రస్తుతం కష్టమే. ఆ కారణం చేతనే జట్టులో పూర్తిస్థాయి ఆల్రౌండర్ను ఎంపిక చేయలేకపోయాం. అయితే బంతితో రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ టెస్టు సిరీస్లో బ్యాట్తోనూ సత్తా చాటగలడని ఆశిస్తున్నాం. భువీ ఆల్రౌండర్ ప్రదర్శన పట్ల మాకు విశ్వాసం ఉంది’ అని తెలిపాడు. -
కోహ్లి నీ టార్గెట్ ఇది: పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్ : వరుస సెంచరీలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇటు అభిమానులు అటు మాజీ క్రికెటర్లు కోహ్లిపై పొగడ్తల వర్షం కురపిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ మాత్రం కోహ్లికి ఓ లక్ష్యాన్ని నిర్ధేశించాడు. అతని బ్యాటింగ్పై ప్రశంసలు కురిపించిన షోయబ్.. అతనిలో ఏదో శక్తి దాగి ఉందని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డాడు. ‘గువాహటి, విశాఖపట్నం, పుణె వేదికల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించి కోహ్లిలో ఏదో ప్రత్యేక ఉంది. ఈ ఘనతనందుకున్న తొలి భారత క్రికెటర్ కోహ్లి. అతనో అద్భుత పరుగుల యంత్రం. ఇలానే 120 సెంచరీలు సాధించాలి. ఇది నేను కోహ్లికి నిర్ధేశించిన టార్గెట్’అంటూ ట్వీట్ చేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి తాజా ఫామ్, అతని వయసు చూస్తే ఈ రికార్డు అలవోకగా అధిగమిస్తాడనే భావన కలుగుతోంది. ఇప్పటికే కోహ్లి 62 సెంచరీలు(వన్డేల్లో 38, టెస్టుల్లో 24) పూర్తి చేసుకున్నాడు. అయితే విండీస్తో జరిగిన గత మ్యాచ్లో కోహ్లి సెంచరీ చేసినా మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. -
చూశారా.. ఇదే మా సమాధానం: వెస్టిండీస్ క్రికెటర్
పుణె: భారత్పై మూడో వన్డేలో విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. తొలి వన్డేలో పోరాడి ఓడిన విండీస్.. రెండో వన్డేను టైగా ముగించింది. కాగా, మూడో వన్డేలో ఏకంగా విజయమే సాధించి టీమిండియాకు షాకిచ్చింది. దాంతో విండీస్ ఆటగాళ్లు తమ మాటలకు పదునుపెట్టారు. గత మ్యాచ్లలా కాదంటూ.. ఇప్పుడు రెండు వన్డేలలోనూ గెలిచితీరతామనే విధంగా చెప్పుకొస్తున్నారు. భారత్ గడ్డపై వెస్టిండీస్ ప్రదర్శన గురించి అనుమానం వ్యక్తం చేసి తమను విమర్శించిన వారికి ఇటీవల ముగిసిన మూడు వన్డేల్లో మా జట్టు కనబర్చిన ప్రదర్శనే సమాధానమని ఆ జట్టు ఆల్రౌండర్ నర్స్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్లో విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ..‘ చూశారా.. ఇదే మా సమాధానం. మా జట్టును విమర్శించిన వారు ఇప్పుడేమంటారు. మూడో వన్డేలో మా జట్టు ఆడిన తీరు అమోఘం. మేము ఇక్కడకు వచ్చినప్పుడు అండర్డాగ్స్గానే వచ్చాం. అది కూడా కచ్చితమైన ఆటతో అలరించాలనుకున్నాం. అయితే భారత్పై టెస్టు సిరీస్ను కోల్పోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మా సత్తా ఏమిటో బయటపడింది కదా’ అంటూ నర్స్ వ్యాఖ్యానించాడు. పుణె వేదికగా శనివారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో బ్యాట్తో 22 బంతుల్లోనే 4ఫోర్లు, 2సిక్సుల సాయంతో 40 పరుగులు చేసిన నర్స్.. బంతితోనూ శిఖర్ ధావన్ (35), రిషబ్ పంత్ (24) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. భారత్పై 43 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు గెలుపొందగా.. కీలక ప్రదర్శన చేసిన నర్స్కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. పుణేలో పల్టీ ఈ ఘనతా.. అతడికే సొంతం -
ధోని రిటైర్మెంట్ తీసుకో
పుణె : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్కు వీడ్కోలు పలకాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలోనే ధోని రిటైర్మెంట్ ప్రకటించడం గౌరవప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు. శనివారం వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి మినహా మిగతా బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో కీపింగ్లో అదరగొట్టిన ధోని.. ఓ అద్బుత క్యాచ్తో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అయితే ఇదే విధంగా బ్యాటింగ్లోనూ రాణిస్తాడనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో వారు ఇక ధోని రిటైర్మెంట్ తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మ్యాచ్కు ముందే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ధోనిని టీ20ల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెస్కేపై భగ్గుమన్న అభిమానులు.. బ్యాటింగ్లో ధోని తాజా ప్రదర్శన చూసి డీలా పడ్డారు. (ఎమ్మెస్కేపై ధోని ఫ్యాన్స్ ఫైర్!) ఈ మ్యాచ్లో సెంచరీతో ఒంటరిపోరాటం చేసిన కోహ్లికి ఏ ఒక్కరు అండగా నిలవలేదు. ఇది అభిమానులు తీవ్ర ఆగ్రహానికి తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. ‘ప్రపంచకప్ ముందే భారత మిడిలార్డర్ గందరగోళంగా ఉంది. ప్రతీసారి కోహ్లి ఒక్కడే ఆడలేడు. ధోని తప్పుకొని అతని స్థానంలో ఓ మంచి బ్యాట్స్మన్కు అవకాశం ఇవ్వాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. త్వరగా ధోని రిటైర్మెంట్ తీసుకోవాలి లేకుంటే అన్ని ఓడిపోవాల్సి వస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ‘ధోని ఇప్పుడు వీడ్కోలు పలకడం గౌరవంగా ఉంటుంది. అతని కెరీర్లో ప్రతి ఒక్కటి సాధించాడు. అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు నిరాశ పరుస్తున్నాయని’ ఇంకొకరు పేర్కొన్నారు. (చదవండి: వారెవ్వా ధోని..) India' middle order in complete disarray before the #WC19. #Kohli cannot salvage every game for us. #Dhoni should retire he's getting to a stage where he needs to be shown the door for the betterment of the team. @BCCI #kingkohli #Dhonidropped — Sachin Kerpal (@sachinkerpal) October 27, 2018 Congratulations for windies team ..dhoni should retire soon otherwise we will lose series too — PRASHANT PATHAK. (@pkpathak_hindu) October 27, 2018 Dhoni should retire honourably right now. There is no point in dragging further. He achieved everything in his career. All ICC trophies great career. His face told the story today he was himself disappointed. Retire and end this misery. #INDvWI — Sunil Singh (@Sunil_1984_) October 27, 2018 -
మూడో వన్డేలో విండీస్ విజయం
-
కోహ్లి పోరాటం వృథా.. విండీస్దే విజయం
పుణె : వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లి(107: 119 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాట్స్మన్ సహకారం అందించకపోవడంతో భారత్కు పరాజయం తప్పలేదు. విండీస్ బౌలర్లు మార్లోన్ శామ్యూల్స్ మూడు , హోల్డర్, మెక్కాయ్, అశ్లేనర్స్లు తలో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో విండీస్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత వైజాగ్ వన్డేలో ఊరించి చేజారిన విజయాన్ని విండీస్ ఈ మ్యాచ్లో ఒడిసిపట్టుకుంది. భారత బ్యాట్స్మెన్ కోహ్లి మినహా రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన విండీస్కు బ్యాట్స్మన్ షై హోప్ (95), అశ్లే నర్స్ (40), హెట్మైర్ (37), హోల్డర్(32)లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన భారత్కు కోహ్లి శతకం గట్టెక్కించలేకపోయింది. చదవండి: పరుగుల యంత్రం కోహ్లి మరో సెంచరీ -
పరుగుల యంత్రం కోహ్లి మరో సెంచరీ
పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ నోట వచ్చిన మాట. వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లి తాజాగా చేసిన శతకాన్ని చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తోంది. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి శతకాలు బాదేస్తున్నాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి.. మూడో వన్డేలోను తన జోరును కొనసాగిస్తూ.. వరుసగా మూడో సెంచరీ సాధించాడు.110 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్తో కెరీర్లో 38వ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఫుల్ ఫామ్లో ఉన్న కోహ్లిని ఆపడం విండీస్ బౌలర్ల నుంచి కావడం లేదు. మరోవైపు కోహ్లి మినహా మిగతా టాపార్డర్ బ్యాట్స్మన్ రోహిత్(8), ధావన్ (35), రాయుడు (22), పంత్ (24), ధోని(7)లు విఫలమయ్యారు. దీంతో భారత్ 194 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోహ్లి ఒక్కడే బాధ్యతనంతా తన భుజాలపై వేసుకోని గెలుపు కోసం పోరాడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లితో పాటు భువనేశ్వర్ ఉన్నాడు. -
మూడో వన్డే.. కోహ్లి హాఫ్ సెంచరీ
పుణె: వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో సెంచరీలతో చెలరేగిన కోహ్లి.. మూడో వన్డేలో 63 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఇక 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(8) మరోసారి నిరాశపరిచాడు. అనంతరం ధావన్తో కలిసి కోహ్లి ఆచితూచి ఆడాడు. మంచి టచ్లోకి వచ్చినట్టే కనిపించిన ధావన్ (35) అశ్లే నర్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగుతేజం అంబటి రాయుడుతో లక్ష్యం దిశగా పోరాడుతున్నాడు. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీ చూసిన తరువాత అతని మాటలు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. మరో శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. -
మూడో వన్డే: భారత్ లక్ష్యం 284
పుణె : భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ బ్యాట్స్మెన్ షై హోప్ (95: 113 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్స్లు) మరోసారి చెలరేగాడు. అతనికి తోడుగా.. అశ్లే నర్స్ (40), హెట్మైర్ (37), హోల్డర్(32)లు రాణించడంతో విండీస్.. భారత్కు 284 పరుగుల లక్ష్యాన్ని విధించింది. బుమ్రా బౌలింగ్..ధోని కీపింగ్.. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో విండీస్ బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్తో జట్టులోకి వచ్చిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా విండీస్ను దెబ్బతీశాడు. ఓపెనర్లు పోవెల్(21), హెమ్రాజ్(15)లను పెవిలియన్కు చేర్చాడు. అయితే హెమ్రాజ్ ఇచ్చిన క్యాచ్ ధోని అందుకున్న విధానం ఔరా అనిపించింది. వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టే యత్నం చేశాడు. కానీ బంతి టాప్ ఎడ్జ్ తీసుకోవడంతో గాల్లోకి లేచింది. దీంతో ఆ బంతిని అందుకోవడానికి ధోని పరుగుత్తుకుంటూ వెళ్లి మరి, అద్భుత డైవ్తో క్యాచ్ అందుకున్నాడు. ఆ వెంటనే సామ్యూల్స్ను ఖలీల్ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి విధ్వంసకర బ్యాట్స్మన్ హెట్మెయిర్ వచ్చాడు. వచ్చి రావడంతోనే ఫోర్లు, సిక్స్లతో దాటిగా ఆడిన హెట్మైర్.. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. అయితే కుల్దీప్ అద్భుత బంతికి ధోని రెప్పపాటు స్టంపౌట్తో హెట్మైర్ను బోల్తా కొట్టించాడు. అనంతరం విండీస్ పోవెల్(4), హోల్డర్(32), అలెన్(5)ల వికెట్లను కూడా త్వరగా కోల్పోయింది. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా గత మ్యాచ్ శతకవీరుడు షై హోప్ మాత్రం తనదైన శైలిలో చెలరేగాడు. సెంచరీకి చేరువైన క్రమంలో బుమ్రా బౌలింగ్లో క్లీన్బౌల్డై శతకం చేజార్చుకున్నాడు. చివర్లో అశ్లే నర్స్(40), రోచ్(15 నాటౌట్)లు రాణించడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో బుమ్రా 4, కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, చహల్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: వారెవ్వా ధోని.. అలిగి మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయాడు! -
ఎమ్మెస్కేపై ధోని ఫ్యాన్స్ ఫైర్!
హైదరాబాద్ : భారత జట్టుకు తొలి టీ20 ప్రపంచకప్ను అందించిన మహేంద్ర సింగ్ ధోనిని వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్లకు ఎంపిక చేయకపోవడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ఆలస్యంగా నాలుగు వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. విండీస్, ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్లకు ధోనిని ఎంపికచేయలేదు. ఇది అతని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. (చదవండి: టి20ల నుంచి ధోని ఔట్) ఇక భారత్ టీ20లు ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ధోని కేవలం 11 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడలేదు. అలాంటి ధోనిని పక్కకు పెట్టడం ఏంటని అతని అభిమానులు సెలక్షన్ కమిటీని నిలదీస్తున్నారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారని, ఈ నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు. ‘విండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20ల్లో ధోని ఆడబోవడం లేదు. మేము రెండో వికెట్ కీపర్ను పరీక్షించే ప్రయత్నంలో ఉన్నాం. ఈ విషయంలో పంత్, కార్తీక్ పోటీ పడతారు. అయితే టి20ల్లో ధోని కెరీర్ ముగిసిందని మాత్రం చెప్పలేను’ అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చారు. దీంతో ఎమ్మెస్కేపై సైతం ధోని అభిమానులు ఫైర్ అవుతున్నారు. కనీసం కెరీర్లో మూడు, నాలుగు మ్యాచ్లు కూడా ఆడని ఎమ్మెస్కే..ధోని లాంటి దిగ్గజ బ్యాట్స్మన్ గురించి నిర్ణయం తీసుకోవడం తమ కర్మని మండిపడుతున్నారు. మరికొందరు ధోని లేని లోటు ఎంటో వారికే తెలుసోస్తుందని కామెంట్ చేస్తున్నారు. (చదవండి: కేదర్ జాదవ్ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ) జట్టులో అతనికి సరైన అవకాశాలు ఇవ్వకుండా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ అంటూ.. అప్పుడు కెప్టెన్సీ తీసేశారనీ, ఇప్పుడు జట్టు నుంచి దూరం చేయాలనుంకుంటున్నారని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ధోనిని జట్టు నుంచి దూరం చేయడానికి జరుగుతున్న కుట్రేనని పేర్కొంటున్నారు. ఇక పుణే వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ధోని అద్భుత క్యాచ్ అందుకొని ఆకట్టుకున్నాడు. ఈ క్యాచ్పై సైతం అతని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎమ్మెస్కే ఇకనైనా నీ నిర్ణయం మార్చుకో అంటూ ట్వీట్ చేస్తున్నారు. (చదవండి: వారెవ్వా ధోని..) My father almost stopped watching cricket after @sachin_rt Retirement I almost stopped watching test matches After dropping #Dhoni From t 20 I will stopped watching t 20 now 😢😢😢😢😢#MSDhoni Will bounce back pic.twitter.com/c1W7MqehJ7 — Shubham Agarwal 🇮🇳 (@tigerboyshubham) October 27, 2018 #mskprasad .can msk Prasad be rested ..#MSDhoni always justify his place in any team until 2019 world cup — Raj kamal (@Rajkama79686135) October 27, 2018 Worst move by selectors , No Dhoni No T20...No one would love to see T20 without MS Dhoni...@BCCI @msdhoni #INDvsAUS #MSDhoni #BCCI #Cricket #TeamIndia pic.twitter.com/pCtCESC5Zq — Harsh V Shah (@Shahharsh07) October 27, 2018 This tweet is specially for Indian Chief Selector of #BCCI Today you are disheartened lot of cricket fans of India and what is the reason behind it,you surely know about it. Today you dropped #MSDhoni, He will definitely answer by his bat. Mr.MSK Prasad — Swarnim Ujjawal (@UjjawalSwarnim) October 26, 2018 what m telling... indian team management are playing with Dhoni career.. they didn't giving chance to bat up the order to express himself... as he said right be4he left captaincy in NZ tour 2016...... and now they drop him from T20 squad.. ..#RIPBCCI #wewantbackdhoni — BITU TELENGA (@BituTelenga) October 27, 2018 -
వారెవ్వా ధోని..
పుణె: వెస్టిండీస్తో జరగబోయే టీ20 సిరీస్కు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రకటించిన జట్టులో ధోనికి ఉద్వాసన పలికారు సెలక్టర్లు. ధోని ఫామ్ తగ్గిందని భావించారో.. ప్రయోగంలో భాగంగానే అతన్ని తప్పించారో తెలియదు కానీ మొత్తంగా వేటు మాత్రం పడింది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ధోని ఫ్యాన్స్. కాగా, విండీస్తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో ధోని ఔరా అనిపించాడు. భారత జట్టులో వికెట్ కీపర్గా సైతం తనదైన మార్కు వేసిన ధోని.. ఒక అద్భుతమైన క్యాచ్తో ఆకట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ ఆరో ఓవర్లో తొలి వికెట్ను కోల్పోయింది. బూమ్రా వేసిన ఆ ఓవర్ ఐదో బంతిని విండీస్ ఓపెనర్ హెమ్రాజ్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండరీ కొట్టే యత్నం చేశాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న ఆ బంతిని పట్టుకునే క్రమంలో ధోని పరుగుత్తుకుంటూ వెళ్లడమే కాకుండా డైవ్ కొట్టి మరీ క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీదు ఉన్న హెమ్రాజ్కు సైతం ధోని క్యాచ్ను అందుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు సైతం వారెవ్వా ధోని అనుకుంటున్నారు.ఇది కచ్చితంగా ధోని పట్టిన బెస్ట్ క్యాచ్ల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. Who says this guy is almost 40 years old. Man just feels he is 40 years young. Look at the #Athletic ability of this man #MSDhoni. A stunning catch to get #India their first wicket. #INDvWI #WIvIND #KingKohli #Pune #CricketMeriJaan #BleedBlue pic.twitter.com/RUBZAM7o9d — Rishabh Mishra (@Rishabh99648610) October 27, 2018 -
‘కోహ్లికి ఇదే నా వందనం’
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిజంగానే పరుగుల యంత్రమని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లి నిబద్ధత, కఠోర శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని భజ్జీ కొనియాడాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో వన్డేల్లో అత్యంత వేగవంతంగా 10 వేల పరుగుల మైలురాయిని కోహ్లి అందుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మాట్లాడిన హర్భజన్.. ‘కోహ్లి అంకితభావానికి, ఆటతీరుకు ఎవరైనా వందనం చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో తాను చూసి అత్యుత్తమ క్రికెటర్ కోహ్లినే. మైదానంలో దిగిన ప్రతిసారి కోహ్లిఅద్భుతాలు సృష్టిస్తున్నాడు. అంచనాలను అందుకుని రాణించే అరుదైన ఆటగాళ్లలో కోహ్లి ఒకడు. విరాట్ కోహ్లిలా ఆటడం మరో ఆటగాడికి సాధ్యం కాదేమో. జట్టు భారాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. చాలా మంది దిగ్గజాలతో క్రికెట్ ఆడాననీ, ప్రస్తుత తరంలో మాత్రం కోహ్లినే నెంబర్ వన్. కోహ్లికి ఇదే నా వందనం’ అని పేర్కొన్నాడు. -
మూడో వన్డే; టాస్ గెలిచిన టీమిండియా
పుణె: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో ఇక్కడ మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ముందుగా విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ జరిగిన రెండు వన్డేల్లో భారత్ తొలి మ్యాచ్లో గెలవగా, రెండో వన్డే టైగా ముగిసింది. దాంతో ఈ సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాలు తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బౌలింగ్ మరింత బలంగా మారింది. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. ఏకపక్షంగా సాగుతుందనుకున్న వన్డే సిరీస్ను విశాఖపట్నంలో అనూహ్య పోరాటంతో ఆసక్తికరంగా మార్చింది వెస్టిండీస్. తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్కు దిగి భారీ స్కోరు చేసి... రెండో వన్డేలో ఛేదనలో ప్రత్యర్థి స్కోరును సమం చేసి తమను తక్కువగా చూడొద్దని చాటింది. బ్యాట్స్మెన్ పట్టుదలతో పోటీలో నిలిచింది. మరోవైపు భారత్ తప్పనిసరిగా శక్తులను కూడదీసుకునేలా చేసింది. బౌలర్లకు కఠిన పరిస్థితులు ఎదురవుతుండటంతో టీమిండియా సైతం అప్రమత్తమైంది. దానిలో భాగంగానే బూమ్రా, భువనేశ్వర్లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. తుది జట్లు భారత్; విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, ఖలీల్ అహ్మద్, చాహల్ వెస్టిండీస్; కీరన్ పావెల్, చంద్రపాల్ హెమ్రాజ్, సాయ్ హోప్, మార్లోన్ శామ్యూల్స్, హెట్మెయిర్, రోవ్మాన్ పావెల్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అశ్లే నర్స్, కీమర్ రోచ్, మెక్కాయ్ -
కేదార్ జాదవ్ విమర్శలు; దిగివచ్చిన బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో చివరి మూడు వన్డేల కోసం తనని భారత జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదంటూ పేర్కొన్న జాదవ్.. ఇందుకు సంబంధించి ఎవరూ కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఫిట్నెస్ కారణంగా పక్కకు పెట్టామన్న బీసీసీఐ సెలక్టర్లు.. ఫిట్నెస్ సాధించాక కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదంటూ బహిరంగంగా విమర్శించాడు. అయితే పరిస్థితి అర్థం చేసుకోవాలంటూ తొలుత నచ్చచెప్పేందుకు యత్నించిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. జాదవ్ను చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిన్న సవరణ అంటూ కేదార్ జాదవ్కు చివరి రెండు వన్డేల్లో అవకాశం ఇస్తున్నట్లు శుక్రవారం బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. వెస్టిండీస్తో చివరి మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు గురువారం సాయంత్రమే ప్రకటించారు. అయితే ఈ జట్టులో సెలక్టర్లు కేదార్ జాదవ్కు చోటు కల్పించలేదు. దీంతో పూర్తి ఫిట్నెస్ సాధించినా సెలక్టర్లు ఎందుకు జట్టులోకి ఎంపిక చేయలేదంటూ జాదవ్ ప్రశ్నించగా.. బీసీసీఐ సెలక్టర్లు దిగి రాక తప్పలేదు. ఇది ఎమ్మెస్కే మాట.. ‘కేదార్ జాదవ్ తరచుగా గాయపడతాడన్న కారణంగా మూడో వన్డేలోకి ఎంపిక చేయలేదు. గతంలోనూ ఒకటి రెండుసార్లు అతను జట్టులోకి పునరాగమనం చేయడం, వెంటనే గాయపడటం జరిగింది. దేశవాళీలో ఆడించేందుకు భారత-ఎ జట్టులో గురువారం చోటిచ్చాం. కేవలం అతనికి ఒక మ్యాచ్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అతడి ఫిట్నెస్పై ఓ అంచనాకి రాలేమని విండీస్తో చివరి 3 వన్డేలకు ఛాన్స్ ఇవ్వలేదని జాదవ్కు ఎమ్మెస్కే ప్రసాద్ సర్ది చెప్పారు. మనసు మార్చుకున్నారు అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ... ఎమ్మెస్కే మనసు మార్చుకుని జాదవ్ను విండీస్తో చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేదార్ జాదవ్ను చివరి రెండు వన్డేలకు ఎంపిక చేశామని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు. వెస్టిండిస్తో ఐదు వన్డేల సిరిస్ అనంతరం జరగనున్న మూడు టీ20ల సిరీస్తో పాటు ఆసీస్ పర్యటనకు సంబంధించి టెస్టు జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా, విండీస్తో టీ20 సిరీస్కు కోహ్లికి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఓపెనర్ రోహిత్ శర్మకు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. UPDATE - @JadhavKedar has been included in #TeamIndia squad for the 4th and 5th ODI against Windies.#INDvWI — BCCI (@BCCI) 26 October 2018