మహిళల టీ20 ప్రపంచకప్ 2026 వార్మప్ మ్యాచ్ల్లో టీమిండియా బోణీ కొట్టింది. కార్డిఫ్ వేదికగా విండీస్తో ఇవాళ (జూన్ 8) జరిగిన మ్యాచ్లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. విండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులకే పరిమితమైంది.
భారత ఇన్నింగ్స్లో భారతి ఫుల్మాలి (56 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ (29), స్మృతి మంధన (39), యస్తికా భాటియా (36) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లలో జెమీమా రోడ్రిగ్స్ 7, రిచా ఘోష్ డకౌట్, రాధా యాదవ్ 1, శ్రేయాంక పాటిల్ 2, క్రాంతి గౌడ్ 4, శ్రీ చరణి 2 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ 4 వికెట్లతో సత్తా చాటగా.. కరిష్క రామ్హరాక్, ఆలియా అలెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో ఓపెనర్లు డొట్టిన్ (49), షెర్మైన్ క్యాంప్బెల్ (25) శుభారంభం అందించినా, శ్రేయాంక పాటిల్ (4-0-36-4), రాధా యాదవ్ (4-0-25-3) చెలరేగడంతో విండీస్కు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు మినహా విండీస్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేదు. భారత్ జూన్ 10న జరగే తమ మరో మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడనుంది.


