BCCI Updated Siddarth Kaul Added in the Team India Squad for 3rd IND Vs WI T20 Series in Chennai - Sakshi
Sakshi News home page

మూడో టీ20: సిద్దార్థ్‌ కౌల్‌కు అవకాశం

Nov 9 2018 11:29 AM | Updated on Nov 9 2018 3:07 PM

Siddarth Kaul Returns As India for 3rd T20 - Sakshi

సిద్దార్థ్‌ కౌల్‌

ప్రధాన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు..

ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి భారత్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి ప్రధాన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ విశ్రాంతిని కల్పించింది. అలాగే యువబౌలర్‌ సిద్దార్థ్‌ కౌల్‌కు అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ట్వీట్‌ చేసింది.

రంజీల్లో పంజాబ్‌ తరపున కౌల్‌ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్‌ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్‌.. వన్డేల్లో ఒక్క వికెట్‌ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్‌ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన దృష్ట్యానే సిరీస్‌కు ముందే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోహిత్‌ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement