భారత్‌తో నాలుగో వన్డే : విండీస్‌ ముందు భారీ లక్ష్యం​

India Scored 377 Runs Against West Indies In Fourth One Day - Sakshi

భారత్‌ స్కోర్‌ 377/5

రోహిత్‌, రాయుడు సెంచరీలు

ముంబై : వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ భారీ స్కోర్‌ను సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్‌ 377 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 137 బంతుల్లో 162 పరుగులతో మెరుపు సెంచరీ సాధించగా.. తెలుగు తేజం అంబటి రాయుడు (100) సెంచరీతో కదంతొక్కాడు. గత మూడు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలతో చలరేగిన కెప్టెన్‌ కోహ్లి (16) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు.

భారత్ బ్యాట్సమెన్స్‌లో ధావన్‌ (38) కోహ్లి (16), ధోని (23), జాదవ్‌ (16) నాటౌట్‌ జడేజా (6) నాటౌట్‌ రాణించారు. విండీస్‌ బౌలర్లలో రోచ్ రెండు‌, ఆశ్లే నర్స్, కీమో పాల్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా విండీస్‌ ముందు  378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.  

చదవండి : సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు..

చదవండి : ధావన్‌.. నేను కూడా తొడగొడతా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top