ODI series
-
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
వైభవ్కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. భారత అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.ఇక ఈ ఏడాది ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.శ్రీలంక పర్యటనలోఈ క్రమంలో తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్లో వైభవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్ మ్యాచ్లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.గంటసేపు ఎదురుచూసి మరీఅయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్గా పనిచేసిన అనురా తెనాకూన్.Former great of Sri Lanka and one of the finest batters of the country and the captain of the 1st ever World cup in 1975, Anura Tennekoon met a potential future great Vaibhav Sooryavanshi during the Triangular A team series in Dambulla. pic.twitter.com/xYOWMcO6AM— Roshan Abeysinghe (@RoshanCricket) June 16, 2026ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పేశ్రీలంక- భారత్ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.అతడి బ్యాటింగ్ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.అప్పటికే మ్యాచ్ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడాఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్ నా దగ్గరికొచ్చి.. ‘సర్. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్ పేర్కొన్నారు.కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్.. వైభవ్ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.చదవండి: వైభవ్ను టార్గెట్ చేస్తారా?🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs AFG: కేఎల్ రాహుల్ను పక్కనపెట్టారా?
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ హర్ష్ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు.రాహుల్ లేడుఅయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్లో కుల్దీప్ స్థానాన్ని హర్ష్ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బదులు.. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.అదే విధంగా.. పేస్ దళంలో కీలకమైన అర్ష్దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్కు ముందే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ మ్యాచ్కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.మరోవైపు.. గత మ్యాచ్లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్ యాదవ్ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్, కుల్దీప్లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్దీప్తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.2-0తో సిరీస్ కైవసంఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చదవండి: వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
ఇంగ్లండ్ సిరీస్కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్తో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్కప్ రోడ్మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హష్మతుల్లా సింగిల్కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్లో.. హష్మతుల్లా షాహిది సింగిల్కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే..
శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్తో పాటు వైభవ్కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.ఇక భారత్తో ఫైనల్కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా! -
IND vs AFG: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్తో నామమాత్రపు మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.సిరీస్ కైవసంకాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.రెండో వన్డేకు దూరంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.సెలక్షన్కు అందుబాటులో ఉన్నాడుఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్కు దంబుల్లా వేదిక. -
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
అఫ్గానిస్తాన్తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.రెండో వన్డేకు మూడు మార్పులుకాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.అయితే, రెండో మ్యాచ్కు హర్ష్ దూబే దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఆడాడు. అదే విధంగా నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి..ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. అఫ్గాన్తో మూడో వన్డేలో అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి.. నితీశ్ రెడ్డిని ఆడించాలని సూచించాడు.ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్ కోసం అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినివ్వాలి.ఏదేమైనా విరాట్ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్ను పక్కనపెట్టే వీలులేదు. పేస్ దళంలో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్లను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.చదవండి: భారత క్రికెట్కు గుడ్బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్ -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 154 పరుగులతో బ్యాటర్గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- ‘ఎ’తో బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నెట్రన్రేటు భారీగా మెరుగుపరుచుకుని ఫైనల్ చేరుకుంది.వరుసగా రెండు ఓటములుశ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో భారత్- ‘ఎ’, అఫ్గాన్ - ‘ఎ’ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకపై గెలిచిన భారత్.. తదుపరి మ్యాచ్లో అఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడగా.. సూపర్ ఓవర్లో తిలక్ వర్మ సేనకు భంగపాటే ఎదురైంది.319 పరుగులుఈ క్రమంలో ఫైనల్ రేసులో నిలవాలంటే అఫ్గాన్పై బుధవారం నాటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది.ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (58)తో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (38) ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (59), వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర (58) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.సూర్యాంశ్ షెడ్గే (7) విఫలం కాగా.. నిశాంత్ సింధు (21 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (30) మెరుగ్గా రాణించారు. ఫలితంగా భారత్ మంచి స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫర్మానుల్లా సఫీ రెండేసి వికెట్లు కూల్చగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చెలరేగిన నిశాంత్ సింధుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాపార్డర్లో ఓపెనర్ హసన్ ఐసాఖిల్ (14), వన్డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. మరో ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (46), బహీర్ షా (57) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మహ్మద్ ఇషాక్ (16), ఫర్మానుల్లా సఫీ (17లతో పాటు షామ్స్ ఉర్ రహ్మాన్ (8), అబ్దుల్లా అహ్మద్జాయ్ (6), జహీర్ ఖాన్ (4) భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కట్టారు.ఫైనల్కు దూసుకువెళ్లిన భారత్ఈ క్రమంలో 36.5 ఓవర్లలో 218 పరుగులకే అఫ్గానిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ రెండు, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్రన్రేటు +0.797. మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్లో శ్రీలంక- అఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గెలిచిన జట్టు భారత్తో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ శుబ్మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్పై భారత్ భారీ స్కోరు -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్లో మరోసారి ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
వైభవ్ సూర్యవంశీ విషయంలో మరో వివాదం!
తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగిన ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ చిచ్చర పిడుగు బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 12 బంతుల్లో మూడు ఫోర్లు బాదిన వైభవ్ కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆ ఒక్క మ్యాచ్లోనే మెరుపులుఇక అఫ్గనిస్తాన్- ‘ఎ’తో మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది ఫోర్ల సాయంతో 44 పరుగులతో రాణించాడు. అనంతరం శ్రీలంక- ‘ఎ’తో వన్డేలో 21 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి వన్డేలోనూ పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు.పరుగుల ఖాతా తెరవకముందే.. ప్రియాన్ష్ ఆర్య (58)కు జోడీగా ఓపెనర్గా వచ్చిన వైభవ్.. 28 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. నిజానికి ఈ లెఫ్టాండర్ బ్యాటర్ పరుగుల ఖాతా తెరవకముందే.. అవుటయ్యేవాడు. రెండో ఓవర్ రెండో బంతికి వైభవ్ ఇచ్చిన క్యాచ్ను అఫ్గన్ ఫీల్డర్ ఫరీదూన్ దావూద్జాయ్ గాల్లోకి ఎగిరిమరీ ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు.బతికిపోయిన బుడ్డోడుదీంతో ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వగా.. వైభవ్ మైదానం వీడేందుకు సిద్ధమయ్యాడు. అయితే, రీప్లేలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ గమనించినపుడు బంతిలోని కొంతభాగం నేలకు తాకినట్లుగా ఉందని చెబుతూ థర్డ్ అంపైర్ వైభవ్ను నాటౌట్గా ప్రకటించాడు. దీంతో అఫ్గనిస్తాన్ ప్లేయర్లు తెల్లముఖాలు వేయగా.. వైభవ్కు లైఫ్ లభించింది.అయినప్పటికీ వైభవ్ తన ఆట తీరును మార్చుకోలేదు. మూడో ఓవర్ నాలుగో బంతికి కూడా ఇలాగే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని రెండో అవకాశం పొందాడు. కానీ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫరీదూన్ దావూద్జాయ్ బౌలింగ్లో ఖలీద్ తనీవాల్కు క్యాచ్ ఇచ్చి వైభవ్ వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.థర్డ్ అంపైర్ నిర్ణయంపై వివాదంవైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. స్పష్టంగా అవుట్ అని తెలిసినా.. థర్డ్ అంపైర్ పదే పదే పరిశీలించి ఆఖరికి వైభవ్కు అనుకూలంగా తీర్పునివ్వడం సరికాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో వైభవ్ ఆట తీరును విమర్శిస్తూ.. ‘ ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.. నువ్విక మారవా బుడ్డోడా’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్రీలంకతోమ్యాచ్ సందర్భంగా వైభవ్ సహనం కోల్పోయిన సంగతి తెలిసిందే.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐVaibhav survives the scare! Third umpire says NOT OUT 😮💨Watch #TalentTVCup LIVE on #SonyLIV & #SonySportsNetwork 📺 pic.twitter.com/txOaxjXdx3— Sony LIV (@SonyLIV) June 17, 2026 -
చరిత్రకు అడుగుదూరంలో గిల్.. రోహిత్ను ఊరిస్తున్న రికార్డు!
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచిన టీమిండియా రెండో విజయంతో పాటు సిరీస్ గెలుపుపై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో లక్నో వేదికగా ఇవాళ రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గిల్ తప్పిదంతో రనౌట్ అయిన సీనియర్ క్రికెటర్, ఓపెనర్ రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఆఫ్గన్తో రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 10 పరుగులు చేస్తే లిస్ట్-ఏ క్రికెట్లో 14వేల పరుగులు మైలురాయిని అందుకోనున్నాడు. ఇక కెప్టెన్గా శుబ్మన్ గిల్ కూడా ఒక అరుదైన ఫీట్కు అడుగు దూరంలో ఉన్నాడు. వన్డే కెప్టెన్గా గిల్కు ఇదే మొదటి సిరీస్. ఇప్పటికే టీమిండియా తొలి వన్డే గెలిచింది. రెండో వన్డేలోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ వశం కానుంది. ఈ క్రమంలో స్వదేశంలో తొలి వన్డే సిరీస్ గెలిచిన కెప్టెన్గా గిల్ నిలవనున్నాడు. ఇక రెండో వన్డేకు కుల్దీప్ యాదవ్, జైస్వాల్కు చోటు దక్కే అవకాశముందని ఇప్పటికే గిల్ ప్రకటించాడు. ఇక తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గిల్ అజేయ ఇన్నింగ్స్కు తోడు కేఎల్ రాహుల్ దనాధన్ ఇన్నింగ్స్తో టీమిండియా సులువుగానే గెలిచింది. అయితే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ విజయంతో ఆ అంశం పెద్దగా ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అన్ని విభాగాల్లో రాణించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (102) సెంచరీ సాధించాడు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గిల్ (84 నాటౌట్), కేఎల్ రాహుల్ (39 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.Read: కాన్వేకు ప్రమోషన్.. కివీస్ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే! -
IND vs AFG: రెండో వన్డేలో భారత్ ఘన విజయం
భారత్ గ్రాండ్ విక్టరీలక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. 403 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు.అఫ్గాన్ ఎనిమిదో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సలీమ్ సఫీ.. గుర్నూర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.అఫ్గాన్ ఏడో వికెట్అఫ్గాన్ ఏడో వికెట్ కోల్పోయింది. ఘజన్ఫర్ అర్ష్ దీప్ బౌలింగ్లో ఔటయ్యాడు.అఫ్గాన్ ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రషీద్ ఖాన్.. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఔటయ్యాడు. అఫ్గాన్ స్కోర్: 190/6అఫ్గానిస్తాన్ ఐదో వికెట్అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖరోటి.. ప్రిన్స్ యాదవ్ క్లీన్ బౌల్డయ్యాడు. అఫ్గాన్ 31 ఓవర్లకు స్కోర్: 182/5అఫ్గాన్ నాలుగో వికెట్ డౌన్అఫ్గాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కెప్టెన్ షాహిది.. గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో ఔటయ్యాడు.మూడో వికెట్ డౌన్అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. సెదీఖుల్లా(42).. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.20 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 105-2సెదీఖుల్లా 28, రహ్మత్ షా 14 పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ డౌన్13.1: అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (21). రహ్మత్ షా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 76-2(13.4).పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 62-1 (10)సెదీఖుల్లా 5, ఇబ్రహీం జద్రాన్ 15 పరుగులతో ఉన్నారు.అఫ్గానిస్తాన్ తొలి వికెట్ డౌన్52 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన గుర్బాజ్.. గుర్నూర్ బౌలింగ్లో ఔటయ్యాడు.403 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ఐదు ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 32-0రహ్మానుల్లా గుర్బాజ్ 26, ఇబ్రహీం జద్రాన్ 6 పరుగులతో ఉన్నారు.టీమిండియా భారీ స్కోరుకెప్టెన్ శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ 48 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో శ్రేయస్ అయ్యర్ (26) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆలౌట్ అయింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా48.5: రషీద్ ఖాన్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ అవుట్ (19).ఎనిమిదో వికెట్ డౌన్47.6: ఘజన్ఫర్ బౌలింగ్లో రషీద్కు క్యాచ్ ఇచ్చి అర్ష్దీప్ సింగ్ (3) అవుట్. క్రీజులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్. స్కోరు: 392-8.టీమిండియా ఏడో వికెట్ డౌన్టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన గుర్నూర్ బ్రార్.. రషీద్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. స్కోరు: 387-7 (47).ఆరో వికెట్ డౌన్44.3: ఖరోటి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (26) ఆరో వికెట్గా వెనుదిరిగాడు. గుర్నూర్ బ్రార్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 373-6 (45).43 ఓవర్లలో టీమిండియా స్కోరు: 361-5ఐదో వికెట్ డౌన్42.3: ఖరోటి బౌలింగ్లో ఐదో వికెట్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్. క్రీజులోకి వాషింగ్టన్ సుందర్గిల్ అవుట్42.3: ఖరోటి బౌలింగ్లో 154 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఘజన్ఫర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన శుబ్మన్ గిల్. క్రీజులోకి కేఎల్ రాహుల్.40 ఓవర్లలో టీమిండియా స్కోరు: 340-3శ్రేయస్ అయ్యర్ 7, గిల్ 146 పరుగులతో ఉన్నారు.భారత్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 పరుగులు చేసిన కిషన్.. ఖరోటి బౌలింగ్లో ఔటయ్యాడు. 37 ఓవర్లలో టీమిండియా స్కోరు 322-3. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.ఇషాన్ మెరుపు సెంచరీలక్నో వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. కేవలం 71 బంతుల్లోనే తన రెండో వన్డే సెంచరీ మార్క్ను ఇషాన్ అందుకున్నాడు.శతక్కొట్టిన గిల్32.1: 77 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో శుబ్మన్ గిల్ సెంచరీ. 32 ఓవర్లలో టీమిండియా స్కోరు 245-2. ఇషాన్ 91 పరుగులతో ఉన్నాడు.30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-2ఇషాన్ 70, గిల్ 96 పరుగులతో ఉన్నారు.ఇషాన్ అర్ధ శతకం27.5: హష్మతుల్లా బౌలింగ్ ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్. స్కోరు: 193-2.20 ఓవర్లలో టీమిండియా స్కోరు: 136-2గిల్ 71, ఇషాన్ కిషన్ 11 పరుగులతో ఉన్నారు.గిల్ హాఫ్ సెంచరీ16.1: ఖరోటి బౌలింగ్లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.రోహిత్ శర్మ అవుట్13.1: అర్ధ శతకానికి చేరువైన ఓపెనర్ రోహిత్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మొత్తంగా 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు బాది 48 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ మ్యాచ్సందర్భంగా రోహిత్ లిస్ట్-ఎ క్రికెట్లో 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. గిల్ 42 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 96-2(13.1)పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 80-1గిల్ 31, రోహిత్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా హాఫ్ సెంచరీ.. స్కోరు: 50-1(6.1)గిల్ 22, రోహిత్ 21 పరుగులతో ఉన్నారు.ఐదు ఓవర్లలో టీమిండియా స్కోరు: 42-1(5)గిల్ 18, రోహిత్ 18 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా1.6: సలీమ్ సఫీ బౌలింగ్లో ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన యశస్వి జైస్వాల్. చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చి నిరాశపరిచిన జైసూ. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేసి అవుట్. సలీమ్ ఖాతాలో తొలి వన్డే వికెట్గా జైసూ. గిల్ క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 4 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 9-1 (2).ప్రిన్స్ యాదవ్ అరంగేట్రంఊహించిందే నిజమైంది. అఫ్గనిస్తాన్తో రెండో వన్డే సందర్భంగా యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్కు తుదిజట్టులో చోటు ఇచ్చింది.ఇక ప్లేయింగ్ ఎలెవన్లో మొత్తంగా మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ను ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా తొలి వన్డేలో ఆడిన ప్రసిద్ కృష్ణతో పాటు అరంగేట్ర స్పిన్నర్ హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలను ఈ మ్యాచ్ నుంచి తప్పించారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్అఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఏఎమ్ ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ సఫీ, బిలాల్ సమీ. -
IND vs AFG: రెండో వన్డే.. భారత తుదిజట్టు ఇదే
టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉంది. ఇరుజట్ల మధ్య ధర్మశాలలో శనివారం తొలి వన్డే జరిగింది. వర్షం ఆటంకం కలిగించగా ఈ మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు.గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీఈ క్రమంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ విధ్వంసకర సెంచరీ (51 బంతుల్లో 102) కారణంగా ఈ మేరకు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అరంగేట్ర కుర్రాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే తలా మూడు వికెట్లు పడగొట్టారు.గిల్ అజేయ అర్ధ శతకంమిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు కూల్చారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ అజేయ అర్ధ శతకం (84)తో రాణించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.లక్నో వేదికగా..ఇక టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు లక్నో ఆతిథ్యం ఇస్తుండగా.. గిల్ సేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత తుదిజట్టులో ఒక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రసిద్ కృష్ణను తప్పించి మరో బౌలర్ను అరంగేట్రం చేయించనున్నట్లు సమాచారం.యార్కర్ల స్పెషలిస్టు అరంగేట్రంఅఫ్గన్తో తొలి వన్డేలో ప్రసిద్ ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 35 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై వేటు వేసి.. పేస్ దళంలోకి యార్కర్ల స్పెషలిస్టు ప్రిన్స్ యాదవ్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ అఫ్గన్తో సిరీస్ సందర్భంగా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.గత మ్యాచ్లో డెబ్యుడెంట్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించగా.. ఈసారి ప్రిన్స్కు కూడా వన్డే క్యాప్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ప్రిన్స్ యాదవ్ ఇప్పటికి 20 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 19 వికెట్లు కూల్చాడు.అఫ్గనిస్తాన్తో రెండో వన్డేకు భారత తుదిజట్టు (అంచనా)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ
గత కొన్నాళ్లుగా తన ఆట తీరుతో హాట్టాపిక్గా మారిన భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. భారత్- ‘ఎ’ జట్టు తరఫున శ్రీలంక పర్యటనలో ఉన్న ఈ పిల్లాడు.. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.సూపర్ ఓవర్లో లంక విజయంఇందులో భాగంగా శ్రీలంక- ‘ఎ’ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో శ్రీలంక భారత్- ‘ఎ’ జట్టుపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది.నువ్వు ఇక ఇంటికి వెళ్లుఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్ హలంబగే.. భారత ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్లు’’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. అతడిపైకి దూసుకెళ్లాడు. విశేన్ను వెనక్కి నెట్టేయగా.. అతడూ వైభవ్ను తోసేశాడు.ఇంతలో లంక సీనియర్ ప్లేయర్ డిక్విల్లా ఇద్దరినీ విడదీసి.. వైభవ్ను అక్కడి నుంచి పంపించాడు. అయితే, వైభవ్ వెళ్తూ వెళ్తూ వేలు చూపించి బెదిరించినట్లు కనిపించింది. ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఇది అనధికారిక మ్యాచ్ కాబట్టి ఐసీసీ పెద్దగా చర్యలు తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.స్పందించిన బీసీసీఐఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా వైభవ్ సూర్యవంశీ వివాదం గురించి స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియా- ‘ఎ’ జట్టు కీలక టోర్నమెంట్ ఆడుతోంది. వర్దమాన క్రికెటర్లు టీమిండియాలోకి వచ్చేందుకు ఇదొక మంచి అవకాశం.ముక్కోణపు వన్డే సిరీస్ రూపంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశం దొరికింది. కాబట్టి వాళ్లంతా కేవలం ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరత్రా విషయాలను పట్టించుకోకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది.ఆటపైనే దృష్టి పెట్టండిఅక్కడికి ఎందుకు వెళ్లారో ఆ విషయంపై మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతి ఒక్కరు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ట్రై సిరీస్లో ఇండియా విజేతగా నిలవగలదు. మా దృష్టి మొత్తం విజయం మీదే కేంద్రీకృతమై ఉంది. ఆటగాళ్లు అందుకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని దేవజిత్ సైకియా పరోక్షంగా భారత క్రికెటర్లను హెచ్చరించాడు.కాగా ఈ మ్యాచ్ సందర్భంగా సూపర్ ఓవర్ విషయంలో కెప్టెన్ తిలక్ వర్మ సైతం అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. లంక, భారత్తో పాటు అఫ్గనిస్తాన్ కూడా ఈ ట్రై సిరీస్లో భాగమైంది. భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి రెండు ఓడిపోయింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. -
పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదు.. వైభవ్పై సంచలన వ్యాఖ్యలు
అతి పిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో అలరిస్తూ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్.. ఏకంగా 776 పరుగులు సాధించాడు.పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి పదిహేనేళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్ టీమిండియాకు కూడా ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టీ20 జట్టులో అతడికి స్థానం దక్కింది.ముక్కోణపు వన్డే సిరీస్లోఇక ప్రస్తుతం భారత్- ‘ఎ’ తరఫున వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. భారత్, లంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. అయితే, సోమవారం శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయాడు. సూపర్ ఓవర్లో విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్, సూర్యాంశ్ షెడ్గేలను ఉద్దేశించి ఏదో అన్నాడు.దీంతో వైభవ్, సూర్యాంశ్ లంక ప్లేయర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పరస్పరం నెట్టేసుకున్నారు. లంక ఆటగాడి ఛాతీపై చేయి వేసి వైభవ్ వెనక్కి నెట్టాడు. అంతేకాదు వెళ్తూ వెళ్తూ వేలు చూపిస్తూ బెదిరించినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026వైభవ్ ప్రవర్తనపై విమర్శలుఈ నేపథ్యంలో వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. చిన్న వయసులో ఇంత దూకుడు పనికిరాదని.. కాస్త ఓర్పుతో ఉండాలని మాజీ క్రికెటర్లు సద్విమర్శలు చేస్తున్నారు. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియా మాజీ మేనేజర్ బ్రేన్ థామస్ మాత్రం శ్రుతిమించాడు. సూర్యవంశీతో పాటు భారత ప్రజల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు.పల్లెటూరోడు!.. పెంపకం సరిగ్గా లేదంటూ ఓవరాక్షన్‘‘సూర్యవంశీ.. అతడి చెత్త కోపానికి సంబంధించిన ఫుటేజీని ఇప్పుడే చూశాను. క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు లేకపోవడం విచారకరం. ఒకవేళ మ్యాచ్ రిఫరీ గనుక ఈ కౌబాయ్ను తదుపరి మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తే బాగుంటుంది.అప్పుడే ఎలా ప్రవర్తించాలో అతడికి తెలిసి వస్తుంది. అయినా.. ఇండియాలోని గ్రామానికి చెందిన పిల్లాడి నుంచి ఇంతకంటే ఎక్కువగా ఏం ఆశించగలము? శ్రీలంకలో మాదిరి అక్కడి పిల్లల పెంపకం అంత గొప్పగా ఏమీ ఉండదు.హేయ్ సూర్యవంశీ నువ్వు గనుక సంతోషంగా లేకుంటే.. ఇండియాలో నిన్ను పొగుడుతూ నెత్తికెక్కించుకునే వాళ్ల దగ్గరికి వెళ్లిపో. మీ ఇంటికి పో. ఇది జెంటిల్మెన్ గేమ్’’ అంటూ బ్రేన్ థామస్ పరుష పదజాలంతో వైభవ్ను కించపరిచాడు. దీంతో భారత నెటిజన్లు సైతం థామస్కు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. ‘స్పెల్లింగ్ సరిగా రాయడం రాని నువ్వు చదువు గురించి మాట్లాడుతున్నావా? 15 ఏళ్ల పిల్లాడిపై ఇంత విషం చిమ్ముతావా?’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ఈ సిరీస్లో వైభవ్ ఇప్పటికి మూడు మ్యాచ్లలో వరుసగా.. 14, 44, 21 పరుగులు చేశాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లు!భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అక్కసు -
వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు చిక్కుల్లో పడింది. ఇప్పటికి మూడు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ సేన.. రెండింట ఓడిపోయింది. తొలుత అఫ్గనిస్తాన్ -‘ఎ’ చేతిలో ఓడిన భారత జట్టు.. సోమవారం నాటి పోరులో లంక చేతిలో పరాజయం పాలైంది.దంబుల్లా వేదికగా ఈ మ్యాచ్లో ఇరుజట్లు 265 పరుగులు చేయగా.. మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత్ అనూహ్య రీతిలో ఓడిపోయింది. అయితే, వెలుతురులేమి కారణంగా తొలుత సూపర్ ఓవర్ నిర్వహించడం సాధ్యం కాదని అంతా భావించారు.వెలుతురులేమి సమస్యభారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ సైతం ఇదే విషయంపై అంపైర్లతో వాదించినట్లు సమాచారం. కానీ వెలుతురు మరీ తగ్గిపోతే సూపర్ ఓవర్ మొదలైనప్పటికీ మ్యాచ్ నిలిపివేస్తామని అంపైర్లు భారత శిబిరానికి చెప్పినట్లు క్రిక్బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే, తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేయగా.. భారత్ లక్ష్య ఛేదనకు దిగిన సమయంలో మరింతగా చీకటి అలుముకుంది.కొట్టుకోవడం ఒక్కటే తక్కువఅయినప్పటికీ సూపర్ ఓవర్ నిర్వహించగా.. భారత జట్టు ఓటమిపాలైంది. ఆద్యంతం ఆసక్తిరేపిన ఈ మ్యాచ్లో సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో శ్రీలంక ఆటగాళ్లు వ్యవహరించిన తీరు.. అందుకు వైభవ్ బదులిచ్చిన విధానం విమర్శలకు దారితీసింది.వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు!వైభవ్- శ్రీలంక ఆటగాళ్లు పరస్పరం మీదమీదకు వెళ్తూ కొట్టుకున్నంత పనిచేశారు. అయితే, వారి మధ్య గొడవకు కారణం ఏమిటన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. శ్రీలంక ప్లేయర్ విశేన్ హలంబగే వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి.. ‘‘మ్యాచ్ అయిపోయింది.. ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అన్నట్లు సమాచారం.దీంతో కోపోద్రిక్తుడైన వైభవ్.. ‘‘ఏమంటున్నావు’’ అంటూ మీదకు వెళ్లగా ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఆ తర్వాత లంక సీనియర్ ప్లేయర్ ఒకరు వచ్చి ఇద్దరినీ విడదీశారు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. అయితే, ఈ విషయం గురించి శ్రీలంక డ్రెసింగ్రూమ్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.క్షమాపణ అడుగుదాం!చీకటి పడిన తర్వాత కూడా సూపర్ ఓవర్లో ఆడేందుకు సహకరించిన భారత జట్టుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు.. వైభవ్ విషయంలో జరిగినదానికి క్షమాపణలు కోరాలనే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లాయి.చదవండి: 29 బంతుల్లోనే సెంచరీ చేసిన చహల్🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
అంపైర్లతో తిలక్ వర్మ, వైభవ్ వాగ్వాదం.. తిలక్ను తోసేసి..
భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంపైర్లతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది.దంబుల్లా వేదికగా గురువారం అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టు చేతిలో ఓడిన భారత్.. సోమవారం శ్రీలంక చేతిలోనూ ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది.అయితే, శ్రీలంక ఇన్నింగ్స్లో ఆఖరి బంతిని ఎదుర్కొన్న గుణశేఖర బాల్ను ఫ్లిక్ చేయకుండానే.. సింగిల్ తీసి రనౌట్ అయ్యాడు. దీంతో స్కోరు సమం కాగా.. భారత శిబిరం మాత్రం ఆ పరుగును ఎలా పరిగణిస్తారని అంపైర్లను ప్రశ్నించింది. మరోవైపు.. సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా అప్పటికే చీకటి పడిపోయింది.ఈ నేపథ్యంలో కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. గుణశేఖర బంతిని బాదనపుడు తొలి పరుగును ఎలా లెక్కలోకి తీసుకుంటారని వాదించినట్లు కనిపించింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ కూడా తిలక్కు మద్దతుగా వచ్చి నిలబడ్డాడు.Vaibhav Sooryavanshi sending off Captain Tilak Varma from arguing with Umpire.pic.twitter.com/067cYfhmo2— Maina Singh (@Maina_Singhx77) June 15, 2026అయితే, కాసేటికే తిలక్ను సముదాయించినట్లు వెనక్కి నెడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో తిలక్ బంతిని అర్షద్ ఖాన్కు ఇవ్వగా.. లంక కెప్టెన్ సహన్ అరాచిగే తొలి బంతికే రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతి వైడ్కాగా.. తదుపరి మరో సింగిల్ వచ్చింది.మూడో బంతికి అవిష్క ఫెర్నాండో సింగిల్ తీయగా.. నాలుగో బంతికి అరాచిగే మూడు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని ఫెర్నాండో సిక్సర్గా మలచగా.. ఆరో బంతి నోబాల్ అయింది. దీంతో ఫ్రీ హిట్ రాగా.. మొత్తంగా లంక 16 పరుగులు చేసింది. అయితే, నోబాల్ విషయంలో కూడా తిలక్ వర్మ వాదనకు దిగాడు. అనంతరం భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే బ్యాటింగ్కు దిగగా.. భారత్కు ఓటమే ఎదురైంది. A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026చదవండి: శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. వీడియో వైరల్ -
శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్.. కోపంతో ఊగిపోతూ..
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఆతిథ్య శ్రీలంక- ‘ఎ’- భారత్ -‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. దంబుల్లాలో సోమవారం టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్కు దిగింది. లంక బౌలర్ల ధాటికి 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.మ్యాచ్ ‘టై’ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాల వల్ల భారత్కు ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. అయితే, విప్రాజ్ నిగమ్ పిచ్ మధ్యభాగంలో రెండుసార్లు పరిగెత్తడం వల్ల భారత్కు పది పరుగుల పెనాల్టీ పడింది. దీంతో 10/0తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేసింది.ఫలితంగా మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 పరుగులు చేసింది. అనంతరం భారత్ తరఫున బ్యాటింగ్కు దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. తొలి బంతికి సూర్యాంశ్ రెండు పరుగులు తీయగా.. తర్వాత పరుగేమీ రాలేదు.భారత్ ఓటమిఆ తర్వాత వైభవ్ రెండు పరుగులు తీయగా.. మరుసటి బంతికి ఫోర్ బాదాడు. ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. వైభవ్ పరుగులేమీ తీయలేకపోయాడు. దీంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ క్రమంలో వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్న శ్రీలంక ప్లేయర్లలో ఎవరో వైభవ్ను ఏదో అన్నట్లుగా కనిపించింది.శ్రీలంక ప్లేయర్ను నెట్టేసిన వైభవ్దీంతో కోపంతో శ్రీలంక ఆటగాళ్లపై దూసుకువెళ్లిన పదిహేనేళ్ల వైభవ్ వారిని నెట్టేశాడు. ఇంతలో అంపైర్, సూర్యాంశ్ వచ్చి అతడిని వారి నుంచి విడదీశారు. ఆ తర్వాత కూడా వైభవ్ చేయి చూపిస్తూ కోపంతో ఊగిపోతూ మైదానం వీడాడు. అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. వైభవ్ దూకుడుగా వ్యవహరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులు.. హైడ్రామా🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
IND vs SL: నరాలు తెగే ఉత్కంఠ.. ట్విస్టులే ట్విస్టులు.. ఆఖరికి
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలుత అఫ్గనిస్తాన్ చేతిలో ఓడిన భారత జట్టు తాజాగా.. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలోనూ పరాజయం పాలైంది.ముక్కోణపు వన్డే సిరీస్కాగా శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య జూన్ 9న ముక్కోణపు వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్లో శ్రీలంకపై భారత్ 8 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో అఫ్గనిస్తాన్ భారత్పై 4 పరుగుల తేడాతో గట్టెక్కింది.ఇక మూడో మ్యాచ్లో శ్రీలంక అఫ్గనిస్తాన్పై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించగా.. నాలుగో మ్యాచ్లో భాగంగా సోమవారం భారత్- శ్రీలంక రెండోసారి తలపడ్డాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు.. తిలక్ వర్మ సేన తొలుత బ్యాటింగ్కు దిగింది.265 పరుగులు చేసి ఆలౌట్గత మ్యాచ్లో ఆకట్టుకున్న భారత ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) ఈసారి నిరాశపరిచారు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 37 పరుగులకే పరిమితం కాగా.. కెప్టెన్ తిలక్ వర్మ కేవలం 23 పరుగులే చేశాడు. ఆయుశ్ బదోని 15, నిశాంత్ సింధు 6, అనుకుల్ రాయ్ 8, అర్షద్ ఖాన్ 2 పరుగులు చేసి నిష్క్రమించారు.అయితే, ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే 66 బంతుల్లో 72, విప్రాజ్ నిగమ్ 49 బంతుల్లో 51 పరుగులు సాధించి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి అర్ద శతకాల కారణంగా భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.పది పరుగుల పెనాల్టీశ్రీలంక బౌలర్లలో విజయకాంత్ వియస్కాంత్, మొహ్మద్ షిరాజ్ చెరో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. కెప్టెన్ సహన్ అరాచిగే, వనుజా సహన్, కుగాతస్ మతూలన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అయితే, విప్రాజ్ నిగమ్ పరుగులు తీసే క్రమంలో రెండుసార్లు పిచ్ మధ్యభాగంలోకి వచ్చాడు. దీంతో భారత జట్టుకు పది పరుగుల పెనాల్టీ పడింది.Not every day you see 5 runs off a helmet hit😅 Watch #SLvIND in the #TalentTVCup, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV 📺 #SonySportsNetwork #SonyLIV #TeamIndia pic.twitter.com/2db4eMFJpL— Sony Sports Network (@SonySportsNetwk) June 15, 2026ఫలితంగా శ్రీలంక 10/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే, బౌలింగ్ సమయంలో బంతి వికెట్ కీపర్ హెల్మెట్కు తాకడంతో శ్రీలంకకు కూడా పెనాల్టీ పడింది.ఇదిలా ఉంటే.. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు నిరోషన్ డిక్విల్లా (37), అవిష్క ఫెర్నాండో (22) మెరుగైన ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ విశేన్ హలంబగే (17) విఫలమయ్యాడు. కెప్టెన్ సహన్ అరాచిగే 8 పరుగులకే నిష్క్రమించగా.. అహాన్ విక్రమసింఘే 6 పరుగులు చేసి అవుటయ్యాడు.ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ సదీర సమరవిక్రమ ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా వనుజా సహన్ (25) రాణించగా.. విజయకాంత్ వియస్కాంత్ 39 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు.నరాలు తెగే ఉత్కంఠఇక 47 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఏడు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేయగా.. విజయానికి 18 బంతుల్లో 18 పరుగులు అవసరమయ్యాయి. అప్పటికి సదీర సమరవిక్రమ 104 బంతుల్లో 88 పరుగుల వద్ద ఉన్నాడు.ఈ క్రమంలో 48వ ఓవర్లో ఆరు పరుగులు రాగా.. శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సదీర ఆచితూచి ఆడాడు. ఇలాంటి తరుణంలో యశ్ ఠాకూర్ నోబాల్తో 48వ ఓవర్ ఆఖరి బంతికి లంకకు ఫ్రీహిట్ రాగా.. గుణశేఖర ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. అర్షద్ ఖాన్ బంతితో రంగంలోకి దిగాడు.తొలి బంతికి పరుగులేమీ ఇవ్వని.. అర్షద్ రెండో బంతికి సదీర సమరవిక్రమను బౌల్డ్ చేశాడు. దీంతో 93 పరుగుల వద్ద సదీర నిష్క్రమించగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులుగా లంక విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షిరాజ్ మూడో బంతికి సింగిల్ తీయగా.. ఆ తర్వాత గుణశేఖర సైతం సింగిల్ పూర్తి చేశాడు.దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరం కాగా.. అర్షద్పై ఒత్తిడి పెరిగింది. ఐదో బంతికి షిరాజ్ సింగ్ తీయడంతో సమీకరణం ఆఖరి బంతికి రెండు పరుగులుగా మారింది. అయితే, ఆఖరి బంతికి పరుగు తీసిన గుణశేఖర రెండో పరుగు కోసం రాగా.. రనౌట్ అయ్యాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి.సూపర్ ఓవర్ ముగిసిందిలా..అయితే, గుణశేఖర షాట్ ఆడినట్లు కనిపించలేదని.. బంతి ఫ్లిక్ అయి కీపర్ వైపు వెళ్లింది కాబట్టి దీనిని రన్గా పరిగణించవద్దని భారత శిబిరం కోరగా.. ప్రతికూల నిర్ణయమే వచ్చింది. ఇక ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి ఉండగా.. వెలుతురులేమి సమస్యగా మారింది. అయినప్పటికీ సూపర్ కోసం పట్టుపట్టగా.. ఫ్లడ్లైట్లు లేకుండానే శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగింది.భారత కెప్టెన్ తిలక్ వర్మ అర్షద్ ఖాన్ చేతికి బంతినివ్వగా.. వైడ్, నోబాల్ రూపంలో భారత్ మూల్యం చెల్లించింది. శ్రీలంక 16 పరుగులు చేసింది. అయితే, నోబ్ విషయంలో తిలక్ వర్మ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కానీ మ్యాచ్ కొనసాగింది. 17 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 పరుగులే చేయడంతో ఓటమి ఖరారైంది. -
IND vs AFG: ‘టీమిండియా సెలక్టర్ల నిర్ణయం సరైందే’
టీమిండియా సెలక్టర్లపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. విమర్శలకు బెదరకుండా సరైన ఆటగాడినే జట్టుకు ఎంపిక చేశారని కొనియాడాడు. టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆకిబ్ నబీకి మొండిచేయి అంతకుముందు అఫ్గన్తో ఏకైక టెస్టు ఆడింది శుబ్మన్ గిల్ సేన. ఈ మ్యాచ్కు ఎంపిక చేసిన జట్టులో గుర్నూర్ బ్రార్కు చోటు ఇచ్చారు సెలక్టర్లు. రంజీ ట్రోఫీ 2025-26లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి మాత్రం మొండిచేయి చూపారు.ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించి.. అతడికి బదులు గుర్నూర్ను ఎంపిక చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. రంజీల్లో ఒకే సీజన్లో అరవైకి పైగా వికెట్లు సాధించినా ఆకిబ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు తలెత్తాయి.వన్డేతో అరంగేట్రంఇక అఫ్గన్తో టెస్టు మ్యాచ్లో గుర్నూర్ బ్రార్కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అయితే, ధర్మశాల వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. ఈ పేస్ బౌలర్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే కూడా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇద్దరూ రాణించారుఇక తన తొలి ఓవర్లోనే వికెట్ తీసిన గుర్నూర్ బ్రార్.. మొత్తంగా 4.5 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు.. హర్ష్ దూబే ఐదు ఓవర్ల కోటా పూర్తి చేసి 47 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సెలక్టర్ల నిర్ణయం సరైందేఈ నేపథ్యంలో అశ్విన్ సెలక్టర్ల నిర్ణయాన్ని సమర్థించాడు. ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ను ఎంపిక చేసి మంచి పనిచేశారన్నాడు. ఈ మేరకు.. ‘‘గుర్నూర్ బ్రార్ తొలి మ్యాచ్లోనే తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడు పొడుగ్గా ఉంటాడు. బలంగా కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాడు.ప్రతీ బంతిని గంటకు 145కు కిలోమీటర్ల వేగంతో సంధించాడు. అతడి బౌలింగ్ నైపుణ్యం, శైలి.. బంతిని స్వింగ్ చేసే విధానం అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా కొత్త బంతితో అద్భుతంగా ఆడాడు. అతడు ఇంకా వేగంగా కూడా బౌలింగ్ చేయగలడు.సెలక్టర్లు ఆకిబ్ నబీని కాదని గుర్నూర్ ఎంపిక చేసినపుడు చాలా మంది విమర్శించారు. అయితే, వారి నిర్ణయం సరైందే. వాళ్లిద్దరి మధ్య పోలిక ఇక్కడ అనవసరం. గుర్నూర్ ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు, కోచ్లను తప్పక అభినందించాల్సిందే.భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గాఒకవేళ అతడు ఫిట్గా ఉండి.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. భారత పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారగలడు. భవిష్యత్తులో టీమిండియా స్టార్ బౌలర్గా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని అశ్విన్.. 26 ఏళ్ల గుర్నూర్ బ్రార్తో పాటు సెలక్టర్లను ప్రశంసించాడు. అదే విధంగా.. హర్ష్ దూబే సైతం మున్ముందు జట్టుకు బాగా ఉపయోగపడతాడని అశూ అభిప్రాయపడ్డాడు. కాగా వర్షం వల్ల తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించగా.. భారత్ అఫ్గన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.చదవండి: 29 బంతుల్లోనే చహల్ సెంచరీ -
IND vs SL: కొంపముంచేశాడు.. భారత్కు భారీ షాక్!
శ్రీలంక, అఫ్గనిస్తాన్లతో ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. తొలుత ఆతిథ్య లంక జట్టుతో తలపడ్డ తిలక్ వర్మ సేన.. ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.అఫ్గన్ చేతిలో ఓటమిఅనంతరం అఫ్గన్-‘ఎ’ జట్టుతో మ్యాచ్లో 349 పరుగుల మేర భారీ స్కోరు సాధించినప్పటికీ.. భారత జట్టుకు పరాభవం తప్పలేదు. వర్షం పదేపదే అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో అఫ్గన్ జట్టు డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఫలితంగా పాయింట్ల పట్టికలో అఫ్గనిస్తాన్ అగ్రస్థానానికి దూసుకుపోగా.. భారత్, శ్రీలంక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. అయితే, తర్వాతి మ్యాచ్లో అఫ్గనిస్తాన్పై గెలిచి లంక టాప్కు దూసుకెళ్లగా.. భారత్ రెండు, అఫ్గన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.మరోసారి శ్రీలంకతోఈ ట్రై సిరీస్లో భాగంగా భారత్ సోమవారం నాటి మ్యాచ్లో మరోసారి శ్రీలంకతో తలపడుతోంది. దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్కు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11), వైభవ్ సూర్యవంశీ (21) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 37, కెప్టెన్ తిలక్ వర్మ 23 పరుగులు చేశారు. మిగతా వారిలో ఆల్రౌండర్లు సూర్యాంశ్ షెడ్గే (72), విప్రాజ్ నిగమ్ (51) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.రెండుసార్లు అదే తప్పుఅయితే, విప్రాజ్ చేసిన పొరపాటు వల్ల భారత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. భారత్-‘ఎ’ ఇన్నింగ్స్లో 35వ, 37వ ఓవర్లలో విప్రాజ్.. సింగిల్ తీసే క్రమంలో పిచ్ మధ్యలో పరిగెత్తాడు. ఎంసీసీ నిబంధన 41.14 ప్రకారం.. ఉద్వేశపూర్వకంగా గానీ, అనుకోకుండా గానీ పిచ్ మధ్యలో (ప్రొటెక్టెడ్ ఏరియా)కి వచ్చి డ్యామేజ్కు కారణమయ్యే పరిస్థితి తలెత్తితే తొలుత అంపైర్ సదరు స్ట్రైకర్ను హెచ్చరిస్తాడు.ఇదే తప్పు పునరావృతం చేస్తే బ్యాటింగ్ చేసే జట్టు స్కోరులో ఐదు పరుగుల మేర కోత విధిస్తారు. అయితే, ఇక్కడ తొలుత అనుకుల్ రాయ్ కూడా ఇలాంటి తప్పిదానికే పాల్పడగా.. అంపైర్ వార్నింగ్తో వదిలేశాడు. అయితే, విప్రాజ్ ఒకటి కాకుండా.. ఏకంగా రెండుసార్లు పిచ్ మధ్యలోకి రావడంతో మొత్తంగా భారత్కు పది పరుగుల మేర నష్టం కలిగింది.పది పరుగుల నష్టంఫలితంగా శ్రీలంక తమ ఇన్నింగ్స్ను 10/0తో మొదలుపెట్టింది. అంటే విప్రాజ్ తప్పిదం వల్ల ప్రత్యర్థికి అదనంగా పది పరుగుల మేర లాభం చేకూరింది. ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఈ ఆల్రౌండర్ చేసిన తప్పిదం దేనికి దారితీస్తుందో చూడాలి మరి!!చదవండి: హోల్డర్ సిక్సర్ల వర్షం.. సిరీస్ విండీస్ కైవసం -
శుబ్మన్ గిల్ గెలిపించగా...
అఫ్గాన్తో ఏకైక టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ రికార్డు విజయం సాధించిన భారత జట్టు... వన్డే సిరీస్లోనూ అదే ఆటతీరుతో బోణీ కొట్టింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో గుర్బాజ్ సెంచరీతో అఫ్గాన్ ఓ మాదిరి స్కోరుకు పరిమితం కాగా... అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం ఛేదనలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్కు రాహుల్, ఇషాన్ మెరుపులు తోడవడంతో టీమిండియా ముందంజ వేసింది.ధర్మశాల: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు... అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరులో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే నాలుగున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా... ఆటను 25 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102; 8 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27; 3 ఫోర్లు), అజ్మతుల్లా (26; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. ఆడిన తొలి వన్డేలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టగా... అర్ష్ దీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో అలరించగా... కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ (16; 2 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (12; 1 ఫోర్) భారీ స్కోరు చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియాఉర్ రహమాన్ చెరో వికెట్ పడగొట్టారు. గుర్బాజ్ సెంచరీ... భారీ వర్షం కారణంగా మ్యాచ్ను కుదించడంతో... మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గాన్ టి20 తరహా దూకుడు కనబర్చింది. గుర్నూర్ బ్రార్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1) అవుట్ కాగా... అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో సాధిఖుల్లా (0), రహమత్ షా (3)ను పెవిలియన్కు పంపాడు. దీంతో అఫ్గాన్ జట్టు 26/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ హష్మతుల్లా అండతో గుర్బాజ్ రెచ్చిపోయాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన గుర్బాజ్... ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బౌలర్తో సంబంధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న అతడు... 48 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో అతడికిది తొమ్మిదో శతకం. ‘టెస్టు మ్యాచ్ అనంతరం నా బ్యాటింగ్కు సంబంధించి గౌతమ్ గంభీర్ సర్తో చర్చించా. షాట్ సెలక్షన్ విషయంలో గంభీర్ సలహాలు పాటించడంతోనే సెంచరీ చేయగలిగా’ అని మ్యాచ్ అనంతరం గుర్బాజ్ అన్నాడు. నాలుగో వికెట్కు 66 బంతుల్లోనే 116 పరుగులు జోడించిన అనంతరం గుర్బాజ్ అవుట్ కాగా... ఆ తర్వాత మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో అఫ్గాన్ ఆశించిన స్కోరు చేయలేకపోయింది. హర్ష్ దూబే, గుర్నూర్ అరంగేట్రం...గత కొంతకాలంగా టీమిండియా నెట్ బౌలర్గా కొనసాగుతున్న గుర్నూర్ బ్రార్... ఈ మ్యాచ్తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.మ్యాచ్ ఆరంభానికి ముందు అతడికి జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ భారత క్యాప్ అందించాడు. దేశవాళీల్లో సత్తాచాటిన స్పిన్నర్ హర్ష్ దూబేకు సైతం ఇదే తొలి వన్డే కాగా... అతడికి కేఎల్ రాహుల్ క్యాప్ అందజేశాడు.1 టీమిండియా తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అతి పెద్ద (39 సంవత్సరాల 44 రోజులు) వయసు్కడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.మొహిందర్ అమర్నాథ్ (39 సంవత్సరాల36 రోజులు) రెండో స్థానానికి చేరాడు.స్కోరు వివరాలుఅఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (బి) నితీశ్ రెడ్డి 102; ఇబ్రహీం (సి) గిల్ (బి) గుర్నూర్ 1; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) అర్ష్ దీప్ 0; రహమత్ షా (సి) హర్ష్ దూబే (బి) అర్ష్ దీప్ 3; హష్మతుల్లా (సి) రాహుల్ (బి) హర్ష్ దూబే 27; అజ్మతుల్లా (స్టంప్డ్) ఇషాన్ (బి) హర్ష్ దూబే 26; నబీ (సి) అర్ష్ దీప్ (బి) నితీశ్ రెడ్డి 9; రషీద్ (బి) గుర్నూర్ 9; ఘజన్ఫర్ (సి) గిల్ (బి) హర్ష్ దూబే 0; జియాఉర్ (సి) అర్ష్ దీప్ (బి) గుర్నూర్ 4; సలీమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (24.5 ఓవర్లలో ఆలౌట్) 194. వికెట్ల పతనం: 1–13, 2–16, 3–26, 4–142, 5–144, 6–172, 7–182, 8–182, 9–193, 10–194. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–27–2; గుర్నూర్ బ్రార్ 4.5–0–27–3; ప్రసిధ్ 5–0–35–0; హర్ష్ దూబే 5–0–47–3; సుందర్ 1–0–19–0; నితీశ్ రెడ్డి 4–0–31–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (రనౌట్) 16; గిల్ (నాటౌట్) 84; ఇషాన్ (బి) రషీద్ 34; శ్రేయస్ (సి) సలీమ్ (బి) జియాఉర్ 12; రాహుల్ (నాటౌట్) 39; ఎక్స్ట్రాలు 10; మొత్తం (22.5 ఓవర్లలో 3 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–46, 2–116, 3–142. బౌలింగ్: అజ్మతుల్లా 3–0–28–0; జియా ఉర్ 4–0–39–1; ఘజన్ఫర్ 5–0–28–0; సలీమ్ 3.5–0–36–0; రషీద్ ఖాన్ 5–0–37–1; నబీ 2–0–26–0. -
గిల్, రాహుల్ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్లో కెప్టెన్ శుబ్మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.Picture-Perfect 🙌#TeamIndia wrap a comprehensive victory by 7️⃣ wickets in Dharamshala ✅They lead the #INDvAFG ODI series by 1️⃣-0️⃣ 👌Scorecard ▶️ https://t.co/lCuohEZYAl @IDFCFIRSTBank pic.twitter.com/RNy13a0PHX— BCCI (@BCCI) June 13, 2026 -
గిల్ స్టన్నింగ్ క్యాచ్కు నోరెళ్లబెట్టాల్సిందే!
అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. హర్ష్దూబే వేసిన బంతిని అల్లా గజన్ఫర్ ఆఫ్ స్టంప్ ఔట్సైడ్ దిశగా ఆడాడు. అయితే స్లిప్లో ఉన్న గిల్ ఒక్క ఉదుటున డైవ్ చేసి సెకన్ల వ్యవధిలో ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడం విశేషం. ఇక గిల్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్కు గజన్ఫర్ నోరెళ్లబెట్టాడు.అయితే గిల్ పట్టిన క్యాచ్ను చాలా మంది టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పోలుస్తున్నారు. ధోని తన ప్రైమ్టైమ్లో సెకన్ల వ్యవధిలోనే స్టంపింగ్లు చేసిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు. 🔹 1st ODI | IND 🇮🇳 vs AFG 🇦🇫 🔹IND 🇮🇳 : 4️⃣0️⃣-0️⃣ (5 Overs)Rohit* : 1️⃣5️⃣¹⁴Gill* : 1️⃣7️⃣¹⁷INDIA 🇮🇳 NEED 1️⃣5️⃣5️⃣ RUNS MORE TO WIN#INDvAFG #TeamIndia #INDvsAFG #ODI #Cricketpic.twitter.com/z9dUJRGKlK https://t.co/oL8hQj02gs— Cricket Lover 🏏 (@Crick97924Lover) June 13, 2026 What. A. Catch 🤯Captain Shubman Gill with an absolute stunner of a grab 🫡Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/jX2rAfSbtq— BCCI (@BCCI) June 13, 2026 -
అఫ్గన్తో వన్డే.. ఆ ఇద్దరి అరంగేట్రం.. జైసూకు నో ఛాన్స్
ఊగిసలాటల నడుమ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డే నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. ధర్మశాలలో వర్షం కారణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యమైంది. వర్షం కారణంగా దాదాపు నాలుగు గంటలపాటు ఇటు ఆటగాళ్లు.. ఇటు ప్రేక్షకులు వేచి చూడాల్సిన పరిస్థితి.అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత వాన తగ్గడంతో మైదానంలో కప్పిన కవర్లు తీసేసిన సిబ్బంది.. మ్యాచ్కు గ్రౌండ్ను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 5.15 నిమిషాలకు టాస్ పడింది. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఆ ఇద్దరి అరంగేట్రంఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికెట్ పాత బడే కొద్ది బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారుతుందని భావిస్తున్నట్లు గిల్ తెలిపాడు. అదే విధంగా హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్తో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు. కాగా విరాట్ కోహ్లి స్థానంలో వన్డే జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్కు తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీగా గిల్- రోహిత్ శర్మ కొనసాతుండగా.. వన్డౌన్లో కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ సేవలు అందించనున్నాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడి సిరీస్కు దూరం కాగా.. ఆంధ్ర సీమ్బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఇక సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనపెట్టిన యాజమాన్యం.. హర్ష్ దూబేకు తొలి అవకాశం ఇచ్చింది. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణతో కలిసి గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగుతున్నాడు.భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ తుదిజట్టుఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ. -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
IND vs AFG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. గిల్ (67), శ్రేయస్ (6) పరుగులతో ఆడుతున్నారు.👉ఇషాన్ కిషన్ (34) రూపంలో టీమిండియా 116 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ బాదిన గిల్అఫ్గాన్తో మ్యాచ్లో కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 37 బంతుల్లో గిల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది.👉10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), గిల్ (29) పరుగులతో ఆడుతున్నారు.రోహిత్ శర్మ రనౌట్.. తొలి వికెట్ డౌన్రోహిత్ శర్మ రనౌట్ కావడంతో టీమిండియా 46 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న టీమిండియా195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (15), శుబ్మన్ గిల్ (17) పరుగులతో ఆడుతున్నారు.ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ భారీ స్కోరు చేసింది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది . ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్లు 2 వికెట్లు పడగొట్టారు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్16.3: హర్ష్ దూబే బౌలింగ్లో హష్మతుల్లా (27) రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్గా వెనుదిరిగాడు. హర్ష్కు వన్డేల్లో ఇదే తొలి వికెట్. నబీ క్రీజులోకి రాగా.. అజ్మతుల్లా రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 144-5(16.5).నాలుగో వికెట్ డౌన్15.3: నితీశ్ రెడ్డి బౌలింగ్లో బౌల్డ్ అయిన రహ్మానుల్లా గుర్బాజ్. 51 బంతుల్లో 102 పరుగులు చేసి నిష్క్రమణ. స్కోరు: 143-4(16). హష్మతుల్లా 27, అజ్మతుల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.శతక్కొట్టిన రహ్మానుల్లా గుర్బాజ్48 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న అఫ్గనిస్తాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 👉14 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 130-3 సెంచరీకి చేరువైన రహ్మానుల్లా గుర్బాజ్సెంచరీ కొట్టిన అఫ్గనిస్తాన్.. స్కోరు: 110-3(12)హష్మతుల్లా 17, రహ్మానుల్లా గుర్బాజ్ 86 పరుగులతో ఉన్నారు.రహ్మానుల్లాగుర్బాజ్ హాఫ్ సెంచరీ👉10 ఓవర్లు ముగిసేసరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 25 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకుని.. అఫ్గన్ తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు.ఆరు ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 35-3 (6)రహ్మానుల్లా 25 పరుగులతో ఉండగా.. హష్మతుల్లా 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్4.3: అర్ష్దీప్ బౌలింగ్లో హర్ష్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటైన రహ్మత్ షా (3). క్రీజులోకి హష్మతుల్లా షాహిది. రహ్మానుల్లా 20 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 26-3(4.4).రెండో వికెట్ డౌన్2.3: అర్ష్దీప్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన సెదీకుల్లా (0). అంపైర్ అవుట్ ఇవ్వగా.. అఫ్గన్ రివ్యూకు వెళ్లింది. అయితే, ఎల్బీడబ్ల్యూగా తేలడంతో సెదీకుల్లా మైదానం వీడాడు. రహ్మత్ షా క్రీజులోకి రాగా.. రహ్మానుల్లా 14 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 17-2(2.4)తొలి వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన ఇబ్రహీం జద్రాన్ (1). స్కోరు: 13-1(1.5). క్రీజులోకి సెదీకుల్లా రాగా.. రహ్మానుల్లా 11 పరుగులతో ఉన్నాడు.👉టాస్ గెలిచిన టీమిండియా.. తొలుత బౌలింగ్👉టీమిండియా తరఫున హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంతుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్ సఫీ, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ.శుభవార్తవర్షం తగ్గుముఖం పట్టింది. సూర్యుడు మేఘాల మాటు నుంచి బయటకు వచ్చాడు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసేసి మాప్ చేస్తున్నారు. 5.45 నిమిషాలకు మ్యాచ్ మొదలుకానుంది. ఈ వన్డే మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. బ్యాటింగ్ పవర్ప్లే ఐదు ఓవర్లు ఉంటుంది. ఐదుగురు బౌలర్లు తలా ఐదు ఓవర్లు బౌల్ చేస్తారు. 👉4.45PM: తగ్గుముఖం పట్టిన వాన.. మైదానంలోకి వచ్చిన గ్రౌండ్ సిబ్బంది.👉కొనసాగుతున్న చిరుజల్లులు👉మరోసారి భారీగా కురుస్తున్న వర్షం. 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహణకు కటాఫ్ టైమ్ సాయంత్రం 6.32 గంటలు.మ్యాచ్ జరిగేనా?👉తగ్గుముఖం పట్టిన వానవరుణుడు కరుణిస్తాడా?👉కొనసాగుతున్న జల్లులు👉మైదానంలోకి వచ్చి పరిశీలించిన హెడ్ క్యూరేటర్.. వాన తెరిపినిస్తేనే కవర్లు ఎత్తివేసే అవకాశంవాన మొదలు👉🌧️ధర్మశాలలో మొదలైన వాన👉రన్-అప్ ఏరియాపై కవర్లు కప్పిన సిబ్బందిటాస్ ఆలస్యంక్రికెట్ అభిమానులకు చేదు వార్త. టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ధర్మశాలలో వాతావరణం మేఘావృతం కావడంతో టాస్ ఆలస్యం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ధర్మశాలలో వాన పడేందుకు 60- 70 శాతం అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తుదిజట్ల అంచనాభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్/యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్/ప్రిన్స్ యాదవ్.అఫ్గనిస్తాన్రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదీకుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇక్రమ్ అలికిల్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, బిలామ్ సమీ/మహ్మద్ సలీం. -
మరికొన్ని గంటల్లో మ్యాచ్.. అంతలోనే స్టార్ క్రికెటర్ తండ్రి మరణం
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి వన్డే ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు అఫ్గాన్ క్యాంప్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ క్రికెటర్ దర్విష్ రసూలీ తండ్రి గురువారం(జూన్ 11) కన్నుమూశారు.దీంతో వెంటనే రసూలీ తన కుటుంబానికి అండగా ఉండేందుకు ఉన్నపళంగా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించాడు."దర్విష్ రసూలీ తండ్రి మరణించినట్లు మాకు గత రాత్రి తెలిసింది. ఇది చాలా బాధకరం. ఈ కష్టసమయంలో అతడు తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడు అఫ్గాన్కు తిరిగి వెళ్లిపోయాడు" అని షాహిదీ పేర్కొన్నాడు.ఇప్పుడు రసూలీ లేకపోవడంతో తుది జట్టు ఎంపికకు అఫ్గాన్ వద్ద 14 ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. యాదృఛ్చికంగా భారత్ వద్ద కూడా అంతే మంది ఉన్నారు. గాయం కారణంగా సిరీస్కు దూరమైన హార్దిక్ పాండ్యా స్ధానాన్ని బీసీసీఐ ఇంకా భర్తీ చేయలేదు.కాగా దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్న రసూలీ ఇప్పటివరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ధర్మశాల వేదికగా అతడు భారత్పై వన్డే డెబ్యూ చేస్తాడని అంతా భావించారు. అంతలోనే అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.ఇప్పటికే అఫ్గానిస్తాన్ తరఫున 28 టీ20లు ఆడిన రసూలీకి లిస్ట్-ఎ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. అతడు 54.94 సగటుతో, 93.79 స్ట్రైక్ రేట్తో 3,022 పరుగులు చేశాడు. అతడు తిరిగి జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి జట్టుతో చేరే అవకాశముంది.అఫ్ఘనిస్తాన్ జట్టురహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహమత్ షా, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఘజన్ఫర్, బిలాల్ రాసోలీ, ఫాలీద్ సమీ, ఫాలీద్ సమీ, రెహమాన్ షరీఫీచదవండి: IND Vs AFG: రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్! -
రోహిత్ శర్మకు గాయం.. ఆఫ్గన్తో తొలి వన్డేకు డౌట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తోంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ వేసిన బంతిని ఆడే క్రమంలో రోహిత్ మిస్ చేయడంతో అతడి కుడిచేతి బొటనవేలిని బలంగా తాకింది. అయితే రోహిత్ శర్మ మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. కానీ అర్ష్దీప్ సింగ్ వేసిన బంతులను ఆడడంలో రోహిత్ ఇబ్బంది పడడం చూస్తుంటే చేతివేలి గాయం పెద్దదిగానే కనిపిస్తోంది. దీంతో ఆఫ్గన్తో తొలి వన్డేలో రోహిత్ ఆడడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయంతో దూరమైతే గిల్తో కలిసి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అప్పుడు వన్డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు రానున్నాడు. ఇక మరో సీనియర్ విరాట్ కోహ్లీ కండరాల గాయంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. అయితే కోహ్లీ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడని, ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. అయితే 2027 వన్డే ప్రపంచకప్ రోహిత్, కోహ్లీకి చివరి టోర్నీ కానుందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇద్దరు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. ఇక రోహిత్ గాయంతో దూరమయ్యే అవకాశాలు ఉంటే మాత్రం అతడి స్థానంలో జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, కుల్దీప్ యాదవ్.Rohit Sharma very rusty in the nets so far. Prasidh Krishna delivery hits him on the right thumb, plenty hitting the maker’s mark on the bat and then thick outside edge to a Arshdeep Singh delivery. pic.twitter.com/65M2pKVVeF— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 12, 2026చదవండి: ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు! -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్తో చండీగఢ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్కు బదులు ఇషాన్ కిషన్నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్డౌన్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
IND vs AFG: భారత్కు భారీ షాక్.. అఫ్గన్ అనూహ్య విజయం
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గనిస్తాన్- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది.తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్ జరుగగా.. భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. అదరగొట్టిన భారత బ్యాటర్లుగత మ్యాచ్లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్సిమ్రన్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. మిగతా వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.349 పరుగుల భారీ స్కోరుఇక వర్షం వల్ల ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ పడగొట్టారు.పదే పదే ఆటంకంఅనంతరం అఫ్గన్ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. అఫ్గన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మిర్, హసన్ ఐసాఖిల్ అఫ్గన్కు శుభారంభం అందించారు.ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్ ఇమ్రాన్కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్బహీర్ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.భారత్ ఓటమిఅయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే అఫ్గన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ను విజేతగా ప్రకటించారు. భారత్పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. మరోవైపు.. అఫ్గన్ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్రన్రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు -
BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!
అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత జట్టు ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకు పయనమైంది. కెప్టెన్ శుబ్మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ.. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ విమానంలో బయల్దేరారు. జైస్వాల్కు చోటుఇక లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల అఫ్గన్తో వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు.రోహిత్ పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించి జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేశాయి. దీంతో దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కానీ పాండ్యా గాయం గురించి అధికారిక ప్రకటన రాలేదు.అతడు జట్టుకు దూరమయ్యాడు!ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘అవును.. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గాయం వల్ల అతడు అందుబాటులో ఉండటం లేదు.అతడి స్థానంలో వేరే ఆటగాడిని తీసుకోవాలా? లేదంటే పద్నాలుగు మందితోనే జట్టును కొనసాగించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డి ఉన్నాడుగాకాగా ఇప్పటికే హార్దిక్కు బ్యాకప్గా మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని అఫ్గన్తో వన్డేలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందుకే రీప్లేస్మెంట్ గురించి సెలక్టర్లు ఆలోచించడంలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. అఫ్గన్తో ముల్లన్పూర్ వేదికగా టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తదుపరి జూన్ 13, 17, 20 తేదీల్లో మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ధర్మశాల, లక్నో, చెన్నై ఇందుకు వేదికలు. చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
IND vs AFG ODI: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.తొలి మ్యాచ్ శ్రీలంకతోశ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.లంకతో మ్యాచ్లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్లో భాగంగా గురువారం అఫ్గన్పై భారీ స్కోరు సాధించింది.అఫ్గన్పై చెలరేగిన ఓపెనర్లు దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.రుతు, తిలక్ మరోసారి..వన్డౌన్లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. 49 ఓవర్లు ఎందుకంటే?వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అఫ్గన్ లక్ష్యం 294వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి -
ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే
బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఘోర ఓటమి చవిచూసిన ఆస్ట్రేలియాలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఢాకా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. బంగ్లా పేస్ బౌలర్ల ధాటికి కంగారులు కంగారెత్తిపోతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.టాస్కిన్ అహ్మద్ వేసిన మొదటి ఓవర్లో నాలుగో బంతికి మాథ్యూ షార్ట్ ఖాతా తెరవకుండానే క్లీన్ బౌల్డయ్యాడు. అంతకుముందు తొలి వన్డేలో కూడా ఇదే తరహాలో షార్ట్ అవుటయ్యాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ పర్యాటక జట్టను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి బంతికి కూపర్ కొన్నోలీ(0).. ఆఖరి బంతికి రెన్షా(0) వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. దీంతో ఆస్ట్రేలియా తమ స్కోర్ బోర్డు ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తద్వారా ఆసీస్ ఓ చెత్త రికార్డును మూట కట్టుకుంది. ఆస్ట్రేలియా తమ 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఒక్క పరుగు కూడా బోర్డుపై లేకుండా 3 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.అంతేకాకుండా ఈ ఘోరమైన రికార్డు నమోదు చేసిన తొలి ఆసియా యేతర జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇంతకుముందు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్, సౌతాఫ్రికాపై ఈ చెత్త రికార్డును నమోదు చేసింది. తాజాగా కంగారులు కూడా ఈ జాబితాలో చేరారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 23 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ జోష్ ఇంగ్లిష్(34), గ్రీన్(25) కాసేపు బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇంగ్లిష్ ఔటయ్యాకు ఆసీస్ వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. కాగా బంగ్లా పర్యటనకు ముందు పాకిస్తాన్తో వన్డే సిరీస్ను కూడా 2-1 తేడాతో ఆస్ట్రేలియా కోల్పోయింది. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, కమ్మిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: Vaibhav suryavanshi: మనోడు ఏం మారలే.. శ్రీలంక గడ్డపై విధ్వంసం -
టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్?
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా చేరాడు. పాండ్యా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తన ఫిట్నెస్ టెస్ట్ను క్లియర్ చేశాడు. దీంతో అఫ్గాన్తో వన్డే సిరీస్లో పాల్గోనేందుకు బీసీసీఐ వైద్య బృందం అనుమతి ఇచ్చింది.అయితే క్లియరన్స్ లభించిన కొన్ని గంటల్లోనే హార్దిక్ మళ్లీ గాయపడ్డాడు. ప్రాక్టీస్ సమయంలో పాండ్యాకు పక్కటెముకల గాయమైంది. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్ సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడు కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జూలైలో ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు కూడా ఈ బరోడా ఆల్రౌండర్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది.టీమిండియాలోకి అర్షద్?ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేయగల పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు వేటను మొదలు పెట్టారు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న మధ్యప్రదేశ్ ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అర్షద్ ప్రస్తుతం ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్లో అర్షద్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. 48వ ఓవర్ వేసిన అర్షద్ ఊహకందని అద్భుతం చేశాడు. ఆ ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు సంచలన విజయాన్ని అందించాడు. ఈ ఎడమచేతి వాటం పేసర్ పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బాగా రాణించగలడు. కేవలం బౌలర్గానే కాకుండా లోయర్ ఆర్డర్లో భారీ సిక్సర్లు బాదగల సత్తా అతడిది. గత ఐపీఎల్ సీజన్లలోనూ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో అర్షద్ బ్యాట్తో మెరుపు మెరిపించాడు. అర్షద్ ఇప్పటివరకు 9 లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. అయితే పాండ్యా స్ధానంలో సెలక్టర్లు అర్షద్కు అవకాశమిస్తారో లేదో చూడాలి మరి. జూన్ 13 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: IND vs AFG: టీమిండియాతో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం -
భారత్తో వన్డే సిరీస్.. అప్గాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
భారత్తో మూడు వన్డేల సిరీస్కు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్లో 6 వికెట్లు పడగొట్టిన యువ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సలీమ్ సఫీకి ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ఈ ఏకైక టెస్ట్లో అఫ్గాన్ ఓడిపోయినప్పటికి, సఫీ మాత్రం తన అద్భుత బౌలింగ్తో అందరిని ఆకట్టుకున్నాడు. ముల్లాన్పూర్లో తీవ్రమైన వేడిని తట్టుకుని మరి సఫీ ఏకంగా 27 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ స్పీడ్స్టర్ భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లయిన యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతడిని వన్డే జట్టులో చేర్చారు.2023లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 23 ఏళ్ల మహ్మద్ సలీమ్ సఫీ.. ఇప్పటివరకు అఫ్గానిస్తాన్ తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ అతడికి అఫ్గాన్ వన్డే జట్టులో చోటు దక్కింది.నబీ, రషీద్ దూరం!కాగా మొహాలీలో బుధవారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్కు సీనియర్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ రషీద్ ఖాన్ దూరమయ్యాడు. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు రషీద్ నేరుగా జట్టుతో కలవనున్నాడు. 41 ఏళ్ల మహ్మద్ నబీ మాత్రం 'అనారోగ్యం' కారణంగా ఈ ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కాగా ఈ వన్డే సిరీస్కు ముందు భారత్కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలిగాడు. అదేవిధంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఈ సిరీస్కు అందుబాటులో లేడు.వన్డే సిరీస్ షెడ్యూల్మొదటి వన్డే- జూన్ 13- ధర్మశాలరెండో వన్డే-జూన్ 17-లక్నోమూడో వన్డే-జూన్ 20-చెన్నైవన్డే సిరీస్కు జట్లు భారత్శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ,యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, , ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబె, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, గుర్నూర్ బ్రార్అఫ్గానిస్తాన్హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతై, రహ్మత్ ఝాన్ఫార్, ఘాజాయ్ మాలిక్, బిలాల్ సామి, సలీమ్ సఫీచదవండి: IND vs ENG: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
మళ్లీ గాయపడిన పాండ్యా.. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు దూరం!
అప్గానిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయంతో దూరమయ్యాడు. అయితే మంగళవారమే రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా తమ ఫిట్నెస్ను నిరూపించుకొని క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు ఆడుతారని బీసీసీఐ తెలిపింది. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు హార్దిక్ పాండ్యా మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. రీఎంట్రీ కోసం సీవోఈలో శిక్షణ తీసుకుంటున్న పాండ్యా బౌలింగ్ వేస్తున్న క్రమంలో అతడి కాలు బెణికినట్లు సమాచారం. దీంతో అతడు కోలుకోవడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. స్వల్ప గాయం కావడంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని మెడికల్ టీమ్ వెల్లడించింది. దీంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్కు పాండ్యా దూరమైనట్లే. బీసీసీఐ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక సీవోఈ నుంచి క్లియరెన్స్ పొందిన రోహిత్ శర్మ మాత్రం ఆఫ్గన్తో వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవలే ఐపీఎల్ 2026 సీజన్లో పాండ్యా వెన్నునొప్పికి గురయ్యాడు. దీంతో సీజన్ ఆఖర్లో ముంబై జట్టుకు దూరమైన పాండ్యా నేరుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి చేరుకున్నాడు. పాండ్యా కోలుకొని ఫిట్నెస్ క్లియరెన్స్ కూడా సాధించడంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఈ ఆల్రౌండర్ మళ్లీ గాయానికి గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో చీలమండ గాయంతో పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా తన చివరి వన్డే మ్యాచ్ను 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి పాండ్యా వరుస గాయాలతో సతమతమవుతూనే వస్తున్నాడు.చదవండి: మెస్సీ విజృంభణ.. అర్జెంటీనా ఘన విజయం -
గెలిచామన్న గర్వం.. రెచ్చిపోయిన బంగ్లా బౌలర్!
బంగ్లాదేశ్ తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏళ్ల తర్వాత ఆసీస్ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే గెలిచామన్న గర్వమో లేక పొగరో తెలియదు కానీ బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రానా ఆస్ట్రేలియా కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ను స్లెడ్జింగ్ చేయడం మ్యాచ్లో హాట్టాపిక్గా మారింది. విషయంలోకి వెళితే.. 285 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా, మార్నస్ లబుషేన్ కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కూపర్కు జత కలిసిన ఇంగ్లిస్ ఆసీస్ ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. వీరి మధ్య భాగస్వామ్యం బలపడుతున్న తరుణంలో నహీద్ రానా 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లిస్ను పెవిలియన్ చేర్చాడు. ఔట్సైడ్ అయిన బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో ఇంగ్లిస్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఇంగ్లిస్ పెవిలియన్ వైపు వెళుతున్న తరుణంలో నహీద్ రానా అతడిని ఉద్దేశించి ఏదో అన్నాడు. ఇది విన్న ఇంగ్లిస్ నేరుగా నహీద్ రానావైపు దూసుకొచ్చి ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బంగ్లా కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ ఇంగ్లిస్ను అడ్డుకొని అక్కడి నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నహీద్ రానా వద్దకు వచ్చిన మెహదీ హసన్.. ఎమోషన్ కంట్రోల్ చేసుకో అని అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడాడు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (10-1-41-4) దెబ్బకు కంగారూలు కంగారు పడిపోయారు. ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం అంతరాయం కలిగించింది. డక్వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ను విజేతగా ప్రకటించారు. Big Wicket for Bangladesh! Josh Inglis departs. Caught by Litton Das, bowled by Nahid Rana! pic.twitter.com/waRZRvW6mX— Bangladesh Cricket (@BCBtigers) June 9, 2026చదవండి: 'అతడు పేరుకే ఆల్రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ' -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్తో సిరీస్ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్కు బదులు యశస్వి జైస్వాల్కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్తో వన్డేలో కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్ను వన్డౌన్లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్తో పాటు గుర్నూర్ బ్రార్ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా.. 16 మ్యాచ్లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్ను తప్పించిన బీసీసీఐ -
టీమిండియాలో చోటివ్వరా? శతకంతో కదం తొక్కాడు!
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ శతక్కొట్టాడు. శ్రీలంక-‘ఎ’ జట్టుతో తొలి వన్డేలో సెంచరీతో మెరిసి జట్టును ఆదుకున్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో పాటు అఫ్గనిస్తాన్తో భారత్ వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత శ్రీలంకతో పోరుకు భారత్ సిద్ధమైంది. దంబుల్లా వేదికగా మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.వైభవ్ విఫలం..అయితే, ఆదిలోనే శ్రీలంక భారత్కు షాకిచ్చింది. ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్ (11 బంతుల్లో 2), వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14)లను పెవిలియన్కు పంపి దెబ్బకొట్టింది. వన్డౌన్లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.శతకంతో కదంతొక్కాడుఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ శతకంతో కదంతొక్కాడు. మొత్తంగా 114 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 101 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (97 బంతుల్లో 60)తో కలిసి 185 బంతుల్లో 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.మిగిలిన వారిలో ఆయుశ్ బదోని 24, సూర్యాంశ్ షెడ్గే 26 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన భారత్ 277 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో మహ్మద్ షిరాజ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. చమిక కరుణరత్నె, గరుక సంకేత్, వనుజా సాహన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గనిస్తాన్తో వన్డేలకు ఎంపిక చేయని సెలక్టర్లుచివరగా సౌతాఫ్రికాతో వన్డేలో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత సెలక్టర్లు అతడిని పక్కనపెట్టారు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జూన్ సిరీస్కు రుతురాజ్ను ఎంపిక చేయలేదు.స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడగా.. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్కు ఆఖరి నిమిషంలో చోటిచ్చారు. ఇలాంటి తరుణంలో రుతురాజ్ భారత్-ఎ తరఫున శతక్కొట్టడం విశేషం. దీంతో తనను విస్మరించిన టీమిండియా సెలక్టర్లకు రుతు బ్యాట్తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: కొడితే సెంచరీ.. లేదంటే డకౌట్! -
ODI WC: కొంప ముంచిన వర్షం.. విండీస్కు తప్పని గండం!
సొంతగడ్డపై వెస్టిండీస్ చతికిలపడింది. పర్యాటక శ్రీలంక జట్టుకు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య ఈ మెగా ఈవెంట్ జరుగనున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా విండీస్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్లో పర్యాటక జట్టు చేతిలో 41 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండు వన్డేలు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో సిరీస్ 1-0తో శ్రీలంక వశమైంది.పదో స్థానంలో...ఫలితంగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించే అవకాశాలు సన్నగిల్లాయి. కాగా శ్రీలంకతో సిరీస్ ద్వారా ఈ సైకిల్ (2023-2027)లో విండీస్ ఇప్పటికి 32 మ్యాచ్లు పూర్తి చేసుకుంది.ఇందులో 11 గెలిచి, 18 ఓడిపోయింది. మిగిలిన మ్యాచ్లు వర్షం వల్ల రద్దైపోయాయి. దీంతో మొత్తంగా 73 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ పట్టికలో పదో స్థానంలో ఉంది.టాప్-8లో ఉన్న జట్లు మాత్రమేకాగా పట్టికలో టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలో అడుగుపెడతాయి.ఇక విండీస్కు ఈ సైకిల్లో దాదాపుగా తొమ్మిది మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. స్వదేశంలో జూలైలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడనున్న కరేబియన్ జట్టు.. తదుపరి భారత పర్యటనలో మూడు వన్డేలు ఆడుతుంది. అనంతరం అఫ్గనిస్తాన్కు మూడు వన్డేల కోసం ఆతిథ్యం ఇస్తుంది. వరుసగా రెండోసారి..ఈ సిరీస్లలో వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శనతో గెలవాల్సి ఉంటుంది. వర్షం వల్ల ఈ మ్యాచ్లకు ఆటంకం కలిగితే విండీస్ అవకాశాలు మరింత సన్నగిల్లడం ఖాయం. అదే జరిగితే వెస్టిండీస్ వరుసగా రెండోసారి గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది.ఇందులో నాలుగు స్థానాల కోసం పది జట్లు పోటీలో ఉంటాయి. ఉదాహరణకు.. స్కాట్లాండ్, నమీబియా, ఐర్లాండ్ వంటి చిన్నజట్లు రీజినల్ క్వాలిఫయర్స్లో సత్తా చాటడం ద్వారా గ్లోబల్ క్వాలిఫయర్లో అడుగుపెడతాయి. కాగా గత ఎడిషన్లో వెస్టిండీస్కు ఈ టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది.గత ఎడిషన్కు అర్హత సాధించకుండానే..స్కాట్లాండ్, నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయి.. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి అర్హత సాధించకుండానే వెస్టిండీస్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు చాంపియన్గా నిలిచిన జట్టు ఈ మేరకు అర్హత కూడా సాధించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.ఇక ప్రస్తుతం పటిష్టమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, టీమిండియాపై వెస్టిండీస్ సత్తా చాటాల్సి ఉంది. అఫ్గనిస్తాన్ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రస్తుత సైకిల్లో కూడా విండీస్కు క్వాలిఫయర్స్ ఆడే గండం తప్పకపోవచ్చని అనిపిస్తోంది. చదవండి: పాకిస్తాన్ కంటే ప్రమాదకరమా? అని అడిగాను -
మూడో వన్డే రద్దు.. లంక కెప్టెన్ అరుదైన ఫీట్!
వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడో వన్డే వర్షార్పణమైంది. దీంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను లంక 1-0తో కైవసం చేసుకుంది. దీంతో విండీస్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన మూడో కెప్టెన్గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో అర్జున రణతుంగ, ఆటపట్టు ఈ ఫీట్ను సాధించారు. జమైకా వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది.కనీసం టాస్ వేసేందుకు కూడా వరుణుడు అవకాశం కల్పించలేదు. గ్రౌండ్ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండో వన్డే కూడా వర్షార్పణమైన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మాత్రం శ్రీలంక జట్టు 41 పరుగుల తేడాతో గెలిచింది. కరీబియన్ గడ్డపై 13 ఏళ్ల తర్వాత లంక విజయం సాధించడం విశేషం. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ గురువారం నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి.చదవండి: రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్! -
రోహిత్, పాండ్యా ఫిట్నెస్పై కీలక అప్డేట్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోర్ట్స్ బృందం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం తెలిపింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించు కున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ శుభవార్త చెప్పాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే తనకు అందిన సమాచారం మేరకు రోహిత్, పాండ్యా ఫిట్నెస్ నిరూపించుకున్నారని, అయితే మెడికల్ టీమ్ ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వలేదని తెలిపాడు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు ఆఫ్గన్తో వన్డే సిరీస్లో ఆడతారని స్పష్టం చేశాడు. కానీ వన్డే సిరీస్లో ఈ ఇద్దరూ పాల్గొనాలంటే పాండ్యా, రోహిత్లు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాండ్యా, రోహిత్ శర్మలు ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరానికి వచ్చారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విఫలం.. తీవ్ర నిరాశలో అభిమానులు! -
కోహ్లి అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ను అఫ్గన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు.. అనంతరం న్యూజిలాండ్తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్కప్లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్తో సిరీస్కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవదు’’ అని గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ఏడాది తర్వాత బరిలోకి దిగనున్న సూపర్ స్టార్
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో పాల్గోనేందుకు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) నుండి అనుమతి లభించింది.దీంతో దాదాపు ఏడాది తర్వాత పాండ్యా వన్డేల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. కాగా గత నెలలో అఫ్గాన్తో సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. కానీ వెన్ను గాయంతో బాధపడుతున్న పాండ్యాకు ఈ సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. దీంతో జూన్ 2న బెంగళూరులోని సీఓఈకి వెళ్లిన పాండ్యాకు వైద్యులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతడు ఉత్తీర్ణత సాధించడంతో సీఓఈ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది. మరోవైపు తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు.ఇందులో పాసైతేనే అఫ్గాన్తో సిరీస్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో సెలక్షన్ కమిటీ భర్తీ చేయనుంది. ఇక ఈ సిరీస్కు ఇప్పటికే టీమిండియా స్టార్, రన్మిషన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా దూరమయ్యాడు. కోహ్లి ప్రస్తుతం కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతడి స్ధానాన్ని రుతురాజ్ గైక్వాడ్తో భర్తీ చేశారు.పాండ్యా విషయానికి వస్తే.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. పాండ్యా ఇప్పటివరకు 94 వన్డేలు ఆడి, 32.82 సగటుతో 1904 పరుగులు చేశాడు. అంతేకాకుండా అతడి పేరిట 91 వన్డే వికెట్లు ఉన్నాయి. అయితే వన్డే మ్యాచ్లో 10 ఓవర్ల కోటాను పూర్తి చేసేందుకు అతడి శరీరం సహకరిస్తుందో లేదో చూడాలి. వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు ఇదేశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ (వైస్కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ENG vs NZ: ఇంగ్లండ్ బౌలర్ అరుదైన రికార్డు.. 149 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్ పాక్దే
లహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 4 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1తో పాక్ కైవసం చేసుకుంది. ఈ ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 42 ఓవర్లలో కేవలం 157 పరుగులకే ఆలౌటైంది. షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించగా.. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ (65 పరుగులు, 71 బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. పాక్ గడ్డపై ఆసీస్కు ఇదే అత్యల్ప వన్డే స్కోర్ కావడం గమనార్హం.రాణించిన బాబర్ ఆజంఅనంతరం 158 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఆసీస్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ఆతిథ్య జట్టు 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పిచ్ స్పిన్కు అనుకూలించడంతో పాక్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (40 పరుగులు, 84 బంతుల్లో) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దగా.. షాదాబ్ ఖాన్(42 బంతుల్లో 29), సమద్(30) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కుహ్నెమాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రెన్షా, ఎల్లీస్ తలా వికెట్ సాధించారు.చదవండి: ENG vs NZ: తొలి రోజే 16 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్ -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ జట్టు ప్రకటన
ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తమ జట్టును ప్రకటించింది. శ్రీలంక- ‘ఎ’, భారత్- ‘ఎ’ జట్లతో తలపడే అఫ్గన్- ‘ఎ’ జట్టు వివరాలను గురువారం వెల్లడించింది. ఈ జట్టుకు ఇమ్రాన్ మిర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది. వికెట్ కీపర్ల కోటాలో నూర్ రహ్మాన్తో పాటు మొహమ్మద్ ఇషాక్లకు సెలక్టర్లు చోటిచ్చారు. బ్యాటింగ్ విభాగంలో హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా స్థానం సంపాదించుకున్నారు.ఆల్రౌండర్ల జాబితాలో ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్ ఎంపికయ్యారు. వీరు సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లు కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖలీల్ గుర్బాజ్కు కూడా సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు.ఇక స్పిన్ దళంలో రిస్ట్ స్పిన్నర్ జహీర్ ఖాన్ పక్టీన్ ఒక్కడే ఉండగా.. పేస్ విభాగంలో మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫరీదూన్ దావూద్జాయ్ సేవలు అందించనున్నారు. కాగా జూన్ 9 నుంచి 21 వరకు శ్రీలంక వేదికగా ఈ ముక్కోణపు వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్లో భారత్-‘ఎ’ జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దంబుల్లా వేదికగా భారత్- శ్రీలంక- అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి.శ్రీలంక- భారత్లతో ముక్కోణపు వన్డే సిరీస్కు అఫ్గన్-‘ఎ’ జట్టు ఇదేఇమ్రాన్ మిర్ (కెప్టెన్), నూర్ రహ్మాన్, మొహమ్మద్ ఇషాక్, హసన్ ఐసాఖిల్, ఖలీద్ తనీవాల్, ఐజాజ్ అహ్మద్జాయ్, బహీర్ షా మెహబూబ్, ఫైజల్ ఖాన్ షినోజదా, ఫర్మానుల్లా సూఫీ, షామ్స్ ఉర్ రహ్మాన్, జహీర్ ఖాన్ పక్టీన్, ఫరీదూన్ దావూద్జాయ్, మహ్మద్ ఇబ్రహీం, అబ్దుల్లా అహ్మద్జాయ్.సిరీస్ షెడ్యూల్ ఇదేజూన్ 9: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 11: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 13: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 15: భారత్ వర్సెస్ శ్రీలంకజూన్ 17: భారత్ వర్సెస్ అఫ్గన్జూన్ 19: అఫ్గన్ వర్సెస్ శ్రీలంకజూన్ 12: ఫైనల్. -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్తో మ్యాచ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్నెస్లోబడే...శుబ్మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్నెస్లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్లను అఫ్గన్తో సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ను 5 వికెట్ల తేడాతో పాక్ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్ ఇంగ్లిష్, గ్రీన్, లబుషేన్ వంటి కీలక వికెట్లను అరాఫత్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్గా మిన్హాస్ నిలిచాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో మిన్హాస్తో పాటు అబ్రార్ రెండు, రౌఫ్, అఫ్రిది, అఘా తలా వికెట్ సాధించారు.బాబర్, ఘోరి హాఫ్ సెంచరీలుఅనంతరం పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్(18), సమద్(1) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఆసీస్ బౌలర్లలో నాథన్ ఈల్లీస్ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, లబుషేన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 2న లహోర్ వేదికగా జరగనుంది.చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్ -
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్! -
PAK vs AUS: రిజ్వాన్పై వేటు.. కొత్త ముఖాలకు చోటు
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పేసర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్గా కొనసాగించింది. ఇక ఈ సిరీస్తో బాబర్ ఆజం తిరిగి వన్డే జట్టుతో చేరనుండగా.. మరో మాజీ సారథి మహ్మద్ రిజ్వాన్పై సెలక్టర్లు వేటు వేశారు.కెప్టెన్గా అతడే.. కాగా టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన పాకిస్తాన్.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అయితే, సెలక్టర్లు అప్పుడు బాబర్ను ఈ జట్టుకు ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడిన పాక్... షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాకు దాదాపు పదకొండేళ్ల తర్వాత 2-1 తేడాతో సిరీస్ను కోల్పోయింది.ఈ నేపథ్యంలో షాహిన్పై వేటు వేసి.. బాబర్కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, సెలక్టర్లు మాత్రం ఈ లెఫ్టార్మ్ పేసర్పై నమ్మకం ఉంచారు. అదే విధంగా సల్మాన్ ఆఘాను వైస్ కెప్టెన్గా కొనసాగించారు.ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఇక ఇటీవల బంగ్లాదేశ్తో టెస్టులకు ఎంపిక కాని నసీం షా, హ్యారిస్ రవూఫ్, షాదాబ్ ఖాన్లకు సెలక్టర్లు తాజాగా పిలుపునిచ్చారు. వీరితో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు కూడా ఆసీస్తో వన్డేలు ఆడే జట్టులో చోటిచ్చారు.అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, రొహైల్ నాజిర్లు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ముహమ్మద్ ఘాజి ఘోరితో పాటు నాజిర్ వికెట్ కీపర్గా వ్యవహరించనున్నాడు. ఇక అనారోగ్యం కారణంగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ సెలక్షన్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఓపెనర్లుగా వీరేఇక సయీమ్ ఆయుబ్, ఫఖర్ జమాన్ గాయాల కారణంగా దూరం కాగా.. వారి స్థానంలో ఓపెనర్లుగా సాహిబ్జాదా ఫర్హాన్, మాజ్ సదాకత్ ఆసీస్తో వన్డే బరిలో దిగనున్నారు. మరోవైపు.. పేస్ దళంలో కెప్టెన్ షాహిన్ ఆఫ్రిదితో పాటు హ్యారిస్ రవూఫ్, నసీం షా ఉండనే ఉన్నారు. స్పిన్నర్ల కోటాలో అబ్రార్ అహ్మద్, సూఫియాన్ ముకీమ్ చోటు దక్కించుకున్నారు. కాగా గత పర్యటనలో రిజ్వాన్ కెప్టెన్సీలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించి వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), సల్మాన్ ఆఘా (వైస్ కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజం, హ్యారిస్ రవూఫ్, మాజ్ సదాకత్, ముహమ్మద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), నసీం షా, రొహైల్ నాజిర్ (వికెట్ కీపర్), సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్, షామిల్ హుసేన్, సూఫియాన్ ముకీమ్.షెడ్యూల్మే 30 (రావల్పిండి), జూన్ 2, జూన్ 4 (లాహోర్) తేదీల్లో పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు.చదవండి: సన్రైజర్స్కు తప్పని గండం.. అలా అయితేనే టాప్-2లో చోటు! -
నిరాశపరిచారు: టీమిండియా సెలక్టర్లపై విమర్శలు
టీమిండియా సెలక్షన్ కమిటీ తీరును ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లను విస్మరించడం ఎంతమాత్రం తగదన్నాడు. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ (జూన్ 6 నుంచి)తో బిజీ కానుంది. ఇందులో భాగంగా తొలుత స్వదేశంలో అఫ్గనిస్తాన్ ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్లను ప్రకటించింది.గుర్నూర్ బ్రార్కు తొలిసారి పిలుపు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణతో కలిసి పేస్ దళంలో చేరాడు. అయితే, మెజారిటీ మంది విశ్లేషకులు అఫ్గన్తో టెస్టుకు ఆకిబ్ నబీని తప్పక ఎంపిక చేస్తారని భావించారు.కానీ సెలక్టర్లు మాత్రం అతడికి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో ఆకిబ్ నబీ పట్ల సెలక్షన్ కమిటీ వ్యవహారశైలిపై హర్ష్ భోగ్లే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ఈ జట్టులో ఆకిబ్ నబీ తప్పక ఉంటాడని నేను విశ్వసించాను. అతడి గురించి చర్చ కూడా జరిగింది.అతడిని ఎందుకు ఎంపిక చేయలేదు?అతడి బౌలింగ్లో తగినంత పేస్ ఉందా? లేదా? అన్న విషయంతో నాకు సంబంధం లేదు. బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాడా? లేదా? అన్నది కూడా నాకు అక్కర్లేదు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో రెండేళ్లలో అతడు వందకు పైగా వికెట్లు కూల్చాడు. అలాంటి బౌలర్కు ప్రోత్సాహం అందించడం కనీస బాధ్యత. అతడిని ఎంపిక చేసి ఉంటే దేశీ క్రికెట్లో సత్తా చాటే ఆటగాళ్లకు మంచి బూస్టప్ లభించేది.టెస్టుల్లో రాణించాలనే కసి మరింత పెరిగేది. అఫ్గన్తో టెస్టులో తుదిజట్టులో ఆకిబ్ నబీకి చోటు ఇవ్వకున్నా పర్లేదు. కానీ పదిహేను మంది సభ్యుల జట్టుకు మాత్రం అతడిని ఎంపిక చేయాల్సింది. అతడికి ఫిట్నెస్ సమస్యలు కూడా లేవు.ఏం మెసేజ్ ఇస్తు న్నారు?దేశీ క్రికెట్లో ఓ బౌలర్గా ఎంతగా రాణించాలో.. అంతా చేసి చూపాడు. బ్యాటింగ్ ఆర్డర్లో తొమ్మిదో స్థానంలో మెరుగ్గా ఆడగలడు. అయినప్పటికీ అతడిని ఎంపిక చేయకపోవడం నిజంగా నిరాశాజనకం. ఈ సెలక్షన్ కమిటీకి ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ వారి చర్యల ద్వారా ఇచ్చే సందేశం మాత్రం సరిగ్గా లేదు’’ అని హర్షా భోగ్లే యూట్యూబ్ చానెల్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 2025-26 సీజన్లో పది మ్యాచ్లలో ఆకిబ్ నబీ జమ్మూ కశ్మీర్ తరఫున 60 వికెట్లు తీశాడు. తన జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు సీజన్లో ఆకిబ్.. 44 వికెట్లతో సత్తా చాటాడు.చదవండి: నితీశ్ రెడ్డి, ఇషాన్లకు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!.. కొత్త ముఖాలు ఇవే -
కొత్త కుర్రాళ్లకు పిలుపు
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్గానే కొనసాగనున్నాడు. పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్ను ఎంపిక చేయలేదు. రోహిత్తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్తో సిరీస్ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్. ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఈ ఢిల్లీ బౌలర్కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్తో సిరీస్కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. మానవ్ సుతార్: రాజస్తాన్కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 29 మ్యాచ్ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్గా టీమ్లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు. గుర్నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్కు బ్రార్పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 18 మ్యాచ్లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి. -
అతడి గురించి అసలు చర్చించనేలేదు: అగార్కర్
వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోకాగా స్వదేశంలో జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్బ్రార్, ప్రిన్స్ యాదవ్ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.పేస్ దళ నాయకుడిగా సిరాజ్ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ పేస్ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్దీప్ సింగ్కు సెలక్టర్లు చోటిచ్చారు.మరోవైపు.. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.అసలు చర్చే జరుగలేదు‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆకిబ్ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్ నాడు పేర్కొన్నాడు.సత్తా చాటినా...ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్లో బెంగాల్ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్నెస్ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.67 వికెట్లు పడగొట్టినా..కాగా వన్డే వరల్డ్కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్గా నిలవడంలోనూ ఈ రైటార్మ్ పేసర్ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.ఇక చివరగా 2023 జూన్లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.చదవండి: టీమిండియాలోకి వైభవ్.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు -
నితీశ్ రెడ్డి, ఇషాన్కు లక్కీ ఛాన్స్.. పాపం పంత్!
అఫ్గనిస్తాన్తో టెస్టు, వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ సారథ్యంలో సొంతగడ్డపై అఫ్గన్తో తలపడే జట్ల వివరాలను మంగళవారం వెల్లడించింది. ఇందులో ప్రధానంగా గమనించదగ్గ అంశాలు ఏమిటంటే..పాపం పంత్!ఐపీఎల్-2026లో వరుస వైఫల్యాలతో సతమతమైన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు సెలక్టర్లు షాకిచ్చారు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను టెస్టు జట్టు వైస్ కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ను గిల్ డిప్యూటీగా నియమించారు.అంతేకాదు వన్డే జట్టులోనూ పంత్కు చోటు దక్కలేదు. కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. కాగా 2023 అక్టోబరులో చివరగా టీమిండియా తరఫున వన్డే ఆడిన ఇషాన్ కిషన్.. ఈ సిరీస్తో రీఎంట్రీ ఇస్తున్నాడు. అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్.. ఏకంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్.. ఐపీఎల్-2026లో సన్రైజర్స్ తరఫునా సత్తా చాటుతున్నాడు. వారిద్దరికి విశ్రాంతిఈ క్రమంలోనే వన్డే జట్టులోనూ అతడికి సెలక్టర్లు చోటిచ్చారు. నిజంగా అతడికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ లాంటిదే. ఇక ముందుగా ఊహించినట్లుగానే ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అతడిపై పనిభారాన్ని తగ్గించే క్రమంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.అయితే, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా ఈ సిరీస్లకు ఎంపిక చేయకపోవడం గమనార్హం. అతడికి కూడా విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. రంజీల్లో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు మొండిచేయి చూపారు.కొత్త ముఖాలకు చోటుతాజా ఎడిషన్లో ఆకిబ్ 60 వికెట్లు తీసినప్పటికీ అతడికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఐపీఎల్, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్కు మాత్రం తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు బీసీసీఐ ప్రిన్స్ను ఎంపిక చేసింది.రోహిత్, హార్దిక్ డౌటేఇక ప్రిన్స్ యాదవ్తో పాటు పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ మానవ్ సుతార్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే వంటి కొత్త ఆటగాళ్లు కూడా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్కు లోబడి అందుబాటులో ఉంటారని బీసీసీఐ తెలిపింది.ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి.. హార్దిక్ ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా వన్డే జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇక వన్డే జట్టు వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తన స్థానం నిలబెట్టుకోగా.. అఫ్గన్తో సిరీస్ ద్వారా దిగ్గజ బ్యాటర్, వన్డే రారాజు విరాట్ కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.అఫ్గనిస్తాన్తో ఏకైక టెస్టుకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.టీమిండియా- అఫ్గనిస్తాన్ టెస్టు, వన్డే సిరీస్ షెడ్యూల్ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి మొదలు- న్యూ చండీగఢ్- ఉదయం 9.30 గంటలకు ఆరంభంతొలి వన్డే: జూన్ 14- ధర్మశాల- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంరెండో వన్డే: జూన్ 17- లక్నో- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభంమూడో వన్డే: జూన్ 20- చెన్నై- మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం.చదవండి: IPL 2026: ముంబై ఇండియన్స్ కీలక ప్లేయర్లు అవుట్ -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ!
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. న్యూజిలాండ్తో రెండో వన్డేలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున.. మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న తొలి వన్డే జరుగగా కివీస్ గెలుపొందింది.198 పరుగులకు ఆలౌట్ఈ క్రమంలో సోమవారం రెండో వన్డే జరుగగా బంగ్లాదేశ్ జయభేరి మోగించింది. యువ పేసర్ నహీద్ రాణా (5/32) కెరీర్ అత్యుత్తమ గణాంకాలతో చెలరేగి బంగ్లాకు విజయం అందించాడు. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి.. 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. చెలరేగిన నహీద్ఓపెనర్ నిక్ కెల్లీ (102 బంతుల్లో 83; 14 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ టామ్ లాథమ్ (14), హెన్రీ నికోల్స్ (13), విల్ యంగ్ (2), మొహమ్మద్ అబ్బాస్ (19), డీన్ ఫోక్స్ క్రాఫ్ట్ (15), క్లార్క్సన్ (6) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు చేరారు. తన్జిద్, షంటో హాఫ్ సెంచరీలుబంగ్లా బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నహీద్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో షరీఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 35.3 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. తన్జిద్ హసన్ (58 బంతుల్లో 76; 10 ఫోర్లు, 4 సిక్స్లు), నజ్ముల్ హసన్ షంటో (71 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సైఫ్ హసన్ (8), సౌమ్య సర్కార్ (8), లిటన్ దాస్ (7) విఫలమైనా... లక్ష్యం చిన్నది కావడంతో బంగ్లాదేశ్కు ఎక్కువ ఇబ్బంది కాలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జైడన్ లెనాక్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది.ఫీజులో 10 శాతం కోతఅయితే, న్యూజిలాండ్తో రెండో వన్డేలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున ఐసీసీ బంగ్లాకు షాకిచ్చింది. బంగ్లా జట్టు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనుందన ఈ మేరకు శిక్ష వేసింది. కాగా బంగ్లాదేశ్- న్యూజిలాండ్ మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే గురువారం జరగనుంది. చట్టోగ్రామ్ ఇందుకు వేదిక.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డుpic.twitter.com/3kSqC7iEUy 🚨 BANGLADESH WIN 🚨BAN vs NZ — 2nd ODI | Sher-e-Bangla, DhakaBangladesh chase down 199 with 6 wickets in hand!The heroes of the win:-Nahid Rana — 5 wickets, dismantled the NZ batting lineup-Tanzid Hasan Tamim — 76 off 58 balls, set the chase on…— Suresh N (@TheDugoutStats) April 20, 2026 -
బంగ్లా 221 ఆలౌట్.. న్యూజిలాండ్దే తొలి వన్డే
బంగ్లాదేశ్ టూర్ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హెన్రీ నికోలస్ (68) టాప్ స్కోరర్గా నిలవగా, డియాన్ ఫాక్స్ క్రాఫ్ట్ (59) అర్థసెంచరీ సాధించాడు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసెన్, షోరిపుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. సైఫ్ హసన్ (57), తౌహిద్ హృదోయ్ (55) అర్థసెంచరీలు సాధించారు. లిటన్ దాస్ (46) పర్వాలేదనిపించాడు. అయితే వీరు ఔటైన తర్వాత బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ 4 వికెట్లతో చెలరేగగా, నాథన్ స్మిత్ 3 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో అర్థసెంచరీ, బౌలింగ్లో ఒక వికెట్ తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనరబరిచిన డియాన్ ఫాక్స్క్రాఫ్ట్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సోమవారం జరగనుంది. -
బీసీసీఐకి మా రిక్వెస్ట్.. లేఖలో ఆ విషయాలు: బంగ్లాదేశ్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సంప్రదించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాజాగా ధ్రువీకరించింది. భారత్తో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం తాము ముందడుగు వేసినట్లు తెలిపింది. కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.భద్రతా కారణాలు చూపుతూఈ క్రమంలో బంగ్లాదేశ్ ఫాస్ట్బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు భారత్కు వచ్చేందుకు బంగ్లా నిరాకరించింది. భద్రతా కారణాలు చూపుతూ తమ వేదికను శ్రీలంకను మార్చమని ఐసీసీని కోరగా.. ప్రతికూల నిర్ణయం రావడంతో టోర్నీ నుంచే తప్పుకొంది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు వంత పాడుతూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది. ఐసీసీ సైతం బీసీసీఐ ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్కు అన్యాయం చేసిందని ఆరోపించింది. ఇందుకు ప్రతిగా తాము భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడింది.భారీగా నష్టపోయే ప్రమాదంఐసీసీ రంగంలోకి దిగడంతో టీమిండియాతో మ్యాచ్ ఆడటమే కాకుండా.. యథావిధిగా మరోసారి ఓటమిని మూటగట్టుకుంది పాకిస్తాన్. ఈ ఎపిసోడ్తో బంగ్లాదేశ్ ఆర్థికంగా భారీగా నష్టపోయే ప్రమాదం వచ్చిపడింది. ఆదేశంలోని మెజారిటీ ప్లేయర్ల క్రికెట్ కిట్లకు స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు వైదొలుగుతాయనే భయం పట్టుకుంది.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పలువురు మాజీ క్రికెటర్లు బంగ్లా బోర్డును హెచ్చరించారు కూడా!.. ఈ క్రమంలో తాజాగా బీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ నజ్ముల్ అబెదిన్ ఫాహిమ్ ANIతో మాట్లాడుతూ కీలక విషయం వెల్లడించాడు. బీసీసీఐని సంప్రదించాము‘‘వివిధ దేశాల క్రికెట్ బోర్డులతో మేము సమన్వయం చేసుకుంటున్నాము. ఇటీవలే బీసీసీఐని కూడా సంప్రదించాము. ఇ-మెయిల్ ద్వారా లేఖ పంపించాము. అందులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన గురించి ప్రస్తావించాము. ఈ ఏడాది సెప్టెంబరులో టీమిండియా బంగ్లాదేశ్లో పర్యటించాల్సిన విషయాన్ని గుర్తుచేశాము.అదే విధంగా మా మహిళా జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. దీనితో పాటు పరస్పర ప్రయోజనాలు చేకూరేలా క్రికెట్కు సంబంధించి ఇతర కార్యక్రమాలు ఏమైనా నిర్వహించవచ్చన్న విషయాన్ని కూడా పరిశీలించాలని అభ్యర్థించాము’’ అని నజ్ముల్ తెలిపాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు!కాగా బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రహమాన్ ఎన్నికైన తర్వాత భారత్- బంగ్లా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఏప్రిల్ 7,8 తేదీల్లో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖా మంత్రి డాక్టర్ ఖాలిలుర్ రహమాన్ భారత పర్యటనకు రానున్నారు.ఈ నేపథ్యంలో క్రికెట్లోనూ సంబంధాల పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది బంగ్లా బోర్డు. ఇదిలా ఉంటే గతేడాది ఆగస్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. టూర్ వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబరు 1- 13 మధ్య బంగ్లాదేశ్తో భారత్ మూడు వన్డే, మూడు టీ20లు ఆడేలా షెడ్యూల్ ఖరారు కావాలని బీసీబీ కోరుకుంటోంది.చదవండి: టీమిండియాకు శుభవార్త: నితీశ్ రెడ్డిపై గావస్కర్ ప్రశంసలు -
మూడో వన్డేలో విండీస్ చిత్తు.. క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
సెయింట్ కిట్స్ వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0 తో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఆఖరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 35.4 ఓవర్లలో కేవలం 136 పరుగులకే కుప్పకూలింది.అసీస్ స్పిన్నర్ అలానా కింగ్ ఐదు వికెట్లు పడగొట్టి కరేబియన్ జట్టు పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు గార్డనర్ రెండు, హామిల్టన్, కారీ, మెక్గ్రాత్ తలా వికెట్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో చినెల్లే హెన్రీ (42 పరుగులు), హేలీ మాథ్యూస్(34 పరుగులు) రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 19.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్(68), ఎలీస్ పెర్రీ(33) నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించారు. విండీస్ బౌలర్లలో అష్మిని మునిసర్ ఒక్క వికెట్ పడగొట్టింది.కాగా అంతకుముందు టీ20 సిరీస్ను కూడా ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా తమ ఖాతాలో వేసుకుంది. దీంతో మొత్తం పర్యటనలో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.చదవండి: ముస్తాఫిజుర్ రహమాన్ తొలగింపు దురదృష్టకరం: ఐపీఎల్ చైర్మన్ -
న్యూజిలాండ్ ప్లేయర్ ప్రపంచ రికార్డు
న్యూజిలాండ్ క్రికెటర్ అమేలియా కెర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనర్ బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. కాగా సౌతాఫ్రికా మహిళా జట్టుతో స్వదేశంలో న్యూజిలాండ్ వైట్బాల్ సిరీస్లు ఆడుతోంది.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా ఆతిథ్య న్యూజిలాండ్ 4-1 తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఇక ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా గెలవగా.. వెల్లింగ్టన్ వేదికగా బుధవారం రెండో వన్డే జరిగింది.346 పరుగులుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. కెప్టెన్ వాల్వర్ట్ (69; 8 ఫోర్లు, 1 సిక్స్), అనికె బాష్ (91; 12 ఫోర్లు), ట్రియాన్ (25 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్సెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనలో న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలిచింది. మహిళల వన్డే క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగాగతేడాది ఆస్ట్రేలియాపై టీమిండియా ఛేజ్ చేసిన 339 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కివీస్ సారథి అమేలియా కెర్ (Amelia Kerr) ఆకాశమే హద్దుగా చెలరేగింది. వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన ఆమె మొత్తంగా 139 బంతుల్లో 179 పరుగులతో అజేయంగా నిలిచింది.కెర్ ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 1 సిక్స్ ఉండటం విశేషం. ఇలా కెప్టెన్ ఇన్నింగ్స్తో కెర్ న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చగా... ఆమెకు ఇసాబెల్లా (68;11 ఫోర్లు) చక్కటి సహకారం అందించింది. సఫారీ బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ప్రస్తుతం సిరీస్ 1–1తో సమమైంది.అమేలియా కెర్ ప్రపంచ రికార్డుసౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా అమేలియా కెర్ 179 పరుగులతో అజేయంగా నిలవడం ద్వారా.. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్- ఓపెనింగ్ ప్లేయర్గా రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం చమరి ఆటపట్టు పేరిట ఉండేది.బ్రిస్టల్ వేదికగా 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఆటపట్టు 178 పరుగులతో అజేయంగా నిలిచింది. తాజాగా ఆమె కంటే ఒక్క పరుగు ఎక్కువ చేసిన అమేలియా కెర్.. ఆటపట్టును అధిగమించింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (171), న్యూజిలాండ్ స్టార్లు సుజీ బేట్స్ (168), బీఎమ్ హైల్డే (157) కెర్, ఆటపట్టు తర్వాతి స్థానాల్లో నిలిచారు.చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు -
బంగ్లాదేశ్ పర్యటన.. కివీస్ వన్డే, టీ20 జట్ల ప్రకటన
బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును కివీస్ బోర్డు ప్రకటించింది. ఇందులో పేస్ త్రయం మ్యాట్ ఫిషర్, విలియం ఓ రూర్కీ, బ్లెయిర్ టిక్నర్లకు చోటు దక్కింది. కాగా భారత్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్.. రన్నరప్తో సరిపెట్టుకుంది.ఈ క్రమంలో ఐసీసీ టోర్నీ ముగిసిన వెంటనే దాదాపుగా ద్వితీయ శ్రేణి జట్టుతో స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడింది కివీస్ జట్టు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రొటిస్ జట్టు ఆతిథ్య న్యూజిలాండ్పై 3-2తో గెలిచింది.పరిమిత ఓవర్ల సిరీస్లుఇక ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ బంగ్లాదేశ్ పర్యటన (New Zealand tour of Bangladesh, 2026)కు వెళ్లేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత ఏప్రిల్ 17న వన్డే సిరీస్ మొదలుకానుండగా.. మే 2 నాటి మూడో టీ20తో ఈ టూర్ ముగియనుంది.టామ్ లాథమ్ సారథ్యంలోఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు కివీస్ బోర్డు తాజాగా తమ జట్లను ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్థానంలో వన్డే, టీ20 జట్లకు టెస్టు కెప్టెన్ టామ్ లాథమ్ సారథ్యం వహించనున్నాడు.కాగా సాంట్నర్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడితో పాటు పలువురు కీలక ప్లేయర్లు సైతం ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్ విధులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్లేయర్లతో కివీస్ బోర్డు వన్డే, టీ20 జట్లను ప్రకటించింది.ఇక గాయాల నుంచి కోలుకున్న ఫిషర్, ఓరూర్కీ, టిక్నర్ తిరిగి జట్టుతో చేరడం పట్ల హెడ్కోచ్ రాబ్ వాల్టర్ హర్షం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్ చాలా కాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు.బంగ్లాదేశ్ పర్యటనకు న్యూజిలాండ్ వన్డే జట్టు (ఏప్రిల్ 17, 20, 23)టామ్ లాథమ్ (కెప్టెన్), ముహమ్మద్ అబ్బాస్, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, హెన్రీ నికోల్స్, విలియం ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.బంగ్లాదేశ్తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు (ఏప్రిల్ 27, 29, మే 2)టామ్ లాథమ్ (కెప్టెన్), కెటెనె క్లార్క్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్, మ్యాట్ ఫిషర్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెవాన్ జేకబ్స్, నిక్ కెల్లి, జేడెన్ లెనాక్స్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఇష్ సోధి, బ్లెయిర్ టిక్నర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీని పంపండి: మైకేల్ వాన్ -
‘అఫ్గనిస్తాన్తో సిరీస్ బాయ్కాట్ చేయొచ్చు’
క్రికెట్ ఐర్లాండ్ ఇటీవలే అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సొంతగడ్డపై ఆగష్టు 5- 14 వరకు ఐర్లాండ్- అఫ్గనిస్తాన్ మధ్య ఐదు వన్డేలు జరుగనున్నట్లు వెల్లడించింది.కాగా గతంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు అఫ్గనిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లు బహిష్కరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అఫ్గన్లో 2021లో తిరిగి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం మహిళలు, బాలికల పట్ల అనుసరిస్తున్న విధానాలే కారణం.అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ సమయంలో ఇంగ్లండ్ అఫ్గన్తో మ్యాచ్ బాయ్కాట్ చేస్తామని ముందుగా చెప్పినా.. ఆ తర్వాత మాత్రం మ్యాచ్ ఆడింది. ఇక ఐర్లాండ్ తాజాగా అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ ఆడనుండటం పట్ల విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో క్రికెట్ ఐర్లాండ్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్ గ్రేమ్ వెస్ట్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము అఫ్గన్తో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఇష్టం లేని ఆటగాళ్లు తప్పుకొనే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఆటగాళ్లకు మేము ఆ వెసలుబాటు కల్పిస్తాం.ఇప్పటికే పురుష, మహిళల జట్లతో మేము ఈ విషయంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాము. బోర్డుతో కూడా మాట్లాడాము. ఇరు వర్గాలకు ఇందుకు సంబంధించి పూర్తి అవగాహన ఉంది. ఈ విషయంలో వారికి స్వేచ్ఛ ఉంటుంది’’ అని వెస్ట్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. క్రికెట్ ఐర్లాండ్ సీఈవో ఇటీవలే ఎంపికైన సారా కీన్ అఫ్గనిస్తాన్తో సిరీస్ నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళగా తనకు ఈ విషయంలో నైతికంగా కాస్త ఇబ్బందిగానే ఉందని.. అయితే, సిరీస్ బహిష్కరించడం ద్వారా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని అన్నారు.తమ బోర్డులో నలభై శాతం మహిళలే ఉన్నారని.. అఫ్గనిస్తాన్తో సిరీస్ను బహిష్కరించే బదులు.. ఆ మహిళా జట్టును కూడా ఐర్లాండ్కు పంపాల్సిందిగా కోరినట్లు సారా తెలిపారు. కాగా ఇటీవల ఐర్లాండ్ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైంది. కనీసం సూపర్-8 దశ చేరకుండానే లీగ్ స్టేజీలోనే నిష్క్రమించింది. ఫలితంగా టీ20 కెప్టెన్ పదవికి పాల్ స్టిర్లిండ్ రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టులో అఫ్గనిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు బ్రీడీ, బెల్ఫాస్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
జట్టులో చోటుకే దిక్కులేదు.. కెప్టెన్ను చేయాలా?
పాకిస్తాన్ పేస్ దళ నాయకుడిగా పేరొందిన షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో పేలవ ప్రదర్శన, వన్డే కెప్టెన్గా బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమి ఇందుకు తాజా కారణాలు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 103 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టార్మ్ పేసర్ 136 వికెట్లు కూల్చాడు.తద్వారా పాక్ తరఫున పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షాహిన్ ఆఫ్రిది కొనసాగుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడి ఆట మరీ దిగజారింది. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్ టోర్నీలో మొత్తంగా ఎనిమిది వికెట్లు మాత్రమే తీయగలిగాడు.పదకొండేళ్ల తర్వాతఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో పాక్ వన్డే జట్టుగా బాధ్యతలు నిర్వర్తించిన షాహిన్ ఆఫ్రిది.. 2-1 తేడాతో పాక్ సిరీస్ కోల్పోవడంతో విమర్శల పాలయ్యాడు. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత పాక్ బంగ్లాకు వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి కావడంతో విమర్శలు పదునెక్కాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ సైతం షాహిన్ ఆఫ్రిది ఆట తీరుపై మండిపడ్డాడు.జట్టులో చోటుకే దిక్కులేదు‘‘పాకిస్తాన్ టీ20, వన్డే జట్ల కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిది ఉండాలని గతంలో క్యాంపెయిన్ నడిచింది. ఆ తర్వాత వన్డేలకు బదులు టీ20 జట్టుకు కెప్టెన్ అయితే చాలు అన్నారు. కానీ ఇప్పుడు వన్డే కెప్టెన్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు.నిజానికి పాక్ టీ20 జట్టులో అతడికి చోటు కూడా ఇవ్వొద్దు. ముఖ్యంగా తుదిజట్టులో ఉండే అర్హత అతడు కోల్పోయాడు. అతడి ఖేల్ ఖతమైపోయింది’’ అని రషీద్ లతీఫ్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాడు.మామ అలామరోవైపు.. బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమి తర్వాత షాహిన్ ఆఫ్రిది మామ, మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్, బంగ్లా సిరీస్లో ఓటముల నేపథ్యంలో విమర్శలకు సెలక్టర్లు అర్హులేనని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. ఏ ఫార్మాట్కు ఎవరిని కెప్టెన్ చేయాలో తెలియదంటూ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రషీద్ లతీఫ్ పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
’ఇంకా నేర్చుకుంటూనే ఉండు.. సెలక్టర్లకు బుద్ధి లేదు’
పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్పై ఆ దేశ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెజాద్ విమర్శల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా నేర్చుకునే దశలోనూ ఉన్నాడంటూ చురకలు అంటించాడు. ఇప్పటికైనా ఆట తీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డాడు.చేదు అనుభవం.. బంగ్లా చేతిలో చిత్తుటీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలోనూ చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేల సిరీస్లో 2-1తో ఓడిపోయి దాదాపు పదకొండేళ్ల తర్వాత.. తొలిసారి బంగ్లాదేశ్కు సిరీస్ కోల్పోయింది.షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో బంగ్లాతో వన్డే సిరీస్ ఆడిన పాకిస్తాన్ జట్టులో రిజ్వాన్ ఒక్కటే సీనియర్ మోస్ట్ ప్లేయర్. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లలో కలిపి కేవలం 58 పరుగులే చేశాడు.అసలు టెక్నికే సరిగ్గా లేదుఈ నేపథ్యంలో అహ్మద్ షెజాద్ రిజ్వాన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘బంతులు నువ్వు ఆడగలిగేలానే పడుతున్నాయి రిజ్వాన్ సాబ్. నువ్వు చాలా సమయం తీసుకుంటున్నావు. అయినా సరే బంతిని బాదలేకపోతున్నావు.అసలు టెక్నికే సరిగ్గా లేదు. లెగ్ సైడ్ ఆడాల్సింది. ఇన్నేళ్లు గడిచినా నువ్వింకా నేర్చుకునే దశలోనే ఉన్నావు. అసలు నీ ఆటలో ఏమైనా పురోగతి ఉందా? టీ20 ప్రపంచకప్ జట్టులో నీకు స్థానమే లేదు.బుద్ధి రావడం లేదువన్డేల్లోనైనా అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్ వంటి జట్టుపై నువ్వు సెంచరీలు బాదాల్సింది. కానీ సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించేలా చెత్తగా ఆడావు. నిన్ను జట్టుకు ఎంపిక చేసే వాళ్లకు కూడా బుద్ధి రావడం లేదు’’ అని అహ్మద్ షెజాద్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2015లో పాకిస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన రిజ్వాన్.. ఇప్పటి వరకు 41 టెస్టుల్లో 2399, 103 వన్డేల్లో 2979, 106 టీ20లలో 3414 పరుగులు సాధించాడు.చదవండి: కోహ్లి, గేల్ కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్ -
‘అతడు మానసికంగా అన్ఫిట్.. అందుకే చోటు కరువు’
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి బంగ్లాదేశ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది. బంగ్లా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో ఈ మూడు మ్యాచ్లు ఆడిన పాకిస్తాన్.. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడినా.. రెండో వన్డేలో గెలిచింది. ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన మూడో వన్డేలో మాత్రం 11 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎంపిక చేశారు?ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ హెడ్కోచ్ మైక్ హెసన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ‘‘ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎవరు ఎంపిక చేశారు? అన్నింటిలోనూ అతి జోక్యం అవసరమా? ఇదేమైనా అతడి అంకుల్స్ జట్టా?’’ అంటూ ఫైర్ అయ్యాడు.పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో...ఇక చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్తాన్ క్రికెట్ను నాశనం చేయడంలో ఆకిబ్ జావేద్ పాత్ర కూడా ఉంది. మైక్ హసన్కు తన సెలక్షన్ అధికారాలను కట్టబెట్టిందే అతడు. హెడ్కోచ్ అయినప్పటికీ.. సెలక్టర్ల పనిని తానే చేస్తున్నాడు. అతడే జట్టు ఎంపిక చేస్తున్నాడు. దీనికి కారణం ఎవరు?’’ అని బసిత్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మానసికంగానే అతడు అన్ఫిట్అదే విధంగా.. బాబర్ ఆజంను బంగ్లాదేశ్ పర్యటన నుంచి తప్పించడంపై ఆకిబ్ జావేద్ చేసిన వ్యాఖ్యలపైనా బసిత్ అలీ స్పందించాడు. ఆకిబ్ చెప్పినట్లు బాబర్కు ఎలాంటి గాయమూ కాలేదని పేర్కొన్నాడు. ‘‘బాబర్ ఆజం శారీరకంగా ఫిట్గానే ఉన్నాడు. మానసికంగానే అతడు అన్ఫిట్’’ అంటూ బసిత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా బాబర్ ఆజం గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలంఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో వన్డేల నుంచి సెలక్టర్లు అతడిని తప్పించినట్లు వార్తలు రాగా.. ఆకిబ్ జావేద్ మాత్రం ఫిట్గా లేనందువల్లే సెలక్ట్ చేయలేదని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాకిస్తాన్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, గత వరల్డ్కప్లో సూపర్-8 కూడా చేరుకుండానే నిష్క్రమించిన పాక్.. ఈసారి సూపర్-8కు చేరుకున్నా.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో బాబర్ ఆజం మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.చదవండి: అతడి ఆట అసాధారణం.. గంభీర్పై ద్రవిడ్ ప్రశంసలు -
బంగ్లాదేశ్దే వన్డే సిరీస్
ఢాకా: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు 2–1తో పాకిస్తాన్పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో నెగ్గింది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ చేజిక్కించుకుంది. కీలక మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీతో కదంతొక్కగా... తౌహిద్ హృదయ్ (48 నాటౌట్; 4 ఫోర్లు), లిటన్ దాస్ (41; 1 ఫోర్, 1 సిక్స్), సైఫ్ హసన్ (36; 3 ఫోర్లు) అతడికి సహకరించారు. పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సల్మాన్ ఆగా (98 బంతుల్లో 106; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీతో పోరాడగా... అబ్దుల్ సమద్ (34; 5 ఫోర్లు), సాద్ మసూద్ (38; 5 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాహిబ్జాదా ఫర్హాన్ (6), మాజ్ (6), రిజ్వాన్ (4) విఫలమయ్యారు. పాకిస్తాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్స్లు కొట్టిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది (38 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లు ఘాజి ఘోరి, సాద్ మసూద్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు. -
అబ్బో క్రీడాస్ఫూర్తి!.. పాక్ క్రికెటర్లపై లిటన్ దాస్ ఫైర్
పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లా- పాక్ మధ్య శుక్రవారం జరిగింది చారిటీ మ్యాచ్ కాదని.. అదొక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటూ చురకలు అంటించాడు. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరించామని స్పష్టం చేశాడు.కాగా మూడు వన్డేలు ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన పాకిస్తాన్ జట్టు తొలి వన్డేలో చిత్తుగా ఓడింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో మాత్రం సమిష్టిగా రాణించి ఆతిథ్య జట్టును చిత్తు చేసిన పాక్ 1-1తో సిరీస్ను సమం చేసింది.రనౌట్పై వివాదంఇదిలా ఉంటే.. పాక్ బ్యాటర్ సల్మాన్ ఆఘా రనౌట్ (Salman Agha's run-out)పై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్లో మొహ్మద్ రిజ్వాన్ స్ట్రెయిట్ షాట్ ఆడగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సల్మాన్కు బంతి తాకింది. అప్పటికే క్రీజును వీడిన అతడు బంతి అందుకుని మిరాజ్కు ఇచ్చే ప్రయత్నం చేయగా.. వేగంగా స్పందించిన మిరాజ్ బంతిని వికెట్లకు గిరాటేశాడు.మాటల యుద్ధంఈ క్రమంలో బంగ్లాదేశ్ రనౌట్కు అప్పీలు చేయగా.. సానుకూల ఫలితం వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన సల్మాన్ హెల్మెట్ను నేలకేసి కొట్టి అసంతృప్తి వెళ్లగక్కాడు. మిరాజ్తో కాసేపు మాటల యుద్ధం చేశాడు. ఇంతలో లిటన్ దాస్ జోక్యంచేసుకోగా.. రిజ్వాన్ అతడిని సముదాయించి పక్కకు తీసుకువెళ్లాడు.క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అయితే, సల్మాన్ రనౌట్ అయిన విషయంపై పాక్ జట్టు, మాజీ క్రికెటర్లు రాద్దాంతం చేస్తున్నారు. సల్మాన్ ఆఘా మిరాజ్ స్థానంలో ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవాడిని కాదన్నాడు. క్రీడా స్ఫూర్తి ప్రదర్శించేవాడిని అన్నాడు.ఇక పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందిస్తూ.. ‘‘నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ చేసింది సరైందే కావచ్చు. కానీ క్రీడాస్ఫూర్తికి వారు భంగం కలిగించారు. బ్యాటర్ బౌలర్కు సాయం చేద్దామని చూశాడు. కానీ అతడు తనని రనౌట్ చేస్తాడని ఊహించలేదు’’ అని మిరాజ్ తీరును విమర్శించాడు.ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ స్పందిస్తూ.. ‘‘ముందుగా అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. ఇదేమీ చారిటీ లీగ్ మ్యాచ్ కాదు. ఇదొక అంతర్జాతీయ మ్యాచ్.క్రీడాస్ఫూర్తికి భంగమా?నిబంధనలకు అనుగుణంగానే మేము రనౌట్ చేశాము. ఇందులో క్రీడాస్ఫూర్తికి భంగం కలిగినట్లు నాకైతే ఎక్కడా కనిపించలేదు. ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, మైదానంలో ఆటగాళ్లుగా అది అవుట్ అంటే అవుటేనని మా అందరికీ తెలుసు’’ అని పాక్ క్రికెటర్లు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (31), మాజ్ సదాకత్ (75)లతో పాటు రిజ్వాన్ (44), సల్మాన్ ఆఘా (64) రాణించారు. దీంతో 47.3 ఓవర్లలో 274 పరుగులు చేసి పాక్ ఆలౌట్ అయింది.బంగ్లా బౌలర్లలో రిషాద్ హొసేన్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ మిరాజ్ రెండు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, నహీద్ రాణా తలా ఒక వికెట్ తీశారు. ఇక వర్షం వల్ల బంగ్లా టార్గెట్ను డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లలో 243 పరుగులకు కుదించగా.. 23.3 ఓవర్లలో 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: SRH: బెస్ట్ ప్లేయింగ్ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026 -
BAN vs PAK: ’చెడ్డ మాటలు!.. అలా రనౌట్ చేస్తాడనుకోలేదు’
బంగ్లాదేశ్తో రెండో వన్డేలో తాను అవుటైన విధానంపై పాకిస్తాన్ క్రికెటర్ సల్మాన్ ఆఘా స్పందించాడు. ఆ సమయంలో తాను గందరగోళంలో పడిపోయానని.. అంతలో మెహిదీ హసన్ మిరాజ్ మాత్రం తనను రనౌట్ చేసేందుకే మొగ్గుచూపాడని పేర్కొన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మైదానంలోవాగ్యుద్ధం నడిచిందన్నాడు.అసలు విషయం ఏమిటంటే.. మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లా గెలవగా.. శుక్రవారం నాటి రెండో మ్యాచ్లో పాక్ జయభేరి మోగించింది.ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాక్ ఇన్నింగ్స్ సందర్భంగా బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 39వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగాడు. అప్పటికి క్రీజులో ఉన్న మొహ్మద్ రిజ్వాన్ మిరాజ్ బౌలింగ్లో నాలుగో బంతికి స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అది నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సల్మాన్ ఆఘా ప్యాడ్కు తగిలి కింద పడింది.రనౌట్కు అప్పీలు ఈ క్రమంలో బంతి కోసం వచ్చిన మిరాజ్- సల్మాన్ను ఢీకొట్టగా.. బంతిని తీసి మిరాజ్కు ఇచ్చే ప్రయత్నం చేశాడు సల్మాన్. అప్పటికి అతడు క్రీజు బయటే ఉండటం గమనించిన మిరాజ్ బంతిని అందుకుని స్టంప్స్కు గిరాటేసి.. రనౌట్కు అప్పీలు చేశాడు.ఇందుకు అంపైర్ నుంచి సానుకూల ఫలితంగా వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సల్మాన్ మిరాజ్తో గొడవపడ్డాడు. ఇంతలో లిటన్ దాస్ కూడా మిరాజ్కు మద్దతుగా రాగా.. రిజ్వాన్ అతడిని శాంతింపజేశాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా మిరాజ్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు.. టెక్నికల్గా మిరాజ్ చేసింది సరైందేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ పరిణామాలపై సల్మాన్ ఆఘా స్వయంగా స్పందించాడు.Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026అలా రనౌట్ చేస్తాడనుకోలేదు‘‘అతడు చేసింది నిబంధనల ప్రకారం సరైందే. ఆ సమయంలో అతడు తాను సరైంది అనుకున్న పనే చేశాడు. నేనే కాస్త భిన్నంగా ప్రవర్తించాల్సింది. గతంలో నేను ఇప్పుడూ ఇలా చేయలేదు. ఇకముందు కూడా చేయను.నిజానికి బంతి నా ప్యాడ్ను తాకి.. తర్వాత బ్యాట్కు తాకింది. కాబట్టి అతడు నన్ను రనౌట్ చేయడని భావించా. ముందుగా చెప్పినట్లు బంతి నా ప్యాడ్, బంతిని అప్పటికే తాకింది. అతడికి బంతి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశా. నేనేమీ పరుగు తీయడానికి ప్రయత్నించలేదు.చెడ్డ మాటలు!.. కానీ అతడు నన్ను రనౌట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మేమిద్దరం ఒకరినొకరం చాలా మాటలే అనుకున్నాం. అవేమీ మంచి మాటలు కాదు. కోపంలో ఇద్దరం అలా నోరు జారాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. కాగా బంతి బ్యాటర్ ప్యాడ్ లేదంటే దుస్తుల్లో ఇరుక్కుంటే డెడ్బాల్ అవుతుంది. అలా కాకుండా ప్యాడ్, బ్యాట్ను తాకి రోల్ అయితే మాత్రం అది ఇంకా లైవ్లోనే ఉన్నట్లు లెక్క. ఈ నిబంధన ప్రకారమే మిరాజ్ సల్మాన్ను రనౌట్ చేశాడు. కానీ సల్మాన్ మాత్రం ఆ బంతి డెడ్ అయిందని భావించడం కన్ఫ్యూజన్కు దారితీసి ఉంటుంది.ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో సల్మాన్ హాఫ్ సెంచరీ (64) చేయగా.. మిరాజ్ రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా.. డీఎల్ఎస్ పద్ధతిలో పాక్ బంగ్లాపై 128 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్ను 1-1తో సమం చేసింది.చదవండి: ఇది కాదు.. గంభీర్కు ముందుంది అసలైన సవాల్: గంగూలీ -
ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్
బంగ్లాదేశ్తో తొలి వన్డేలో ఎదురైన ఘోర పరబాభావానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవారం ఢాకా వేదికగా జరిగిన రెండో వన్డేలో 128 పరుగుల భారీ తేడాతో (డీఎల్ఎస్ పద్దతి ప్రకారం) ఆతిథ్య బంగ్లాను పాక్ చిత్తు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మెన్ ఇన్ గ్రీన్ 1-1తో సమం చేసింది.ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 47.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ బ్యాటర్లలో యువ ఆటగాడు మాజ్ సదాకత్ (75) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ ఆఘా (64), మహమ్మద్ రిజ్వాన్ (44) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లాదేశ్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో ఆటకు వర్షం కూడా అంతరాయం కలిగించింది. భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా ఆట రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఆ తర్వాత డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 243 పరుగులుగా కుదించారు. కానీ ఆట తిరిగి మొదలయ్యాక కూడా బంగ్లా వికెట్ల పతనం కొనసాగింది.లిటన్ దాస్ (41) కాసేపు పోరాడినా, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. దీంతో బంగ్లా జట్టు కేవలం 23.3 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో మాజ్ సదాకత్, హారిస్ రవూఫ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. షాహిన్ అఫ్రిది రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే మార్చి 15న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IPL 2026: కేకేఆర్కు మరో భారీ షాక్ -
పాక్కు ఘోర ఓటమి.. షాహిన్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైంది. ఢాకా వేదికగా తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లా చేతిలో పాక్ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే పాకిస్తాన్ జట్టు ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే.మూడు వన్డేల సిరీస్ఈ క్రమంలో వరల్డ్కప్ టోర్నీ అనంతరం తొలుత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది పాక్ జట్టు. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడాల్సి ఉండగా.. బుధవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరిగింది. 114 పరుగులకే ఆలౌట్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిని పాక్.. 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ 27 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఆల్రౌండర్ ఫాహీమ్ ఆష్రఫ్ 37 పరుగులతో పాక్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లాదేశ్ యువ పేసర్ నహీద్ రాణా ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ మూడు, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.15.1 ఓవర్లలోనే ఫినిష్లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ కేవలం 15.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. రెండు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. కాగా వరల్డ్కప్ టోర్నీలో విఫలమైన బాబర్ ఆజంను బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నుంచి తప్పించింది యాజమాన్యం.ఈ క్రమంలో బంగ్లాదేశ్తో తొలి వన్డే సందర్భంగా సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్, మాజ్ సదాకత్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. వీరిలో ఫర్హాన్ కాస్త ఫర్వాలేదనిపించగా.. అతడి ఓపెనింగ్ జోడీగా వచ్చిన సదాకత్ 18 పరుగులకే నిష్క్రమించాడు. వన్డౌన్లో వచ్చిన షామిల్ 4 పరుగులకే అవుటయ్యాడు.ఓడినా పర్లేదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది స్పందిస్తూ.. ‘‘ఓడిపోయినపుడు ఎన్నో అంశాలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇది యువ జట్టు. చివరి వరకు ఈ జట్టుకు నేను మద్దతుగా ఉంటాను’’ అని తెలిపాడు.అదే విధంగా.. ‘‘వన్డే క్రికెట్లో భాగస్వామ్యాల నిర్మాణం అత్యంత ముఖ్యం. బ్యాట్, బాల్.. రెండింటితోనూ రాణించాల్సి ఉంటుంది. జట్టుకు ఇదొక మేలుకొలుపు లాంటిది. నహీద్ రాణా రానంత వరకు మా జట్టు బాగానే ఆడింది.అత్యద్భుతంగా బౌలింగ్ చేసిఅయితే, అతడు అత్యద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని దెబ్బ కొట్టాడు. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలే ఉన్నాయి. ఆ రెండింటిపై దృష్టి పెట్టి సానుకూల ఫలితం సాధిస్తాం’’ అని షాహిన్ ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లా- పాక్ మధ్య మార్చి 13న రెండు వన్డే, మార్చి 15న మూడో వన్డే జరుగుతాయి. ఢాకాలోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
‘గేమ్ప్లాన్ ఎవడిదో కానీ చంపేయాలి’!
పాకిస్థాన్ క్రికెట్ అంటేనే అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ, కమ్రాన్ అక్మల్ గేమ్ప్లాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ బాసిత్ అలీ మాట్లాడుతూ.. ‘పవర్ప్లేలో 60 కంటే తక్కువ పరుగులు చేయాలని చెప్పిన వాడిని మొదట షూట్ చేయాలి. గేమ్ప్లాన్ చాలా చెత్తగా ఉంది. నాకు తెలిసి ఆ చెప్పినవాడు ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రౌండ్లోకి దిగినట్లుగా అనిపించడం లేదు. కేవలం పేపర్పై రాసుకొన్న థియరీని మాత్రమే అప్లై చేసే పనిలో పడ్డట్లున్నాడు. పిచ్ పరిస్థితులపై కనీసం అంచనాలు లేకుండా జట్టును బరిలోకి ఎలా దించుతారు. ఇదే పిచ్పై టీమిండియా కూడా ఓటమి పాలైందన్న సంగతి మరిచిపోయినట్లున్నారు.’ అని తెలిపాడు. మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఘాటుగా స్పందించాడు. ‘ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంటే.. పాకిస్థాన్ ఆటతీరు మాత్రం క్లబ్ క్రికెట్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నట్లుగా ఉంది. బాసిత్ అలీకి ఫోన్ చేసి పాక్ జట్టు ఆడుతున్న ఆట గురించి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతేకాదు క్లబ్ క్రికెటర్లు కూడా ఇంత దారుణంగా ఆడరనుకుంటా’ అని తెలిపాడు. బంగ్లాతో మ్యాచ్లో ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయని బాసిత్ అలీ తెలిపారు. జట్టులో యువరక్తం ఎక్కువగా ఉందని, వాళ్లంతా సెటిల్ కావడానికి టైం పట్టే అవకాశముందన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 30.4 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్ అశ్రఫ్ 37 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రానా 5 వికెట్లు తీయగా, మెహదీ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బంగ్లాదేశ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే మార్చి 13న జరగనుంది.చదవండి: గురుశిష్యులకు అరుదైన గౌరవం! -
200 పరుగుల తేడాతో చిత్తుగా!
జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ మహిళల జట్టు క్లీన్స్వీప్ చేసింది. డునెడిన్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్ అమ్మాయిలు 200 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కెప్టెన్ అమెలియా కెర్ (106 బంతుల్లో 80), మ్యాడీ గ్రీన్ (73 బంతుల్లో 94) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో చటోన్వాజ 2 వికెట్లు తీయగా, మకుశా, అడెల్, మరంగేలు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మహిళల జట్టు 27.1 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. లోరీన్ షుమా 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, చిపో టిరిపానో 22 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో అమేలి కెర్ 5 వికెట్లతో జింబాబ్వే నడ్డి విరవగా.. రోస్మేరీ మెయిర్ 2 వికెట్లు పడగొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అమెలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకుంది. చదవండి: భజ్జీ చేసిన గాయం ఇప్పటికీ మానలేదు! -
PCB: బాబర్పై వేటు.. కెప్టెన్గా ఆఫ్రిది.. ఆరుగురికి చోటు
ఊహాగానాలే నిజమయ్యాయి. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విఫలమైన ‘స్టార్’ బ్యాటర్ బాబర్ ఆజంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వేటు వేసింది. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ నుంచి అతడిని తప్పించింది.బంగ్లాతో వన్డే సిరీస్కాగా ఢాకా వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య మార్చి 11- 15 మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో పర్యటించే జట్టును పీసీబీ బుధవారం ప్రకటించింది. పేస్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్గా కొనసాగించిన యాజమాన్యం.. బాబర్ను మాత్రం ఎంపిక చేయలేదు.ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు ఇచ్చారు సెలక్టర్లు. తద్వారా సీనియర్లపై కఠిన చర్యలు తప్పవని.. జట్టు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సమద్, మాజ్ సదాకత్, ముహమద్ ఘాజి ఘోరి, సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, షామిల్ హుసేన్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు ఇచ్చారు.అందుకే బాబర్పై వేటు.. వారికి చోటుకాగా బాబర్ ఆజం ఆట తీరుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ప్రపంచకప్ టోర్నీలోనూ అతడు విఫలమయ్యాడు. మొత్తంగా 91 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.ఇక గతేడాది వన్డేల్లోనూ బాబర్ ఆజం 17 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 544 పరుగులే చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న ఓపెనర్ ఫర్హాన్కు మాత్రం సెలక్టర్లు వన్డేక్యాప్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాగా ఫర్హాన్ వరల్డ్కప్ టోర్నీలో 383 పరుగులతో రాణించాడు.ఇదిలా ఉంటే.. అన్క్యాప్డ్ ప్లేయర్లు అబ్దుల్, మాజ్, మసూద్, హుసేన్ ఇప్పటికే పాకిస్తాన్ షాహిన్స్ తరఫున సత్తా చాటారు. ఇక సీనియర్ ప్లేయర్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ హ్యారిస్ రవూఫ్, మొహమ్మద్ వసీం జూనియర్, ఆల్రౌండర్ ఫాహిమ్ ఆష్రఫ్, సల్మాన్ ఆఘా, మణికట్టు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఈ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు.బంగ్లాదేశ్తో వన్డేలకు పాకిస్తాన్ జట్టుషాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫాహిమ్ ఆష్రఫ్, ఫైజల్ అక్రం, హ్యారిస్ రవూఫ్, హుసేన్ తలత్, మాజ్ సదాకత్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వసీం జూనియర్, ముహమద్ ఘాజి ఘోరి (వికెట్ కీపర్), సాద్ మసూద్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా, షామిల్ హుసేన్షెడ్యూల్మార్చి 11- తొలి వన్డేమార్చి 13- రెండోవన్డేమార్చి 15- మూడో వన్డేవేదిక: షేరే బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం, ఢాకా.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
T20 WC 2026: బీసీసీఐ కీలక ప్రకటన
టీమిండియా జూన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. భారత క్రికెట్ జట్టు స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడనుందని వెల్లడించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.సెమీ ఫైనల్లో భారత్కాగా టీమిండియా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్.. సూపర్-8లో జింబాబ్వే, వెస్టిండీస్లను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇంగ్లండ్తో గురువారం (మార్చి 5) సెమీస్ మ్యాచ్లో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.మళ్లీ జూన్లోనేఈ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు చేరితే మార్చి 8న టైటిల్ పోరులో టీమిండియా తలపడుతుంది. అనంతరం భారత జట్టులోని ఆటగాళ్లంతా ఐపీఎల్-2026 (IPL)తో బిజీ అవుతారు. ఈ క్రమంలో మళ్లీ జూన్లోనే అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున విధుల్లో పాల్గొంటారు.అఫ్గనిస్తాన్తో సిరీస్ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా తదుపరి షెడ్యూల్ను విడుదల చేసింది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తుందని పేర్కొంది. జూన్ 6-10 మధ్య టెస్టు జరుగనుండగా.. ఇరుజట్ల మధ్య జూన్ 14, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది. భారత్- అఫ్గన్ టెస్టుకు న్యూ చండీగఢ్ వేదిక కాగా.. వన్డే సిరీస్కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.రో-కో రీఎంట్రీ డేట్ ఫిక్స్.. అభిమానులు ఖుష్అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డేలలో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరు చివరగా ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ బరిలో దిగారు.రోహిత్ శర్మ ఫర్వాలేదనిపించగా.. కోహ్లి వరుస సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సిరీస్లో భారత్ కివీస్ చేతిలో ఓడిపోయింది. ఇక తదుపరి అఫ్గనిస్తాన్తో సిరీస్ సందర్భంగా జూన్ 14న రో-కో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఐపీఎల్లో బెంగళూరు తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ అభిమానులను అలరించనున్నారు.భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ షెడ్యూల్👉జూన్ 6- 10 టెస్టు మ్యాచ్, న్యూ చంఢీగఢ్ (ఉదయం 9. 30 నిమిషాలకు ఆరంభం)👉జూన్ 14- తొలి వన్డే, ధర్మశాల👉జూన్ 17- రెండో వన్డే, లక్నో👉జూన్ 20- మూడో వన్డే, చెన్నై.👉వన్డే మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం. చదవండి: T20 WC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఆటగాళ్లకు భారీ షాక్! -
ఆఖరి వన్డే గెలుస్తారా!
హోబర్ట్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ను కోల్పోయింది. ఇప్పుడు క్లీన్స్వీప్ నుంచి తప్పించుకునేందుకు, గెలుపు తృప్తితో ముగించేందుకు ఆఖరి వన్డే బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో ఉన్న హర్మన్ప్రీత్ సేన జోరు మీదున్న ఆసీస్ను సొంతగడ్డపై ఎలా నిలువరిస్తుందో చూడాలి. వన్డే సిరీస్కు వచ్చేసరికి భారత బ్యాటింగ్ తడబడుతోంది. టాపార్డర్లో స్మృతి మంధాన, మిడిలార్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ మెరుగ్గా ఆడుతున్నప్పటికీ సహచరులంతా ఆసీస్ బౌలింగ్కు దాసోహం కావడం జట్టుకు ప్రతికూలంగా పరిణమిస్తోంది. బ్యాటింగ్లో షఫాలీ, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మలు రాణించాలి. అలాగే బౌలింగ్ విభాగం కూడా మెరుగవ్వాలి. రేణుక, క్రాంతి, కాశ్వీ గౌతమ్లు ఆరంభంలో వికెట్లు తీయగలిగితే పటిష్టమైన ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్ను సంతృప్తికరంగా ముగిస్తుంది. లేదంటే వైట్వాష్ ఖాయమవుతుంది. గత రెండు మ్యాచ్ల్లోనూ కంగారూ జట్టు అద్భుతంగా ఆడింది. బౌలింగ్తో కట్టడి చేసి... బ్యాటింగ్లో అదరగొట్టింది. ఇప్పుడు ఇదే జోరుతో ‘హ్యాట్రిక్’ విజయంపై కన్నేసింది. ఇదే జరిగితే ఓవరాల్ చాంపియన్షిప్ (టి20, వన్డే, ఏకైక టెస్టు సిరీస్)లోనూ ఆ్రస్టేలియా పైచేయి సాధిస్తుంది. ఒకే ఒక టెస్టును డ్రా చేసుకున్నా... ఆసీసే ఓవరాల్ చాంప్గా నిలుస్తుంది. ఉ. గం. 9:20 నుంచి ‘స్టార్స్పోర్ట్స్’లో ప్రసారం -
IND vs AUS: టీమిండియాను చిత్తు చేసిన ఆసీస్
ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ఆరంభించిన భారత మహిళా క్రికెట్ జట్టు అదే జోరు కొనసాగించలేకపోయింది. టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టుపై 2-1తో ఆధిపత్యం కనబరిచిన హర్మన్ సేన.. వన్డే సిరీస్లో మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను ఆసీస్కు సమర్పించుకుంది.తొలుత బ్యాటింగ్మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండో వన్డేలోనూ భారత్ను ఓడించింది. హోబర్ట్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (52), స్మృతి మంధాన (31) శుభారంభం అందించగా.. జెమీమా రోడ్రిగ్స్ (11) మాత్రం విఫలమైంది.హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకంకెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ద శతకం (54)తో రాణించగా.. రిచా ఘోష్ (22), కశ్వీ గౌతం (25) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 251 పరుగులు మేర మెరుగైన స్కోరు సాధించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, ఆష్లే గార్డ్నర్ రెండేసి వికెట్లు కూల్చగా.. మేగన్ షట్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆరంభంలో తడబడినా.. 36.1 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. టాపార్డర్లో కెప్టెన్ అలిసా హేలీ (6) విఫలం కాగా.. మరో ఓపెనర్ ఫోబే లిచిఫీల్డ్, వన్డౌన్ బ్యాటర్ జార్జియా వోల్ అదరగొట్టారు.Georgia Voll had us all nervous on 99 😅 She's got her second ODI ton 👏 #AUSvIND pic.twitter.com/eP41Tfx5Qp— cricket.com.au (@cricketcomau) February 27, 2026జార్జియా శతకంతో..లిచిఫీల్డ్ 62 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ బాది 80 పరుగులు చేయగా.. జార్జియా శతక్కొట్టింది. మొత్తంగా 82 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 101 పరుగులు సాధించింది. మిగిలిన వారిలో బెత్ మూనీ 31 పరుగులు చేయగా.. అనాబెల్ (10) విఫలమైంది.అయితే, ఆష్లే గార్డ్నర్ 19 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు గెలుపును ఖరారు చేసింది. భారత బౌలర్లలో కశ్వీ గౌతం, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. క్రాంతి గాడ్కు ఒక వికెట్ దక్కింది. ఇక భారత్- ఆసీస్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇందుకు హోబర్ట్ వేదిక. తదుపరి ఇరుజట్లు ఏకైక టెస్టు ఆడతాయి.చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్ ఫైర్ -
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ఈ సిరీస్లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. స్టార్ బ్యాటర్లు ప్రతిక రావల్ (0), షెఫాలీ వర్మ(4) వరుస బంతుల్లో పెవిలియన్కు చేరారు. అయితే స్మృతి మంధాన (58), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (53) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత భారత్ మళ్లీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో యాష్ గార్డనర్ 3 వికెట్లతో రాణించగా.. మేఘాన్ షాట్, అలానా కింగ్, మెక్గ్రాత్ తలా వికెట్ సాధించారు.215 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 38.2 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఓపెనర్లు అలిస్సా హీలీ (50), ఫోబ్ లిచ్ఫీల్డ్ (32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం బెత్ మూనీ (76 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును గెలుపు తీరాలకు చేర్చింది. భారత బౌలర్లలో శ్రీ చరణి రెండు వికెట్లు, దీప్తీ శర్మ, క్రాంతి గౌడ్ తలా వికెట్ సాధించారు. -
భారత మహిళల వన్డే జట్టులోకి ప్రతీక
న్యూఢిల్లీ: ఆ్రస్టేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాల్గొనే భారత మహిళల జట్టులో అదనంగా మరో ప్లేయర్ను జోడించారు. చీలమండ గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ ప్రతీక రావల్ ఈనెల 24 నుంచి బ్రిస్బేన్లో ఆ్రస్టేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్లో భారత జట్టులోకి వచ్చింది. గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సందర్భంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ ప్రతీక గాయపడింది. ఆ తర్వాత ప్రతీక మిగతా టోర్నీకి దూరం కాగా...ఆమె స్థానంలో షఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ఈనెల 24న బ్రిస్బేన్లో తొలి వన్డే తర్వాత... 27న హోబర్ట్లో రెండో వన్డే, అదే వేదికగా మార్చి 1న మూడో వన్డే జరుగుతాయి. మార్చి 6 నుంచి భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఏకైక టెస్టు పెర్త్లో జరుగుతుంది. 25 ఏళ్ల ప్రతీక భారత్ తరఫున 24 వన్డేలు ఆడి 1110 పరుగులు సాధించింది. ఇందులో రెండు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలున్నాయి. భారత వన్డే జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్ ), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్ ), షఫాలీ వర్మ, రేణుక సింగ్ ఠాకూర్, నల్లపురెడ్డి శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, కాశ్వీ గౌతమ్, అమన్జోత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, ప్రతీక రావల్. -
గుడ్బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..పదవి నుంచి తొలగించాలిగౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులేఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.వారిదే తుది నిర్ణయంఅయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు. చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే -
SL Vs ENG: హ్యారీ బ్రూక్ విధ్వంసం.. శతక్కొట్టిన రూట్
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 53 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. తద్వారా 2–1 తేడాతో సిరీస్ను చేజిక్కించుకుంది. 2023 తర్వాత ఇదే తొలిసారికాగా 2023 తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఇదే తొలి విదేశీ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (66 బంతుల్లో 136 నాటౌట్; 11 ఫోర్లు, 9 సిక్స్లు), మాజీ కెప్టెన్ జో రూట్ (108 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీలతో కదంతొక్కారు. జేకబ్ బెథెల్ (72 బంతుల్లో 65; 8 ఫోర్లు) హాఫ్సెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బెన్ డకెట్ (7), రేహాన్ అహ్మద్ (24) విఫలమవడంతో ఇంగ్లండ్ జట్టు 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోగా... మూడో వికెట్కు బెథెల్తో కలిసి రూట్ 126 పరుగులు జోడించాడు. 57 బంతుల్లోనే శతకంఅయితే, బ్రూక్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న పరుగుల ప్రవాహం ఒక్కసారిగా రాకెట్ వేగాన్ని అందుకుంది. అబేధ్యమైన నాలుగో వికెట్కు రూట్తో కలిసి బ్రూక్ 113 బంతుల్లోనే 191 పరుగులు జతచేశాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్... 57 బంతుల్లోనే శతకం ఖాతాలో వేసుకున్నాడు. శతక్కొట్టిన రూట్ మరోవైపు.. రూట్ 100 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, ధనంజయ, వండర్సే తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్నాయకే (115 బంతుల్లో 121; 12 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి పోరాటం కనబర్చాడు. 8వ ఓవర్లో క్రీజులోకి వచి్చన అతడు చివరి వికెట్గా వెనుదిరిగాడు. మెరుపు అర్ధశతకంఓపెనర్ పాథుమ్ నిసాంక (25 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్ధశతకంతో జట్టుకు శుభారంభం ఇవ్వగా... పవన్ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. అయితే అతడికి సహచరుల నుంచి తగినంత సహకారం లభించలేదు. కమిల్ మిశ్రా (22), కుషాల్ మెండిస్ (20), కెప్టెన్ చరిత అసలంక (13), జనిత్ లియనాగె (22), దునిత్ వెల్లలాగె (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్, డాసన్, విల్ జాక్స్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రూక్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, రూట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: World Cup 2026: టీమిండియా ఘన విజయం -
గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఘాటు విమర్శలు
టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుబ్మన్ గిల్ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్గా గిల్ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో టెస్టుల్లో వైట్వాష్ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్ తొలిసారి 2-0తో వైట్వాష్కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్ సేనకు న్యూజిలాండ్ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్లను చూసి నేర్చుకోకివీస్ సిరీస్లో ముఖ్యంగా ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్కు ఏ బౌలర్తో బౌలింగ్ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్తో సిరీస్లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్ ఫిలిప్స్ ఫాస్ట్ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. డారిల్ మిచెల్ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్.. గిల్ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్పై రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!
న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్తో మ్యాచ్లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు -
భారత్ నెత్తిన మిచెల్ పిడుగు
130, 134, 17, 63, 84, 131 నాటౌట్, 137... భారత్పై గత 7 వన్డేల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డరైల్ మిచెల్ స్కోర్లు ఇవి. టీమిండియాపై మ్యాచ్ అనగానే చెలరేగిపోయే అతి తక్కువ మంది ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు అతను కూడా చేరాడు. మొత్తంగా భారత్పై ఆడిన 11 వన్డే ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సహా ఏకంగా 74.10 సగటుతో అతను 741 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ ఒక్కడే భారత్లో భారత్పై ఇంతకంటే ఎక్కువ (5) సెంచరీలు నమోదు చేయగలిగాడంటే మిచెల్ ప్రదర్శన విలువను చెప్పవచ్చు. ఒంటిచేత్తో అతను తన టీమ్కు తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ అందించి కివీస్ హీరోగా మారాడు. భారత్లో భారత్పై మిచెల్ చెలరేగిపోవడం వెనక తీవ్ర సాధన, పట్టుదల ఉన్నాయి. 2023 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్ లీగ్ మ్యాచ్, సెమీఫైనల్లలో రెండుసార్లూ వందకు పైగా స్ట్రయిక్ రేట్తో అతను శతకాలు బాదాడు. కానీ ఈ రెండు మ్యాచుల్లోనూ టీమిండియా అలవోక విజయాలు సాధించింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో కూడా లీగ్ మ్యాచ్లో విఫలమైన తర్వాత ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి అతను హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పరిస్థితిని బట్టి బాగా నెమ్మదిగా ఆడిన మిచెల్ మన స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడ్డాడు. తన ఇన్నింగ్స్లోని 101 బంతుల్లో అతను 96 బంతులు స్పిన్నర్ల బౌలింగ్లోనే ఆడాడు! అయితే నలుగురు భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోలేక 52 పరుగులే చేయగలిగాడు. ఈ మ్యాచ్లో కూడా కివీస్ ఓడింది. సిరీస్కు సిద్ధమై... భారత్తో వన్డే సిరీస్కు ముందు మిచెల్ అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు. ఈసారి తాను వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన కనబర్చడమే కాదు. టీమ్ను కూడా గెలిపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. భారత్ తరహాలో నెమ్మదైన పిచ్లు ఉండే లింకన్, మౌంట్ మాంగనీలలో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై ఎదురుదాడికి చాలా మంది స్టార్ బ్యాటర్లు వాడే ఆయుధం ‘స్వీప్ షాట్’ను గంటలకొద్దీ ఆడాడు. రివర్స్ స్వీప్ల సాధన దీనికి అదనం. స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే మరో పద్ధతి ముందుకు దూసుకొచ్చి బౌలర్ మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడటం. రాజ్కోట్ వన్డేలో ఇది చాలా బాగా కనిపించింది. జడేజా, కుల్దీప్లను అతను అలవోకగా ఎదుర్కోవడంతో భారత్ సమస్య పెరిగింది. కుల్దీప్ తొలి ఓవర్లోనే సిక్స్తో మొదలు పెట్టిన మిచెల్ ...అతని బౌలింగ్లో ఆడిన 32 బంతుల్లో 50 పరుగులు రాబట్టడం విశేషం. కివీస్ ఇంత అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడం దిగ్గజం సునీల్ గావస్కర్ను కూడా ఆశ్చర్యపర్చింది. వన్డేల్లో కుల్దీప్ ఒక సిరీస్లో ఇంత చెత్త ప్రదర్శన (60.66 సగటు) తొలిసారి నమోదు చేశాడంటే అందుకు మిచెల్ కారణం. అన్ని ఫార్మాట్లలో... న్యూజిలాండ్ జట్టులో మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ఆటగాళ్లలో మిచెల్ కూడా ఒకడు. ఏడాదిన్నర క్రితం భారత్పై 3–0తో క్లీన్స్వీప్ చేసిన టెస్టు టీమ్లో అతను కూడా ఉన్నాడు. అదే స్ఫూర్తితో తాము వన్డే సిరీస్ కూడా గెలవడం సంతోషానిచి్చందని మిచెల్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో తన కెరీర్ ఆరంభంలో స్పిన్ ప్రదర్శనను అతను గుర్తు చేసుకున్నాడు. న్యూజిలాండ్తో పాటు జూనియర్ స్థాయిలో పెర్త్లో ఎక్కువగా క్రికెట్ ఆడిన మిచెల్కు స్పిన్ అంటే మొదటి నుంచీ సమస్యే. ఎప్పుడో 2013లో అండర్–19 జట్టు సభ్యుడిగా భారత్, శ్రీలంక పర్యటలకు వచ్చి ఘోరంగా విఫలమైన అనంతరం అతను మళ్లీ పోటీలోకి వచ్చేందుకు చాలా సమయం పట్టింది. దాదాపు ఏడేళ్ల కెరీర్లో ఇప్పటికి 184 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అతను తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్లో ప్రస్తుతం కీలక సభ్యుడిగా ఎదిగిన మిచెల్... ఐపీఎల్లో ఒక సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు, మరో ఏడాది చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక్కడ ఆడటం మాత్రమే కాదు, భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్యలో ఆడిన అనుభవం తన ఆటను రాటుదేలి్చందని చెప్పాడు. – సాక్షి క్రీడా విభాగం -
మాది చిన్న దేశం.. అయినా పెద్ద పెద్ద జట్లను ఓడిస్తున్నాం: కివీస్ కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ గడ్డపై తొలి దైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసమైంది. గత పర్యటనలో టెస్టుల్లో భారత్ను వైట్వాష్ చేసిన కివీస్.. ఈసారి వన్డేల్లో మట్టి కరిపించింది. చివరి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(124) ఒంటరి పోరాటం చేశాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రోహిత్, గిల్,శ్రేయస్ అయ్యర్ వంటి టాపార్డర్ బ్యాటర్ల నుంచి సహకరం లభించకపోవడంతో 296 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ స్పందించాడు. భారత్పై సిరీస్ విజయం తమకెంతో ప్రత్యేకమని బ్రేస్వెల్ చెప్పుకొచ్చాడు."భారత్కు వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాం. టీమిండియా వంటి పటిష్టమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించి, తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము ఎప్పటకీ మర్చిపోము. భారత్కు వచ్చి మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రతీ జట్టు కోరుకుంటుంది.మేము ఒక జట్టుగా మా ప్రణాళికలకు కట్టుబడి, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. అది మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఒక మూలన ఉన్న చిన్న దేశం నుంచి వచ్చిన మేము.. ఐక్యంగా ఉండి పెద్ద పెద్ద జట్లను సవాల్ విసురుతున్నాము. కలిసి కట్టుగా ఆడడం ఒక్కటే న్యూజిలాండ్ క్రికెట్ సిద్ధాంతం. ఇక డారిల్ మిచెల్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా వన్డేల్లో తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. అతడు మాకు మిడిలార్డర్లో కీలకమైన ఆటగాడు. మిచెల్ మా బ్యాటింగ్ యూనిట్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సిరీస్లో అరంగేట్రం చేసిన ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్ ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాము. భారత్ వంటి కఠిన పరిస్థితులలో వారి ఆట తీరు చూస్తుంటే కివీస్ క్రికెట్ భవిష్యత్తుపై ఎటువంటి ఢోకా లేదన్పిస్తోందని" బ్రేస్వేల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే? -
వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!
న్యూజిలాండ్ వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ మైకేల్ బ్రేస్వెల్పై టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో భారత గడ్డపై తొలిసారి కివీస్కు వన్డే సిరీస్ విజయాన్ని అందించాడని కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఫిట్నెస్ సమస్యల కారణంగా వన్డే సిరీస్కు దూరం కాగా.. టీ20 సారథి బ్రేస్వెల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.ఈ క్రమంలో బ్రేస్వెల్ (Michael Bracewell) కెప్టెన్సీలో తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. ఆఖరి రెండు మ్యాచ్లలో గెలిచి తొలిసారి భారత్లో వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రేస్వెల్ ధనాధన్ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ బ్రేస్వెల్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన కివీస్.. లక్ష్యాన్ని కాపాడుకుని జయభేరి మోగించింది.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఐదో స్థానంలో వచ్చి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అద్భుతంగా ఆడాడు. షార్ట్ పిచ్ డెలివరీలను చక్కగా ఆడాడు. బంతిని నేరుగా బౌండరీ మీదుగా తరలించాడు.అత్యంత కీలకంవికెట్ బాగుంది. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, మైకేల్ బ్రేస్వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఈ మ్యాచ్కు అత్యంత కీలకం. అతడి కారణంగానే న్యూజిలాండ్ స్కోరు 300- 330 వరకు చేరుకోగలిగింది. బ్రేస్వెల్ సూపర్గా సిక్సర్లు బాదాడు.ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని ఎందుకు కొనలేదో నాకు ఇంత వరకు అర్థం కాలేదు. గాయం కారణంగా అతడు పెద్దగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అంతే తప్ప బ్యాటింగ్లో పర్లేదు. మరెందుకనో ఐపీఎల్ జట్లు అతడి వైపు మొగ్గు చూపలేదు.అసలు ఏ ప్రాతిపదికన ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన బ్రేస్వెల్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేయకపోయినా వికెట్ తీయగలిగాడు. తాజాగా మూడో వన్డేలో విలువైన 28 పరుగులు చేయడంతో పాటు తన అద్భుత కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. కాగా 34 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ అయిన బ్రేస్వెల్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్ వేలం-2026లో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన బ్రేస్వెల్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
సిరీస్ విజయంపై గురి
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్ను చిత్తు చేసింది. ఇప్పుడు వన్డేల్లో చరిత్ర చూస్తే భారత్లో న్యూజిలాండ్ ఎప్పుడూ వన్డే సిరీస్ నెగ్గలేదు. కానీ గత మ్యాచ్లో ఆ జట్టు ప్రదర్శన చూస్తే అలాంటి అవకాశం ఇక్కడా కనిపిస్తోంది. గతంలో మూడు సార్లు ఆ జట్టు సిరీస్ గెలిచేందుకు చేరువగా వచ్చినా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సవాల్ మధ్య స్వదేశంలో తమ రికార్డును నిలబెట్టుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 2019 మార్చి తర్వాత సొంతగడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోని రికార్డును భారత్ కొనసాగిస్తుందా లేక సంచలనం నమోదవుతుందా చూడాలి. ఇండోర్: భారత్, న్యూజిలాండ్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. హోల్కర్ స్టేడియంలో నేడు జరిగే మూడో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో భారత్ ఆధిపత్యం సాగగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ అలవోక విజయాన్ని అందుకుంది. ప్రత్యరి్థతో పోలిస్తే సొంతగడ్డపై భారత్ అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా...పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో ఇక్కడ అడుగు పెట్టిన కివీస్ కూడా తమ ఆటతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆఖరి ఆట ఆసక్తికరంగా సాగవచ్చు. అర్ష్ దీప్కు చాన్స్! భారత బ్యాటింగ్ టాప్–5 విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. రోహిత్, గిల్ జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందిస్తున్నారు. అయితే రోహిత్ తన జోరును భారీ స్కోరుగా మార్చాల్సి ఉంది. గత మ్యాచ్లో తక్కువ పరుగులే చేసినా...కోహ్లి ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయిలో రాణిస్తుండగా... రాహుల్ రాజ్కోట్లో సెంచరీతో తానేమిటో చూపించాడు. ఈ ఐదుగురిలో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయం. ఆరో స్థానంలో నితీశ్ రెడ్డిని కొనసాగిస్తారా లేక స్పిన్నర్ ఆయుశ్ బదోనికి అరంగేట్రం చేసే అవకాశం వస్తుందా చూడాలి. నితీశ్ను పూర్తి స్థాయి ఆల్రౌండర్గా జట్టు ఉపయోగించుకోవడం లేదు. స్పిన్నర్గా కుల్దీప్ ప్రదర్శన కీలకం కానుంది. జడేజా బౌలింగ్ ప్రదర్శనను చూస్తూ అతని బ్యాటింగ్ను ఎవరూ పట్టించుకోలేదు. సుదీర్ఘ కాలంగా అతను వన్డేల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఓవరాల్గా భారత్లోనైతే 2013 తర్వాత అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించలేదు. పేసర్లుగా సిరాజ్, హర్షిత్ ఖాయం. మూడో పేసర్గా వైవిధ్యం కోసం ప్రసిధ్ స్థానంలో అర్ష్ దీప్ను ప్రయతి్నంచవచ్చు. తొలి రెండు వన్డేల్లో ప్రసిధ్ పెద్దగా ఆకట్టుకోలేదు. కుర్రాళ్లు సమష్టిగా... ‘న్యూజిలాండ్ ఇంత సులువుగా విజయం సాధించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’...అంటూ రెండో వన్డే తర్వాత దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్య భారత్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపించింది. మిచెల్, యంగ్లను నిలువరించడంలో మన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాన్వే, నికోల్స్ కూడా ఓపెనర్లుగా రాణిస్తే కివీస్ కూడా మంచి స్కోరుపై దృష్టి పెట్టవచ్చు. ఫిలిప్స్లాంటి హిట్టర్తో పాటు మంచి బ్యాటింగ్ పదును ఉన్న కెప్టెన్ బ్రేస్వెల్ మిడిలార్డర్లో కీలకం కానున్నారు. పేసర్ జేమీసన్ మొదటినుంచీ భారత్ను ఇబ్బంది పెడుతున్నాడు. క్లార్క్, ఫోక్స్లతో జట్టు బౌలింగ్ ఆధారపడి ఉంది. ఆఫ్ స్పిన్నర్గా బ్రేస్వెల్ ఉన్నాడు కాబట్టి తొలి వన్డే తరహాలోనే లెనాక్స్ స్థానంలో లెగ్స్పిన్నర్ ఆదిత్య అశోక్కు చోటు దక్కవచ్చు. ఎనిమిది మంది తొలిసారి భారత గడ్డపై ఆడుతున్న ఆటగాళ్లతో పర్యటనకు వచ్చి వన్డే సిరీస్ గెలవగలిగితే న్యూజిలాండ్కు ఇది పెద్ద ఘనత అవుతుంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, అయ్యర్, రాహుల్, నితీశ్/బదోని, జడేజా, హర్షిత్, కుల్దీప్, అర్ష్ దీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జేమీసన్, ఫోక్స్, ఆదిత్య. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలిసా హేలీ కీలక ప్రకటన చేసింది. స్వదేశంలో భారత్తో ఆడబోయే సిరీస్ తన కెరీర్లో చివరిదని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది.నా కెరీర్లో చివరిదిఈ మేరకు.. ‘‘మిశ్రమ భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఆస్ట్రేలియా తరఫున భారత్తో ఆడబోయే సిరీస్ నా కెరీర్లో చివరిది. ఆసీస్ తరఫున ఇంకా ఇంకా ఆడాలనే ఉంది. అయితే, నాలో పోటీతత్వం కొరవడిందని అనిపిస్తోంది.అందుకే రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈసారి టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నేను వెళ్లడం లేదని తెలుసు. ఈ మెగా టోర్నీ సన్నాహకాలకు చాలా తక్కువ సమయం ఉంది. టీమిండియాతో టీ20లలోనూ నేను ఆడలేను.ఇండియాతో వీడ్కోలు మ్యాచ్ ప్రత్యేకంఅయితే, సొంతగడ్డపై భారత్తో మ్యాచ్లో వన్డే, టెస్టు కెప్టెన్గా కెరీర్ ముగించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నాకు దక్కిన గొప్ప అవకాశం ఇది. మాకు క్యాలెండర్ ఇయర్లో వచ్చే అతిపెద్ద సిరీస్ ఇదే’’ అంటూ అలిసా హేలీ ‘ది విల్లో టాక్’ పాడ్కాస్ట్లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. దిగ్గజ క్రికెటర్గాకాగా 2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసింది వికెట్ కీపర్ బ్యాటర్ అలిసా హేలీ. ఆమె నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు పటిష్ట జట్టుగా మారింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 టోర్నీ గెలిచిన జట్లలో అలిసా సభ్యురాలు. అంతేకాదు.. 2013, 2022లో వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులోనూ అలిసా ఉంది.ఇక 2018, 2019 ఇయర్లకు గానూ ‘ఐసీసీ టీ20 క్రికెర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును 35 ఏళ్ల అలిసా హేలీ అందుకుంది. కాగా అలిసా నిష్క్రమణ తర్వాత తహీలా మెగ్రాత్ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. భారత్తో, టీ20 ప్రపంచకప్-2026లో ఆసీస్ను ఆమె ముందుకు నడుపనున్నట్లు తెలుస్తోంది.స్టార్క్ జీవిత భాగస్వామికాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్- అలిసా హేలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! -
అచ్చం నాలాగే..: రోహిత్తో కోహ్లి ఏం చెప్పాడంటే..
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్ చెప్పాను.నా డూప్లికేట్ అక్కడ కూర్చున్నాడుఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.93 పరుగులుకాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్ న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.కివీస్ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్- కివీస్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026 -
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ హర్షిత్ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్.ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిఅదే విధంగా.. న్యూజిలాండ్ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హర్షిత్ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.బుమ్రా గైర్హాజరీలోఈ క్రమంలో కివీస్పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.మండిపడ్డ టీమిండియా హర్షిత్ రాణాఈరోజు సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.ఆల్రౌండర్గా ఇక టీమిండియా మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా చూడాలని భావిస్తోందని హర్షిత్ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదిక. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్!.. ప్రకటన విడుదల
న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే రిషభ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ఆటగాడు సైతం గాయపడ్డాడు.వడోదర వేదికగా తొలి వన్డే సందర్భంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)కు గాయమైంది. పక్కటెముకల్లో నొప్పితో అతడు విలవిల్లాడాడు. ఈ క్రమంలో అతడిని స్కానింగ్కు పంపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న వాషీ.. తదుపరి రిపోర్టు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.ఊహించని ఆటగాడుఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్ మిగిలిన రెండు వన్డేలకు దూరమయ్యాడు. మెన్స్ సెలక్షన్ కమిటీ వాషీ స్థానంలో యువ ఆటగాడు ఆయుశ్ బదోని (Ayush Badoni)ని జట్టుకు ఎంపిక చేసింది. రాజ్కోట్లో రెండో వన్డే కోసం బదోని టీమిండియాతో చేరతాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా బదోని జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఢిల్లీకి చెందిన ఆయుశ్ బదోని బ్యాటింగ్ ఆల్రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన బదోని.. రైటార్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ కూడా!.. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న 26 ఏళ్ల బదోని.. ఇప్పటికి 56 మ్యాచ్లలో కలిపి 963 పరుగులు చేశాడు.ఫామ్లో లేడుఇక లిస్ట్-ఎ క్రికెట్లో 27 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఆయుశ్ బదోని ఖాతాలో 693 పరుగులు ఉన్నాయి. ఇందులో ఓ శతకం, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, ఇటీవల దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మాత్రం గత మూడు మ్యాచ్ల (1, 12, 3 నాటౌట్)లో బదోని తీవ్రంగా నిరాశపరిచాడు. అయినప్పటికీ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషీ దూరం కావడంతో అతడి స్థానంలో తొలిసారి టీమిండియాలోకి వచ్చాడు. కాగా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక. ఇదిలా ఉంటే పంత్ స్థానంలోధ్రువ్ జురెల్ జట్టులో చేరిన విషయం తెలిసిందే.న్యూజిలాండ్తో రెండు, మూడో వన్డేకు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), ఆయుశ్ బదోని.చదవండి: ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి -
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి
వన్డే క్రికెట్లో తాను ఛేజింగ్ ‘కింగ్’నని టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ న్యూజిలాండ్తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.మా అమ్మకు పంపిస్తానుఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.గుర్గావ్లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.దేవుడు నాకు అన్నీ ఇచ్చాడునా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్- కివీస్ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ ఆడాయి. 93 పరుగులుటాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.మిగిలిన వారిలో శ్రేయస్ అయ్యర్ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో అద్భుతం🗣️ If I look back at my whole journey, it's nothing short of a dream come true. ✨🎥 Virat Kohli reflects on his incredible career after becoming the 2⃣nd highest run-getter in men's international cricket🙌👏#TeamIndia | #INDvNZ | @imVkohli | @idfcfirstbank pic.twitter.com/87BgcZlx4b— BCCI (@BCCI) January 11, 2026 -
కోహ్లి పరుగుల బాటతో...
అనుభవం లేని ఆటగాళ్లతో వచ్చిన న్యూజిలాండ్ అదరగొట్టింది. గెలిచేందుకు అవసరమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. కానీ ఛేదనలో మొనగాడు, ‘కింగ్ కోహ్లి’ కుదురుకొని ఆడటంతో పెద్ద లక్ష్యం కూడా దిగివచ్చింది. ఒకదశలో జేమీసన్ వణికించినా... 8 పరుగుల వ్యవధిలోనే కోహ్లి, జడేజా, అయ్యర్ల వికెట్లు కోల్పోయినా... కేఎల్ రాహుల్ చేసిన విలువైన పరుగులతో టీమిండియా తొలి వన్డేలో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వడోదర: భారత బ్యాటింగ్ ‘కింగ్’ కోహ్లి మరోసారి ఛేజింగ్లో తన విలువ ఏంటో నిరూపించుకున్నాడు. కోహ్లి సాధికారిక ఆటతీరు కారణంగా... తొలి వన్డేలో న్యూజిలాండ్ 300 పరుగులు చేసినా ఓటమిని తప్పించుకోలేకపోయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ఫై గెలిచింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కివీస్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగుల భారీస్కోరు చేసింది. డారిల్ మిచెల్ (71 బంతుల్లో 84; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డెవాన్ కాన్వే (67 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్), హెన్రీ నికోల్స్ (69 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. ‘హైదరాబాద్ ఎక్స్ప్రెస్’ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీని చేజార్చుకోగా... గిల్ (71 బంతుల్లో 56; 3 ఫోర్లు, 2 సిక్స్లు), శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. జేమీసన్కు 4 వికెట్లు దక్కాయి. రెండో వన్డే 14న రాజ్కోట్లో జరుగుతుంది. అదిరే ఆరంభం ఓపెనర్లు కాన్వే, నికోల్స్ చూడచక్కని అర్ధసెంచరీలతో కివీస్కు శుభారంభమిచ్చారు. 21 ఓవర్ల వరకు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. హర్షిత్ రెండో స్పెల్ 2–0–13–2తో విలువైన వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ తడబడింది. 117/0 స్కోరుతో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్ 38వ ఓవర్ వచ్చేసరికి 198/5తో కష్టాల్లో పడింది. ఇలాంటి దశలో మిచెల్ మెరుపులతో కివీస్ ఇన్నింగ్స్ను మళ్లీ నిలబెట్టాడు. æ కోహ్లి నడిపించడంతో... భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ (26; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అవుటయ్యాడు. కెప్టెన్ గిల్కు జతయిన కోహ్లి చకచకా పరుగులు రాబట్టారు. రెండో వికెట్కు 118 పరుగులు జోడించాక గిల్ అవుటయ్యాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్తో కలిసి విరాట్ జట్టు స్కోరును 200 దాటించాడు. సెంచరీకి చేరువవుతున్న దశలో కోహ్లిని జేమీసన్ అవుట్ చేశాడు. అప్పుడు భారత్ స్కోరు 234/3. ఇక చేయాల్సింది 67 పరుగులే కాగా చేతిలో 7 వికెట్లున్నాయి. కానీ జేమీసన్ ధాటికి అయ్యర్, జడేజా (4) పెవిలియన్ చేరారు. అయితే హర్షిత్ రాణా (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ (21 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) రాణా 56; నికోల్స్ (సి) రాహుల్ (బి) రాణా 62; యంగ్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 12; మిచెల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రసిధ్ 84; ఫిలిప్స్ (సి) అయ్యర్ (బి) కుల్దీప్ 12; మిచెల్ హే (బి) ప్రసిధ్ 18; బ్రేస్వెల్ రనౌట్ 16; ఫోక్స్ (బి) సిరాజ్ 1; క్లార్క్ (నాటౌట్) 24; జేమీసన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 300. వికెట్ల పతనం: 1–117, 2–126, 3–146, 4–170, 5–198, 6–237, 7–239, 8–281. బౌలింగ్: సిరాజ్ 8–0–40–2, హర్షిత్ రాణా 10–0–65–2, సుందర్ 5–0–27–0, ప్రసిధ్ కృష్ణ 9–0–60–2, కుల్దీప్ 9–0–52–1, జడేజా 9–0–56–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 26; గిల్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ 56; కోహ్లి (సి) బ్రేస్వెల్ (బి) జేమీసన్ 93; శ్రేయస్ (బి) జేమీసన్ 49; జడేజా (సి) క్లార్క్ (బి) జేమీసన్ 4; రాహుల్ (నాటౌట్) 29; హర్షిత్ (సి) హే (బి) క్లార్క్ 29; సుందర్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–39, 2–157, 3–234, 4–239, 5–242, 6–279. బౌలింగ్: జేమీసన్ 10–1–41–4, ఫోక్స్ 10–0–49–0, ఆదిత్య అశోక్ 6–0–55–1, క్లార్క్ 10–0–73–1, బ్రేస్వెల్ 8–0–56–0, ఫిలిప్స్ 4–0–21–0, మిచెల్ 1–0–7–0.2: మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టి20) కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి రెండో స్థానానికి ఎగబాకాడు. 557 మ్యాచ్లు ఆడిన కోహ్లి 28,068 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (664 మ్యాచ్ల్లో 34,357 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (594 మ్యాచ్ల్లో 28,016 పరుగులు) మూడో స్థానానికి పడిపోయాడు.1: అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్గా కోహ్లి ఘనత వహించాడు. సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (624 ఇన్నింగ్స్) బద్దలు కొట్టాడు.45: వన్డేల్లో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ (62), సనత్ జయసూర్య (48) ముందున్నారు. -
IND vs NZ: 'ఈసారి కూడా వైట్ వాష్ చేస్తాము'
భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆదివారం(జనవరి 11) నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొదటి వన్డేకు వడోదరలోని బీసీఎ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే ఏడాదిన్నర కిందట స్వదేశంలో భారత్ను టెస్టుల్లో వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు అదే ఫలితాన్ని వన్డేల్లో కూడా పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.ఇదే విషయాన్ని తొలి వన్డేకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ విల్ యంగ్ స్పష్టం చేశాడు. కివీస్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, భారత్ను ఓడించగలమని యంగ్ థీమా వ్యక్తం చేశాడు. కాగా 2024 ఆఖరిలో భారత్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ సంచలనం సృష్టించింది.మూడు టెస్టుల సిరీస్ను కివీస్ వైట్ వాష్ చేసింది. బ్లాక్ క్యాప్స్ జట్టు 1955 తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయంలో యంగ్ది కీలక పాత్ర. యంగ్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు."ఈసారి భిన్నమైన ఫార్మాట్లో క్రికెట్ ఆడేందుకు భారత్ పర్యటనకు వచ్చాము. మా జట్టు ప్రస్తుతం వన్డేల్లో అద్భుతంగా రాణిస్తోంది. సీనియర్ ప్లేయర్లు దూరంగా ఉన్నప్పటికి మేము మెరుగైన ప్రదర్శన చేస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఈ సిరీస్కు ముందు మేము స్వదేశంలో ఇంగ్లండ్, వెస్టిండీస్తో వన్డేల్లో విజయం సాధించాము.గత భారత పర్యటనలో మేము సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని ఇచ్చింది. ఈసారి కూడా గెలిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాము. భారత్లో మరొక సిరీస్ గెలవడమే మా లక్ష్యం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో చివరి మెట్టుపై బోల్తా పడ్డాము. కానీ ఆ ఓటమిని మేము ఎప్పుడో మర్చిపోయాము.ఇప్పుడు మా దృష్టి కేవలం ఈ ద్వైపాక్షిక సిరీస్ పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా గతేడాది మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో కివీస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ భారత పర్యటకు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్,రచిన్ రవీంద్ర వంటి స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వన్డే సిరీస్కు కివీస్ కెప్టెన్గా మైఖల్ బ్రెస్వెల్ వ్యవహరించనున్నాడు.చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 9 ఫోర్లు, 7 సిక్స్లతో -
ప్రాక్టీస్లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్లో కనిపించారు. నెట్స్లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా నెట్స్లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
కోహ్లి కంటే సన్నగా!.. కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!
టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లతో బిజీ కానుంది. కివీస్తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించాయి.ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్-కివీస్ మధ్య జరిగే వన్డే సిరీస్కు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్ భాయ్’’ అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Rohit Sharma in the nets. pic.twitter.com/OsFnlwkg40— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026 కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!మరోవైపు.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కివీస్తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy— ANI (@ANI) January 7, 2026ఇద్దరూ సూపర్ ఫామ్లోఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్ కింగ్ను గుర్తు చేశాడు.ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉండటం కివీస్తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
న్యూజిలాండ్తో వన్డేలకు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నుంచి శ్రేయస్ అయ్యర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించింది.అంతా సజావుగా సాగితే.. శ్రేయస్ (Shreyas Iyer) న్యూజిలాండ్తో మూడు వన్డేలకు అందుబాటులో ఉంటాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబరు 25న సిడ్నీలో ఆసీస్ (Ind vs Aus)తో మూడో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టబోయి అదుపు తప్పి కిందపడిపోయిన శ్రేయస్ పక్కటెములకు తీవ్ర గాయమైంది.అంతర్గత రక్తస్రావందీంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో చాన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే ఉన్న శ్రేయస్.. క్రమంగా కోలుకున్నాడు. అయితే, ఆటకు మాత్రం దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్నాడు.రీఎంట్రీ ధనాధన్ఈ క్రమంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు శ్రేయస్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడు అందుబాటులో ఉండే విషయం తేలుతుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్తో ముంబై కెప్టెన్గా శ్రేయస్.. కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.వచ్చీరాగానే ధనాధన్ దంచికొట్టి 36 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో మొత్తంగా 53 బంతుల్లో 82 పరుగులు సాధించాడు. అంతేకాదు కెప్టెన్గానూ రాణించి.. ముంబై క్వార్టర్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సీఓఈ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది స్వదేశంలో కివీస్తో వన్డే (జనవరి 11, 14, 18)లకు సిద్ధమయ్యాడు.చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు -
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్తో వన్డేలకు ముందు ఈ రన్మెషీన్ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.బీసీసీఐ ఆదేశాల మేరకుఅంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే బరిలో దిగాడు.రెండు మ్యాచ్లు కంప్లీట్కనీసం రెండు మ్యాచ్లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్పై 77 పరుగులు సాధించాడు.మూడోదీ ఆడతానని చెప్పి..ఇక న్యూజిలాండ్తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.అందుబాటులో లేడుఅయితే, తాజాగా ఢిల్లీ కోచ్ సరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్లో రైల్వేస్ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్లో గల కేఎస్సీఏ క్రికెట్ గ్రౌండ్-2 ఇందుకు వేదిక. రిషభ్ పంత్ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.చదవండి: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ -
అతడు సెలక్ట్ అవ్వాలంటే అదొక్కటే మార్గం: మాజీ చీఫ్ సెలక్టర్
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. గత వన్డే సిరీస్ (సౌతాఫ్రికా)తో పోలిస్తే.. ఈసారి ముగ్గురు క్రికెటర్లు తమ స్థానాలు కోల్పోయారు. రిషభ్ పంత్ ఆట, వన్డేల్లో అతడి సగటు, వైఫల్యాలపై చర్చ జరుగుతున్నా... రెండో వికెట్ కీపర్గా అతడికే పట్టం కట్టారు సెలక్టర్లు.అయితే.. మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ (Dhruv Jurel)పై మాత్రం వేటు పడింది. ఇక హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. తిలక్ను విశాఖపట్నంలో మూడో వన్డేకు తుది జట్టులోకి తీసుకున్నా...బ్యాటింగ్ రాకపోగా, జురేల్కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశమే రాలేదు.శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతోమరోవైపు.. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ సాధించినా రుతురాజ్ గైక్వాడ్పై కూడా వేటు పడింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లోనూ దుమ్ములేపుతున్నా అతడికి నిరాశే మిగిలింది. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ పునరాగమనంతో రుతురాజ్ స్థానం కోల్పోక తప్పలేదు.అయితే, రుతు విషయంలో సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని భారత మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించాడు. ‘‘జట్టులో స్థానం కోసం రుతురాజ్ తనలోని మరో నైపుణ్యం గురించి సెలక్టర్లకు చెప్పాలేమో!.. ‘నేను ధోనితో కలిసి ఆడాను.. వికెట్ కీపింగ్ కూడా చేయగలను’ అని చెప్పాలి.అదొక్కటే మార్గంజట్టులోకి తిరిగి వచ్చేందుకు అతడికి అదొక్కటే మార్గం. శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా జట్టులో ఉండాలి. అదే సమయంలో పదిహేను మంది సభ్యులలో రుతురాజ్ కూడా ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డికి బదులు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది.నువ్వు సెంచరీ చేశావని తెలిసినా రుతు వంటి ఆటగాళ్లకు చోటు ఇవ్వమని చెప్పడం సరికాదు. దేశీ క్రికెట్లో మళ్లీ సత్తా చాటి అతడు తనను తాను నిరూపించుకోవాల్సిందే’’ అని చిక్కా అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఈ నెల 11, 14, 18 తేదీల్లో వరుసగా వడోదర, రాజ్కోట్, ఇండోర్లలో వన్డేలు జరుగుతాయి. న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్. చదవండి: BCCI: శుబ్మన్ గిల్ డిమాండ్ ఇదే! -
భారత కుర్రాళ్ల విజయం
బెనోనీ: అండర్–19 వరల్డ్ కప్కు ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో మొదలైన వన్డే సిరీస్లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో భారత అండర్–19 జట్టు 25 పరుగుల తేడాతో (డక్వర్త్ – లూయీస్ ప్రకారం) దక్షిణాఫ్రికా అండర్–19పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. హర్వంశ్ పంగాలియా (95 బంతుల్లో 93; 7 ఫోర్లు, 2 సిక్స్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇతర బ్యాటర్లలో ఆర్ఎస్ అంబరీశ్ (79 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కని‹Ù్క చౌహాన్ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఖిలాన్ పటేల్ (12 బంతుల్లో 26; 3 సిక్స్లు) ధాటిగా ఆడారు. సఫారీ బౌలర్లలో జేజే బాసన్ 4 వికెట్లతో భారత్ను పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరిక్ వాన్ షావిక్ (72 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా, అర్మాన్ మనక్ (59 బంతుల్లో 46; 4 పోర్లు) రాణించాడు. భారత్ తరఫున దీపేశ్ దేవేంద్రన్ 2 వికెట్లు తీయగా, ఖిలాన్ పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఈ దశలో ముందుగా ఉరుములు, మెరుపుల కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కూడా రావడంతో అంపైర్లు పూర్తిగా మ్యాచ్ను రద్దు చేయక తప్పలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్వర్త్ – లూయీస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. అయితే జట్టు లక్ష్యానికి 26 పరుగులు వెనుకబడి ఉండటంతో ఓటమి ఖాయమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1–0తో ముందంజ వేయగా...రెండో వన్డే ఇదే మైదానంలో సోమవారం జరుగుతుంది. -
IND vs NZ: సెలక్షన్ రోజే విఫలమైన ఇషాన్ కిషన్!
స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్తో టీ20 సిరీస్కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.వన్డేల్లోనూ పునరాగమనం!అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్కు బ్యాకప్గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.సెలక్షన్ రోజు విఫలంకివీస్తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.ఏకంగా ప్రపంచకప్ జట్టులోకిజార్ఖండ్ సారథిగా.. బ్యాటర్గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్ను కాకుండా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్కు బ్యాకప్ కీపర్, ఓపెనర్గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు. చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్లో ‘తొలి’ సెంచరీ! -
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ జట్టు 2026 సీజన్లో స్వదేశంలో ఆడే సిరీస్ల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు జరుగుతాయి. షెడ్యూల్ ఇదేసెప్టెంబరు 1, 3, 6లలో వన్డేలు... 9, 12, 13 తేదీల్లో టీ20లు నిర్వహిస్తామని బీసీబీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు, భారత ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన ఎంత వరకు జరుగుతుందనేది చర్చనీయాంశం.ఒప్పందం ప్రకారంనిజానికి గత ఏడాది జులైలోనే భారత జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరవధికంగా వాయిదా వేసింది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 2026లోగా ఈ షెడ్యూల్ను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రకటించిన టూర్ వివరాలు బహుశా వాయిదా పడిన సిరీస్ను ఆడటం గురించే కావచ్చని సమాచారం. కాగా బంగ్లాదేశ్లో పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ షెడ్యూల్పై ఎలా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లుభారత్ను రెచ్చగొట్టే విధంగా బంగ్లాదేశ్లో కొంతమంది నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం సహా మైనారిటీ హిందూ వర్గంపై దాడుల నేపథ్యంలో.. ఇప్పటికే ఐపీఎల్లో బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను కొనుగోలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇంతకుమించి దీని గురించి మాట్లాడేందుకు ఏమీలేదు’’ అని దాటవేశాయి.చాలా సమయం ఉంది ఇలాంటి తరుణంలో బీసీబీ ప్రకటించిన షెడ్యూల్లో టీమిండియాతో మ్యాచ్లు ఉండటం చర్చకు దారితీసింది. సిరీస్లకు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. బంగ్లా బోర్డు ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా వెళ్లి వన్డే, టీ20 సిరీస్లు ఆడాల్సి ఉంది. కాగా టీమిండియా జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే, టీ20 సిరీస్లతో బిజీ కానుంది. అనంతరం టీ20 వరల్డ్కప్-2026 బరిలో దిగుతుంది.చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్లు ఇవే..! -
IND vs NZ: పంత్పై వేటు!.. దేశీ ‘హీరో’ ఎంట్రీ?
న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శనివారం భారత జట్టు ఎంపిక జరగనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటిస్తుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత్ 2–1తో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండా అదే జట్టును కొనసాగిస్తారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనేది చర్చనీయాంశం. వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్ పేరును పరిశీలిస్తారా అనేది ఆసక్తికరం. చాలా కాలంగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ప్రధాన కీపర్గా కొనసాగుతున్నాడు. గత సిరీస్లో పంత్, జురేల్ జట్టులో ఉన్నా వీరికి మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. దేశీ క్రికెట్లో హీరోగా ఇషాన్ కిషన్ఇప్పటికే వన్డే తుది జట్టులో పంత్కు చోటు కష్టంగా మారగా...ఇప్పుడు బయటి నుంచి ఇషాన్ కిషన్ రూపంలో పోటీ ఎదురవుతోంది. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ సత్తా చాటగా...యూపీ తరఫున జురేల్ కూడా రాణిస్తున్నాడు. మరో వైపు పంత్ వరుసగా విఫలమయ్యాడు. నిజానికి గంభీర్ కోచ్గా వచ్చాక చూస్తే జులై 2024 నుంచి ఇప్పటి వరకు పంత్ ఒకే ఒక్క వన్డే ఆడాడు! ఏడేళ్ల కెరీర్లో అతను ఆడినవి 31 వన్డేలే కాగా...బ్యాటింగ్లో 34 సగటు చెప్పుకోదగ్గది కాదు. ఇలాంటి స్థితిలో పంత్కు మరిన్ని అవకాశాలు ఇస్తారా లేక పక్కన పెడతారా చూడాలి. సిరాజ్ను ఎంపిక చేస్తారా?మరో వైపు పేస్ బౌలర్ ఎంపికపై కూడా చర్చ నెలకొంది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను తగిన కారణం లేకుండా సెలక్టర్లు వన్డేల నుంచి పక్కన పెడుతూ వస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కని అతను ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాడు. అయితే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు సిరాజ్ను మళ్లీ ఎంపిక చేయలేదు. విజయ్హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్లలో సిరాజ్ బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మరో ఇద్దరు పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను కూడా పక్కన పెట్టి సిరాజ్ను ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరం. షమీ విషయంలో యూటర్న్?సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. దేశవాళీలో అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నా... షమీ అంతర్జాతీయ స్థాయిలో తన అత్యుత్తమ దశను దాటేశాడనేది సెలక్టర్ల అభిప్రాయంలా కనిపిస్తోంది. బ్యాటింగ్లో చూస్తే మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో సెంచరీతో రుతురాజ్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నట్లే. ఓపెనర్గా గిల్, రోహిత్, జైస్వాల్ల స్థానాలకు ఢోకా లేదు కాబట్టి విజయ్హజారేలో సత్తా చాటుతున్న పడిక్కల్కు కూడా చోటు కష్టమే. చదవండి: IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్! -
కివీస్తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.ఇందుకు సంబంధించి న్యూజిలాండ్ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.జైస్వాల్కు చోటు దక్కినా..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్లో కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్.ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.పంత్కు చోటెలా?అదే విధంగా వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్ హజారే మ్యాచ్లలో విఫలమవుతున్న రిషభ్ పంత్ను ఎంపిక చేసుకున్నాడు.ఇక స్పిన్ ఆల్రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్కు ఓటు వేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్టార్మ్ బౌలర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఐదు టీ20లతో పాటు వరల్డ్కప్ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.సంజూతో పాటు షమీకీ మొండిచేయితన జట్టులో తిలక్ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు ఆకాశ్ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్తో టీ20 మ్యాచ్లు, ప్రపంచకప్-2026 దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టుశుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
రిషభ్ పంత్ ఫెయిల్.. ఇలా అయితే కష్టమే!
టీమిండియా స్టార్ రిషభ్ పంత్ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో... మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్ కీపర్.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ జట్టుకు సారథ్యం వహిస్తున్న పంత్ (Rishabh Pant)... కీలక పోరులో బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 79 పరుగుల తేడాతో ఒడిశా (Delhi Vs Odisha) చేతిలో ఓడింది. సమంత్రాయ్ హాఫ్ సెంచరీమొదట బ్యాటింగ్ చేసిన ఒడిశా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బిప్లబ్ సమంత్రాయ్ (72; 3 ఫోర్లు, 4 సిక్స్లు), హాఫ్ సెంచరీ సాధించగా... తక్కినవాళ్లంతా తలాకొన్ని పరుగులు చేశారు. పంత్ సహా వారంతా విఫలంఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ తడబడింది. 42.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. పంత్ (28 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ రాణా (2), ప్రియాన్ష్ ఆర్య (5), సార్థక్ రంజన్ (1) విఫలమవడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు.ఒడిశా బౌలర్లలో దేబబ్రత ప్రధాన్, సంబిత బరల్ చెరో 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడిన ఢిల్లీ 12 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్ల్లో రైల్వేస్ 4 వికెట్ల తేడాతో గుజరాత్పై... హర్యానా 7 వికెట్ల తేడాతో సర్వీసెస్పై గెలుపొందాయి.చదవండి: IND vs NZ: టీమిండియా వికెట్ కీపర్ రేసులో ఆ ముగ్గురు.. బెస్ట్ ఆప్షన్ ఎవరంటే? -
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి మంచి రోజులు వచ్చాయా? త్వరలోనే అతడు భారత జట్టులో పునరాగమనం చేయనున్నాడా? అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.వాగ్యుద్ధంఆస్ట్రేలియా పర్యటనకు ముందు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar).. షమీ ఫిట్నెస్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు పూర్తి ఫిట్గా లేడని.. అందుకే ఈ టూర్కు ఎంపిక చేయలేదని తెలిపాడు. ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తనకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యలు లేవని.. రంజీల్లో ఆడుతున్న వాడిని వన్డేల్లో ఆడలేనా? అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇందుకు ప్రతిగా అగార్కర్.. మరోసారి తన మాటకు కట్టుబడే ఉన్నానంటూ.. షమీ పూర్తి ఫిట్గా లేడని పునరుద్ఘాటించాడు. అయితే, షమీ (Mohammed Shami) కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలతో పాటు.. ఆటతోనూ సమాధానం ఇచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియాలో అతడి రీఎంట్రీ కష్టమనే సంకేతాలు వచ్చాయి.అయితే, తాజాగా బీసీసీఐ (BCCI) వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. షమీ గురించి సానుకూలంగా స్పందించాయి. వన్డే వరల్డ్కప్-2027 టోర్నమెంట్కు ఎక్కువ సమయం లేదు కాబట్టి.. షమీని తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.ఇంకా పోటీలోనే ఉన్నాడుఈ మేరకు.. ‘‘సెలక్షన్ సమయంలో మొహమ్మద్ షమీ గురించి తరచూ చర్చ నడుస్తుంది. అతడు ఇంకా పోటీలోనే ఉన్నాడు. అయితే, అతడి ఫిట్నెస్ గురించే బోర్డుకు ఆందోళనగా ఉంది. వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ అతడు.కివీస్తో సిరీస్కు.. వరల్డ్కప్కూ ఎంపిక కావొచ్చు!అలాంటి ఆటగాడు సెలక్షన్ రాడార్లో లేకపోవడం అనే మాటే ఉండదు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు అతడి ఆట మెరుగ్గా సాగుతోంది. ఒకవేళ ఈ సిరీస్కు అతడిని ఎంపిక చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.షమీ అనుభవజ్ఞుడైన బౌలర్. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయగలడు. 2027 వరల్డ్కప్ జట్టుకూ అతడు ఎంపికయ్యే అవకాశం లేకపోలేదు’’ అని బీసీసీఐ వర్గాలు ఎన్డీటీవీతో పేర్కొన్నాయి. కాగా వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ సత్తా చాటాడు.మెరుగైన ప్రదర్శనఈ మెగా టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో షమీది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో తొమ్మిది వికెట్లు తీసిన ఈ రైటార్మ్ పేసర్.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత బెంగాల్ తరఫున దేశీ క్రికెట్లో రంజీల్లో కేవలం నాలుగు మ్యాచ్లలోనే 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.ప్రస్తుతం దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జనవరి 11 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు జరుగుతాయి.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
టీమిండియా సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు.సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో హార్దిక్ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.అయితే, ఈ రెండు మ్యాచ్లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్కు మాత్రం హార్దిక్ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్లలో ఆడనున్నాడు.విశ్రాంతి తీసుకోమన్నా వినడే!టీమిండియా తదుపరి న్యూజిలాండ్తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ మాత్రం ఈ సిరీస్ నుంచి హార్దిక్కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్తో ఐదు టీ20లు సహా వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, పాండ్యా మ్యాచ్ ఫిట్నెస్ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్ ఆడాడు.రో-కో ఆడేశారుకాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు ఆడారు. టీమిండియా యంగ్ స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్ శర్మ కూడా పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. ఇక శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్ తదుపరి మ్యాచ్లలో పంజాబ్కు ఆడతారు. సంజూ శాంసన్ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
IND vs NZ: ‘మనోడి’తో పాటు మరో ముగ్గురు.. గోల్డెన్ ఛాన్స్!
టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్లకు న్యూజిలాండ్ క్రికెట్ ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది. వన్డే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దూరంగా ఉండగా.. అతడి స్థానంలో మైకేల్ బ్రేస్వెల్ సారథ్యం వహించనున్నాడు.అయితే, టీ20 సిరీస్ సందర్భంగా సాంట్నర్ తిరిగి జట్టుతో చేరనున్నాడు. ఇక జనవరి 11- 31 వరకు కివీస్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీ20 జట్టు స్టార్లతో నిండి ఉండగా.. వన్డే జట్టులో కొత్త ముఖాలే ఎక్కువగా ఉన్నాయి. ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ కార్ల్సన్, జేడన్ లెనాక్స్ ఈసారి ఇండియా టూర్కు రానున్నారు.ఆది అశోక్భారత సంతికి చెందిన కివీస్ క్రికెటర్ ఆదిత్య అశోక్. తమిళనాడులో 2002, సెప్టెంబరు 5న జన్మించాడు. అశోక్ లెగ్ స్పిన్నర్. వైవిధ్య భరితమైన బంతులు వేయడంలో దిట్ట.భారత సంతతికే చెందిన ఇష్ సోధి కెరీర్ చరమాంకానికి చేరుకుంటున్నాడు. వైట్బాల్ క్రికెట్లో అతడి వారసుడిగా కివీస్ బోర్డు అశోక్ను తీర్చిదిద్దుతోంది. ఇప్పటికి న్యూజిలాండ్ తరఫున అశోక్ రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.క్రిస్టియన్ క్లార్క్దేశీ క్రికెట్లో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రిస్టియన్ క్లార్క్ రైటార్మ్ ఫాస్ట్బౌలర్. ఇప్పటి వరకు అతడు కివీస్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 34 మ్యాచ్లు ఆడిన క్లార్క్ 52 వికెట్లు తీశాడు. అయితే, అతడి ఖాతాలో ఓ శతకం కూడా ఉండటం విశేషం. 23 ఇన్నింగ్స్లో కలిపి అతడు 373 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటర్గానూ రాణించగల సత్తా ఉన్న క్లార్క్ వైపు కివీస్ మొగ్గుచూపవచ్చు.జోష్ క్లార్క్సన్ఆరడుగుల మూడు అంగుళాల ఎత్తు ఉండే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ జోష్ క్లార్క్సన్. లోయర్ ఆర్డర్లో ఫినిషర్గా రాణించగల సత్తా కూడా ఉంది. ఇప్పటికి 11 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన క్లార్క్సన్.. 92 పరుగులు చేశాడు. లిస్ట్-ఎ క్రికెట్లో 98 మ్యాచ్లలో అతడి పేరిట 2214 పరుగులు ఉన్నాయి.జేడన్ లెనాక్స్భారత పర్యటనలో భాగంగా ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 31 ఏళ్ల లెనాక్స్.. లిస్ట్-ఎ క్రికెట్లో 54 మ్యాచ్లలో కలిపి 69 వికెట్లు కూల్చాడు. ఎకానమీ 4.86. అతడి బౌలింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాంట్నర్కు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు కాబట్టి.. లెనాక్స్ స్పిన్ విభాగంలో కీలకమయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs NZ: కివీస్ జట్ల ప్రకటన.. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరం -
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టును జనవరి మొదటి వారంలో బీసీసీఐ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ జనవరి 3 లేదా 4న వర్చువల్గా సమావేశం కానుంది. ఈ మీటింగ్లో కివీస్తో వన్డేల కోసం కోసం భారత జట్టును ఖరారు చేయనుంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు దూరమైన కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. కివీస్తో వన్డే సిరీస్లో జట్టును నడిపించేందుకు గిల్ సిద్దమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ మధ్యలో మెడ గాయం కారణంగా వైదొలిగిన గిల్.. వన్డేలకు దూరమయ్యాడు. దీంతో అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలను చేపట్టాడు. అనంతరం గిల్ తిరిగి తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. అయితే నాలుగో టీ20కు ముందు గిల్ కాలి మడమ గాయం బారిన పడ్డాడు.దీంతో ఆఖరి రెండు టీ20లకు కూడా అతడు దూరమయ్యాడు. అనంతరం టీ20 వరల్డ్కప్-2026 జట్టులో గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ గిల్ మాత్రం ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం మొహాలీలోని పీసీఏ స్టేడియంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే వన్డే జట్టు పగ్గాలను చేపట్టాక గిల్ పెద్దగా రాణించలేకపోయాడు. ఆసీస్తో వన్డే సిరీస్లో గిల్ విఫలమయ్యాడు. దీంతో తన రీఎంట్రీలో న్యూజిలాండ్పై సత్తాచాటాలని శుభ్మన్ ఉవ్విళ్లూరుతున్నాడు. మరోవైపు ఆసీస్ పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో (CoE) తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. త్వరలోనే అతడికి వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే అతడు కివీస్తో వన్డేలకు అందుబాటులోకి రానున్నాడు. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.కివీస్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, తిలక్ వర్మచదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే! -
విలియమ్సన్ లేకుండానే...
వెల్లింగ్టన్: విదేశీ లీగ్లు ఆడేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్... భారత్తో వన్డేసిరీస్కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో పర్యటించనున్న న్యూజిలాండ్ జట్టు.. ఈ టూర్లో భాగంగా మూడు వన్డేలు, 5 టి20లు ఆడనుంది. దీని కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. దక్షిణాఫ్రికా (ఎస్ఏ)20 లీగ్లో ఆడేందుకు గానూ విలియమ్సన్ ఈ సిరీస్కు దూరం కాగా... యువ ఆటగాళ్లకు న్యూజిలాండ్ బోర్డు పెద్దపీట వేసింది. వన్డేల్లో మైకేల్ బ్రేస్వెల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. పేసర్ కైల్ జేమీసన్ రెండు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. ఎడంచేతి వాటం స్పిన్నర్ జేడెన్ లెనాక్స్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సాంట్నర్ టి20ల్లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. క్రిస్టియన్ క్లార్క్, ఆదిత్య అశోక్, జోష్ క్లార్క్సన్, నిక్ కెల్లీ, మిచెల్ రే వంటి పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో న్యూజిలాండ్ బరిలోకి దిగనుంది. జేడెన్ లెనాక్స్పై ఆ జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. ‘న్యూజిలాండ్ ‘ఎ’ జట్టు తరఫున లెనాక్స్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. దానివల్లే అతడికి ఈ అవకాశం దక్కింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో గత కొన్నాళ్లుగా అతడు నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దేశవాళీల్లో కనబర్చిన దూకుడే... అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిస్తాడనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్ కోచ్ రోబ్ వాల్టర్ అన్నాడు. త్వరలో టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న టామ్ లాథమ్ను ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన బెవాన్ జాక్స్, టిమ్ రాబిన్సన్ టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. జేమ్స్ నీషమ్, ఇష్ సోధి కూడా జట్టుకు ఎంపికయ్యారు. నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నెర్, మార్క్ చాప్మన్లను వన్డే జట్టు ఎంపికలో పరిగణనలోకి తీసుకోలేదు. టి20 జట్టులో మాత్రం చాప్మన్కు చోటు దక్కింది. న్యూజిలాండ్ వన్డే జట్టు: బ్రేస్వెల్ (కెప్టెన్ ), ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రే, విల్ యంగ్. న్యూజిలాండ్ టి20 జట్టు: సాంట్నర్ (కెప్టెన్), బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, హెన్రీ, జేమీసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి. -
భారత్తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్కు విలియమ్సన్ను దూరంగా ఉండనున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు. గత నెలలలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్తో టెస్టు సిరీస్లో మాత్రం మాడాడు. మౌంట్మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు."ఒక్కో సిరీస్కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు. -
వైజాగ్ వన్డేలో టీమిండియా జయభేరి.. ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
ముఖం మాడ్చుకున్న కుల్దీప్!.. రోహిత్ ఇలా చేశావేంటి?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సౌతాఫ్రికా మీద ఏకంగా ఐదుసార్లు.. నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఏకైక భారత బౌలర్గా చరిత్రకెక్కాడు.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచిలో భారత్ గెలవగా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ క్రమంలో 1-1తో సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్తో సిరీస్ ఫలితం తేలనుంది. వైజాగ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.270 పరుగులకు ఆలౌట్కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) నిర్ణయాన్ని సమర్థించేలా భారత బౌలర్లు మెరుగ్గా రాణించి.. సఫారీలను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లలో ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో ఓవరాల్గా పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్.. కేవలం 41 పరుగులు ఇచ్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) రూపంలో ముగ్గురు డేంజరస్ ప్లేయర్లను వెనక్కి పంపిన కుల్దీప్.. లుంగి ఎంగిడి (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. పదే పదే అప్పీలు చేస్తూ.. అయితే, ఎంగిడి ఎల్బీడబ్ల్యూ చేసే క్రమంలో కుల్దీప్ యాదవ్ రివ్యూ కోసం ప్రయత్నించిన తీరు.. అందుకు రోహిత్ శర్మ స్పందించిన విధానం నవ్వులు పూయించింది. ఎంగిడి అవుట్ అయ్యాడంటూ కుల్దీప్ పదే పదే అప్పీలు చేస్తూ.. రివ్యూ తీసుకోవాల్సిందిగా కెప్టెన్ కేఎల్ రాహుల్ను కోరాడు. అయితే, అందుకు అతడు నిరాకరించాడు.ముఖం మాడ్చుకున్న కుల్దీప్ఇంతలో రోహిత్ శర్మ జోక్యం చేసుకుంటూ.. ‘‘అబే.. రివ్యూ అవసరం లేదు’’ అంటూ నవ్వుతూ కుల్దీప్ను టీజ్ చేశాడు. దీంతో ఓవైపు రాహుల్.. మరోవైపు విరాట్ కోహ్లి కూడా నవ్వులు చిందించారు. అప్పటికే ముఖం మాడ్చుకున్న కుల్దీప్ నవ్వలేక నవ్వుతూ తన స్థానంలోకి వెళ్లాడు. అయితే, కొద్దిసేపటికే అతడు అనుకున్నట్లుగా ఎంగిడిని పెవిలియన్కు పంపడం విశేషం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. అయినా ఘోర పరాభవంThese are the moments we pay our internet bills for! 😉😁😍#INDvSA 3rd ODI, LIVE NOW 👉 https://t.co/Es5XpUmR5v pic.twitter.com/hPZJFPlJ0G— Star Sports (@StarSportsIndia) December 6, 2025 -
సౌతాఫ్రికా ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?
సౌతాఫ్రికాతో మూడో వన్డేలో భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టును 270 పరుగులకు పరిమితం చేశారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచిలో టీమిండియా.. రాయ్పూర్లో సౌతాఫ్రికా గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం నాటి మూడో వన్డే (IND vs SA 3rd ODI) ద్వారా సిరీస్ ఫలితం తేలనుంది. విశాఖపట్నం వేదికగా టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా తొలుత బ్యాటింగ్కు దిగిన ప్రొటిస్ జట్టుకు భారత పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే షాకిచ్చాడు. టీమిండియా బౌలింగ్ అటాక్ను ఆరంభించిన ఈ లెఫ్టార్మ్ బౌలర్.. ఐదో బంతికే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (0)ను పెవిలియన్కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.శతక్కొట్టిన డికాక్ఈ క్రమంలో డికాక్ సెంచరీ (89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు- 106 పరుగులు) పూర్తి చేసుకుని జోరు కనబరచగా ప్రసిద్ కృష్ణ అతడిని బౌల్డ్ చేశాడు. మరోవైపు.. బవుమా అర్ధ శతకం దిశగా సాగుతున్న వేళ.. రవీంద్ర జడేజా బౌలింగ్లో విరాట్ కోహ్లి (Virat Kohli)కి క్యాచ్ ఇచ్చి 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.మార్క్రమ్ విఫలంమిగతా వారిలో మాథ్యూ బ్రీట్జ్కే (24), డెవాల్డ్ బ్రెవిస్ (29) మాత్రమే చెప్పుకోగదగ్గ స్కోర్లు చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఐడెన్ మార్క్రమ్ (1) దారుణంగా విఫలం కాగా.. ఆల్రౌండర్లలో మార్కో యాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9) తేలిపోయారు. లుంగి ఎంగిడి ఒక్క పరుగుకే అవుట్ కాగా.. ఆఖర్లో కేశవ్ మహరాజ్ మెరుగైన (20 నాటౌట్) బ్యాటింగ్తో అలరించాడు. ప్రసిద్ బౌలింగ్ ఒట్నీల్ బార్ట్మన్ పదో వికెట్గా వెనుదిరగడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిపోయింది.చెరో నాలుగు పంచుకున్న ప్రసిద్, కుల్దీప్ఈ క్రమంలో 47.5 ఓవర్లలో సౌతాఫ్రికా 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ ప్రసిద్ కృష్ణ డికాక్, బ్రీట్జ్కే, మార్క్రమ్ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చడంతో పాటు బార్ట్మన్ను అవుట్ చేశాడు. మరోవైపు.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్రెవిస్, యాన్సెన్. బాష్, ఎంగిడిలను పెవిలియన్కు పంపాడు. మిగిలిన వారిలో అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు. సౌతాఫ్రికా విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.చదవండి: టెస్టుల్లో వెస్టిండీస్ క్రికెటర్ ప్రపంచ రికార్డు -
ఎట్టకేలకు టాస్ గెలిచిన టీమిండియా..
టీమిండియా ఎట్టకేలకు టాస్ గెలిచింది. సౌతాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా విశాఖపట్నంలో తమ దురదృష్టానికి స్వస్తి పలికింది. 21వ ప్రయత్నంలో వన్డేల్లో తొలిసారి టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అందుకే తొలుత బౌలింగ్ఈ సందర్భంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేస్తాం. నిన్న రాత్రి ఇక్కడ మేము ప్రాక్టీస్ చేశాము. రాంచి, రాయ్పూర్లో మాదిరి కాకుండా ఇక్కడ తేమ కాస్త ఆలస్యంగా ప్రభావం చూపుతోందని గ్రహించాము.వాషీపై వేటు.. జట్టులోకి తిలక్అందుకే లక్ష్య ఛేదననే మేము ఎంచుకున్నాము. ఈ వికెట్ బాగుందనిపిస్తోంది. గత రెండు మ్యాచ్లలో మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాము. పరిస్థితులకు తగ్గట్లుగా ఇంకాస్త మెరుగుపడితే అనుకున్న ఫలితం రాబట్టవచ్చు. ఈ మ్యాచ్లో ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మ (Tilak Varma) తుదిజట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.గాయాలతో వారిద్దరు దూరంమరోవైపు.. సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (Temba Bavuma) సైతం టాస్ గెలిస్తే తాము తొలుత బౌలింగే ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. రాంచి, రాయ్పూర్ మాదిరి ఇక్కడ కూడా ఆఖరి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగితే ప్రేక్షకులు సంతోషిస్తారన్న బవుమా.. బర్గర్, డి జోర్జి స్థానాల్లో ఒట్నీల్ బార్ట్మన్, ర్యాన్ రికెల్టన్ తుదిజట్టులోకి వచ్చారని తెలిపాడు. బర్గర్, డి జోర్జి గాయాల కారణంగా రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించాడు.ఫలితం తేల్చే మ్యాచ్కాగా మూడు వన్డేలో సిరీస్లో భాగంగా రాంచిలో తొలి మ్యాచ్లో టీమిండియా ఆదివారం పదిహేడు పరుగుల తేడాతో గెలిచింది. అనంతరం రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో సౌతాఫ్రికా 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమం కాగా.. శనివారం నాటి విశాఖపట్నం మ్యాచ్లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మూడో వన్డే తుదిజట్లుభారత్రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికార్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్మన్.చదవండి: భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు -
భారత్తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు భారీ షాకులు
భారత్తో కీలక మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. పేసర్ నండ్రీ బర్గర్ (Nandre Burger), బ్యాటర్ టోనీ డీ జోర్జి (Tony de Zorzi) గాయాల కారణంగా విశాఖపట్నం మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. సౌతాఫ్రికా క్రికెట్ ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. గాయాల కారణంగా..టీమిండియాతో రాయ్పూర్ వేదికగా రెండో వన్డే సందర్భంగా.. ఫాస్ట్ బౌలర్ నండ్రీ బర్గర్కు తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. మధ్యలోనే అతడు మైదానం నుంచి నిష్క్రమించాడు. మరోవైపు.. డి జోర్జి కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరనికి శుక్రవారం స్కానింగ్కు పంపగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.టీ20 సిరీస్ మొత్తానికి అతడు దూరంఫలితంగా బర్గర్, డి జోర్జికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సౌతాఫ్రికా క్రికెట్ వెల్లడించింది. డి జోర్జి భారత్తో ఆఖరి వన్డేతో పాటు.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ మొత్తానికి కూడా దూరమైనట్లు తెలిపింది. అతడు స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు పేర్కొంది. అయితే, అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయలేదని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సందర్భంగా వెల్లడించింది.క్వెనా మఫాకా సైతం..అదే విధంగా.. యువ ఫాస్ట్ బౌలర్ క్వెనా మఫాకా కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు తెలిపిన ప్రొటిస్ బోర్డు.. అతడు పూర్తి స్థాయిలో కోలుకోలేదని తెలిపింది. కాబట్టి టీమిండియాతో టీ20 సిరీస్ ఆరంభ మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. జట్టు నుంచి అతడు నిష్క్రమించాడని.. మఫాకా స్థానంలో లూథో సిపామ్లను టీ20 జట్టులోకి చేర్చినట్లు వెల్లడించింది.టెస్టులలో పైచేయి.. వన్డేలలో 1-1తో..కాగా టీమిండియాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలుత ఆతిథ్య జట్టును టెస్టుల్లో 2-0తో వైట్వాష్ చేశారు సఫారీలు.ఇక వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ ఓడిన ప్రొటిస్ జట్టు.. రెండో వన్డేలో గెలిచి 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే ఆఖరిదైన శనివారం నాటి మూడో వన్డేకు విశాఖపట్నం వేదిక. ఆ తర్వాత డిసెంబరు 9 నుంచి ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్కు తెరలేస్తుంది.చదవండి: చరిత్రలో నిలిచిపోయే పోరాటం చేసిన వెస్టిండీస్ -
‘తిలక్, పంత్ ఉన్నా.. అతడిని నమ్మారు.. క్రెడిట్ ఇవ్వాల్సిందే’
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో ఆడిన జట్టునే.. రెండో వన్డేలోనూ కొసాగించింది టీమిండియా యాజమాన్యం. ఫలితంగా మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్కు తనను తాను నిరూపించుకునేందుకు మరో అవకాశం లభించింది.సెంచరీతో అదరగొట్టాడుఈసారి రుతురాజ్ ఎలాంటి తప్పిదమూ చేయలేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్పూర్ మైదానంలో శతక్కొట్టిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేవలం 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ (Ruturaj Gaikwad)... మొత్తంగా 83 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 105 పరుగులు రాబట్టాడు.సాధారణంగా రుతురాజ్ ఓపెనింగ్ బ్యాటర్గా వస్తాడు. కానీ జట్టు కూర్పు దృష్ట్యా ఈసారి అతడు మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గైర్హాజరీ కారణంగా రుతుకు జట్టులో చోటు దక్కింది. మరోవైపు.. రిషభ్ పంత్ (Rishabh Pant) నుంచి గట్టి పోటీ ఉన్నా.. యాజమాన్యం అనూహ్య రీతిలో తుదిజట్టులోనూ అతడిని ఆడించింది.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రుతురాజ్ విషయంలో మేనేజ్మెంట్కు తప్పక క్రెడిట్ ఇవ్వాలన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తిలక్, పంత్ ఉన్నా.. ‘‘ఒక్క మ్యాచ్తో ఏ ఆటగాడు తనను తాను నిరూపించుకోలేడు. కాబట్టే రుతురాజ్కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. ఇందుకు యాజమాన్యానికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. తిలక్ వర్మ , రిషభ్ పంత్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్నా రుతుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అతడిని నాలుగో స్థానంలో పంపినా సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక ముందు కూడా అతడిని జట్టులో కొనసాగిస్తే టాపార్డర్లో ఉంటాడా? లేదంటే నాలుగో స్థానంలో ఆడతాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.తనను ఏ స్థానంలో ఆడించినా పర్లేదనే సంకేతాన్ని రుతురాజ్ సెలక్టర్లకు ఇచ్చేశాడు. కాబట్టి మూడో వన్డేలోనూ అతడిని తప్పక కొనసాగిస్తారనే భావిస్తున్నా’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.దురదృష్టవశాత్తూకాగా రాంచి వేదికగా తొలి వన్డేలో రుతు 14 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులే చేశాడు. ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతు ఇచ్చిన క్యాచ్ను డెవాల్డ్ బ్రెవిస్ సంచలన రీతిలో ఒంటిచేత్తో అందుకుని.. అతడికి రీఎంట్రీలో చేదు అనుభవం మిగిల్చాడు. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఓడింది. ఫలితంగా ప్రస్తుతం 1-1తో ఇరుజట్లు సమానంగా ఉండగా.. విశాఖపట్నంలో శనివారం జరిగే మూడో వన్డేతో సిరీస్ విజేత ఎవరో తేలుతుంది. చదవండి: RO-KO హవా!.. ఈ హీరోని మర్చిపోతే ఎలా? కెప్టెన్గానూ సరైనోడు! -
IND vs SA: ఈ హీరోని మర్చిపోతే ఎలా?.. కెప్టెన్గానూ సరైనోడు!
జట్టులో తమకంటూ ప్రత్యేక బ్యాటింగ్ స్థానం లేకపోయినా టీమిండియాకు నిస్వార్థమైన సేవలు అందిస్తున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉంటాడు. 2014లో ఓపెనర్గా భారత జట్టు తరఫున ప్రస్థానం మొదలుపెట్టిన ఈ కర్ణాటక ఆటగాడు.. వికెట్ కీపర్గానూ సేవలు అందించాడు.తరచూ మార్పులుఅయితే, తర్వాతి కాలంలో రాహుల్ (KL Rahul) తన ఓపెనింగ్ స్థానాన్ని కోల్పోయాడు. ముఖ్యంగా టెస్టుల్లో ఓసారి ఐదో నంబర్ బ్యాటర్గా.. మరోసారి నాలుగో స్థానంలో.. ఆ తర్వాత మళ్లీ ఓపెనర్గా ఇలా వివిధ స్థానాల్లో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ నిలకడైన ఆటతో రాణిస్తూ తనను తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాహుల్. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రిటైర్మెంట్ తర్వాత రాహుల్కు టెస్టుల్లో ఓపెనర్గా వరుస అవకాశాలు వస్తున్నాయి.కీపింగ్ బాధ్యతలు కూడా.. ఇదిలా ఉంటే.. వన్డేల్లోనూ రాహుల్ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. టీ20 జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్ బ్యాటర్గా తన సేవలు అందిస్తున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా తానే నిర్వర్తిస్తున్న రాహుల్.. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు తాత్కాలిక కెప్టెన్గానూ వ్యవహరిస్తున్నాడు.సఫారీ జట్టుతో తొలి వన్డేలో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రాహుల్. కేవలం 56 బంతుల్లోనే 60 పరుగులు (రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. లెజెండరీ బ్యాటర్లు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లి (135)తో రాహుల్ మెరుపు అర్ధ శతకంతో రాణించడంతో టీమిండియా 349 పరుగుల భారీ స్కోరు చేయగలిగిందిరాహుల్ విలువైన ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో బౌలర్లు ఆరంభంలో తడబడినా ఆఖరి నిమిషంలో సత్తా చాటడంతో 17 పరుగుల తేడాతో భారత జట్టు గట్టెక్కింది. అదే విధంగా రెండో వన్డేలోనూ కోహ్లి శతక్కొట్టగా (102).. రుతురాజ్ గైక్వాడ్ (105) కూడా సెంచరీతో అలరించాడు. వీరిద్దరికి తోడుగా రాహుల్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 43 బంతుల్లోనే ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 66 పరుగులతో అజేయంగా నిలిచాడు.అయితే, ఈ మ్యాచ్లో 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించినా టీమిండియా గెలవలేకపోయింది. బౌలర్ల వైఫల్యం కారణంగా నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లోనూ బ్యాటర్గా, కెప్టెన్గా రాహుల్ తనదైన ముద్ర వేయగలిగాడు. అయితే, రో-కోల హవాలో అతడి ఆటకు దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు నిజానికి టీమిండియా కెప్టెన్గానూ రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా అతడు పద్దెనిమిదిసార్లు భారత జట్టును సారథిగా ముందుకు నడిపించాడు. ఇందులో ఏకంగా పన్నెండుసార్లు టీమిండియా గెలిచింది. రాహుల్ కెప్టెన్సీలో 14 వన్డేలకు గానూ తొమ్మిదింట విజయం సాధించిన టీమిండియా.. టెస్టుల్లో మూడింటికి రెండు, టీ20లలో ఒకటికి ఒకటి గెలిచింది.మరో విశేషం ఏమిటంటే.. రాహుల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి ఇప్పటికి ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం. ఓవరాల్గా రాహుల్ సారథ్యంలో కోహ్లి సాధించిన స్కోర్లు వరుసగా... 122,51,0,65,113,135,102. ఇందులో చివరి రెండు సెంచరీలు సౌతాఫ్రికాతో వన్డేల్లో బాదినవే.ఏదేమైనా.. టీమిండియా విజయాల్లో అనేకసార్లు కీలక పాత్ర పోషించిన రాహుల్.. తెరవెనుకే ఉండిపోతున్నాడనే అభిప్రాయం అతడి అభిమానుల్లో ఉంది. అంతేకాదు.. కెప్టెన్గానూ రాణించగల సత్తా ఉన్నా ఈ 33 ఏళ్ల ఆటగాడికి అదృష్టం కలిసి రావడం లేదని.. ప్రస్తుత పరిస్థితుల్లో వన్డే సారథిగా రాహులే సరైనోడు అన్న విషయాన్ని యాజమాన్యం గుర్తిస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
రిషభ్ పంత్ చేసిన పనికి.. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో బ్యాట్తో పరుగుల వరద పారించే హిట్మ్యాన్.. సారథిగా గంభీరంగా కనిపిస్తూనే.. పరిస్థితులకు తగ్గట్లు నవ్వులు పూయించడంలోనూ ముందే ఉంటాడు. ఇక మైదానం వెలుపల సహచర ఆటగాళ్లతో రోహిత్ ఫ్రెండ్లీగా ఉంటాడనే విషయం అతడి అభిమానులకు బాగా తెలుసు.తానొక లెజెండరీ బ్యాటర్, కెప్టెన్ని అనే గర్వం రోహిత్ శర్మ (Rohit Sharma)లో అస్సలు కనిపించదు. తోటి ఆటగాళ్లను ఆటపట్టించడంలో ముందుండే హిట్మ్యాన్.. తన పట్ల వారు కూడా అదే విధంగా ప్రవర్తించినా సరదాగానే ఉంటాడు. ఈ విషయాన్ని రుజువు చేసే ఘటన ఇటీవల చోటు చేసుకుంది.మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా..టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికా (IND vs SA)తో వరుస సిరీస్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టెస్టుల్లో సఫారీల చేతిలో 2-0తో వైట్వాష్కు గురైన భారత జట్టు.. మూడు వన్డేల సిరీస్లో 1-1తో సమంగా ఉంది. ఆఖరి ఓవర్ ఉత్కంఠగా సాగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో గట్టెక్కిన టీమిండియా.. రెండో వన్డేలో మాత్రం 358 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.రాలిపడ్డ కనురెప్పఈ రెండు వన్డేల్లో రోహిత్ శర్మ వరుసగా 57, 14 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. రాయ్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడు, బెంచ్కే పరిమితమైన రిషభ్ పంత్ (Rishabh Pant).. రోహిత్ను ఆటపట్టించాడు. రోహిత్ కంటి నుంచి రాలిపడిన రెప్పను పట్టుకున్న పంత్.. అతడి చెయ్యిపై ఉంచి.. ఓ కోరిక కోరుకోమన్నాడు.ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?ఇందుకు నవ్వులు చిందించిన రోహిత్ అలాగే చేశాడు. వీరిద్దరు ఇలా సరదాగా సంభాషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో.. ‘ఇంతకీ రోహిత్ ఏం కోరుకున్నాడు?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై రోహిత్ శర్మ సన్నిహితుడు అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ వేదికగా స్పందించాడు.రెండే రెండు కోరికలు‘‘నాకు తెలిసి ప్రస్తుతం రోహిత్కు రెండే రెండు కోరికలు ఉండి ఉంటాయి. ఒకటేమో.. ‘నేను 2027 వన్డే వరల్డ్కప్ను నా చేతుల్లో పట్టుకోవాలి’ అని.. మరొకటి.. సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ చేయాలని’’ అంటూ అభిషేక్ నాయర్.. రోహిత్ శర్మ మాటలను డీకోడ్ చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్-సౌతాఫ్రికా మధ్య శనివారం విశాఖపట్నం వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. కాగా టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 అందించిన రోహిత్ శర్మను.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ తొలగించిన విషయం తెలిసిందే. ఇక అంతకు ముందు రోహిత్.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్తో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.చదవండి: 5 ఏళ్లలో 23 సెంచరీలు.. టెస్ట్ క్రికెట్పై రూట్ పంజా -
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డు
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన రుతురాజ్ గైక్వాడ్కు తొలి ప్రయత్నంలో చేదు అనుభవం ఎదురైంది. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఈ మహారాష్ట్ర ఆటగాడు.. మొత్తంగా 14 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసి నిష్క్రమించాడు.సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్..సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో రుతురాజ్ (Ruturaj Gaikwad) గాల్లోకి లేపిన బంతిని.. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) అద్భుతంగా ఒడిసిపట్టాడు. సంచలన రీతిలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకుని.. రుతురాజ్కు నిద్రలేని రాత్రిని మిగిల్చాడు. అసలే రాక రాక వచ్చిన అవకాశం.. కానీ ఇలా స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రుతుతో పాటు అతడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో రెండో వన్డేలో యాజమాన్యం రుతురాజ్పై వేటు వేసి.. రిషభ్ పంత్ (Rishabh Pant)ను తుదిజట్టులోకి తీసుకుంటుందనే ఊహాగానాలు వచ్చాయి. అయితే, మేనేజ్మెంట్ రుతుకు మరో అవకాశం ఇచ్చింది. రాయ్పూర్ వేదికగా రెండో వన్డేలో అతడిని ప్లేయింగ్ ఎలెవన్కు ఎంపిక చేసింది.77 బంతుల్లోనే సెంచరీఈసారి తనకు వచ్చిన అవకాశాన్ని రుతురాజ్ గైక్వాడ్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. ఆది నుంచి దూకుడు ప్రదర్శించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. శతక్కొట్టిన తర్వాత కూడా జోరు కొనసాగించిన రుతురాజ్... మొత్తంగా 83 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 105 పరుగులు సాధించాడు.మరికొన్నాళ్లపాటు..సఫారీ పేసర్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో టోనీ డి జోర్జికి క్యాచ్ ఇవ్వడంతో రుతురాజ్ ఇన్నింగ్స్కు తెరపడింది. నిజానికి ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే రుతురాజ్ను మేనేజ్మెంట్.. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో బరిలోకి దింపింది. తొలి ప్రయత్నంలో దురదృష్టవశాత్తూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన రుతు.. తాజా వన్డేలో శతకం సాధించి తనను తాను నిరూపించుకున్నాడు. మరికొన్నాళ్లపాటు జట్టులో కొనసాగే అర్హత సంపాదించాడు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025చిరస్థాయిగా నిలిచిపోయే రికార్డుఇక వన్డేల్లో తన తొలి సెంచరీతోనే రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాయ్పూర్లో మొట్టమొదటి అంతర్జాతీయ శతకం నమోదు చేసిన క్రికెటర్గా తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడు. కాగా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో గల షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇప్పటి వరకు రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది.ఆస్ట్రేలియాతో టీ20, న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్లు జరుగగా.. కివీస్తో వన్డేలో నాటి కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు సాధించాడు. ఈ వేదికపై ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండగా.. తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా రుతురాజ్ శతకం సాధించి.. రోహిత్ పేరును చెరిపేశాడు.మరో రెండు రికార్డులుఇక ఈ మ్యాచ్లో రుతురాజ్తో పాటు విరాట్ కోహ్లి కూడా శతకం (93 బంతుల్లో 102) సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్కు రికార్డు స్థాయిలో 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇదిలా ఉంటే.. 77 బంతుల్లోనే శతక్కొట్టిన రుతురాజ్.. సౌతాఫ్రికాపై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. అంతకు ముందు యూసఫ్ పఠాన్ 2011లో ప్రొటిస్ జట్టుతో 68 బంతుల్లోనే శతకం సాధించాడు. ఇక సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.చదవండి: BCCI: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కు భారత జట్టు ప్రకటన -
శతక్కొట్టిన రుతురాజ్, కోహ్లి.. రాహుల్ మెరుపు ఇన్నింగ్స్
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) విఫలం కాగా.. విరాట్ కోహ్లి (102), రుతురాజ్ (105) సెంచరీలతో చెలరేగారు.Firsts are always special! 💪#RuturajGaikwad lights up Raipur with an epic knock to bring up his first ODI ton. 👏🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/uDZZ6h8ulN— Star Sports (@StarSportsIndia) December 3, 2025 రాహుల్ మెరుపు అర్ధ శతకంతాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ అర్ధ శతకం (43 బంతుల్లోనే 66)తో అదరగొట్టగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (1) రనౌట్ అయ్యాడు. మిగిలిన వారిలో మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 24 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి తలా ఒక వికెట్ పడగొట్టారు.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025కాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ (IND vs SA ODIs)లో భాగంగా టీమిండియా రాంచిలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 349 పరుగులు చేసిన భారత్.. ప్రొటిస్పై 17 పరుగుల తేడాతో నెగ్గింది. తాజాగా మరోసారి 358 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన టీమిండియా.. సఫారీలకు 359 పరుగుల టార్గెట్ విధించింది. ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాపై వన్డేల్లో భారత్కు ఇది రెండో అత్యధిక స్కోరు.వన్డేల్లో సౌతాఫ్రికాపై టీమిండియా అత్యధిక స్కోర్లు టాప్-5 జాబితా🏏గ్వాలియర్ వేదికగా 2010లో 401/3🏏రాయ్పూర్ వేదికగా 2025లో 358/5🏏రాంచి వేదికగా 2025లో 349/8🏏కార్డిఫ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ 2013లో 331/7🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 326/5.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి -
IND vs SA: ప్రపంచ రికార్డు సమం చేసిన కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేల్లో శతక్కొట్టిన కోహ్లి.. రాయ్పూర్లో రెండో వన్డేలోనూ సెంచరీతో కదం తొక్కాడు. తద్వారా చాన్నాళ్ల తర్వాత ‘విన్టేజ్’ కోహ్లిని గుర్తు చేస్తూ వరుసగా రెండు శతకాల (Back to Back Centuries)తో సత్తా చాటాడు.ఈ క్రమంలో న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamsion) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి సమం చేశాడు. ఇంతకీ అదేమిటి అంటారా?... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోహ్లి (Virat Kohli) పునరాగమనం చేశాడు. కానీ, ఆసీస్ గడ్డపై తొలి రెండు వన్డేల్లో అనూహ్య రీతిలో అతడు డకౌట్ అయ్యాడు.అయితే, మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (74) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లో (IND vs SA ODIs)నూ దుమ్ములేపుతున్నాడు. సఫారీలతో తొలి వన్డేలో 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో వన్డేలో తొంభై బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కోహ్లి శతక ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి.A sight you never get tired of. Another ODI, another Virat Kohli century. 💯👑The nation roars. The blockbuster rolls on. 🇮🇳#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/YvZyupUqYa— Star Sports (@StarSportsIndia) December 3, 2025మొత్తంగా రాయ్పూర్లో 93 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 102 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లుంగి ఎంగిడి బౌలింగ్లో.. ఐడెన్ మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి రెండో వికెట్కు 22 పరుగులు జోడించిన కోహ్లి.. నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి 195 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్తో కలిసి 27 పరుగులు జోడించి కోహ్లి నిష్క్రమించాడు. కాగా సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అంతకు ముందు కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికాపై ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా ఉండగా.. కోహ్లి తాజాగా కేన్ మామ ప్రపంచ రికార్డును సమం చేశాడు.సౌతాఫ్రికాపై వన్డేల్లో కోహ్లి సెంచరీలు🏏కోల్కతా వేదికగా వన్డే వరల్డ్కప్ 2023లో 101 నాటౌట్🏏రాంచి వేదికగా 2025లో 135 పరుగులు🏏రాయ్పూర్ వేదికగా 2025లో 102 పరుగులుచదవండి: IND vs SA: గంభీర్ నమ్మకమే నిజమైంది.. శతక్కొట్టిన రుతురాజ్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్) బాది ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.రెండో వన్డేలోనూ దూకుడుఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్పూర్ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లియాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం. గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్ నమోదు చేయగా.. సచిన్ టెండుల్కర్ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.కోహ్లి- రుతు ధనాధన్మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్పూర్ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, నాలుగో నంబర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. UPDATE: IND vs SA 2nd Odi: విరాట్ కోహ్లి సూపర్ సెంచరీచదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్ -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత తుదిజట్టు అదే!
భారత్తో రెండో వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఈ మ్యాచ్తో తిరిగి జట్టుతో చేరిన ప్రొటిస్ కెప్టెన్ టెంబా బవుమా మాట్లాడుతూ.. ‘‘వికెట్ పాత బడుతున్న కొద్దీ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము తొలుత బౌలింగ్ ఎంచుకున్నాం.అయితే, పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. గత మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నాం. నాతో పాటు కేశవ్ మహరాజ్ (Keshav Maharan), లుంగి ఎంగిడి తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ మాకెంతో కీలకమైనది’’ అని పేర్కొన్నాడు. కాగా భారత్తో తొలి వన్డేలో విఫలమైన సఫారీ జట్టు ఓపెనర్ ర్యాన్ రికెల్టన్పై వేటు పడగా.. పేసర్లు ప్రెనేలన్ సుబ్రేయన్, ఒట్నీల్ బార్ట్మన్ తమ స్థానాలు కోల్పోయారు.తుది జట్టులో మార్పులు లేవుమరోవైపు.. మరోసారి టాస్ ఓడిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేకపోతున్నాం. ఏదేమైనా గత మ్యాచ్లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. ప్రత్యర్థి జట్టు కూడా గట్టి పోటీనిచ్చింది.పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితం రాబట్టగలము.ఈ వికెట్ బాగుంది. మా తుదిజట్టులో ఎలాంటి మార్పులూ లేవు’’ అని తెలిపాడు. ఆధిక్యంలో టీమిండియాకాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచి వేదికగా ఆదివారం తొలి వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది.ఈ మ్యాచ్లో భారత దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli) శతక్కొట్టడం (135), రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) రాణించడం హైలైట్గా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో వన్డేలోనూ రో-కో ప్రదర్శనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరు మరోసారి చితక్కొడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో వన్డే తుదిజట్లు👉వేదిక: షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం, రాయ్పూర్👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్భారత తుదిజట్టుయశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.సౌతాఫ్రికా తుదిజట్టుక్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో యాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, నండ్రీ బర్గర్, లుంగి ఎంగిడి.చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ప్లేయర్ -
రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!
భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల భవితవ్యం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్గా రోహిత్ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్మన్ గిల్కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్ తెలిపాడు. వన్డే వరల్డ్కప్-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆద్యంతం అద్భుత ఆట తీరుతోఅయితే, ఆసీస్ టూర్లో అందుకు భిన్నంగా రోహిత్- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.రాంచి వేదికగా రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 83వ శతకం బాది తన బ్యాటింగ్లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.అగ్రెసివ్గా సెలబ్రేషన్స్ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా.. రోహిత్ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్కాగా..రో- కో ఫ్యాన్స్ హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు అగార్కర్ను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 బీసీసీఐ సీరియస్!ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్- అగార్కర్లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్తో సీనియర్ ఆటగాళ్లు రోహిత్, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్పూర్ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్- అగార్కర్కు అస్సలు మాటల్లేవు.ఇక కోహ్లి- గంభీర్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్- కోహ్లి అభిమానులు గంభీర్- అగార్కర్లను ట్రోల్ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.రోహిత్తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్రూమ్లోకి వెళ్లే సమయంలో గంభీర్ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్లాబీలో గంభీర్తో రోహిత్ సీరియస్గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్తో హోటల్ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసింది.తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కేక్ కట్ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గాKohli completely ignored gambhir after win 😭😭 pic.twitter.com/XNBwPZPN0q— ADITYA (@Wxtreme10) December 1, 2025Gautam Gambhir seen talking with Rohit Sharma at the team hotel while the Indian team was celebrating their victory by cutting a cake.🇮🇳❤️ pic.twitter.com/iw6ld3PCv4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 1, 2025 -
వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్
టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్వాష్కు గురైన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. బాష్ ఒంటరి పోరాటంఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది. Game, set, match! 💪Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk— BCCI (@BCCI) November 30, 2025 అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..వాళ్ల పోరాటం అద్భుతం‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే. జాగ్రత్త అంటూ వార్నింగ్తదుపరి రెండు మ్యాచ్లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు. కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
IND vs AFG ODIs: ఫైనల్ వర్షార్పణం.. విజేత ఎవరంటే?
బెంగళూరు: అండర్–19 ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్ జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయింది. దిత్వా తుపాను ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ను 31 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసిన దశలో వెలుతురులేమి, వర్షం కారణంగా మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత ఎంతసేపు ఎదురుచూసినా ఆట తిరిగి ప్రారంభించే పరిస్థితులు లేకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కెప్టెన్ విఫలంభారత బ్యాటర్లలో కనిష్క్ చౌహాన్ (28 నాటౌట్), అభిజ్ఞ కుందు (27) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ విహాన్ మల్హోత్రా (10), వన్ష్ ఆచార్య (2), వఫీ (2), వినీత్ (0) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్ అజీజ్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, అఫ్గానిస్తాన్తో పాటు భారత్ ‘బి’ జట్టు కూడా పాల్గొంది. లీగ్ దశలో అఫ్గానిస్తాన్ 4 మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి ఒక దాంట్లో ఓడి 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా... భారత ‘ఎ’ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలతో 8 పాయింట్లతో ఫైనల్కు అర్హత సాధించింది. భారత ‘బి’ జట్టు 4 మ్యాచ్ల్లో ఒక విజయం రెండు పరాజయాలతో చివరి స్థానంలో నిలిచింది. చదవండి: సూర్యవంశీ మరోసారి ఫెయిల్.. మాత్రే వరుస సెంచరీలు -
నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కోహ్లి
సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి పాత ‘కింగ్’ను గుర్తుచేశాడు. రాంచి వేదికగా ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి శతక్కొట్టాడు. వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసి.. సింగిల్ ఫార్మాట్లో అత్యధికసార్లు వంద పరుగుల మార్కు అందుకున్న ఏకైక బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు.తన ‘విన్’టేజ్ ఆటతోనే విమర్శకులకు సమాధానం ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. టీమిండియా యాజమాన్యానికి కూడా తన ఫామ్ గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తొలి వన్డేలో సఫారీలపై విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు‘‘నేను వందకు 120 శాతం ఫామ్తో తిరిగి వస్తానని ఇప్పటికే చెప్పాను. ఈ మ్యాచ్ కోసం నేను పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాను. ఒకరోజు ముందుగానే ఇక్కడికి చేరుకుని ప్రాక్టీస్ చేశాను. నా వయసు ఇప్పుడు 37 ఏళ్లు.నా శరీరానికి కూడా తగినంత విశ్రాంతి, రికవరీ కోసం సమయం కావాలి. ఆట ఎలా ఉండబోతుందో ముందుగానే నా మైండ్లోనే ఓ స్పష్టతకు వచ్చేస్తాను. ఈరోజు మ్యాచ్లో ఇలా ఆడటం అద్భుతంగా అనిపించింది. తొలి 20- 25 ఓవర్ల వరకు పిచ్ బాగానే ఉంది. ఆ తర్వాత వికెట్ కాస్త నెమ్మదించింది.వెళ్లి బంతిని బాదడమే కదా అనుకున్నా. కానీ తర్వాత పరిస్థితికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాను. ఇతర విషయాల గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆటను పూర్తిగా ఆస్వాదించాను. చాలా ఏళ్లుగా నేను ఇదే పని చేస్తున్నాను. గత 15-16 ఏళ్లలో 300కు పైగా వన్డేలు ఆడాను.టచ్లో ఉన్నట్లే లెక్కప్రాక్టీస్లో మనం బంతిని హిట్ చేయగలిగామంటే టచ్లో ఉన్నట్లే లెక్క. సుదీర్ఘకాలం పాటు క్రీజులో నిలబడి బ్యాటింగ్ చేయాలంటే శారీరకంగా ఫిట్గా ఉండటం ముఖ్యం. ఆటకు మానసికంగా సిద్ధంగా ఉండటం అత్యంత ముఖ్యం.కేవలం గంటల కొద్ది సాధన చేస్తేనే రాణించగలము అనే మాటను నేను పెద్దగా నమ్మను. ముందుగా చెప్పినట్లు మానసికంగా సిద్ధంగా ఉంటే ఏదైనా సాధ్యమే. నేను ప్రతిరోజూ కఠినశ్రమ చేస్తాను. క్రికెట్ ఆడుతున్నాను కాబట్టే వర్కౌట్ చేయను. జీవితంలో ఇదీ ఒక భాగం కాబట్టే చేస్తాను.అప్పటి వరకు ఆడుతూనే ఉంటానాకు నచ్చినట్లుగా జీవిస్తాను. శారీరకంగా ఫిట్గా ఉండి.. మానసికంగా ఆటను ఆస్వాదించినన్ని రోజులు క్రికెట్ ఆడుతూనే ఉంటాను’’ అని కోహ్లి కుండబద్దలు కొట్టాడు. ఇప్పట్లో తాను రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చాడు.కాగా రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి నుంచి వన్డే వరల్డ్కప్-2027 ఆడతామనే హామీ రాలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గతంలో పేర్కొన్నాడు. అయితే, రో-కో వన్డేల్లో వరుసగా సత్తా చాటుతూ తాము ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నామని చాటి చెబుతున్నారు.తాజాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు చేయగా.. ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ 51 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 136 పరుగులు జోడించారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా సఫారీలను 17 పరుగులతో ఓడించి.. మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్! A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025 -
నరాలు తెగే ఉత్కంఠ.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. రాంచిలో ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో 17 పరుగుల తేడాతో సఫారీ జట్టును ఓడించింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్కు ఈ గెలుపు సాధ్యమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0తో టీమిండియా ముందంజ వేసింది. రాంచిలోని జేఎస్సీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కాంప్లెక్స్లో టాస్ వేదికగా తొలి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా (IND vs SA) తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది. రోహిత్, కోహ్లి, రాహుల్ ధనాధన్ఓపెనర్లలో రీఎంట్రీ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (18) విఫలం కాగా.. దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 57)తో సత్తా చాటాడు. ఇక మరో లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat kohli) భారీ శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) అర్ధ శతకంతో అలరించాడు. మిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 20 బంతుల్లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆదిలోనే షాకులుసౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికాకు భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఆదిలోనే షాకులు ఇచ్చాడు. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను డకౌట్ చేసిన రాణా.. అతడి స్థానంలో వన్డౌన్లో వచ్చిన క్వింటన్ డికాక్ను కూడా డకౌట్గా వెనక్కి పంపాడు. అదరగొట్టిన మాథ్యూ, యాన్సెన్మరో ఓపెనర్, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో కష్టాల్లో కూరుకుపోయిన ప్రొటిస్ జట్టును మాథ్యూ బ్రీట్జ్కే (72) ఆదుకున్నాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ యాన్సెన్ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే యాన్సెన్ 70 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఫర్వాలేదనిపించారు. భయపెట్టిన బాష్అయితే, సగం ఇన్నింగ్స్లో (25) ఓవర్లలో 162 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా సులువుగానే తలవంచుతుందనిపించగా.. టెయిలెండర్లు ప్రెనెలర్ సుబ్రేయన్ (17), నండ్రీ బర్గర్ (17) ఆల్రౌండర్ కార్బిన్ బాష్తో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మరోవైపు.. బాష్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి.. 40 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని మ్యాచ్ను ఎగురవేసుకుపోయే ప్రయత్నం చేశాడు. తొమ్మిది వికెట్లు పడినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ.. నరాలు తెగే ఉత్కంఠ రేపాడు. హాఫ్ సెంచరీ తర్వాత రెండు సిక్సర్లు బాది టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఈసారి బంతి ప్రసిద్ కృష్ణ చేతికి ఇవ్వగా అతడు అద్భుతం చేశాడు. ప్రసిద్ కృష్ణ, రోహిత్ అద్భుతంఆఖరి ఓవర్లో రెండో బంతిని బాష్ గాల్లోకి లేపగా ఎక్స్ట్రా కవర్లో ఉన్న రోహిత్ శర్మ క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. 17 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసింది.భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక కీలక వికెట్ కూల్చి జట్టును విజయతీరాలకు చేర్చారు.చదవండి: కోహ్లి ప్రపంచ రికార్డులు.. 7000వ సెంచరీ -
పొడిచేశావ్ కట్టప్పా!.. ఎందుకిలా చేశావు!.. పాపం మన కెప్టెన్!
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. సౌతాఫ్రికాతో వన్డేలకు ఈ మహారాష్ట్ర ఆటగాడిని ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం.. రాంచిలో తుదిజట్టులోనూ ఆడే అవకాశం ఇచ్చింది.ఎట్టకేలకు ఓ అవకాశంఇటీవల సౌతాఫ్రికా-‘ఎ’ జట్టుతో అనధికారిక వన్డే సిరీస్లో రుతు (Ruturaj Gaikwad) సత్తా చాటిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో 129 బంతుల్లో 117 పరుగులు సాధించిన రుతురాజ్.. రెండో మ్యాచ్లో అజేయ అర్ధ శతకం (68)తో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే జాతీయ జట్టు నుంచి అతడికి పిలుపు వచ్చింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) గాయం వల్ల దూరం కావడం వల్ల రుతుకు సెలక్టర్లు మరో అవకాశం ఇచ్చారు.అయితే, ప్రస్తుత భారత వన్డే జట్టు కూర్పు దృష్ట్యా తుదిజట్టులో రుతురాజ్కు చోటు దక్కుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అనూహ్యంగా రిషభ్ పంత్కు మొండిచేయి చూపిన నాయకత్వ బృందం రుతుకు ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం కల్పించింది. ఈ క్రమంలో మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఈ కుడిచేతి వాటం ఆటగాడు బ్యాటింగ్కు వచ్చాడు.ఊహించని రీతిలో షాక్నెమ్మదిగానే తన ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రుతురాజ్కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. భారత ఇన్నింగ్స్లో 27వ ఓవర్ను సఫారీ పేసర్ ఒట్నీల్ బార్ట్మన్ వేశాడు. అతడి బౌలింగ్లో మూడో బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో రుతు గాల్లోకి లేపాడు. అంతే.. ఇన్సైడ్ సర్కిల్ లోపల ఇంతలో బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పాదరసంలా దూసుకవచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ నమ్మశక్యం కాని రీతిలో... ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు.కోహ్లి సైతం.. నోరెళ్లబెట్టాడుబ్రెవిస్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో రుతు కథ ముగిసిపోయింది. మొత్తంగా 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసి అతడు నిష్క్రమించాడు. నిజానికి బ్రెవిస్ ఆ క్యాచ్ అలా పడతాడని ఎవరూ ఊహించలేదు. అంతెందుకు రుతుకు తోడుగా మరో ఎండ్లో ఉన్న దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం.. ఆ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టాడు.అలా బ్రెవిస్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రుతు రీఎంట్రీలో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో బ్రెవిస్ సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలైట్ కాగా.. ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేసిన పోస్టు వైరల్గా మారింది. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సీఎస్కే.. ‘‘ఎందుకిలా చేశావు డీబీ? ఎందుకు?’’ అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.Why, Brevis… why?Ruturaj was settling in so beautifully, playing with such calm and class —and then you flew in the air and snatched that catch out of nowhere.Brevis, you just broke the hearts of countless Rutu fans today. 💔pic.twitter.com/qEfyTuhfHC— Mahi Patel (@Mahi_Patel_07) November 30, 2025 పొడిచేశావు కదా కట్టప్పాతమ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో తమకూ బాధ మిగిల్చాడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ మేరకు చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఇందుకు బదులుగా.. ‘‘పాపం.. రుతును పొడిచేశావు కదా కట్టప్పా’’ అంటూ నెటిజన్లు బాహుబలి స్టైల్ మీమ్స్తో ఇద్దరినీ ట్రోల్ చేస్తున్నారు. కాగా బేబీ ఏబీడీగా పేరొందిన బ్రెవిస్.. ఐపీఎల్లో రుతు కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈసారి 2026 వేలానికి ముందు బ్రెవిస్ను సీఎస్కే అట్టిపెట్టుకుంది కూడా!భారత్ భారీ స్కోరుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60), రవీంద్ర జడేజా (32) రాణించగా.. కోహ్లి (120 బంతుల్లో 135) శతక్కొట్టాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.కష్టాల్లో సౌతాఫ్రికాలక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (7), ర్యాన్ రికెల్టన్ (0), క్వింటన్ డికాక్ (0) దారుణంగా విఫలమయ్యారు. టోనీ డి జోర్జి (39), డెవాల్డ్ బ్రెవిస్ (37) ఓ మోస్తరుగా రాణించారు. ఇలాంటి దశలో నాలుగో నంబర్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అర్ద శతకం పూర్తి చేసుకుని సఫారీల ఆశాకిరణంగా నిలిచాడు.అన్నట్లు హర్షిత్ రాణా బౌలింగ్లో బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ను రుతురాజ్ పట్టడం విశేషం. కాగా భారత పేసర్లు హర్షిత్ రాణా మూడు, అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్ తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో 25 ఓవర్ల ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విజయానికి 188 పరుగుల దూరంలో నిలిచింది. మరోవైపు.. భారత్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి!!చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!Need a breakthrough? Call Harshit Rana! 📞A fine catch by Ruturaj as the dangerman Dewald Brevis departs 👏#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/w4PAuCIgUR— Star Sports (@StarSportsIndia) November 30, 2025 -
ఇచ్చిపడేశారు!.. కోహ్లి సెంచరీ.. రోహిత్ రియాక్షన్ వైరల్!
‘‘వన్డే ప్రపంచకప్-2027 టోర్నమెంట్లో ఆడే విషయంపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి నుంచి మాకు ఎలాంటి హామీ లభించలేదు’’.. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన వేళ టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన మాట ఇది.ఆస్ట్రేలియా పర్యటనకు ముందు శుబ్మన్ గిల్ (Shubman Gill)ను వన్డే జట్టు కొత్త కెప్టెన్గా ప్రకటించిన అగార్కర్.. రో-కోల గురించి ఎదురైన ప్రశ్నకు అగార్కర్ (Ajit Agarkar) పైవిధంగా బదులిచ్చాడు. అయితే, ఆసీస్ టూర్లో ఆరంభంలో కోహ్లి తడబడ్డా.. రోహిత్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్తో అలరించాడు.రో- కో వన్డే భవితవ్యంపై చర్చమూడో వన్డేలో శతక్కొట్టి భారత్ను గెలిపించడంతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. మరోవైపు.. ఆఖరిదైన మూడో మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) సైతం భారీ అర్ద శతకంతో సత్తా చాటాడు. తాజాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్కు ముందు కూడా రో- కో వన్డే భవితవ్యంపై చర్చ జరిగింది.టీమిండియాలో కొనసాగాలంటే దేశీ క్రికెట్ ఆడాలంటూ బోర్డు నుంచి రోహిత్, కోహ్లికి సందేశం వెళ్లిందనే వార్తలు వచ్చాయి. సఫారీ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత వీరిద్దరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ సమావేశం కానున్నారనే సమాచారం వచ్చింది.ఇచ్చిపడేశారు భయ్యా!ఇలాంటి తరుణంలో రాంచిలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57)తో దుమ్ములేపగా.. కోహ్లి శతకం (120 బంతుల్లో 135)తో చెలరేగి తనకు తానే సాటి మరోసారి నిరూపించుకున్నాడు. ఇద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ తమ అనుభవంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.ఈ నేపథ్యంలో రో-కో అభిమానులు గంభీర్, అగార్కర్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దిగ్గజాల కెరీర్ ముగించాలని చూస్తే సహించేది లేదని.. ఒకవేళ మీ పంతం నెగ్గించుకోవాలని చూస్తే టీమిండియా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్అంతేకాదు.. రో- కో భవిష్యత్తుపై కాకుండా గంభీర్- అగార్కర్ భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని.. సౌతాఫ్రికాతో టెస్టుల్లో 2-0తో వైట్వాష్కు బాధ్యతగా ముందుగా వీరిద్దరిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ సెలబ్రేషన్ సమయంలో రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ మరింత హైలైట్ అయింది. వన్డేల్లో రికార్డు స్థాయిలో 52వ సెంచరీ బాదడం ద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83 శతకాలు పూర్తి చేసుకున్నాడు కోహ్లి. దీంతో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకున్నాడు.A leap of joy ❤️💯A thoroughly entertaining innings from Virat Kohli 🍿Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025ముఖం మీద కొట్టినట్లుగా ఇంతలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ.. ‘‘ఇదిరా మన సత్తా’’ అన్నట్లుగా కాస్త అసభ్య పదజాలంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కాగా.. గంభీర్- అగార్కర్లకు రో- కో సరైన సమాధానం ఇచ్చారంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు అంకితభావం లేదన్న వారికి సెంచరీలతో ముఖం మీద కొట్టినట్లుగా కౌంటర్ ఇచ్చారని కామెంట్లు చేస్తున్నారు. కాగా రాంచిలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 349 పరుగులు సాధించింది.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా.. 7000వ సెంచరీRohit Sharma reaction on Virat Kohli century. 😭pic.twitter.com/hmsllR1eYm— Selfless⁴⁵ (@SelflessCricket) November 30, 2025 -
దంచికొట్టిన కోహ్లి, రోహిత్, రాహుల్.. సౌతాఫ్రికాకు భారీ లక్ష్యం
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. రాంచి వేదికగా నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. తద్వారా సౌతాఫ్రికాతో వన్డేల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ నమోదు చేసింది.రోహిత్ మెరుపు అర్ధ శతకంస్వదేశంలో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచి వేదికగా సౌతాఫ్రికాతో తొలి వన్డే (IND vs SA 1st ODI)లో టాస్ ఓడిన టీమిండియా.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. రోహిత్ శర్మ (Rohit Sharma) ధనాధన్ దంచికొట్టాడు. మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) సాధించాడు.మరోవైపు.. రోహిత్తో కలిసి వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హిట్మ్యాన్తో కలిసి రెండో వికెట్కు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి రికార్డు సెంచరీఈ క్రమంలో 102 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. ఆ తర్వాత జోరు పెంచాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగులు జోడించిన కోహ్లి.. నండ్రీ బర్గర్ బౌలింగ్లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఈ మ్యాచ్లో మొత్తంగా 120 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 83వ శతకం, వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేశాడు. 52nd ODI hundred for the King! 🤩👑Most in a single format in international cricket 🙌🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF pic.twitter.com/DPYCzEZ72J— Star Sports (@StarSportsIndia) November 30, 2025రాణించిన జడేజామిగిలిన వారిలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) వేగంగా ఆడగా.. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) విఫలమయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి భారత్ 349 పరుగులు సాధించి.. సౌతాఫ్రికాకు 350 పరుగుల టార్గెట్ విధించింది.సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్, నండ్రీ బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్మన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా వన్డేల్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు (349/8). ఇంతకు ముందు 2010లో గ్వాలియర్ వేదికగా టీమిండియా ప్రొటిస్ జట్టుపై మూడు వికెట్ల నష్టానికి 401 పరుగులు (401/3) చేసింది. ఇదిలా ఉంటే.. శుబ్మన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్కు దూరం కాగా.. కేఎల్ రాహుల్ టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. 7000వ సెంచరీ గురించి తెలుసా? -
ప్రపంచ రికార్డులు సృష్టించిన కోహ్లి.. సచిన్ను దాటేసి తొలి ప్లేయర్గా..
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా సెంచరీతో చెలరేగిన కింగ్... యాభై ఓవర్ల ఫార్మాట్లో పలు ప్రపంచ రికార్డులు సృష్టించాడు.సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలురాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి మ్యాచ్లో కోహ్లి (Virat Kohli) 102 బంతుల్లో శతక మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 52వ సెంచరీ నమోదు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సింగిల్ ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా ఉన్న టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టాడు.ఏకైక బ్యాటర్గాకాగా శతక శతకాల వీరుడు సచిన్ టెస్టుల్లో 51 సెంచరీలు చేయగా.. కోహ్లి వన్డేల్లో 52వసారి వంద పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు.అంతేకాదు వన్డేల్లో భారత్లో ఒకే వేదికపై అతి తక్కువ ఇన్నింగ్స్లోనే మూడు శతకాలు బాదిన బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. కోహ్లి రాంచిలో ఐదు ఇన్నింగ్స్లో మూడు శతకాలు బాదగా.. సచిన్ వడోదరలో ఏడు ఇన్నింగ్స్లో మూడుసార్లు శతక్కొట్టాడు.అదే విధంగా.. సౌతాఫ్రికాతో వన్డేల్లో అత్యధిక సెంచరీ సాధించిన క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ప్రొటిస్ జట్టుపై కోహ్లికి ఇది ఆరో శతకం. అంతకు ముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్, డేవిడ్ వార్నర్ (David Warner) పేరిట ఉండేది. వీరిద్దరు సౌతాఫ్రికాపై చెరో ఐదు శతకాలు బాదారు.అరుదైన నంబర్అంతర్జాతీయ పురుషుల క్రికెట్లో కోహ్లి తాజాగా సాధించిన 83వ సెంచరీ (టెస్టుల్లో 30, వన్డేల్లో 52, టీ20లలో ఒకటి)కి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం దక్కనుంది. కోహ్లి హండ్రెడ్ బాదడంతో మెన్స్ క్రికెట్లో వ్యక్తిగత శతకాల సంఖ్య 7000కు చేరింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఓవరాల్గా 7000వ సెంచరీ కోహ్లి పేరిట లిఖించబడింది. భారత్ స్కోరెంతంటే?కాగా సౌతాఫ్రికాతో తొలి వన్డేలో కోహ్లి మొత్తంగా 120 బంతులు ఎదుర్కొని పదకొండు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో రెండో వికెట్కు 136 పరుగులు జోడించిన కోహ్లి.. కేఎల్ రాహుల్ (60)తో కలిసి ఐదో వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరితో పాటు రవీంద్ర జడేజా (32) కూడా రాణించడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. చదవండి: రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?.. ఫ్యాన్స్ ఫైర్ -
విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ.. వన్డే రారాజుకు తిరుగులేదు
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి శతక్కొట్టాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 83వ సెంచరీని నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కోహ్లికి ఇది 52వ శతకం. ఈ నేపథ్యంలో యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక శతకాల వీరుడిగా తన రికార్డును తానే సవరించాడు కోహ్లి.వింటేజ్ కింగ్ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వన్డేల్లో రీఎంట్రీ ఇచ్చిన కోహ్లి (Virat Kohli).. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, ఆసీస్తో మూడో వన్డేలో మాత్రం ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేశాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక స్వదేశంలో సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ కోహ్లి ఇదే ఫామ్ను కొనసాగించాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ 102 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో 38వ ఓవర్లో ఐదో బంతికి మార్కో యాన్సెన్ బౌలింగ్లో ఫోర్ బాది కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.రోహిత్తో కలిసి ధనాధన్రాంచి వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి కోహ్లి ఇన్నింగ్ నిర్మించాడు.రోహిత్ శర్మ అర్ద శతకం (57)తో సత్తా చాటగా.. అతడితో కోహ్లి రెండో వికెట్కు 109 బంతుల్లో 136 పరుగులు జోడించాడు. రోహిత్ అవుటైన తర్వాత కోహ్లి మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) ఇలా వచ్చి అలా వెళ్లగా.. కేఎల్ రాహుల్ కోహ్లికి తోడుగా నిలిచాడు.ఈ క్రమంలో కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత గేరు మార్చిన కోహ్లి జోరు పెంచాడు. ఫలితంగా 41 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.చదవండి: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్ -
రాక రాక వచ్చిన అవకాశం.. ఇలా చేస్తావా?
సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. చాన్నాళ్ల తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్లో వచ్చిన అవకాశాన్ని ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెరుగ్గానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ నిలకడగా ముందుకు సాగలేకపోయాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్ ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో ఓపెనర్గా పాతుకుపోయిన జైసూకు పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో మాత్రం అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. టీ20లలో శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ, వన్డేల్లో రోహిత్ శర్మ- శుబ్మన్ గిల్ ఓపెనర్లుగా రాణిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరైనా గైర్హాజరైతే మాత్రమే జట్టులో చోటు దక్కుతోంది.తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు కెప్టెన్ గిల్ గాయం కారణంగా దూరం కాగా.. జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. రాంచి వేదికగా ప్రొటిస్ జట్టుతో ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతికే ఫోర్ బాది సత్తా చాటిన జైసూ.. రెండో బంతిని కూడా బౌండరీకి తరలించాడు.ఆ తర్వాత సిక్సర్ బాది దూకుడు ప్రదర్శించిన జైస్వాల్కు ప్రొటిస్ పేసర్ నండ్రీ బర్గర్ చెక్ పెట్టాడు. నాలుగో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బర్గర్... తొలి బంతిని అవుట్ సైడాఫ్ దిశగా సంధించగా.. జైస్వాల్ గాల్లోకి లేపాడు. ఈ క్రమంలో వేగంగా స్పందించిన వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ బంతిని ఒడిసిపట్టగా.. జైసూ పెవిలియన్ చేరాడు. మొత్తంగా 16 బంతులు ఎదుర్కొని.. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో జైస్వాల్పై విమర్శలు వస్తున్నాయి. రీఎంట్రీలో సత్తా చాటుతాడనుకుంటే.. నిరాశపరిచాడంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికాతో టెస్టుల్లోనూ జైసూ విఫలమైన విషయం తెలిసిందే. రెండు టెస్టు మ్యాచ్లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ చేసిన స్కోర్లు వరుసగా.. 12, 0, 58, 13. ప్రొటిస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ జైస్వాల్.. ఒక్క హాఫ్ సెంచరీతో సరిపెట్టాడు. -
రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. ప్రపంచ రికార్డ్ బ్రేక్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు. సౌతాఫ్రికాతో ఆదివారం నాటి తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.మూడు వన్డేల సిరీస్లో భాగంగా సొంతగడ్డపై ప్రొటిస్ జట్టుతో రాంచి వేదికగా తొలి మ్యాచ్లో.. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్కు దిగింది . ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) నిరాశపరచగా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.ఈ క్రమంలో రోహిత్కు తోడైన వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరు అదరగొట్టడంతో పవర్ ప్లేలో (10 ఓవర్లు) భారత్ వికెట్ నష్టానికి 80 పరుగులు సాధించింది. తద్వారా వన్డే వరల్డ్కప్-2023 తర్వాత వన్డేల్లో తొలి పది ఓవర్లలో మొదటిసారి ఈమేర అత్యధిక స్కోరు సాధించింది. ఇక రోహిత్- కోహ్లి స్థాయికి తగ్గట్లు చెలరేగడంతో డ్రింక్స్ విరామ సమయానికి (16 ఓవర్లలో) మరో వికెట్ నష్టపోకుండా 122 పరుగులు సాధించింది.రోహిత్ శర్మ ప్రపంచ రికార్డురోహిత్ శర్మ 36 బంతుల్లో 45, కోహ్లి 44 బంతుల్లో 45 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇక భారత ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ప్రొటిస్ స్పిన్నర్ సుబ్రేయన్ రంగంలోకి దిగగా.. అతడి బౌలింగ్లో తొలి రెండు బంతుల్లో రోహిత్ వరుసగా సిక్సర్లు బాదాడు. Just one Ro-𝗛𝗜𝗧 away from history! 👀🔥@ImRo45 now has the joint-most 6️⃣s in ODIs! He reached his fifty with some classy attacking strokes along the way! 🏏🔥#INDvSA 1st ODI, LIVE NOW 👉 https://t.co/BBkwein9oF#RohitSharma pic.twitter.com/DbJ822jVda— Star Sports (@StarSportsIndia) November 30, 2025 ఈ క్రమంలోనే వన్డేల్లో తన 352వ సిక్సర్ను రోహిత్ నమోదు చేశాడు. తద్వారా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సర్లు) పేరిట ఉన్న వన్డే సిక్సర్ల రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అనంతరం రోహిత్ 57(51 బంతుల్లో) పరుగుల వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుగదిరిగాడు.కోహ్లి అర్ద శతకంమరోవైపు... కోహ్లి అర్ద శతకం పూర్తి చేసుకున్నాడు. కార్బిన్ బాష్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది కెరీర్లో 76వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. ఈ క్రమంలోనే 26 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది. కాగా 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ మార్కో యాన్సెన్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.చదవండి: శతక్కొట్టిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. సరికొత్త చరిత్ర


