భారత కుర్రాళ్ల విజయం  | India U19 beat SA by 25 runs via Duckworth Lewis Stern method | Sakshi
Sakshi News home page

భారత కుర్రాళ్ల విజయం 

Jan 4 2026 5:10 AM | Updated on Jan 4 2026 7:42 AM

India U19 beat SA by 25 runs via Duckworth Lewis Stern method

25 పరుగులతో దక్షిణాఫ్రికా ఓటమి 

అండర్‌–19 వన్డే సిరీస్‌  

బెనోనీ: అండర్‌–19 వరల్డ్‌ కప్‌కు ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో మొదలైన వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో భారత అండర్‌–19 జట్టు  25 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ – లూయీస్‌ ప్రకారం) దక్షిణాఫ్రికా అండర్‌–19పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. హర్‌వంశ్‌ పంగాలియా (95 బంతుల్లో 93; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

ఇతర బ్యాటర్లలో ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ (79 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కని‹Ù్క చౌహాన్‌ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఖిలాన్‌ పటేల్‌ (12 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. సఫారీ బౌలర్లలో జేజే బాసన్‌ 4 వికెట్లతో భారత్‌ను పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరిక్‌ వాన్‌ షావిక్‌ (72 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా, అర్మాన్‌ మనక్‌ (59 బంతుల్లో 46; 4 పోర్లు) రాణించాడు.

 భారత్‌ తరఫున దీపేశ్‌ దేవేంద్రన్‌ 2 వికెట్లు తీయగా, ఖిలాన్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఈ దశలో ముందుగా ఉరుములు, మెరుపుల కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కూడా రావడంతో అంపైర్లు పూర్తిగా మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్‌వర్త్‌ – లూయీస్‌ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. అయితే జట్టు లక్ష్యానికి 26 పరుగులు వెనుకబడి ఉండటంతో ఓటమి ఖాయమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేయగా...రెండో వన్డే ఇదే మైదానంలో సోమవారం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement