టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..? | WTC 2025 Updated Points Table After Team India’s Win Over West Indies | Sakshi
Sakshi News home page

టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?

Oct 14 2025 7:51 PM | Updated on Oct 14 2025 8:06 PM

WTC 2025 Updated Points Table After Team India’s Win Over West Indies

స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ టెస్ట్సిరీస్ను భారత్‌ 2-0 తేడాతో క్లీన్స్వీప్చేసింది. ఇవాళ (అక్టోబర్‌ 15) ముగిసిన రెండో టెస్ట్లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో గెలుపొందింది.

సిరీస్గెలుపుతో టీమిండియా వరల్డ్టెస్ట్చాంపియన్షిప్‌ 2025-27కు (WTC) సంబంధించి పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకుంది. సిరీస్కు ముందు భారత డబ్ల్యూటీసీ పాయింట్ల శాతం 43.56 శాతంగా ఉండింది. సిరీస్గెలుపుతో భారత్ఖాతాలో 18.34 పాయింట్ల శాతం చేరి సంఖ్యను 61.90కి పెంచింది.

విండీస్ను క్లీన్స్వీప్చేసిన తర్వాత భారత్పాయింట్ల శాతాన్ని భారీగా పెంచుకున్నా, పట్టికలో మాత్రం మూడో స్థానంలోనే ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌ 7 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, డ్రాతో 52 పాయింట్లు సాధించింది.

ఆస్ట్రేలియా, శ్రీలంక టాప్‌-2లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల్లో 3 విజయాలతో 100 శాతం పాయింట్లు సాధించగా.. శ్రీలంక 2 మ్యాచ్ల్లో విజయం, డ్రాతో 66.67 పాయింట్ల శాతాన్ని కలిగి ఉంది.

జాబితాలో ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్‌ (43.33), బంగ్లాదేశ్‌ (16.67), వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా ఉన్నాయి.

కాగా, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియా తదుపరి టాస్క్నవంబర్లో ఎదుర్కొంటుంది. నవంబర్‌ 14 నుంచి సౌతాఫ్రికా భారత్లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా తొలుత రెండు మ్యాచ్ టెస్ట్సిరీస్జరుగుతుంది. అనంతరం మూడు వన్డేలు, ఐదు మ్యాచ్ టీ20 సిరీస్జరుగుతుంది.

చదవండి: సిగ్గుచేటు అంటూ గంభీర్‌ ఫైర్‌.. బీసీసీఐ స్పందన ఇదే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement