breaking news
Amaravati
-
అంతుచిక్కని పజిల్... అమరావతి!
అమరావతి... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పజిల్. రాష్ట్రం భవిష్యత్తు మొత్తం దీంతోనే ముడిపడిందని కూటమి పెద్దలు చెబుతున్నా... దాన్నో రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం వల్లనే ప్రస్తుత సంక్షోభం నెలకొందని అందరూ అనుకుంటున్నారు. కేవలం 29 గ్రామాల్లో లక్షల కోట్లు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అక్కడి రైతులు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే.. తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుతో మరణించేంత! దురదృష్టవశాత్తూ ఈ అసంతృప్తులు, మరణాలు కూటమి నేతల మనసుల్లో ఏమాత్రం కదలిక, మార్పు తీసుకు రాలేకపోయాయి. ఉన్న ఇళ్లు కూల్చకుండానే అభివృద్ధి చేస్తామని మన్నటివరకూ ఊదరగొట్టిన చంద్రబాబు, మంత్రి నారాయణల గొంతులిప్పుడు మూగబోయాయి ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని.. ఇప్పుడు వేల కోట్ల అప్పులెందుకు చేస్తున్నారు? ఉన్నది చాలదన్నట్లు మరో 44 వేల ఎకరాల భూమి పూలింగ్ కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు? రాష్ట్ర ప్రజల మనసుల్లోని సమాధానం లేని ప్రశ్నలివి. కొద్ది రోజుల క్రితం మందడం గ్రామసభలో రామారావు అనే రైతు రాజధాని కోసం తానిచ్చిన రెండెకరాల భూమికి బదులుగా వాగులో ఫ్లాట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే గుండెపోటుకు గురై మరణించడం తీవ్ర కలకలం రేపింది. రామారావు బంధువులు, కొందరు స్థానికులు ‘‘మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు’’ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణకుమార్లను ప్రశ్నించిన తీరు రాజధాని ప్రాంతంలో రైతుల ఆగ్రహానికి దర్పణం పడుతుంది. రామారావుది ప్రభుత్వ హత్యే అని సీపీఐ నేత కె.నారాయణ విమర్శించారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణించినా, అమరావతి ఉద్యమంలోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా, వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక రామారావు ఇంటికి వెళ్లలేదు. ఫోన్లో పరామర్శించారని ఎల్లో మీడియా తెలిపింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రామరావుది సహజ మరణంగా చూపించడానికి తాపత్రయపడ్డాయి. రామారావు అంత గట్టిగా మంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూల్గా మాట్లాడి కుప్పకూలారని ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం రామారావు ఒక్కరి సమస్య కాదు. వేలాదిమంది ఇతర రైతుల బాధ. చిన్నకారు, సన్నకారు రైతులకు ఎదురవుతున్న సంక్షోభం. కీలకమైన ప్రదేశాలలో ఉన్న తమ పొలాలను ప్రభుత్వానికి ఇస్తే, తమకు చెరువులలో, వాగులలో ప్లాట్లు ఇస్తున్నారేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే పలుకుబడిని బట్టి తూర్పు ఫేసింగ్ ప్లాట్లు కేటాయిస్తున్నారని మరి కొందరు వాపోతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు చెంత తమకు ఎందుకు ప్లాట్లు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోడ్ల మధ్యలో ప్లాట్ ఎలా కొనుగోలు చేయగలిగారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించడం విశేషం. ఇక ఆయా గ్రామాల వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. భూ సమీకరణ సమయంలో గ్రామాలకు ఎలాంటి హానీ జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం రోడ్ల నిర్మాణంతో గ్రామాలు ఛిద్రమవుతున్నాయని ఒక జర్నలిస్టు తన పరిశీలన వ్యాసంలో తెలిపారు. అబ్బరాజుపాలెం, దొండడపాడు, పిచ్చుకలపాలెం, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు తదితర 11 గ్రామాలలో తక్షణం ప్రభావితం అవుతుండగా, మొత్తం 20 గ్రామాలలో ఇళ్లు, భవనాలు పోతాయని అనధికార సమాచారంగా ఉందని ఆ కథనంలో తెలిపారు. ఒక్క మందడంలోనే 147 ఇళ్లను తొలగించవలసి వస్తోందట. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన తక్షణ అవసరాల కోసం ఏదో ఒక హామీ ఇచ్చేయడం, ఆ తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తారన్న గ్యారంటీ లేదట. బాధితులు కోరిన విధంగా ఖరీదైన ప్రాంతాలలో స్థలాలు ఇవ్వలేమని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారట. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం వాటిని దుబారా చేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. పూలింగ్ లే అవుట్ కింద రాజధాని జోన్ 8లో ఎకరా అభివృద్దికి ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఇంత వ్యయం దేశంలో ఇంకెక్కడైనా జరుగుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన మొత్తం ఖర్చు రూ.7794 కోట్లుగా ఉండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వరద నీటిని ఎత్తిపోయడానికి ఏ రాజధానిలోనూ వరదనీటి ఎత్తిపోతకు ప్రత్యేక లిఫ్ట్లు లేవని ప్రముఖ నిపుణుడు రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వంటి చోట్ల కూడా భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేసినా చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు కాదని, అమరావతిలో మాత్రం రూ.తొమ్మిది, పది వేలు అవడానికి కారణం ఏమిటన్నది మరికొందరి ప్రశ్న. చంద్రబాబు అండ్ కో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నా రియల్ ఎస్టేట్ పెద్దగా లేకపోవడం అక్కడివారిలో నిరాశకు దారి తీస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన వడ్డే శోభనాద్రీశ్వర రావు, పరకాల ప్రభాకర్ వంటి కొందరు ప్రముఖులు రాజధాని స్థల ఎంపికను తప్పుపడుతున్నారు. అంతేకాక, ప్రస్తుతం ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదని, మరో నలభైవేల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. రెండో దశ పూలింగ్కు సహకరించవద్దని వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు కూడా. అయినా ప్రభుత్వం రెండో దశ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. తొలిదశ రైతులకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని, తమకు ఏ గ్యారంటీలు ఇస్తారని రెండో దశ గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు..ఈ పరిణామాలతో ఒకప్పుడు చంద్రబాబుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న రైతులలో సైతం ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలియక ఇదంతా ఒక పజిల్గా మారిందని వాపోతున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
సాక్షి,శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా రాత్రి శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవంగా జరిగింది. ఆలయ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించగా, వేలాది మంది భక్తులు ప్రత్యక్ష సాక్షులయ్యారు.సాయంత్రం బ్రహ్మోత్సవాలలో భాగంగా చెంచు గిరిజనులు మరియు ఐటీడీఏ పీవో శివప్రసాద్ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సంప్రదాయం ఆలయ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తరువాత నందివాహనంపై ఆశీనులైన ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు హర్షధ్వానాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.వాహన పూజల అనంతరం క్షేత్రపురవిధుల్లో గ్రామోత్సవం జరిగింది. స్వామి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి, గ్రామ ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు భజనలు, హారతులు సమర్పించి ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. నాలుగో రోజు ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు, సంక్రాంతి సందర్భంగా శ్రీశైలం ఆలయంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు తమ జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచాయని తెలిపారు. -
రైతు ఇంట కానరాని సంక్రాంతి.. ఊరు.. ఉసూరు
సాక్షి, అమరావతి: పాడి పంటలు.. భోగి మంటలతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు కళ తప్పాయి. పంటలు చేతికందే సమయంలో సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతాల తోరణాలు రైతన్నల ఇంట కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాలు, ఎరువులు, చివరకు గిట్టుబాటు ధరల కోసం గత 19 నెలలుగా పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకానికి తోడు వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బతినగా, చేతికొచ్చిన అరకొర పంటకు మద్దతు ధర కోసం రైతన్నలు రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గద్దెనెక్కగానే ఆర్బీకేల ద్వారా నాన్ సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలలో కూడా అడ్డగోలుగా కోతలు పెట్టి అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు అందించకుండా ముప్పు తిప్పలు పెడుతోంది. మరోవైపు అదునుకు యూరియా అందక రైతులు పడిన ఇక్కట్లు వర్ణనాతీతం. ఎన్నడూ లేనివిధంగా ఒక్క కట్ట యూరియా కోసం పొలం పనులు వదిలేసి కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారుపై రైతన్నలు మండిపడుతున్నారు.మద్దతు ధర దక్కక.. కొనేవారు లేక..చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా కనీసం కొనేవారు లేని దుస్థితి ఏర్పడింది. ధాన్యం, పత్తి, ఉల్లి, టమాటా, మిరప, మామిడి, పొగాకు, అరటి, చీని... ఇలా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత ఖరీఫ్ సీజన్లో ఓవైపు తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు మోంథా, దిత్వా లాంటి తుపాను వైపరీత్యాలు అన్నదాతల కష్టాన్ని మట్టిపాలు చేశాయి. ఒక్క మోంథా తుపాను వల్లే దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమ జిల్లాల్లో మరో మూడు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినా చంద్రబాబు సర్కారు ఏ ఒక్క రైతుకూ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. ఒకపక్క పతనమైన దిగుబడులు.. మరోపక్క కనీస మద్దతు ధరలు కరువై రైతన్నలు రోడ్డెక్కారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో గతేడాది రూ.35 వేల కోట్లకుపైగా దిగుబడి, పంట నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.ఏలూరు జిల్లా కో–ఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు (ఫైల్) సుఖీభవ పేరిట దగా..తాము అధికారంలోకి రాగానే పీఎం కిసాన్తో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో ఒక్కో రైతుకు రూ.40 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.పది వేలు మాత్రమే విదిల్చారు. అన్నదాతా సుఖీభవలో ఒక్కో రైతుకు రెండేళ్లలో రూ.30 వేలు ఎగ్గొట్టారు. ఎన్నికల హామీ మేరకు 53,58,366 మంది రైతులకు పథకాన్ని వర్తింప చేయాల్సి ఉండగా ఏడు లక్షల మందికి సాయం అందించకుండా కోత పెట్టారు. ఈ ఒక్క పథకం కింద రెండేళ్లలో రైతులకు రూ.16,746 కోట్లు ఎగ్గొట్టారు. ఇక ఏ ఒక్క కౌలు రైతుకూ పైసా కూడా పెట్టుబడి సాయం ఇచ్చిన దాఖలాలు లేవు. బీమా పోయింది.. ఇన్పుట్ సబ్సిడీ లేదుచంద్రబాబు సర్కారు రాగానే ఉచిత పంటల బీమాను అటకెక్కించింది. సున్నా వడ్డీ పంట రుణం పథకానికి సున్నా చుట్టేశారు. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు. ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు. ఈ–క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. రైతు సంక్షేమ పథకాలకు మంగళం పాడేశారు. 2024 జూన్లో కట్టాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం సొమ్ములు చెల్లించకపోవడంతో 11 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా చేశారు. 3.91 లక్షల మంది రైతులకు రూ.328 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టారు. దాదాపు 12 లక్షల మందికి రూ.500 కోట్ల సున్నా వడ్డీ రాయితీకి సున్నా చుట్టేశారు. వరుస వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఆరున్నర లక్షల మందికి రూ.వెయ్యి కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించలేదు. ప్రభుత్వ నిర్వాకం వల్ల దాదాపు 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా ఏ ఒక్క కుటుంబానికీ పైసా పరిహారం ఇవ్వలేదు. మరి చేతిలో చిల్లిగవ్వ లేని దుస్థితిలో తాము పండగెలా చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.ఏ పంటకూ మద్దతు లేదు..అన్నదాతా సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఎవరికి పడ్డాయో తెలియడం లేదు. ఎకరాకు రూ.లక్ష చొప్పున అప్పు చేసి టమాటా, పత్తి, కూరగాయలు సాగుచేశా. అధిక వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. కొద్దిగా పత్తి మిగలగా క్వింటాకు రూ.5 వేలు మించి ఇవ్వలేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. చేతిలో పెట్టుబడి డబ్బులు లేక రబీ సాగుకు మా గ్రామంలో చాలా మంది రైతులు దూరమయ్యాం. ఏ ఒక్క పంటకూ మద్దతు ధర దక్కడం లేదు. రైతులందరూ ఆర్థికంగా చితికిపోయారు. పండుగలు చేసుకునే పరిస్థితి లేదు.– కే.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లాఆదుకోవడంలో దారుణ వైఫల్యం..కౌలు రైతులకు పైసా కూడా పెట్టుబడి సాయం అందలేదు. ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారంగా మారింది. లక్షలాది మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. పంట నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ లేదు. ఓవైపు దిగుబడులు తగ్గిపోగా మరోపక్క ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏ ఇంటా సంక్రాంతి సంతోషం లేదు.– వి. కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు90 శాతం కౌలు రైతులే...కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దాదాపు 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిలో 90 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారు. ఏ ఒక్కరికీ పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు.– ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతుల సంఘం -
కొరుకుడు పడని రేటు.. సర్కారు ఖజానాకు వేటు!
సాక్షి, అమరావతి: రాజధానిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా ఒక్కో ఐఏఎస్ అధికారి బంగ్లా నిర్మాణ విలువ రూ.5.97 కోట్లుగా లెక్కగట్టడం ఇంజినీరింగ్ నిపుణులను, కాంట్రాక్టు వర్గాలను విస్మయ పరుస్తోంది. ధరల సర్దుబాటు, అదనపు పనుల పేరుతో నిర్మాణ వ్యయం మరింతగా పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఈ స్థాయిలో నిర్మాణ విలువ ఉండటంపై ఇంజినీర్లు, రియల్టర్లు విస్తుపోతున్నారు. సీఆర్డీఏ పేర్కొన్న ప్రమాణాల మేరకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలతోపాటు విజయవాడలో అత్యంత ప్రధానమైన ప్రాంతంలోనూ భూమితోపాటు ఐఏఎస్ అధికారులకు నిర్మిస్తున్న బంగ్లాల వంటివి ఒక్కోటి రూ.3 కోట్ల నుంచి రూ.3.50 కోట్లకు దొరుకుతాయని రియల్టర్లు, ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన ఈ వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని చెబుతున్నారు. కాంట్రాక్టు సంస్థ ‘కేఎమ్వీ ప్రాజెక్ట్స్’ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడిది కావడంతో ప్రజాధనాన్ని భారీ ఎత్తున దోచి పెడుతున్నారనే చర్చ కాంట్రాక్టు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్తో అంతర్గత, బహిర్గత విద్యుదీకరణ, ఐటీ పనులు.. అంతర్గత, బహిర్గత ప్రాంతాల్లో ప్లంబింగ్ చేసి 5,28,125 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో 115 బంగ్లాల నిర్మాణ పనులకు రూ.237.02 కోట్ల వ్యయంతో 2018 ఫిబ్రవరి 19న సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. వాటిని కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.9.88 కోట్లకు.. అంటే రూ.246.09 కోట్లకు కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు అప్పగించింది. 2019 నాటికే 28.5 శాతం పనులు అంటే రూ.61.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని.. రూ.41.80 కోట్ల బిల్లులు చెల్లించారని సీఎం చంద్రబాబు 2024లో విడుదల చేసిన శ్వేత పత్రంలో ప్రకటించారు. దీన్ని బట్టి.. ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల్లో రూ.184.69 కోట్ల విలువైన పనులు మిగిలాయి. వాటిని 2024లో చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. అంచనా వ్యయం ఏకంగా రూ.244.54 కోట్లు పెంపు రద్దు చేసిన ఐఏఎస్ బంగ్లాల నిర్మాణ పనులకు 2018 ఫిబ్రవరి 19న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న వాటికి అదనంగా హోమ్ ఆటోమేషన్ను చేర్చి పనుల కాంట్రాక్టు విలువను రూ.184.69 కోట్ల నుంచి రూ.411.37 కోట్లకు పెంచేసింది. ఈ మేరకు 2025 ఫిబ్రవరి 17న సీఆర్డీఏ మళ్లీ టెండర్లు పిలిచింది. 2018–19తో పోల్చితే 2024–25లో సిమెంటు, స్టీలు, బంగ్లాల నిర్మాణంలో వినియోగించే సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని అదనంగా రూ.226.68 కోట్లు పెంచేశారు. అంటే.. మిగిలిన పనుల విలువ కంటే అదనంగా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇక ఆ పనులను కాంట్రాక్టు విలువ కంటే అదనంగా రూ.17.86 కోట్లకు కోట్ చేసిన అంటే రూ.429.23 కోట్లకు అదే కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు పనులు అప్పగించారు. అంటే.. నాడూ నేడు ఒకే కాంట్రాక్టు సంస్థే. కానీ, అప్పట్లో మిగిలిన పనుల విలువ రూ.184.69 కోట్లు కాగా, ఇప్పుడు వాటిని రూ.429.23 కోట్లకు అప్పగించారు. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.244.54 కోట్లు ఎక్కువ ధరకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఆ మేరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లడంతోపాటు కాంట్రాక్టర్కు ప్రయోజనం చేకూరుతుంది. పైగా సీనరేజీ, జీఎస్టీ, వంటి పన్నుల రూపంలో రూ.86.79 కోట్లు కాంట్రాక్టర్కు రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. తద్వారా అంచనా వ్యయం రూ.577.42 కోట్లకు చేరుకుంది.అదనంగా రూ.109.52 కోట్ల పనులు ఐఏఎస్ అధికారుల బంగ్లాలకు మరిన్ని హంగులు చేకూర్చే పనులు చేపట్టడానికి రూ.109.52 కోట్లతో సోమవారం ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హోమ్ ఆటోమేషన్, అదనపు వార్డ్ రోబ్స్, అదనపు స్టోర్ రూమ్, జ్యూస్ సెంటర్, స్పైరల్ స్టెయిర్ కేస్, క్యానోపి బాల్కానీ, కార్ పార్కింగ్ షెడ్, గ్లేజ్డ్ రెయిలింగ్, టెన్సిల్ రూఫింగ్, హీట్ పంప్స్, అదనపు హెచ్వీఏసీ, ట్రాన్స్ఫార్మర్, బయట విద్యుదీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులకు టెండర్లు పిలవాలని సీఆర్డీఏ కమిషనర్ను నిర్దేశించింది. నిజానికి ఈ పనులకు 2025 ఫిబ్రవరి 17న సీఆర్డీఏ పిలిచిన టెండర్లలోనూ హోమ్ ఆటోమేషన్, బయట విద్యుదీకరణ, ట్రాన్స్ఫార్మర్ వంటి పనులు ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు అదనంగా ఆ పనుల పేరుతో రూ.109.52 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించడం గమనార్హం. ఈ పనులు కూడా కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకే కట్టబెట్టడం తథ్యమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ రూ.109.52 కోట్లను కూడా కలుపుకుంటే.. 5,28,125 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో 115 ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ వ్యయం రూ.686.94 కోట్లకు చేరుతుంది. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.13,007.15. ఒక్కో బంగ్లా కాంట్రాక్టు విలువ రూ.5.97 కోట్లు. -
మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు!
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయలేక చేతులెత్తేశారు. ఓవైపు ఎడాపెడా అప్పులు చేస్తూ... మరోవైపు ప్రజలపై పన్నుల మీద పన్నులు బాదుతూ వారి నడ్డి విరుస్తున్నారు. చేస్తానన్న మేలును విస్మరించి... అడ్డగోలుగా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఒకదాని వెంట ఒకటి భారం వేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాది తిరగకుండానే రిజిస్ట్రేషన్ల చార్జీలను రెండోసారి సవరించేందుకు సబ్ రిజిస్ట్రార్లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు సర్కారు గత ఏడాది ఫిబ్రవరిలోనే స్థిరాస్తుల మార్కెట్ విలువలను పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం, పట్టణాల్లో 50–60 శాతం మేర సవరించింది. ఇంత భారీగా చార్జీల పెంపుతో ఆస్తుల క్రయవిక్రయాల సమయంలో ప్రజలు లబోదిబో అంటున్నారు. కానీ, అడ్డగోలుగా ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్న చంద్రబాబు సర్కారుకు ఇదేమీ పట్టడం లేదు. చార్జీలను ఇంకా పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెల మొదటి వారం నుంచే దీనిని అమలు చేసేందుకు సన్నాహాలు సాగిస్తోంది.సర్వే నంబర్ల వారీగా విలువల సవరణచార్జీల పెంపు ఉద్దేశంలో భాగంగా ఇటీవల అన్ని జాయింట్ సబ్ రిజిస్ట్రార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అంతర్గతంగా పలు సూచనలు జారీ చేశారు. వారి పరిధిలోని స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణకు అవసరమైన పూర్తి డేటా సేకరించాలని పేర్కొన్నారు. అందులో ప్రధానంగా నాలా మార్పిడి చేసిన సర్వే నంబర్లు, జాతీయ రహదారి, రాష్ట్ర రహదారులు, జెడ్పీ, మండల పరిషత్ రోడ్లకు ఆనుకుని ఉన్న భూముల సర్వే నంబర్లను రెవెన్యూ అధికారుల నుంచి వెంటనే తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల నుంచి కొత్తగా చేర్చిన వాణిజ్య డోర్ నంబర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (సీఆర్డీఏ, తుడా, ఉడా తదితర) లేదా స్థానిక సంస్థల ద్వారా ఏర్పడిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ల సర్వే నంబర్ల వివరాలను కూడా సేకరించాలని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఇదంతా పూర్తిచేసి ఆ సర్వే నంబర్లలో మార్కెట్ విలువల పెంపునకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఇందుకోసం నాలుగు రకాల ఫార్మాట్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం సబ్ రిజిస్ట్రార్లకు పంపింది. వాటి ప్రకారం సర్వే నంబర్ల వారీగా ఏ ప్రాంతాల్లో ఎంతమేర పెంచాలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. ఈ ప్రతిపాదనలను నాలుగు రోజుల్లోపు జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని రివిజన్ కమిటీల ముందుంచి ఆమోదం తీసుకోవాలని, అనంతరం అన్ని జిల్లాల డీఐజీ కార్యాలయాలకు సమర్పించాలని పేర్కొన్నారు.భూముల క్లాసిఫికేషన్ల మార్పు...భూముల క్లాసిఫికేషన్ను మార్చేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేకంగా మరో అంతర్గత ఆదేశం ఇచ్చారు. క్లాసిఫికేషన్ మార్పు అంటే... ఒకే ప్రాంతంలో ఒక రేటు కాకుండా సర్వే నంబర్లవారీగా భూముల క్లాసిఫికేషన్ చేయాలని చెబుతున్నారు. దీంతో మార్కెట్ విలువలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ సవరణ ప్రక్రియను అత్యంత అత్యవసర, ప్రాధాన్య కార్యక్రమంగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. అది పూర్తయ్యేదాక సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేశారు.మందగించిన అభివృద్ధి.. పడిపోయిన ఆదాయంఫిబ్రవరి తొలి రోజుల్లోనే స్థిరాస్తుల మార్కెట్ విలువలు పెంచేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. తక్కువలో తక్కువ రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా సవరణ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో అభివృద్ధి మందగించింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పడిపోయి రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చార్జీల పెంపు ద్వారా ప్రజల ముక్కుపిండి వసూలు చేసి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు సిద్ధమైంది.వైఎస్ జగన్ పాలనలో ఏటా రూ.10 వేల కోట్ల రాబడిగత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఏడాదికి రూ.10 వేల కోట్లు ఉన్న రిజిస్ట్రేషన్ల ఆదాయం చంద్రబాబు సర్కారు వచ్చాక రూ.8 వేల కోట్లకు పడిపోయింది. అదికూడా గత ఏడాది రిజిస్ట్రేషన్ల చార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచడంతో ఆ మాత్రం ఆదాయమైనా వచ్చింది. లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మళ్లీ మార్కెట్ విలువలను సవరించి... ఆదాయం పెరిగినట్లు చూపించేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు.వచ్చే నెల నుంచి పెంచేందుకు సన్నాహాలుఅధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు... ఇప్పటికే పలు విధాలుగా ప్రజలపై రూ.20,135 కోట్ల భారం మోపారు. వాహన కొనుగోళ్లపై జీఎస్టీ శ్లాబ్ను కేంద్ర ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా... రాష్ట్ర ప్రజలకు ఆ ఉపశమనం లేకుండా ఏకంగా పది శాతం రోడ్ సెస్ విధించారు. తద్వారా ప్రతి సంవత్సరం రూ.1,500 కోట్లను దండుకునేందుకు సిద్ధమయ్యారు. పండుగ పూట మందుబాబులకు ఝలక్ ఇస్తూ ప్రతి బాటిల్పై రూ.10 చొప్పున పెంచేశారు. ఇప్పుడు మరో బాదుడుకు తయారవుతున్నారు. ఏడాదిలోపే రెండోసారి రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచేందుకు వేగంగా కసరత్తులు సాగిస్తున్నారు. -
బడి.. అలజడి!
ఓ కుక్కను కొట్టాలంటే పిచ్చిదని దానికి ముద్ర వేయాలి. అప్పుడు ఎవరూ ఏమీ అనరన్నది ఓ నానుడి. రాష్ట్రంలో సర్కారు బడుల విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఆ సూత్రాన్నే వర్తింప చేస్తోంది. విద్యా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న గత ప్రభుత్వ సంస్కరణలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. నిర్వీర్యం చేస్తూ.. ప్రభుత్వ స్కూళ్లంటే అయిష్టం ఏర్పడేలా చేస్తోంది. ఫలితంగా గత రెండేళ్లలోనే 17.99 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. విద్య, వైద్యం ప్రైవేట్ చేతుల్లో ఉండాలన్నదే తమ లక్ష్యం అంటూ ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు తీరుపై విద్యా రంగ నిపుణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి దిగజారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో అడ్మిషన్లు తగ్గిపోవడంతో పాటు, బడి బయటి పిల్లలను సైతం పట్టించుకోక పోవడంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగాయి. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో అడ్మిషన్లు పెరగడం గమనార్హం. యూడైస్ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) లెక్కల ప్రకారం గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 69,42,009కి పడిపోయింది. ఈ లెక్కన ఏకంగా 17,99,876 మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలను (ఎయిడెడ్ సహా) తీసుకుంటే జగన్ ప్రభుత్వంలో 41,75,608 విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 33,79,835కు పడిపోయింది. తద్వారా ఏకంగా 7,95,765 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. మరోవైపు డ్రాప్ అవుట్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. 2024 వరకు ప్రైవేటు స్కూళ్లల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధికంగా విద్యార్థులుండగా, ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు.. వాటిని కల్పించే పరిస్థితి లేదు.. డబ్బున్న వారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బహిరంగంగా చెప్పిన మాటలను ఇప్పుడు అదే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. 2024 జూన్లో రాష్ట్రంలో అధికారం చేపట్టిన ప్రభుత్వం పేద పిల్లలకు చదువులను దూరం చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ.. ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోయేలా చేసింది. సర్కారు బడుల్లో తగ్గిపోయిన విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోయేలా ప్రస్తుత ప్రభుత్వం విధానాలను అనుసరించింది. అందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన విద్యా సంస్కరణలను అధికారంలోకి వచ్చిన 2024 జూన్ నుంచి ఒక్కొక్కటిగా రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో 1,000 సీబీఎస్ఈ స్కూళ్లను రద్దు చేశారు. పేద పిల్లలను ఇంగ్లిష్ భాషలో ప్రవీణులుగా తిర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన టోఫెల్ను రద్దు చేశారు. ఐబీ సిలబస్ను ఆరంభంలోనే నిలిపివేశారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడాన్ని ఆపేశారు. మనబడి నాడు–నేడు పనులను ఒక్క అడుగు కూడా ముందుకు పడనీయలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామన్న హామీని సైతం అధికారం చేపట్టిన తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకొరగా ఇస్తూ.. ఇవ్వాల్సిన సొమ్ములో కోత పెట్టారు. దీంతో ప్రభుత్వ బడులపై నమ్మకం పోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో 42 లక్షల మంది విద్యార్థులుండగా, 2024–25లో ఆ సంఖ్య 36 లక్షలకు తగ్గిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2025–26)లో ఈ సంఖ్య మరింత దిగజారి 33 లక్షలకు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేటు స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య 35.62 లక్షలకు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వ స్కూళ్లల్లో కంటే ప్రైవేటులో దాదాపు 2.62 లక్షల మంది విద్యార్థులు అధికంగా చేరారు.పెరిగిన డ్రాపౌట్లు.. పడిపోయిన జీఈఆర్యూడైస్ ప్లస్ నివేదికలను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వ విద్య ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో డ్రాప్ అవుట్లు పెరిగాయి. బడి బయట పిల్లలు ఎంత మంది ఉన్నారో గమనించి.. వారిని బడుల్లో చేర్చాలన్న లక్ష్యం పూర్తిగా నీరుగారింది. గత ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లతో కలిసి బడి బయటి పిల్లలను గుర్తించి, తప్పనిసరిగా స్థానిక పాఠశాలల్లో చేరి్పంచే ప్రక్రియ కొనసాగేది. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం, సచివాలయాల సిబ్బందిని విధులకు దూరం చేయడంతో పిల్లల చేరికల బాధ్యతను పూర్తిగా ఉపాధ్యాయులకు అప్పగించారు. రెండు విద్యా సంవత్సరాల్లో ఈ విధులు ప్రభుత్వ ఉపాధ్యాయులే చేయాలని ఆదేశించారు. దీంతో ఉదయం పూట బడుల్లో బోధించిన టీచర్లు.. మధ్యాహ్నం బడి బయటి పిల్లల సర్వేకు వెళ్లడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో డ్రాప్ అవుట్లు భారీగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో డ్రాప్ అవుట్లు 15.50 శాతం, యూపీ స్కూళ్లల్లో 3.70 శాతం, ప్రాథమిక పాఠశాలల్లో 1.4 శాతం పెరిగింది. ఇదే క్రమంలో జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) నమోదు కూడా దిగజారినట్టు యూడైస్ ప్లస్ నివేదికలే చెబుతున్నాయి. విద్యా రంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఈ పరిస్థితి మరింత దిగజారుతోందని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బాబు ‘సంక్రాంతి’ బాదుడు!
సాక్షి, అమరావతి: పండగ పూట కూడా ప్రజలపై పన్నుల బాదుడే..! అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది. వాహనాల కొనుగోలుపై రహదారి భద్రత పేరుతో రోడ్ సెస్ బాదుడుతో వాహనదారులపై ఏటా రూ.1,500 కోట్ల భారీ ఆరి్థక భారాన్ని మోపింది. మరోచేత్తో పండుగ వేళ టీడీపీ సిండికేట్కు అడ్డగోలుగా లాభాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. ఏటా రూ.350 కోట్లు సిండికేట్కు దోచిపెట్టేందుకు పచ్చ జెండా ఊపింది. అందుకోసం హడావుడిగా మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసిది. చంద్రబాబు సర్కారు సంక్రాంతి బాదుడు ఇలా ఉంది..! కేంద్రం కరుణించినా... బాబు పన్నుల కొరడా కేంద్ర ప్రభుత్వం కరుణించినా చంద్రబాబు మాత్రం ససేమిరా అంటూ రాష్ట్ర ప్రజలపై పన్నుల కొరడా ఝళిపించారు. జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించడంతో కాస్త ఊరట లభించిందనుకునేలోపే.. చంద్రబాబు ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకుని పన్నుల భారం ప్రజలపైనే వేశారు. కేంద్ర ప్రభుత్వం 2017 నుంచి వాహన కొనుగోళ్లపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ వచ్చింది. ఇటీవలే జీఎస్టీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై జీఎస్టీ రేటును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దాంతో 10 శాతం జీఎస్టీ భారం తగ్గిందని ప్రజలు కాస్త ఊరట చెందారు.కానీ దీన్ని చంద్రబాబు సహించలేకపోయారు. రాష్ట్ర ప్రజలకు ఆ మాత్రం కూడా జీఎస్టీ పన్నుల తగ్గింపు ఊరట మిగల్చకూడదని భావించి రోడ్ సెస్ పేరుతో కొత్త పన్ను రూపొందించారు. ఏపీలో వాహనాల కొనుగోళ్లపై 10 శాతం రోడ్ సెస్ విధించాలని ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఆమేరకు ప్రజలు కొనుగోలు చేసే వాహనాలపై 10 శాతం రోడ్ సెస్ విధించేందుకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించింది. సద్వినియోగంపై సందేహాలు.. ప్రజలపై పన్నుల భారానికి చంద్రబాబు ప్రభుత్వం రహదారి భద్రత సెస్సు అనే ముసుగు వేసింది. ఆ సెస్సు ద్వారా వసూలు చేసే నిధులు ఎలా వెచి్చస్తామన్నది వెల్లడించలేదు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు కూడా అందుకోసం వెచ్చించడం లేదనే విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. హోం, వైద్య–ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా ఆ నిధులను వెచి్చంచాలి. కానీ ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెస్సు పేరిట ఏటా వసూలు చేసే రూ.1,500 కోట్లను సద్వినియోగం చేస్తారనే నమ్మకం ఏమాత్రం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్లపై 15 శాతం ఏఆర్ఈటీ రద్దు వాహన కొనుగోలుదారులపై పన్నుల బాదుడు బాదిన చంద్రబాబు ప్రభుత్వం... టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మాత్రం తలుపులు బార్లా తెరచింది. రాష్ట్రంలో బార్లపై విధిస్తున్న 15 శాతం ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ)ని రద్దు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఖజానాకు ఏటా రూ.350 కోట్ల మేర గండి పడనుంది. 2014–15లో కూడా ఇదే రీతిలో టీడీపీ సిండికేట్ బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజును ఏకపక్షంగా రద్దు చేసింది. తద్వారా ఖజానాకు రూ.5,400 కోట్ల మేర గండి కొట్టింది. చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. చంద్రబాబుతోపాటు అప్పటి మంత్రులు కొల్లు రవీంద్ర తదితరులను నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఆ కేసును చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల మూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బార్లపై ఏఆర్ఈటీ రద్దు చేస్తూ మరో దందాకు తెర తీసింది. మద్యం బాటిల్పై రూ.10 బాదుడు.. ఇక మద్యం ప్రియులపై కూడా చంద్రబాబు ప్రభుత్వం పన్నుల మోత మోగించింది. ప్రతి మద్యం బాటిల్పై రూ.10 చొప్పున ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 20,135 కోట్ల మేర కరెంట్ చార్జీల బాదుడు కాగా, అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు.. ఏకంగా రూ. 20,135 కోట్ల మేరకు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరిచారు. ఏటా పన్నుల భారం రూ.270 కోట్లు కాదు... రూ.1,500 కోట్ల బాదుడేరోడ్ సెస్ పన్నుల భారంపై చంద్రబాబు సర్కారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారని... ఆ ప్రకారం కొత్తగా విధించిన 10 శాతం రోడ్ సెస్తో వాహనాల కొనుగోలుదారులపై నెలకు రూ.22.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.270 కోట్ల భారం పడుతుందని మంత్రులు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రజలపై పడే పన్నుల భారాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించేందుకు యతి్నంచారు. వాస్తవానికి అందుకు ఏడెనిమిది రెట్లు అధిక భారం పడుతుందని కేంద్ర జీఎస్టీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.కేంద్ర జీఎస్టీ విభాగం అధికారిక గణాంకాల ప్రకారం వాహనాలపై 28 శాతం జీఎస్టీ పూర్తిగా అమలులో ఉన్న 2024–25లో రాష్ట్రంలో వాహనాల విక్రయాల ద్వారా రూ.4,200 కోట్ల జీఎస్టీ పన్ను ఆదాయం వచ్చింది. అంటే.. 28 శాతం జీఎస్టీ రేటుతో రూ.4,200 కోట్లు వచ్చాయి. జీఎస్టీ రేటును కేంద్రం ఇటీవల 18 శాతానికి తగ్గించింది. దాంతో జీఎస్టీ రేటు 10 శాతం తగ్గడంతో ఏడాదికి రూ.1,500 కోట్లు పన్ను ఆదాయం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. అంటే రాష్ట్ర ప్రజలకు ఏటా రూ.1,500 కోట్ల మేర ఊరట కలుగుతుందని పేర్కొంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ 10 శాతం పన్ను ఉపశమనం లేకుండా చేసింది. వాహనాలపై 10 శాతం రోడ్సెస్ విధించింది. అంటే రాష్ట్రంలో వాహనాల కొనుగోలుదారులపై ఏటా రూ.1,500 కోట్ల ఆర్థిక భారం పడనుందన్నది స్పష్టమవుతోంది. -
చంద్రబాబు రాయలసీమ వ్యతిరేకి
కడప సెవెన్రోడ్స్: సీఎం చంద్రబాబు తొలి నుంచీ రాయలసీమ వ్యతిరేకి అని పలువురు నేతలు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంగళవారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కడపలో అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు చేపట్టిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. రాయలసీమ నీటి అవసరాల దృష్ట్యా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచినపుడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు తన పార్టీ నాయకులు దేవినేని ఉమ తదితరులతో ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాలు చేయించారని గుర్తుచేశారు.వర్షాభావ పరిస్థితుల్లో ఇక్కడి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు వీలుగా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టగా చంద్రబాబు తెలంగాణలోని తమ పార్టీ నాయకులతో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని చెప్పారు. సీమపై బాబుకు ఉన్న వ్యతిరేకతకు ఇవే నిదర్శనమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలం కలిగిస్తున్నాయన్నారు. ముచ్చుమర్రి వద్దే అదనపు లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని, సీమ ఎత్తిపోతల పథకం అనవసరమని మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడటం అర్థరహితమని విమర్శించారు. ముచ్చుమర్రి నుంచి నెలరోజులు ఎత్తిపోస్తే ఒక్క టీఎంసీ నీళ్లు మాత్రమే వస్తాయని చెప్పారు. వైఎస్ జగన్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. సీమ ఎత్తిపోతల పథకం పనుల్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ త్వరలో ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.కృష్ణాలో వరదరోజులు 30కి పడిపోయాయిఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కృష్ణానదిలో వరదరోజులు 30కి పడిపోయాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దిండి, పాలమూరు–రంగారెడ్డి వంటి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగిస్తోందన్నారు. శ్రీశైలంలో నీరు 854 అడుగుల కంటే తగ్గినపుడు తెలంగాణ విద్యుత్ ఉత్పాదన చేయకూడదన్నారు. ఈ అంశంపై పోరాటాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్సెల్ నాయకుడు ఇల్లూరు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎరువుల ధరలు తగ్గించి అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. -
ఉద్యోగులకు పండుగ ఏది?
కానుకలు కాదు మాయ‘‘వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే... హామీ ప్రకారం పది రోజుల్లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. గెలిచాక వాటిని పట్టించుకోవడం లేదు. ఉద్యోగుల ఆందోళన పెరిగిపోతుండడంతో ఏదో ఒక మాయ చేస్తున్నారు. దీపావళి కానుక, సంక్రాంతికి తీపి కబురు అంటూ కాలక్షేపం కబుర్లు చెబుతున్నారు తప్ప, మా ఖాతాల్లో మాత్రం డబ్బులు పడడం లేదు’’ - ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదనసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ ఝలక్ ఇచ్చారు. పండుగ కానుకగా ఒక డీఏ, పోలీసులకు బకాయి ఉన్న ఒక సరెండర్ లీవు సొమ్మును విడుదల చేసినట్లు సోమవారం రాత్రి ప్రకటించినా... మంగళవారం సాయంత్రం వరకు ఏ ఒక్క ఉద్యోగికి ఆ మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో జమకాలేదు. దీంతో అసలు జమ అవుతాయో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బకాయిల విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు సంక్రాంతి కానుక గత ఏడాది ఇచ్చిన దీపావళి ఉత్తుత్తి కానుక వంటిదేనని ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఇచ్చామని చెబుతున్న మొత్తం గత ఏడాది దీపావళి కానుకగా ఇవ్వాల్సి ఉంది. దీనిపై అప్పట్లో... చంద్రబాబు ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశమై నానా హంగామా చేశారు. బకాయి ఉన్న నాలుగు డీఏల్లో ఒకటి, పోలీసులకు పెండింగ్లో ఉన్న రెండు సరెండర్ లీవ్లను రెండు విడతలుగా ఇస్తామని ప్రకటించారు. అయితే, అందుకు విరుద్ధంగా... వెంటనే ఇస్తామన్న డీఏను రిటైర్మెంట్ తర్వాత వచ్చే ప్రయోజనాలతో కలిపి ఇస్తామని జీవోలు జారీ చేశారు. పెన్షనర్లకు మూడు విడతలుగా ఇస్తామని మరో జీవో ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, పెన్షనర్లు భగ్గుమనడంతో తనకు తెలియకుండా జరిగిందంటూ చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. డీఏను 2026, 2027 సంవత్సరాల్లో నాలుగు విడతలుగా ఇస్తామని జీవోను సవరించారు. దీపావళి కానుకే సంక్రాంతి తీపి కబురునాలుగు విడతల్లో ఇస్తామన్నదాంట్లో... ఒక విడత మొత్తాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ప్రస్తుతం ప్రకటించినట్లు తెలుస్తోంది. కానీ, అది కూడా తమకు రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో సంక్రాంతి కానుక మళ్లీ వచ్చే ఏ పండుగకో అని వెటకారంగా చర్చించుకుంటున్నారు. ⇒ పోలీసుల సరెండర్ లీవుల్లో రెండింటిని గత డిసెంబర్లోపు రెండు విడతలుగా ఇవ్వాల్సి ఉంది. అందులో ఒకటి ఈ పండుగ కానుకగా ఇస్తున్నట్లు చెప్పారేమోనని భావించినా అదీ పడలేదు.⇒ చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలని్నంటినీ గాలికొదిలేశారని, బకాయిలను దీపావళి కానుక అని చెప్పి అప్పుడు ఇవ్వనేలేదని అంటున్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుక అని మభ్యపెడుతుండడంపై ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. నాలుగు డీఏల్లో ఒక్కటి ఇవ్వడానికి ఏడాదిన్నర తర్వాత ఒప్పుకొని దాన్నీ ఇవ్వకుండా నయవంచన చేస్తున్నారని మండిపడుతున్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలు ఇవ్వకుండా కానుకలంటూ వాయిదాలు వేయడం ఏమిటని నిలదీస్తున్నారు.ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన వైఎస్ జగన్.. 2014–19 మధ్య బాబు పాలనలో 7 డీఏలేచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడక తప్పడం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడు కూడా ఒక్క డీఏ ఇవ్వడానికి గిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడుతున్నారు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 కాలంలో ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఐఆర్ ఇస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా గెలిచాక పట్టించుకోలేదు.ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధం అవుతుండడంతో 14 నెలల తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. అందులో చెప్పిన మాటలు కూడా అమలు చేయకుండా కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇప్పుడు దానిగురించి కనీసం మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. పీఆర్సీ ఇచ్చే ఆలోచన కూడా లేనట్లుంది. అందుకే... కమిషనర్ రాజీనామా చేసినా ఏడాదిన్నరగా మరొకరిని నియమించలేదు. 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. కమిషన్ నియమించడానికే చంద్రబాబు సిద్ధంగా లేనందున.... పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లుఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.35 వేల కోట్లు ఉన్నా ఇప్పటివరకు ఎంత విడుదల చేశారో చంద్రబాబు చెప్పడం లేదు. వీటిలో ఎప్పుడు ఎంత ఇస్తారో చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఈ విషయంలోనూ మోసపోయినట్లుగా భావిస్తున్నారు.⇒ పోలీసుల రెండు సరెండర్ లీవుల్లో ఒకటి రూ.110 కోట్లు ఇప్పుడు ఇచ్చినట్లు చెబుతున్నా ఎవరికీ జమకాలేదు. ఒక డీఏ బకాయిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చామంటున్నా ఖాతాల్లో పడలేదు. ఈ రెండు మినహాయించినా ఇంకా రూ.33,780 కోట్లు ఎప్పటికి వస్తాయోనని ఉద్యోగులు వాపోతున్నారు. టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్య విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ, ఇంకా ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు కూడా అందులో ఉన్న చిన్న మెలికను సాకుగా చూపుతూ మొత్తం వ్యవహారాన్నే పక్కన పెట్టేశారు.⇒ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. ఒక్క ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించలేదు. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై పాత విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్ను ఎత్తివేయడానికి సిద్ధం అవుతుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను దారుణంగా వేధిస్తున్నారు. వారికి పండుగ నాడు తీపి కబురు అని చెబుతున్న మాటలు ప్రచారమేనని స్పష్టమవుతోంది. -
‘పల్లె’ మళ్లీ మొదటికొచ్చింది
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ కళ తప్పింది.. ప్రజల చేతిలో డబ్బులు లేక మునుపటి సందడి కానరావడం లేదు.. ప్రకృతి వైపరీత్యాలు, వరుస తుపానులతో పంటలు దెబ్బతిన్నా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు.. అరకొరగా చేతికందిన పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఏ పంట అయినా సరే ‘కొందామంటే కొరివి.. అమ్ముదామంటే అడవి’ అన్నట్లు పరిస్థితి తయారైంది.టమాటా, ఉల్లి, ధాన్యం, మిర్చి, అరటి.. ఇలా పంటలన్నీ మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.. ఎరువుల ధరలు చూస్తుంటే ఆకాశాన్ని అంటుతున్నాయి.. యూరియా సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు.. వీటన్నింటికీ తోడు గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా రద్దు చేసింది.. మరోవైపు గత ఎన్నికల్లో ఇదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచింది.. ఫలితంగా వ్యాపారాలూ మందగించాయి.. నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారు.. అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులాడట్లేదు.. పంట చేతికొచ్చి లాభాలార్జించి.. కొనుగోళ్లు, అమ్మకాలు బాగా జరిగితే ఇటు రైతాంగం, అటు వ్యాపార వర్గాల్లో సంతోషం వెల్లివిరిసేది.. తద్వారా ఇతర వృత్తుల వారికీ మెరుగైన ఉపాధి లభించేది.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండటంతో పల్లెల్లో సంక్రాంతి మొక్కుబడిగా మారింది.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు సాగుతున్న తీరుపై ‘సాక్షి’ బృందాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు ఈ విషయాలు కళ్లకు కట్టాయి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారు పండుగ కోసం సొంతూళ్లకు వచ్చినా, రెండేళ్ల క్రితం ఊళ్లలో న్న పరిస్థితికి ృ ప్రస్తుతానికి మధ్య వచ్చిన మార్పును గమనించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘విప్లవాత్మక నిర్ణయాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఊళ్ల రూపురేఖలు సమూలంగా మార్చి వేసింది.. రెండేళ్ల క్రితం వరకు ఊళ్లలో అందమైన పాఠశాల, ఆర్బీకే, పీహెచ్సీ, గ్రామ సచివాలయం, ఇతరత్రా పలు ప్రభుత్వ బిల్డింగ్లన్నీ కళకళలాడుతూ కనిపించాయి.. ఇప్పుడవన్నీ వెలవెలబోతూ కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం ఏమిటి? రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయడం ఏమిటి? అన్నీ బేరీజు వేసుకుంటే మునుపటి ప్రభుత్వ పాలనే నయం. గ్రామాలన్నింటిలో అభివృద్ధి వెనక్కు వెళ్లిపోయింది’ అని ఊరూరా జనం చర్చించుకోవడం కనిపించింది. కళకళలాడిన భవనాలన్నీ వెలవెలఊరు: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం వెల్లటూరు శివారు గ్రామమైన భీమవరప్పాడుతో కలిపి 1,438 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. జనాభా 5,509. వీరిలో బయట ప్రాంతాలలో ఉద్యోగాలు చేసే వారు 1,200 మందికిపైనే. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు 2, వెల్నెస్ సెంటర్లు 2, రైతు భరోసా కేంద్రాలు 2, ఆయుర్వేద ఆస్పత్రి 1, పాఠశాలలు 3, అంగన్వాడీ కేంద్రాలు 5 ఏర్పాటయ్యాయి. 27 మంది గ్రామ వలంటీర్లు, 14 మంది సచివాలయ ఉద్యోగులు సేవలందించే వారు. గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం భవనం, గోడౌను, కేడీసీసీ బ్రాంచి భవనం, సహకార సొసైటీ అదనపు గదుల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం భవనం, నాడు నేడు కింద పాఠశాలల ఆధునికీకరణ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను గత ప్రభుత్వంలోనే పూర్తి చేశారు.గత ప్రభుత్వంలో డీబీటీ రూపంలో రూ.13.64 కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.52.47కోట్లు ప్రజలకు అందాయి. 5,142 ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 1,816 మంది వైద్య సేవలు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భవనాల్లో సగానికి సగం మూతపడ్డాయి. ఇంకో మాటలో చెప్పాలంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిలో పండుగ కోసం గ్రామానికి వచ్చిన వారిలా మాట్లాడుకున్నారు. అశోక్కుమార్ (మార్కెటింగ్ ఉద్యోగి, హైదరాబాద్): వెంకటేశ్వరరావు బాబాయ్ బాగున్నారా.. ఆరోగ్యం ఎలా ఉంది? వెంకటేశ్వరావు (గ్రామస్తుడు, రైతు): ఏముంది నాన్నా.. వయస్సు మీద పడుతుందిగా.. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. సర్లే నువ్వెప్పుడు వచ్చావ్.. కుటుంబం అంతా బాగున్నారా.. అశోక్కుమార్: నిన్ననే వచ్చాం బాబాయ్.. అందరం బాగానే ఉన్నాం.. కానీ ఏంది బాబాయ్ మన ఊళ్లో సంక్రాంతి సందడి అంతగా కనిపించడం లేదు.. రెండు మూడేళ్ల క్రితం చూసిన ఊపు కనిపించడంలేదు.. వెంకటేశ్వరరావు: ఏముంటది నాన్నా.. పోయిన ఏడు బుడమేరు వరదలతో పంటలన్నీ దెబ్బ తిన్నాయ్.. ఈ ఏడు చూస్తే వర్షాల వల్ల పత్తి పంట పోయింది.. మామిడి పోయింది.. వరి పంట అంతంతమాత్రమే.. జగన్ ప్రభుత్వంలో ఇచ్చే పథకాలన్నీ ఎత్తేశారు.. జనం దగ్గర డబ్బులు ఎక్కడున్నాయ్ నాన్నా.. జనం దగ్గర డబ్బులు లేకపోతే పండగ ఊపు ఎక్కడ నుంచి వచ్చుద్ది? (అంతలో జగదీష్ అనే యువకుడు అక్కడికొచ్చి కల్పించుకున్నాడు) జగదీష్: పండగలా ఉందా అసలు.. గత ప్రభుత్వంలో ప్రతి నెలా ఏదో ఒక రూపంలో అకౌంట్లలో డబ్బులు పడేవి. వాటితో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని డబ్బులు రెట్టింపు చేసుకునేవాళ్లు.. ఇప్పుడు ఏం ఉంది.. డబ్బులు లేవు.. ఇస్తానన్న పథకాలూ లేవు. అశోక్కుమార్: అదేందన్నా సూపర్సిక్స్ సూపర్ హిట్ అని తెగ ప్రచారం చేస్తున్నారుగా.. చంద్రబాబు పాలన సూపర్ అంటూ నా సహచరులు కొంత మంది తెగ చెబుతున్నారు.. జగదీష్: సరే చంద్రబాబు పాలన ఎలా ఉందో ఇప్పుడే చూద్దాం.. (అక్కడే ఉన్న రాజే‹Ùను ఉద్దేశించి..) రాజే‹Ù.. నువ్వు చదువుకొని ఉద్యోగం చేయడం లేదుగా.. మరి నీకు నిరుద్యోగ భృతి వస్తుందా? రాజేష్: లేదు అన్నా.. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏడాదిన్నర అయ్యింది. నాకే కాదు. ఏ ఒక్కరికీ ఇచ్చింది లేదు. నాకు నిరుద్యోగ భృతి కింద రూ.54 వేలు రావాలి. వెంకటేశ్వరరావు: నిరుద్యోగ భృతినా వాళ్ల బొందనా.. ఊళ్లో కట్టాల్సిన బిల్డింగ్లను ఏడాదిన్నరగా కట్టలేకపోయారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటరు భవనం అలానే వదిలేశారు. ఆ భవనాలు మందు తాగేవాళ్లకి మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఇదేనా అభివృద్ధి అంటే.. వాన వస్తే మన రోడ్డంతా చెరువులా మారుతుంది.. ఏం అభివృద్ధి వాళ్లు చేసేది? అంతా కల్ల»ొల్లి మాటలే.. (వీళ్ల మాటలను సిద్దార్థ అనే బీటెక్ విద్యార్థి విని కల్పించుకున్నాడు) సిద్దార్ధ: ఏంటో మీరు అభివృద్ధి అంటున్నారు.. పథకాలు అంటున్నారు.. అసలు ఈ ప్రయివేటు పరం గురించి చెప్పరేంది బాబాయ్.. ప్రతి దాన్నీ ప్రయివేటు పరం అంటోంది ఈ ప్రభుత్వం. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటూ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీని వల్ల ఎంత నష్టమో మీకు తెలుసా? డబ్బులు లేవంటూనే ఆవకాయ అమరావతి, యోగాంధ్ర పేరుతో రూ.కోట్లు అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం బాబాయ్? (అప్పుడే అక్కడికొచ్చిన గ్రామస్తుడు అభిద్నగో కల్పించుకున్నాడు) అభిద్నగో: ఒక్క ఆవకాయ అమరావతి ఏంటి.. టూర్లు.. ప్రత్యేక విమానాలు.. ఈవెంట్లు.. వీళ్లని చూస్తుంటే ప్రజల సొమ్ముని పప్పూ బెల్లాల్లా పంచుకొని కాజేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదని ఇట్టే తెలుస్తోందిగా.. జగదీష్: ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు గాల్లో కలిసిపోయాయి.. జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దయ్యాయి. ప్రభుత్వ స్కూళ్లు, పాఠశాలలు నిరీ్వర్యం చేశారు. పేద వాళ్ల పొట్ట కొడుతున్నారు.. ఈ ప్రభుత్వం వల్ల ఎంతగా నష్టపోయారో మనకంటే మహిళలు ఇంకా బాగా చెబుతారు. వెంకటేశ్వరరావు: అసలు మన చెరువుకి నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరగా వదిలేశారు.. ఈ ఏడు నారుమళ్లు ఎండిపోయి, నానా తిప్పలు పడ్డాం..పేదలన్నా, రైతులన్నా ఈ ప్రభుత్వానికి పట్టదబ్బాయ్.. అప్పుడే అక్కడికొచ్చిన శ్రీరాములు, హనమయ్య, రమేష్ కల్పించుకుంటూ: ఏం ప్రభుత్వమో నాయనా.. ఇదివరకు ఇంటికి వచ్చి ఏం కావాలన్నా ఇచ్చే వాళ్లు.. రేషన్ ఇంటి ముందుకే వచ్చి ఇచ్చే వాళ్లు.. ఇప్పుడు రేషన్ షాపుకు పోయి క్యూలో నిలబడాలి.. ఇప్పుడు ఏదైనా సర్టీ ఫికెట్ కావాలంటే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఏదైనా జగన్ ప్రభుత్వంలో పేదోళ్లు నిశి్చంతగా బతికారయ్యా. వెంకటేశ్వరరావు: ఆరే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకో మూడేళ్లు ఈ నరకం అనుభవించాల్సిందే.. వీళ్లు చెప్పే అభివృద్ధి కాగితాలపై మాత్రమే కనిపిస్తుంది. ఊళ్లలోకి వస్తే చూస్తే అసలు రంగు బయట పడుతుంది. అశోక్కుమార్: అవును బాబాయ్.. నేనే విన్నది ఒక్కటి.. ఇక్కడ చూస్తున్నది, వింటున్నది మరొకటి.అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట!ఊరు: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్: అన్నా.. లక్ష్మి పిల్లలు బాగా చదువుకుంటున్నారని తెలిసింది. ఎక్క డ చదువుతున్నారు.. ఇప్పుడు ఎలా ఉంది వారి పరిస్ధితి? బాబూరావు: ఏమి చెప్పమంటావు తమ్ముడూ. పేదోళ్ళయినా పిల్లలను బాగా చదివించాలనుకున్నారు. ఇద్దరు పిల్లలూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. పెద్దోడికి మూడేళ్ళ క్రితం ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లించింది. చిన్నబ్బాయ్ రెండో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రెండేళ్ళ నుంచి వారికి ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వడం లేదంట. కాలేజీ వాళ్ళు బాగా ఒత్తిడి తెస్తే ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజులు కట్టింది. వాళ్ళ చదువులు పూర్తయితేగానీ లక్ష్మి కష్టాలు తీరవు. యశ్వంత్: కోటేసు మావయ్యా.. రాందాసు పిల్లలు ఏమి చేస్తున్నారు.. పెద్దోడు బాగానే చదివేవాడని విన్నాను. కోటేసు: రాందాసు పిల్లలు డిగ్రీలు చదివారు అల్లుడూ.. పెద్దోడుకి కాలేజి ఫస్ట్ వస్తే సన్మానాలు చేశారు. ఉద్యోగం లేక ఏదాడిన్నర నుంచి ఊరిలోనే ఉంటున్నాడు. వ్యవసాయ సీజన్లో పొలం పనులకు వెళుతున్నాడు. ఈ ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఏదీ లేదు. చదువుకున్నోళ్ళకు నెలకు మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఏదీ ఇవ్వడం లేదు. చేసేది లేక వయస్సు మీదపడినా కుటుంబాన్ని లాక్కురావడానికి రాందాసు ఇంకా కష్టపడి పనులకు వెళుతున్నాడు. యశ్వంత్: రాంబాబు బాబాయ్ మూడేళ్ళ క్రితం ఊరొచ్చినపుడు వలంటీర్ రవి మేము తీసుకున్న పొలం తాలూకా ఏదో పనుంటే దగ్గరుండి చేయించాడు. ఇప్పుడు వలంటీర్ పోస్టులు తీసేశారుగా ఏం చేస్తున్నాడు? రాంబాబు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలకు పది వేలు ఇస్తామని హామీ ఇస్తే అందరూ చాలా సంబర పడ్డారు. తీరా అధికారంలోకి వచ్చాక వారందరినీ తీసేయడంతో ఎవరికి తోచిన పనులు వారు చేసుకుంటున్నారు. రవికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఏమి చేస్తాడు.. ఊరిలో పనులు లేకపోవడంతో విజయవాడ వెళ్ళి ఏదో షాపులో గుమస్తాగా పనిచేస్తూ భార్యా పిల్లల్ని పోషించుకుంటున్నాడు. యశ్వంత్: తమ్ముడూ విజయ్.. ఆ వెళ్లే మనిషి వెంకటేశ్వరమ్మలా ఉంది. అలా నడుస్తుందేంటి? విజయ్: వాళ్ళాయన ఐదు నెలల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. రెండు నెలల క్రితం ఆమె పడిపోతే కాలు విరిగింది. ఆపరేషన్ చేశారు. ఒక్కగానొక్క కూతురుకి పెళ్ళి చేసి అత్తింటింకి పంపింది. పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంది. దాని కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. యశ్వంత్: ఈ ప్రభుత్వం బాగా చేస్తోందని సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూసి నిజమేననుకున్నా. ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందే.. అంతా ఉత్తుత్తి ప్రచారమే అన్నమాట.. రంగారావు: రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తామంటే నమ్మి ఓట్లేశాం. చేసిందేం లేదు. పైగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలు తీసేశారు. ఎన్ని చెప్పుకున్నా ప్రయోజనం ఏముంది? ఈ ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరన్నది మాత్రం నిజం. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఇంతే. ఏం పండగో ఏమో.. సెయ్యాడితేగా! ఊరు: విజయనగరం జిల్లాడెంకాడ మండలం గుణుపూరుపేట రమణ: ఏరా శ్రీనూ.. పండగ సందడే లేకుండా పోయింది. చేతిలో డబ్బుల్లేవు. చేద్దామంటే పనుల్లేవు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిర్మాణ పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు పండగ మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్లకు తప్ప ప్రజలకు లేకుండా పోయింది. శ్రీను: నిజమే బావా.. ఆరు నెలలుగా ఉపాధి హామీ డబ్బులు కూడా పడలేదు. నాకు దాదాపుగా పాతిక వేల వరకు రావాలి.. అవి వచ్చినా పండక్కి పిల్లలకు బట్టలైనా కొనేవాడిని. సూర్యనారాయణ (రైతు): ఈ గవర్నమెంట్ వచ్చింది మొదలు పేదలు, రైతుల ఇళ్లలో కష్టాలే తప్ప నవ్వులు కనపడలేదు. రైతులకు సరిపడా యూరియా అందించలేకపోయింది. ఇదీ ఓ ప్రభుత్వమా? లక్ష్మి (డ్వాక్రా సంఘం నాయకురాలు): ఏం చిన్నాయనా.. అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు.. మేం మాత్రం కష్టాల్లో ఉన్నాం. గతంలో వైఎస్ జగన్ ఉన్నపుడు నిత్యం మాకు అండగా ఉండేవారు. పిల్లల చదువులకు అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. చిన్నాచితకా వ్యాపారాలకు కూడా ఆసరా పథకం ఉండేది. ప్రజల వద్ద నిత్యం డబ్బు కదిలేది. మా సొంత అవసరాలు తీరేవి. పిల్లలకు కొత్త బట్టలు కొనేవాళ్లం. ఇప్పుడు ఆ రోజుల్లేవు.. పది రూపాయలు కూడా మా ఆయనను అడగాల్సి వస్తోంది. అప్పన్న: జగన్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఎప్పుడూ అగలేదురా.. కానీ ఈ సర్కారు వచ్చాక ఆరోగ్యశ్రీ ప్రాణం తీసేస్తోంది. మొన్నామధ్య నాకు కాలు విరిగి ఆస్పత్రికి వెళ్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని చేర్చుకోలేదు.. అప్పుచేసి వైద్యం చేయించుకున్నాను.. ఇప్పుడు ఆ అప్పుకు వడ్డీ కడుతున్నాను. కాలు ఇంకా సరిగా నడవడానికి కూడా రావట్లేదు. కుంటుకుంటూ నడవాల్సి వస్తోంది.బతకడమే కట్టమైతే పండగయాడబ్బా..ఊరు: శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి లక్ష్మన్న: ఏందప్పా రామన్న.. పొలం పోలేదా?రామన్న: ముందు ప్రభుత్వంలో పంచాయతీ కాడ ఉన్న ఆర్బీకేలోకి వెళ్లి యూరియా తీసుకుని పంటకు వేసేవాడిని. ఇప్పుడు చూస్తే యూరియా బంగారమైందప్పా.. ధర్మవరానికి వెళ్లి ప్రైవేటోళ్ల దగ్గర దొడ్డిదారిన రెండింతలు ధర ఇచ్చి కొనే పరిస్థితి ఏర్పడింది. రైతులకు కరువు వచ్చినా, ఆపదొచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడమే లేదప్పా.. పట్నం నుంచి వచ్చిన నా కొడుకు, కోడలు ఈ పరిస్థితి చూసి ఎందుకు నీకు వ్యవసాయం.. అంటున్నారు. వాళ్లతోపాటు రమ్మంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదప్పా. ఆళ్లు చెప్పినట్లు పట్నంపోతే అక్కడ నాకు ఏమీ తోచదు. ఈన్నే ఉందామంటే బతికే దారి లేకుండా పోయింది. లక్ష్మన్న: ఏం సాంబయ్యా బియ్యం తెచ్చుకున్నావా.. సాంబయ్య: ఔనప్ప.. పట్నం నుంచి వచ్చిన నా మనుమడిని తీసుకుని పొరుగూరికి వెళ్లి మూడు గంటలు లైన్లో నిల్చుని తెచ్చుకున్నా. ముందు ప్రభుత్వంలో అయితే ఇంటికాడికే రేషన్ బండి వచ్చేది. ఇప్పుడంతా యాతనేకదప్పా. మన గురించి ఆలోచించే వారు ఎవరున్నారు? ముందు రోజులే ఎంతో మేలప్పా. లక్ష్మన్న: ఏం లింగన్నా.. ఆరోగ్యం బాగోలేదంటివి ఆసుపత్రికి పోయినావా.. లింగన్న: ఏం చెప్పాలిలేప్పా.. ముందు ప్రభుత్వంలో అయితే పంచాయతీ వద్దకు వెళితే ఇలేజ్ క్లినిక్లో డాక్టరోళ్లు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు వెళితే పట్టించుకునే వారే లేరప్పా. అందుకే కొడుకుని పిలుచుకుని ధర్మోరం వెళ్తున్నానప్పా. అయినా ఇదంతా ప్రభుత్వం చాతకాని తనమప్పా.. కాదు కాదు చాతకాని ప్రభుత్వానికి ఓట్లేసిన మనప్రజలదప్పా తప్పు. ఇంతకు ముందు మనూరికి పతీ నెలా 10వ తేదీలోపు 104 అంబులెన్స్ వ్యాన్ వచ్చేది. ఇక్కడే పరీక్షలు చేసి.. బీపీ, షుగర్తో పాటు ఏ ఇబ్బంది ఉన్నా మందులు ఇచ్చేవారు. ఇపుడా ఊసేదీ? ఉన్న పట్టా పాసు పుస్తకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చేదానికి డబ్బులు కట్టాలట. అందులోనూ అన్నీ తప్పులే. సుబ్బరాయుడు: అవును.. లింగన్న చెప్పింది నిజమే.. ఈ ప్రభుత్వం దేని గురించీ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నా. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు. కనీసం కొనుగోలు చేసే నాధుడే లేడు. విడ్డూరమేంటంటే.. రాయలసీమ ఎత్తిపోతల పథనాన్ని చంద్రబాబుతో మాట్లాడి నేనే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబితే ఈ ప్రభుత్వ ఉలుకూ పలుకూ లేదు. పైగా ఆ పథకాన్ని మొదలెట్టిన జగన్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతోంది. రేవంత్ రెడ్డి చెప్పిందాంట్లో నిజముందా.. లేదా చెప్పమంటుంటే ఆ పథకమే అక్కర్లేదంటోంది చంద్రబాబు ప్రభుత్వం. సొంత రాష్ట్రానికి నష్టం చేసే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. మన రాత బోగోలేదు కాబట్టే ఇన్ని కష్టాలని అనుకోవాల్సి వస్తోంది. మరో మూడేళ్లు తప్పవీ తిప్పలు. పదండి ఇళ్లకు.. పొద్దు పోయింది.. ఇళ్ల కాడ తిడతారు. సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా.. ఊరు: విశాఖ జిల్లా తాటితూరు ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేష్: అప్పల్రాజూ.. ఏం పండక్కు కొత్త బట్టలు కొన్నావా.. లేదా? అప్పల్రాజు: రా డాక్టరూ.. కూర్చో.. ముందు వెయ్యి కళ్లతో సూసి.. వెనకున్న గోతిలో పడ్డట్టుంది మా యవ్వారం. మొన్నటి దాకా జగనన్న హయాంలో రైతు భరోసా పైసలు సరిగ్గా పండక్కి ముందే పడేవి. అమ్మ ఒడి.. ఆసరా.. ఇలా ఇంటి ఖర్చులకు ఎలాటి లోటుండేది కాదు. ఇప్పుడు బట్టలు కొనడానికి జేబులో పైసా ఉంటే కదా. ఆనంద్: అవునన్నా.. ఈ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడమే మానేసింది. ఆర్బీకేలు ఉంటే రాజులా ఉండేవాళ్ళం. విత్తనం కావాలన్నా, ఎరువు కావాలన్నా అక్కడికెళ్లేవాళ్లం. పండించిన ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పట్టుకెళ్లే తిప్పలు లేకుండా ఊర్లోనే కొనేవారు. ఇప్పుడు మళ్ళీ దళారీలు తయారయ్యారు. గిట్టుబాటు ధర దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మద్దతు ధరేమో రూ.2,369 అంటారు. అక్కడికెళ్తేమో రూ.1,650 ఇత్తన్నారు. ఇంకేటి మిగుల్తాది? బోని లలిత్ ఆదిత్య: అన్నా.. మీ మాటలేమో గానీ మందు (లిక్కర్) మాత్రం బాగా దొరుకుతోంది. అందరూ ఒక్కసారిగా: మందు ఊసెత్తకు ఆదీ.. 24 గంటలూ ఎక్కడ సూసినా మందే కనిపిస్తోంది. కుటుంబాలు నాశనమైపోతుండాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ఆ మందులోనూ సగం నకిలీ అని తేలింది. ఆ మందు తాగితే త్వరగా చస్త్రారా.. చంద్రబాబు ప్రభుత్వం ఆస్పత్రులకు మందులు ఇవ్వడం లేదుగానీ.. ఊరూరా మాత్రం మందు విందు పథకం మొదలెట్టేసింది. సిన్న పిల్లలు కూడ సెడిపోతన్నార్రా. సూస్తే బాధేస్తాంది. అప్పల్రాజు: ఇంకా మూడేళ్ల పాటు పండగ ఇంతేలే.. మా షావుకారి దగ్గరకెళ్లి రూ.రెండు వేలు అప్పు తీసుకోవాలి. తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలున్నాయో తెలుసా? నేను యూఎస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేశాను. ఇక్కడ కూటమి ప్రభుత్వ పోకడ చూస్తుంటే బాధేస్తోంది. రాష్ట్రంలో పేదవాడు మెడిసిన్ చదివే పరిస్థితి కన్పించడం లేదు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులేవని ఈ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. అన్ని రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కష్టపడుతున్నాయి. పక్కనే ఉన్న తెలంగాణలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి తెలుసా? గత ప్రభుత్వం మంజూరు చేయించి, మొదలు పెట్టిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి డబ్బులు లేవు గానీ, ప్రచార ఆర్భాటానికి మాత్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ఇదెక్కడి రాజకీయం? ఉద్యోగాలివ్వని కంపెనీలకు రూపాయికి, అర్ధ రూపాయికి భూములు కేటాయిస్తున్నారు. ముందు చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. – కాసం నాగార్జున, పావులూరు, బాపట్ల జిల్లాప్రచారం మాత్రం ఆహా.. ఓహో.. రాష్ట్రంలో అభివృద్ధిపై ఆహా.. ఓహో.. అంటూ ఆర్భాటం చేస్తున్నారు గానీ.. ఇక్కడ గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతుల్లో గంపెడు మట్టి వేయలేదు. హైదరాబాదు నుంచి జాతీయ రహదారిలో వచ్చి, గ్రామీణ రహదారిలోకి రాగానే గోతులతో ఇబ్బందులు పడ్డాం. అంతటా గోతులమయమే. జుత్తిగ – సిద్ధాంతం రహదారిలో ప్రయాణం భయంభయంగా ఉంది. రెండేళ్లలో గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ భవన నిర్మాణాలూ లేవు. రెండేళ్ల క్రితం వరకు జరిగిన మార్పు అలానే ఉండిపోయింది. – కర్రి ఉమామహేశ్వర్, జుత్తిగ, పశి్చమ గోదావరి జిల్లా (హైదరాబాద్ నుంచి వచ్చారు)చదివించలేక పోతున్నాం గతంలో మాకు జగనన్న చేదోడు వచ్చేది. ఆ ఆరి్థక సాయంతో టైలరింగ్ షాపు నడిపేవాళ్లం. ఇప్పుడు ఆ సాయం లేదు. అందుకే ఇప్పుడు తెలంగాణాలోని సిర్పూరు కాగజ్నగర్లో బెడ్డింగ్ టైలర్గా పనిచేస్తున్నాను. చాలా ఒత్తిడిగా ఉంటుంది. నాతో పాటు నాభార్య కూడా కష్టపడుతుంది. గతంలో వైఎస్సార్ ఆసరా, చేయూతా వచ్చేవి. అవి ఇప్పుడు లేవు. పిల్లల్ని ఇంటి వద్ద ఉంచి చదివిస్తున్నాం. ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. – సవిరిగాన శ్రీహరి, వన్నలి గ్రామం, రేగిడి మండలం, విజయనగరం జిల్లా ఏ పనులూ కావడం లేదు నేను తిరుపతిలో పని చేస్తుంటాను. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు మా ఊరికి వస్తాను. గ్రామంలో ఎక్కువ మంది తల్లిదండ్రులను ఇక్కడే ఉంచి ఇతర ప్రాంతాలకు పనికి వెళ్తారు. దీంతో వృద్ధులైన వారు రేషన్ షాపునకు వెళ్లి బియ్యం మూట తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. పింఛన్ కోసం కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. ఏవైనా పనుల కోసం మా గ్రామ సచివాలయానికి వెళ్లడానికి అడ్డదారిన నడిచి వెళితే సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. మోటారు సైకిల్ వేసుకుని రోడ్డుపై వెళితే నాలుగు కిలోమీటర్లు వెళ్లాలి. ఇంత కష్టబడి తీరా గ్రామ సచివాలయానికి వెళితే సీట్లో అధికారులు ఉండడం లేదు. ఫోన్ చేస్తే సర్వేలో ఉన్నామంటున్నారు. దీంతో చచీ్చచెడి మళ్లీ ఉసూరుమంటూ ఇంటికి తిరిగి రావాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఈ కష్టాలే ఉండేవి కావని గ్రామస్తులు చెబుతున్నారు. – డోలా హనుమంతరావు, బేల్దారి మేస్త్రి, చిన్న కనుమళ్ల గ్రామం, కనుమళ్ల పంచాయతీ, ప్రకాశం జిల్లా -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురు దెబ్బ
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన గన్మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్మెన్తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన అనంతపురం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ వెంటనే స్పందించి, గన్మెన్ షేక్షావలిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా కార్యక్రమాల్లో భద్రత కోసం నియమించిన గన్మెన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండించబడింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాంపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు అనంతపురం రాజకీయ వాతావరణంలో కొత్త మలుపు తిప్పింది. -
నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు చెలగాటం: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: గ్రూప్–1, గూప్–2 మెయిన్స్ ఫలితాలు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఏడాది కావొస్తున్నా, దీనిపై వేసిన కేసులన్నీ క్లియర్ అయినప్పటికీ ఇంకా ఫలితాలు వెల్లడించకుండా నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫలితాలు వెల్లడించవచ్చని కోర్టు ఆదేశించినా ఏపీపీఎస్సీని చంద్రబాబు తన జేబు సంస్థగా మార్చేసుకుని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని విమర్శించారు.అత్యంత కీలకమైన ఈ విభాగానికి ఇప్పటికీ శాశ్వత చైర్మన్ను నియమించకుండా కాలక్షేపం చేయడం నిరుద్యోగులను వంచించడమేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే నియామకాలు పూర్తి కావాల్సి ఉన్నా, వైఎస్ జగన్కి మంచి పేరొస్తుందన్న అక్కసుతో చంద్రబాబు తన వారితో కేసులు వేయించి మెయిన్స్ పరీక్షలు జరగకుండా అడ్డుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు:గత వైయస్సార్సీపీ హయాంలోనే గ్రూప్–1లో 90 పోస్టులకు, గ్రూప్–2లో 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2024 ఫిబ్రవరిలోనే ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం అదే ఏడాది మే నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి, ఆ పరీక్షను అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాకుండా, దాదాపు ఏడాది తర్వాత, 2025 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మరో ఏడాది పూర్తవుతున్నా, ఆ ఫలితాలు ప్రకటించకుండా, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.నిజానికి టీడీపీ వేయించిన కేసుల వల్లే ప్రిలిమ్స్ పరీక్ష జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ నియామకాలు జరగడం లేదు. కోర్టు ఆదేశాలను సైతం ఈ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒకసారి ఏపీపీఎస్సీ చైర్మన్ని కలిసి ఫలితాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకుని, వెంటనే గ్రూప్స్ మెయిన్స్ ఫలితాలు ప్రకటించి, నియామకాలు పూర్తి చేయాలని ఎ.రవిచంద్ర డిమాండ్ చేశారు. -
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబే ప్రధాన దోషి: ఎస్వీ సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: స్కిల్ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని.. చంద్రబాబే ఈ కేసులో ప్రధాన దోషి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఐడీ పక్కా ఆధారాలు సేకరించిందని.. రూ.372 కోట్లు పక్కదారి పట్టినట్టు సాక్ష్యాలు కూడా ఉన్నాయని.. అలాంటి కేసును కొట్టేయటం విడ్డూరం అని సతీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘చంద్రబాబే తన కేసుకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవటం దారుణం. ప్రభుత్వంలో ఉండి మాఫీ చేసుకోవడం అభ్యంతరకరం. చంద్రబాబు కేసును ఎదుర్కొని తాను నిర్దోషినని నిరూపించుకోవాలి. అంతేగానీ ఇలా కేసును నీరు గార్చటం సబబు కాదు. దీనిపై మా పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు సర్వనాశనం చేశారు. అది నిరర్ధక ప్రాజెక్టు అయితే మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు?’’ అంటూ సతీష్రెడ్డి నిలదీశారు.‘‘ప్రాజెక్టు సందర్శన చేస్తున్న నెల్లూరు నేతలను అడ్డుకోవడం ఎందుకు?. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుండి నీరు తీసుకెళ్తున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా?. వెలుగొండ ప్రాజెక్టుకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తే ప్రకాశం జిల్లా సస్యశ్యామలమవుతుంది. కానీ చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు...రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే చంద్రబాబు అందరినీ తీసుకెళ్ళి చూపించాలి. 19వ తేదీ లోపల అందరినీ తీసుకెళ్లాలి. లేకపోతే మేమే స్వయంగా పరిశీలనకు వెళ్తాం. అక్కడ ఏమాత్రం పనులు జరుగుతున్నాయో ప్రపంచానికి తెలుపుతాం. కాంట్రాక్టర్ల నుండి 25-30 శాతం కమిషన్ తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వర రావుకు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఏం తెలుసు?. నీళ్ల విలువ గురించి ఏబీవీకి ఏం తెలుసు?. ఒకసారి ఆయన రాయలసీమ వచ్చి ప్రాజెక్టులను చూస్తే వాస్తవాలు తెలుస్తాయి. రాయలసీమ లిఫ్టు నిరర్థకం అంటున్న చంద్రబాబే నిరర్థకం. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అక్కడి ప్రజలే తగిన బుద్ది చెప్తారు. నామమాత్రపు సీట్లు కూడా సాధించలేరు’’ అని సతీష్రెడ్డి అన్నారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
రోశయ్య సతీమణి శివలక్ష్మి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య కుమారుడు కొణిజేటి శివ సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. శివలక్ష్మి గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని.. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం(జనవరి 12) కన్నుమూశారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అమీర్పేట్ ధరంకరం రోడ్డులోని నివాసంలో తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమెకు కేఎస్ సుబ్బారావు, కె.త్రివిక్రమరావు, కేఎస్ఎస్ మూర్తి కుమారులు, కుమార్తె రమాదేవి ఉన్నారు.గతేడాది డిసెంబర్ 20వ తేదీన అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆమె కొన్నిరోజులు చికిత్స పొంది కోలుకున్నారు. తిరిగి ఆరో గ్యం క్షీణించి సోమవారం ఉదయం మృతి చెందారు. మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు తదితరులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొంపల్లి సమీపంలోని దేవరయాంజల్ వ్యవసాయ క్షేత్రంలో శివలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు. -
స్కిల్ స్కామ్ కేసు అలా ముగిసింది..
సాక్షి, విజయవాడ: అధికార దుర్వినియోగంలో చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా 53 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును మొత్తానికి క్లోజ్ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లయ్యింది.ఆంధ్రప్రదేశ్లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9, 2023లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్ వేయించారు. గతంలో స్కిల్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేసులు మూయించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఇది ఉద్యోగులను ముంచే ప్రభుత్వం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగులంటే లెక్కలేనితనం స్పష్టంగా కనపడుతోందని,. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా ఇంతవరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ, ఐఆర్పై కనీసం స్పందించడం లేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా చేయలేదని, పీఆర్సీ వేయలేదని విమర్శించారు.గత సంక్రాంతికి ఇస్తారని చూసినా ఉద్యోగులకు నిరాశే మిగిలిందని, మళ్లీ సంక్రాంతి వచ్చినా ప్రభుత్వంలో చలనం లేదని, ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచే ప్రభుత్వమని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. గత సంక్రాంతికి పోలీసులకు 2 సరెండర్ లీవ్ల బిల్లులు చెల్లిస్తామని స్వయంగా ఆరి్ధక మంత్రి హామీ ఇచ్చారని, మళ్లీ సంక్రాంతి వచ్చినా అవి పూర్తిగా చెల్లించలేదని విమర్శించారు. దీపావళి సందర్భంగా సీఎం ఉద్యోగ సంఘాల నాయకులందరి సమక్షంలో పోలీసులకు ఒక సరెండర్ లీవ్ బిల్లు రూ.210 కోట్ల రూపాయలను సగం సగం చేసి రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్ నెలలలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు సగం చెల్లించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉంటే అందులో రూ.210 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి అవి కూడా చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులంటే ఇంత నిర్లక్ష్యమా? పోలీసులకు రికార్డు స్థాయిలో 6 సరెండర్ లీవ్ల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రిటైరయిన వారికి 18 నెలలుగా గ్రాట్యుటీ చెల్లించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా ఇంతవరకు ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. సీపీఎస్, జీపీఎస్ను సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే హడావుడిగా గత ప్రభుత్వం తెచ్చిన ఉత్తర్వులను రద్దు చేసిందని, 20 నెలలు అవుతున్నా ఇంతవరకు సీపీఎస్ గురించి మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. ఇక ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీకి తిలోదకాలు వదిలిందని, గతంలో 4 – 5 తేదీల్లో జీతం వచ్చేదని, ఇపుడు కొన్ని నెలల్లో ఉద్యోగులకు 10, 11 తేదీలొచ్చినా జీతాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఉద్యోగులను ఈ సర్కారు తీవ్రంగా వేధిస్తోందని విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచే స్థాయికి కూటమి సర్కారు దిగజార్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని, ఈ సంక్రాంతికైనా పీఆర్సీ వేయడంతోపాటు ఐఆర్ ఇవ్వాలని వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. -
మా భూములు తీసుకుంటే సహించేది లేదు
గుంటూరు వెస్ట్: ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో చిన్న, సన్నకారు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేస్తోందని, ఖరీదైన పొలాలు రింగ్ రోడ్డులో పోతే తమ జీవితాలు రోడ్డున పడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారా కోడూరు ప్రాంత రైతులు సుమారు 150 మంది సోమవారం గుంటూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకుని చంద్రబాబు సర్కారుపై ఫిర్యాదు చేశారు. నారా కోడూరు ప్రాంతంలో ఔటర్రింగ్ రోడ్డు పేరిట సుమారు 650 ఎకరాల పచ్చని పొలాలను అక్రమంగా తీసుకుంటున్నారని వారు వాపోయారు. ఈ రోడ్డుకు సుమారు 80 ఎకరాలు అవసరం అవుతుందని, అంతవరకు ఇవ్వడానికి తమకు ఇబ్బంది లేదని చెబుతున్నారు.అయితే అవసరం లేకపోయినా పచ్చని పొలాలను తీసుకుంటే సహించేది లేదంటున్నారు. 2014–19 కాలంలో రాజధాని పేరిట సుమారు 35 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకుని వారిని ఇప్పటికీ వేధింపులకు గురిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నామన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రైతులను ఇబ్బందులు పెట్టలేదని.. జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూములకు క్రమం తప్పకుండా డబ్బులు కూడా చెల్లించారని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఇతర నాయకులను కలిసి తమ పరిస్థితిని వివరించి సహాయం కోరుతామని చెబుతున్నారు. రాజకీయ క్రీడ ఆడుతున్నారా ? ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర నారా కోడూరు ప్రాంత రైతులను కలిసి వివరాలు అడిగారని రాంబాబు అనే రైతు తెలిపాడు. రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారని.. అయితే వారికి తెలియకుండానే భూములకు మార్కింగ్ జరిగిందా? అని నిలదీస్తున్నారు. తమతో రాజకీయ క్రీడలు ఆడితే భవిష్యత్ గల్లంతేనని హెచ్చరిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం ఎందుకు కక్ష కడుతుందో అర్థం కావడం లేదంటున్నారు. గ్రామసభ కూడా నిర్వహించకుండా, రైతులకు చెప్పకుండా భూములు తీసుకుంటామనడం దారుణమన్నారు. రైతుల ఉసురు తగిలితే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని రైతులంతా చెబుతున్నారు. -
పండుగనాడు పస్తులేనా?
సాక్షి, అమరావతి: అసలే భద్రతలేని ఉద్యోగాలు.. ఆపై ఇచ్చే అరకొర జీతాలు నెలల తరబడి చెల్లించరు.. ఇలా అయితే ఎలా.. పండుగనాడు పస్తులేనా.. అంటూ గిరిజన, ఏకలవ్య, సాంఘిక సంక్షేమ గురుకులాల టీచర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సంక్రాంతి వచ్చినా తమకు వేతనాలు అందకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి బిడ్డలకు, అట్టడుగు వర్గాల పిల్లలకు అక్షరాలు దిద్దించే తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులపాలవుతున్నామని బాధపడుతున్నారు.రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాల్లో పనిచేసే సుమారు 1,600 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులకు రెండు నెలల (నవంబర్, డిసెంబర్) జీతాలు ఇవ్వలేదు. వారిలో గతం నుంచి పనిచేçస్తున్న వారితోపాటు డీఎస్సీ–2025 ద్వారా భర్తీ అయిన రెగ్యులర్ టీచర్లు కూడా ఉన్నారు. వారితోపాటు అవే గురుకులాల్లో పనిచేస్తున్న 1,659 మంది ఔట్సోర్సింగ్ టీచర్లకు డిసెంబర్ నెల వేతనం ఇవ్వలేదు. రెగ్యులర్ టీచర్లతో పోస్టులు భర్తీ కావడంతో అవుట్సోర్సింగ్ వారిని సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేయడంతోపాటు ఆరునెలలుగా సకాలంలో వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఏకలవ్య గెస్ట్ టీచర్లను దగా చేశారు రాష్ట్రంలో 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో (గురుకులాల్లో) పనిచేస్తున్న 200 మంది గెస్ట్ టీచర్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది. వారికి ఇచ్చే జీతానికి సైతం ఈ ఏడాది జూన్ నుంచి దారుణంగా కోతపెట్టింది. ఆ తగ్గించిన జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వడం లేదు. ఏకలవ్య గురుకులాల్లో పనిచేసే టీచర్లలో నెలకు రూ.45 వేలు ఉన్న జీతాన్ని రూ.35 వేలకు, రూ.42 వేలు ఉన్న జీతాన్ని రూ.33 వేలకు తగ్గించారు. తగ్గించిన జీతాలను కూడా రెండు నెలలుగా ఇవ్వలేదు. అంబేడ్కర్ గురుకులాల్లోనూ వేతన వెతలే.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ రెనిడెన్షియల్ స్కూల్స్లో (గురుకులాల్లో) పనిచేసే సుమారు 2,300 మందికీ వేతన వెతలు తప్పలేదు. మూడునెలలుగా జీతాలు రాక వీరు పడుతున్న అవస్థలను గతేడాది నవంబర్లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో అప్పటికప్పుడు రెండునెలల వేతనాలిచ్చిన ప్రభుత్వం తరువాత పట్టించుకోలేదు. వీరికి గత నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు ఇంకా ఇవ్వలేదు. ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న సుమారు 800 కాంట్రాక్ట్ టీచర్లు (సీఆర్టీలు), 1,700 మంది పార్ట్టైమ్, అడ్హాక్, ఔట్సోర్సింగ్ టీచర్లకు రెండునెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గురుకులాల్లో పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ పేరుకు పార్ట్టైమ్ అని చిన్న జీతాలు పొందుతున్న టీచర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శనీయంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం రాకముందు సక్రమంగా జీతాలు వచ్చేవని, ఇప్పుడు నెలల తరబడి పెండింగ్ పెడుతున్నారని ఆయా టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. -
వక్ఫ్ భూములేగా.. ఉఫ్మనిపిద్దాం
సాక్షి, అమరావతి: వక్ఫ్ భూములా..! ఉఫ్ మనిపించేద్దాం అన్నవిధంగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ ధోరణి. రూ.వందల కోట్ల విలువైన భూములను పచ్చ గద్దలు కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేసింది. గత ఏడాది మొదలైన ఈ ప్రయత్నాలకు వక్ఫ్బోర్డు తీర్మానంతో తాత్కాలిక బ్రేక్ పడినా ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ చట్టానికి విరుద్ధం అంటూ న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నా... లీజుకైతే ఓకే, వక్ఫ్ ఆస్తుల టైటిల్ మార్పునకు వీల్లేదు.. అని బోర్డు చెబుతున్నా భూములను కాజేసే కుట్రలు ఆగడం లేదు. విలువైన ఆస్తులను పరులపాలు చేసి, దాతల ఆశయాన్ని దెబ్బతీయొద్దని ముస్లిం సమాజం ఎన్ని విధాలుగా కోరుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. తన దారుణమైన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ⇒ గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలు, గుంటూరులోని అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి భూ సేకరణ ద్వారా బదలాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాది నుంచి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోంది. మల్లాయపాలెంలోని భూములను ఏపీఐఐసీకి భూ సేకరణ పేరుతో అప్పగించేందుకు గత ఏడాది మార్చిలో తెనాలి సబ్ కలెక్టర్ ఏపీఐఐసీ అ«ధికారులకు లేఖ రాయడాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములను పచ్చ నేతలకు అప్పగించేందుకు చేసిన ఆ ప్రయత్నాలను ముస్లిం సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. టైటిల్ మార్చడానికి కుదరదన్నా... మల్లాయపాలెం వక్ఫ్ భూములను ఏపీఐఐసీకి అప్పగించే ప్రధాన అంశంపై ఏకాభిప్రాయం సాధించలేమని భావించిన వక్ఫ్బోర్డు గతంలో రెండుసార్లు సమావేశాలను వాయిదా వేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సొంత జిల్లా నెల్లూరులో నిరుడు జూలైలో నిర్వహించిన సమావేశం వక్ఫ్ టైటిల్ను మార్చడాన్ని (పూర్తిగా అన్యాక్రాంతం) తిరస్కరించింది. భూములను లీజు, పీపీపీ పద్ధతిలో మాత్రమే ఇస్తామని తీర్మానించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికీ నివేదించింది. ఏపీ భూ సేకరణ చట్టం–2018లోని సెక్షన్ 22ని అనుసరించి అతి తక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదన చేయగా... కుదరదని తేలి్చచెప్పింది. లీజు, పీపీపీలో అభివృద్ధి ఏది కావాలో ఎంచుకోమని సూచించడం గమనార్హం. అయితే, ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డు చేసిన లీజు, పీపీపీ రెండు ప్రతిపాదనలను కొందరు బోర్డు సభ్యులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ భూములను లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్ చట్టం–1995లోని సెక్షన్–51 స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. మళ్లీ నోటిఫికేషన్తో కలకలం తాజాగా గుంటూరు అంజుమన్ ఎ ఇస్లామియా సంస్థకు చెందిన మంగళగిరి మండలం చినకాకానిలోని 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్క్ పేరుతో ఏపీఐఐసీకి అప్పగించేందుకు నోటిఫికేషన్ జారీ చేయడం కలకలం రేపుతోంది. భూ సేకరణ ద్వారా తీసుకుంటున్నామని, అభ్యంతరాలు ఉంటే 60రోజుల్లో తెలపాలని జిల్లా కలెక్టర్ డిసెంబరు 19న నోటిఫికేషన్ ఇచ్చారు.దీంతో వక్ఫ్ భూముల సేకరణకు ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లైంది. మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను కూడా మలేసియా కంపెనీలకు ఇండ్రస్టియల్ పార్కు పేరుతో ధారాదత్తం చేసేందుకు చర్చలు జరిగాయి. ఆ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించినట్టు విశ్వసనీయ సమాచారం. తాడికొండ జామియా మసీదుకు చెందిన వంద ఎకరాలు, కొండపల్లి ఖాజీ మాన్యం 50 ఎకరాలను కూడా భూ సేకరణ పేరుతో తీసుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు ఊపందుకున్నట్టు సమాచారం.న్యాయ పోరాటం చేస్తాం ముస్లిం సమాజంలోని పేదల అభివృద్ధి, సంక్షేమం, పిల్లల విద్యను కాంక్షిస్తూ దాతలు మహోన్నత ఆశయంతో భూములు ఇచ్చారు. దానిని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ పోరాటం చేస్తాం. వక్ఫ్ భూములను ఇతర శాఖలు, వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడం సరికాదు. ఏపీఐఐసీకి అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వానికి వక్ఫ్బోర్డు ఆస్తుల టైటిల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయడం సాధ్యం కాదు. లీజు, పీపీపీ మోడల్లో అభివృద్ధి చేసి వక్ఫ్బోర్డుకు ఆదాయం పెంచి ముస్లింల సంక్షేమం, విద్యకు ఉపయోగించాలి. – షేక్ నాగుల్మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడుచినకాకాని వక్ఫ్ భూముల భూ సేకరణ నిలిపేయాలి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చినకాకాని గ్రామంలో ఉన్న వక్ఫ్ భూముల సేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయమై అంజుమన్ ఎ ఇస్లామియా కమిటీ కార్యదర్శి షేక్ సైదా నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించింది. పారిశ్రామిక పార్కు పేరుతో 71.57 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ భూములు వక్ఫ్ చట్టం–1995 ప్రకారం నమోదైన వక్ఫ్ ఆస్తులని, వాటిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా సేకరించడం చట్టవిరుద్ధమని, ఈ భూ సేకరణ చర్యలు చెల్లుబాటు కావని చెప్పారు. వక్ఫ్ భూముల భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని కలెక్టర్కు అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు
సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమందిని బదిలీ చేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వలేదు. వారికి పోస్టింగ్లు ఇస్తూ విడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. -
ఆధార్ సేవల టెస్టు పాస్ కాకుంటే ఇంక్రిమెంట్ కట్
సాక్షి, అమరావతి: నిర్ణీత అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆధార్ జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ధారించిన ఎన్ఎస్ఈఐటీ పరీక్ష గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఈ ఏడాది మార్చిలోగా ఉత్తీర్ణత కాకుంటే ఆయా డిజిటల్ అసిస్టెంట్లకు తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి అందించిన ఆదేశాల మేరకు ఆయా జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు తమ పరిధిలోని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.ఆయా పరీక్ష ఉత్తీర్ణత కాని వారితో పాటు అసలు పరీక్షకు హాజరు కాని వారికీ, పరీక్షకు దరఖాస్తే చేయని వారికి, పరీక్ష ఉత్తీర్ణత అయినా ఆధార్ సేవలు అందించేందుకు అయిష్టత తెలిపిన వారికీ తదుపరి వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులతో పాటు డిజిటల్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఎన్ఎస్ఈఐటీ పరీక్ష వచ్చే మార్చిలోపు తప్పనిసరిగా పాస్ కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డిసెంబరు 31వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాల్లో ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాల్లో కేవలం డిజిటల్ అసిస్టెంట్ల విషయంలోనే వార్షిక ఇంక్రిమెంట్ నిలుపుదల అంశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
‘గ్రూప్స్’ ఫలితాలపై నీలినీడలు!
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థులతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చెలగాటమాడుతున్నాయి. తాము రేయింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసినా ఫలితాలు ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు మొగ్గు చూపకపోవడం.. ఫలితాలిస్తామని ఏపీపీఎస్సీ పైకి చెబుతున్నప్పటికీ అది ఎప్పుడో తెలీక అభ్యర్థులు రెండింటి మధ్య నలిగిపోతున్నారు. ఎందుకంటే.. ఫలితాలు ప్రకటించుకోవచ్చని న్యాయస్థానం చెప్పినా మరికొంత సమయం పడుతుందని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. గత ప్రభుత్వం 2023 డిసెంబరులో ఇచ్చిన గ్రూప్–2 నోటిఫికేషన్కు మూడునెలల్లో ప్రిలిమ్స్ పూర్తిచేసి మేలో మెయిన్స్ నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షలు నిర్వహించొద్దని నాటి ప్రతిపక్ష నేతలు హైకోర్టులో కేసులు వేయించారు. అనంతరం 2024 జూన్లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.కానీ, గత ప్రభుత్వంపై కక్షగట్టి హైకోర్టులో పిటిషన్లు వేయించిన ప్రస్తుత అధికార పక్షం.. ఇప్పుడు కూడా అదే పంధాను అనుసరించడం చూస్తుంటే 2026లో కూడా గ్రూప్–2 ఫలితాలు వస్తాయన్న ఆశలేదని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పోర్ట్సు కోటాతో ఫలితాలను ముడిపెట్టి అడ్డుపడుతోందని వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనకు యతి్నంచిన అభ్యర్థులను కార్యాలయానికి రాకుండానే బెదిరించి వెనక్కి పంపేసినట్లు తెలిసింది. మూడు నెలల్లో ప్రిలిమ్స్.. ఏడాది తర్వాత మెయిన్స్.. నిజానికి.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబరులో 905 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 25న నిర్వహించింది. మెయిన్స్ అదే ఏడాది మే/జూన్లో జరుగుతాయని ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించి నెలరోజుల్లో ఫలితాలు ప్రకటించారు. అనంతరం 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసి మేలో మెయిన్స్కు ఏర్పాట్లుచేశారు. అలాగే, గ్రూప్–1కి కూడా 2023 డిసెంబరులోనే దాదాపు 90 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో కొందరు టీడీపీ నాయకులు అభ్యర్థులతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు.ముఖ్యంగా గ్రూప్–1పై ఈ కేసులు వేయడంతో పాటు గ్రూప్–2పైనా అదనపు పిటిషన్లు వేయించారు. దీంతో 2024 మే, జూన్లో జరగాల్సిన మెయిన్స్కు బ్రేకులు పడ్డాయి. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడడంతో అడ్డంకులు తొలగిపోతాయని అభ్యర్థులు ఆశించారు. కానీ, కూటమి ప్రభుత్వం రాగానే ఏపీపీఎస్సీని అస్తవ్యస్థం చేసింది. అనేక రకాల డ్రామాల నడుమ 2025 ఫిబ్రవరి 23న గ్రూప్–2 మెయిన్స్.. నిర్వహించి గతనెలలో సరి్టఫికెట్ల పరిశీలన, కంప్యూటర్ నైపుణ్య పరీక్షలు పూర్తిచేశారు. అదే ఏడాది మేలో గ్రూప్–1 మెయిన్స్ నిర్వహించారు. హైకోర్టు అడ్డంకులు తొలగినా సరే.. ఇక గ్రూప్–1, 2 ఫలితాల విడుదలకు హైకోర్టులో అడ్డంకులు తొలగినప్పటికీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ రెండూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్సు కోటా పోస్టులను పక్కనబెట్టి, మిగిలిన పోస్టులకు ఫలితాలు ప్రకటించుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. అయితే, ఫలితాలు మరింత ఆలస్యమవుతాయని ఏపీపీఎస్సీ ఇటీవల ప్రకటించడం అభ్యర్థుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఇప్పుడు ఫలితాలు ప్రకటించకపోతే మెయిన్స్ రాసి సీపీటీకి ఎంపికగాని అభ్యర్థులు మళ్లీ డివిజనల్ బెంచ్, సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ నోటిఫికేషన్ పూర్తికావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈ నోటిఫికేషన్ పూర్తికాకుండా కొత్త జాబ్ కేలండర్ ఇవ్వడం కుదరదని ప్రభుత్వం పరోక్షంగా చెబుతోంది. దీంతో ఎంపికగాని అభ్యర్థులు మరోసారి డివిజనల్ బెంచ్కు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. జగన్ పాలనలో దేశంలోనే నం.1గా ఏపీపీఎస్సీ.. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ హయాంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల సర్విస్ కమిషన్ల పనితీరుపై విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకోగా.. వివాదరహిత కమిషన్గా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీని తిరిగి వివాదాల్లోకి నెట్టి నిరుద్యోగ యువత ఆశలను ఛిద్రం చేస్తోంది. 2018 డిసెంబరులో నాటి టీడీపీ ప్రభుత్వం 32 నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్కదానికి కూడా పరీక్షలు నిర్వహించలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో 2018 నాటి పరిస్థితే కనిపిస్తుండడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది. -
కూటమిలో ‘పెద్ద’ లాబీయింగ్!
సాక్షి, అమరావతి: త్వరలో ఖాళీ కానున్న రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం టీడీపీ కూటమిలో భారీ లాబీయింగ్ మొదలైంది. మూడు నెలల సమయం ఉన్నప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీ నుంచి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్చంద్రబోస్ పదవీకాలం ఈ ఏడాది జూన్లో ముగియనుంది. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్బాబు పదవీ కాలం కూడా జూన్ వరకే ఉంది. ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల కోసం మూడు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ఏడాది క్రితం రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో టీడీపీ, బీజేపీ చెరొకటి పంచుకున్నాయి. జనసేనకు మొండిచెయ్యి చూపించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా మంత్రివర్గంలోకి మాత్రం తీసుకోలేదు. టీడీపీ తరఫున రాజ్యసభ సీటు మరోసారి సానా సతీష్బాబుకే కేటాయించే అవకాశం ఉందన్న సంకేతాలు అందడంతో టీడీపీ సీనియర్లు యనమల తదితరులతోపాటు పెద్దల సభకు వెళ్లే యోచనలో ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సీఎం చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. జనసేన కోటాలో లింగమనేని త్వరలో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో ఈసారి తప్పనిసరిగా జనసేనకు ఒక స్థానం కేటాయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానాన్ని అటు సీఎం చంద్రబాబు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సన్నిహితుడైన లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఒక అంగీకారం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రెండు సీట్లకు బీజేపీ పట్టు ఏపీ కోటాలో ఈసారి తమకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని బీజేపీ అధిష్టానం సూచించిన వారికి, రెండో సీటు రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరికి ఇప్పించుకోవాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో తమకు సంఖ్యా బలం కీలకం కాబట్టి ఏపీ కోటాలో ఇవ్వాల్సిందేనని బీజేపీ తేల్చి చెబుతోంది. గతంలో నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్షా జోక్యం చేసుకోవడంతో చంద్రబాబుకు మరోమాటకు తావు లేకుండా ఒక సీటు కమలనాథులకు ఇచ్చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.సానాకే మరోసారి చాన్స్..!రెండు బీజేపీకి, ఒకటి జనసేనకు ఇస్తే ఇక టీడీపీకి మిగిలేది ఒకే ఒక స్థానం. దాన్ని సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడి సానా సతీష్బాబుకి రెన్యువల్ చేయడం ఖాయమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు చినబాబు వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడంతో ఆ సీటు ఇతరులకు దక్కే ఛాన్స్ లేదని చెబుతున్నారు. మరోవైపు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కలిసినప్పుడల్లా అడుగుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు తరపున వ్యవహారాలు నడిపే మరో సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిత్యం టీడీపీ సేవలో తరించే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా తనకు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదాయం రావట్లేదు.. మీదే ఫెయిల్యూర్
సాక్షి, అమరావతి: లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదని, కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధులను వ్యయం చేసి తిరిగి తెచ్చుకోవడంలో అధికారులు, కలెక్టర్లు వైఫల్యం చెందారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనపర్చాలని, సాకులు చెబితే కుదరదని స్పష్టం చేశారు. జీఎస్డీపీ పెరిగితే ఆ మేరకు ఆదాయ వనరులు కూడా పెరగాలని, లేదంటే ఎక్కడో తేడా వస్తోందన్నారు. జీఎస్డీపీని కేంద్ర ఏజెన్సీ కూడా పరిశీలిస్తుందని, మనం రాసుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు.సోమవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతోపాటు వర్చువల్గా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలను సమీక్షించారు. గతేడాది 12.05 శాతం వృద్ధి సాధిస్తే, ఈ ఏడాది అంచనాల మేరకు 11.5 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే వీలుందన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది తగ్గిపోతున్నామని పెదవి విరిచారు. నిజానికి ఈ ఏడాది వృద్ధి లక్ష్యం 16 శాతంగా నిర్దేశించుకున్నట్లు గుర్తు చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులు, కలెక్టర్లు, విభాధిపతులు పది సూత్రాలను సాధించేందుకు రోజువారీ, నెలవారీ క్యాలెండర్తో ప్రణాళికలు తయారు చేసుకుని పనితీరు కనపరచాలని, ఉపన్యాసాలు చెబితే కుదరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుంటాయని, దానికి ముందు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మంచి వృద్ధి..! గతేడాది మన రాష్ట్రం కన్నా ఇతర రాష్ట్రాలు మంచి వృద్ధి సాధించాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర నిధులను వ్యయం చేయకపోవడంపై మంత్రులు, అధికారులు, కలెక్టర్లపై సీఎం విరుచుకుపడ్డారు. కొంత మంది కలెక్టర్లు డేటా కూడా అప్డేట్ చేయడం లేదని, అలాంటి వారిని ఎక్స్పోజ్ చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కనపెడతానన్నారు. కలెక్టర్లు, అధికారులు పనితీరు కనపరచాలన్నారు. కేంద్ర పథకాల నిధుల్లో ఒక రూపాయి కూడా మురిగిపోకూడదని, ఆ పరిస్థితి వస్తే మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాల్సి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.చాలా శాఖలు 50 శాతం నిధులను కూడా వ్యయం చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలన్నరలో నిధులన్నీ వ్యయం చేసి మార్చి 15వ తేదీన కేంద్రం నుంచి అదనపు నిధులు తేవాలని సూచించారు. పెన్షన్ మినహా మిగతా పథకాలపై ప్రజల్లో సంతృప్తి తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, విభాగాధిపతులు డేటా తీసుకుని క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వ పథకాలు, సేవలపై 80 శాతం సంతృప్త స్థాయి తేవాలని నిర్దేశించారు. ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగకుంటే మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల వైఫల్యంగానే పరిగణిస్తామన్నారు. విభాగాధిపతులు మౌనంగా కూర్చుంటే కుదరదని, పనితీరు చూపించాక మాట్లాడాలన్నారు. పీపీపీలో 290 ప్రాజెక్టులు.. నిధులు లేవని ప్రాజెక్టులు నిలిపి వేయకుండా పీపీపీ, హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. పీపీపీ ప్రాజెక్టుల కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలన్నారు. పీపీపీ విధానంలో రూ.1.15 లక్షల కోట్ల విలువైన 290 ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్న ట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్చంద్ర తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులు కడితే నేనెప్పుడూ అడ్డు చెప్పలేదు... తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. పుష్కరాల్లోగా పోలవరం నిర్మించి జాతికి అంకితం చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కూడా త్వరలోనే జాతికి అంకితం చేస్తామన్నారు.కాగా తెలంగాణ సర్కారు కృష్ణా నదిపై అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా చంద్రబాబు ఏపీ హక్కులను తాకట్టు పెట్టారని సాగునీటి నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. జన్మభూమికి ద్రోహం తలపెట్టి రాయలసీమ ఎత్తిపోతలను నిలిపివేసిన చంద్రబాబు ఇంత అన్యాయంగా, బాహాటంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు బడాయి మాటలు చెబుతున్నారని నీటి పారుదల నిపుణులు మండిపడుతున్నారు. -
బాబు సర్కారు మరో బాంబు.. రూ.13,100 కోట్ల బాదుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, సహజ వనరుల దోపిడీ, పేకాట క్లబ్బులు, విద్యుత్తు చార్జీల బాదుడుతోపాటు సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రజల జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన చంద్రబాబు సర్కారు తాజాగా.. ఆదాయం కోసం ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావాలని ప్రతిపాదించింది. వివిధ సెస్లు, పన్నుల ద్వారా రాష్ట్ర ప్రజలపై మరో రూ.13,100 కోట్ల మేర అదనపు భారం మోపాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం సాక్షిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. లాటరీ.. ఆన్లైన్ గేమింగ్ పన్నులు..ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడం ద్వారా రూ.3,000 కోట్లు ఆర్జించాలని చంద్రబాబు సర్కారు ప్రతిపాదించింది. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ.1,400 కోట్లు ఆర్జించాలని నిర్దేశించుకుంది. ఎస్జీఎస్లపై ఒక శాతం సెస్ విధించడం ద్వారా రూ.4,700 కోట్లను ఆర్జించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రూ.2,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు. అలాగే రెండో, మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ విధించడం ద్వారా రూ.1,300 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదన చేశారు. వృత్తి పన్ను పెంపు ద్వారా రూ.400 కోట్లు, విజయవాడ, విశాఖపట్టణం మున్సిపల్ పరిధిలో వృత్తి పన్ను వసూళ్లను బదిలీ ద్వారా రూ.110 కోట్లు ఆర్జించాలని ప్రతిపాదించారు.వసూళ్ల పెంపు కోసం పన్ను ఆధార విస్తరణ, బకాయిల వసూళ్లు, ఐటీ ఆధారిత పర్యవేక్షణ, కొత్త ఆదాయ వనరుల అన్వేషణపై దృష్టి పెట్టడం ద్వారా 2025–26లో రాష్ట్రం స్వంత ఆదాయ వృద్ధి లక్ష్యాలను అధిగమించనున్నారు. ఈమేరకు ఆదాయ విభాగాల లక్ష్యాలు, సాధనపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఈ సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. బడ్జెట్ లక్ష్యాలకు తగినట్లు ఆదాయం రావడం లేదన్నారు. -
ఆదాయాన్ని మళ్లించి అరుపులు!
సాక్షి, అమరావతి: ఇసుక నుంచి మద్యం వరకూ అన్నింటా దోపిడీ.. కేవలం 19 నెలల్లోనే దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో రూ.3.02 లక్షల కోట్ల అప్పులు.. అయినా సరే సూపర్ సిక్స్ సహా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. ఇన్నాళ్లూ ఆర్థిక వృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోందంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వాస్తవాలను అంగీకరించారు. ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టారు. ఆదాయ ఆర్జన శాఖలు పనితీరు కనపర్చాలని.. సాకులు చెబితే కుదరదని.. అలాంటి అధికారులు, కలెక్టర్లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతానంటూ హూంకరించారు.చంద్రబాబు సీఎం కాగానే ఇకపై పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ప్రకటన చేయడం తెలిసిందే. ఇదే అదునుగా పచ్చ ముఠాలు ఇసుక నుంచి క్వార్ట్జ్, సిలికా, మైనింగ్, లేటరైట్ వరకూ సహజ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. మద్యం షాపులు, బెల్ట్షాపులను గుప్పిట్లో పెట్టుకుని నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఒకపక్క రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు టీడీపీ నేతల దోపిడీని ప్రోత్సహిస్తూ.. చివరకు రాబడి తగ్గితే అధికార యంత్రాంగాన్ని బాధ్యులుగా చేస్తామని చంద్రబాబు బెదిరింపులకు దిగడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక రెడ్ బుక్ పేరుతో టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తుండటంతో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీసే ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రశి్నంచే గొంతులను నులిమేందుకు బాబు సర్కారు చేయని కుట్రలు లేవు. ఖజానాకు గండి.. పచ్చ ముఠాలకు రాబడి కూటమి సర్కారు అవినీతి విశృంఖలంగా సాగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం టీడీపీ నేతల జేబుల్లోకి చేరుతోంది. దీనివల్లే ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందన్నది బహిరంగ రహస్యం. పొలిటికల్ గవర్నెన్స్తో పరిపాలన పూర్తిగా అదుపు తప్పిందని.. విచ్చలవిడి అవినీతి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులుగా సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఐఏఎస్లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇసుక ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది.ఇప్పుడు పేరుకే ఉచిత ఇసుక.. ఇసుక ర్యాంప్లను తమ అ«దీనంలోకి తీసుకుని టీడీపీ ముఠాలు యథేచ్ఛగా తవ్వేస్తూ, అధిక ధరకు విక్రయించి దోచేస్తున్నాయి. ఫలితంగా గతంతో పోల్చితే ఇప్పుడు ఇసుక ధర డబుల్ అయ్యింది. కానీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం సున్నా. ఆ ఆదాయమంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇక టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే మద్యం షాపులను తమ అధీనంలోకి తీసుకుని.. ఊరూ వాడా బెల్ట్ షాపులు తెరిచారు. నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో అమ్మే ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం బాటిలే! ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యాన్ని విక్రయిస్తూ, అడ్డగోలుగా దోచేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. దీంతో అవినీతి వ్యవస్థీకృతమైపోయినా, ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మోసాలుగా సూపర్ సిక్స్ హామీలు.. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు.. గతేడాది, ఈ ఏడాదీ ఎగ్గొట్టారు. ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేల చొప్పున ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీకి ఎగనామం పెట్టారు. ఇక 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 చొప్పున పెన్షన్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆ హామీని గతేడాది, ఈ ఏడాదీ అమలు చేయకుండా మోసం చేశారు. తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.యూడీఐఎస్ఈ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్యూడైస్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటివరకూ ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే.. అదీ ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించి.. 21 లక్షల మందికి పూర్తిగా ఎగ్గొట్టారు.ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.పది వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చి.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టి మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్సహా అన్ని హామీలదీ అదే తీరు. ఓవైపు సహజ వనరులను దోచేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించినా హామీలను చంద్రబాబు సర్కార్ అమలు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.అప్పుల్లో రికార్డు.. హామీలకు వెన్నుపోటు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు మాత్రమే చేసింది. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసింది. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో ప్రజల ఖాతాల్లో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా జమ చేసి రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేయగా, అందులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల కింద పేదల ఖాతాల్లో జమ చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ నాడు చంద్రబాబు దుష్ఫ్రచారం చేశారు.దానికి ఎల్లో మీడియా తందాన పాడింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ 19 నెలల్లోనే ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు అప్పులు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో.. చంద్రబాబు సర్కార్ కేవలం 19 నెలల్లోనే 90.87 శాతం అప్పులు చేసింది. అయినా సరే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు నీళ్లొదిలారు. -
మోసాల ద్వారా బాబు సర్కారు యువత లక్ష్యాలకు అడ్డుపడుతోంది
సాక్షి, అమరావతి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని, కానీ... రాష్ట్రంలో యువత అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలను విస్మరించి యువతకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఆయన పాలన యువత, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకొనే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన బోధనలను గుర్తుచేస్తూ... చంద్రబాబు యువతకు చేసిన మోసాలను ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతాలో సోమవారం పోస్ట్ పెట్టారు. చంద్రబాబు పాలనలో 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్, రూ.4,900 కోట్ల విద్యా దీవెన, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు పేరుకుపోయాయని ధ్వజమెత్తారు.టీడీపీ కూటమి మేనిఫెస్టో వాగ్దానమైన యవతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి రెండేళ్లుగా చెల్లింపు లేదని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టీఫికేషన్ కోర్సులు నిలిపేశారని పేర్కొన్నారు. ఇలా మోసాలకు పాల్పడడం ద్వారా చంద్రబాబు సర్కారు యువత వారి లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. వివేకానంద ప్రముఖ సూక్తిని ప్రస్తావిస్తూ ‘‘ఇకనైనా కదలండి.. మేల్కోండి.. యువత వారి లక్ష్యాల సాధనకు తోడ్పడండి’’ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
ఏపీ ప్రభుత్వం కొత్త ఆదాయం టార్గెట్ రూ. 13 వేల కోట్లు
విజయవాడ: రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ప్రజల నుండి ఈ ఆదాయాన్ని వసూలు చేసేందుక కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ. 13 ఏల కోట్లు కొత్త ఆదాయం టార్గెట్ను పెట్టకున్నట్లు హెచ్ఓడీ సదస్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు. SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం సాధించాలనే ప్రతిపాదించారు. 55వ GST కౌన్సిల్ సమావేశంలో సెస్ పరిశీలనలో ఉంది. ఇక ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు సాధించే ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు. -
AP: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్
విజయవాడ: మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మద్యం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం(జనవరి 12వ తేదీ) మద్యం ధరలకు పెంపునకు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలు తగ్గిస్తానని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వగా, ఇప్పుడు మాత్రం ధరలను పెంచుకుంటూ వెళుతున్నారు. బాటిల్పై రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో బాటిల్పై రూ. 10 పెంచిన బాబు సర్కార్.. ఇప్పుడు మరో రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు లిక్కర్ సిండికేట్కు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైంది. బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించింది. అయితే సంక్రాంతి పండుగను క్యాష్ చేసుకోవడానికే ఏపీ ప్రభుత్వం మద్యం ధరను పెంచిందని పలువురు విమర్శిస్తున్నారు. సంపద సృష్టిస్తానని పదే పదే ఎన్నికల్లో ప్రచారం చేసిన బాబు.. మరి ఇప్పుడు లిక్కర్ ధరల పెంపు ద్వారా సంపద సృష్టిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గత గురువారం (జనవరి 8 వ తేదీన) సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోగా, తాజాగా పెంపునకు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం చేకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
మూల్యం చెల్లించాల్సిందే!
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: పంట ఉత్పత్తుల కోత.. ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు చెప్పడం.. సంప్రదాయాలను పాటించడం.. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం.. బంధాలను బలోపేతం చేసుకోవడం.. పిండి వంటలు వండుకోవడం.. నూతన వస్త్రాలు, వాహనాలలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం.. సుదూర ప్రాంతాల నుంచి తరలిరావడం.. పండగ నాలుగు రోజులు సొంతవారితో సందడి చేయడం.. ఇలా సంక్రాంతి పండుగల్లో అన్నీ ఆనందకరమైన విషయాలే. కాని పంటి కింద రాయిలా ఈ ఏడాది పండగకు నిత్యావసర వస్తువులు.. కూరగాయలు.. రొయ్యలు, చేపలు, మాంసాహారాలు.. బస్సు టిక్కెట్లు, వెండి, బంగారాలు ఇలా ప్రతీ ధరలు నింగినంటడంతో సామాన్యులకు పండుగ భారంగా మారింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగదు బదిలీ పథకాల వల్ల ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు కనపడేవి. దీంతో వారిలో కొనుగోలు శక్తి పెరిగి నగదు చెలామణీ జరిగేది. ప్రభుత్వం మారాక నగదు బదిలీలు లేకపోవడం.. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడకపోవడంతో ఏం కొనాలన్నా నాలుగుసార్లు ఆలోచించాల్సిన దుస్థితి నెలకొంది. హతవి«దీ.. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంతో మూల్యం చెల్లించుకుంటున్నామని ప్రజలు ఆలోచనలో పడ్డారు.పిండి వంటలకు ధరా ఘాతం నూనె, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పిండి వంటల పేరు చెబితేనే సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. 2024 పండగతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు కిలో వంట నూనె ధర సగటున రూ.140 వరకు ఉండగా నేడు రూ.160కి పెరిగింది. కందిపప్పు రూ.120, మినపప్పు కేజీ రూ.80 నుంచి రూ.110, పెసరపప్పు రూ.90 నుంచి రూ.120 వరకు పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం తాజాగా చిక్కీ గోధుమ పిండి ఇస్తామని కేవలం అమలాపురం పట్టణంలో 11,634 కార్డుదారులకు మాత్రమే పరిమితం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం (ఫోరి్టఫైడ్) అందించేవారు. అరకిలో పంచదార, కిలో చొప్పున కందిపప్పు, గోధుమ పిండిని వినియోగదారులకు అందజేసేవారు. బాబు వచ్చిన తరువాత కందిపప్పును నిలిపివేశారు. రాకపోకల్లో బాదుడు.. సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ప్రాంతాలలో ఉన్నవారు తమ సొంతూళ్లు అయిన గోదావరి జిల్లాలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు ఆర్టీసీ బస్సులు, రైళ్లు సీట్లు లేకపోవడం ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ దోపిడీకి గురవుతున్నారు. హైదరాబాద్ నుంచి అమలాపురానికి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి.బస్సులలో నాన్ ఏసీ సీటింగ్ రూ.1,500 నుంచి రూ.1,800 వరకు ఉంది. నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.1,800 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సీటింగ్ ధర రూ.రెండు వేల నుంచి రూ.2,800 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు పలుకుతోంది. తొమ్మిదో తేదీన అయితే ఏకంగా రూ.2,600 నుంచి రూ.నాలుగు వేల వరకు ఉండడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే జనవరి 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సీటింగ్ ధర రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ఉండగా, స్లీపర్ ధరలు రూ.2,500 నుంచి రూ.ఐదు వేల వరకు ఉండడం గమనార్హం. కోడి.. చేప.. రొయ్య.. ఆలోచనే రానంతగా.. సంక్రాంతి పండగ ప్రభావంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది. పందెం కోడి పుంజు రకాన్ని బట్టి రూ.ఐదు వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉంది. నాటు కోడి పెట్ట రకాన్ని బట్టి రూ.1,500 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. బ్రాయిలర్ లైవ్ ధర రూ.190 వరకు ఉండగా, లేయర్ లైవ్ ధర రూ.120 పలుకుతోంది. ఇక మాంసం ధరలకు వస్తే బ్రాయిరల్ కేజీ రూ.300 వరకు ఉండగా, లేయర్ కేజీ రూ.240 వరకు చేరింది. వనామీ రొయ్యల ధర 100 కౌంట్ కేజీ ధర రూ.250 వరకు ఉండగా, చందువా చేప కిలో రూ.500, పండుగప్ప రూ.400 వరకు పలుకుతోంది.పండగ కానుకలు లేవు రేషన్ దుకాణాల ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బియ్యంతో పాటు పంచదార, నెయ్యి, ఆయిల్, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పండుగనే కాకుండా ఇతర రోజుల్లోనూ కూడా ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతి వస్తువు అధిక ధరలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. బయట నిత్యావసర వస్తువులు మండిపోతున్నాయి. – మట్టపర్తి విజయ్ కుమార్, గంగలకురు అగ్రహారం, అంబాజీపేట మండలం -
నిమ్మళంగా ముంచింది
పెరవలి: నిమ్మ మార్కెట్ కుదేలై రైతులు విలవిలలాడుతున్నారు. మార్కెట్లో కాయల నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20కి కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోయకుండా తోటల్లోనే వదలివేస్తున్నారు. గతంలో ధరలు లభించిన సమయంలో తెగుళ్ల వల్ల దిగుబడి తగ్గి నష్టాలపాలయ్యారు. ఇప్పుడు దిగుబడి ఉన్నా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారు. ఒక బస్తా నిమ్మకాయలు (50 కిలోలు) మార్కెట్లో కాయ సైజుని బట్టి ప్రస్తుతం రూ.800 నుంచి రూ.1000కు కొనుగోలు చేయడంతో కోత, రవాణా ఖర్చులకు కూడా సరిపోవడం లేదని దీనంగా చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో బస్తా నిమ్మకాయలు రూ.1800 నుంచి రూ.2100కు కొనుగోలు చేశారు.వ్యాపారులు నేడు మార్కెట్లో వీటి వంక చూసేవారు లేరని రైతులు దిగులు చెందుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పతనమయ్యాయని చెపుతున్నారు. కోత కోయాలంటే ఇద్దరు కూలీలు అవసరం ఉంటోందని, వీరికే రూ.వెయ్యి అవుతున్నదని ఇక రవాణా ఖర్చులు, మార్కెట్లో కమీషన్ తీసేస్తే చేతికి ఏమీ రావడం లేదని వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో రూ.60 నుంచి రూ.80 పలికేది. ఒక బస్తా నిమ్మకాయలకు నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4000 వచ్చేదని ఇప్పడు కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని, ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవటం లేదని వాపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో 3200 హెక్టార్లలో సాగవుతోంది. పెరవలి, దేవరపల్లి, చాగల్లు, నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి, రాజానగరం, సీతానగరం, అనపర్తి మండలాల్లో సాగవుతోంది. పెరవలి మండలంలో నిమ్మసాగు ఖండవల్లి, లంకమాలపల్లి, ముత్యాలవారిపాలెం, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముక్కామల గ్రామాల్లో 50 ఎకరాల్లో సాగవుతుండగా ఈ రైతులందరూ నష్టాలకు గురవుతున్నారు. ఒక ఎకరం నిమ్మ పంటలో ఏడాదికి దిగుబడి 5 నుంచి 6 టన్నులు వస్తుంది. సాగుపై ఆధారపడి.. తూర్పుగోదావరి జిల్లాలో నిమ్మసాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మంది రైతులు, వ్యాపారులు, కూలీలు, రవాణా దారులు ఈ సాగుపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు లేకపోవటంతో ఇటు కూలీలకు, వ్యాపారులకు, సంచులు సరఫరా చేసే వ్యాపారులకు, కోత కూలీలకు, జట్టు కూలీలకు పనులు అంతంత మాత్రంగా ఉండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ధరలిలా.. నిమ్మకాయలకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బస్తా ధర రూ.1800 నుంచి రూ.2100 పలికితే నేడు అదే నిమ్మకాయలు రూ.800 నుంచి రూ.వెయ్యి పలకడంతో రైతులు నష్టాల ఊబిలో కూరుపోతున్నారు. అది కూడా కాయలు బాగుంటే ఈ ధర వస్తున్నదని లేకపోతే మరో రెండు వందలు తక్కువకు అడుగుతున్న పరిస్థితి. పెట్టుబడి తప్పటం లేదు ఒక ఎకరం నిమ్మ సాగుకు ఏడాదికి రూ.25 నుంచి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ప్రస్తుత ధరల వల్ల నిమ్మకాయలకు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు.వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సీజన్లో తెగుళ్ల బెడద, దిగుబడి వచ్చే సమయంలో ధరల సమస్య నిమ్మరైతులను కుంగదీస్తోంది. మరోవైపు ఈ నిమ్మను వాడటానికి సీజన్ కాకపోవడం, శుభకార్యాలు లేకపోవడంతో వీటి వినియోగం బాగా తగ్గిందని అందుకే నిమ్మధరలు పతనమయ్యాయని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్లో అన్ని రకాల పండ్లు తక్కువ ధరలకే లభించడం, వీటి ఉపయోగం అంతంతమాత్రంగా ఉండటం మరో కారణంగా చెప్పవచ్చు. ఇంత పతనం ఎన్నడూ లేదు గతంలో ఎన్నడూ ఇంతటి తక్కువ ధరలు పలకలేదు. నేడు మార్కెట్లో కిలో నిమ్మకాయలు నాణ్యతను బట్టి రూ.15 నుంచి రూ.20కు కొనుగోలు చేస్తున్నారు. దీనితో కోత ఖర్చులు కూడా రావటం లేదు. నష్టాల పాలవుతున్నాం. – చిట్టీడి సూరిబాబు, నిమ్మరైతు, ముత్యాలవారిపాలెంఅదనపు ఖర్చులవుతున్నాయి సీజన్ లేకపోయినా ధరలు బాగానే ఉండేవి. నేడు కోత ఖర్చులు రావటం లేదు. అదనంగా రవాణా, సంచుల ఖర్చులు అవుతున్నాయి. కోయకుండా వదిలేస్తే చెట్లు దెబ్బతింటాయి. కోస్తే జేబులో సొమ్ము అదనంగా ఇవ్వాల్సి వస్తోంది. – వలవల బాలాజీ, రైతు ముక్కామల గత ప్రభుత్వంలో రూ.4 వేలునిమ్మసాగు చేపట్టి పదేళ్లు అయ్యింది. ఇంతటి తక్కువ ధరలు ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో 50 కిలోల బస్తా నాణ్యతను బట్టి రూ.2500 నుంచి రూ.4 వేలకు కొనుగోలు చేశారు. అదే బస్తా నేడు రూ.800 నుంచి రూ.వెయ్యి పలుకుతోంది. – నిడదవోలు శ్రీనివాస్, రైతు ముక్కామల -
కన్వర్షన్ చేయరు.. పదోన్నతులు ఇవ్వరు..
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ బోర్డులో పోస్టుల మార్పుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పోస్టుల విభజన చేసిన ప్రభుత్వం కొన్ని పోస్టుల కన్వర్షన్పై ఎటూ తేల్చడం లేదు. దీంతో కమిషనరేట్ అధికారులు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు ఎఫ్ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగిస్తున్నారు. అయితే ఈ విధానంలో తమకు అన్యాయం జరుగుతోందని సీనియర్లు ఆరోపిస్తున్నారు. పైరవీలు చేసుకున్న వారికే అధికారులు అవకాశం కల్పిస్తున్నారని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జిల్లాకు ఒక్క అధికారే ఉండేలా..ఉమ్మడి జిల్లాల్లో జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(డీవీఈవో), డిప్యూటీ వొకేషన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్/ ఏవో, ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి (ఆర్ఐవో) పోస్టులు ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పోస్టుల రీ ఆర్గనైజేషన్ చేస్తూ జిల్లాకు ఒక్కరే అధికారి ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో డీవీఈవో పోస్టును జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీఐఈవో)గా మార్చారు. ప్రస్తుతం పాత జిల్లాలకు డీఈవోలు ఉండగా, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఇన్చార్జిలే దిక్కుగా ఉన్నారు.ఇదీ పరిస్థితిరాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత ఇంటర్మీడియట్ బోర్డులో జిల్లా స్థాయి పోస్టులతో సహ ఉద్యోగులను జిల్లాలకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో ఏవో/ డిప్యూటీ జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషనల్ (డీఐఈవో) అధికారి పోస్టులను కొత్త జిల్లాలకు కేటాయించారు. దీంతో పాటు ఆ పోస్టులను జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ అధికారిగా మార్చాలని (కన్వర్షన్) అధికారులు ప్రభుత్వానికి, ఆర్థికశాఖకు ఫైల్ పంపారు.దీనిపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే, జిల్లా వొకేషన్ ఎడ్యుకేషనల్ అధికారి పోస్టు పేరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా మార్పుచేశారు. దీంతో పాత జిల్లాల్లోని డీవీఈవోలు డీఐఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కొత్త జిల్లాలకు మాత్రం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఐఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరు తమ కాలేజీ నిర్వహణతో పాటు జిల్లా బాధ్యతలు కూడా చూస్తూ ఒత్తిడికి గురవుతున్నారు. -
లిక్కర్ సిండికేట్కు సంక్రాంతి కిక్కు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ జీవోతో మాకేం సంబంధం లేదు.. ప్రభుత్వమే మాది.. మా దోపిడీని ఆపేదెవర్రా.. అన్నట్లుంది రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ బరితెగింపు. మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కాకముందే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేసి, మూడు రోజులుగా అనధికారికంగా దోపిడీకి తెగబడుతున్నారు. అందుకు ఎక్సైజ్ అధికారులు అడ్డుకోకుండా చూస్తామని చెప్పి.. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు సంక్రాంతి సీజన్ వేళ మద్యం దుకాణాల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేశారు. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచుతూ ఈ నెల 8న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించింది. ఒక్కో బాటిల్పై రూ.10 పెంపునకు నిర్ణయించింది. కాగా, అందుకు అనుమతినిస్తూ అధికారికంగా జీవో ఇంకా విడుదల కాలేదు. అంటే మద్యం ధరల పెంపు అధికారికంగా ఇంకా అమలులోకి రాలేదు. కానీ ఈ అధికారిక ప్రక్రియతో తమకు సంబంధం లేదంటూ మద్యం సిండికేట్ బరితెగించింది. ఈ నెల 9 నుంచే మద్యం ధరలు పెంచేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో ధరల పెరుగుదల అనధికారికంగా అమలులోకి వచ్చేసింది. ‘ముఖ్య’ ప్రజా ప్రతినిధి దన్ను ఉండటంతో ఎక్సైజ్ శాఖ చోద్యం చూడటం మినహా ఏమీ చేయలేక పోతోంది.సంక్రాంతి స్పెషల్ బాటిల్పై రూ.10 అదనం అంటే ఏముందీలే అనుకోవద్దు. ఎందుకంటే రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాలు, 540 బార్లు ఉన్నాయి. వాటిలో నెలకు 6 లక్షల కేసుల వరకు మద్యం విక్రయిస్తున్నారు. రోజుకు దాదాపు రూ.100 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. అనధికారికంగా బాటిల్పై రూ.10 పెంపుదలతో రోజుకు రూ.5 కోట్లు చొప్పున అనధికారికంగా కొల్లగొడుతున్నారు. ఇలా మూడు రోజులుగా రూ.15 కోట్ల వరకు దందా సాగించారు. ఇక సంక్రాంతి సీజన్ను సొమ్ము చేసుకునేందుకు మద్యం సిండికేట్.. బెల్ట్ దుకాణాల్లో మరో రూ.5 అదనంగా పెంచింది. అందుకోసమే ఏకంగా 75 వేల వరకు బెల్ట్ దుకాణాలను బరితెగించి మరీ ఏర్పాటు చేసింది. మద్యం ధర పెంపు జీవో వచ్చిన తర్వాత కూడా అధికారిక పెంపుదల రూ.10తోపాటు అనధికారికంగా మరో రూ.10 పెంపుదలకు సిండికేట్ ఇప్పటికే నిర్ణయించింది. వెరసి ఒక్కో బాటిల్పై రూ.15 అదనపు దోపిడీ ఇకపై కూడా వర్తించనుందన్నది సుస్పష్టం. కూటమి ప్రజాప్రతినిధులకు మామూళ్లుమద్యం సిండికేట్ డిమాండ్ను తమ ప్రభుత్వం ఆమోదించి ధరలు పెంచింది కాబట్టి.. తమకు మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో సిండికేట్.. ఒక్కో మద్యం దుకాణం నుంచి రూ.50 వేలు, ఒక్కో బార్ నుంచి రూ.2 లక్షలు చొప్పున వసూలు చేసి కూటమి ప్రజా ప్రతినిధులకు ముట్టజెబుతోంది. ఆ ప్రకారం రాష్ట్రంలో 3,636 మద్యం దుకాణాల నుంచి రూ.18.18 కోట్లు, బార్ల నుంచి రూ.10.80 కోట్లు కూటమి ప్రజా ప్రతినిధులు వసూలు చేశారు. మద్యం దుకాణాల నుంచి సంక్రాంతి మామూళ్ల వసూళ్ల ప్రక్రియను కూటమి ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. -
సంక్రాంతి వేళ సంప్రదాయ సంబరాలు
సాక్షి, అమరావతి: ‘ప్రకృతి ఒడిలో పసిడి కాంతుల పరవశం.. ముంగిట ముగ్గులు.. మురిపించే గొబ్బెమ్మలు.. హరిదాసుల కీర్తనలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. ఆకాశంలో గాలిపటాల విన్యాసాలు.. అంబరాన్నంటే కేరింతలు.. కొత్త బియ్యం పాయసాలు.. కమ్మని నెయ్యి పరిమళాలు.. భోగి మంటల వెచ్చదనం.. ఆతీ్మయ కలయికల మాధుర్యం.. రైతు కంట ఆనందం.. ఇంటింటా సంక్రాంతి వైబోగం..’ అంతటితో సరిపెడితే ఎలా అనుకున్నారో ఏమో.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేకత చాటుకునేలా సంక్రాంతి కోలాహలాన్ని కొనసాగిస్తూ మరింత జోష్ నింపుతున్నారు. పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి వేళ ప్రత్యేక సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తూనే మరింత సందడి నింపేలా చేస్తున్న కార్యక్రమాలు ఆ ప్రాంతాలకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాయి. అవి ఏమిటంటే.. కత్తులు దూసే పందెం కోళ్లు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మూడు రోజులపాటు నిర్వహించే కోడి పందాలకు పెద్ద క్రేజ్ ఉంది. పల్నాటి బ్రహ్మనాయుడు, నాగమ్మ మధ్య పోరాటంలో కోడి పందేలు సైతం పౌరుషాన్ని చాటాయని చరిత్ర చెబుతుండగా.. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. తొలినాళ్లలో కత్తులు కట్టకుండా సరదాగా నిర్వహించిన కోడి పందేలు రానురాను సంప్రదాయం ముసుగులో జూదాల జాతరను తలపించేలా సాగుతున్నాయి. తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలనూ కోడి పందేలు తాకాయి.ప్రధానంగా భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, దెందులూరు తదితర ప్రాంతాల్లో నిర్వహించే భారీ పందేలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వస్తుంటారు. నెత్తురోడుతున్నా గెలుపు కోసం జూలు విదిల్చి కత్తులు దూసే కోడి పందాల్లో బెట్టింగ్లకు పలు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన వారు సంక్రాంతికి ఈ ప్రాంతానికి వ్యయ ప్రయాసలకోర్చి చేరుకుంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు ఈ ప్రాంత వాసులు ప్రత్యేక బస ఏర్పాట్లు చేయడంతోపాటు విందు, వినోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇప్పుడు భారీ టెంట్లు, ఫ్లడ్లైట్లు కాంతులు, ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, బౌన్సర్లు, అతిథులకు విందు, వినోదాలతో కోడి పందేలు నిర్వహించే తీరు అబ్బో అనిపిస్తుంది.ప్రభల తీర్థం.. కోనసీమ ప్రత్యేకం 400 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రభల తీర్థం కోనసీమ ప్రాంతానికి ప్రత్యేకం. కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రభల తీర్థం భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శైవ ఉత్సవంగా నిర్వహించే ప్రభల తీర్థంలో సమీపంలోని 11 గ్రామాల నుంచి 11 ప్రభలు (తడికెలు, కర్రలతో తయారు చేసినవి) తీసుకొస్తారు. ఏకాదశ రుద్రులుగా పరిగణించే ప్రభలను వరి పొలాలు, కాలువలు, కౌశిక నది (గోదావరి పాయ) దాటి తీసుకుని వచ్చి జగ్గన్నతోట ప్రాంతంలో కొబ్బరి తోటల్లో ఉంచుతారు.ఎడ్ల పందేలు చూసి తీరాల్సిందే.. సంక్రాంతి వేళ ముఖ్యంగా కనుమ రోజున పశువులను పూజించి ఆ మరుసటి రోజు నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడ్ల అందాల పోటీలు, బండ లాగుడు పోటీలు, పరాక్రమ పోటీలు నిర్వహించడం ఆచారంగా మారింది. తొలినాళ్లలో రైతులు నిర్వహించిన ఈ పోటీలు రానురాను ప్రత్యేక ప్రదర్శన, ఆకర్షణగా మారాయి. రాష్ట్రంలో ప్రధానంగా ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడ్ల పరుగు పందేలు, బరువైన బండ్లను లాగుతూ వేగంగా పరిగెత్తించడం, ఒంగోలు గిత్తల ప్రదర్శన వంటి పోటీలు నిర్వహించడంతో వేల సంఖ్యలో తిలకించేందుకు వస్తారు. జల్లికట్టు.. ప్రాణాలతో చెలగాటమే తమిళనాడుకు చెందిన జల్లికట్టును ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అనేక గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా పశువుల పండగను పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తుంటారు. అదుపు తప్పి పరుగులు తీసే ఎద్దులకు ఎదురెళ్లి కట్టడి చేసేందుకు యువకులు ప్రాణాలతో చెలగాటం ఆడుతూ జల్లికట్టులో పాల్గొంటారు. ఎద్దులను, గిత్తల కొమ్ములకు కట్టిన జెండాలను చేజిక్కించుకునే క్రమంలో వాటి కొమ్ములు దిగి, కాళ్ల కింద నలిగి గాయాలపాలైనా వాటిని కట్టడి చేసేందుకు చేసేందుకు ప్రయత్నిస్తారు.గుర్రపు పందేలు.. పందుల పందేలు.. సంక్రాంతి రోజుల్లో ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాలోని కొన్నిచోట్ల గుర్రపు పందేలు నిర్వహిస్తుంటారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వినోదం కోసం పందులు, పొట్టేళ్ల పందేలు నిర్వహించడం జరుగుతోంది. -
పట్టణ ఆరోగ్య కేంద్రాలు నిర్వీర్యం!
సాక్షి, అమరావతి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం, విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూపీహెచ్సీలు)ను సైతం నిర్విర్యం చేస్తోంది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీహెచ్సీలు మూతపడేలా చంద్రబాబు సర్కార్ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోంది. సెలవుల్లో సైతం అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సుల కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన క్యాజువల్ లీవ్లను.. ప్రస్తుత ప్రభుత్వం సగానికి సగం కుదించేసింది.తద్వారా యూపీహెచ్సీలు మూత పడే పరిస్థితి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 560 యూపీహెచ్సీలను వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. పండుగలు, ప్రత్యేక సెలవు దినాల్లో సైతం ఆరోగ్య కేంద్రాలు పనిచేసేలా అప్పట్లో చర్యలు తీసుకుంది. సెలవు రోజుల్లో కూడా స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండి.. ప్రజలకు వైద్య సేవలు అందించేలా వారికి 35 రోజుల క్యాజువల్ లీవ్లు(సీఎల్స్) మంజూరు చేసింది. దీంతో పండుగలు, ఇతర సెలవు రోజుల్లో మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరవ్వకపోయినా.. స్టాఫ్ నర్స్లు మాత్రం ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలందించేవారు.ఆ నర్సులు అదనంగా మంజూరైన సెలవులను తమకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుండేది. కానీ, ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెల 24న వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్య కేంద్రాల నర్సులకు కూడా 15 సీఎల్స్ మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల నర్సులు సెలవు దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తి.. ఆరోగ్య కేంద్రాలకు తాళాలు పడతాయని తెలిసినా చంద్రబాబు సర్కార్లో మాత్రం చలనం లేదు. -
కూలీలకు డబ్బుల్లేవ్... పనులకు కోత కూలిన ‘ఉపాధి’!
సాక్షి, అమరావతి: ఎండల్లో చెమటోడ్చి చేసిన పనికి కూలి డబ్బులు ఇవ్వకుండా చంద్రబాబు సర్కార్ నిరుపేదలను వేధిస్తోంది. ఒకపక్క ఉపాధి పనుల్లో కోత.. మరోపక్క దాదాపు ఆరు నెలలుగా కూలి డబ్బులు అందక నిరుపేదలు నరక యాతన పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు పండగ పూట సైతం పస్తులతో గడపాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో లక్షలాది పేద కుటుంబాల్లో సంక్రాంతి సంతోషం ఛాయలు కానరావడం లేదు. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజులకు మించి ఉపాధి కూలీలకు కూలి డబ్బులు బకాయి పెట్టకూడదని కేంద్ర చట్టం చెబుతోంది.అయితే రాష్ట్రంలో గతేడాది ఆగస్టు 10 తర్వాత ఉపాధి కూలీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కూలీలకు రూ.425 కోట్ల మేర కూలి డబ్బుల బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. జనవరి 10వతేదీ నాటికి కూలీలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.454 కోట్లకు పెరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కూలి డబ్బులపై ఆధారపడి జీవనం సాగించే లక్షలాది నిరుపేద కుటుంబాలు రోజువారీ అవసరాల కోసం అల్లాడుతున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.‘ఉపాధి’ బకాయిలు ఏపీలోనే అత్యధికం దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల పార్లమెంట్కు ఇచ్చిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ.1,766 కోట్లు వేతన బకాయిలు ఉండగా అందులో నాలుగో వంతు ఏపీలోనే ఉండటం గమనార్హం.పనులు భారీగా తగ్గుదల..మరోవైపు గత ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పన కూడా భారీగా తగ్గిపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య 21.75 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ పేదలను ఆదుకోగా.. చంద్రబాబు సర్కారు 2025 ఏప్రిల్ – డిసెంబరు మధ్య కేవలం 16.29 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించింది. గత ప్రభుత్వంతో పోలిస్తే దాదాపు ఐదున్నర కోట్ల మేర పని దినాల కల్పన తగ్గిపోవడం గమనార్హం.తగ్గిపోయిన లబ్ధిదారులు.. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 47 లక్షల కుటుంబాలకు చెందిన 75 లక్షల మంది పేదలు ఏటా వ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి హామీ పనులు చేసుకుంటూ ప్రయోజనం పొందుతుంటారు. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో 75.43 లక్షల మంది కూలీలు 25.30 కోట్ల పనిదినాల ద్వారా రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. అదే 2025 ఏప్రిల్ నుంచి 2026 జనవరి 10 వరకు కేవలం 41 లక్షల కుటుంబాలకు సంబంధించి 65 లక్షల మంది ఉపాధి కూలీలకు రూ.4,400 కోట్లు మాత్రమే ప్రయోజనం చేకూరింది.నిరుపేద ఎస్సీలకు కోత..చంద్రబాబు సర్కారు వచ్చాక ఉపాధి హామీ పధకం పనులు భారీగా తగ్గిపోవడంతో నిరుపేద ఎస్సీలే అధికంగా నష్టపోయారు. 2023–24లో గత ప్రభుత్వం కల్పించిన మొత్తం 25.30 కోట్ల పనిదినాల్లో 22.41 శాతం మేర పనిదినాలు ఎస్సీలకే దక్కాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం 2025–26లో కల్పించిన 16 కోట్ల పనిదినాల్లో ఎస్సీలు కేవలం 20.60 శాతం పనిదినాలు మాత్రమే పొందగలిగారు.పండుగ చేసుకునే పరిస్థితి లేదుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఉపాధి హామీ పథకం కూలీల ఉసురు తీస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే గత ఐదు నెలల నుంచి రూ.454 కోట్లు వేతనాలు ఇవ్వలేదు. వేతనాలు సక్రమంగా వచ్చి ఉంటే ప్రతి కుటుంబానికీ కనీసం రూ.3 వేల మేర కూలి అందేది. ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా పేద కుటుంబాలైతే, పండుగ ప్రశాంతంగా జరుపుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం సంక్రాంతి లోపు కూలీలకు వేతన బకాయిలని్నంటినీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. – వి.వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపనులే కల్పించడం లేదు రెండు నెలలుగా మా గ్రామంలో ఉపాధి పనులు పెట్టలేదు. వర్షం పడిందని పనులు ఆపేశారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోవడం లేదు. పనులు పెట్టమని అడుగుతున్నాం. ఉపాధి పనులు చేస్తే మాకు కాస్త చేదోడుగా ఉంటుంది. పనులు ఉంటే చేతిలో కాస్త డబ్బులు ఉంటాయి. సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకునేవాళ్లం. అధికారులు స్పందించి మాగ్రామంలో ఉపాధి పనులు ఏర్పాటు చేయాలి. – దగ్గుమాటి శ్యామల, ఆత్మకూరు గ్రామం, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లాడబ్బులు జమ చేయడం లేదుఉపాధి హామీలో నేను పని చేసి నాలుగు నెలలైంది. అప్పటి నుంచి పని కల్పించడం లేదు. కనీసం మా ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. సంక్రాంతి పండుగ సమయంలో డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి సొమ్ములు ఖాతాలో జమ అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలి. – మెరుగు బాబూరావు, కొత్తూరు, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లాతినడానికి కూడా కష్టంగా ఉంది..ఉపాధి హామీ పనులే మాకు జీవనాధారం. ఈ పనులు చేసుకునే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. చేసిన పనులకు కూలి డబ్బులు పడకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తినడానికి కూడా కష్టంగా ఉంది. సంక్రాంతి పండుగ సమయంలో కూడా కూలి డబ్బులు పడకపోతే పస్తులు ఉండాల్సిందే. – గోదా వెంకట్రావు, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లాఎలా నెట్టుకురావాలో ?రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పనులు చేస్తేనే కుటుంబం గడిచేది. ఉపాధి హామీ పనులు చేసినప్పటికీ కూలి డబ్బులు ఇంతవరకు జమ కాలేదు. కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో తెలియక నానా కష్టాలు పడుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకుదెరువు కోసం మరో పని చూసుకోవాల్సిందే. త్వరగా కూలి డబ్బులు ఖాతాల్లో జమ అయ్యేలా చూడాలి. – వల్లెల మేరి, ఉపాధి హామీ కూలీ, కొత్తూరు, రాజుపాలెం మండలం, పల్నాడు జిల్లా -
సంక్రాంతి సంబరాల్లో కూటమి నేతల మాఫియా: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు నిర్వహించి వేల కోట్లు దోపిడి చేసేలా కూటమి నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా 450కి పైగా బరులు సిద్ధం చేశారని, ప్రతి నిర్వాహకుడి నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఒక్కో బరి వద్ద సగటున 40 వరకు పందేలు నిర్వహిస్తారని, ఒక్కో పందెం విలువ విలువ రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులకు వాటాలు చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇవే కాకుండా ఆ కోడి పందేల బరుల వద్ద ఫుడ్ స్టాళ్లు, లిక్కర్ అమ్మకాలు, కూల్ డ్రింక్స్, పేకాట డెన్లు నిర్వహిస్తూ అధికార పార్టీ నాయకులు మరో భారీ దోపిడీకి తెరదీశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సంక్రాంతి సంబరాల్లో ‘కేపీఎల్’:క్రికెట్లో ఐపీఎల్ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్’ (కోడి పందేల లీగ్)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు చేశారు. అసలు కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, పోలీసులతో కుమ్మక్కై వాటి ద్వారా వేల కోట్లు దోచుకునేందుకు కూటమి నాయకులు ఈ సంక్రాంతి సంబరాల్లో స్కెచ్ వేసుకున్నారు. పోలీస్ స్టేషన్కి రూ.10 లక్షలు ముట్టజెప్పి పందేలు నిర్వహించుకుందామని, మూడు రోజుల తమకు అదే పని అంటూ వారు మాట్లాడుకున్న వీడియో ఇందుకు సాక్ష్యం.పండగ వేడుకలనూ ఈవెంట్లా మార్చారు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పులు, ఈవెంట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. పెన్షన్ పంపిణీ పేరుతో ప్రతి నెలా 1న సీఎం చేస్తున్న ఈవెంట్, ఏటా స్కూళ్లలో రొటీన్గా జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను కూడా ఏ స్థాయిలో ఈవెంట్లా మార్చి హంగామా చేశారో చూశాం. ఇప్పుడు చివరకు సంక్రాంతి పండగను కూడా విడిచిపెట్టకుండా, ఆ వేడుకలను కూడా ఈవెంట్లా మార్చి దోపిడికి సిద్ధమయ్యారు. ఇటీవలే దసరా సందర్భంగా విజయవాడలో గొల్లపూడి వద్ద ఎగ్జిబిషన్ నిర్వహించి ఏం చేశారో చూశాం. కాగా, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలనూ ఈవెంట్లా మార్చిన కూటమి నాయకులు, యథేచ్ఛగా వేల కోట్ల దోపిడి పర్వానికి తెర తీశారని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. -
వడ్డెరలను రాజకీయంగా ప్రోత్సహించింది జగనే
సాక్షి, తాడేపల్లి: గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధ్యక్షుడిగా స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ వారికి ఎదురు నిలబడి వడ్డే ఓబన్న చూపిన తెగువను నాయకులు గుర్తుచేసుకున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి కార్యక్రమాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.వడ్డే ఓబన్న చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు వడ్డె రామదాసు వంటి వడ్డెర నాయకులను ఈ సందర్భంగా కీర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వడ్డెర సంక్షేమం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కృషిని రాజకీయంగా ఇచ్చిన ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు మాచర్ల, చీమకుర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు చైర్మన్లుగా గుంటూరు జెడ్పీ వైయస్ చైర్ పర్సన్గా వడ్డెర కులస్తులకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామని చెప్పారు. వడ్డెర కులస్తులతో వైఎస్ కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రోత్సహిస్తే.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కూడా మరింత ముందుకు తీసుకెళ్లారని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ, పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా జెడ్పీ వైఎస్ చైర్పర్సన్ బత్తుల అనూరాధ, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, పార్టీ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బత్తుల రామారావు, చిత్తూరు జిల్లా పార్టీ సోషల్ మీడియా అడ్వైజర్ పవన్, హైకోర్టు అడ్వకేట్ బేబీ రాణి, వివిధ పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. -
తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు ఓబన్న: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఓబన్న జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు నేల గర్వపడే పోరాట యోధుడు, స్నేహానికి అర్థం చెప్పిన రేనాటి వీరుడు వడ్డే ఓబన్న. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సైన్యాధిపతిగా ఉంటూ బ్రిటిష్ సామ్రాజ్యానికే సవాల్ విసిరిన ఓబన్న జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/IZfKKe17d7— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2026 వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు నిర్వహించారు. వడ్డే ఓబన్న చిత్ర పటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ మూర్తి, పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. -
సెలవు రోజుల్లోనూ పనిచేయాల్సిందే
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా ఐదు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చినప్పటికీ.. సచివాలయాలు మాత్రం పనిచేయాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలకు లిఖితపూర్వక, మౌఖిక ఆదేశాలిచ్చారు. సంక్రాంతి పండుగ రోజులతో పాటు శని, ఆదివారాల్లో సచివాలయంలో ఎవరైనా ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండేలా విధులు కేటాయించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, సెలవు రోజుల్లో పనిచేసే ఉద్యోగులకు.. ఇతర పనిదినాల్లో తిరిగి సెలవు తీసుకునే వెసులుబాటు కలి్పంచకపోవడాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. -
సమాధానం చెప్పలేకే తిట్ల దండకం!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతి.. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తిట్ల దండకం అందుకున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో పోటీ పడి దూషణలకు దిగుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు, మంత్రులు వాటికి సమాధానాలు చెప్పాల్సిందిపోయి, దూషణల పర్వానికి దిగడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు, భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ చోరీ, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్బీఐ నివేదిక, పారిశ్రామిక ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ చేస్తున్న అవినీతిపై సాక్ష్యాధారాలతో గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. ఇదే సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండో దశలో మళ్లీ 50 వేల ఎకరాలు సమీకరిస్తుండటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తమకు అలవాటైన రీతిలో తిట్ల దండకాన్ని అందుకున్నారు. వారితో పాటు ఎల్లో మీడియా సైతం పోటీ పడి దూషణల పర్వానికి దిగింది.స్వలాభం కోసం ఎందాకైనా బాబు సిద్ధం⇒ స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి మోసాన్ని చేయడానికైనా సీఎం చంద్రబాబు వెనుకాడరన్నది రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిచూపడంతో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ⇒ 2014–19 మధ్య భూ సేకరణను కోర్టు కేసులతో సంక్లిష్టం చేసి చంద్రబాబు సర్కార్ చేతులెత్తేస్తే 130 కేసులను పరిష్కరించి, 2019–24 మధ్య 2,700 ఎకరాల భూమిని సేకరించి.. రూ.960 కోట్లతో మూడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. భోగాపురం ఎయిర్పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్ జగన్. 2026 నాటికి ఎయిర్పోర్టు సిద్ధమవుతుందని అప్పుడే చెప్పిన అంశాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీ నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడంతో బాబు అబాసుపాలయ్యారు. ⇒ 2019–24 మధ్య రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. ఎవరెవరి ఖాతాల్లో ఏ పథకం కింద ఎంత వేశామన్నది ఆధార్ కార్డులతో సహా ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదని.. అప్పుగా తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని వైఎస్ జగన్ నిలదీయడంపై కూడా వారెవరూ జవాబు చెప్పలేదని మేధావులు స్పష్టీకరిస్తున్నారు.⇒ ఇసుక నుంచి క్వార్ట్జ్ వరకూ ఎడాపెడా దోచేస్తూ.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నారని గణాంకాలతోసహా ఎత్తిచూపితే ఎందుకు వాటిపై స్పందించరని మేధావులు నిలదీస్తున్నారు. అమరావతి మదర్ ఆఫ్ స్కామ్స్ కాదా?⇒ బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యంత అధునాతన సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేల చొప్పున భవనాలను నిర్మిస్తుంటే.. రాజధానిలో చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తున్నారని ఎత్తిచూపుతూ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులను కి.మీ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే.. రాజధాని అమరావతిలో కిలోమీటర్కు రూ.180 కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నాని ఎత్తిచూపుతూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి నీకింత–నాకింత అంటూ దోచుకుంటున్నారని నిగ్గదీసి అడిగారు. దీనిపై కూడా సమాధానం రాలేదు. ⇒ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతమైన ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తోంది. దీని అభివృద్ధికి మరో రూ.లక్ష కోట్లు కావాలి. మొత్తంగా రూ.రెండు లక్షల కోట్లు. అంతపెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఎవరైనా రాజధాని నిర్మిస్తారా? అని వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకూ సమాధానం లేదు.⇒ ‘మచిలీపట్నంలో పోర్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పూర్తయింది. గన్నవరం ఎయిర్పోర్టు ఉంది. విజయవాడ–గుంటూరు మధ్యలో రహదారికి సమీపంలో లేదా విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారికి సమీపంలో రాజధానిని నిర్మించి ఉంటే తక్కువ ఖర్చుతో ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేది కాదా?’ అని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నకూ వారి నుంచి సమాధానం లేదు.సమాధానం చెప్పేందుకు నోరు పెగలట్లేదెందుకు?⇒ రాజ్యాంగంలో ఎక్కడైనా రాజధాని ప్రస్తావన ఉందా? వైఎస్ జగన్ చెప్పినట్టుగా సీఎం, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. ఇది అబద్ధమని సాక్ష్యాధారాలతో ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా?⇒ రివర్ బేసిన్లో, ముంపు ప్రాంతంలో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మించారా? అన్న వైఎస్ జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ⇒ కొండవీటి వాగు, పాల వాగు వరద వల్ల తరచుగా రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుండటం నిజం కాదా. ఈ వరద ముప్పును తప్పించడానికే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా? కొండవీటి వాగు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల చేపట్టలేదా? తాజాగా 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల చేపట్టింది వాస్తవం కాదా? ⇒ రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చి 11 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక పోవడం నిజం కాదా? రైతులకు అభివృద్ధి చేయకుండా ఇచ్చిన ప్లాట్లను కూడా చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇవ్వడం నిజం కాదా?⇒ తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్–8 రోడ్డు వంటి రోడ్ల విస్తరణ పేరుతో రైతుల ఇళ్లను కూడా సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుంటే.. ఈ అన్యాయంపై మంత్రి నారాయణను రైతు రామారావు ప్రశ్నిస్తూ ఆవేదనతో గుండె పగిలి చనిపోవడం నిజం కాదా?⇒ రెండో దశ భూ సమీకరణ చేసేందుకు వడ్లమానులో నిర్వహించిన గ్రామసభలో ఇదే అంశంపై మంత్రి నారాయణను రైతులు నిలదీయడం వాస్తవం కాదా? -
దారి దోపిడీకి ‘పచ్చ’జెండా!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీకి చంద్రబాబు సర్కారు డూడూ బసవన్న తరహాలో తలాడిస్తోంది. ప్రభుత్వ కీలక నేతకు రూ.వంద కోట్ల ముడుపుల మూట ముట్టజెప్పేందుకు పక్కా డీల్ కుదరడంతో అడ్డగోలు దందాకు సర్కారు పచ్చ జెండా ఊపింది. దీనికోసం ఆర్టీసీ స్పెషల్ సర్వీసుల్లోనూ భారీగా కోత విధించింది. ప్రయాణికులు అనివార్యంగా ప్రైవేటు ట్రావెల్స్పై ఆధార పడాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా కోటి మంది ప్రయాణికులను దోచుకునేందుకు పథక రచన చేసింది. రూ. కోట్లు దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ప్రయాణ వ్యవహారాలు చూసే కీలక మంత్రి మాఫియాకు అండగా నిలిచినట్టు సమాచారం. సంక్రాంతి అంటే ఆంధ్రనాట పెద్ద పండగ. ఉద్యోగ, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు, విద్యార్థులు సొంత ఊళ్లకు తరలివస్తారు. బంధు మిత్రులతో పండగ మూడు నాలుగు రోజులూ ఆనందంగా గడిపి తిరిగి కార్యస్థానాలకు వెళ్తారు. ఏటా సంక్రాంతికి దాదాపు 75 లక్షల మంది సొంతూళ్లకు వస్తారని అంచనా. వీరిలో సొంత వాహనాలు, రైళ్లు, ఆర్టీసీ బస్సులో వచ్చే వారిని మినహాయిస్తే దాదాపు 40 లక్షల మంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కాగా, ఈ ఏడాది ఆర్టీసీ సర్సీసుల్లో భారీ కోత విధించడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 50 నుంచి 60 లక్షల మంది ప్రయాణించక తప్పదని స్పష్టమవుతోంది. ఏటా సంక్రాంతికి వచ్చి వెళ్లే వారిలో 40 శాతం మంది హైదరాబాద్వాసులే ఉంటారు. అందుకే టీడీపీ సిండికేట్ హైదరాబాద్ బస్ సర్వీసులను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. ఆర్టీసీ సర్వీసులను కుదించేలా పావులు కదిపింది.ఆర్టీసీ దొంగాటఏటా సంక్రాంతి స్పెషల్ బస్సు సర్వీసుల వివరాలను ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశం నిర్వహించి మరీ వెల్లడించేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వ కీలక నేతతో డీల్ కుదరడంతో సంక్రాంతి స్పెషల్ బస్సులపై కేవలం చిన్న నోట్ విడుదల చేసి ఆర్టీసీ చేతులు దులిపేసుకుంది. అందులో హైదరాబాద్ నుంచి కేవలం 240 సర్వీసులే నిర్వహిస్తామని వెల్లడించడం గమనార్హం. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆర్టీసీ కనికట్టు చేసేందుకు యత్నించింది. హైదరాబాద్నుంచి ఏటా మాదిరిగానే సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతామని మరో చిన్న ప్రకటన మొక్కుబడిగా ఇచ్చింది. కానీ మొదటి ప్రకటనలో పేర్కొన్నట్టుగా వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసుల పట్టిక ఇవ్వక పోవడం గమనార్హం. అంటే టీడీపీ ట్రావెల్స్ సిండికేట్ దోపిడీకి వత్తాసు పలుకుతున్నట్టేనని ఆర్టీసీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.గతంలో హైదరాబాద్ నుంచి 2,500 సర్వీసులుకొన్నేళ్లుగా ఏటా సంక్రాంతి సీజన్లో హైదరాబాద్ నుంచి ఆర్టీసీ 2,500 బస్ సర్వీసులు నడిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి ముందు ఐదు రోజులపాటు రోజుకు 2,500 బస్ సర్వీసులు.. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణాల కోసం మూడు రోజులపాటు రోజుకు 2 వేల బస్ సర్వీసులు నిర్వహిస్తూ వచ్చింది. గత ఏడాది కూడా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్కు 2,100 బస్ సర్వీసులు నడిపారు. అయితే ఈసారి టీడీపీ సిండికేట్ అక్కడే దెబ్బ కొట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ 240 బస్ సర్వీసులను మాత్రమే నడుపుతామని తొలుత ప్రకటించింది. ఇక హైదరాబాద్ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు నుంచి కూడా కేవలం 102 బస్ సర్వీసులు, చెన్నై నుంచి కేవలం 15 బస్ సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలోని 28 జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య కేవలం 3,500 బస్ సర్వీసులనే నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించడం మాఫియాతో ప్రభుత్వం డీల్ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయి. మూడు నాలుగు రెట్ల చార్జీల బాదుడుప్రభుత్వంతో డీల్ కుదరడంతో టీడీపీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా భారీ దోపిడీకి తెగబడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సర్వీసుల్లో జనవరి 11 నుంచి 18 వరకు రానూపోనూ టికెట్లను జనవరి 1 నాటికే బ్లాక్ చేసేసింది. తద్వారా కృత్రిమ కొరత సృష్టించి ప్రయాణికులను హడలెత్తించింది. ఆ వెంటనే టికెట్ల రేట్లను ఐదు రెట్లు పెంచేసింది. ఆర్టీసీ బస్సుల కోతతో హీనపక్షంగా 50 లక్షల మంది ప్రైవేటు బస్సులపై ఆధార పడతారని అనుకున్నా.. రానుపోను అంటే కోటి మంది దోపిడీకి ప్రైవేటు మాఫియా పథక రచన చేసింది. ఇందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్కు దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వంలో కీలక నేతకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. గతేడాది సంక్రాంతి సీజన్లోనే ఆయనకు రూ.50 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి. ప్రయాణికులు రెట్టింపు కావడంతో ముడుపుల మూట కూడా రెట్టింపు చేసినట్టు సమాచారం. -
జంతు హింస, జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగా కోడి పందేలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం–1960, ఏపీ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. చట్టాల అమలులో విఫలమైతే తహసీల్దార్లు, పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.ఆయా జిల్లాల్లోని మండలాల్లో సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. కోడి పందేల పేరుతో బెట్టింగ్, ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను వాటిలోకి లాగుతున్నారని, దీంతో వారు ఆస్తులు కోల్పోయే పరిస్థితి వస్తోందంటూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పందేలను ఆపేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలోనూ హైకోర్టు పలు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... జంతు హింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు.తహసీల్దార్, ఎస్ఐలతో తనిఖీ బృందాలుసంయుక్త తనిఖీ బృందాల్లో తహసీల్దార్, ఎస్ఐ ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. వీరు తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫోటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని పేర్కొంది. ‘‘కోడి పందేలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? బరులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తదితర వివరాలను తెలుసుకునేందుకు తనిఖీ బృందాలు మండలాల పరిధిలోని గ్రామాలను సందర్శించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేయాలి.కోడి పందేలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు తక్షణమే చర్యలు చేపట్టాలి. అవసరమైతే 144 సెక్షన్ కింద ఉన్న అధికారాలను సైతం ఉపయోగించుకోవచ్చు. కోడి పందేల్లో ఉపయోగించిన, ఉపయోగించ తలపెట్టిన ఉపకరణాలు, పందేల సందర్భంగా వసూలు చేసిన డబ్బును జప్తు చేయవచ్చు’’ అని డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పునిచ్చారు. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమిల్లి జయంతి వాదనలు వినిపిస్తూ చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారని తెలిపారు. -
ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోండి
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్ /అల్లిపురం/ఒంగోలు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రోజూ అభ్యంతరకరమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ శనివారం పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణ మూర్తి తదితరులు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.ఇదే విషయమై వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, అనుబంధ సంఘాల చైర్మన్లు, నాయకులతో కలిసి విశాఖ నగర పోలీస్ కమిషనరేట్లో అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్కమల్కు ఫిర్యాదు అందజేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు.. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, పార్టీ నగర అధ్యక్షుడు కటారి శంకర్తో కలిసి ఫిర్యాదు చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్ చట్టం, ఐపీసీ నిబంధనల ప్రకారం యాంకర్, యాజమాన్యం రాధాకృష్ణ, చర్చలో పాల్గొని విషం చిమ్మిన విశ్లేషకుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం ఎయిర్పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వక్రీకరించాయి. ఇది జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే. – కొమ్మూరి కనకారావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, – అంకంరెడ్డి నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడుఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దహనం రామవరప్పాడు: విజయవాడ రూరల్ రామవరప్పాడు ఫ్లైఓవర్ సమీపంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ప్రధాన గేట్ వద్ద శనివారం వైఎస్సార్సీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వాఖ్యలను వక్రీకరించి, రాష్ట్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఏబీఎన్ డిబేట్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ జగన్పై విషం కక్కడాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. -
YSRCPలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ సీఈసీ సభ్యునిగా కూనదరాజు సత్యనారాయణరాజు (రాజోలు), పార్టీ అధికార ప్రతినిధిగా జి.వీరశేఖరరెడ్డి (ఉదయగిరి) నియమితులయ్యారు.కాగా, ఇటీవల తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి, సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. -
వైఎస్ జగన్పై అదే పనిగా వ్యక్తిత్వ హననం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపె రోజూ అభ్యంతరకమైన రాతలు రాస్తూ, వక్రీకృత వ్యాఖ్యలు చేస్తూ, కేవలం విమర్శల కోసమే డిబేట్లు నిర్వహిస్తున్న ఏబీఎన్ టీవీ, ఆంధ్రజ్యోతి పత్రిక అదేపనిగా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని వైఎస్సార్సీపీ ఆక్షేపించింది. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..:ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు: కొమ్మూరి కనకారావుఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు జర్నలిస్టు వెంకటకృష్ణ పైనా పోలీసులకు ఫిర్యాదు చేశాం. రెండు రోజుల క్రితం జగన్గారు మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, భోగాపురం ఎయిర్పోర్టు, పరిశ్రమలు, రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై స్పష్టంగా వివరించారు. అయితే ఆ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరిస్తూ, జగన్ అనని మాటలు అన్నట్లు చూపించడం ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ ప్రస్తావిస్తే, దాన్ని పూర్తిగా వక్రీకరించిన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆయనపై విరుచుకు పడుతూ, విచక్షణా రహితంగా కామెంట్ చేశాయి.జగన్పై వ్యక్తిగత ద్వేషంతో డిబేట్లు పెట్టి అదేపనిగా అక్కసు వెళ్లగక్కడం, నిందించడం, బురద చల్లడం, దుయ్యబట్టడం జర్నలిజం విలువలకు పూర్తిగా పాతరేయడమే కాకుండా, అది ప్రజాస్వామ్య విరుద్ధం. చంద్రబాబుపై అంత ప్రేమ ఉంటే, పేపర్, ఛానల్కు ఆయన పేరు, ఫోటో పెట్టుకోవాలి. అంతతప్ప, న్యూట్రల్ జర్నలిజమ్ పేరుతో అంత దిగజారి వ్యవహరించొద్దు. అందుకే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తగిన చర్య తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం.వాస్తవాలు ప్రస్తావిస్తే.. దుయ్యబడతారా?: అంకంరెడ్డి నారాయణమూర్తిరాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికీ వారికి స్పష్టత ఇవ్వలేకపోతోంది. తమకు ఇచ్చిన ప్లాట్లు అసలు ఎక్కడున్నాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో రైతు రామారావు గుండెపోటుతో మరణించాడు. ఈ వాస్తవాలను జగన్గారు ప్రశ్నిస్తే.. ఆయన అనని మాటలు అన్నట్లు, పూర్తిగా వక్రీకరిస్తూ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి విషం చిమ్మాయి. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్గారిని నిందించాయి. జగన్ విశేష ప్రజాదరణ ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అన్న విషయాన్ని కూడా మర్చి, విషం చిమ్ముతూ గతి తప్పి విపరీతంగా వ్యాఖ్యలు చేశాయి.రాజధాని ప్రాంతంలో తగిన నిర్మాణాలు, ఎలాంటి అభివృద్ధి లేకపోయినా వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాన్ని ప్రశ్నించడం తప్పా? ఆ ప్రాంత రైతుల సమస్యలు ప్రస్తావించడం నేరమా?. వాటికి ప్రభుత్వం తరపున ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వకాల్తా పుచ్చుకుని, తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, జగన్గారిపై విరుచుకు పడడం, పాతాళానికి దిగజారిన వారి జర్నలిజం విలువలను చూపుతోంది. అందుకే మీడియా ముసుగులో వారు చేస్తున్న అనైతిక పనులపై తగిన చర్య తీసుకోవాలని ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై ఇక్కడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పూర్తి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. ఇంకా ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామని నారాయణమూర్తి స్పష్టం చేశారు. -
‘కూటమి సర్కార్ అరాచకాలపై అలుపెరగని పోరాటం’
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రానున్న 45 రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు లక్షలాది మంది వస్తున్నారని అంబటి అన్నారు.సుధాకర్ బాబు మాట్లాడుతూ.. నేడు గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం జరిగిందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదలు కొని పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పని చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోకి వెళ్లి వైఎస్సార్సీపీ పని చేస్తోందని.. ఒక మహాయజ్ఞంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. వైఎస్ జగన్ ఒక్కరితో ప్రారంభించిన పార్టీ వేలాదిగా, లక్షలాదిగా, కోట్లాదిగా మారింది’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు.టీడీపీ, బీజేపీ, జనసేన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన సాగుతోంది. సోషల్ మీడియాను బలోపేతం చేసి కూటమి ప్రభుత్వంపై అలుపు ఎరుగని పోరాటం చేస్తాం’’ అని సుధాకర్బాబు చెప్పారు. -
దరఖాస్తుతో.. దేవుడి భూములు!
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆ«దీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మీక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకు ఇవ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మీక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్కు కల్పించింది. లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ధార్మీక పరిషత్కు కల్పించింది. అయితే గతంలో దేవదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్దేశించడం గమనార్హంనిన్న ఆమోదం.. నేడు జీవో.. రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల దేవుడి భూములను ఎలాంటి వేలం లేకుండా ధార్మీక సంస్థల పేరిట కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2025 మే 2వతేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత తుది మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా.. శుక్రవారం జీవో ఎంఎస్ నెంబరు 15 ద్వారా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే లీజు ధరలను సైతం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం. అధికారుల విచక్షణ మేరకు లీజు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు... రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో ఆలయాలు, సత్రాలు, మఠాలు పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో 4,244 ఎకరాల మేరకు అత్యంత విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. వీటిలో 1.55 కోట్ల చదరపు గజాలు ఖాళీ భూములుగానూ, మరో 50 వేల చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి. -
ప్రజల ఆస్తులు దోచిపెట్టడానికే పీపీపీ
సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని ఎంచుకున్నారని మే«ధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో నిరి్మంచిన ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతూ ప్రపంచంలో ఎన్నడూ చూడని అతిపెద్ద స్కామ్కు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నాచౌక్లో సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.ఈ దీక్షకు భారీ స్పందన లభించింది. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. దీక్షలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని, ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, ఎన్.తులసిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పానుగంటి చైతన్య, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు మద్దతు తెలుపుతున్న నాయకులు 100కి 150 శాతం తప్పుడు నిర్ణయం గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు చేపట్టింది. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు 10 కళాశాలలు ప్రైవేట్కు ఇస్తామనడం 100కి 150 శాతం తప్పుడు నిర్ణయం. కళాశాలలు ప్రభుత్వరంగంలో ఉంటే దానికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. – వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వినర్ మోసగాడినేనని నిరూపించుకుంటున్న లోకేశ్ గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానం తెస్తే తీవ్రంగా ఖండించిన లోకేశ్.. తాము అధికారంలోకి రాగానే రద్దుచేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం కళాశాలలనే ప్రైవేట్కు ఇచ్చేస్తున్నారు. తండ్రిలాగా తాను కూడా మోసగాడినే అని లోకేశ్ నిరూపించుకుంటున్నారు. – విజయ్కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడుఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ప్రభుత్వం ప్రైవేట్కు ఇస్తున్న 10 వైద్యకళాశాలలు ఉన్న ప్రాంతాల్లో ఏడు అత్యంత వెనుకబడినవే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని విరమించుకోవాలి. దీనిమీద ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. – కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వాన్నే ప్రైవేట్కు ఇచ్చేయ్ 18 నెలల నుంచి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు చేస్తోంది. అన్నింటికి అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్యకళాశాలల కోసం రూ.3 వేలకోట్ల నుంచి రూ.4 వేలకోట్లు ఖర్చు చేయలేరా? ఎవరైనా ప్రశ్నిస్తే ప్రైవేట్ వ్యక్తులయితేనే కళాశాలలు మెరుగ్గా నిర్వహిస్తారని చెబుతున్నారు. అలాగైతే మొత్తం ప్రభుత్వాన్నే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేయండి. వాళ్లే బాగా ప్రభుత్వాన్ని నడుపుతారు. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శిబాబు ప్రభుత్వానికి శరాఘాతం పది వైద్యకళాశాలలను ప్రైవేట్పరం చేయాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వానికి శరాఘాతం అవుతుంది. రాష్ట్రంలో వైద్య శాఖ నిరీ్వర్యం అయిపోయింది. రెండేళ్లు తిరగకుండానే రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు వైద్యకళాశాలలకు నిధుల్లేవంటున్నారు. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడుచంద్రబాబు తగ్గకపోతే ప్రజలే ఆయన్ని తగ్గిస్తారువైద్యకళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు తగ్గకపోతే 2029లో ప్రజలే ఆయన్ని తగ్గిస్తారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం భవిష్యత్లో రాజ్యాంగంపైనా ప్రభావం చూపుతుంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. – జి.ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిపార్టీలకు అతీతంగా ఉద్యమించాలి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి పాడిగేదెలాగా మార్చే నీచమైన ఆలోచన కలిగిన నాయకుడు చంద్రబాబు. ఆయన ఆలోచన మార్చుకునే వరకూ ప్రజలందరు ఉద్యమం చేయాలి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతదానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు ఇవ్వడంపై ప్రశి్నస్తే 99 పైసలకు భూములు ఇచ్చేస్తా మీరెవరు అడగానికి అని లోకేశ్ అంటున్నారు. ఉచితంగా దానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు. అంతలా దానం చేసుకోవాలని ఉంటే హెరిటేజ్, ఇంకా సొంత ఆస్తులను దానం చేసుకోవాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శిప్రపంచంలో ఎక్కడా చూడని కుంభకోణం ప్రభుత్వ రంగంలోని 10 వైద్యకళాశాలలను ప్రైవేట్కు దోచిపెడుతున్న ఇలాంటి కుంభకోణాన్ని ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండం. సంవత్సరానికి రూ.రెండువేల కోట్ల చొప్పున మూడేళ్లు ఖర్చుచేస్తే కళాశాలలన్నీ ప్రభుత్వరంగంలోనే అందుబాటులోకి వస్తాయి. – వి. లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
ఎవరి ఆస్తి ఎవరికి ఉచితంగా ఇస్తారు?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోంది. ఆ భూములను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోంది. దాన్ని సమర్థించుకునేందుకు మంత్రి లోకేశ్ 99 పైసలకే కార్పొరేట్లకు భూములిచ్చేస్తా... మీకేంటి ఇబ్బంది? అని బరితెగించి మాట్లాడుతున్నారు. రైతుల పొట్టకొట్టి బలవంతంగా లాక్కున్న పంట భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా?’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథంతో కలిసి ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.గతంలో తాము ఎవరికీ ఉచితంగా భూములు ఇవ్వలేదని లోకేశ్ చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు మార్కెట్ రేటుకే భూములు ఇస్తున్నామని, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలకు భూములిచ్చారో లెక్కలతో సహా వెల్లడించారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పడం బరితెగింపేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి ఆస్తి? ఎవరికి 99 పైసలకిస్తారు? అలా ఇవ్వడానికి లోకేశ్కు ఏం హక్కుంది? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. విశాఖ రీజనల్ డెవలప్మెంట్ పేరుతో స్టీల్ ప్లాంట్ భూముల మళ్లింపు కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్మెంట్ అంటూ నీతి ఆయోగ్ ఓ రిపోర్టు తయారు చేసిందని, దానిలో విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 2,500 ఎకరాలను నక్కపల్లిలో పరిశ్రమలు పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించండి... అని స్పష్టంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. భూములను ఇష్టానుసారం ఇస్తున్నారని ప్రశ్నించినందుకు సీపీఎం నాయకుడు అప్పలరాజును తీసుకెళ్లి డిటైన్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పలరాజుపై కేసు లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు... ఎవరినీ కలవనీయడం లేదని ధ్వజమెత్తారు.ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి, ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించి రైతుల భూములను లాక్కుంటారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘సీపీఎం నాయకులు వేరేవారి స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి లోకేశ్ ఆరోపించడం సరికాదు. గత ప్రభుత్వంపై మేం పోరాటాలు చేస్తే ఒప్పు.. ఇప్పుడు మీ తప్పులను నిలదీస్తే తప్పా?’ అని లోకేశ్ను శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొత్త ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు ర్యాలీల ద్వారా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ నెల 14న కొత్త ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతరు.. బాబు కోసం బరితెగింపు
ఈ కేసులో చంద్రబాబు కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారే తప్ప తాను అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదు. సెక్షన్ 17(ఏ)ను ఉటంకిస్తూ ఈ కేసు తనకు వర్తించదన్న చంద్రబాబు వాదన సరికాదు. నిజాయితీపరులైన అధికారులను రక్షించడానికి సెక్షన్ 17(ఏ) ఉద్దేశించిందే తప్ప.. అవినీతి పరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదు. ఈ దృష్ట్యా ఈ కేసును కొట్టివేయలేము. – జస్టిస్ బేలా త్రివేది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిసాక్షి, అమరావతి: చంద్రబాబే నిందితుడిగా, చంద్రబాబే పోలీసుగా సాగుతున్న పచ్చ నాటకం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురి చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ, న్యాయ ప్రక్రియను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న కుట్ర దేశంలో కొత్త దుస్సంప్రదాయానికి తెరతీస్తోంది. చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి బాగోతాన్ని అడ్డగోలుగా మూసి వేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వ బరితెగింపు విస్మయ పరుస్తోంది. చంద్రబాబు కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేత కోసం సీఐడీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది.న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంపై న్యాయ నిపుణులే విస్తుపోతున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసు అడ్డగోలు మూసివేత ప్రతిపాదనను సవాల్ చేస్తూ ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ పిటిషన్పై విచారణ, తదుపరి పరిణామాలపై జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లను ఏసీబీ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేశాయన్నది గమనార్హం. ఈ అవినీతి కేసు దర్యాప్తు, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశాయి. ఆ మేరకు ఆ మూడు న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన అంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా ఆధారాలు.. కొట్టేయడం కుదరదు స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతిని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. అందుకే ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత సమరి్పంచిన రిమాండ్ నివేదికతో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సంతృప్తి చెందింది. రిమాండ్ నివేదికను తిరస్కరించాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిది. సిట్ నివేదికతో ఏకీభవిస్తూ చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతోనే ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తర్వాత అనారోగ్య సమస్యల కారణంగానే ఆయనకు బెయిల్ మంజూరైంది.కాగా, ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిచినా ఆయనకు చుక్కెదురైంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న ఆయన వాదనను హైకోర్టు తిరస్కరించింది. అధికారిక విధుల్లో భాగంగానే స్కిల్ కార్పొరేషన్ నిధుల చెల్లింపునకు అనుమతిచ్చానన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చిది. ప్రజాధనాన్ని స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని స్పష్టం చేసింది. దర్యాప్తులో భాగంగా సిట్ 140 మంది సాక్షులను విచారించి, నాలుగు వేల డాక్యుమెంట్లను కూడా సేకరించిందని తన తీర్పులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రభుత్వ అనుమతి లేకుండానే దొంగాట చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న స్కిల్ స్కామ్ను అర్ధంతరంగా మూసివేతకు కూటమి ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలకు విరుద్ధంగా కుట్రకు తెగబడుతోంది. వాస్తవానికి స్కిల్ స్కామ్లో చంద్రబాబుపై కేసు నమోదు, విచారణకు గతంలో ప్రభుత్వం అధికారికంగా సీఐడీకి అనుమతినిచ్చిది. అనంతరమే సీఐడీకి చెందిన సిట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఆ అధికారిక విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటువంటి అధికారిక అనుమతి ఇవ్వలేదు.కానీ సీఐడీ మాత్రం కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ’ ముసుగులో కేసును మూసి వేయడానికి న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం. ఎందుకంటే అధికారికంగా అనుమతి జారీ చేస్తే తదుపరి పరిణామాలకు సంబంధిత అధికారి బాధ్యుడు అవుతారు. ఆ అధికారిక ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు. అందుకే ప్రభుత్వం అడ్డదారిలో కేసు మూసివేతకు కుట్ర పన్నింది. ప్రభుత్వ అధికారిక అనుమతి లేకుండానే కేసు మూసివేతకు సీఐడీ అధికారులు బరితెగించారు. ఆ అధికారులు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు ఎండీల పరస్పర విరుద్ధ వాంగ్మూలాలు ఈ కేసు మూసివేత వ్యవహారంలో ఏపీఎస్ఎస్డీసీ పూర్వ ఎండీ, ప్రస్తుత ఎండీ పరస్పర భిన్న వాంగ్మూలాలు ఇవ్వడం గమనార్హం. గతంలో ఎండీగా వ్యవహరించిన బంగార్రాజును ప్రభుత్వ పెద్దలు తమదైన శైలిలో బెదిరించి లొంగ దీసుకున్నారు. దాంతో ఈ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. కాగా ప్రస్తుత ఎండీ గణేశ్ మాత్రం అందుకు విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న ఆయన తనకు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.అంతే కాకుండా న్యాయపరంగా నిబంధనలను పాటించడంతోపాటు.. ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. అంటే కేసు మూసివేయవచ్చని.. అందుకు తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పలేదు. నిబంధనలు పాటించాలని చెప్పారు. అంటే సీఐడీ నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. కేసు మూసివేతకు అభ్యంతరం లేదని చెబితే తాను భవిష్యత్లో న్యాయ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన గుర్తించారు. అందుకే ఈ కేసు మూసివేత ప్రతిపాదనను ఆయన సమర్ధించ లేదు. అడ్డగోలుగా మూసివేత ప్రతిపాదన సవాల్ చేసిన అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి చంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న ఆతృతలో సీఐడీ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. ఈ కుంభకోణంపై ఫిర్యాదుదారును పక్కన పెట్టేసి, తమ గుప్పిట్లో ఉండే అధికారుల ద్వారా కుట్ర కథ నడుపుతోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఏపీఎస్ఎస్డీసీ అప్పటి చైర్మన్ కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించి సీఐడీ కేసు నమోదు చేసి చంద్రబాబు పాత్రను నిగ్గు తేల్చింది. కాగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసు మూసివేత ప్రక్రియలో అజయ్ రెడ్డిని విస్మరించింది.అప్పటి ఎండీగా ఉన్న బంగార్రాజు ద్వారా పావులు కదుపుతోంది. కేసు మూసివేతపై అభ్యంతరం ఉందా లేదా తెలపాలని సీఐడీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఆయన్ను ప్రభుత్వ పెద్దలు బెదిరించి తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం జరిగిపోయింది. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథకు పన్నాగం పన్నారు. కాకపోతే కూటమి ప్రభుత్వ కుట్రను అప్పటి చైర్మన్ అజయ్రెడ్డి తిప్పి కొట్టారు. ఈ కేసులో అసలు ఫిర్యాదుదారు తానే అని, ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు స్కిల్ కేసు కొట్టివేతను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ను దాఖలు చేశారు. కమీషన్లు దండుకున్న వారు అరెస్టు.. కొల్లగొట్టిన చంద్రబాబుపై కేసు క్లోజా!? స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి విస్మయ పరుస్తోంది. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా ఉండీ.. కొల్లగొట్టిన నిధుల్లో కమీషన్లు దండుకున్న వారిని ఈడీ అరెస్టు చేసింది. షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది.ఈడీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కుంభకోణం సూత్రధారి, ప్రధాన లబ్ధిదారు చంద్రబాబుపై కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా మూసి వేస్తుందని నిపుణులు ప్ర శ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికార దురి్వనియోగానికి పాల్పడి, లేని ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది ఆయనే. ఇక నిబంధనలకు విరుద్ధంగా నిధుల జారీకి ఆదేశాలు జారీ చేసిందీ చంద్రబాబే. కొల్లగొట్టిన నిధుల్లో సింహ భాగం ఏకంగా రూ.271 కోట్లు చంద్రబాబు ప్యాలస్కే చేరాయి. ఈ పరిస్థితిలో చంద్రబాబుపై కేసును తొలగించడం నిబంధనలకు విరుద్ధం.. చట్ట విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీఐడీ క్లోజర్ రిపోర్ట్పై నా వాదనలు వినండి ⇒ స్కిల్ స్కామ్ ఫిర్యాదుదారు, ఆ కార్పొరేషన్ నాటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ⇒ ఈ కుంభకోణంలో ఆధారాలున్నందునే చంద్రబాబుపై కేసు.. రిమాండ్ ⇒ దానిపై హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ ఆయనకు చుక్కెదురు ⇒ చంద్రబాబు సీఎం కాగానే కేసు మూసివేతకు కుట్ర ⇒ అసలు ఫిర్యాదుదారుడినైన నాకు నోటీసు ఇవ్వలేదు ⇒ ఇలా నోటీసు ఇవ్వక పోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం ⇒ హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లోనూ నేను పార్టీగా ఉన్నాసాక్షి అమరావతి : స్కిల్ డెవలప్మెంట్æ కార్పొరేషన్ కుంభకోణంలో ఫిర్యాదుదారునైన తనకు తెలియకుండానే కేసును మూసి వేయడానికి వీల్లేదని ఆ కార్పొరేషన్ అప్పటి చైర్మన్ అజయ్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ కుంభకోణం కేసుని మూసివేసేందుకు సీఐడీ, ప్రాసిక్యూషన్, నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని అయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ముగ్గురూ కుమ్మక్కై కేసును మూసి వేసేందుకు రంగం సిద్ధం చేశారని తెలిపారు. ఈ కుమ్మక్కు కుట్రను అడ్డుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసిందని, ఇందులో చంద్రబాబు నాయుడు 37వ నిందితుడిగా ఉన్నారని చెప్పారు.ఈ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండటంతో సీఐడీ ఆయన్ను 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిందని, ఆ మరుసటి రోజు అంటే 2023 సెపె్టంబర్ 10న ఏసీబీ కోర్టు రిమాండ్కు పంపిందని తెలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులో చుక్కెదురైందన్నారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు బెయిల్ పొంది బయటకు వచ్చారని, ఆ తర్వాత ప్రభుత్వ మార్పుతో ప్రస్తుత దర్యాప్తు అధికారి నిందితులతో కుమ్మక్కై క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారని చెప్పారు. ఫిర్యాదుదారు అయిన తనకు విచారణ పురోగతి గానీ, క్లోజర్ రిపోర్ట్ దాఖలు గురించి గానీ తెలియజేయలేదన్నారు.ఇది మీనూ కుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధం అని తెలిపారు. ఫిర్యాదుదారుడికి నోటీసు ఇచ్చి వాదనలు వినడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ‘కేసు మూసివేతకు ఇఐఈ, ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్, నిందితులు కలిసి కుట్ర పన్నారు. ఎఫ్ఐఆర్ లో కాలమ్ 6లో ఫిర్యాదుదారుగా నా పేరు స్పష్టంగా ఉంది. హైకోర్టు, సుప్రీంకోర్టు కేసుల్లో కూడా నేను పార్టీగా ఉన్నా. ఈ నేపథ్యంలో ఈ కేసును మూసి వేసేందుకు సీఐడీ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినప్పుడు ముందుగా నాకు నోటీసు ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారిని ఆదేశించండి. ఆ క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశాను. ఈ సందర్భంగా నా వాదనలు వినాలి’ అని అజయ్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ స్కామ్పై ఏం జరగనుంది.. సర్వత్రా తీవ్ర చర్చస్కిల్ స్కామ్ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసును అడ్డగోలుగా మూసి వేయాలన్న సీఐడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజయ్రెడ్డి దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్పై తదుపరి విచారణను ఏసీబీ కోర్టు సోమవారం చేపట్టనుంది. ఈ కేసు విచారణ కేవలం స్కిల్ స్కామ్ కేసుపైనే కాదు.. భవిష్యత్లో ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులపై కూడా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం. అందుకే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ బృందం 40 మందికిపైగా సాక్షులను విచారించింది. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వారు చెప్పిన సాక్ష్యాలు, నమోదు చేసిన వాంగ్మూలాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.ఎఫ్ఐఆర్లు, చార్జ్షీట్లు దాఖలు చేసిన విషయం ప్రస్తావనార్హం. ఏకంగా నాలుగు వేల పేజీల డాక్యుమెంట్లలో పేర్కొన్న విషయాల్లోని ప్రామాణికతను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు కొనసాగాలని, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులే తేల్చి చెప్పిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి హోదాలో పాల్పడిన అవినీతి కేసులను అడ్డగోలుగా మూసి వేయడం ఒక దుస్సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే జరిగితే మునుముందు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు బరితెగించి అవినీతికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు, విచారణ కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ.3,300 కోట్లుగా నిగ్గుతేల్చిన సీఐడీ2014–19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగింది. రూ.370 కోట్ల మేర అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, అందుకు అనుగుణంగా కేసు నమోదు చేసింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడులతో పాటు పలువురిని నిందితులుగా చేర్చి తదుపరి దర్యాప్తు ప్రారంభించింది. అంతిమంగా ఈ కుంభకోణం విలువను రూ.3,300 కోట్లుగా తేల్చింది. అటు తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. స్కిల్ కుంభకోణం నిధులను నిందితులందరూ కలిసి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు ఈడీ తేల్చింది.స్కిల్ కుంభకోణం కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన సీఐడీ, చంద్రబాబు నాయుడిని 2023 సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసి 10న విజయవాడ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచింది. ప్రాథమిక దర్యాప్తులో సేకరించిన పలు ఆధారాలను రిమాండ్ రిపోర్ట్ రూపంలో కోర్టుకు సమరి్పంచింది. సాక్షుల వాంగ్మూలాలను సైతం కోర్టుకిచ్చిది. చంద్రబాబును రిమాండ్కు పంపాలని కోరింది. 2015లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్–సీమెన్స్ మధ్య కుదిరిన ఒప్పందం మొదలు నిధుల మళ్లింపు వరకు సేకరించిన ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచింది.చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్టు తనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు నాయుడు హైకోర్టులో కేవలం మూడు రోజుల లోపే పిటిషన్ దాఖలు చేశారు. అలాగే స్కిల్ కుంభకోణంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కూడా కోరారు. చంద్రబాబు పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఆయన పిటిషన్ను కొట్టేస్తూ 2023 సెపె్టంబర్ 22న తీర్పునిచ్చిది. దర్యాప్తులో భాగంగా సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, అలాగే 4,000 డాక్యుమెంట్లను కూడా సేకరించిందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. దర్యాప్తు విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సీమెన్స్కు నిధుల చెల్లింపుల నిర్ణయాన్ని అధికారిక విధుల్లో భాగంగానే తీసుకున్నానన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసి పుచ్చిది. పబ్లిక్ సర్వెంట్ ప్రజాధనాన్ని తన స్వీయ అవసరాలకు వాడుకోవడం అధికారిక విధుల కిందకు రాదని తేల్చి చెప్పింది. కేసు కొట్టివేతకు సుప్రీం నిరాకరణఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు రిమాండ్ ఉత్తర్వులను ఆయన సవాలు చేశారు. అలాగే తనపై కేసును సైతం కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండా, కేవలం సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. అవినీతి నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేసే ముందు ఆ చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోలేదన్న వాదనను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా భిన్న తీర్పులు వెలువరించారు.అయితే ఇరువురు న్యాయమూర్తులు కూడా చంద్రబాబు కుమ్మక్కుకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఆయనకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సమరి్థస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబుపై కేసును కొట్టేసేందుకు సైతం ఇరువురు న్యాయమూర్తులు నిరాకరించారు. సెక్షన్ 17(ఏ) కింద ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ బోస్ చెప్పగా, అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది చెప్పారు. సెక్షన్ 17(ఏ)ను నిజాయితీపరులైన అధికారులను రక్షించేందుకే తీసుకొచ్చారే తప్ప, అవినీతిపరులైన పబ్లిక్ సర్వెంట్లను రక్షించడానికి కాదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు.స్కిల్ స్కామ్లో అసలు దోషి బాబే ఆధారాలతో నిగ్గు తేల్చిన ఈడీ, సీఐడీ⇒ దాచాలన్నా చంద్రబాబు అవినీతి బాగోతం దాగేది కాదు. స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అనే పేరుతో కుట్రకు తెరతీశారు. కానీ స్కిల్ స్కామ్ కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనని ఇప్పటికే ఈడీ, సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చాయి. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో సమరి్పంచిన రిమాండ్ నివేదికలో సిట్ వెల్లడించింది. ⇒ జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. రూ.370 కోట్ల ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా రూ.3,300 కోట్లకు పెంచేశారు. లేని ఈ ప్రాజెక్టును కాగితాలపై చూపించి.. సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ⇒ నిబంధనలకు విరుద్ధంగా నిధులు చెల్లింపునకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ఆదేశాలు జారీ చేశారు. ఏకంగా 13 నోట్ ఫైళ్లపై ఆయన సంతకాలు చేసి ఈ కుంభకోణాన్ని అంతా తానై నడిపించారు. అలా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చారు. ⇒ 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఈ కుంభకోణం బయట పడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చిది. ⇒ సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తుతో ఆధారాలతో సహా నిగ్గు తేలింది. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ అధికారులు పక్కా ఆధారాలతో ఛేదించారు. కొల్లగొట్టిన అవినీతి సొమ్ములో రూ.77.37 కోట్లను హైదరాబాద్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిల్లోని టీడీపీ ఖాతాల్లో డిపాజిట్ చేశారు. కేవైసీ నిబంధనలకు విరుద్ధంగా నిధులను డిపాజిట్ చేసినట్టు సిట్ దర్యాప్తులో బట్టబయలైంది. ⇒ ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్ïÙట్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెపె్టంబరు 9న సీఐడీ చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని ఎక్కడా ఎవరూ చెప్పక పోవడం గమనార్హం. ⇒ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖని్వల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. ⇒ రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. -
చరిత్ర మిమ్నల్ని క్షమించదు: గడికోట శ్రీకాంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ లిఫ్ట్ స్కీమ్పై తెలంగాణా సీఎం వ్యాఖ్యలతో చంద్రబాబు బాగోతం బయటపడ్డా.. ప్రభుత్వం ఎదురుదాడి చేయడంపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్న ఆయన.. అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అవసరమే లేదన్న మంత్రుల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.మరో వైపు మచ్చుమర్రి, రాయలసీమ లిఫ్ట్ ఒకటే అంటూ ప్రభుత్వ అనుకూల మీడియాలో అవగాహన లేకుండా మిడిమిడి జ్ఞానంతో అబద్దపు వార్తలు రాయడాన్ని తప్పు పట్టారు. రాయలసీమ లిఫ్ట్ స్కీం ద్వారా వైఎస్ జగన్కి మైలేజ్ వస్తుందన్న అక్కసుతోనే తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజిత రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా ఉన్న చంద్రబాబు రాయలసీమ చేసిన మేలు శూన్యమని తేల్చి చెప్పారు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్నదే వైఎస్ జగన్ తపన అని.. తెలంగాణా వినియోగించుకున్నట్టే.. కృష్ణా జలాలతో సీమను స్టెబిలైజ్ చేసేందుకే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ చేపట్టారని స్పష్టం చేశారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం దాన్ని రద్దు చేయడం తీరని ద్రోహమని ఆక్షేపించారు. తన కాంట్రాక్టుల కోసం పోలవరం ప్రాజెక్టునే నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ లిఫ్ట్ను ప్రభుత్వం పూర్తి చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేస్తుందని.. కానీ అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అలా చేస్తే చరిత్ర మిమ్నల్ని క్షమించదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..తప్పును సరిదిద్దుకోని చంద్రబాబు..కానీ సీఎం చంద్రబాబుతో సహా కూటమి నేతలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్న ఆలోచన చేయడం కానీ, కనీసం దాన్ని పరిశీలించే యోచన కూడా చేయకుండా ఎదురుదాడికి దిగడం అత్యంత దుర్మార్గం. చంద్రబాబు తన కేబినెట్ సహచరులతో రెండు రోజులగా అసలు రాయలసీమ లిఫ్ట్ స్కీం అవసరం ఏముంది అనేలా హేళన చేయడంతో పాటు అడ్డుగోలుగా విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం. ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడి ప్రజలకు జరుగుతున్న నష్టంపై కనీసం ఆలోచన చేయకుండా తిరిగి ఎదురుదాడి చేయడం, వారి అనుకూల పత్రికల్లో అసలు ఈ ప్రాజెక్టే అవసరం లేదన్నట్టు వార్తలు రాయించిన తీరు అత్యంత దుర్మార్గం.ఈ తరహా వార్తలు రాసే వారు ముందు పూర్తిగా అవగాహన కలిగించుకుని.. జరుగుతున్న నష్టాన్ని తెలియజేయాలే తప్ప మిడిమిడి జ్ఞానంతో ఆ ప్రాంతానికి జరుగుతున్న నష్టాన్ని కనీసం అంచనా వేయడం లేదు. కేవలం వైయస్సార్సీపీ, వైయస్.జగన్ కి మైలేజ్ వస్తుందన్న ఒకే ఒక్క కారణంతో తప్పుదోవ పట్డిస్తూ అసత్యాలు ప్రచురించడం శ్రేయస్కరం కాదు.మచ్చుమర్రి సహా ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ చలువే..మల్లెలలో హంద్రీనీవాకు ప్రాజెక్టు 834 అడుగుల నీటిమట్టం వద్ద నుంచి లిఫ్ట్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత.. కింద స్థాయిలో నీళ్లు తోడేస్తున్న నేపథ్యంలో.. 834 అడుగులకి చేరడం కష్టం అవుతుంది కాబట్టి.. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్రెడ్డే కేసీ కెనాల్కు, హంద్రీనీవాకు వేసవిలోనే, తాగునీరు ఇచ్చేందుకు మచ్చుమర్రికి జీవో ఇచ్చారు. మచ్చుమర్రి పనులు ప్రారంభమైన తర్వాత అందులో నాలుగు పంపులుకే సీ కెనాల్కు, మిగిలిన పంపులు హంద్రీ నీవా ద్వారా జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్కు వెళ్లేలా ఏర్పాటు చేశారు.అవేవీ తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారు. నీటిపారుదల శాఖ మంత్రికి క్యూసెక్కులుకు, టీఏసీలకు తేడా తెలియదని గతంలో చెప్పాను. అదే విషయం మరోసారి స్పష్టమవుతుంది. 790 అడుగుల్లో ముచ్చుమర్రి ప్రాజెక్టు 0.31 టీఎంసీ సామర్ధ్యం అంటే దాదాపు 3వేల క్యూసెక్కులు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది. దాన్ని 3 టీఎంసీలు అని మీరు అనుకుంటున్నారు. ఆ విధంగా ప్రచురించారు. దాదాపు 33 వేల క్యూసెక్కులు వస్తే తప్ప... 3 టీఎంసీలు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు, అది కూడా తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం ముచ్చుమర్రి ప్రాజెక్టు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రెండూ సేమ్ అన్నట్టు వార్తలు రాశారు.సీమకు చంద్రబాబు చేసిన మేలు శూన్యం..చంద్రబాబుకి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికీ రానంతగా... అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉంటే అవకాశం చంద్రబాబుకి వచ్చినా ఆయన ప్రజలకు ఉపయోగపడే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన ఆయను రాలేదు. మల్లెల, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పోతిరెడ్డుపాడు, ముచ్చుమర్రి, గండికోడ, తెలుగుగంగ ముందుకు తీసుకెళ్లే యోచన, హంద్రీనీవా చేపట్టే ఆలోచన కానీ, చివరకు పోలవరాన్ని చేయాలన్న తలపు కూడా మీకు లేదు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి, గుండ్లకమ్మ ప్రాజెక్టులు, నెల్లూరుకు చెందిన సోమశిల, నెల్లూరు బ్యారేజీ ఈ ప్రాజెక్టులు వేటి మీద మీరు ఆలోచన చేయలేదు. ఉమ్మడి రాష్ట్రానికి,కొత్త రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసానని చెప్పుకోవడానికి తప్ప... రాయలసీమకు, రాష్ట్రానికి మీరు చేసిందేమీ లేదు.అన్ని ప్రాంతాలు బాగుండాలన్న తపనతోనే..మా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలకు నష్టం జరగకూడదు అన్ని ప్రాంతాలు సమానమని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు 825 అడుగులులోపే 8 టీఎంసీలు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి... రాయలసీమలో కూడా వ్యవసాయానికి మేలు చేస్తూ.. స్టెబిలైజ్ చేయడానికి వాళ్లతో పాటు మనకూ సమాన అవకాశం ఉంటే భవిష్యత్తులో కలిసి నీటిని పంచుకునే ఆవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టారు. మీరు మాత్రం ఆ ప్రాజెక్టును బలహీనపరుస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ ను అర్ఱం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఎగువ రాష్ట్రాల వల్ల అన్యాయం జరగకూడదనే..శ్రీశైలం రిజర్వాయర్ పుల్ లెవల్ కి రావాలంటే ఎన్ని క్యూసెక్కులు నీళ్లు రావాలి, ప్రతి సంవత్సరం అలా నీళ్లు రాని పరిస్ధితులలో ఎగువనున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు నీటి వినియోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి. శ్రీశైలం నుంచి ఎస్ ఎల్ బీ సీ, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తెలంగాణా 820 అడుగులు లోపే నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. మరీ అన్యాయంగా 780 వరకు పవర్ జనరేషన్ కోసం 4 టీఎంసీలు రోజూ కిందకు వదిలేస్తున్నారు.ఇవన్నీ సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీశైలంలో అదే పరిస్థితి ఉంది. ఈ నీరు ఎవరికీ ఉపయోగపడకుండా నేరుగా సముద్రంలో కలుస్తున్న పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీళ్లు ఎక్కువగా వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు పనిచేస్తుంది. నీటి ప్రవాహం తక్కువగా 70వేలు, 80 వేలు క్యూసెక్కులు వచ్చినప్పుడు ఒకేసారి వాళ్లు 8 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నప్పుడు, మనకు అదే లెవల్ లో 3 టీఎంసీలు కెపాసిటీతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అంతిమంగా అన్ని ప్రాంతాలు బాగుంటాయి. కానీ చంద్రబాబు గారూ మీకు ఆ ఆలోచన లేదు.పోలవరాన్నీ నిర్వీర్యం చేసిన చంద్రబాబు..ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిర్వీర్యం చేశారు. గతంలో ఎంతో కష్టంతో వైయస్సార్ ఆ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత కూడా మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీ కాంట్రాక్టర్ల కోసం తాకట్టు పెట్టి.. కేంద్ర ప్రభుత్వం కట్టకుండా అడ్డుకుని బలవంతంగా లాక్కుని ప్రాజెక్టుని అవినీతి మయం చేశారు.కాపర్ డ్యామ్ మందు కట్టి.. నీటిని అరికట్టి మధ్యలో డయాఫ్రమ్ వాల్ కడితే నాణ్యతతో వచ్చేది. కానీ ఎలాంటి ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ ముందు కట్టడంతో కాపర్ డ్యాంలో నీళ్లు ప్లో అరికట్టలేకపోవడంతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దీంతో పోలవరం ఆలస్యమయ్యేలా చేసింది మీరు కాదా చంద్రబాబూ?దివంగత నేత వైయస్సార్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఆ తర్వాత వైయస్.జగన్ హయాంలో ప్రాజెక్టు నిధులు, ఆర్ అండ్ ఆర్ కోసం కేంద్రాన్ని ఒప్పించి జీవో సైతం విడుదల చేయించి, స్పిల్ వే సహా నిర్మాణం చేపట్టారు. మీ అనాలోచిత నిర్ణయం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు. మీ వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారకులయ్యారు. కమిషన్ల కోసం మీ కక్కుర్తే ఇందుకు కారణం. 3 వేలకు 33 వేల క్యూసెక్కులకు తేడా తెలియదా?మచ్చుమర్రి చంద్రబాబు చేశాడు.. దాని ఇమేజ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారన్న పత్రికలు అసులు ఆ ప్రాజెక్టు జీవో ఎప్పుడు వచ్చిందో చూడాలి. దానిలో ఎంత నీరు తీసుకోవచ్చో చూడండి. 834 అడుగులు వద్ద మల్లెల ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే... మచ్చుమర్రికి మాత్రం 790 అడుగుల వద్ద కేవలం 0.31 టీఎంసీ అంటే 3 వేల క్యూసెక్కులు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే 33 వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఆలోచన లేకుండా పోయింది. ముచ్చుమర్రి అనేది కేసీ కెనాల్, హంద్రీనీవాకు సమాంతర కాలువ ఉంది. అదే రాయలసీమ లిఫ్ట్లో 33 వేల క్యూసెక్కుల కోసం జరిగిన కాలువలు ఎలా ఉన్నాయి?పనులెంత జరిగాయో చూడండి? నీళ్లు లిఫ్ట్ చేసిన తర్వాత 33వేల క్యూసెక్కుల నీరు పోవడానికి కాలువలు ఉండాలి. ఈ కాలువలు కూడా పోతిరెడ్డిపాడు దాటిన తర్వాత బనకచర్ల క్రాస్ ముందు కలుస్తుంది. పోతిరెడ్డి పాడు నుంచి బనకచర్ల క్లాస్ వరకు ఉన్న కాలువ కూడా 80వేలక్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా కాలువలు వెడల్పు చేశారు. అదే విధంగా ముచ్చుమర్రి ప్రాజెక్టు చేసినప్పుడు.. హంద్రీనీవా స్థాయిని పెంచాలని కాలువల సామర్ధ్యం 3300 క్యూసెక్కులుంటే దాన్ని 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి అనువుగా వెడల్పు చేశారు.ఉద్యమానికి సిద్ధమైన రాయలసీమ..విధ్వంసం చేయాలన్న ఆలోచనే మీది. ఏ ప్రాజెక్టు చేయాలన్న ఆలోచన మీకు లేదు. ఖరీఫ్ లో వేగంగా నీళ్లు వచ్చినప్పుడు దిగువ ప్రాంతాలకు నీళ్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఇక్కడ రైతుల పంటలను కాపాడ్డం కోసం, వాళ్లు కూడా సరైన సమయంలో పంటలు పెట్టుకోవడానికే రాయలసీమ లిఫ్ట్ పని జరుగుతుంది. ఈ ప్రాజెక్టు రాయలసీమ గుండె చప్పుడు. దయచేసి ఈ ప్రాజెక్టు అవసరం లేదని నిర్లక్ష్యంగా మాట్లాడవద్దు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్లు కూడా హేళనగా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాయలసీమ, అమరావతి, గోదావరి, ఉత్తరాంధ్రా ప్రాంతం ఏదైనా రైతులందరూ బాగుండాలన్నదే మా విధానం.మేం రైతుల పక్షాన నిలబడతాం. ఇవా అల్మట్టి ఎత్తు పెంచడం వల్ల కృష్ణా, గుంటూరు రైతులకు నష్టం జరుగుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులిచ్చి ఆల్మట్టి ఎత్తు పెంచే నిర్మాణ పనులు మొదలుపెడుతుంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అంతే తప్ప కేవలం వ్యక్తిగత లబ్ధికోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరైన విధానం కాదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే పనిచేస్తోంది. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు భావోద్వేగంతో ఉన్నారు. ఉప్పెనలా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాయలసీమ నుంచి చంద్రబాబు తరలించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.రాజధాని పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..దీంతో మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెర తీస్తూ మరలా రాజధాని అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకువస్తున్నారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదు. అక్కడ రైతులకు మంచి జరగాలన్నదే మా విధానం. తొలివిడతలో రాజధానికి భూమిలిచ్చిన రైతులకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన ఓరైతు మంత్రి సమక్షంలో గుండాగి చనిపోయారు. వారికి అండగా నిలబడాలన్నదే మా విధానం. వారికిచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండో విడత భూసేకరణకు వెళ్లడాన్ని మేం తప్పుపడుతున్నాం.దయచేసి రాజకీయ కోణంలో విమర్శలు చేసి.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో లోపాయికారీ ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ను రద్దు చేయడం ముమ్మాటికీ తప్పు. ఏడాదిలోగా దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి.. తక్షణమే పూర్చి చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా పూర్తి చేస్తుందన్ని స్పష్టం చేసిన శ్రీకాంత్ రెడ్డి ప్రజలను మాత్రం అబద్దాలతో తప్పుదోవపట్టించొద్దని హెచ్చరించారు. అలా చేస్తే టీడీపీ ప్రజా ప్రతినిధులను చరిత్ర క్షమించదని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. -
‘లిఫ్ట్’పై చంద్రబాబు డైవర్షన్!
సాక్షి, అమరావతి: చీకటి ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీయడంతో ఆత్మరక్షణలో పడ్డ టీడీపీ కూటమి సర్కారు ఎల్లో మీడియాతో కలిసి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెర తీసింది. రాజధానిలో రెండో విడత భూసమీకరణపై గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. తొలి విడత భూములిచ్చిన రైతుల ఆక్రందనను ప్రస్తావించడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు సర్కారు విషప్రచారానికి దిగింది.రివర్ బేసిన్ (నదీ పరివాహక ప్రాంతం)లో రాజధాని నిర్మిస్తున్నారని వైఎస్ జగన్ అంటే.. రివర్ బెడ్ (నదీ గర్భం)లో నిర్మిస్తున్నారని అన్నట్లుగా వక్రీకరిస్తూ, దూషణలకు దిగుతూ దుష్ప్రచారం చేస్తోంది. బేసిన్కు.. బెడ్కూ తేడా తెలియని మంత్రులు ఎల్లో మీడియాతో కలసి, రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేసిన విషయాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఖండించకపోగా... ఎదురు దాడి, దుష్ప్రచారంఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపివేయించా..! పనులు ఆగాయో లేదో కావాలంటే చెక్ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం చంద్రబాబుగానీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుగానీ రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తారనుకుంటే అది చేయలేదు. పైగా వారిద్దరి మాటలు వింటే.. ఆ ఎత్తిపోతల అవసరం లేదనడం చూస్తే.. రేవంత్రెడ్డితో చంద్రబాబుకు ఉన్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోదముద్ర వేసినట్లేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతౖకైనా దిగజారుతారు.. ఎవరికైనా వెన్నుపోటు పొడుస్తారన్నది మరోసారి నిరూపితమైందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేశారన్నది తేటతెల్లమవడంతో చంద్రబాబు సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే రాజధానిపై వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మంత్రులు, ఎల్లో మీడియా డైవర్షన్ డ్రామాకు తెరతీశాయి. నిర్మాణ వ్యయానికి అంతెక్కడ..?విభజన తర్వాత అధికారం చేపట్టి, అమరావతిని రాజధానిగా ప్రకటించి.. 2014–19 మధ్య ఐదేళ్లలో అదే రాజధాని నిర్మాణం కోసం రూ.5,500 కోట్లు చంద్రబాబు సర్కార్ ఖర్చు చేసింది. కానీ.. ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణం చేయలేదు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని.. ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడదని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ.. ఇప్పుడు 19 నెలల్లోనే రూ.47 వేల కోట్ల రుణం రాజధాని కోసం తెచ్చారు. తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ సమర్పించింది. రెండో విడతగా తీసుకుంటున్న భూముల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.లక్ష కోట్లు అవసరం.అంటే.. మొత్తమ్మీద రాజధాని నిర్మాణానికి ఏకంగా రూ.2 లక్షల కోట్లు అవసరం. ఇప్పటికే రూ.60 వేల కోట్లతో చేపట్టిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ, పనుల్లో ఎక్కడా పురోగతి లేదు. రాజధాని పేరుతో అప్పులు తేవడం, పనుల అంచనా వ్యయాలు పెంచడం, కాంట్రాక్టర్లకు అప్పగించడం, మొబిలైజేషన్ అడ్వాన్స్లు చెల్లించడం, కమీషన్లు వసూలు చేసుకోవడం మినహా నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి కన్పించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజధానిలో వర్షం కురిస్తే ఆ నీరు కృష్ణాలోకి వెళ్లడం లేదనే నెపంతో ఇప్పటికే రూ.222 కోట్లతో ఉండవల్లి వద్ద కొండవీటివాగు వరద ఎత్తిపోతల నిర్మించారు. తాజాగా రూ.523 కోట్లతో ఉండవల్లి వద్ద రెండో ఎత్తిపోతలను చేపట్టారు.వరదను నియంత్రించడానికి మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు.. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే మంత్రులు, ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు నిజంగానే మేలు చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణం ఎప్పుడో జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు కదా? ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఎందుకంత ఉలుకు? ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల విశాల ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. అలాగే రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరగాలి. అదే విషయాన్ని వైఎస్ జగన్ చెప్పారు. రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందనే కదా వైఎస్ జగన్ చెప్పింది! ఇకనైనా రాజధాని రైతులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టండి.. రాజధాని నిర్మాణం పేరుతో ప్రజలపై ఇంకా భారం మోపడం ఆపాలని సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎల్లో మీడియాకు మేధావులు, రైతులు హితవు పలుకుతున్నారు.ఏడేళ్లలో ఏం చేశావ్ బాబూ..?రాజధాని నిర్మాణం కోసం టీడీపీ హయాంలో తొలి విడతగా 53 వేల ఎకరాలు సమీకరించారు. 2014–19 మధ్య ఐదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లు వెరసి దాదాపు ఏడేళ్లు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. కానీ..ఇప్పటికీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కొలిక్కి రాకముందే రెండో విడత భూసమీకరణను ప్రభుత్వం ప్రారంభించడంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. తొలి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను వాగులు, వంకలు, చెరువుల్లో ఇవ్వడం.. ఇప్పుడు రహదారుల నిర్మాణం పేరుతో నివాసం ఉంటున్న ఇళ్లను సైతం చంద్రబాబు ప్రభుత్వం గుంజుకోవడంపై రైతులు మానసికంగా కుంగిపోతున్నారు.ఇదే అంశంపై ఇటీవల రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన రామారావు అనే రైతు గుండె పగిలి మరణించారు. రెండో విడత భూసమీకరణ కోసం వడ్డమానులో నిర్వహించిన గ్రామసభలో ప్రభుత్వాన్ని రైతులు నిలదీశారు. తొలి విడతలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు.. ఇప్పుడు రెండో విడతలో భూములివ్వాలంటే, మూడేళ్లలోగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆవేదననే వైఎస్ జగన్ ప్రస్తావించారు. -
మాది సంక్షేమ క్యాలెండర్..బాబుది అప్పుల క్యాలెండర్
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వంలో ప్రతి ఏటా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి, దాన్ని క్రమం తప్పకుండా అమలు చేశాం. అదే ఇప్పుడున్న చంద్రబాబు అప్పులు తెచ్చుకోవడానికి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దునుమాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. రెండేళ్లు కూడా తిరక్కముందే రూ.3.02 లక్షల కోట్లు.. అంటే తాము ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం అప్పును చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లోనే చేసేసిందంటూ కాగ్ నివేదికల్లో గణాంకాలను చూపుతూ కడిగిపారేశారు. ఇన్ని అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకేమైనా మేలు చేశాడా? అంటే అదీ లేదన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేకుండా పోయాయని, వైఎస్సార్సీపీ హయాంలో అమలైన పథకాలన్నీ రద్దు చేసేశారని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ గాలికి పోయాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, అక్కచెల్లెమ్మలు, ఉద్యోగులకు దిక్కులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు దాదాపుగా రూ.30 వేల కోట్లు బకాయి పడిందని చెప్పారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ ఊసే లేదన్నారు. ఇక సరెండర్ లీవుల గురించి చెప్పాల్సిన పనే లేదన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే..ఆశ్చర్యం కలిగించేలా అప్పులు ళీ చంద్రబాబు పదే పదే తప్పులు చేస్తూ.. మరో వైపు దు్రష్పచారం చేస్తుంటారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్ల మేర అప్పులు చేసేశారని ఎన్నికలకు ముందు దు్రష్పచారం చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబును ఎవరైనా గిల్లినా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసినా, ఉద్యోగులు సమ్మెల్లోకి వెళ్లినా మళ్లీ మనమే గుర్తుకొస్తాం. అసెంబ్లీలో ఒకటి చెబుతారు. ప్రభుత్వ రికార్డుల్లో ఒకటి చూపుతారు. బహిరంగ సభల్లో ఇంకో మాట మాట్లాడతారు.⇒ 2014లో బాబు గద్దెనెక్కే నాటికి ప్రభుత్వ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ హామీతో తీసుకున్న అప్పులు, హామీ లేని రుణాలు అన్నీ కలిపి రూ.1,40,717 కోట్లు ఉన్నాయి. ఈ అప్పులు చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.3,90,247 కోట్లకు చేరాయి. ఈ లెక్కన ఆయన రూ.2,49,530 కోట్లు అప్పు చేశారు. అంటే.. చంద్రబాబు సర్కార్ హయాంలో రుణాల సగటు వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 22.63 శాతం నమోదైంది. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,31,671 కోట్లు అప్పు చేశాం. ఈ లెక్కన గమనిస్తే అప్పుల్లో సీఏజీఆర్ 13.57 శాతం మాత్రమే ఉంది.ప్రజలపై విపరీతంగా బాదుడు ⇒ చంద్రబాబు ఓ వైపు అప్పులు చేస్తూనే, మరో వైపు ప్రజల మీద విపరీతంగా బాదేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లపాటు కరెంటు చార్జీలు పెంచనని చంద్రబాబు అన్నారు. కానీ, రెండేళ్లు కూడా గడవకుండానే ఏకంగా రూ.20,135 కోట్ల కరెంటు చార్జీలు బాదారు. ట్రూ అప్, ఇంకా రకరకాల చార్జీల పేరిట భారం మోపుతున్నారు. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఫ్యూయల్, పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్మెంట్ – ఎఫ్పీపీసీఏ) కింద 2024 నవంబర్ 29న రూ.9,412 కోట్లు, 2024 అక్టోబర్ 25న మరో రూ.6,072 కోట్లు, 2025 సెపె్టంబర్ 27న మరో రూ.1863 కోట్లు, ప్రొవిజనల్ ఎఫ్పీపీసీఏ చార్జెస్ కింద మరో రూ.2,787 కోట్లు వెరసి రూ.20,135 కోట్ల విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు. ⇒ రిజిస్ట్రేషన్ చార్జీలు 50% పెంచారు. దీంతో భూములు కొనాలంటేనే షాక్ కొట్టే పరిస్థితి. గ్రామాల్లో ప్రజలు తాగే తాగునీటిపైనా చార్జీలు వసూలు చేస్తున్నారు. తాజాగా కొత్తగా వాహనాల కొనుగోళ్లపై రోడ్ సెస్ వేశారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. వాళ్లు తగ్గించిన పన్ను మొత్తాన్ని రహదారి సుంకం రూపంలో వీళ్లు మళ్లీ వేస్తున్నారు. అన్ని రకాల రోడ్లకూ టోల్ గేట్లు పెట్టి వసూలు చేయడం ఒక వడ్డన అయితే, రోడ్ సెస్ పేరిట వాహనాల మీద వడ్డిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది.⇒ మేము చేసిన రూ.3.31 లక్షల కోట్ల అప్పుల్లో రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) కింద ప్రజలకు అందించిన ఘనత మాది. డీబీటీ కింద ఎవరికి ఇచ్చామో పేరు, ఆధార్, బ్యాంక్ ఖాతాతో సహా పూర్తి వివరాలు అందిస్తాం. మేం ఐదేళ్లలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, కేవలం రెండేళ్లు కూడా తిరక్కుండానే బాబు రూ.రూ.3,02,303 కోట్లు అప్పు చేశారు. అంటే మేం ఐదేళ్లలో చేసిన అప్పులో 90.87 శాతం ఇప్పటికే చేసేశారు. మరోవైపు వచ్చే మూడు నెలల కాలంలో మరో రూ.11 వేల కోట్లు అప్పు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ముందు ప్రతిపాదన పెట్టారు. అప్పులు తేవడంలో ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. ⇒రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం వీళ్ల జేబుల్లోకి పోతోంది. ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ ఇలా ప్రతిదీ కుంభకోణం అయిపోయింది. రాష్ట్రంలో గ్రామ గ్రామాన మద్యం మాఫియా కనిపిస్తోంది. కమీషన్ల కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) రూపంలో కుంభకోణాలు చేస్తున్నారు. ప్రతి ఊళ్లో రేషన్ మాఫియా, ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు దర్శనమిస్తున్నాయి. ఏ పనికి అయినా సరే కింది నుంచి పైదాక లంచం ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. - వైఎస్ జగన్ -
భూ దోపిడీ.. క్రెడిట్ చోరీ..
సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భారీగా భూ దోపిడీకి పథకం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఎయిర్పోర్టు నిర్మాణంలో క్రెడిట్ చోరీకి పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు చేసిందేమీ లేకపోగా.. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ, నిస్సంకోచంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భోగాపురం విమానాశ్రయానికి ఏకంగా 15 వేల ఎకరాల భూమి కావాలన్న చంద్రబాబు తీరును చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు 5 వేల ఎకరాలు అని చెప్పారన్నారు.దీంతో ప్రజలు ఆయన చిత్తశుద్ధిపై అనుమానంతో భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో ఏకంగా 130 కేసులు దాఖలు చేశారని చెప్పారు. దీంతో ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. నాడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎయిర్పోర్టుకు కనీస అనుమతులు తేవడంలో దారుణంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్లో విశ్వాసాన్ని నింపి, కోర్టు కేసులను పరిష్కరించి 2,700 ఎకరాల భూసేకరణ చేసి ఎయిర్పోర్టు నిర్మాణ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. భూ సేకరణకు రూ.960 కోట్లు ఖర్చు చేశాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. అంతర్జాతీయంగా చూసినా 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన విమానాశ్రయం ఏర్పాటవుతుంది. మేం ప్రభుత్వంపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. సమయాన్ని వెచ్చించి.. శ్రమించి విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.కనీసం కనెక్టివిటీ రోడ్డూ పూర్తి చేయలేదు..భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు (ఆ వీడియోను ప్రదర్శించారు). కానీ, ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు కనీసం ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డును కూడా పూర్తి చేయలేకపోయారు.రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నా చంద్రబాబు రోడ్డు పనులను చేయకుండా గాలికొదిలేశారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు. త్వరలో భోగాపురం నుంచి విమానాలు టేకాఫ్ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే సరైన రోడ్లు లేవు. చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి మాత్రం తామే విమానాశ్రయాన్ని నిర్మించినట్లు బిల్డప్ ఇస్తారు. వీళ్లు కనీసం ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా? భూ సేకరణ చేశారా? కనీసం ఇప్పుడు జరగాల్సిన పనులైనా చేయించారా? చంద్రబాబు మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. తన కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండానే క్రెడిట్ కొట్టేస్తారు! ఎవరో పని చేస్తే.. ఆ క్రెడిట్ తీసుకోవడానికి కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పి సంకోచం లేకుండా చోరీ చేసేస్తారు.బాబు అనుమతులు కూడా తేలేకపోయారు..నాడు చంద్రబాబు హయాంలో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అయినా కూడా.. భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు కనీసం అనుమతులు, ఎన్వోసీలు తేలేకపోయారు. ఆ ప్రాజెక్టు అనుమతులు అన్నీ మేమే తీసుకొచ్చాం. విశాఖపట్నంలో డిఫెన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్లు (రక్షణ శాఖ విభాగాలు) ఎక్కువగా ఉన్నందున ఎయిర్పోర్టుకు ప్రత్యేక అనుమతులు అవసరం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం. నేను స్వయంగా ప్రధానిని కలిసి లేఖలు ఇచ్చా. అనేక సార్లు విజ్ఞ్ఞప్తి చేశా.అందుకే.. మా హయాంలోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బీసీఏఎస్ (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవివేషన్ సెక్యూరిటీ), రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, పర్యావరణ అనుమతులు, కేంద్ర ప్రభుత్వ ఎన్వోసీ, అన్ని బ్యాంకుల ఫైనాన్షియల్ క్లోజర్ పర్మిషన్లు వచ్చాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉండగానే జరిగాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అవసరమైన అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. కోవిడ్ లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ధృడ సంకల్పంతో ముందుకెళ్లాం. ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది.⇒ భోగాపురం ఎయిర్పోర్టుకు మా హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. రోడ్లు, నీళ్లు, కరెంటు లాంటి మౌలిక వసతులకు అదనపు నిధులను మా ప్రభుత్వంలోనే కేటాయించి ఖర్చు చేశాం. 2023 మే 3వ తేదీన ముఖ్యమంత్రి హోదాలో నేను భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేశా. 2026లో తొలి విమానం ఇక్కడి నుంచి టేకాఫ్ అవుతుందని ఆ రోజు మీటింగ్లో నేను చెప్పిందే ఇవాళ నిజమవుతోంది. ఈ రోజు విమానాశ్రయం విషయంలో క్రెడిట్ తీసుకోవాలని తాపత్రయపడుతున్న వ్యక్తులు.. కనీసం ఎయిర్పోర్టు కనెక్టివిటీ రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే నాటికి రోడ్డు పూర్తి చేయాలనే కనీస ధ్యాస కూడా వీరికి లేదు...⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయానికి 2,200 ఎకరాలు, ఏరో సిటీకి మరో 500 ఎకరాలు కలిపి మొత్తం 2,700 ఎకరాల్లో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాం. రైతుల్లో విశ్వాసాన్ని పెంచి కోర్టు కేసులు మొత్తం వేగంగా పరిష్కరించాం. విజయవంతంగా భూసేకరణ పూర్తి చేసి మూడు గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించాం. వారికి ప్రత్యేకంగా పునరావాస కాలనీలు నిర్మించి ఇచ్చాం. భూ సేకరణ కోసమే దాదాపు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. భోగాపురం భూ సేకరణ మొత్తం మా హయాంలో జరిగింది.⇒ భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు.. దానికి కనెక్టివిటీ రోడ్డు విషయంలోనూ అప్పుడే మేం దృష్టి సారించాం. విశాఖ సిటీ నుంచి 55 కిలోమీటర్ల మేర 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్డుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. కేంద్ర మంత్రి గడ్కరీతో దీన్ని అప్పటికప్పుడు మంజూరు చేయించాం. ఆ సమావేశంలోనే గడ్కరీ దీనిని ‘వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్..’ అని ప్రకటించారు. – వైఎస్ జగన్ -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే ప్రభుత్వానికి పతనమే!
కడప రూరల్: ప్రభుత్వ ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తే పతనం తప్పదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడపలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ముందు సీఎం చంద్రబాబు ఒక డీఏ ఇచ్చి పండుగ చేసుకోమని చెప్పారని, ఆ ఒక్క డీఏతో ఎన్ని పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు దాదాపు రూ.34 వేల కోట్ల బకాయిలు ఉంటే చంద్రబాబు రూ.210 కోట్లను రెండు విడతలుగా ఇస్తామని హామీ ఇచ్చి చేతులెత్తేశారన్నారు. పోలీసులకు 6 సరెండర్ లీవులను పెండింగ్ పెట్టిన ఘనచరిత్ర చంద్రబాబు సర్కారుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో 11వ తేదీ వరకు జీతాలు పడని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి ఏ వైరస్ సోకింది? గత ప్రభుత్వం కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదిలోనే అమలు చేసిందని వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ఇపుడు రాష్ట్రానికి ఏ వైరస్ సోకిందని హామీలు నెరవేర్చడం లేదని నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారన్నారు. ఈ ప్రభుత్వానికి పీఆర్సీని నియమించే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఐఆర్, డీఏ ఎప్పుడు మంజూరు చేస్తుందో తెలియని పరిస్థితి దాపురించిందన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ పథకం సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.ఉద్యోగులపై వేధింపులు సైతం ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు 158 యాప్లను ఒక్క యాప్గా చేయడం దారుణమన్నారు. సంక్రాంతిలోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల ద్వారా సాధించుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సమాఖ్య కో–చైర్మన్ లెక్కల జమాల్రెడ్డి, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు నారాయణరెడ్డి, రాఘవరెడ్డి, వల్లెం శివశేషాద్రిరెడ్డి, వల్లెం సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
బాబు స్వార్థ ప్రయోజనాల కోసం 'సంజీవని తాకట్టు': వైఎస్ జగన్
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 777–825 అడుగుల మధ్య రోజుకు 8 టీఎంసీల నీళ్లు వాడుకుంటుంటే, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చిత్తూరు జిల్లాలోనే పుట్టిన చంద్రబాబు ఏరోజైనా ఈ ఆలోచన చేశాడా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ భావించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే స్థాయికి దిగజారిపోరని ప్రతీ రైతూ ఆశించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదంటూ చంద్రబాబు బరితెగించి మాట్లాడటమే కాకుండా, జలవనరుల మంత్రితో మాట్లాడించిన మాటలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో తను (చంద్రబాబు) చేసుకున్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోంది. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడడని మరోసారి రుజువైంది. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే.. జన్మనిచ్చిన సీమకు కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెన్నుపోటు పొడుస్తాడన్నది మరోసారి నిరూపితమైంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరుృనగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నాయి. ప్రస్తుత స్పిల్ లెవల్ 841 అడుగులు. ఈ స్థాయిలో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు వస్తుంది. 854 అడుగులకు నీరు చేరితే 7 వేల క్యూసెక్కులు వస్తుంది. ఈ లెక్కన పూర్తి సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. మరొకవైపు యథేచ్ఛగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల అత్యంత అవశ్యం. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్న ప్రజల గొంతు తడపాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడుచూసినా దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలు. ప్రజల కోసం చీకు, చింతా లేవు. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ దొంగ పనులే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చేందుకు గతంలో కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే పథకమే ఇది.కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు ఏటా తగ్గిపోతున్నాయి. ఏడాదిలో 20ృ30 రోజులకు మించి వరద రావడం లేదు. మరొకవైపు లిఫ్టులు, పవర్ హౌస్ల ద్వారా తెలంగాణ ఎడాపెడా రోజుకు 8 టీఎంసీల నీళ్లు తోడేస్తోంది. శ్రీశైలం నుంచి 777ృ825 అడుగులకే నీళ్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో తక్కువ సమయంలోనే ఇప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నింపలేని పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టాం. దీంట్లో కొత్త రిజర్వాయర్లు ఏమీ లేవు. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపేందుకు ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు.అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. కొంత మంది పాలకులు ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం.. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం.. అలాగే ఉండాలి. -వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల సంజీవని అని, ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అలాంటి రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ‘వీళ్లు అసలు మనుషులేనా?’ అనిపిస్తోందని మండిపడ్డారు. వాళ్లు మాట్లాడిన ప్రతీ మాట రాక్షసులను గుర్తు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు (క్లోజ్డ్ డోర్ మీటింగ్) రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని తాను అడిగానని, తనపై ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డితో సాన్నిహిత్యం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో చెప్పేందుకు రేవంత్రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టాడో.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం ఏ విధంగా పణంగా పెడుతున్నాడో చెప్పేందుకు రేవంత్రెడ్డి చెప్పిన మాటలే సాక్ష్యాలని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతుల దృష్టిలో చంద్రబాబు ఓ విలన్ కేరక్టర్గా కన్పిస్తున్నారన్నారు. బహుశా దేశ చరిత్రలో ఇలాంటి చరిత్ర హీనుడు ఎవరూ ఉండకపోవచ్చని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ, పెట్టుబడులు–ఉపాధి కల్పన–అప్పులపై నాణేనికి మరో పార్శ్వం తదితర అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వివరిస్తూ చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిని ఏకిపారేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ ఆశిస్తే.. ఆశ్చర్యకరంగా బాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోందన్నారు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులను ప్రారంభించి.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను వాయు వేగంతో పూర్తి చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల’ గొప్ప ఆలోచన నిజంగా రాయలసీమ ఎత్తిపోతల అనేది గొప్ప ఆలోచన. గొప్ప ఉద్దేశం. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం ప్రశ్నార్థకమైన పరిస్థితులు.. తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. రాయలసీమతోపాటు నెల్లూరు, చెన్నైలకు సంజీవని లాంటిది. ఈ విషయంలో అందరూ ఆలోచించాలని చెబుతున్నా. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నై ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్పిల్ లెవల్ 841 అడుగులు. కానీ ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గరిష్ఠ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు. ఆ స్థాయిలో ప్రధాన కాలువలోకి నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగుల్లో నీళ్లుండాలి. శ్రీశైలంలో 841 అడుగుల్లో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు, 854 అడుగులకు చేరితే 7 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువలోకి వస్తుంది. ఈ లెక్కన 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నా సరే... గడిచిన 20 ఏళ్లలో కేవలం 3–4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. అందరూ ఆలోచించాల్సిన వాస్తవాలు ఇవి. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఒకవైపు ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించాలి.ఓటుకు కోట్లు కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణం ⇒ 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. మరోవైపు 800 అడుగుల్లోనే రోజుకు మరో 2 టీఎంసీలు వాడుకునేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి–దిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. ఇంకో వైపున 825 అడుగులకే ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లేలా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల నుంచి నెట్టంపాడు, కోయల్ సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా మరొక టీఎంసీ నీళ్లు అటు నుంచి అటే తెలంగాణకు తరలిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు 777 అడుగుల నుంచి శ్రీశైలం ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు 4 టీఎంసీల నీళ్లు ఇష్టమొచ్చినట్టుగా ఎడాపెడా తీసుకొని శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి.⇒ ఇటువైపు మన రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే.. మరొకవైపు అటు యథేచ్చగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏపీది అడ్డుకోలేని పరిస్థితి. శ్రీశైలం ఎడమ వైపున పవర్ హౌస్లో విద్యుత్ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకు 4 టీఎంసీల నీళ్లను ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేకపోతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ గట్టు పవర్ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ⇒ మొన్నటి వరకు మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉండేది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణను స్వాధీనం చేసుకుంది. నాగార్జున సాగర్ కిందనున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కల్గించే ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇందుకు కారణం.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి. అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా ఉన్న నేను కర్నూలులో జల దీక్ష కూడా చేశాను. చంద్రబాబు మౌనం.. రాష్ట్రానికి శాపం ⇒ చంద్రబాబు మౌనం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ వైపు తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు 2019 వైఎస్సార్సీపీ వచ్చే నాటికి చకచకా జరుగుతున్నాయి. కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ విస్తరణ పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి–దిండి ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కదానికి పర్యావరణ అనుమతుల్లేవు. ఈ పనులు ఆపాలని ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) 2021 అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోలేదు. ⇒ ఇదే విషయమై ఎన్జీటీ 2022లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా కూడా విధించింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలు, పవర్ హౌస్ ఆపరేషన్స్ ద్వారా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగుల వరకు రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 834 అడుగుల వద్ద మల్యాల వద్ద చిన్న ఎత్తిపోతల ద్వారా 0.3 టీఎంసీలు, ముచ్చుమర్రిలో 795 అడుగుల వద్ద 0.3 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నాం. ⇒ తెలంగాణ వాళ్లు 8 టీఎంసీలు నీళ్లు వాడుకుంటుండగా, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. రోజుకు 777–825 అడుగుల వద్ద 8 టీఎంసీలు నీళ్లు ఖాళీ అవుతుంటే.. ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనే పుట్టాడు. ఏరోజైనా ఆలోచన చేశాడా? రిజర్వాయర్లకు.. స్టెబిలైజింగ్ రిజర్వాయర్లకు తేడా తెలియదా? ⇒ రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటుందన్న జ్ఞానం కూడా ఈ పెద్దమనిíÙకి లేదు. పైగా ఈ ప్రాజెక్టును ఇంకా గందరగోళంలో పడేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ, నెల్లూరు ప్రజలను చులకన చేసి మాట్లాడతున్నాడు. ఆ ఎత్తిపోతలలో కింద స్టెబిలైజింగ్ రిజర్వాయర్లను పట్టుకొని రిజర్వాయర్లంటాడు. అక్కడ కట్టింది రిజర్వాయర్లు కాదన్న విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ⇒ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టకపోతే కుప్పంకు, చిత్తూరుకు తాగునీళ్లు కూడా పోయే పరిస్థితి ఉండదు. తాను పుట్టిన చిత్తూరు జిల్లా ప్రజలపై మమకారం లేదు. తనకు ఓటేసి గెలిపించిన కుప్పం ప్రజలపై కృతజ్ఞతా లేదు. హంద్రీ–నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 500 కిలోమీటర్లకు పైబడి నీళ్లు ప్రయాణం చేయాలి. ఈ ప్రాంతం పూర్తిగా శివారు (టెయిల్ ఎండ్)లో ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, కుప్పంకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశాం. జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) ద్వారా గండికోటకు నీళ్లు వస్తే.. అక్కడ ఎత్తిపోతలు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కాలువలోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా తంబళ్లపల్లి, పీలేరు మదనపల్లె, పుంగనూరు, కుప్పం, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ⇒ ఇదే ఆలోచనతో పనులు చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు నిర్మించాం. వీటి నిల్వ సామర్థ్యం ఎంతో తెలుసా? కాలేటి వాగు సామర్థ్యం 1.2 టీఎంసీలు. ముదివేడు సామర్థ్యం 2 టీఎంసీలు. నేతిగుంటిపల్లి సామర్థ్యం ఒక టీఎంసీ. ఆవులపల్లి సామర్థ్యం 3 టీఎంసీలు. మా హయాంలో వీటిని కట్టాం. 500 కిలోమీటర్లు దాటి శివారు ప్రాంతానికి వెళ్లా్లలంటే, ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు లేకపోతే ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి.భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ⇒ అటు తెలంగాణ కానివ్వండి.. ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏరోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే కార్యక్రమం పాలకులుగా కొంత మంది చేస్తున్నారు. ఇది చాలా తçప్పు. వాస్తవాలు, నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ⇒ అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం. అలాగే ఉండాలి. గతంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును కూడా పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. చంద్రబాబు 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటాడు.‡ 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ సీఎం పదవిలో కూర్చొని 19 నెలలవుతోంది. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే పెద్దమనిషి ప్యాకేజీలు విడగొడతాడు.. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అంటూ డబ్బులు దోచేయడానికి జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచి, నామినేషన్ల పద్ధతిలో పనులిచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తాడు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం మాట ఎలా ఉన్నా, ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. రాయలసీమ లిఫ్టునకు వ్యతిరేకంగా కేసులు వేయించాడు⇒ ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని చక్కబెట్టే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే మనం కూడా 3 టీఎంసీల నీళ్లు తీసుకుని వెళ్లే వెసులుబాటును ఈ ఎత్తిపోతల ద్వారా కల్పించాం. దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుతో చేపట్టి చకచకా పనులు కూడా జరిగాయి. ఈ ఎత్తిపోతల పూర్తయితే మా ప్రభుత్వానికి, వైఎస్ జగన్కు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే భయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సొంత టీడీపీ కార్యకర్తలతోనే తెలంగాణ నుంచి కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు. ఎంత దుర్మార్గుడో చూడండి. ⇒ అయినా సరే రాయలసీమ, నెల్లూరు రైతులకు మేలు చేకూర్చేందుకు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ఈ ప్రాంత రైతుల దురదృష్టమేమిటంటే మా ప్రభుత్వం మళ్లీ రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, సీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు. కేవలం ఎన్జీటీ అభ్యంతరాల తర్వాత ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్, 2025 జనవరి, ఫిబ్రవరిలలో మూడుసార్లు సమావేశమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే ఈ ప్రాజెక్టును ఈ పెద్దమనిషి ఖూనీ చేశాడు. ⇒ ఒకటికి మూడుసార్లు సమావేశమై తమ వాదన విన్పించేందుకు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకుండా ఈ ప్రాజెక్టుపై కత్తి పెట్టాడు. అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. తన మనుషులతో మాట్లాడిస్తున్నాడు. పైగా ఆశ్చర్యకరంగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో 34 టీఎంసీలే.. దాంట్లో ఏపీ వాటా 22 టీఎంసీలే.. దీని కోసం లిఫ్టు ఎందుకంటూ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబూ.. నువ్వు అసలు మనిషివేనా.. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. అటువైపు 777–825 అడుగులకే రోజుకు 8 టీఎంసీల నీరు వాడుకుంటుంటే 881 అడుగులకు నీళ్లెప్పుడు చేరతాయి.. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు ఎప్పుడు వస్తాయన్న కనీస ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నాడంటే ఆయన్ను ఏమనాలి? మా హయాంలో ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వచ్చాం ⇒ రాయలసీమలో పేరుకు రిజర్వాయర్లున్నాయి. కానీ ఏ ఒక్క రిజర్వాయర్లోనూ వాటి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నింపలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ వచ్చాం. ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేశాం. ⇒ తెలుగు గంగ లింక్ కెనాల్ 0 నుంచి 18 కిలోమీటర్ల డిజైన్ మేరకు నీటిని పంపించుకోలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ మేరకు దాంట్లో 15 వేల క్యూసెక్కులు పంపేలా ఆధునికీకరించి వాడుకలోకి తీసుకొచ్చాం. ⇒ ఎస్ఆర్బీసీ–జీఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యం రెండూ కలిపి 30 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమం చేపట్టాం. నిప్పుల వాగు నుంచి నెల్లూరు వరకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాం. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలో కేవలం 2 వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్తుంటే, మేము వచ్చిన తర్వాత ఆ కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టాం. ⇒ అవుకు టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ ద్వారా మరో 10 వేల క్యూసెక్కుల నీళ్లు పంపగలిగాం. రెండు టన్నెళ్లు పూర్తి చేసేందుకు రూ.260 కోట్లు ఖర్చు చేశాం. అవుకులో మూడో టన్నెల్ పనులు కూడా మొదలు పెట్టాం. ⇒ గండికోట రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఏంసీలు. కానీ.. ఏరోజూ 14–15 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,000 కోట్లు ఆర్అండ్ఆర్ మీద ఖర్చు పెట్టి 27 టీఎంసీల నీళ్లు నిలిచేలా చేశాం.⇒ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీళ్లు నిలపలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.280 కోట్లు ఖర్చు చేసి.. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు నిలిపేలా చేశాం. ⇒ బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు. కానీ.. ఏ రోజూ ఆ స్థాయిలో నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత డయా ఫ్రమ్ వాల్ కొత్తది వేసి.. లీకేజీ సమస్యను అరికట్టి రూ.90 కోట్లు ఖర్చు చేసి.. 17 టీఎంసీల నీళ్లు నింపాం. ⇒ వెలుగొండలో రెండు టన్నెళ్లను పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను సాకారం చేసి, జాతికి అంకితం చేశాం. మిగిలింది ఆర్ అండ్ ఆర్, లైనింగ్ పనులు మాత్రమే.⇒ కొన్ని దశాబ్దాలుగా తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో ఏ రోజూ నీళ్లను నిలపలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీల నీళ్లను నిలుప గలిగాం. రూ.120 కోట్లు ఖర్చు చేసి ఈ డ్యామ్లలో పూర్తి సామర్థ్యంలో నీళ్లు నిలబెట్టగలిగాం. ⇒ దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు మా హయాంలో పూర్తి చేశాం. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. ఏ ఒక్కరోజూ పూర్తి సామర్థ్యం మేరకు ఇక్కడ నీటిని నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్కు రూ.200 కోట్లు ఖర్చు చేశాం. 45 టీఎంసీలు స్టోరేజ్ చేశాం. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. పనులు జరుగుతాయి. అవి చంద్రబాబులో లోపించాయి. -
హడ్కో ద్వారా ఏపీ టిడ్కో రూ.4,451 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ గ్యారెంటీల అప్పులకు అంతులేకుండా పోతోంది. బడ్జెట్ అప్పులు మంగళవారాల్లో చేస్తుండగా.. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రతీనెలా అప్పులు చేస్తోంది. తాజాగా.. హడ్కో ద్వారా ఏపీ టిడ్కో రూ.4,451 కోట్లు అప్పు తీసుకునేందుకు బాబు సర్కారు గ్యారెంటీ ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్లు అందులో పేర్కొంది. ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు ఆర్థిక శాఖ నుంచి కంఫర్ట్ లెటర్ను అందించడానికి సర్కారు అంగీకరించింది. అసలు, వడ్డీకి హామీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ హామీ చెల్లుబాటవుతుంది.వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం వ్యవధి మొదలైన షరతులు వంటి వివరాలతో పాటు అసలుతో పాటు వడ్డీ తిరిగి చెల్లింపు షెడ్యూల్ను సమర్పించాల్సిందిగా ఏపీ టిడ్కోకు ప్రభుత్వం సూచించింది. రుణ సంస్థకు బాధ్యతలను చెల్లించడంలో టిడ్కో విఫలమైన సందర్భంలో మాత్రమే ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. రుణ డీడ్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ అ«దీకృత అధికారి సంతకం చేస్తారు. మొత్తం రుణంపై ఏపీ టిడ్కో ఐదు శాతం గ్యారెంటీ కమీషన్ను చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే రాజధాని పేరుతో హడ్కో నుంచి రూ.11,000 కోట్లు అప్పుచేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ రూ.4,451 కోట్లతో కలిపితే చంద్రబాబు సర్కారు హడ్కో నుంచి చేసిన మొత్తం అప్పు రూ.15,451 కోట్లకు చేరుతోంది. -
వైఎస్సార్టీఏ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్(వైఎస్సార్టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్కే జంషీద్, ట్రెజరర్ ఎస్.ప్రేమ్ సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీకే వెంకట్నాథ్రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులు బి.సురేశ్, ఎం.వి.మహంకాళీరావు, జి.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జస్టిస్ ఎన్వీ రమణ వల్లే హైకోర్టు న్యాయమూర్తి అయ్యాను
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ మల్లికార్జునరావు ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 9 నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడం, 18వ తేదీ ఆదివారం కావడంతో హైకోర్టు ఆయనకు గురువారమే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ, ‘జిల్లా జడ్జిగానే పదవీ విరమణ చేస్తానని నేను భావించా.అయితే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వల్ల పరిస్థితులు మారాయి. నేను కూడా హైకోర్టు న్యాయమూర్తిని అయ్యాను’అని తెలిపారు. అంతకుముందు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జస్టిస్ మల్లికార్జునరావు న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా న్యాయవ్యవస్థకు ఎనలేని సేవలు అందించారన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్చార్జ్ అధ్యక్షుడు కేవీ రఘువీర్లు జస్టిస్ మల్లికార్జునరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు, హైకోర్టు న్యాయవాదులు, రిజి్రస్టార్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానం అనంతరం జరిగిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
తొలి దశకే దిక్కు లేదు.. మళ్లీ రెండో దశా?
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయకుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం ఓ స్కామ్ అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. రాజధాని తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే రెండో దశ భూ సమీకరణ చేస్తుండడంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. ‘‘చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు.అనంతరం తొలి దశలో 50 వేల ఎకరాలు సమీకరించారు. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలంటే తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు అవసరమని గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. రెండో విడతలో 50 వేల ఎకరాలు తీసుకుంటే, వాటిలో సదుపాయాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మరో రూ.లక్ష కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.అంటే, రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పటికీ తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలను అమలు చేయలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టాలి. కేవలం చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే రివర్ బేసిన్లో రాజధాని నిర్మిస్తున్నారు’’ అని మండిపడ్డారు. రాజధాని ఓ పెద్ద స్కామ్ రాజధాని నిర్మాణ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెంచేసి, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని, రాజధాని ఓ పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని పునరుద్ఘాటించారు. విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో రాజధాని నిర్మించి ఉంటే ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని వివరించారు. మీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీకంటే చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తోంది. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమౌతుంది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మీరే చెప్పండని వైఎస్ జగన్ అన్నారు. దక్షిణ సుడాన్, సోమాలియానో అవుతుందని అన్నారు.ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లు రాకపోవడం సంతోషకరం. ప్రైవేటీకరణపై న్యాయ పోరాటం చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7న) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాం. దాన్ని కోర్టు ఆమోదించింది. ప్రభుత్వానికి నోటీసులిచ్చింది’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘కట్టినవి, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నవి, సగం పూర్తయినవి... ఉచితంగా ఇవ్వడమే కాక, రెండేళ్ల పాటు నడిపేందుకు సంబంధించిన జీతాలు సంవత్సరానికి రూ.60 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి చంద్రబాబు ఇస్తాడంట.ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ సిబ్బంది.. జీతాలు ఇచ్చేది ప్రభుత్వం.. కానీ, లాభాలేమో ప్రైవేటు వ్యక్తలకంట. ఇది స్కామ్ కాకపోతే ఏంటి? ఇలాంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములవుతారా?’’ అని ప్రశ్నించారు. ‘‘తొలుత కిమ్స్ వాళ్లు టెండర్ వేశారని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. కిమ్స్ వాళ్లు అదేమీ లేదు. ఆ స్కాముల్లో మాకు సంబంధం లేదని వెనక్కి తప్పుకొన్నారు. వీళ్లకు ఏం చేయాలనో దిక్కు తెలీలేదు. ఎల్లయ్యతోనో, పుల్లయ్యతోనో, వంట మనుషులతోనో టెండర్లు వేయిస్తున్నారు.వాళ్లకైనా సరే నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది... అక్కడ 13 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మొన్ననే ప్రారంభించారు. కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే దరఖాస్తులు పెట్టుకుంటే ఇస్తారు. అదొక పద్ధతి. భూములు కొనుక్కో, భవనాలు కట్టుకో, అన్ని రకాలుగా చేసుకో, ప్రభుత్వం నీకు సహకరిస్తుంది. ఇదొక పద్ధతి. కానీ, ఈ మాదిరిగా స్కాములు చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం కట్టిన భవనాలను ప్రైవేటువాళ్లకు ఊరికే ఇచ్చేయడం, సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం వంటివి ఎవడూ చేయడు. ఏ ప్రభుత్వమూ చేయదు’ అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మా హయాంలోనే పారిశ్రామిక వృద్ధి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అదానీ డేటా సెంటర్.. గూగుల్.. భోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాల్లో చంద్రబాబు క్రెడిట్ చోరీ తెలిసిందే. ఆయన ఇంకో అడుగు కూడా ముందుకేసి.. మా హయాంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వెళ్లిపోయారంటూ నిరంతరం బురదజల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు..! దీనికి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, డజన్ల కొద్దీ అబద్ధాల ఫ్యాక్టరీలైన వాళ్ల సోషల్ మీడియా వంత పాడుతోంది..’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు.నిజాలు గడప దాటేలోపే.. చంద్రబాబు అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టేసి వస్తాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న ఆ తప్పుడు ప్రచారాలను బద్ధలుకొడుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025 డిసెంబర్ 11న ఒక నివేదిక విడుదల చేసిందని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే.. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచిందని, దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉందని గుర్తు చేశారు.‘మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12 శాతం ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87 శాతం మాత్రమే. అంతేకాదు.. మా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానంలో, దక్షిణాదిలో మళ్లీ మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96 శాతం అయితే ఏపీలో 11.14 శాతం ఉంది. అయినాసరే చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. అసలు వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వేత్తలు బెదిరి పారిపోతున్నారు..’ అని పేర్కొన్నారు. కప్పం కడితేనే పరిశ్రమల మనుగడ.. సజ్జన్ జిందాల్, అరబిందో, మైహోమ్స్ సిమెంట్స్, శ్రీసిమెంట్స్, రామ్కో సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, షిర్డీసాయి.. వీళ్లందరూ చంద్రబాబు ఏలుబడిలో పరిశ్రమలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా.. కప్పం కట్టకపోతే పరిశ్రమలను నడిపే పరిస్థితి ఉందా? చంద్రబాబు ఈమధ్య మరో డ్రామా మొదలు పెట్టారు. కొత్త ఏడాది వేడుకలకు ఆయన, ఆయన కుమారుడు విదేశాలకు వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో ప్రజలకు ఎలాగూ తెలియదు. పైపెచ్చు వీళ్ల పర్యటనను దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా కొత్త కొత్త సెన్సేషనల్ అబద్ధాలను క్రియేట్ చేస్తోంది. పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ తీసుకొస్తోంది. అదంతా కేవలం పబ్లిసిటీ మాత్రమే. రియాలిటీ కాదు. ఎంఎస్ఎంఈల్లో 32.79 లక్షల ఉద్యోగాలు కల్పించాం వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే దాని ద్వారా 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి.అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఇది మేం చెబుతున్నది కాదు.. ఆ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది. చంద్రబాబు ఇచి్చన ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు కేవలం దాదాపు 9.50 లక్షలు మాత్రమే. మరి ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు? ఎవరి హయాంలో పారిశ్రామిక వేత్తలకు ఊరట, భరోసా లభించింది? కమీషన్లు ఇస్తేనే ప్రోత్సాహకాలు! పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒక్క ఎంఎస్ఎంఈ విభాగంలోనే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా పెండింగ్ పెట్టారు. ఆ ప్రోత్సాహకాలు ఇచ్చే నాథుడు లేడు. పట్టించుకునే నాథుడు కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇవ్వాలంటే.. రెండు బకెట్లు పెట్టారట! ఒక బకెట్లో.. 30 శాతం ఎవరు కమీషన్ ఇస్తే వారి పేరు పెడతారట! రెండో బకెట్లో న్యూట్రల్గా (తటస్థం) కనిపించడానికి కేవలం 20 శాతం మాత్రం పెడతారట! కొంతమందిని ఎంపిక చేసి 20 శాతం సొమ్ము ఇస్తారట! ఇలా ప్రోత్సాహకాల్లోనూ దోపిడీ చేస్తుంటే ఇంకేం పరిశ్రమలు వస్తాయి? చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచౌకగా భూములు! సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు.. తదితర రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి వేలం లేకుండానే భూములు ఇచ్చేస్తోంది. పొరుగున తెలంగాణలో చూస్తే ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరా భూమి రూ.170 కోట్లు పలికింది. గుజరాత్లోనూ ఇలానే ప్రభుత్వం వేలంలో భూమిని కేటాయిస్తూ ఖజానాకు నిధులు సమకూర్చుకుంటోంది. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు దోచిపెడుతున్నారు. ఎకరా రూ.50 కోట్లు విలువైన భూములను కేవలం రూ.1.50 కోట్లకే ఇచ్చేశారు.సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్కు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్కు 10 ఎకరాలు.. రహేజాకు అయితే మరీ 99 పైసలకే కట్టబెట్టేశారు. ఒకవైపు ఎలాంటి వేలం లేకుండానే భూములు కారుచౌకగా ఇవ్వడమే కాకుండా.. మరోవైపు ల్యాండ్ యూజ్ (భూమి వినియోగం) 40–50 శాతం మిక్స్డ్ యూజ్ చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చారు. మరోవైపున వీళ్లు బిల్డింగులు కడితే.. ఎస్ఎఫ్టీకి రూ.2 వేలు తిరిగి ప్రభుత్వమే వెనక్కి డబ్బులిచ్చేలా భారీ స్కామ్కు తెరదీశారు. ఇది నిజంగా బొనాంజా కాదా? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడికి ఎవరైనా ఈ మాదిరిగా ఇస్తారా? విశాఖలో లూలుకు రూ.2 వేల కోట్ల భూమి విశాఖపట్నంలో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన 14 ఎకరాల భూమిని 99 ఏళ్లకు లూలు గ్రూప్నకు లీజుకిచ్చారు. ఎలాంటి టెండరూ లేదు.. ఎలాంటి వేలం లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్లు మాల్ కట్టుకోవడానికి ఇచ్చేశారు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో 16 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడుతోంది. ఆంధ్రాలో మాత్రం ఉచితంగా, వేలం లేకుండా చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. అహ్మదాబాద్లో లూలుకు కేటాయించిన భూమి వేలంలో రూ.519 కోట్లు ధర పలకడంతో పాటు రికార్డు స్థాయిలో రూ.31 కోట్లు స్టాంపు డ్యూటీ కింద వచ్చిందంటూ ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటోంది. (ఆంగ్ల పత్రిక కథనాన్ని చూపించారు)⇒ చంద్రబాబు గతంలో మాదిరిగానే ఈదఫా కూడా పెట్టుబడులపై పీక్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కానీ చేసేవన్నీ స్కామ్లే! పేరుకు ఒకట్రెండు పెద్ద కంపెనీలకు ఉచితంగా, 99 పైసలకే భూములిస్తున్నట్లు ప్రకటించి ఆ ముసుగులో రూ.వేల కోట్ల విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా దోచిపెడుతున్నారు. పెద్ద కంపెనీల పేర్లతో పబ్లిసిటీ చేసుకుని మరో మార్గంలో ఎల్లయ్యలకో, పుల్లయ్యలకో, తన బినామీలకు అప్పనంగా కట్టబెడుతున్నారు...⇒ వంటవారికి, డ్రైవర్లకు సూటూ బూటూ వేసి కూర్చోబెట్టడం.. ఎంవోయూలు రాయడం.. రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ప్రకటించుకోవడం చంద్రబాబుకు అలవాటే. 2014–19 మధ్య కూడా ఇలాంటి కథలే విన్నాం. ఆర్టీఐ ద్వారా వెల్లడించిన సమాచారం చంద్రబాబు పారిశ్రామిక పబ్లిసిటీ గుట్టును బయటపెట్టింది. 2014–19 మధ్య భారీ పరిశ్రమల్లో రూ.50,708 కోట్లు పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కనిపిస్తే 84,333 ఉద్యోగాలు కల్పించారు. అదే మా హయాంలో 2019–24 మధ్య చూస్తే.. దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అది గతంలో కంటే 25 శాతం అధికం. దీంతో పాటు 90,230 ఉద్యోగాలు కల్పించాం. ఇక ఎంఎస్ఎంఈలు చూసినా మేం ఐదేళ్లలో 32,79,770 ఉద్యోగాలిచ్చాం. ఈ విషయం సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వం రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ (సామాజిక ఆర్థిక) సర్వే రిపోర్ట్లోనే ఉంది.⇒ ఇటీవల ఆర్బీఐ నివేదికను పరిశీలిస్తే వైఎస్సార్సీపీ హయాంలో తయారీ రంగం జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) వృద్ధిలో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో నాడు నంబర్ వన్గా ఉంది. మా హయాంలో తయారీ రంగంలో ఏపీ వృద్ధి రేటు 11.12% ఉంటే, దేశ సగటు వృద్ధి రేటు కేవలం 6.87% మాత్రమే. మా ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటును గమనిస్తే దేశంలో 8వ స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో నిలిచాం. దేశ సగటు 8.96% అయితే ఏపీలో 11.14% ఉంది. అయినా చంద్రబాబు పైశాచిక ఆనందంతో నిత్యం మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉన్నారు. – వైఎస్ జగన్ -
మందుబాబులకు సర్కారు షాక్
సాక్షి, అమరావతి: మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో బార్లు, మద్యం దుకాణదారులకు భారీగా లబ్ధి చేకూరుస్తూ, రాష్ట్ర ఖజానాకు పెద్ద గండికొట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం... మద్యం సీసాపై (బీరు, వైన్ మినహా) రూ.10 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దుకాణదారుల మార్జిన్ కమీషన్ను 14 శాతం నుంచి 15 శాతం చేసింది. బార్లపై ప్రస్తుతం ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును తొలగించింది.ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మద్యం సీసాపై రూ.10 చొప్పున పెంచడం ద్వారా ప్రభుత్వానికి రూ.1,391 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. బార్ల వ్యాపారానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో వారికి ప్రోత్సాహంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను రద్దు చేశామని చెప్పారు. దీంతో బార్ల యజమానులకు రూ.340 కోట్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మద్యం బాటిల్పై ఎంఆర్పీ రూ.10 చొప్పున, దుకాణదారులకు విక్రయాల మార్జిన్ మనీ కమీషన్ ఒక శాతం పెంచ డం వల్ల రూ.195 కోట్లు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఇక 14 శాతం నుంచి మార్జిన్ కమీషన్ను 15 శాతం చేయడం ద్వారా రూ.337 కోట్లు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి చెప్పారు. అంటే, సీసాపై రూ.10 పెంపుతో వచ్చే రూ.1,391 కోట్ల ఆదాయంలో ఈ మూడు మినహాయించగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడి రూ.519 కోట్లకు పరిమితం కానుంది. మరికొన్ని నిర్ణయాలు...⇒ రూ.10 లక్షల వరకు నామినేషన్పై సాగునీటి పనులు ⇒ సాగునీటి రంగంలో నామినేషన్పై ఇచ్చే పనుల పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు ⇒ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదించిన ట్రూ అప్ చార్జీలు డిస్కమ్లకు 6 వాయిదాల్లో తిరిగి చెల్లింపు. ⇒ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి చుట్టూ 5 కి.మీ.లలో నిర్దేశిత పర్యాటక కేంద్రాలలో స్థానంతో సంబంధం లేకుండా 3 స్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్లలో, ప్రస్తుత పరిమితులకు అదనంగా మైక్రో బ్రూవరీలకు అనుమతి. ⇒ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి రూ.5 వేల కోట్ల జల్ జీవన్ మిషన్ కార్పొరేషన్ అప్పునకు ప్రభుత్వ గ్యారెంటీ. గతంలో జల్ జీవన్ మిషన్కు అప్పు పరిధి రూ.10 వేల కోట్లు కాగా, దానిని రూ.12 వేల కోట్లకు పెంచుతూ ఆమోదం. ⇒ ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రూ.250 కోట్ల మూలధన వ్యయంతో సమగ్ర లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ కంపెనీగా ఏర్పాటు. ⇒ నామినేషన్ ఆధారంగా నాన్ క్యాప్టివ్ వాణిజ్య కార్యకలాపాల కోసం మంజూరు చేసిన లీజుల విషయంలో, సంస్థ అంచనా వనరుల విలువలో ఐదు శాతం ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాలలో కచ్చితంగా చెల్లించాలి. అదనంగా, లీజు మంజూరు చేసే ముందు సంస్థ మూడేళ్ల సీనరేజీ రుసుమును తొలుతే చెల్లించాలి. దీనికోసం మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్–1966ను సవరించడానికి ఆమోదం. ⇒ ఏపీ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ భవిష్యత్ డిమాండ్ను తీర్చడానికి, లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేయడానికి ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.1,500 కోట్ల రుణ మంజూరు. ⇒ ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు విజయవాడ ఎస్బీఐ నుంచి రూ.2 వేల కోట్ల టర్మ్ రుణానికి ఆమోదం. -
మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బార్లు, మద్యం షాపులను ఇప్పటికే తమ తాబేదర్లకు ఇష్టారాజ్యంగా కేటాయించుకున్న చంద్రబాబు ప్రభుత్వం దానికి కొనసాగింపుగా మరో అంకానికి తెరలేపింది. వారికి మరింత లబ్ధిచేకూర్చేలా అడ్డగోలు నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. 2014–19 మధ్య మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును యథేచ్ఛగా రద్దుచేసి ఖజానాకు గండికొట్టినట్లుగానే ఇప్పుడు బార్లపై ‘అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్ఈటీ)ని చంద్రబాబు సర్కారు తాజాగా తొలగిస్తూ వారికి బంపర్ ఆఫర్ ఇస్తూ నాటి మద్యం కుంభకోణానికి అవలంబించిన విధానాన్నే తిరిగి లిఖిస్తోంది.అలాగే, టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముకాయడమే లక్ష్యంగా మద్యం ప్రియులకు షాక్ ఇస్తూ వాటి ధరలను బాటిల్పై రూ.10 చొప్పున పెంచింది. ఇలా.. మద్యం సిండికేట్కి ఏటా రూ.500 కోట్ల వరకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగిస్తూ.. మరోవైపు ధరల దరువుతో మద్యం ప్రియులపై ఏటా రూ.3 వేల కోట్ల మోత మోగిస్తోంది. మంత్రి మండలి సమావేశం వేదికగా చంద్రబాబు ప్రభుత్వ తాజా మద్యం కుంభకోణం కథాకమామిషు ఇది.రూ.2 వేల కోట్ల సిండికేట్ దోపిడీకి పచ్చజెండా..ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్ఈటీని రద్దుచేసింది. దీంతో.. ప్రభుత్వ ఖజానా ఆదాయానికి ఏటా రూ.340 కోట్లు గండిపడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండిపడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్లు మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్ గల్లా పెట్టే మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది. అప్పట్లో ప్రివిలేజ్ ఫీజు రద్దు దందా..2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ముకాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దుచేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీచేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. తద్వారా టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కొల్లగొట్టారు.ఆ తర్వాత ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు పలువురిపై ఐపీసీ, సెక్షన్లు–166, 167, 409, 120 (బి) రెడ్విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు–13(1), (డి), రెడ్విత్ 13 (2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై దాదాపు మూడేళ్లు బయట ఉన్నారు. ఆ కేసును ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేయడం గమనార్హం. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ కేసును అటకెక్కించింది. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని వేధించి బెంబేలెత్తించింది. ఆయనపై కేసులు నమోదుచేసి లొంగదీసుకుంది.మరోవైపు.. ఈ కేసులో ఆధారాల్లేవని సీఐడీ న్యాయస్థానానికి నివేదించింది. ప్రభుత్వ వేధింపులతో వాసుదేవరెడ్డి అందుకు వంతపాడారు. దాంతో ఆ కేసును మూసివేశారు. ప్రసుతం అదే రీతిలో ఏఆర్ఈటీని రద్దుచేసి మరోసారి మద్యం సిండికేట్ దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రెడ్కార్పెట్ వేసింది.మద్యం ప్రియులకు ధరల షాక్..ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచి ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రూ.99 మద్యం తప్ప మిగిలిన అన్ని రకాల మద్యంపై ధరల మోత మోగించింది. సీసాపై రూ.10 చొప్పున పెంచింది. తద్వారా మద్యం ప్రియులపై ఏడాదికి రూ.1,391 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ, ఈ బాదుడు రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.రాష్ట్రంలో నెలకు సగటున రూ.3 వేల కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. వాటిలో బీరు విక్రయాలు రూ.వెయ్యి కోట్లు కాగా.. మద్యం విక్రయాలు రూ.2 వేల కోట్లు. మద్యం విక్రయాల్లో రూ.99 మద్యం సీసాల వాటా 30 శాతం ఉంది. మిగిలిన 70 శాతం విక్రయాలు అంటే రూ.1,200 కోట్ల మేర మద్యం విక్రయాలపై ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. ఆ ప్రకారం నెలకు రూ.250 కోట్ల వరకు మద్యం ప్రియులకు షాక్ తగలనుంది. అంటే.. ఏడాదికి రూ.3 వేల కోట్ల భారం పడనుందన్నది సుస్పష్టం. -
ఏపీలో మద్యం ప్రియులకు షాక్
సాక్షి, విజయవాడ: మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ నుంచి మద్యం ధరలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బాటిల్ పై ఏకంగా రూ. 10 ధర బాదుడుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో మధ్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్పై రూ.10 పెంచి.. ఇప్పుడు మరోసారి అదీ పండుగపూటనే పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది. ఈ నిర్ణయం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(IMFL), ఫారిన్ లిక్కర్ (FL)కు వర్తింపజేయాలని భావిస్తోంది. దీంతో.. 70 శాతం మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. లిక్కర్ సిండికేట్కి దాసోహం.. లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కు అయిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సిండికేట్కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రులపై మళ్లీ సీరియస్మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ అయ్యారు. మంత్రులెవ్వరూ ఏ పని చేయడం లేదని.. తమ పని తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనే నెలకు రెండు, మూడుసార్లు పార్టీ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. వినతులు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడ్డవారి వివరాలు ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోంది’’ అంటూ ఎప్పటిలాగే అసంతృప్తిని మంత్రులపై నెట్టేశారాయన. -
ఏ రోజూ అలాంటి ఆలోచన చేయను: వైఎస్ జగన్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా ఎల్లప్పుడూ కలిసుండాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని తాము కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు సొంత ప్రయోజనాల కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి రెండు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు పెడుతున్నారని, ఇది ఎంతమాత్రం సరైంది కాదని అన్నారు.''అందరం అన్నదమ్ములం. మనమంతా ఒకటే భాష మాట్లాడుతున్నాం. ఎవరికి ఎవరూ వ్యతిరేకం కాదు. తెలంగాణ ప్రాంతంలోని వారికి నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్లకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమీ కట్టడం లేదు. ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనులమవుతాం. ఇదే మేం చేస్తున్నాం. ఇందులో ఒక ఎమోషనల్ డ్రామా ప్లే చేసి.. భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమం పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తావున్నారు. తప్పది. వాస్తవాలు కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నామ''ని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. రాయలసీమకు 'చంద్ర'గ్రహణంకాగా, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేసి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన స్వార్థ రాజకీయాల కోసం ప్రజా ప్రయోనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ను చంద్రబాబు దగ్గరుండీ మరి ఖూనీ చేశారని, ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ ఉండరని మండిపడ్డారు. తన స్వార్థం కోసం జన్మనిచ్చిన సీమకు వెన్నుపోటు పొడిచారని, రాయలసీమకు 'చంద్ర'గ్రహణం పట్టిందని జగన్ దుయ్యబట్టారు. చదవండి: ఆ 20 టీఎంసీల నీళ్లు ఉంటే..'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ (Credir Chori) చేయడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని పట్టించుకోలేదని, తమ హయాంలో పనులు వేగవంతం చేశామని గుర్తు చేశారు. కోవిడ్ కష్టాల్లో కూడా ఎయిర్పోర్టు పనులు ఆగలేదన్నారు. 2026లో భోగాపురం ఎయిర్పోర్టులో మొదటి విమానం టేకాఫ్ అవుతుందని 2023లోనే తాను చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు మనస్తత్వాన్ని 'క్రెడిట్ వితవుట్ కాంట్రిబ్యూషన్'గా వర్ణించారు. -
‘బాబు హయాంలో పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్తున్నాయి’
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ హయాంలో పరిశ్రమలు, పారిశశ్రామిక వేత్తలు పారిపోతున్నారని ప్రచారం చేశారు. మా హయాంలో కాదు.. చంద్రబాబు నాయుడు హయాంలో సంస్థలు తరలిపోతుందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఇదే విషయాన్ని ఆర్బీఐ కుండబద్దలు కొడుతూ డిసెంబర్ 11,2025న ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది.ఈ సందర్భంగా.. తమ హయాంలో పరిశ్రమలు, పారిశ్రామిక వేత్తలు తరలి వెళ్లాయని చంద్రబాబు అండ్ కో చేసిన విష ప్రచారాన్ని ఖండించారు.ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్టులో.. మా హయాంలో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)లో తయారీ రంగంలో భారత్లోనే రాష్ట్రం ఐదవ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీది అగ్రస్థానం.ఇది వాస్తవం. కానీ చంద్రబాబు ఏమంటారు. ప్రతిరోజు తనకున్న పైశాచికానందంతో మాపై టన్నుల కొద్ది బురద జల్లుతుంటారు.వాస్తవం ఏంటంటే?చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు బెదిరిపోతున్నారన్నది వాస్తవం.పేర్లు చెబుతా రాసుకోండి. సచిన్ జిందాల్,మైహోం సిమెంట్స్,శ్రీ సిమెంట్స్,రామ్కో సిమెంట్స్,దాల్మియా సిమెంట్స్,భారతి సిమెంట్స్తో పాటు ఇతర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా,ఏ జిల్లాలోనైనా చంద్రబాబుకు కప్పం కట్టకపోతే నడపలేరు’ అని తెలిపారు. ప్రెస్ మీట్లో ప్రదర్శించిన ప్రెజెంటేషన్ డాక్యుమెంట్స్ కోసం 👉.. జగన్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి -
ఆ 20 టీఎంసీల నీళ్లుంటే...
‘‘ఆ... ఏమవుతుంది? 20 టీఎంసీలే కదా? దానికే అంత పెద్ద రాద్ధాంతం చేస్తారా’’, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలివి. పద్నాలుగేళ్లకుపైగా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడంపై రాజకీయ నేతలే కాదు.. వ్యవసాయ, ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మనిషి జీవితానికి అత్యంత ప్రాథమికమైన అవసరం నీరు అన్నది ఆయనకు తెలియదని కాదు కానీ.. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించి రాయలసీమ ద్రోహి అనిపించుకోవాల్సి వస్తుందన్న భయంతో సమస్యను చిన్నదిగా చేసి చూపించే ప్రయత్నం చేసినట్టుగా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఇరవై టీఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకు సాక్షి.కాం ఒక ప్రయత్నం చేసింది. వివక్ష, పక్షపాతాలకు తావులేకుండా ఉండేందుకు ఇదే ప్రశ్నను కృత్రిమ మేధకు వేసింది. కృత్రిమ మేధ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది...అంతకంటే ముందు అసలు 20 టీఎంసీల నీళ్ల లెక్క ఒక్కసారి చూద్దాం. ఇంగ్లీషులో వెయ్యి మిలియన్ల ఘనపు అడుగులను క్లుప్తంగా టీఎంసీ అంటున్నాము. లెక్క ఏమిటంటే.. వందకోట్ల ఘనపుటడుగుల నీళ్లు. ఒక్కో ఘనపుటడుగులో 28.3 లీటర్లు. అంటే ఒక టీఎంసీ = 2831.68 కోట్ల లీటర్లు. ఇరవై టీఎంసీలంటే.. కొంచెం అటు ఇటుగా 56600 కోట్ల లీటర్లన్నమాట. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఇంత మొత్తంలో నీళ్లు వాడుకోగలిగితే ఏమవుతుందంటే...వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తే...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా అందుకునే 20 టీఎంసీల నీటిలో అరవై శాతం అంటే 12 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుంటే ఎంత భూమి సాగు చేయవచ్చో తెలుసా? సుమారు 1.5 లక్షల ఎకరాలు! రాయలసీమ తరువాత అత్యంత కరవు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లాకు ఈ నీరు చేర్చామనుకుందాం. ఎకరాకు సీజన్కు 12 లక్షల లీటర్లు అందించడం ద్వారా సుమారు లక్ష ఎకరాల్లో వరి, మిగిలిన నీటితో పత్తి, పప్పు ధాన్యాలు పండించవచ్చు. ఎన్ని రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుంచి, పేదరికం నుంచి బయటపడతాయో మనమే ఊహించుకోవచ్చు. పన్నెండు టీఎంసీల నీరు వ్యవసాయనికి కేటాయించగా మిగిలిన ఎనిమిది టీఎంసీలను తాగునీటికి, పరిశ్రమల అవసరాలకు వాడుకోవచ్చు. చెరిసగం చేద్దాం...మొత్తం 20 టీఎంసీల నీటలో వ్యవసాయానికి, పరిశ్రమలకు చెరి సగం నీళ్లు కేటాయించారనుకుందాం. పది టీఎంసీలతో సుమారు రెండు కోట్ల మందికి ఏడాది పొడవునా మంచినీరు ఇవ్వవచ్చు. విజయవాడ లాంటి నగరం ప్రస్తుతం రోజుకు 50 కోట్ల లీటర్లు ఖర్చవుతున్నట్లు అంచనా. 10 టీఎంసీలు విజయవాడకు మాత్రమే కేటాయిస్తే మూడేళ్లపాటు నీటి కొరత అస్సలు ఉండదు. ఇలా కాకుండా... కడప, అనంతపురం లాంటి రాయలసీమ పట్టణాలకు కేటాయిస్తే.. తాగునీటి అవసరాలు తీరడమే కాదు.. భూగర్భ జలాల మట్టం కూడా గణనీయంగా పెరుగుతుంది. తాగునీటికి పది టీఎంసీలు పోగా మిగిలిన నీటిలో ఆరు టీఎంసీలు సాగుకు, నాలుగు టీఎంసీలు తాగునీటికి ఇస్తే.. రాయలసీమ జిల్లాల్లో కనీసం యాభై వేల ఎకరాల్లో పచ్చని పంటలు పండుతాయి. అందరికీ సమపాళ్లలో ఇస్తే...సాగు, తాగు నీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు కూడా సమప్రాధాన్యం ఇచ్చి చూస్తే... ఎనిమిది టీఎంసీల సాగునీటితో వరి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు లక్ష ఎకరాల్లో పండించవచ్చు. అదే సమయంలో కోటీ ఇరవై లక్షల మంది దాహార్తిని ఏడు టీఎంసీల నీటితో పూర్తి చేయవచ్చు. అలాగే 5 టీఎంసీలతో పారిశ్రామిక వృద్ధికి కారణం కావచ్చు. విశాఖపట్నం ఫార్మా, స్టీల్ పరిశ్రమలు ప్రస్తుతం రోజుకు పది కోట్ల లీటర్ల నీరు వాడుతున్నట్లు అంచనాలున్నాయి. ఐదు టీఎంసీల నీటితో ఏడాది పాటు ఈ అవసరాలు తీరతాయి. రిజర్వాయర్ల రీఛార్జ్ కోసం...???రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఏటా ఇరవై టీఎంసీల చొప్పున అందే నీటిని నేరుగా వెలిగొండ, పెన్నా బేసిన్ లోని రిజర్యావర్లలో నింపామని అనుకుందాం. సుమారు 43 టీఎంసీల సామర్థ్యమున్న వెలిగొండ ప్రాజెక్టు సగం వరకూ నిండుతుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 600 గ్రామాలకు తాగునీటి నిరంతర సరఫరా సాధ్యమవుతుంది. బంగాళాఖాతంలోకి వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు. నిత్యం కరవు కాటకాలతో సమస్యలు ఎదుర్కొనే రాయలసీమ జిల్లాలు సస్యశ్యామలమవుతాయి -
పచ్చని సుక్షేత్రమే కానీ.. పిన్ను పీకేసిన గ్రనేడ్..
సైరన్ వినిపించినా.. టముకు శబ్దం చెవిని తాకినా.. హఠాత్తుగా కరెంటు ఆపేసినా.. అక్కడ జనం వణికిపోతారు.. తట్టాబుట్టాతో పిల్లాజెల్లాతో బంధువుల ఇళ్లకు బయల్దేరతారు.. కోనసీమలోని 316 గ్రామాలలోని పరిస్థితి ఇది. కోనసీమ అంటే.. అఖండ గోదావరి ఏడు పాయలుగా విచ్చుకున్న సుందరప్రదేశం.. గలగలపారే కాలువల నడుమ వరిపైర్లు.. కొబ్బరితోటలు.. అరటివనాలతో ఆహ్లాదాన్ని పంచే అందమైన ప్రాంతం. కానీ.. అందరికీ తెలియని కోనసీమ మరొకటుంది. చిన్న శబ్దానికే చిగురుటాకులా వణికిపోయే ప్రాంతం అది.. దానికి కారణం చమురు, సహజవాయువు నిక్షేపాలు.. ఆ సంపదను ఒడిసిపట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు.. అందుకే కోనసీమ అంటే.. పిన్ను పీకేసిన గ్రనేడ్.. అది ఏ క్షణంలో ఎక్కడ పేలుతుందో ఎక్కడ మండుతుందో.. ఇరుసుమండలో మండుతున్న ఓఎన్జీసీ బావి తాజా దృష్టాంతం.. అది ఓ సజీవ సాక్ష్యం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీకి చెందిన మోరి–5వ నంబర్ బావి వద్ద ఈ నెల 5న భారీ బ్లోఅవుట్ సంభవించింది. పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుపక్కల భీతావహ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మంటల తీవ్రత తగ్గినప్పటికీ బ్లోఅవుట్ ఇప్పటికీ అదుపులోకి రాలేదు. ముందుజాగ్రత్తగా ఇరుసుమండ, లక్కవరం గ్రామాలను ఖాళీ చేయించారు. మంటలు అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందని అంచనా.కోనసీమ కాదు బ్లో అవుట్ల సీమ.. కోనసీమలో చమురు, సహజవాయు సంస్థ ఓఎన్జీసీ జరుపుతున్న తవ్వకాలలో భాగంగా నిత్యం ఏదో ఒకమూల చిన్నపాటి బ్లోఅవుట్లు, గ్యాస్ లీక్ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఓఎన్జీసీ నిపుణులు వెంటనే అరికట్టేస్తుం టారు. అందువల్ల వాటి గురించి జనబాహు ళ్యానికి పెద్దగా తెలియదు. రికార్డులకూ ఎక్కవు. భారీ బ్లోఅవుట్ అయితేనే ప్రపంచానికి తెలుస్తుంది. అలాంటివాటిలో కొన్ని..తొలి బ్లోఅవుట్ కొమరాడలో..1993 మార్చిలో మామిడికుదురు మండలం కొమరాడలోని ఓఎన్జీసీ సైట్లో బ్లోఅవుట్ సంభవించింది. లీకైన గ్యాస్ బురద నీటిలో కలిసింది.. ఆ ప్రాంతంలో పలుచోట్ల మంటలు ఎగసిపడి, కొబ్బరి చెట్లు దగ్ధమయ్యాయి. కొన్ని రోజుల తర్వాత లీక్ అదుపులోకొచ్చింది..ప్రపంచంలోనే పెద్దది.. పాశర్లపూడి బ్లోఅవుట్1995 జనవరి 8న మామిడికుదురు మండలం పాశర్లపూడిలో పెద్దఎత్తున గ్యాస్ లీకైంది. పాశర్లపూడిృ19 బావి వద్ద డ్రిల్లింగ్ సమయంలో ఏర్పడిన గ్యాస్ లీక్కు నిప్పురవ్వ తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 65 రోజులపాటు కొనసాగాయి. ప్రమాదం సంభవించిన రిగ్గుకు రెండు కిలోమీటర్ల పరిధిలోని ఏడు గ్రామాలలో దాదాపు 5వేలకుపైగా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. ఓఎన్జీసీ అంతర్జాతీయ నిపుణులను సంప్రదించింది. చివరకు స్థానిక నిపుణుల బృందమే బావిని మూసివేయగలిగింది. మార్చి 15న మంటలు అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీకి రూ.16 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రమాద ప్రదేశంలో ధ్వంసమైన రిగ్గు ఖరీదు రూ.9కోట్లు. రూ.7 కోట్ల విలువైన ఇతర పరికరాలు ధ్వంసమయ్యాయి. వీటికి క్రైసిస్ మేనేజ్మెంట్ ఖర్చులు అదనం. ప్రపంచంలోనే పెద్ద బ్లోఅవుట్గా పేరు తెచ్చుకున్న ఈ ప్రమాదంలో రోజుకు వంద క్యూబిక్ మిలియన్ల గ్యాస్ వృథాగా మండిపోయింది. బ్లో అవుట్ జరిగేది ఇలా.. భూగర్భంలో ఉండే విపరీతమైన గ్యాస్ ఒత్తిడిని నియంత్రించలేని పరిస్థితుల్లో గ్యాస్బావిలోని పైప్లైన్లు లేదా ఇతర పరికరాల రాపిడి వల్ల నిప్పురవ్వలు ఏర్పడి మంటలు చెలరేగుతాయి. బావులు తవ్వుతున్నప్పుడు ఓఎన్జీసీ సిబ్బంది పైపులను దింపడం.. అవసరమైతే పైకి తీయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే నిప్పురవ్వలు రాజుకుంటాయి. గ్యాస్ బావుల తవ్వకంలో సాంకేతిక లోపాలు, పైప్లైన్ల నిర్వహణలో లోపాలు లేదా తుప్పుపట్టడం వంటి పరిస్థితులు బ్లోఅవుట్లకు కారణమవుతాయని నిపుణులంటున్నారు. పాశర్లపూడి గ్యాస్ బావి నుంచి పైపులను పైకి తీస్తున్న సమయంలో ఒక పరికరం జారి బోర్వెల్లో ఇరుక్కుపోయింది. అది పైపులకు అడ్డుపడగా.. అవి ఎక్కడికక్కడ బిగుసుకుపోయాయి. వీటిని బయటకు తీయటానికి లాగే క్రమంలో ఒరిపిడికి పుట్టిన నిప్పు రవ్వలతో గ్యాస్ అంటుకుంది. ఆ మంట బోర్వెల్లోకి దూసుకెళ్తున్న సమయంలో పాశర్లపూడి ప్రాంతంలో భూమి పెద్దగా కంపించింది. బోర్వెల్లో ఉన్న పైపులు పెద్ద శబ్దంతో పైకి ఎగిరి కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. ప్రాణాలు పోతాయనుకున్నా డ్వాక్రా సంఘం డబ్బులు రూ.30 వేలు మోటార్ సైకిల్ బ్యాగులో పెట్టుకుని బ్యాంకులో కట్టేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో గ్యాస్ ఎగజిమ్మి శబ్దం రావడంతో గ్రామంలో యువకులు హెచ్చరించారు. ఆందోళనతో మోటార్ సైకిల్ స్టార్ట్ చేయలేక కట్టుబట్టలతో పారిపోయా. పరుగెడుతుండగానే ప్రాణాలు పోతానుకున్నా. ఇలా బతికి వస్తాననుకోలేదు. మోటార్ సైకిల్ను దొంగలు పట్టుకుపోతుంటే యువకులు అడ్డుకుని నాకు తెచ్చి ఇచ్చారు. – వలవల సత్యనారాయణ, ఇరుసుమండభయంతో పారిపోయా.. బ్లో అవుట్ భయంతో ఇల్లు విడిచి పారిపోయాను. వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఏ వస్తువులు పోయాయో చూసుకుంటున్నాను. ఎవరు సాయం చేస్తారో తెలియడం లేదు. ఇంకా ఆ భయం వీడడం లేదు. చుట్టూ ఓఎన్జీసీ బావులే ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి మా ప్రాణాలకు రక్షణ కలి్పంచాలి. – చేట్ల రామలక్ష్మి, ఇరుసుమండబతుకుతామనుకోలేదు ఇంట్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో భారీ శబ్దం వచ్చింది. బయటకు వచ్చేసరికి గ్యాస్ ఎగదన్నుతోందని పక్కవాళ్లు చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. పెద్ద శబ్దం వచ్చేసరికి ఇంటికి తాళం వేసే ధైర్యం కూడా చేయలేకపోయాను. అందరూ పరుగులు తీస్తుండడంతో నేనూ అడ్డదారిలో పరుగులు పెట్టాను. బతుకుతామనుకోలేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. – ముగ్గు లక్ష్మి, ఇరుసుమండవారం రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతాం ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి ఎగసిపడుతున్న మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం మంటల తీవ్రత చాలావరకు తగ్గింది. మా సిబ్బంది బావికి దగ్గరగా చేరుకోగలిగారు. అక్కడి నుంచి శిధిలాలు తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. బావికి మరింత సమీపంగా చేరుకున్నాక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం క్యాప్ ఎలా బిగించాలి అనేదానిపై నిర్ణయం తీసుకుంటాం. హైడ్రో కార్బన్స్ మండేటప్పుడు దాని తీవ్రత అడుగున ఉన్న గ్యాస్ నిల్వలపైన ఆధారపడి ఉంటుంది. నిపుణులైన సిబ్బందిని, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నాం. – విక్రం సక్సేనా, శాంతనూర్దాస్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు -
సంక్రాంతి సంబరాలకు ఎఫెక్ట్?.. దూసుకొస్తున్న తుపాన్!
సాక్షి,అమరావతి: సంక్రాంతి పండుగకు ముందు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో తుపాను ముప్పు నెలకొననుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ తుపానుగా మారే అవకాశం ఉందని సమాచారం. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతోంది. ఇది తుపానుగా మారి తీర ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 60–100 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. తుపాను కారణంగా ఉత్తర ఆంధ్ర తీర ప్రాంతాలు ఒడిశా తీర ప్రాంతాలు, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు.తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.1891–2024 మధ్యకాలంలో సంక్రాంతి సమయానికి 12 సార్లు తుపానులు ఏర్పడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈసారి కూడా అదే తరహా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు ముందు తుపాను ముప్పు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ఇప్పటికే అలర్ట్ జారీ చేసి, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
పారని రాజకీయ కుట్ర
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షతో సాక్షి ఫోటో గ్రాఫర్ మోహన్కృష్ణతోపాటు, వైఎస్సార్సీపీ నాయకుడు కోటిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులకు తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వారిద్దరి రిమాండ్ని బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకెళితే.. తిరుమలలో ఈనెల 4న ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడటంతో వైఎస్సార్సీపీ నాయకుడు ఆలపాక కోటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయాన్ని సాక్షి ఫొటో గ్రాఫర్ మోహన్ కృష్ణకు సమాచారం ఇచ్చారు. అదే విషయాన్ని తిరుమల ఫొటో గ్రాఫర్ గిరి, సాక్షి టీవీ కెమెరామెన్కి సమాచారం ఇచ్చారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ వివరాలతో ‘సాక్షి’తోపాటు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. అన్ని మీడియా ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. అదే రోజు తిరుమల టూటౌన్లో కేసు నమోదైంది. అయితే గుర్తు తెలియని వ్యక్తుల పేరున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈనెల 5న తిరుపతి కలెక్టరేట్ వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను పోలీసులు అడ్డుకుని ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ పరిణామాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కేసు నమోదు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే టీటీడీ, టీడీపీ పెద్దల ఒత్తిడితో పోలీసులు తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై మోహన్కృష్ణపైనా, కోటిపైనా కేసులు నమోదు చేశారు. సాక్షి ఫొటోగ్రాఫర్ను టార్గెట్గా చేసుకుని రెండురోజులుగా ఓవర్ యాక్షన్ చేశారు. మంగళవారం తిరుమల టూటౌన్ పోలీసులు సాక్షి ఫోటో గ్రాఫర్ ఇంటికి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరింపులకూ దిగారు. దీంతో బుధవారం ఉదయం న్యాయవాది చంద్రశేఖర్రెడ్డితో కలిసి మోహన్ కృష్ణ అలిపిరి పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. అయితే సాయంత్రం వరకు డ్రామాలాడిన పోలీసులు ఆ తర్వాత టీడీపీ, టీటీడీ పెద్దల ఒత్తిడితో బెయిల్ రాకుండా ఉండేందుకు ఎఫ్ఐఆర్లో 152 సెక్షన్ అదనంగా చేర్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్, వైఎస్సార్సీపీ నాయకుడు కోటిని దేవలోక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కట్టుకథ అల్లారు. బుధవారం రాత్రి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టులో బాధితుల తరఫున న్యాయవాది చంద్రశేఖర్రెడ్డి చేసిన వాదనలతో ఏకీభవించిన రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్ను తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు, టీటీడీ పాలకమండలి పెద్దలు షాక్కు గురయ్యారు. -
రక్షకులా.. రాక్షసులా!
గుంటూరు జిల్లా: ‘బూటు కాళ్లతో మా పిల్లలను తొక్కుతారా? పన్నెండు మంది కలిసి పోల్ పీక్కెళితే అందులో నలుగురు దళిత బిడ్డలను మాత్రమే స్టేషన్కు పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టడమేంటి?’ అంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా? లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారా’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురానికి చెందిన పన్నెండు మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం ఓ వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని(పోల్) తొలగించి, తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టి ఉన్న విద్యుత్వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ ఓ మహిళ కాకుమాను పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వారిలో నలుగురు యువకులను పోలీసులు స్టేషన్కు పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషను వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాలుగు గంటల పాటు రాస్తారోకో ‘మా పిల్లలను బూటు కాళ్లతో తొక్కి, లాఠీలు విరిగేలా అరికాళ్లపై కొట్టిన ఎస్ఐ ఏక్నాథ్ను సస్పెండ్ చేయాలి. కులం పేరుతో దూషించిన ఏఎస్ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థులు, యువకులతో కలిసి మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పన్నెండు మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్లను వదిలేసి దళిత బిడ్డలనే స్టేషన్కు పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశి్నంచారు. చదువుకునే పిల్లలను ఇలా విచక్షణారహితంగా కొట్టడం ఏమిటంటూ తల్లిదండ్రులు నిప్పులు చెరిగారు. బాధిత యువకులు, విద్యార్థులు స్టేషన్లో సీసీ కెమెరాల్లేని గదిలోకి తీసుకువెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో వందల మంది మహిళలు, స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళితసంఘ నాయకుడు చార్వాక దళితులకు మద్దతు పలికి, రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమను, తమ పిల్లలను దూషించిన ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ చార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో చివరికి వారు శాంతించారు. కాగా, పోలీసుల దాషీ్టకానికి బలైన దళిత విద్యార్థులకు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళితవాడలో పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేది లేదని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు. -
రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ రూ.1,000
సాక్షి, అమరావతి: ప్రభాస్ నటించిన కొత్త సినిమా రాజాసాబ్ ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల ధరలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గురువారం సాయంత్రం ప్రదర్శించే ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని, ఒక్కో టికెట్పై అదనంగా సింగిల్ స్క్రీన్లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మిమ్మల్ని నమ్మి భూములెలా ఇవ్వాలి?
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ: ‘‘మిమ్మల్ని నమ్మి భూములు ఎలా ఇవ్వాలి? భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటి? మీరు హామీలిచ్చి వెళ్లిపోతారు. తర్వాత దిక్కెవరు?’’ అని రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణలో వడ్డమాను గ్రామ రైతులు మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్లను నిలదీశారు. భూములు తీసుకున్న మూడేళ్లలో అభివృద్ధి చేసివ్వకపోతే ఎకరాకు రూ.5 లక్షల చొప్పున ఏటా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బుధవారం తుళ్లూరు మండలం వడ్డమాను, అమరావతి మండలం యండ్రాయి గ్రామాల్లో సభలు నిర్వహించారు. ‘‘గతంలో ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు అందజేయగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. రోడ్డున పడినా పట్టించుకోలేదు. ప్రభుత్వం చేయలేకపోతే ఏంటి? అనేదానిపై సరైన జవాబు చెప్పాలి’’ అని వడ్డమానులో మంత్రి నారాయణను రైతులు ప్రశ్నించారు. రైతు ఆళ్ల బసవ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? మూడు కాదు నాలుగేళ్లు తీసుకోండి. అనుకున్న సమయంలో ప్లాట్లు అభివృద్ధి చేయలేకపోతే మేం కోర్టులకు వెళ్లి లేదా ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకునేలా ప్రభుత్వం అగ్రిమెంట్ చేయాలి’’ అని కోరారు. ⇒ ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామస్థులతో మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో భూములు ఇచ్చేందుకు సమ్మతిస్తూ వడ్డమాను రైతులు మైనేని సత్యనారాయణ, సాయితరుణ్, వడ్లమూడి శ్రీలక్ష్మిలు ఫారం–1ను అందజేశారు. సీఎం సూచనతో పూలింగ్లో భూములిచ్చే రైతు కుటుంబాలకు రూ.లక్షన్నర రుణమాఫీ ప్రకటిస్తున్నట్లు నారాయణ తెలిపారు. కౌలు పెంచేందుకు సీఎం అంగీకరించారని చెప్పారు. వడ్డమానులో 1,768 ఎకరాల పూలింగ్ ప్రారంభించిగా ముగ్గురు రైతులు ఫారం–1 ఇచ్చారన్నారు. గతంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర కారణాలతో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. అమరావతిలో పనులు మూడేళ్లలో పూర్తవుతాయని, రైతులకిచ్చే ప్లాట్లలో ముందు 2 వరుసల రోడ్లు నిర్మింస్తామన్నారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ్ తేజ పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అగ్రిమెంట్పై మీకు అభ్యంతరం ఏమిటి? వడ్డమాను రైతు చిట్టా సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ‘‘ఇదివరకు మెట్టకు 1,250, జరీబుకు 1,450 గజాలు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వానికి సరిపడా భూములున్నాయి కనుక 1,450 గజాలు ఇవ్వాలి’’ అని కోరారు. ఎకరాకు రూ.60 వేల కౌలు ఇవ్వాలని, భూ సమీకరణ చట్టం రైతులకు అనుకూలంగా లేదని, ప్లాట్ల అభివృద్ధిపై అగ్రిమెంట్ చేసివ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరమేంటి? అని రైతులు సూటిగా ప్రశ్నించారు. అగ్రిమెంట్ చేసేది లేదంటూ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ పదేపదే చెప్పడంతో పాటు ‘‘మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో కోర్టుకు వెళ్లొచ్చు’’ అని సమాధానమిచ్చారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేయలేదనే గడువు పెంచి ఇప్పుడు రైతులకు పరిహారం ఇస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. -
సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి జీవనాడి పోలవరం సాక్షిగా... రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు తన కడుపు మంట, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.3,528 కోట్లు మంజూరు చేసి సరైన అనుమతులు లేకుండా ప్రారంభించారని విమర్శించారు. అనుమతులు లేని ప్రాజెక్టును మొదలుపెట్టి విచ్చలవిడిగా, అడ్డగోలుగా పనులు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువన కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉంటాయని.. అందులో రాష్ట్ర వాటా 22 టీఎంసీలని.. ఆ నీటిని వాడుకోవడానికి మల్యాల, ముచ్చుమర్రి (హంద్రీ–నీవా) ఎత్తిపోతల ఉందంటూ దబాయించారు. ఆ నీటిలో రోజుకు 3 టీఎంసీలను మళ్లించేలా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని.. దానిపై ఎవరో ఎన్జీటీలో కేసు వేస్తే పనులు ఆపేయాలని తీర్పు ఇచ్చిందని.. దాంతో పనులు ఆగిపోయాయంటూ తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్వాల్ పూర్తవుతుందని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయని, హంద్రీ–నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చామని, కుప్పం వరకు నీళ్లు పారించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా సీఎం చంద్రబాబునాయుడుతో ఏకాంతంగా (క్లోజ్ రూమ్లో) సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయించా..! ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను ఇంతవరకూ చంద్రబాబు ఖండించకపోవడం గమనార్హం. ఆ సమావేశంలో ఏం ఒప్పందం కుదిరిందన్నది వెల్లడించలేదు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది నిజమేనని చంద్రబాబు అంగీకరించారన్నది స్పష్టమవుతోంది. దీన్ని బట్టి.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతో.. పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. రాయలసీమ, నెల్లూరు వరదాయిని..⇒ శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ⇒ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ⇒ ఇదే అదునుగా తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా నాడు బాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సాధించుకుంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ –నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. ⇒ శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ.. 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా సరే.. డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఇక శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ సర్కార్ వచ్చింది వచ్చినట్టుగా నీళ్లను తరలించడం వల్ల నీటి మట్టం 881 అడుగులకు చేరడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడటమే అందుకు నిదర్శనం. ⇒ ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరదాయిని అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ⇒ చంద్రబాబు చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు 3 టీఎంసీలను ఎత్తిపోసి.. మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల.పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా మోకాలడ్డు..రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర‡్ష్యతో.. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారని.. అదే వ్యక్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో పిటిషనర్ వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై తాగునీటి అవసరాల కోసం సీమ ఎత్తిపోతల పనులను కొనసాగించింది. ఈ క్రమంలో రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు.ఒక్క ప్రాజెక్టూ కట్టకుండా బడాయి మాటలు..ఉమ్మడి రాష్ట్రంలో 1995–99, 1999–2004.. విభజన తర్వాత 2014–19, మళ్లీ ఇప్పుడు.. మొత్తం నాలుగు సార్లు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నారు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు.. నిర్మాణాన్ని చేపట్టలేదు.. పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు అంటూ జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు తానే కట్టానంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ బడాయి మాటలు మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తోటపల్లి, పుష్కర, తాడిపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 వంటి భారీ, సూరంపాలెం, భూపతిపాలెం వంటి మధ్య తరహా 83 ప్రాజెక్టులు చేపట్టి.. తాను మరణించే నాటికే 44 ప్రాజెక్టులను పూర్తి చేసి, జాతికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాహేశ్వరరావుతో తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ నిర్మాణంలో లోపాల వల్ల మట్టికట్టలో లీకేజీలు ఏర్పడటంతో 2020 వరకూ ఎన్నడూ నాలుగైదు టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖాలు లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించి, మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020 నుంచి బ్రహ్మంసాగర్లో పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆ పనులను పర్యవేక్షించిన రిటైర్డు అధికారి ఒకరు విస్తుపోయారు. మహానేత వైఎస్ నిర్మించిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వైఎస్ జగన్ 2019లో రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించి.. ఆ రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను ప్రతి ఏటా నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటం గమనార్హం. ఇక మహానేత వైఎస్సార్ పూర్తి చేసిన పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకాలను తాను పూర్తి చేసినట్లుగా సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది.జగన్ హయాంలోనే సీమ సుభిక్షం..⇒ నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. ⇒ తెలుగుగంగ లింక్ కెనాల్ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. ⇒ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ⇒ గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి..గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ⇒ ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది.కొత్తగా అనేక పనులు చేపట్టిన జగన్ సర్కార్...మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. ⇒ కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ⇒ తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. ⇒ గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. ⇒ హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. ⇒ కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడతారు. -
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టులో వైఎస్సార్సీపీ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఇప్పటికే కోటికి పైగా సంతకాలు సేకరించగా... ఇప్పుడు న్యాయ పోరాటం ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల విషయంలో చంద్రబాబు సర్కారు తీరును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తరఫున ఆయన న్యాయవాది మారక్కగారి బాలకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వమే నిరి్మంచి, నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రైవేటీకరణకు జారీ చేసిన ఉత్తర్వులు, టెండర్ నోటిఫికేషన్ను సైతం సవాల్ చేశారు. దాదాపు 2,300 పేజీలతో ఆయన పిల్ వేయడం విశేషం. కాగా, వైఎస్సార్సీపీ దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం స్పందించిన హైకోర్టు... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ, రాష్ట్ర వైద్య విద్య పరిశోధన కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్సీ) ఎండీలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశాం వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ... కోటిమంది గొంతుకగా తాము పిల్ వేశామని, ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ విధానాన్ని సవాల్ చేశామని చెప్పారు. ప్రైవేటీకరణపై ఇప్పటికే ఒక వ్యాజ్యం దాఖలైందని గుర్తు చేసిన ధర్మాసనం... అందులో వాదనలు వినిపించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే, అందులోని అంశాలకు, ప్రస్తుత వ్యాజ్యంలో తాము లేవనెత్తినవాటికి చాలా తేడా ఉందని పొన్నవోలు బదులిచ్చారు. ప్రభుత్వ విధానాన్ని నిర్దిష్టంగా సవాల్ చేశామని, ప్రైవేటీకరణ కారణంగా వైద్య ఖర్చులను భరించడంలో ప్రజల శక్తి, ప్రభుత్వంపై పెట్టుకున్న చట్టబద్ధమైన నమ్మకం వంటి అనేక విషయాలను లేవనెత్తామని చెప్పారు.ప్రభుత్వం జాప్యం చేస్తుంది.. పొన్నవోలు వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ఒకే అంశంపై ఇలా పిటిషన్లు వేస్తూ ఉంటే, ఎప్పటికీ తేలవని వ్యాఖ్యానించింది. ఈ పిల్ను అడ్డంపెట్టుకుని ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు మరింత సమయం కోరుతుందని, దీంతో విచారణలో జాప్యం జరుగుతుందని పేర్కొంది. సుధాకర్రెడ్డి స్పందిస్తూ... తమ పిల్ను ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో జత చేసినా అభ్యంతరం లేదన్నారు. దీంతో ధర్మాసనం వైఎస్సార్సీపీ వ్యాజ్యాన్ని ప్రైవేటీకరణపై గతంలో దాఖలైన వ్యాజ్యంతో జత చేసింది.చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటీకరణతో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు ఖరీదైనవిగా మారిపోతాయి. వైద్య కళాశాలల్లో రూ.వేలల్లో ఉన్న ఫీజులు రూ.లక్షల్లోకి వెళ్లిపోతాయి. ప్రైవేటీకరణతో అంతిమంగా పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. – పొన్నవోలు సుధాకర్రెడ్డి -
ఫీజు బకాయిలివ్వండి మహాప్రభో
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలను నడిపే పరిస్థితి లేదని ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల అసోసియేషన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కళాశాలల నిర్వహణ కోసం బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి కూడా దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాయి. అప్పులు కట్టడానికి మళ్లీ అప్పులు చేయడం, అప్పుపుట్టే దారి లేకపోవడంతో విద్యాసంస్థల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం తీరును నిలదీస్తూ రెండు అసోసియేషన్లు బుధవారం వేర్వేరుగా బహిరంగ లేఖలను విడుదల చేశాయి. కనీసం సంక్రాంతి పండగకు ఉద్యోగులకు, అధ్యాపకులకు జీతాలివ్వలేకపోతున్న దుస్థితిని ప్రభుత్వం కల్పించిందంటూ నిరసన తెలిపాయి. గత సెప్టెంబర్లో విడతల వారీగా కళాశాలలకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ హామీని గాలికొదిలేసిందని మండిపడ్డాయి. 9 క్వార్టర్లకు సంబంధించి సుమారు రూ.6,300 కోట్ల బకాయిలున్నట్లు తెలిపాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని ప్రభుత్వ అసమర్థతను ఎత్తి చూపించాయి. ఫీజు క్యాలెండర్ను తేదీలతో ప్రకటిస్తామని చెప్పి ముఖం చాటేస్తుండటంపై మండిపడ్డాయి. ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులు, పట్టభద్రుల ఎమ్మెల్సీలతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడును ఆలకించేవారు కనిపించలేదని అసహనాన్ని వ్యక్తం చేశాయి. ఎప్పటికప్పుడు ‘ఈ నెల.. వచ్చే నెల..’ అంటూ మాటలు దాటవేయడం తప్ప రూపాయి విడుదల చేయటంలేదని దుయ్యబట్టాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంతోపాటు 2026–29 విద్యాసంవత్సరాలకు ఫీజులు పెంచాలని కోరాయి. ఫీజులు నిర్ధారణ చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రైవేటు డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణాజీ, రాజకుమార్చౌదరి, ఇంజనీరింగ్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోయి సుబ్బారావు, గ్రంధి సత్యనారాయణ లేఖలు విడుదల చేశారు. -
అసలు విషయంపై మాట్లాడని చంద్రబాబు
ఏలూరు, సాక్షి: నీళ్లపై రాజకీయాలు వద్దంటూ ఆవేశపూరితంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు.. అసలు విషయంపై స్పందించలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించినట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై ఏపీ సీఎం పెదవి మాత్రం విప్పలేదు. పోలవరం సమీక్ష పనుల తర్వాత నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. నీటి రాజకీయాలంటూ ఏవేవో అంశాలపై మాట్లాడారు. అయితే.. కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను తానే ఆపించానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. క్లోజ్ రూమ్లో తమ మధ్య భేటీ జరిగిందని రేవంత్ చెప్పగా.. ఆ గదిలో ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో చంద్రబాబు చెప్పలేకపోయారు. అలాగే తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గారో అనే అంశంపై కూడా నోరు తెరవలేకపోయారు. అయితే.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాత్రం తప్పుడు ప్రచారం చేశారు. సీమ రైతుల ఆందోళనను లెక్క చేయని చంద్రబాబు.. అసలు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదన్న ధోరణిలో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరుతున్నా. రాజకీయ నేతలు పోటీపడి మాట్లాడటం సరికాదు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. భావోద్వేగాలతో ఆటలు ఆడటం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్టీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్నగర్కు ఇచ్చాం. దేవాదుల, కల్వకుర్తి నేనే ప్రారంభించా. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్లండి.. ఎవరు వద్దన్నారు?. ఈ మధ్య కొందరి మాటలు చూస్తే.. రాజకీయాలు నాకే అర్థం కాలేదు. గోదావరి నదికి ఎగువన దేవాదుల ప్రాజెక్టు ఉంది. దేవాదుల నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. కిందకు వచ్చే నీళ్లకు మీరు అభ్యంతరం చెబితే ఏమైనా అర్థం ఉందా? ఆరోజు మంజీరాకు నీళ్లు తీసుకెళ్లారు.. అప్పుడు స్వాగతించాం. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి.. పూర్తి చేసుకోండి. దేవాదులకు మేం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకు కూడా లబ్ధి కలుగుతుంది. మిగిలిన నీరు సాగర్, శ్రీశైలంలో నిల్వ చేస్తే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన ప్రాజెక్టులు కడితే నష్టం. కృష్ణా డెల్టాను కాపాడి గోదావరిని అనుసంధానం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. రాయలసీమ ఎత్తిపోతలపై చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం అవుతుందని భావిస్తున్నారు.సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకుంటే లాభాలు ఉంటాయి..నష్టాలు ఉంటాయి’’ అని చంద్రబాబు చెప్పారు. -
రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగు నీటి ప్రాజెక్టులన్నీ చంద్రబాబు మూలనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేశారు. కమీషన్ల కోసమే రూ.8 వేల కోట్ల బిల్లులు ఇచ్చారు. అంతే తప్ప ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు’’ అని సతీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘2020లోనే రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు ఆగిపోయిందని మంత్రి రామానాయుడు అబద్దాలు చెప్తున్నారు. మీ ప్రభుత్వం దగ్గరే ఉన్న ఎంబుక్లూ చెక్ చేసుకుంటే మంత్రికి వాస్తవాలు తెలుస్తాయి. గతంలో జరిగిన పనులకు కమీషన్ల కోసం బిల్లులు మంజూరు చేశారే తప్ప ప్రాజెక్టుల నిర్మాణం కోసం కాదు. కమీషన్లు తీసుకుని రూ.8 వేల కోట్లు రిలీజ్ చేశారు. రూ.1100 కోట్లతో కుప్పం వరకు నీటిని తీసుకెళ్లే పని జగన్ ప్రారంభిస్తే దాన్ని కూడా చంద్రబాబు ఆపేశారు. మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందకుండా చేశారు. దీనివలన చంద్రబాబు నియోజకవర్గం కుప్పం కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది’’ అని సతీష్రెడ్డి నిలదీశారు.‘‘తెలంగాణ కృష్ణా జలాలను తరలించుకు పోతుంటే.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోవటం లేదు?. 800 అడుగుల్లో ఉన్న నీటినే తెలంగాణ తీసుకెళ్తోంది. మరి రాయలసీమ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి?. చంద్రబాబుకు రాయలసీమ మీద ఏమాత్రం ప్రేమ లేదు. కొన్ని దశాబ్ధాలుగా దుర్భిక్షం అనుభవిస్తున్న రాయలసీమ మీద వైఎస్సార్, జగన్ ప్రేమ కనపరిచారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 44 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన నేత వైఎస్సార్. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలతో చంద్రబాబు కుట్ర బయట పడింది’’ అని సతీష్రెడ్డి దుయ్యబట్టారు.‘‘రేవంత్ చెప్పింది అబద్దమైతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదు?. చంద్రబాబు అసమర్థత వలనే రాయలసీమ ప్రాజెక్టులు ఆగిపోయాయి. చంద్రబాబు వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ప్రజల అభీష్టం కూడా తెలుసుకోవాలి. హెచ్ఆర్ఎస్ఎస్ కాలువ లైనింగ్ పనులు తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకేమీ జరగటం లేదు. ఆ లైనింగ్ పనులను ఆపాలని రైతులు కోరినా పట్టించుకోవటం లేదు. లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అందవని రైతులు వాపోతున్నారు’’ అని సతీష్రెడ్డి చెప్పారు. -
చంద్రబాబు సర్కారుపై తిరగబడ్డ అమరాతి రైతులు!
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుపై అమరాతి రైతులు తిరగబడ్డారు. ‘తొలి దశలో మిమ్మల్ని నమ్మి వేలాది ఎకరాలు ఇస్తే.. మాకు అరుణ్య రోదన మిగిల్చారు. సంచార జాతుల్లా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. అభివృద్ధి.. అభివృద్ధి అంటున్నారు ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి చేశారు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అమరావతి రైతులు షాకిచ్చారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండో దశ ల్యాండ్ పూలింగ్ కోసం నిర్వహించిన గ్రామ సభకు హాజరైన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ను నిలదీశారు.బుధవారం తుళ్లూరు మండలం వడ్డమానులో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ సభ నిర్వహించింది. గ్రామ సభలో గ్రామస్తుల నుంచి భూసేకరణకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ప్రయత్నించారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని.. భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అన్నీ ప్రయోజనాలు కల్పిస్తామని సూచించగా.. ఇందుకు వారు ససేమిరా అన్నారు. ఈ సందర్భంగా.. అమరావతి చట్టబద్ధపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్పై గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో గ్రామ సభలో గందర గోళం నెలకొంది. తొలి విడుత భూసేకరణ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. మూడేళ్లలో అభివృద్ధి గ్యారంటీ అని మీరు రాసిస్తారా? చట్టబద్ధత ఎక్కడ? అభివృద్ధి ఏది? అని నిలదీశారు. అందుకు తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పందిస్తూ.. అమరావతి చట్టం ఉంది. అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా. మూడేళ్లలో అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపారు.అభివృద్ధి చేయకపోతే ప్రతి ఏటా ఎకరానికి రూ.5లక్షలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014లో మీ మాటల్ని నమ్మి 50వేలమంది రైతులు ఎకరాలకు ఎకరాలు భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చారా?.అయినా, మీరు చెప్పేది మాకు అనవసరం. మా భూములను అభివృద్ధి చేశారా?.అభివృద్ధి చేస్తామని చెప్పడం కాదు. అగ్రిమెంట్లో పెట్టండి..అమరావతి రైతుల బతుకు అరణ్య రోదనగా మారింది. సంచార జాతుల్లా మేం రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. మూడేళ్లలో అభివృద్ధి చేయకుంటే ఏం పరిహారం ఇస్తారో చెప్పండి. మా డిమాండ్లకు అంగీకరించి అడుగు ముందుకు వేయాలి’ అని స్పష్టం చేశారు. -
శిష్యుడి మాటకు గురువు తలూపుతున్నారా?
ఎల్లో మీడియాకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకోపక్కేమో తమకు అత్యంత ప్రియుడైన తెలుగుదేశాధిపతి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబును చిక్కులే పడేసేలా వ్యాఖ్యానిస్తే.. సమర్థించుకోలేక, విమర్శించనూ లేక అల్లల్లాడిపోతోంది ఈ పచ్చమీడియా! తన విజ్ఞప్తితోనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని రేవంత్ చెప్పడం.. ఏపీలో తెలుగుదేశంతోపాటు, ఎల్లో మీడియాకు కూడా దిక్కుతోచటం లేదు.రేవంత్ రెడ్డిని విమర్శించే ధైర్యం తెలుగుదేశం పార్టీ ఎటూ చేయదు. వంతపాడే జనసేన, బీజేపీలు కూడా కామ్గానే ఉన్నాయి. రహస్య విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి మూడు రోజులు అవుతున్నా చంద్రబాబు కూడా రేవంత్ వ్యాఖ్యలను నేరుగా ఖండించలేకపోయారు. నష్టం కొంత తగ్గిద్దామనుకున్నాయేమో.. ఎల్లో పత్రికలు రేవంత్ వ్యాఖ్యలను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేశాయి. చంద్రబాబుకు నష్టం జరిగే సమాచారాన్ని ఎడిట్ చేసి కనీ కనిపించకుండా వేసి ఏపీ పాఠకులను మోసం చేశాయి.సాక్షి మీడియా మాత్రమే రేవంత్ ప్రకటనను యథాతథంగా ఇచ్చింది. విశ్లేషణలు అందించింది. సాక్షి, సోషల్మీడియా చురుకుగా ఉండటంతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ముఖ్యంగా రాయలసీమకు ఎంత అన్యాయం చేసింది అర్థమైంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఈ ఊబి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తన సహజ ధోరణిలో జగన్ వల్లే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ఆగిందంటూ దిక్కుమాలిన వాదన తెరపైకి తెచ్చింది. ఈనాడు పత్రిక తెలంగాణ ఎడిషన్లో 'చచ్చినా, బతికినా తెలంగాణ కోసమే’ అన్న శీర్షికతో రేవంత్ వ్యాఖ్యలను ప్రచురించింది.ఇందులో రాయలసీమ లిఫ్ట్ను తానే ఆపు చేయించానన్న అంశానికి ప్రాధాన్యమివ్వలేదు. లోపల పేజీలో మాత్రం కొద్దిగా రాసింది. అందులో కూడా జగన్ ప్రస్తావన తెచ్చింది. పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టి కేసీఆర్ భుజం తట్టి జగన్ను ప్రోత్సహిస్తే తాను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆపించానంటూ రేవంత్ చేసిన కామెంట్ను ముద్రించారు. తెలంగాణలో కనీసం లోపలి పేజీలోనైనా వేశారు.. ఈనాడు ఏపీ ఎడిషన్లో వేసినట్లు కనిపించలేదు. కాని మరుసటి రోజు మాత్రం మంత్రులు సవిత, రామానాయుడుల ప్రకటనలను మొదటి పేజీలో ప్రచురించారు.కాగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రేవంత్ అబద్దాలు చెప్పారని చేసిన వ్యాఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈనాడు మీడియా చంద్రబాబు పట్ల స్వామిభక్తి చూపింది. రాయలసీమ లిఫ్ట్ ఆగడానికి కారణం జగనే అని ఏపీ మంత్రి సవిత ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాలతోనే 2020లో ఎత్తిపోత పనులు నిలిచిపోయాయని అన్నారు. చంద్రబాబును బూచిగా చూపుతూ తెలంగాణ నేతల రాజకీయ ఎత్తుగడలుగా ఈ ఉదంతాన్ని కొట్టిపారేశారు. అంతే తప్ప తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక్క మాట అనలేకపోయారు. దీనినిబట్టి టీడీపీ కాంగ్రెస్ మాచ్ ఫిక్సింగ్ చాలా స్పష్టంగా వెల్లడైంది. ఈ పథకంపై ఎన్జీటీలో ఫిర్యాదు చేసింది తెలంగాణ టీడీపీ సహకారంతోనే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్జీటీ వ్యతిరేక ఆదేశాలు ఇచ్చినా జగన్ వ్యూహాత్మకంగా పనులు కొనసాగించారు. దాంతో అటు కేసీఆర్ ప్రభుత్వం, ఇటు ఏపీలో జగన్ అంటే పడని శక్తులు ఎన్జీటీకి మళ్లీ మళ్లీ ఫిర్యాదులు చేశాయి. ఈలోగా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 19 నెలలు అయినా ఈ స్కీమ్ అడుగు ముందుకు కదల్లేదు. ఎందుకిలా అన్నదానికి ఈ మంత్రులు సమాధానం ఇవ్వాలి కదా! ఆ ఊసే లేకుండా వారు స్టేట్ మెంట్ ఇచ్చారు.కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుపుతున్నామని ఊదరగొట్టే ఈ నేతలు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తెచ్చి ఉండాలి కదా!అవేమీ చేయలేదంటే ఈ పథకాన్ని ఆగినా, రాయలసీమకు నష్టం జరిగినా ఫర్వాలేదన్నట్లే కదా అన్న ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారు? రేవంత్ డిమాండ్ కు తలొగ్గినట్లే అవుతుంది కదా! ఒకవేళ జగన్ పై ఇలాంటి ఆరోపణ వచ్చి ఉంటే తెలుగుదేశంతోపాటు ఎల్లో మీడియా ఎంత రచ్చ చేసి ఉండేవో ఊహించుకోవచ్చు. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కూడా రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ ఒక తప్పుడు ఆరోపణ చేశారే తప్ప, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక్క విమర్శ చేయలేదు. రేవంత్ చాలా స్పష్టంగా ఏకాంత సమావేశంలో చంద్రబాబును ఒప్పించానని వెల్లడించారు. తనపై గౌరవంతోనే చంద్రబాబు ఈ స్కీమ్ పనులు నిలిపివేశారని అన్నారు. కావాలంటే కమిటీగా వెళ్లి చూడవచ్చని తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. అయినాసరే... టీడీపీ నేతలు, మంత్రులు మొక్కుబడిగా మాట్లాడి సరిపెట్టుకున్నారు.రాయలసీమకు చెందిన చంద్రబాబు నాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణమా? కాదా? వైఎస్సార్ కాంగ్రెస్ కాని, ప్రజాసంఘాలు కాని చేస్తున్న విమర్శలకు కూటమి నేతలు నేరుగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. 2024లో జగన్ ప్రభుత్వం ఉన్నంతవరకూ ఈ స్కీమ్ పనులు కొనసాగాయనేందుకు వైసీపీ నేత సతీష్ రెడ్డి రికార్డులు చూపించారు. వైసీపీ బృందం ఒకటి లిఫ్ట్ స్కీమ్ ప్రాంతానికి వెళ్లి జగన్ టైమ్లో జరిగిన పనులు ప్రజలకు తెలియచెప్పింది.అలాగే నమస్తే తెలంగాణ పత్రిక గతంలో ఆ ప్రాంతానికి వెళ్లి జగన్ ఈ స్కీమ్ పనులు ఆపలేదని, ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన నాటికి 14 శాతం పనులు జరిగితే, ఆ తర్వాత 85 శాతం జరిగాయని ఆ రోజుల్లో తెలిపింది. ఏపీ మంత్రులు ఈ విషయాలను కప్పిపుచ్చుతూ ప్రకటనలు చేస్తున్నారు. ఎల్లో మీడియా కూడా అప్పట్లో ఈ స్కీమ్ను ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఆపలేదంటూ కొన్ని వార్తలు ఇచ్చిన క్లిప్లింగ్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ మీడియా కూడా జగన్పై ద్వేషంతో రాయలసీమకు నష్టం చేయడానికి వెనుకాడలేదన్నమాట.ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో దీనిపై మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు చెబుతారని లీక్ ఇచ్చారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక 'సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని పెద్ద హెడింగ్ పెట్టి తన పాఠకులను, ఏపీ ప్రజలను మోసం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ఈ పత్రిక రేవంత్ చేసిన వ్యాఖ్యల సారాంశాన్ని ఒక్క ముక్క కూడా ఏపీ ఎడిషన్ లో ప్రస్తావించినట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు మాత్రం తాటికాయంత శీర్షిక పెట్టి జగన్ పై బురద చల్లేందుకు యత్నం చేసింది. రేవంత్ ప్రకటనతో ఏపీలో చంద్రబాబుకు తీరని నష్టం జరిగిందని గమనించిన ఈ ఎల్లో మీడియా మొత్తం ఇష్యూని జగన్ పై నెట్టేసి టీడీపీని రక్షించాలని విఫల యత్నం చేసింది.అనుమతులు లేవు.. డీపీఆర్ లేదు.. అయినా జగన్ 2020లో ఈ ప్రాజెక్టును చేపట్టారని ఈ పత్రిక రాసింది. పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయంటూ రాశారు. ఈ వివాదంలో చంద్రబాబుపై బురద చల్లి రాజకీయ లబ్దిపొందేందుకు వైసీపీ ఎత్తు అని ఎల్లో మీడియా ఆరోపించింది. అయినా వాస్తవాలు వెల్లడవడంతో ఆ ఎత్తు చిత్తయిందని ఈ పత్రిక అభిప్రాయపడింది. అది నిజమే అయితే ఇంతగా కంగారు పడుతూ జగన్కు వ్యతిరేకంగా కథనాలు ఇవ్వవలసిన అవసరం ఏముంది. అసలు ఈ వివాదానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కదా! ఆయనను ఎందుకు ఒక్క మాట అనలేదు?జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ పనులను చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు వేసింది తెలియచేస్తూ సోషల్ మీడియాలో విశ్లేషణలు వస్తున్నాయి. అటు రేవంత్ తోను, ఇటు చంద్రబాబుతోను ఈనాడు యజమాని కిరణ్ కు, ఆంద్రజ్యోతి యజమాని రాధాకృష్ణకు ఉన్న సంబంధాలు అందరికి తెలిసినవే. వారి వ్యాపార ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని తాకట్టు పెట్టారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఎల్లో మీడియాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అవడంతో దానిని కవర్ చేయడానికి జగన్ పై తోసేయాలని కుట్ర చేస్తున్నారు.ఇదే టైమ్ లో ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి బనకచర్లకు లిఫ్ట్ స్కీమ్ అంటూ విపరీతంగా ప్రచారం చేసి, సడన్గా దానిని ఆపేసి పోలవరం-నల్లమల సాగర్ స్కీమ్ అంటూ కొత్త గాత్రం ఎందుకు ఎత్తుకున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా! ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ తో ఏర్పడిన సంబంధ బాంధవ్యాల రీత్యా చంద్రబాబు ఆయన మాట కాదనలేని పరిస్థితి ఏర్పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.ఆ కేసు వల్లే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదలుకుని చంద్రబాబు ఏపీకి వెళ్లిపోతే, ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టి ఏకంగా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నే నీరుకార్చుతున్నారన్న విమర్శను ఎదుర్కుంటున్నారు. అంటే గురువును శిష్యుడే శాసిస్తున్నారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పిల్
సాక్షి, అమరావతి: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ పిల్ వేసింది. పిల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గతంలో దాఖలైన పిటిషన్లను కలిపి విచారిస్తామని పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.పిల్లో కీలక అంశాలు..ఏపీలో ఉన్న 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలని.. ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఉండకూడదని పిల్లో వైఎస్సార్సీపీ పేర్కొంది. ‘‘ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించటానికి వీటి ఏర్పాటు జరిగింది. మెడికల్ కాలేజీల నిర్వహణ బడ్జెట్ ప్రభుత్వానికి భారం లేకుండా అప్పటి ప్రభుత్వం విధానాలను రూపొందించింది. మెడికల్ కళాశాలల్లో కొన్ని సీట్లను మాత్రమే డొనేషన్కి కేటాయించి ఆ డబ్బును ఆసుపత్రులకు వాడే విధంగా మార్గదర్శకాలు అప్పటి ప్రభుత్వం రూపొందించింది’’ అని కోర్టుకు వైఎస్సార్సీపీ తెలిపింది.అనుబంధ పిటిషన్ దాఖలు..టెండర్లు ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ పిటిషన్ను కూడా వైఎస్సార్సీపీ దాఖలు చేసింది. పీపీపీ వల్ల వైద్య విద్య దూరం అవటమే కాకుండా విద్యా, వైద్యం పేద ప్రజలకు దక్కకుండా కొనుక్కునే పరిస్థితి వస్తుందని పిల్లో వైఎస్సార్సీపీ పేర్కొంది. ఆర్థికంగా భారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది వాస్తవం కాదన్న వైఎస్సార్సీపీ.. ప్రజా ప్రభిప్రాయం కోసం కోటి సంతకాలు కూడా తెలియజేస్తునట్టు కోర్టుకు తెలిపింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎంఎస్ఐడీసీ, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ను వైఎస్సార్సీపీ చేర్చింది. -
‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదు
సాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు.ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్జీటీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..గత ప్రభుత్వ హయాంలో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా రూ.500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారన్నారు. -
గంజాయి నియంత్రణలో బాబు ప్రభుత్వం విఫలం
సాక్షి, అమరావతి: గంజాయి నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. ‘గంజాయిని అరికట్టాలి–యువత భవితను కాపాడాలి’ అనే అంశంపై విజయవాడ బాలోత్సవ భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు.రాజకీయ అండతో గంజాయి గ్యాంగులు చెలరేగిపోతున్నాయని, ఇటీవల నెల్లూరు జిల్లాలో పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గంజాయి నిరోధానికి విద్యాసంస్థల పరిసరాల్లో నిఘా కమిటీలు, గంజాయికి బానిసలైన యువతకు డి–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. యువజన, మహిళా సంఘాలు గంజాయిపై సమరభేరికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ నెల 7 నుంచి 12 తేదీ వరకు గంజాయికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని, అలాగే, 14న భోగి మంటల్లో గంజాయి దహనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీదేవి, వి.సావిత్రి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ తదితర ప్రజాసంఘాల మహిళా నేతలు మాట్లాడారు. -
సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్లపై కేసులు
సాక్షి, అమరావతి: సాక్షి పత్రిక, టీవీ లక్ష్యంగా చంద్రబాబు సర్కారు మరోసారి వేధింపులకు పాల్పడింది. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయన్న కథనానికి సంబంధించి సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్లపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తిరుపతిలో, తిరుమలలో ఇష్టారీతిన వ్యవహరించారు. తిరుపతి సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఒక సీఐ, ఎస్ఐ, 20 మంది పోలీసులు సోదాలతో హల్చల్ చేశారు. టెరర్రిస్టులు, స్మగ్లర్లు, హంతకుల కోసం గాలించినట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదుసార్లు ఫొటోగ్రాఫర్ ఇంట్లో సోదాలు చేశారు.సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికెళ్లాడంటూ ఇంట్లోవాళ్లమీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించారు. మీ ఆయన ఎక్కడ, ఫోన్లు ఎక్కడ పెట్టాడు.. అంటూ గుచి్చగుచ్చి అడిగారు. ఇంతమంది రావడం ఏమిటి, అసలు ఏం జరిగిందని ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులు అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదు. సాయంత్రం ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అతడిని విచారణకు హాజరుకావాలని చెప్పమని సూచించి వెళ్లిపోయారు. రోజంతా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడంతో సాక్షి ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలు ప్రచురించినా, ఎల్రక్టానిక్ మీడియా చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసినా.. ఒక్క సాక్షి రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను మాత్రమే పిలిపించి విచారించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్షపూరితంగా సాక్షి విలేకరులనే లక్ష్యంగా చేసుకుని విచారణ జరపడం మీడియా స్వేచ్ఛపై దాడేనని జర్నలిస్టు వర్గాలు మండిపడుతున్నాయి. -
రుణాంధ్రగా రాష్ట్రం
సాక్షి, అమరావతి: సంక్షేమ క్యాలండర్కు బదులుగా చంద్రబాబు సర్కారు అప్పుల క్యాలండర్ అమలు చేస్తోంది. వారం వారం అప్పుల మోత మోగిస్తూ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసింది. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అందినకాడికి అప్పులు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల.. రాజధాని.. వివిధ కార్పొరేషన్లు.. చివరకు గనులు, మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ చంద్రబాబు తన రికార్డులను తానే అధిగమిస్తున్నారు. తాజాగా మంగళవారం 7.64 శాతం వడ్డీతో చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.6,500 కోట్లు అప్పులు చేసింది. గత మంగళవారమే రూ.4,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వారం తిరగక ముందే మళ్లీ అప్పు చేయడం గమనార్హం.వారం వ్యవధిలో ఏకంగా రూ.10,500 కోట్లు అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు రికార్డు సృష్టించింది. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ,1,01,540 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఒక ఆర్థిక ఏడాదిలో రూ. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్లో రూ.90,540 కోట్లు అప్పులు చేయగా, మరో రెండు నెలల్లో మరో రూ.11,000 కోట్లు అప్పు చేసేందుకు చంద్రబాబు సర్కారు ఆర్బీఐకి అప్పుల క్యాలెండర్ ఇచి్చంది. ఇలా చంద్రబాబు రెండేళ్ల పాలన పూర్తి కాకుండానే బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి ఏకంగా దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేయడం గమనార్హం. సంపద సృష్టి లేదు.. అంతా ప్రైవేట్ పరం! చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లోపలే చేసిన అప్పులు రూ.1,72,137 కోట్లకు ఎగబాకాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పులు చేశారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు ప్రభుత్వం రూ.రూ.80,245 కోట్లు అప్పులు చేసింది. మరోపక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్ధ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పులు చేసింది. ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్లో ప్రధాన హామీలను సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టారు.పోనీ తీసుకున్న అప్పులతో ఆస్తుల కల్పన చేపట్టారా? అంటే అదీ లేదు. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి విలువైన సంపద సృష్టిస్తే .. ఇప్పుడు వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేట్పరం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన సంపదను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వారం వారం ఇష్టారాజ్యంగా అప్పులతో దేశంలోనే రికార్డులు సృష్టిస్తున్నా నోరు మెదపకపోవటం గమనార్హం.బాబు సర్కారు బడ్జెట్ అప్పులు..2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు రూ.81,597 కోట్లు 2025-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు రూ.77,040 కోట్లు డిసెంబర్ 2వ తేదీ (ఆర్బీఐ) రూ.3,000 కోట్లు డిసెంబర్ 30వ తేదీ (ఆర్బీఐ) రూ.4,000 కోట్లు జనవరి 6వ తేదీ (ఆర్బీఐ) రూ.6,500 కోట్లు మొత్తం రూ.1,72,137కోట్లు బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు..పౌరసరఫరాల సంస్థ రూ.7,000 కోట్లు మార్క్ఫెడ్ రూ.19,900 కోట్లు ఏపీఎండీసీ రూ.9,000 కోట్లు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.6,710 కోట్లు బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్ధల అప్పులు రూ.1150 కోట్లు ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ రూ.1,000 కోట్లు ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ రూ.10,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.8,500 కోట్లు ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా రూ.5,473 కోట్లు నాబార్డు నుంచి డిస్కమ్స్ రూ.3,762 కోట్లు ఎస్బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.2,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ (బాండ్లు) రూ.5,750 కోట్లు మొత్తం రూ.80,245 కోట్లు అమరావతి అప్పులుప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు రూ.15,000 కోట్లు హడ్కో రూ.11,000 కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్యూ సంస్థ రూ.5,000 కోట్లు ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి రూ.7,500 కోట్లు ఏపీపీఎఫ్సీఎల్ నుంచి రూ.1,500 కోట్లు నాబార్డు నుంచి రూ.7,387 కోట్లు మొత్తం రూ.47,387 కోట్లు -
పురిటిగడ్డకు బాబు వెన్నుపోటు!
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల అభివృద్ధి.. ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయించానని.. ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత శనివారం చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకు చంద్రబాబు కనీసం ఖండించలేదు. ఇక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ తాజాగా మంగళవారం స్పష్టం చేయించడం ద్వారా.. తెలంగాణ సీఎం రేవంత్ చెప్పింది నిజమేనని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులు నిలిపివేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే కాదు.. జన్మనిచ్చిన రాయలసీమకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అటు ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమామహేశ్వరావుతో ఇటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు.ముమ్మాటికీ సీమ ఎత్తిపోతల గేమ్ ఛేంజర్..శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ఈ క్రమంలో విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. 2014 నుంచి శ్రీశైలంలో నీటి మట్టం కనీస స్థాయికి 854 అడుగులకు చేరకున్నా.. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా సరే తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడారు. ఇక 2016–17లో శ్రీశైలానికి 337.95 టీఎంసీలు వచ్చినా.. తెలంగాణ 800 అడుగుల నుంచే యథేచ్ఛగా నీటిని తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 67.44 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాల రూపురేఖలను మార్చేస్తుందని.. ఆ జిల్లాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. మంత్రి నిమ్మల చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి కూడా హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల అని స్పష్టం చేస్తున్నారు. గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించిదెవరు బాబూ..?రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,307.6 కోట్ల అంచనాతో వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్కు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం హంద్రీ–నీవాలో అంతర్భాగంగా చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా అదే గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి పర్యావరణ అనుమతి ఏదీ..?రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్ జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిందని.. అందువల్లే ఆ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయంటూ మంత్రి నిమ్మల ఏమాత్రం పసలేని వాదన చేస్తున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది. నిజానికి రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలుత నివేదిక ఇచ్చింది.జగన్ హయాంలో సీమ సుభిక్షం..నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. తెలుగుగంగ లింక్ కెనాల్ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ఇక గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి.. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
నారా వారి పాలనలో.. నారీ విలాపం
మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగికదాడులు చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు బడిలో కూడా బాలికలకు రక్షణ లేకుండా పోయింది. వీటికి తోడు బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై అకృత్యాలకు సంబంధించి గత రెండేళ్లలో జిల్లాలో 1564 కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మహిళలకు రక్షణ కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో మరింతగా దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టంగుటూరు ప్రభుత్వ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. ఆ తరువాత వరుసగా బాలికల మీద లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. బాలికలకు రక్షణ కలి్పంచడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మహిళల సంగతి సరే సరి. ప్రతి రోజూ అదనపు కట్నం కోసమో, ఇతరత్రా కారణాలతో మహిళల మీద నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక మహిళా హోం మంత్రి పాలనలో కూడా మహిళలకు రక్షణ లేకుండాపోవడం బాధాకరమని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుకు ఇద్దరు మహిళలపై అఘాయిత్యం.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకాశం జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ఇద్దరు మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు గురవుతున్నారు. కట్నం కోసం హతమార్చడం కావచ్చు, అదనపు కట్నం కోసం వేధింపులు, గృహహింస, ఇతరత్రా కారణాలతో మహిళలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మహిళలపై అకృత్యాలకు సంబంధించి 2024లో 475 కేసులు నమోదు కాగా, 2025లో 440 కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో 915 కేసులు నమోదయ్యాయి. ఇక మహిళల హత్యలు, కిడ్నాపులు వంటి కేసులు 2024లో 274 నమోదు కాగా, 2025లో 180 కేసులు నమోదవడం గమనార్హం.మొత్తం మీద మహిళలకు వ్యతిరేకంగా 2024లో 855 కేసులు, 2025లో 709 కేసులు నమోదయ్యాయి. అంటే ఈ రెండేళ్లలో 1564 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఒక్కటే ప్రతి రోజూ రెండు కేసుల చొప్పున నమోదయ్యాయి. పోలీసు స్టేషన్ గడప తొక్కని కేసులు ఇంకెన్ని ఉన్నాయో ఊహించడం కష్టం. మహిళల రక్షణ కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన దిశ యాప్ను మూలనడేసిన చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చింది. శక్తి యాప్ను నామమాత్రంగా మహిళల ఫోన్లలో డౌన్లోడ్ చేసి ఇక దాని గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ యాప్ వల్ల మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. బాలికలకు రక్షణేది.. జిల్లాలో బాలికల మీద లైంగికదాడులు పెరిగిపోయాయి. బాలికల మీద ఈ రెండేళ్లలో 177 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది పోలీసు రికార్డులు పరిశీలిస్తే నాలుగు రోజులకో బాలిక మీద లైంగికదాడి జరిగినట్లు తెలుస్తోంది. పిక్కిలి ఆంజనేయులు అనే టీడీపీ నాయకుడు యర్రగొండపాలెం మండలంలోని ఒక గ్రామంలో కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తినుబండరాల కోసం దుకాణానికి వెళ్లిన 9, 8 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు బాలికలను మాయమాటలతో మభ్య పెట్టి దుకాణం వెనకకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.కురిచేడు పరిసరాలకు చెందిన ఒక 16 ఏళ్ల బాలికను రాగుల శ్రీను అనే కామాంధుడు మాయమాటలతో నాగార్జున సాగర్కు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించి ఐదు రోజుల పాటు లైంగికదాడి చేశాడు. ఈ ఘటనలో బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టకుండా రాజీ చేసేందుకు ప్రయతి్నంచారు. దళిత సంఘాలు రంగంలోకి దిగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ పేరుతో మోసం..ఆత్మహత్య.. ఇటీవల నగరానికి చెందిన ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఎంటెక్ చదువుకున్న బాలిక నగరానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సదరు యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమని అడగడంతో నీ కులం వేరు మా కులం వేరు అంటూ మొహం చాటేశాడు. యువకుడి ఇంటికి వెళ్లిన యువతిని నెట్టివేయడంతో మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఈ ఘటనలోనూ యువకుడి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అరెస్టు చేయడం లేదని దళిత సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు.బిలాల్ నగర్లో బాలికను వేధిస్తున్నట్లు ఫిర్యాదు నగరంలోని బిలాల్ నగర్లో ఒక బాలికను వేధిస్తున్నట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే మీ కోసం వేదికలో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాడు. డీఎస్పీని కలిసి తన కూతురికి రక్షణ కలి్పంచడమంటూ వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చదువుకోవడానికి బడికి వెళితే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక చదువుకోడానికి బడికి వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో నివాసం ఉండే ఇద్దరు చిన్నారులు పట్టణంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. అదే పాఠశాలలో చదువు చెబుతున్న ఒక ఉపాధ్యాయుడు వీరి మీద కన్నేశాడు. ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులను సాయంత్రం స్కూలు వదిలిన తరువాత కూడా వేచి ఉండమని చెప్పాడు. విద్యార్థులందరూ వెళ్లి పోయాక ఆ చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన చూసి భయపడిపోయిన చిన్నారులు ఇంటికి వెళ్లి జరిగింది చెప్పడంతో కేసు నమోదు చేయడమే కాకుండా కీచక గురువును సస్పెండ్ చేశారు.మద్య నిషేధం చేయడం ఒక పరిష్కారం ఇటీవల కాలంలో మద్యం తాగడం ఎక్కువైపోయింది. ప్రభుత్వం టార్గెట్ విధించి మరీ తాగిస్తున్నారు. గ్రామా ల్లో బెల్ట్ షాపులు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. చిన్నపిల్లలు సైతం మద్యం తాగుతున్నారు. దీంతో పాటుగా అశ్లీల చిత్రాల ప్రసారం మితిమీరింది. మద్యపానాన్ని నిషేధించాలి. విష సంస్కృతిని కట్టడి చేయకుండా మహిళలపై హింసను అరికట్టడం అసాధ్యం. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే ఆందోళన కలుగుతోంది. ప్రభుత్వాలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – బి.పద్మ, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మహిళలు, బాలికలపై దాడులు పెరగడం ఆందోళనకరం రాష్ట్రంలో ఇటీవల కాలంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగిక దాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. చివరికి పాఠశాలల్లో కూడా బాలికలకు రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి? గ్రామగ్రామానికి మద్యం అందుబాటులోకి రావడంతో మహిళలపై హింస కూడా పెరిగింది. గృహహింస గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిదన్నట్లుగా తయారైంది. మహిళల సాధికారిత గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం మహిళ రక్షణ గురించి నోరుమెదపడం లేదు. – ఎం.విజయ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుఆగని బాలికలు, మహిళలు మిస్సింగ్లు... జిల్లాలో బాలికలు, మహిళల మిస్సింగులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు రికార్డుల ప్రకారమే గత ఏడాది కాలంలో 136 మంది బాలికలు, 264 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. అయితే పోలీసుల అప్రమత్తత కారణంగా ఈ కేసుల్లో 90 శాతానికి పైగా ట్రేస్ చేశారు. అయినా కొంతమంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. 2024 జూన్లో మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు గ్రామ శివారులోని కపిల్ లేఔట్ వద్ద సింగరాయకొండకు చెందిన 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. తొలుత ఈ బాలిక మిస్సింగ్ అయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదిక రావడంతో పోలీసులు విచారణ కొనసాగించారు. ఏడాదిన్నర తరువాత 2025 డిసెంబర్ 31న నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడాదిన్నర కాలంలో బాలిక కుటుంబ సభ్యులు నరకం అనుభవించారు. -
ఆఫ్కాఫ్ చేప చిక్కేదెవరికి?
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో బుధవారం నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ పదవుల్ని తమ వర్గీయులకే దక్కించుకోవాలని మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తమ బలగాలతో మోహరించారు. ఎవరి శక్తిమేర వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సిఫార్సుతో వైఎస్సార్ కడప జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ యాతగిరి రాంప్రసాద్ పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించగా, చివర్లో చక్రం తిప్పిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడితో కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ బి.శివనవీన్కుమార్ పేరిట జీవో వచ్చేలా చేశారు. ఈ జీవోను సవాల్ చేస్తూ మంత్రి కొల్లు వర్గీయులైన జిల్లా సమాఖ్య చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, ఎన్నికల ద్వారా ఆఫ్కాఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సహకార సంఘాల డిప్యూటీ రిజి్రస్టార్ (విజయవాడ) పి.కిరణ్కుమార్ను ఎన్నికల అధికారిగా నియమించారు. మంత్రుల అండతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు రాంప్రసాద్, నవీన్కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకరికి చైర్మన్.. మరొకరికి వైస్ చైర్మన్.. ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లా సమాఖ్యలుగా విభజించి వాటికి ఎన్నికలు నిర్వహించిన తరువాతే ఆఫ్కాఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని నవీన్కుమార్ ఎన్నికల అధికారిని కోరారు. ఓటు హక్కున్న 13 మందిలో ఎనిమిదిమంది తమవైపే ఉన్నారంటున్న ఆయన ఎన్నికల విషయంలో తగ్గేది లేదని అంటున్నారు. రాంప్రసాద్, నవీన్కుమార్ ఇద్దరూ రాయలసీమకు చెందినవారు కావడం, ఆఫ్కాఫ్ కార్యకలాపాలన్నీ తీరప్రాంత జిల్లాల్లోనే ఉండడంతో వారిద్దరిని కాదని ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్రకు చెందిన వారికి ఈ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది.రాంప్రసాద్కు ప్రత్యామ్నాయంగా కృష్ణాజిల్లా సమాఖ్య చైర్మన్ కొక్కిలగడ్డ నాగరమేష్ పేరును మంత్రి కొల్లు వర్గీయులు ప్రతిపాదించగా అచ్చెన్నాయుడి వర్గీయులు వ్యతిరేకించినట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాంప్రసాద్, నాగరమే‹Ùలను మంత్రి కొల్లు బలపరుస్తుండగా.. నవీనకుమార్, శ్రీకాకుళం జిల్లా సమాఖ్య చైర్మన్ చీకటి శ్రీరాములును మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదిస్తున్నట్టు చెబుతున్నారు. మధ్యేమార్గంగా రాంప్రసాద్–నవీన్కుమార్లలో ఒకరికి చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలన్న ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు.కానీ రెండు పదవులు తమకే దక్కాలని కొల్లు వర్గీయులు పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. ఒకరు తమ శాఖ మంత్రి, మరొకరు తమ సామాజికవర్గానికి చెందిన మంత్రి కావడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక జిల్లా సమాఖ్యల చైర్మన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరు సీఎంవో నుంచి, మరొకరు మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఫోన్ చేస్తుండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లయిన జిల్లా సమాఖ్యల చైర్మన్లకు రూ.10 లక్షల వరకు తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానంటూ ప్రచారం సాగుతోంది. నేటి ఎన్నికల షెడ్యూల్ ఇలా.. ⇒ ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రకటన ⇒ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ⇒ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ⇒ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ⇒ మధ్యాహ్నం 2.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల ప్రకటన, చిహ్నాల కేటాయింపు ⇒ ఎన్నికలు ఏకగ్రీవమైతే 2.30 గంటలకు ఫలితాల ప్రకటన ⇒ అవసరమైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ⇒ సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. అనంతరం ఫలితాల ప్రకటన -
భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడం ఆపాల్సిందే
సాక్షి, అమరావతి: శ్రీవారి పరకామణిలో చేపట్టే సంస్కరణలపై టీటీడీ సమర్పించిన ప్లాన్–ఏపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో తాము పలు అంశాల్లో సంస్కరణలు అవసరమని చెబుతూ సలహాలు, సూచనలు కోరితే.. టీటీడీ మాత్రం ఎలాంటి సలహాలను తెలియజేయలేదని హైకోర్టు ఆక్షేపించింది. తాము లేవనెత్తిన ఏ అంశానికీ సమాధానం ఇవ్వలేదని తప్పు పట్టింది. శ్రీవారి పరకామణిలో కానుకల లెక్కింపును సేవగా భావించి వచ్చే భక్తులను అమానవీయ రీతిలో తనిఖీలు చేయడంపై హైకోర్టు మరోసారి అభ్యంతరం తెలిపింది.తనిఖీలపై భక్తిరీత్యా భక్తులు అభ్యంతరం చెప్పకపోవచ్చని, కానీ.. ఇది రాజ్యాంగం కల్పించిన ‘గౌరవంగా, హుందాగా జీవించే హక్కు’ను కాలరాయడమేనని స్పష్టం చేసింది. ఈ హక్కును ఎవరూ కాలరాయలేరని తేల్చి చెప్పింది. ఒకవేళ తనిఖీల్ని ఆపకుంటే.. పరకామణిలో భక్తుల చేత కానుకల లెక్కింపును ఆపేస్తూ ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.కానుకలు లెక్కించే చోట టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాలపైనా టీటీడీ తన నివేదికలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదంది. అందువల్ల భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడం, లెక్కింపు కోసం టేబుళ్ల ఏర్పాటుపై స్పష్టత తీసుకుని పూర్తి వివరాలను తమ ముందుంచాలని టీటీడీ న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ అధికారులపై క్రమశిక్షణ చర్యలు అవసరం పరకామణిలో రూ.72 వేల విలువైన 900 డాలర్ల చోరీ నేపథ్యంలో హైకోర్టు ఇటీవల పలు సంస్కరణలను ప్రతిపాదించింది. ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీకి ఆదేశాలిచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణల నిమిత్తం ప్లాన్–ఏ సమర్పించాలని టీటీడీని ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం ఈ వ్యవహారంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారణ జరిపారు.టీటీడీ సమరి్పంచిన ప్లాన్–ఏను పరిశీలించానని, గత విచారణ సమయంలో తాను లేవనెత్తిన అంశాలు, ఆదేశాల గురించి అందులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఇది తమను అసంతృప్తికి గురి చేసిందన్నారు. పరకామణిలో చోరీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. నిందితుడు రవికుమార్తో కొందరు పోలీసులు కుమ్మక్కైనట్టు సీఐడీ నివేదికను పరిశీలిస్తే తెలిసిందన్నారు. చోరీ కేసు లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న వ్యవహారంపై తప్ప మిగిలిన అన్ని అంశాల్లో దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, చట్ట ప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అదనపు డీజీలకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది. నియామకాల వివరాలు- తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులయ్యారు. - పార్టీ పీఏసీ (PAC) సభ్యుడిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. - ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. - సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్ ఎంపికయ్యారు. - శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. -
ఇవాళ మంగళవారం.. దేశంలోకెల్లా ఏపీ సరికొత్త రికార్డు!
సాక్షి, అమరావతి: ఇవాళ మంగళవారం. షరా మామూలుగా కూటమి సర్కార్ చేయాల్సింది చేసింది. అయితే తాజా అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తిరగకుండానే.. ఏపీ అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది. వారం కిందటే రూ.4 వేల కోట్ల అప్పు చేసిన బాబు సర్కార్(డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్ల అప్పులు).. ఇవాళ మరో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చింది. తద్వారా అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ, అత్యధిక అప్పులు చేస్తోన్న సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. వీటిల్లో.. బడ్జెటరీ అప్పులు రూ. 1,71,637 కోట్లు కాగా, . బడ్జెట్ బయట అప్పులు రూ.1,27,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.77,040 కోట్లుగా ఉంది. ఆ అప్పుల చిట్టాను ఓసారి పరిశీలిస్తే.. డిసెంబర్లో.. డిసెంబర్ 2న తెచ్చిన అప్పులు రూ.3,000 కోట్లుడిసెంబర్ 30న తెచ్చిన అప్పు రూ.4,000 కోట్లుజనవరి 6న తెచ్చిన అప్పు రూ.6,500 కోట్లుబడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.80,245 కోట్లు అప్పుఏపీ మార్క్ ఫెడ్ 19,900 కోట్లుజలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లుఏపీఎండీసీ 9,000 కోట్లుఏపీఐఐసీ 8,500 కోట్లుపౌరసరఫరాల సంస్థ 7,000 కోట్లుఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లుఏపీ బెవరేజస్ కార్పొరేషన్ (బాండ్లు) 5,750 కోట్లుఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్ పి డిసి ఎల్ 5,473 కోట్లునాబార్డు నుండి డిస్కమ్స్ 3,762 కోట్లుఎస్ బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లుబ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లుఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లుఅమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులుప్రపంచ బ్యాంకు, ఎడిబి ద్వారా 15,000 కోట్లుహడ్కో ద్వారా అప్పు 11,000 కోట్లుఎన్ ఏ బి ఎఫ్ డి ద్వారా 7,500 కోట్లునాబార్డు ద్వారా అప్పు 7,387 కోట్లుకే ఎఫ్ డబ్ల్యూ అప్పు 5,000 కోట్లుఏ పీపీ ఎఫ్ సీఎల్ 1500 కోట్లుజగన్ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారంగత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లప్పులు చేసిందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లుగా చెప్పారు. చివరాఖరికి.. జగన్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమేనని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని స్వయంగా ఆర్థిక మంతత్రి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రకటన బాబు దుర్మార్గమైన ప్రచారాన్ని బద్ధలు కొట్టింది. -
ఇరుసుమండ గ్యాస్ లీక్.. తగ్గుముఖం పట్టిన బ్లోఔట్ మంటలు
సాక్షి, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: మల్కిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఔట్ మంటలు తగ్గుముఖం పట్టాయి. ఓఎన్జీసీ సిబ్బంది నిరంతర ప్రయత్నాలతో మంటలు చాలావరకు అదుపులోకి వచ్చాయి.మూడు వైపులా నీటిని వెదజల్లే విధంగా ప్రత్యేకంగా వాటర్ అంబరిల్లా ఏర్పాటు చేశారు. ఈ సాంకేతికతతో మంటలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అదనంగా మరో పైప్ను అమర్చుతూ మంటలను మరింత త్వరగా పూర్తిగా అదుపులోకి తెచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. మరోవైపు బ్లోఔట్ ప్రభావంతో గ్రామంలోని వందలాది కొబ్బరి చెట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంటలతో అనేక చెట్లు దగ్ధమయ్యాయి. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచిన వరి పొలాల్లో నీరు ఇంకిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరుసు మండ గ్రామంలో జరిగిన బ్లోఔట్ ఘటన స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున భయాందోళన కలిగించినా.. ఓఎన్జిసి సిబ్బంది చర్యలతో మంటలు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించింది. పంటలు, చెట్లు దెబ్బతిన్నా, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి చేరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నిన్న మధ్యాహ్నం ఓఎన్జీసీ గ్యాస్ లీకై.. సోమవారం మధ్యాహ్నం నుంచి ఓఎన్జీసీ గ్యాస్ లీకైనప్పటికీ.. బావిలో చోటు చేసుకున్న బ్లో అవుట్ మంటలు రెండో రోజు కొనసాగాయి. దీంతో ఇరుసుమండ సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బావి నుండి భారీగా లీక్ అవుతున్న గ్యాస్ ఎగిసి పడుతూ మంటలు విస్తరించాయి. ఈ ఘటనతో గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రజలు భయంతో ఇళ్లలోనే తలదాచుకున్నారు. గంటల కొద్ది సమయం గడుస్తున్నప్పటికీ ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రాలేదు. దీంతో ఢిల్లీ నుండి ఓఎన్జిసి నిపుణుల బృందం రంగంలోకి దిగింది. వాటర్ అంబరిల్లా సాంకేతికతతో నాలుగు వైపుల నుండి నీళ్లు విరజిమ్మి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇందుకు అవసరమైన పైప్లైన్లు, మిషనరీలను నరసాపురం నుండి తరలించారు.16 గంటలకుపైగా నిరంతరంగా మంటలు ఎగిసి పడుతున్న ఈ ఘటనతో ఇరుసుమండ గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా సమీప ప్రాంతాల వారు కూడా ఆందోళన చెందారు. నిపుణుల బృందం రాకతో మంటలు అదుపులోకి రావడంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. Fire at an ONGC well in Andhra Pradesh's Konaseema continues to rage a day after a gas leak here led to massive evacuations from three villages within a four-km radius on Monday. No deaths or casualties have been reported so far.According to a press release from the Konaseema… pic.twitter.com/dux5wJw2bC— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2026 -
కిడ్నాప్.. దాడులు.. ఆగడాలు
బలం లేకున్నా బరిలో దిగి.. ఓడిపోతామని తెలిసి.. ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ బరితెగించింది. వారి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో... ఖాకీల సాక్షిగా... గూండాగిరి, దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్సీపీ సభ్యుల కిడ్నాప్.. దాడులు.. నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక ఖూనీ చేసింది. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నికలలో అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది.. అడ్డదారుల్లో వెళ్లి పచ్చ పార్టీ అక్రమంగా గెలుపును ఖాతాలో వేసుకుంది. ‘రెడ్బుక్’ రాజ్యాంగాన్ని ప్రయోగించి దొడ్డిదారిన పదవులు దక్కించుకోవడం విస్తుపోయేలా చేసింది.సాక్షి టాస్క్ఫోర్స్, వింజమూరు (ఉదయగిరి): పోలీసుల సమక్షంలోనే వింజమూరు ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులపై దౌర్జన్యం చేశాయి. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీడీవో కార్యాలయంలో తిష్టవేసి దీన్నంతటినీ నడిపించారు. ఆయన కనుసన్నల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఊటుకూరు ఎంపీటీసీ సభ్యుడు జి.మల్లికార్జునను బలవంతంగా లాక్కెళ్లి కారులో ఎక్కించి కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ, మాజీ ఎంపీపీ అయిన ఇనగలూరి మోహన్రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. తాత్కాలిక ఎంపీపీ అన్నంగి రమణయ్య వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతారనే అనుమానంతో అజ్ఞాతంలోకి తీసుకెళ్లారు. నల్గొండ్ల ఎంపీటీసీ ఉంటా రత్నమ్మనూ కిడ్నాప్ చేసేందుకు బరితెగించారు.ఈ క్రమంలో పెనుగులాటలో ఆమె చేతికి గాయమైంది. అయినా లెక్కచేయకుండా ప్రతిఘటించారు. వైఎస్సార్పీపీ ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, ఎంపీటీసీ డేగా వంశీ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డిలు... టీడీపీ దౌర్జన్యాన్ని అడ్డుకుని రత్నమ్మను రక్షించారు. తమ సభ్యుడిని కిడ్నాప్ చేశారంటూ కొండారెడ్డి మిగతా ఎంపీటీసీలతో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. దౌర్జన్యాన్ని ఎన్నికల అధికారి నిర్మలాదేవికి వివరించి, ఎన్నిక వాయిదా వేయాలని కోరారు. కానీ, కోరం ఉందని ఎన్నికల అధికారులు చెప్పడంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు వాకౌట్ చేశారు. ఎన్నికల పరిశీలకులు, జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు విషయం మొత్తం చెప్పినా ఫలితం లేకపోయింది.2 నిమిషాల్లో సభ వాయిదా పడుతుందనగా...ఉప ఎన్నిక ఉదయం 11కు ప్రారంభమవుతుందనగా 10.30కు ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు బంగ్లా సెంటర్ చేరుకున్నారు. పోలీసులు వారి కారులో కాకుండా నడిచివెళ్లాలని చెప్పారు. ఇంతలో టీడీపీ శ్రేణులు అడ్డుకుని దౌర్జన్యం చేశాయి. ఇద్దరు సభ్యుల కిడ్నాప్నకు ప్రయత్నించి.. ఒకరిని లాక్కెళ్లారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. టీడీపీ ఎంపీటీసీలను వారి వాహనంలో తీసుకొచ్చారు. కాగా, ఎంపీపీ ఎన్నికకు ఆరుగురు సభ్యుల కోరం అవసరం. నలుగురు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు బాయ్కాట్ చేశారు. టీడీపీ తరఫున ఐదుగురే మిగిలారు. సమావేశం వాయిదా పడేందుకు 2 నిమిషాలు ఉందనగా తాత్కాలిక ఎంపీపీ రమణయ్యను పోలీసులు దొడ్డిదారిన తీసుకొచ్చారు. కోరం ఉందంటూ సమావేశం నిర్వహించి వనిపెంట హైమావతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు.బొమ్మనహాళ్లో ‘పచ్చ’ మూక దాష్టీకం ‘కాలవ’ రౌడీయిజం.. అడుగడుగునా ఆంక్షలుబొమ్మనహాళ్ ఎంపీపీ ఉప ఎన్నిక టీడీపీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచింది. ఆ పార్టీకి సంఖ్యా బలం లేకపోయినా ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతోనే ఎన్నిక పూర్తి చేశారు. గత ఎన్నికల్లో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒకచోట ఇండిపెండెంట్ గెలిచారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు పద్మావతి ఎంపీపీ అయ్యారు. ఇటీవల ఆమె రాజీనామా చేశారు. టీడీపీ నాయకుల ప్రలోభాలు, ఇతర కారణాలతో నలుగురు ఆ పార్టీ వైపు మొగ్గుచూపారు. స్వతంత్ర అభ్యర్థితో కలిపి టీడీపీ బలం 5 మాత్రమే. ఈ క్రమంలో ఎంపీపీ ఎన్నిక కోసం క్యాంపులో ఉన్న 8 మంది ఎంపీటీసీ సభ్యులను తీసుకుని బొమ్మనహాళ్ బయల్దేరిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి అడుగడుగునా పోలీసు ఆంక్షలు, టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు. ఆయనతో ఉన్న వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య, నాయకులను పోలీసులు కణేకల్లు క్రాస్లోనే అడ్డుకున్నారు.రిటర్నింగ్ అధికారి గంగాధర ఉదయం 10 గంటలకు ఎన్నిక ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నుంచి ఉద్దేహాళ్ ఎంపీటీసీ కరూరు కల్పన, టీడీపీ అభ్యర్థిగా ఉప్పరహాళ్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి పోటీపడ్డారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికాలక్ష్మీనారాయణ హాజరయ్యారు. దర్గాహొన్నూరు ఎంపీటీసీ–1 నాగరత్నమ్మ (వైఎస్సార్సీపీ) గైర్హాజరవగా, ఎన్నిక సమయంలో ఇద్దరు సభ్యులు టీడీపీ వైపు మొగ్గుచూపారు. చివరకు వైఎస్సార్సీపీ అభ్యర్థికి 8 మంది, టీడీపీకి ఏడుగురు మద్దతుగా నిలిచారు.టీడీపీ ఓటమిని గుర్తించిన ఎమ్మెల్యే కాలవ... దేవగిరి ఎంపీటీసీ సభ్యుడు అనుమేష్ను బయటకు పిలిచి మద్దతు తెలపాలని చాలా సమయం తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని అనుమేష్ మీడియాకు స్వయంగా తెలిపారు. కాగా, ఎమ్మెల్యే వైఖరితో మనస్తాపం చెందడంతో పాటు సహనం కోల్పోయిన ఏడుగురు వైఎస్సార్సీపీ సభ్యులు కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. ఇదే అదనుగా భావించి ఉన్నవారితో కోరం చూపి ఎంపీపీ ఎన్నికను పూర్తిచేశారు. క్షణాల వ్యవధిలోనే టీడీపీ అభ్యర్థి చేతిలో డిక్లరేషన్ పెట్టారు.మెట్టు వాహనంపై టీడీపీ గూండాల రాళ్ల దాడిమండల పరిషత్ నుంచి బయటకు వచ్చేసిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు.. మెట్టు గోవిందరెడ్డిని కలిశారు. ఆయన వారిని వెంటబెట్టుకుని జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు అనంతపురం బయలుదేరారు. దేవగిరి వద్ద టీడీపీ గూండాలు మెట్టు వాహనంపైకి రాళ్లు రువ్వారు. వాహనం దెబ్బతినగా.. డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పింది. కాగా, ఎంపీపీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీడీï³ దౌర్జన్యపూరిత వైఖరి తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు వాపోయారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఎన్నికను ఏకపక్షం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలవ దౌర్జన్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యానికి పాతర: మెట్టు మండిపాటు‘‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఎంపీపీ ఎన్నికలో నైతిక విజయం వైఎస్సార్సీపీ. కోరం లేకున్నా గెలిచినట్టు ప్రకటించుకోవడం సిగ్గుచేటు. రక్షణగా నిలవాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మాకు ఆంక్షలు, అడ్డంకులు విధించి, టీడీపీ నాయకులకు మాత్రం గేట్లు తెరిచారు’’ అని మెట్టు గోవిందరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు..మండల పరిషత్లోకి వెళ్లి వైఎస్సార్సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నా పోలీసులు అడ్డుకోలేదని అన్నారు. తమపై దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికను రద్దుచేసి న్యాయబద్ధంగా మళ్లీ నిర్వహించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తామన్నారు. -
రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు
సాక్షి, అమరావతి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని మండిపడ్డారు. దేశానికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే సీఎం చంద్రబాబు... రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సోమవారం ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఒక చిన్న ఎంపీపీ ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేస్తున్న తీరు, ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియకు బదులుగా బల ప్రదర్శన వేదికగా మార్చిన వైనం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది’’ అని అన్నారు.‘‘ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో ఓటు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకోవడమే కాకుండా, వారిపై దాడి చేశారు. దీంతో ఒక మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారు. ఒక సభ్యుడిని కిడ్నాప్ చేశారు. మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం... ఎంపీపీ ఎన్నికలో వారిని ఓటు వేయకుండా ఆపడమే.ఒక భయాందోళన పరిస్థితి సృష్టించి, బల ప్రయోగంతో వారి ఓటు హక్కును అడ్డుకోవడమే. ప్రజల గొంతును అణచివేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేయడానికి ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి అప్రజాస్వామిక సంఘటనల సమయంలో... పోలీసులు టీడీపీ చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తూ, అధికార పార్టీకి బహిరంగంగా మద్దతిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడడంలో విఫలమవుతున్నారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. మౌన ప్రేక్షకుల్లా ఎన్నికల అధికారులు ‘‘రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, ఎంపీపీ ఎన్నికను బలవంతంగా పూర్తి చేశారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల కిడ్నాప్, వారిపై బహిరంగంగా దాడి, పోలీసు వ్యవస్థను దుర్వీనియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయింది. ఒక చిన్న స్థానిక సంస్థ పరోక్ష ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉందంటే ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వీనియోగం చేస్తోందో తేటతెల్లం అవుతోంది. ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకిగా మారింది అన్న విషయాన్ని చాటుతోంది’’ అని జగన్ అన్నారు. -
భోగాపురంపై నీళ్లు నమిలిన మంత్రులు
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు నీళ్లు నమిలారు. ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాటవేత ధోరణి అవలంబించారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్కు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే అని భజన చేశారు. ఈ విషయం చిన్న పిల్లాడిని నిద్రలో లేపి అడిగినా చెబుతాడని ప్రగల్భాలు పలికారు. దీంతో మీడియా ప్రతినిధులు కల్పించుకుని ‘ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి పునరావాసం, భూసేకరణ కోసం గత ప్రభుత్వంలో రూ.960 కోట్లు ఖర్చు చేశామని వైఎస్సార్సీపీ చెబుతోంది.’ వాస్తవం కాదా? అని మీడియా ప్రశి్నంచగా మంత్రులు నీళ్లు నమిలారు.ఎయిర్పోర్ట్ నిర్మాణంపై హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులను ఎవరి హయాంలో అధిగమించారు? అన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం గత ప్రభుత్వంలోనే పూర్తయినట్టు ప్రతిపక్షం చెబుతోందని మీడియా ప్రస్తావించగా అచ్చెన్నాయుడు కస్సుబుస్సులాడారు. వాస్తవాలను అంగీకరించలేక మాజీ సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణకు దిగారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఘనత అంతా బాబుకే దక్కాలన్నారు. సీమ ఎత్తిపోతల పథకంపై మీడియా వేసిన ప్రశ్నలతో అచ్చెన్నాయుడు అసహనానికి గురయ్యారు.రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబుతో మాట్లాడి ఆపించేశానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని దీనిపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అచ్చెన్నను ప్రశ్నించగా ‘వెళ్లి ఆయన్నే అడుక్కోండి’ అని వారిపై కస్సుమన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం తమకు లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు సీమ ద్రోహి అని రాసేస్తారా? అంటూ చిందులు తొక్కారు. -
నారా లోకేశ్ శాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: నారా లోకేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఏమీ చేయలేరన్న భావన విద్యాశాఖ అధికారుల్లో కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారులు తమను తాము చాలా గొప్ప వారిగా, కోర్టుకన్నా శక్తివంతులుగా భావిస్తున్నారని మండిపడింది.కోర్టులన్నా, కోర్టు ఆదేశాలన్నా వారికి ఏ మాత్రం లెక్క లేకుండా పోయిందని తెలిపింది. పైగా న్యాయస్థానాలతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయంది. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంది. కేజీబీవీల్లో పీజీటీల బదిలీలకు సంబంధించి అప్పీల్పై జరుగుతున్న విచారణ సందర్భంగా హైకోర్టు... విద్యాశాఖలో ఏదీ కూడా సక్రమంగా జరగడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వ్యక్తిగత హాజరుకు ఆదేశం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న వారిని ఒప్పందం ప్రకారం యథాతథంగా కొనసాగించాలంటూ సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను, అలాగే సింగిల్ జడ్జి ఇచి్చన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ ఇచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) బి.శ్రీనివాస్రావుపై హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. ఆయనకు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని శ్రీనివాస్రావును ఆదేశిస్తూ ఆయనకు నోటీసు ఇచి్చంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.కేసు వివరాలు ఇవీ..⇒ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) పార్ట్టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)గా పనిచేస్తున్న తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు పీజీటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ⇒ ఈ తీర్పును సవాలు చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు గత ఏడాది జనవరిలో అప్పీల్ దాఖలు చేశారు.⇒ ఈ సందర్భంలో కోర్టు ఆదేశాలను, కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించిన అధికారి ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.⇒ సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్రావు అని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ధర్మాసనం ఆయనపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది.⇒ ఈ అప్పీల్పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.⇒ విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ⇒ పీజీటీల తరఫు న్యాయవాది జైభీమ్ రావు వాదనలు వినిపిస్తూ “ఒప్పందం ప్రకారం రిట్ పిటిషనర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగిస్తూ, వారికి ఆ మేర వేతనాలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సర్వశిక్షాభియాన్ అధికారులు మాత్రం పిటిషనర్లను వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో పాటు నెలవారీ ఇచ్చే వేతనాన్ని పని గంటల ఆధారంగా చెల్లించేలా మార్పులు చేశారు. అంతేకాక సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తామంటూ ఈ కోర్టుకు ఇచ్చిన హామీని సైతం అధికారులు ఉల్లంఘించారు’ అని ధర్మాసనానికి విన్నవించారు. -
హే.. కృష్ణా.. బాబు సర్కార్ ఘోర వైఫల్యం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం, బాధ్యతా రాహిత్యానికి మరో నిదర్శనమిది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందంతో రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపివేసిన సీఎం చంద్రబాబు.. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేందుకు 16 ప్రాజెక్టుల డీపీఆర్ల తయారీకి గతేడాది సెపె్టంబరు 16న తెలంగాణ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోగానీ సుప్రీం కోర్టులోగానీ సవాల్ చేయలేదు.మరోవైపు శ్రీశైలం నుంచి పది టీఎంసీలు తరలించి 1.15 లక్షల ఎకరాలకు నీళ్లందించడం కోసం రూ.2,945 కోట్లతో అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పనులతోపాటు తాగునీటి అవసరాల ముసుగులో పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను యథేచ్ఛగా చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపకపోవడం గమనార్హం. వీటిని బట్టి చూస్తే.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు చంద్రబాబు సర్కార్ నీళ్లొదులుతున్నట్లు స్పష్టమవుతోందని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. మొద్దు నిద్రలో బాబు సర్కారు..! కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలు.. 65 శాతం, సరాసరి లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 194 టీఎంసీల మిగులు జలాలు వెరసి 1,005 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడంపై ప్రస్తుతం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోంది. పరీవాహక ప్రాంతం (బేసిన్) ప్రాతిపదికగా తమకు 904 టీఎంసీలు కేటాయించాలని ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కార్ తుది వాదనలు వినిపించింది.ఈ క్రమంలో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి.. ఉప నదుల నుంచి 372.54 టీఎంసీలు తరలించేలా, కొత్తగా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి డీపీఆర్ల (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత సెపె్టంబరు 16న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేటాయింపులు చేయకుండానే 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను నిలుపుదల చేయాలని.. ఆ ప్రాజెక్టులను అడ్డుకోవాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో చంద్రబాబు ప్రభుత్వం ఐఏ (ఇంటర్ లొకేటరీ అప్లికేషన్) దాఖలు చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.వాటిని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయకపోవడంపై నివ్వెరపోతున్నారు. ఇది కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యానికి, చిత్తశుద్ధి లోపానికి అద్దం పడుతోందని స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేస్తున్నారు. మన హక్కులకు నీళ్లొదిలి..! విభజన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా 120 టీఎంసీలను తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, సుంకేశుల బ్యారేజీ గర్భం నుంచి తుంగభద్ర జలాలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతల.. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల సామర్థ్యం పెంచి.. భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా తెలంగాణ సర్కార్ పనులు చేపట్టినా.. ఓటుకు కోట్లు కేసు భయంతో నాటి సీఎం చంద్రబాబు నోరు మెదపలేదు. అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది.అనంతరం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం చేసింది. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టింది. పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. సాగర్కు ఎగువన 45 టీఎంసీల కృష్ణా జలాలు తమకే దక్కుతాయని, వాటితోపాటు చిన్న నీటిపారుదల విభాగంలో 45 టీఎంసీల మిగులు ఉందని.. వెరసి ఆ 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయడంపై అప్పట్లో వైఎస్సార్సీపీ సర్కార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఐఏ దాఖలు చేసి, దాన్ని అడ్డుకుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ సర్కార్ 372.54 టీఎంసీల కృష్ణా జలాల తరలింపునకు డీపీఆర్ తయారీకి అనుమతి ఇచి్చన ప్రాజెక్టులు ఇవే..1. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు 2. గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 1.32 నుంచి 10 టీఎంసీలకు పెంపు 3. నెట్టెంపాడు ఎత్తిపోతల రెండో దశలో మరో 4 టీఎంసీలు తరలింపు 4. 0.5 టీఎంసీల సామర్థ్యంతో బుజ్జితండా–భీమ తండా ఎత్తిపోతల 5. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం మరో 20.12 టీఎంసీలు పెంపు6. జూరాల వరద కాలువ ద్వారా 100 టీఎంసీలు తరలించి 11.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం 7. కోయిల్కొండ–గండీడు ఎత్తిపోతల ద్వారా 123 టీఎంసీలు తరలింపు 8. కోయిల్సాగర్ ఎత్తపోతల సామర్థ్యం అదనంగా 3.30 టీఎంసీలు పెంపు 9. జయపురం వద్ద 2 టీఎంసీల సామర్థ్యంతో ఆకేరు బ్యారేజ్ 10. విస్పంపల్లె వద్ద 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో ఆకేరు బ్యారేజ్ 11. 1.3 టీఎంసీల సామర్థ్యంతో మున్నేరు బ్యారేజ్ 12. గార్ల వద్ద మున్నేరుపై 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్ 13. డోర్నకల్ మండలం ముల్కపల్లి వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ 14. ఎద్దులచెర్వు వద్ద ఆకేరుపై 1.3 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్ 15. శ్రీశైలం ఎడమగట్టు కాలువ విస్తరణలో భాగంగా 3.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా సోమశిల వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ 16. శ్రీశైలం నుంచి నీటిని తరలించి రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కోసం దేవులమ్మ నాగారం (పది టీఎంసీలు), దండు మైలారం (పది టీఎంసీలు), ఆరుట్ల (పది టీఎంసీలు సామర్థ్యంతో) రిజర్వాయర్ల నిర్మాణం. -
సీమ ఎత్తిపోతలకు చంద్ర ‘గ్రహణం’.. !
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు తడిపేందుకు.. తెలుగుగంగ, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’ పట్టుకుంది! ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్ 5న.. 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. దాని పర్యవసానంగానే గతేడాది ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగిపారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో కేసు.. ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014–19 మధ్య ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని తడారిన గొంతులను తడపడం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను రూ.3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్తో ఎన్జీటీ (చెన్నై బెంచ్) లో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు గత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54 శాతం పనులు పూర్తి చేశారు. చీకటి ఒప్పందంతో పనులు నిలిపివేతసీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే.. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిచిపోవడానికి పర్యావరణ అనుమతి రాలేదనే సాకులు చూపడానికే చంద్రబాబు సర్కార్ ఈఏసీకి వివరాలు అందజేయలేదని స్పష్టం చేస్తున్నారు. -
చంద్రబాబు అప్పులపై వెంకయ్యనాయుడు హాట్ కామెంట్స్!
సాక్షి,అమరావతి: చంద్రబాబు చేస్తున్న అప్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. ‘చంద్రబాబు ప్రతినెలా చేస్తున్న అప్పులు సీఎం కట్టాలా? మంత్రులు కట్టాలా? ఆర్ధిక శాఖ కట్టాలా?.ఈ అప్పులన్నీ ప్రజలే కట్టాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి. విద్య,వైద్యం ఉచితంగా అందించాలి. నిరుపేదలకు మాత్రమే ఉచిత బస్సు సదుపాయం కల్పించాలి. మిగిలిన వారికి రద్దు చేయాలి’అని పిలుపు నిచ్చారు. -
కోనసీమ జిల్లాలో ONGC గ్యాస్ లీక్.. మరో 24 గంటలు ఆందోళన
సాక్షి,ఇరుసుమండ: కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్లీకేజీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. గ్యాస్లీకేజీపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఘటన స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. లీకైన గ్యాస్ను అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. 1993 నుంచి ఆపరేషన్లో ఉన్న వెల్లో ఈ బ్లో అవుట్ చోటుచేసుకుంది. 2024లో ‘డీప్’ అనే కంపెనీకి సబ్ లీజ్ ఇచ్చారు. 2,500 మీటర్ల లోతులో ఒక లేయర్లో ఎక్స్ప్లోరేషన్ ప్రయత్నం జరుగుతుండగా, అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ తన్నుకొచ్చింది. ఒక గంట పాటు గ్యాస్ మాత్రమే బయటికి వచ్చింది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. వెల్లో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజల భద్రత కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓఎన్జిసి ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. వెల్ను పూర్తిగా అదుపులోకి తీసుకోవడానికి కనీసం మరో 24 గంటలు పట్టే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.A explosion occurred at the border of Lakkavaram Irusumanda villages in Malikipuram mandal, Konaseema. Large quantities of gas are gushing out from an ONGC pipeline, spreading like a thick fog for nearly a kilometer.The incident has triggered panic and fear among local… pic.twitter.com/nvHarm2xmn— Sowmith Yakkati (@YakkatiSowmith) January 5, 2026ఇరుసుమండ బ్లో అవుట్ పై ఓఎన్జిసి ప్రకటన చేసింది. ‘గ్యాస్ లీక్ ఘటనలో ఎవరూ చనిపోలేదు, ఎవరికి గాయాలు కాలేదు. రిమోట్ ఏరియాలో ఎలాంటి నివాస ప్రాంతాలు లేవు. గ్యాస్ లీక్ ప్రాంతంలో కూలింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. క్రైసిస్ మేనేజ్మెంట్ టీములను మొబలైజ్ చేశాం. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరమైతే గ్యాస్ బావిని మూసివేస్తాం.అంతర్జాతీయ నిపుణులతో సమన్వయం చేసుకొని, అధునాతన వ్యవస్థతో నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓఎన్జిసి సీనియర్ మేనేజ్మెంట్ సాంకేతిక ని పనులు పరిస్థితిని నిషితంగా అంచనా వేస్తున్నారు. అవసరమైన అదనపు పరికరాలు నర్సాపురం సహా ఇతర ప్రాంతాల నుంచి పంపిస్తున్నాము’అని తెలిపింది. -
ఏయూలో నిరంకుశ ‘గీతం’!
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఆంక్షలు, నిబంధనల పేరిట విద్యార్థులు, సిబ్బంది స్వేచ్ఛాయుత హక్కులను కాలరాస్తోంది. వర్సిటీ పాలకుల చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. శతాబ్ద చరిత్ర కలిగిన ఏయూలో ఇప్పుడు ఎన్నడూ లేనంతగా కంటికి కనిపించని కంచెలు వేసి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. సాక్షి, అమరావతి : ఒకప్పటి ఏయూను ఊహించుకుని ఎవరైనా ఇప్పుడు స్వేచ్ఛగా క్యాంపస్లోకి అడుగుపెడదామంటే కుదరదు. వచ్చినోళ్లను వచ్చినట్లు గేటు దగ్గరే ఆపేస్తారు. వర్సిటీ ఐడీ కార్డు ఉంటేనే ప్రవేశం. విద్యార్థుల కోసం వచ్చే తల్లిదండ్రులైనా.. సర్టిఫికెట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులైనా గేటు బయట నిలబడాల్సిందే. సీఎం చంద్రబాబు బంధుప్రీతి, రాజకీయ కార్పొరేట్ల కబంధ హస్తాల్లో బం«దీగా మారిన ఏయూలోని పాలకవర్గం ఈ అనిశి్చతిని ప్రేరేపించే నిబంధనలను ఇష్టారాజ్యంగా ప్రవేశపెడుతోంది. ఇక్కడ విద్యార్థులకు స్వేచ్ఛగా బోధించే పరిస్థితిలేదు. సమస్యలను సత్వరం పరిష్కరించే యంత్రాంగంలేదు. వర్సిటీలో ఎవరైనా ఇది మంచి.. ఇది చెడు అని చెబితే ఇక వాళ్ల పని అయిపోయినట్లే! అందరికీ దూరంగా వీసీ? విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ అత్యున్నత స్థాయి వ్యక్తి. వర్సిటీ ప్రతి అభివృద్ధి అడుగులో వీసీ ముందుండాలి. అలాంటిది.. ఏయూ వీసీ మాత్రం వింత పోకడలను అవలంబిస్తున్నారు. తనను ఎవ్వరూ కలవడానికి వీల్లేదంటూ అధికారిక ఉత్తర్వులు జారీచేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి.. ఇక్కడికి ఎన్నో సమస్యలు, నివేదనలు, ఫిర్యాదులు, ప్రతిపాదనలు వస్తుంటాయి. వాటిని వీసీ పరిష్కరిస్తూ మంచి మార్గం చూపించాలి. కానీ, ఏయూ వీసీ ఇందుకు విరుద్ధంగా చేతులెత్తేస్తున్నారు. తన దగ్గరకు ఎవ్వరినీ పంపొద్దని నిష్కర్షగా చెప్పేశారు. చివరికి.. రిజిస్ట్రార్ సైతం ముందస్తు అపాయింట్మెంట్ ఉంటే తప్ప వీసీని కలవలేని దుస్థితి. ఇక విద్యార్థులు, సిబ్బంది తమ సమస్యలు చెప్పుకుందామంటే.. వీసీనే కొత్త సమస్యలు సృష్టిస్తుండటం కలవరపెడుతోంది. నూతన సంవత్సరం వేళ వీసీ వర్సిటీ అధికారులకు, సిబ్బందికి ఇచ్చే ఆనవాయితీ ‘హయ్ టీ’ని రద్దుచేయడం దుస్సాంప్రదాయానికి నిదర్శనం. ఎవ్వరూ హాస్టళ్లలో ఉండొద్దు! ఆంధ్ర విశ్వవిద్యాలయం కేవలం పుస్తకాల్లో పాఠాలు చెప్పే యంత్రాంగం కాదు. ఎందరో పౌరులను దేశానికి సేవచేసేలా తీర్చిదిద్దిన విజ్ఞాన భాండాగారం. ఉన్నత విలువలు, రాజకీయం, ప్రజా ఉద్యమకారులను అందించిన మేధావుల కార్ఖానా. ఇంతటి విలువ కలిగిన ఏయూలో ఇప్పుడు పండగ సెలవులు వస్తే విద్యార్థులు, స్కాలర్లు ఎవ్వరూ క్యాంపస్లో కనిపించడానికి వీల్లేదు. హాస్టళ్లలో ఉంటున్న వారు సైతం పెట్టే బేడా సర్దుకుని గదులు ఖాళీచేసి వెళ్లిపోవాల్సిందే. గతంలో సెలవుల సమయంలో వర్సిటీల్లో ఉండే విద్యార్థులను బట్టి కనీసం ఒక మెస్ను అయినా తెరిచి ఉంచేవారు. అప్పట్లో విద్యార్థులు హాయిగా లైబ్రరీలు, వర్సిటీ ప్రాంగణాల్లో తమకు నచ్చిన అంశాలు అభ్యాసనం చేసి, ప్రాజెక్టు వర్క్స్, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వ రాకతో ఇప్పుడు ఏయూ ప్రతిష్ట మసకబారుతూ పూర్తిగా భ్రషు్టపట్టిపోతోంది. సార్ రూల్స్ పెడతారు.. కానీ పాటించరు.. ఏయూ వైస్ చాన్సలర్ వ్యవహారశైలి ఆది నుంచి విమర్శలకు తావిస్తోంది. తన అసమర్థ చేష్టలతో వర్సిటీని భ్రషు్టపట్టిస్తున్నారనే వాదన వర్సిటీ మొత్తం వ్యాపించింది. గతేడాది నవంబరు 21న వీసీ ఆదేశాలతో రిజి్రస్టార్ ఓ సర్క్యులర్ విడుదల చేశారు. ‘‘వర్సిటీలో ఎవ్వరూ రాజకీయ ప్రేరేపిత మీటింగ్లు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదు’’.. అన్నది దాని సారాంశం. తీరా అదే నెల 25న.. రాజ్యాంగ దినోత్సవానికి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఇందులో వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొనాలని సర్క్యులర్ ఇచ్చారు. దీంతో వీసీ తనకు నచ్చినట్లు రూల్ పెట్టి.. ఆయనే పాటించరనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. శతాబ్ది ఉత్సవాల వేళ ఏయూ గేట్లు మూసివేత.. ఈ నేపథ్యంలో.. ఏయూ శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి గ్రహణం పట్టించింది. కార్పొరేట్ శక్తుల కోసం ఏయూని నిరీ్వర్యం చేయాలని కంకణం కట్టుకుని ఒక్కొక్కటిగా అభివృద్ధికి గేట్లు మూసేస్తోంది. ఏయూ గేట్ల దగ్గర ఆంక్షలు విధిస్తే ఇక్కడే చదువుకుని, ఉద్యోగం చేసి రిటైరైన వ్యక్తులు. అనేకమంది నిపుణులు ఎలా వస్తారని విద్యార్థి లోకం ప్రశి్నస్తోంది. నిజానికి.. ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ చేసిన రోజే స్థానిక టీడీపీ ఎంపీ, చంద్రబాబు సమీప బంధువు శ్రీభరత్ ‘గీతం గొప్పోళ్లది.. ఏయూ పేదోళ్లది’ అంటూ అవమానకర రీతిలో వ్యాఖ్యానించారు. అప్పటినుంచి ఏయూ ఖ్యాతికి పాలకవర్గం తూట్లు పొడుస్తూ వస్తోంది. ఇక్కడ తనను ఎవ్వరూ కలవడానికి వీల్లేదని హుకుం జారీచేసిన వీసీ.. నిత్యం స్థానిక ఎంపీ నుంచి వచ్చే ఆదేశాలనే ఏయూలో అమలుచేస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విశాఖ వాసులకు నో ఎంట్రీ!..ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రజల ఆస్తి. ఎన్నో గ్రామాల కలయిక. అందుకే విశాఖ వాసులతో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకుంది. వందల సంస్కృతులు, సాంప్రదాయాలకు ఏయూ నిలయంగా ఉంది. ముఖ్యంగా క్యాంపస్లో గ్రామ దేవతల జాతరలు, పండుగలు బలమైన ఆధ్యాత్నిక భావాన్ని పెంపొందిస్తున్నాయి. అలాగే, నిత్యం విశాఖ వాసులు అనేక పనులపై ఏయూ క్యాంపస్కు వస్తుంటారు. క్యాంపస్లోనే కలెక్టర్ బంగ్లా ఉండటంతో ఎంతోమంది కలెక్టర్కు సమస్యలు మొరపెట్టుకుని, అర్జీలు ఇచ్చేందుకు వెళ్తుంటారు. ఇప్పుడు వీసీ నిర్ణయంతో వీరందరికీ తీవ్రనష్టం వాటిల్లుతోంది. బ్యాంకింగ్, పోస్టల్ సేవల కోసం వచ్చేవారికి సైతం చుక్కెదురవుతోంది. నిజానికి.. ఏయూ ఏర్పాటులో ఎందరో పేదల భాగస్వామ్యం ఉంది. వందల ఎకరాల భూములను అడిగిందే తడవుగా ఇచ్చేశారు. అలాంటి విశాఖ వాసులకు ఇప్పుడు ఏయూలోకి ప్రవేశం లేకపోవడం కలవరపరుస్తోంది. -
చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం.. ‘సీమ’కు సైంధవుడు!
సాక్షి, అమరావతి: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, సీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైంధవుడిలా అడుగడుగునా అడ్డుపడుతున్నారనేందుకు మరో నిదర్శనమిది. శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతికి హక్కుగా దక్కిన కృష్ణా జలాలను వాడుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సుభిక్షం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను బాబు సర్కారు 19 నెలలుగా పూర్తి స్థాయిలో నిలిపివేయడమే అందుకు తార్కాణం. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే నిజ నిర్ధారణ కమిటీతో తనిఖీ చేసుకోవచ్చు..’’ అంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ఒక్క రాయలసీమ ఎత్తిపోతలే కాదు.. శ్రీశైలానికి వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే ఆ నీటిని గరిష్టంగా ఒడిసిపట్టి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు పనులతోపాటు.. రాజోలి, జోలదరాశి, కుందూ ఎత్తిపోతల లాంటి కొత్త ప్రాజెక్టుల పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తి స్థాయిలో నిలిపివేసింది. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి 2015లో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కార్కు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 2020లో ఏపీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ చర్యలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేపట్టిన సీమ ఎత్తిపోతలతోపాటు రాయలసీమ కరువు నివారణ పథకం కింద చేపట్టిన కాలువల ప్రవాహ సామర్థ్యం పెంపు, కొత్త ప్రాజెక్టుల పనులను ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కార్ నిలిపి వేయడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శిషు్యడు రేవంత్రెడ్డికి రాజకీయ ప్రయోజనం చేకూర్చడం కోసం కృష్ణా జలాలపై ఏపీ హక్కులను మళ్లీ తెలంగాణకు తాకట్టు పెట్టడం ద్వారా రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎడారిగా మార్చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.సామర్థ్యం పెంచకుండా లైనింగ్ పేరుతో లూటీ..!కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కాలువ సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల చేపట్టిన కొత్త ప్రాజెక్టులను పనులను చంద్రబాబు సర్కార్ రాగానే పూర్తిగా నిలిపివేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఆ మేరకు పెంచే పనులు.. గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను పూర్తిగా ఆపేసింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను కూడా పూర్తిగా ఆపేసింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి చేపట్టిన కుందూ ఎత్తిపోతల పనులనూ నిలిపివేసింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పనులకూ చంద్రబాబు సర్కార్ మోకాలడ్డింది. ఇక హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను రూ.6,182.20 కోట్లతో 2021 జూన్ 7న వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. కానీ.. అధికారంలోకి రాగానే ఆ పనులను ఆపేసిన చంద్రబాబు సర్కార్ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పరిమితం చేస్తూ గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లుగా చిత్రీకరించి రూ.695.53 కోట్లను దోచేశారని సాగునీటిరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పేరుతో నాసిరకం పనులు చేసి రూ.1,968.62 కోట్లకుపైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు.సీమ ఎత్తిపోతలపై ఆది నుంచి బాబు అక్కసు..⇒ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకుంది. కానీ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను.. పులిచింతల పూర్తిగా ఏపీ ప్రాజెక్టు అయినప్పటికీ అందులో అంతర్భాగమైన విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నా నాడు చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో కిమ్మనడం లేదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాడు చంద్రబాబు కిమ్మనలేదు. ఈ నిర్వాకాల ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది.⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ⇒ శ్రీశైలం ప్రాజెక్టు దిగువన తాగునీరు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు.. కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. ఏపీ వాటాలో జలాలు మిగిలి ఉన్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఖాళీ చేస్తుండటం వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేని దుస్థితి దాపురించింది. దాంతో 2014–19 మధ్య నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం... తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి 2020 మే 5న వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీమ, నెల్లూరు జిల్లాలకు తాగునీరు, చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది ఈ ఎత్తిపోతల లక్ష్యం. ఈ ప్రాజెక్టు పనులను వైఎస్ జగన్ అధికారంలో ఉండగా పరుగులెత్తించారు. రూ.795 కోట్లకుపైగా విలువైన పనులను పూర్తి చేశారు.⇒ సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ రైతులతో టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది.⇒ ఒకవైపు రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిసూ్తనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులకు పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతంగా వాదనలు వినిపించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఏకాంత సమావేశంలో కుదిరిన ఒప్పందం వల్లే సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పనులను పూర్తిగా నిలిపి వేయించారనడాకి ఇది మరో నిదర్శనమని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
బాబు సీఎంగా ఉన్నప్పుడల్లా ఏపీకి నీటిగండం
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం ద్వారా... సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణ శాసనం రాస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు ద్రోహం బయటపడిందని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం స్వప్రయోజనాల కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనమని తేల్చిచెప్పారు.చంద్రబాబు తప్పునకు నిష్కృతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు లేవన్న సాకుతో చంద్రబాబే రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ నిలిపివేశారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఏపీకి నీటిగండమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడంలో బాబు విఫలమయ్యారని తేల్చి చెప్పారు. తక్షణమే రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్రకు పాల్పడవద్దని హెచ్చరించారు. రాయలసీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ‘రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు తొలి నుంచీ వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, లా యూనివర్సిటీ, హైకోర్టులను అమరావతికి తరలించుకుపోయారు. సీమ ప్రయోజనాల కోసం ఈ ప్రాంత నాయకులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలి. వైఎస్ జగన్ ఏపీ ప్రయోజనాల కోసం తాపత్రయపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనతో మాట్లాడి ప్రాజెక్టును నిలుపుదల చేయించినట్టు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తన మాటలపై నిజనిర్ధారణకు అన్ని పార్టీల నుంచి నాయకులను పంపిస్తానని కూడా సవాల్ చేశారు. చంద్రబాబు చేసిన ఈ ద్రోహంపై రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పునకు బాధ్యత వహించి రాయలసీమ ప్రాజెక్టును చంద్రబాబు తక్షణం పూర్తి చేయాలి. లేకుంటే వదిలే ప్రసక్తే లేదు’ గడికోట హెచ్చరించారు. బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపం ‘చంద్రబాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. ఏపీకి బాబు సీఎం అయిన ప్రతిసారీ నీటి గండం తలెత్తుతోంది. పైనున్న రాష్ట్రాలు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నాయి. గతంలో కర్నాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు మౌనం వహించారు. ఇప్పుడు మళ్లీ ఎత్తు పెంచుతున్నా పట్టించుకోవడం లేదు. నీటి కేటాయింపుల కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తరఫున వాదనలు వినిపించడంలోనూ బాబు విఫలమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. అందుకే బాబును గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు.ఆంధ్రా తెలంగాణ రెండు ప్రాంతాలకు మంచి జరగాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలోచించింది. తెలంగాణ నాయకులు కూడా రాయలసీమ ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తే, వైఎస్ జగన్ సీఎం అయ్యాకనే కేంద్రంతో మాట్లాడి మళ్లీ గాడినపెట్టారు. నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యూహాత్మకంగా పక్కనపెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచి్చన చంద్రబాబు, కొన్ని రోజులు హడావుడి చేసి దాన్ని కూడా అటకెక్కించారు’ అని శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
‘రీ సర్వే’పై దోబూచులాట!
సాక్షి, అమరావతి: భూముల తల రాతను మార్చేలా గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన భూముల రీ సర్వేను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా చేయలేక సతమతమవుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఒక్క గ్రామంలోనూ రీ సర్వే పూర్తి చేయలేకపోయింది. గత జగన్ ప్రభుత్వం 8 వేలకుపైగా గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, అక్కడ డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది. అధికారంలోకి రాకముందు ఆ రీ సర్వేపై ఇష్టానుసారం ఆరోపణలు చేసి.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన చంద్రబాబు, ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.రీ సర్వే మంచిదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో తాను అభాండాలు వేసిన దాన్ని రద్దు చేయలేక కొన్నాళ్లు డ్రామాలతో కాలక్షేపం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్ హయాంలో జరిగిన రీ సర్వే దేశానికే రోల్ మోడల్గా ఉన్నట్లు చెప్పడం, రీ సర్వే చేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో.. రీ సర్వేలో తప్పులు సరి చేస్తామంటూ చంద్రబాబు కొత్తపాట పాడారు. మరోవైపు జగన్ హయాంలో 8 వేలకుపైగా గ్రామాల్లో పూర్తయిన రీ సర్వేను చూపించి కేంద్రం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ.400 కోట్ల నిధులు తెచ్చుకున్నారు. అయినా ఆ నిధులను రీ సర్వే కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కనీసం రెవెన్యూ శాఖకు కొన్ని నిధులైనా ఇవ్వాలని ఆ శాఖ కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ముందుకు సాగడం లేదు. సౌకర్యాలు లేవు.. సిబ్బందికి ఇతర పనులు రీ సర్వే చేసే బృందాలకు అవసరమైన కంప్యూటర్లు, రోవర్లు ఇవ్వకుండా రీ సర్వే చేయాలని ఒత్తిడి చేశారు. రెవెన్యూ యంత్రాంగానికి సర్వే చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించకుండానే సర్వే చేయాలంటూ మొక్కుబడి తంతు నడిపారు. మరోవైపు వీఆర్ఓలు, సర్వేయర్లకు ఇతర పనులు అప్పగించడంతో రీ సర్వే ముందుకు సాగలేదు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా నిరంతరం చేపట్టే అభిప్రాయ సేకరణ సర్వేలు, పింఛన్ల పంపిణీ తదితర పనుల కోసం వారిని పెద్ద ఎత్తున వినియోగించారు.ప్రధాని పర్యటనలు, యోగా డే ఇతర కార్యక్రమాల పనులన్నీ వారికే అప్పగించారు. ఆ పనుల్ని ఎంపీడీఓలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వారిపై ఒత్తిడి తెచ్చారు. ఆ సమయంలో రీ సర్వే చేయాలని రెవెన్యూ శాఖ చెప్పినా దాంతో తమకు సంబంధం లేదని, తాము చెప్పిన పని చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తహశీల్దార్లకు సైతం రెవెన్యూ పనులు చాలా ఉండడంతో రీ సర్వే గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఫలితంగా ఏడాదిన్నరలో ఒక్క గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి చేయలేకపోయారు.రీ సర్వేలో మొదటి స్థానం ఎవరి ఘనత?గతంలో రీ సర్వే ప్రారంభమైన వెంటనే 19 నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఆయా భూములకు సంబంధించిన రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించే వారు. వారి రికార్డులు చూసేవారు. ఇప్పుడు అలా కాకుండా సర్వే అయిపోయాక రైతుల అభిప్రాయాలు తీసుకోవాలనే విధానాన్ని తెచ్చారు. దీంతో తప్పులు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో ఇటీవలే తప్పులు సరి చేయడానికి అవకాశం కల్పించారు. ఈ క్రమంలో రీ సర్వేలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర మంతి పెమ్మసాని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గ్రామంలో కూడా సర్వే పూర్తి చేయకుండా ఏపీ ఎలా నంబర్ వన్గా నిలిచిందన్న దానికి ఆయన వద్ద సమాధానం లేదు. వైఎస్ జగన్ హయాంలో విజయవంతంగా రీ సర్వే జరగడం, 8 వేలకుపైగా గ్రామాల్లో సర్వే పూర్తయి కొత్త డిజిటల్ రికార్డులు అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైంది. రీ సర్వేకు ప్రోత్సాహకంగా వచ్చిన రూ.400 కోట్లు ఇతర అవసరాలకు ఖర్చు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం రీ సర్వేను మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వ తరహాలో విజయవంతంగా కొనసాగించలేకపోతోంది. -
గంజాయి ‘కూటమి’
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే, ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి గంజాయి తాగుతూ అడ్డంగా దొరికాడు.⇒ భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ కూడా గత ఏడాది డ్రగ్స్ గ్యాంగ్తో దొరికినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.⇒ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులు అల్లూరి జిల్లాలో గంజాయి అక్రమ సాగు, స్మగ్లింగ్ దందా సూత్రధారులు.. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో గంజాయి మాఫియా జడలు విప్పుతున్న తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు. కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు, వారసులే రింగ్ మాస్టర్లుగా భారీస్థాయిలో మత్తు దందా సాగుతున్న వైనానికి నిదర్శనాలు. వెరసి బాబు సర్కారు.. ఆంధ్రప్రదేశ్ను గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్కు రాజధానిగా మార్చివేసింది. మొత్తమ్మీద పచ్చ మాఫియా ఏటా రూ.25 వేల కోట్ల దందాకు పాల్పడుతోందని అంచనా.టీడీపీ కూటమిలోని కీలక నేతల కుటుంబసభ్యులు గంజాయి డాన్లుగా చెలరేగుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా... ఇలా ఎక్కడ మత్తు బాగోతం బయటపడినా వీరి పాత్ర బట్టబయలవుతోంది. ఓవైపు కూటమి నేతల కుటుంబ పెద్దల ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి గంజాయి స్మగ్లింగ్ సాగుతుంటే, మరోౖవెపు ఆ కీలక నేతల వారసులు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో మకాం వేసి రవాణా చానెల్ను పర్యవేక్షిస్తున్నారు. పనిలోపనిగా ‘దమ్ మారో దమ్’ అంటూ గంజాయి, డ్రగ్స్తో జల్సా చేస్తున్నారుదక్షిణాది రాష్ట్రాలు దాటి..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) దెబ్బకు గంజాయి సిండికేట్ తోకముడిచి పరారైంది. కానీ, 2024లో చంద్రబాబు ప్రభుత్వం రాగానే టీడీపీ గంజాయి మాఫియా అడుగుపెట్టింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ దందా సాగించిన టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారు. ఈ ముఠా అల్లూరి జిల్లాలో గంజాయి సాగును పునఃప్రారంభించింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా మత్తు పదార్థం తెప్పిస్తూ ఎంపిక చేసిన మార్గాల్లో రాష్ట్రంలోని జిల్లాలు, దక్షిణాది రాష్ట్రాలు, గోవాకు సరఫరా చేస్తోంది. అంటే... బాబు సర్కారు గంజాయి రవాణాకు రాష్ట్రాన్ని గేట్వేగా మార్చేసిందికేంద్రం సూచనలు బేఖాతరుసరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని 18 ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ సూచించింది. కానీ, దీనిని చంద్రబాబు ప్రభుత్వం 8 చెక్పోస్టులతో సరిపెట్టింది. మిగిలిన పది కీలక ప్రాంతాల గుండా అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్కు తలుపులు బార్లా తెరిచింది. పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం టీడీపీ మాఫియా అల్లూరి జిల్లా నుంచి దక్షిణాది రాష్ట్రాలకు భారీగా గంజాయి రవాణా చేస్తున్న 3 ప్రధాన మార్గాలు... ఏవోబీ–ఏఎస్ఆర్ జిల్లా–అనకాపల్లి జిల్లా (చెన్నై–కోల్కతా హైవే)– చెన్నై/బెంగళూరు–కేరళ, ఏవోబీ–ఏఎస్ఆర్ జిల్లా సీలేరు–భద్రాచలం–హైదరాబాద్–పుణె/ముంబై, ఏవోబీ–రంపచోడవరం– రాజమహేంద్రవరం– చెన్నై. ఏడాదికి రూ.25 వేల కోట్లు.. టీడీపీ గంజాయి మాఫియా దోపిడీకేంద్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అనధికారికంగా వెల్లడించిన ప్రకారం 2024–25లో ఏవోబీ నుంచి రూ.8 వేల కోట్ల విలువైన గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు స్మగ్లింగ్ చేశారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.25 వేల కోట్లు. ఇక 2025–26లో రాష్ట్రం నుంచి సగటున నెలకు రూ.2 వేల కోట్ల విలువైన ‘సరుకు’ స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనికోసం టీడీపీ గంజాయి మాఫియా అల్లూరి జిల్లాలో ఏజెంట్ల వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించింది.కేరళ, కర్ణాటక, తమిళనాడు వారిని ఎంపిక చేసుకుని ఏజెన్సీలో అద్దె ఇళ్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చింది. ఈ ఏజెంట్లు అల్లూరి జిల్లాతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్లో గంజాయి పండించే వారిని సంప్రదించి భారీగా కొనుగోలు చేసి, దక్షిణాది రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, గోవాలలో పోలీసులు అరెస్టు చేసిన పెడ్లర్లు అందరూ వారికి ఏపీ నుంచే గంజాయి వస్తోందని చెప్పడం గమనార్హం. వీరిచ్చిన వివరాలతో ఏఎస్ఆర్ జిల్లా కేంద్రంగా సాగుతున్న వ్యవస్థీకృత మాఫియా బాగోతం బట్టబయలైంది.విద్యా సంస్థలకు గంజాయి ముప్పుఏపీలో గంజాయి మార్కెట్ విస్తరణపై టీడీపీ మాఫియా దృష్టిపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేతల ప్రధాన అనుచరులు ఇతర జిల్లాల్లోని వారి పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో నెట్వర్క్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థలను గంజాయి విక్రయాలకు మార్కెట్గా చేసుకున్నారు. విశాఖ, విజయనగరం, విజయవాడ, రాజమహేంద్రవరం తదితర జిల్లా కేంద్రాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ప్రత్యేకంగా వెండర్లను ఎంపిక చేసుకున్నారు. పాన్షాపులు, చిన్నచిన్న హోటళ్లు, సంచార వర్తకులు... ఇలా పలువురిని నెట్వర్క్లో భాగం చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. గంజాయి దందాను పెకలించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏర్పాటు చేసి గంజాయి మాఫియా ఆటకట్టింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దున... మన రాష్ట్ర పరిధిలో దశాబ్దాలుగా సాగిన గంజాయి సాగును సమర్థంగా కట్టడి చేసింది. ఆపరేషన్ పరివర్తన్ పేరిట ప్రత్యేక కార్యాచరణను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించింది. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12వేల ఎకరాల్లో గంజాయి సాగయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ ద్వారా 11,800 ఎకరాల్లో గంజాయి సాగును పెకలించి వేసింది. రూ.150 కోట్లతో గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. 2024 నాటికి గంజాయి సాగు కేవలం 50 ఎకరాలలోపునకు పరిమితం కావడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. -
రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు గంగలో కలిపారు
ఎంవీపీ కాలనీ: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను గంగలో కలిపే తీరును మరోసారి బట్టబయలు చేశాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బొత్స విలేకరులతో మాట్లాడుతూ, ‘చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసిమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించినట్లు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం ఎలా తాకట్టుపెడుతున్నారో స్పష్టమవుతోంది. పైగా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అబద్ధమంటూ ఏపీ ప్రభుత్వం లేఖ విడుదల చేయడం సిగ్గుచేటు. సూపర్ సిక్స్ హామీలు కొండెక్కడంతో రాష్ట్రంలో ప్రజా సంక్షేమం సంక్షోభంలో పడింది. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు పడుతున్న కష్టాలే ఇందుకు నిదర్శనం’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చొరవతోనే వేగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంసీఎంగా వైఎస్ జగన్ చొరవలు, విజ్ఞప్తి ప్రకారమే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను జీఎంఆర్ సంస్థ వేగంగా పూర్తిచేసిందన్నారు. ఇందుకు ఆ సంస్థకు అభినందనలు తెలిపారు. ‘ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఇచ్చింది. శంకుస్థాపన సమయంలో తొలుత 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేస్తామని జీఎంఆర్ ప్రకటించారు. అయితే అప్పటి సీఎం జగన్ కలుగజేసుకుని మరింత త్వరగా పనులు పూర్తిచేయ్యాలని విజ్ఞప్తి చేశారు. దానికి జీఎంఆర్ అంగీకారం తెలిపింది. ఎయిర్పోర్టు పనులు పూర్తిచేయించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు’ అని బొత్స వివరించారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మేల్యే ధర్మశ్రీ, విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు.ఈ ప్రశ్నలకు బదులేది?: ప్రభుత్వానికి బొత్స సూటి ప్రశ్నలు⇒ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం తానే పూర్తిచేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న బాబు ప్రభుత్వం గంగవరం ఎయిర్పోర్ట్ ఆధునీకరణ పనులను ఎందుకు చేయించలేకపోతోంది?⇒ భోగాపురం ఎయిర్పోర్ట్–విశాఖ సిటీ మధ్య కనెక్టివిటీ పనులు ఎందుకు వేగంగా జరగడంలేదు? పోర్ట్ టు ఎయిర్పోర్ట్ పేరుతో జగన్ ప్రభుత్వం బీచ్రోడ్డు అభివృద్ధికి ప్రణాళికలు వేసింది. ఆ డీపీఆర్కు కేంద్రమంత్రి నితిన్గడ్కారీ ఆమోదం తెలిపారు. అయినా ఆ పనులను ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు చేపట్టలేకపోయింది? ⇒ కనీస సమాచారం ఇవ్వకుండా విదేశాలకెళ్లిన సీఎం దేశ చరిత్రలో చంద్రబాబు మినహా మరెవ్వరూలేరు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన రహస్య పర్యటనకు కారణమేమిటి?⇒ జగన్ జన్మదినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్న పార్టీ కార్యకర్తలపై ‘జంతుబలి’ అంటూ కేసులు పెట్టి రోడ్డుపై నడిపించి చిత్రహింసలు పెట్టిన పోలీసు యంత్రాంగం, గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్ పోస్టర్ల ఎదుట ఇదే తీరుగా వ్యవహరించిన వారిని ఎందుకు పట్టించుకోలేదు? -
‘నేతన్న భరోసా’ ఏమైంది బాబూ!
సాక్షి, అమరావతి: చేనేత రంగానికి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయాలని చేనేత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఏడాదికి రూ.25 వేల చొప్పున నేతన్న భరోసా పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం అందించాలని, చేనేత కార్మికులకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరింది. చేనేత రంగానికి సంబంధించి 18 ప్రధాన డిమాండ్ల సాధన కోసం 15 చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.చేనేత రంగాన్ని ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులు జరపాలని సమావేశానికి హాజరైన నాయకులు డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగానే నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జీఎస్టీని రద్దు చేయాలని, చిలప నూలు, పట్టు, రంగులు, రసాయనాలు సబ్సిడీ ధరలకు అందించాలని, చేనేత రంగానికి పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని, నేతన్నలకు 3 సెంట్ల చొప్పున భూమి ఇచ్చి ఇళ్లు నిర్మించాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.ఫిబ్రవరి 23న చలో మంగళగిరిరాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 23న చలో మంగళగిరి నిర్వహించాలని రౌండ్టేబుల్ సమావేశం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఏర్పాటు చేసింది. జేఏసీ కో–కన్వీనర్లుగా బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, బుధవారపు బాలాజీ, కట్టా దుర్గారావు ఎంపికయ్యారు. సమావేశంలో చేనేత సంఘాల జాతీయ, రాష్ట్ర నేతలు నమాల శివరామప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, దామెర్ల శ్రీకృష్ణ, ముప్పన వీర్రాజు, వీరభద్రేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, చింతా శ్రీనివాసులు, సాయి ఓంకారయ్య, సమతం రమణ మహేష్ మాట్లాడారు. -
జగన్ విజన్.. దటీజ్ భోగాపురం
సాక్షి, అమరావతి : భూ సేకరణ పూర్తి చేయలేదు.. కనీసం కోర్టు కేసులు తేల్చలేదు.. కేంద్రం నుంచి ఎన్వోసీ తీసుకోలేదు.. అయినా భోగాపురం ఎయిర్పోర్టును మేమే కట్టేశామంటూ డప్పులు కొట్టుకోవడం ఒక్క చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది. భోగాపురం విమానాశ్రయం నిర్మాణం విషయంలో 2014–2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేశారు. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకే చెందిన అశోక్ గజపతి రాజు ఉన్నప్పటికీ కనీసం భూ సేకరణ చేయలేకపోయారు. అనుమతులు తీసుకురాలేకపోయారు. 2,703 ఎకరాలకు గాను 377 ఎకరాలు మాత్రమే చంద్రబాబు హయాంలో సేకరించారు. కనీసం ఎన్వోసీ కూడా లేదు.అయినా ఎన్నికల ముందు హడావిడిగా భూ సేకరణ, ఎటువంటి అనుమతులు లేకుండానే 2019 ఫిబ్రవరిలో టెంకాయ కొట్టి మమా అనిపించేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్ర మణిహారంగా వైజాగ్లో అంతర్జాతీయ విమానాశ్రయం 2,200 ఎకరాల్లో నిర్మించేలా నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్లో జీఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత భూమిని సేకరించడంతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం వంటి కీలక వ్యవహారాలను పూర్తి చేశారు. హైకోర్టు, ఎన్జీటీల్లో ఉన్న కేసులను అధిగమించి పనులు మొదలు పెట్టడానికి మార్గం సుగమం చేశారు.కేంద్రం కూడా ఎయిర్పోర్టు నిర్మాణానికి 2022 నవంబర్లో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసింది. దీంతో 2023 మే 3న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి వాయు వేగంతో పనులు జరుగుతున్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే భోగాపురం ఎయిర్పోర్టు తానే నిర్మిస్తున్నట్లు బాబు డబ్బా కొట్టుకోవడం ప్రారంభించారు. త్వరలో వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్న జీఎంఆర్ ఎయిర్పోర్టు రన్వేపై ఆదివారం తొలిసారిగా విమానాన్ని ల్యాండ్ చేసి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ క్రమంలో అప్పటి వైఎస్ జగన్ సర్కారు నిర్దేశించిన విధంగానే 2026 జూన్లోగా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.సామాజిక మాధ్యమాల్లో క్రెడిట్ చోరీ ట్రెండింగ్ వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, అదానీ డేటా సెంటర్.. ఇలా అన్ని ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకొని అభాసుపాలైనప్పటికీ వురోసారి నిస్సిగ్గుగా భోగాపురం ఎయిర్పోర్టును తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారు. బాబు క్రెడిట్ చోరీపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో సహా పెట్టి ఉతికి ఆరేస్తున్నారు.శంషా బాద్ ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభమయ్యాయంటూ జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు చెప్పిన మాటల వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు కానీ ఒక్క అనుమతిని కూడా తీసుకు రాలేదని, ఎకరం భూమి కూడా సేకరించలేదని, ఒక్క రూపాయి భూ పరిహారమూ చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. అయినా క్రెడిట్ తీసుకోవడానికి ఎలా సిద్ధమయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.క్రెడిట్ తండ్రీ తనయులదే..మా ఫస్ట్ ఎయిర్పోర్ట్కు హైదరాబాద్లో వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగా ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో కూడా వైఎస్సార్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయమో.. ఏమో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా భోగాపురం ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. – 2023 మే 3న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనలో జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జున రావు -
విజన్ వైజాగ్లో కీలక అడుగు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు సాధించడంతో పాటు ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయిందన్నారు. ‘విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒక మైలు రాయి.విజన్ వైజాగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడింది. మా పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాదు.. ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం, భూసేకరణ కోసం సుమారు రూ.960 కోట్లు ఖర్చు చేశాం. తద్వారా ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశాం. ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయింది.As the first flight prepares to land in Vizag, Andhra Pradesh accelerates on its growth runway, marking a significant milestone for #VisionVizag.Congratulations to the GMR Group for their exceptional efforts. During our tenure expedited permissions, timely approvals and land…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2026ఆ రోజు మేం చేసిన కృషి.. ఇవాళ్టి ఈ కీలక మైలు రాయిని చేరుకునేందుకు ముఖ్య కారణంగా నిలిచింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్ గ్రూప్కు నా హృదయ పూర్వక అభినందనలు. అలాగే, విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్ట్కు 2023 మార్చిలో ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారం, కృషి నాకు గుర్తుంది’ అని వైఎస్ జగన్ ఆదివారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. -
ఐఏఎస్ అధికారి భార్య అనుమానాస్పద మృతి
సాక్షి,విజయవాడ: ఐఏఎస్ అధికారి కిషోర్ సతీమణి సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్య దీపిక గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత వారం ఐఏఎస్ అధికారి కిషోర్ తన భార్యను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే,ఈ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.సత్య దీపిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యదీపిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు. -
నీతులు చెప్పే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. ఇప్పుడేమంటావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్ను పెంచి పోషిస్తున్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొదలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్ ఆదినారాయణరెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్ను పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?తండ్రీకొడుకులు పరువు తీశారు ‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీయిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్ను అలవాటు చేసి రౌడీలను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్కు అలవాటుపడి తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లా పరువును బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారు.రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజాయి నిర్మూలన కోసం నాటి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యంచంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
సెల్ ఫోన్.. గూగుల్ డేటా సెంటర్.. భోగాపురం!.. బాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ను నేనే కట్టాను.. సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను.. సత్య నాదెళ్ల, పీవీ సింధులు నా వల్లే ఎదిగారు.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను.. అని గొప్పలు చెప్పుకునేదెవరని అడిగితే.. ‘చంద్రబాబే’ అని ఎవరైనా ఇట్టే సమాధానమిస్తారు. రూపాయి పని చేయకపోయినా మొత్తం తానే చేసినట్లు, గంపెడు మట్టి పోయకున్నా ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఇసుమంత కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారు.వాస్తవానికి ఈ విమానశ్రయానికి ఏ మాత్రం అనుమతులు, భూసేకరణ వంటి ప్రాథమిక ప్రక్రియలు చేపట్టకుండానే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇదే చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు సంబంధించిన కోర్టు కేసులను కొలిక్కి తెచ్చారు. భూసేకరణ పూర్తి చేసి, భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి విమానాశ్రయానికి సంబంధించి దాదాపుగా పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పనుల పూర్తికి చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకుని.. ఈ ఎయిర్పోర్టు నిర్మాణం అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తద్వారా మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జనం చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో భూ సేకరణ ⇒ 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. ⇒ భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ⇒ విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ⇒ ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తయ్యింది. చంద్రబాబువి టెంకాయ రాజకీయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5 వేల ఎకరాలకు దిగొచ్చారు. భూ సేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నామన్నది ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం గమనార్హం. క్రెడిట్ చోరీకి పోటాపోటీ వైఎస్ జగన్ కృషినంతటినీ పక్కన పెట్టి.. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీలో పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్కు వచ్చినప్పుడల్లా భోగాపురం ఎయిర్పోర్టు పనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. లోకేశ్ ఓ దశలో కేంద్ర మంత్రి రామ్మోహన్ను నిలదీశారంటూ కూడా ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘనత తమదేనని ఈ ముగ్గురూ ఎవరంతకు వారు తమ కోటరీల ద్వారా ప్రచారానికి తెర లేపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత వైఎస్ జగన్ది అయినప్పటికీ.. ఆయనకు పేరు రాకుండా ఉండేందుకు వీరు పాట్లు పడుతుండటంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్దే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగవిుంచింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్షిప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది.ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకోవడంతో జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
రాయుడి హత్యలో బొజ్జల సుదీర్రెడ్డే సూత్రధారి
ఏర్పేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్యలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డే ప్రధాన సూత్రధారి అని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెట్టి నిర్దోíÙత్వం నిరూపించుకుంటామని జనసేన పార్టీ బహిష్కృత నేత కోట వినుత భర్త కోట చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ... ‘‘నా భార్య వినుత రాజకీయంగా ఎదుగుతుండడం ఓర్వలేక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఇదంతా చేశారు. ఆమెను అడ్డు తొలగించేందుకు డ్రైవర్ రాయుడు హత్యకు కుట్ర చేసి, అందులో మమ్మల్ని ఇరికించేలా పక్కా స్క్రిప్ట్ రచించి అధికార బలంతో అమలు చేశారు.మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకముందే... రాయుడిది హత్యనా? ఆత్మహత్యనా? అని పోలీసులు తేల్చకముందే సు«దీర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాపై ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపారాలన్నీ చెన్నై కేంద్రంగా చేస్తున్నారు. అక్కడినుంచే మాపై కుట్ర చేశారు. రాయుడిని మేమే హత్య చేసి ఉంటే శ్రీకాళహస్తి నుంచి 150 కి.మీ. దూరంలోని చెన్నై వెళ్లి మృతదేహాన్ని పడేయాల్సిన అవసరం ఏముంది?’’ అని కోట చంద్రబాబునాయుడు ప్రశి్నంచారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సుదీర్రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి వన్టౌన్ సీఐ గోపీని చెన్నై పంపి, అక్కడి పోలీసులతో ఎమ్మెల్యే మంతనాలు జరిపించారని, విచారణ ద్వారానే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. మా కారు డ్రైవర్తో ఆయనకు పనేంటి? జూన్ 25న తన మామ నగరం భాస్కర్కు ప్రమాదం జరగడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చి వారం పాటు అక్కడే ఉండి వైద్యం చేయించామని కోట చంద్రబాబునాయుడు తెలిపారు. అప్పటినుంచి ఆస్పత్రి పనిపైనే చెన్నై తరచూ వెళ్లామని వెల్లడించారు. సుధీర్రెడ్డికి అనుచరులే సరిగా గుర్తుండరని, తమ కారు డ్రైవర్తో ఆయనకు పనేంటని ప్రశి్నంచారు. రాయుడిని సు«దీర్రెడ్డి ఎమ్మెల్యే కాకముందు చాలాసార్లు ఇంటికి పిలిపించుకుని తమపై కుట్రకు బీజం వేశారని ఆరోపించారు. -
చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై విచ్చలవిడిగా దాడులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విజయవాడ పశి్చమ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు.‘మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్, ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసి కొట్టారు. నేడు దర్శి నియోజకవర్గంలోని గంగదేవిపల్లిలో దశాబ్దకాలంగా రేషన్ డిపో నిర్వహిస్తున్న శ్రీరామ్ వెలుగొండ రామయ్యపై వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించారు. లేకపోతే ఆయన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు భరించలేక శ్రీరామ్ వెలుగొండ రామయ్య ఇల్లు వదిలి వెళ్లి దేవస్థానంలో తలదాచుకున్నారు. టీడీపీ కూటమి నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.’ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. బతకాలంటేనే భయపడుతున్న ఆర్యవైశ్యులు ‘రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదు. అసలు ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు బతకాలంటే భయపడుతున్నారు. వరుస దాడులపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎందుకని ప్రశి్నంచడం లేదు? పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను అరికట్టాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులమంతా కలిసి తిరుగుబాటు చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు. -
బాబు పాలనలో దేవుడికే రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైంది. ఒక ఉన్మాది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం లోపలి నుంచి పైకెక్కి కలశాలను ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్నడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం, దేవదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లలో టీటీడీ చేతులెత్తేసింది. చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దర్శనాలు నిలిపివేయడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావొద్దనడం చరిత్రలో ఇదే ప్రథమమని ఆక్షేపించారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పాలనలో 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. కొండపైకి మద్యం, మాంసంతో యథేచ్ఛగా వస్తున్నారు. చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్తున్నారు. అయినా, పాలక మండలి చోద్యం చూస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో వెల్లడించాలి’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. దుర్గగుడి ఘటనకు మంత్రి బాధ్యత వహించరా? ‘విజయవాడ దుర్గగుడికి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిదం. ఆ సమయంలో 70 వేల మంది భక్తులు ఉన్నారు. దీనికి చిన్నస్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారా?’’ అని విష్ణు ప్రశి్నంచారు. తిరుమల లడ్డూపై దు్రష్పచారంతో రాష్ట్రానికి చెడు ‘తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేసిన రోజు నుంచే రాష్ట్రానికి చెడ్డ కాలం మొదలైంది. నేడు ఆలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు.హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది?’ అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘సీమ’ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా..
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం. – తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. తాగునీటి పనులకూ బ్రేక్రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది. ⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది. ⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు. -
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నమయ్య జిల్లా కేంద్రంపై పిల్
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పరిపాలన కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. జిల్లా కేంద్రం రాయచోటుగానే కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రాన్ని మార్చడం చట్ట విరుద్ధమని పిల్లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. జిల్లా కేంద్ర మార్పుకు సంబంధించిన జీవో, గెజిట్ నోటిఫికేషన్లను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. కార్యాలయాలు, రికార్డులను మదనపల్లికి మార్చకుండా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో అభ్యర్థించారు.ప్రతివాదులుగా రెవెన్యూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ను చేర్చిన పిటిషనర్. చట్ట నిబంధనల ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు.. పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు. దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం మొద్దునిద్రరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు.సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగంఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు గొలికొదిలిన ప్రభుత్వం..సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్థమవుతోంది.హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.జీవో 46తో సంక్షేమ హాస్టళ్లను ఆదుకున్న వైఎస్ జగన్జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండగా జీవో నంబర్ 46 తెచ్చింది. వీటిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఈ చక్కటి జీవోను తెచ్చింది. ఇందులో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్ధుల భద్రత, ఆహారం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఇందులో మరో గొప్ప అంశం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి క్షేత్రస్దాయిలో ఇబ్బందుల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని జీవోలో చెప్పాం.అందుకే ఇలాంటి ఘటనలు అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ జీవో నంబర్ 46ను పూర్తిగా పక్కనబెట్టేశారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణమైన పాలన చేస్తున్నారో అర్దమవుతోంది. విద్యార్ధుల డైట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో తక్కువగా ఉంటే మా హయాంలో పౌష్టికాహారం ఇవ్వాలని వాటిని సమూలంగా మార్చి చక్కడి డైట్ ప్లాన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలకు నీళ్ల పప్పు, ఉడకని అన్నం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే కారణంతో ఈ జీవోను పక్కనబెట్టేశారు.ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయంరాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఈ భోజనాలు తినలేక ఆకలితో నీరసించిపోతున్నారు. చలి వణికిస్తున్నా కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ప్రశ్నిస్తే వార్డెన్ కొడతారో, ఇంటికి పంపేస్తారనే భయంతో పిల్లలు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ వసతి గృహానికి నిర్వహణ, రిపేర్ల కోసం 20-30 వేలు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచే వాళ్లం.ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. వార్డెన్లు వస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్లం. పిల్లల భవిష్యత్తు, హాస్టళ్లలో పారిశుద్ధం, పౌష్టికాహారం అందించే విషయంలో నిరంతరం సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి. అలాగే ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని వైయస్.జగన్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు, పర్యవేక్షణ లేదు.వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడుతో మారిన స్కూళ్లువైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ స్కూల్స్కు సైతం రికమండేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి వాటిని తెచ్చారు. కార్పోరేట్ స్కూల్స్ లా మార్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటస్థలాల్ని అభివృద్ధి చేసి ఇచ్చారు. గోరు ముద్ద పేరుతో మంచి మెనూతో పౌష్టికాహారం అందించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం ఓ నిధి ఏర్పాటు చేసి పూర్తి పారిశుద్ధ్యంగా ఉండేలా చూశారు. ప్రతీ పేద విద్యార్దికీ కార్పోరేట్ స్కూల్ అన్న ఫీలింగ్ తెచ్చారని విడదల రజిని స్పష్టం చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికల మీద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్ధితి ఉండేదని.. కానీ ఇప్పుడు కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. క్లబ్లో గేమింగ్స్కు సంబంధించి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పాటించకుంటే చర్యలు తీసుకోవాలని అటు పోలీసులకు స్పష్టం చేసింది. డిసెంబర్ 22వ తేదీన మ్యాంగో బే క్లబ్పై పోలీసులు రైడ్స్ నిర్వహించి.. పేకాట ఆడుతున్న 285 మందిని పట్టుకున్నారు. మొత్తం రూ.34 లక్షల నగదుతో పాటు 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నాలుగురోజుల కిందట ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 13 కార్డ్స్ పేకాట లేదంటే డబ్బులు పందేలకు ఏ ఆట ఆడవద్దని.. అలా ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఉత్తర్వులపైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతోందని గమనిక బోర్డు ఏర్పాటు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
జల వివాదాలపై కేంద్ర కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారుడు, ఈఎన్సీ(ఇరిగేషన్), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారు.తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు, శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్)తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సీఈలను సభ్యులుగా నియమించారు. సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏవో) సీఈని కమిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కమిటీని నియమించి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.ఆ మేరకు ఇప్పుడు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సమన్యాయంతో నీటి పంపకాల మార్గాలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం పేర్కొంది. జల వివాదాల పరిష్కారానికి మూడు నెలలులోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఇందుకోసం ఇతర విభాగాల అధికారులు, నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.పరిష్కారమయ్యేనా..?కృష్ణా జలాలను ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు కల్పించింది. అయితే కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమలులోకి వచ్చే వరకు, బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో తమకు 50 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ వివాదాలపై చర్చించి పరిష్కారాలను సూచిస్తూ కేంద్రానికి కమిటీ ఇచ్చే నివేదికతోనైనా జల వివాదాలు పరిష్కారమవుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. -
అవినీతిలో రెవెన్యూ శాఖ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. ఇదే సమయంలో అవినీతి అధికారులకు శిక్షలు మాత్రం తగ్గుతున్నాయి. 2025లో రాష్ట్రంలో అవినీతి కేసులపై ఏసీబీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అవినీతిలో రెవెన్యూ శాఖదే మొదటి స్థానమని తేలి్చంది. ఏసీబీ డీజీ అతుల్సింగ్ శుక్రవారం విడుదల చేసిన ఆ నివేదిక రాష్ట్రంలో అవినీతి పెరుగుతోందని వెల్లడించింది. 2025లో ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మొత్తం 115 అవినీతి కేసులను నమోదు చేశారు. వాటిలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న (ట్రాప్) కేసులు 69 ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 8 నమోదు కాగా, వీటిలో కారి్మక శాఖకు చెందినవి రెండు.. విద్యుత్తు, వైద్య–ఆరోగ్య, పురపాలక – పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఒక్కో కేసు నమోదైంది.నేరపూరితమైన ప్రవర్తన కేసులు 7, సాధారణ విచారణ కేసులు 19, ఆకస్మిక తనిఖీల కేసులు 12 ఉన్నాయి. ట్రాప్ కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 69 కేసుల్లో అత్యధికంగా 19 కేసులు ఆ శాఖ అధికారులపై నమోదు చేసినవే. ఓ వైపు అవినీతి పెరుగుతూ ఉంటే మరోవైపు అవినీతికి పాల్పడిన అధికారులపై మాత్రం శిక్షలు తగ్గుతుండటం విస్మయ పరుస్తోంది. ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి సంవత్సరం 2023లో 48 శాతం కేసుల్లో అవినీతి అధికారులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించారు. 2025లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం శిక్షల శాతం 46 శాతానికి తగ్గింది. న్యాయస్థానాల్లో విచారణ ముగిసిన 36 కేసుల్లో కేవలం 12 కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి. అవినీతి తగ్గించేందుకు కృషి: అతుల్ సింగ్, డీజీ, ఏసీబీ ‘రాష్ట్రంలో అవినీతి పెరుగుతోంది. దాన్ని ఒక్క ఏసీబీనే కట్టడి చేయలేదు. ప్రజల సహకారం చాలా అవసరం’ అని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై 46 శాతం శిక్షల రేటుతో తాను సంతృప్తికరంగా లేనని చెప్పారు. శిక్షల రేటు 75 శాతం ఉండాలన్నారు. మధ్య స్థాయి, ఉన్నత స్థాయి అధికారులు బినామీల పేరుతో ఆస్తులను కూడగడుతుండటాన్ని గుర్తించడం ఏసీబీకి సవాల్గా మారిందన్నారు. అందుకోసం ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ను త్వరలో ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. -
రాబడిని పెంచండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.ఫిబ్రవరిలో 2026–27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అందులో తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలను నిధి ఆన్లైన్ పోర్టల్లో ఈనెల 9లోగా ఆన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలూ నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి్సందిగా సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని కోరింది. హెచ్ఓడీలు బకాయిల వసూళ్లపై డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశమున్న బకాయిలను అంచనా వేయాలని.. రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతోపాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చి సూచికలను అమలుచేయాలని తెలిపింది.కొత్తగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించొద్దు..ప్రస్తుతమున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సమీక్షించడం ద్వారా వారి సంఖ్య తగ్గించాలని, కొత్తగా ఎవరినీ ప్రతిపాదించొద్దని.. అలాగే ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరైన ఉత్తర్వుల ఆధారంగా ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ తెలిపింది. సంబంధిత శాఖల ఆమోదం తరువాతే కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలను ప్రతిపాదించాలని పేర్కొంది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా నిర్వహణ వ్యయం ప్రతిపాదించాలంది. ప్రభుత్వ అనుమతిలేని ఎలాంటి అంశాలకూ కేటాయింపులు ప్రతిపాదించరాదని చెప్పింది. రాయితీలు, నిర్వహణ, సామాజిక పింఛన్లు మొదలైన తప్పనిసరి వ్యయాలకు పూర్తిగా కేటాయింపులు చేస్తామని.. అయితే, లబ్ధిదారుల సంఖ్యతో సహా బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి. అప్పులతోనే మూలధన వ్యయం..ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. కనెక్టివిటీ, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమీక్షించడంతో పాటు వాటి అవసరం, ప్రాధాన్యత, వ్యయాలు, ఫలితాలను పరిశీలించి కాలం చెల్లిన పథకాలను రద్దుచేయాలని చెప్పింది. వేతనాలేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేయాలని కోరింది. సాధ్యంకాని, సరిపోని కేటాయింపుల ప్రతిపాదనలను చెయొ్యద్దని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది.పథకాల వ్యయం అంచనాలు ఇలా..‘పథకాల వ్యయానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి డేటాతో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాకే ప్రతిపాదనలు పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది వాస్తవ నిధుల విడుదల ఆధారంగా ప్రతిపాదనలు ఉండాలి. ఊహాజనిత గణాంకాలతో ప్రతిపాదనలు చెయొ్యద్దు. ఉప ప్రణాళికలతో పాటు మహిళలు, పిల్లల బడ్జెట్ను ప్రతిపాదించాలి. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి’ అని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మూడు నెలల్లో మళ్లీ రూ.17,500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అప్పుల క్యాలెండర్తో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) బాబు సర్కారు రూ.17,500 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో ఆర్బీఐ శుక్రవారం మూడు నెలల బాబు సర్కారు అప్పుల క్యాలెండర్ను ప్రకటించింది. బాబు ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తున్నా, సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు, యువతకు ఉద్యోగాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు.ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు కూడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో మూడు నెలల్లో చేసే అప్పుల్లో వచ్చే మంగళవారం అంటే ఈ నెల 6వ తేదీన రూ.6,500 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. గత మంగళవారం నాడే బాబు సర్కారు రూ.4,000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారం వ్యవధిలోనే రూ.6,500 కోట్లు అప్పు చేస్తోంది. అంటే వారం వ్యవధిలోనే బాబు సర్కారు ఏకంగా రూ.10,500 కోట్లు అప్పు చేసినట్లవుతోంది. -
మామిడి రైతుకు అందని ‘మద్దతు’!
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధర దక్కక గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధరగా కిలోకు రూ.12 ప్రకటించిన సర్కారు ఆ మేరకు రైతులకు ధర దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని రైతులకు జమచేయడంతో తమ పని అయిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంది. మరోవైపు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకి రూ.8 చొప్పున ఇవ్వకుండా గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కూడా చేతులెత్తేయడంతో రానున్న సీజన్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన మామిడి రైతులను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో.. మరో నాలుగు నెలల్లో మార్కెట్కు రానున్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రం నిధులతో సరి..వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగా చిత్తూరు జిల్లాలో 32,257 మంది నుంచి 3.72 లక్షల టన్నులు.. తిరుపతి జిల్లాలో 6,137 మంది నుంచి 67 వేల టన్నులు.. అన్నమయ్య జిల్లాలో 2,401 మంది నుంచి 24 వేల టన్నులు.. వెరసి 40,795 మంది రైతుల నుంచి 4.62 లక్షల టన్నుల మామిడి కాయలను గుజ్జు పరిశ్రమలు, వ్యాపారులు, మండిలోని ర్యాంపు నిర్వాహకుల ద్వారా సేకరించినట్లు లెక్కతేల్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.130 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, 1.62 లక్షల టన్నుల మామిడికి మార్కెట్, మద్దతు ధరల మధ్య వ్యత్యాసం ఇస్తామని కేంద్రం ప్రకటించింది.చివరికి.. లక్ష టన్నులకు రూ.109 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి మరో రూ.76 కోట్లు జతచేసి కిలోకు రూ.4 చొప్పున రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 14న విడుదల చేసింది. కానీ, ఇప్పటివరకు రూ.150 కోట్లకు మించి జమకాలేదని తెలుస్తోంది. పైగా.. ఈ–పంట డేటా ఆధారంగా రాయితీ సొమ్ము జమచేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం చివరికి, ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి సేకరించిన జాబితా ప్రకారం జమచేయడంతో అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.చేతులెత్తేసిన పరిశ్రమలు.. పట్టించుకోని ప్రభుత్వం..ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకు రూ.8 చొప్పున చెల్లించాల్సిన గుజ్జు పరిశ్రమలు, ర్యాంప్ నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించడంలో చేతులెత్తేశాయి. కొన్ని పరిశ్రమలు రూ.3–4లు, మరికొన్ని పరిశ్రమలు రూ.4–5 చొప్పున చెల్లించాయి. ర్యాంపుల్లో అయితే రూ.3కు మించి చెల్లించిన దాఖలాల్లేవు. మరికొన్ని ఫ్యాక్టరీలైతే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి రూ.400 కోట్లు జమకావాల్సి ఉండగా, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు 40 వేల మందికి రూ.350 కోట్లకు పైగా రావాల్సి ఉండడంతో ఆ మొత్తం కోసం రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.అయినా సరే ప్రభుత్వం పట్టనట్లుగా ఉంది. కిలో రూ.8 చొప్పున చెల్లించేందుకు తాము అంగీకరించలేదని, అలాంటప్పుడు ఏ విధంగా చెల్లిస్తామని గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లుగా ఎగుమతుల్లేక ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన పల్ప్ నిల్వలకు మార్కెటింగ్లో సహకరించాలని మొరపెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వమే హామీ ఇచ్చినందున తమకు రావాల్సిన మొత్తం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గత సీజన్లో తలెత్తిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న సీజన్లో మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వైఎస్ జగన్ చొరవతోనే కిలోకు రూ.4 సబ్సిడీ..చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి, అల్ఫాన్సా, బెనిషా, మల్లికతో పాటు దాదాపు 10 రకాల వెరైటీలు సాగవుతున్నాయి. అత్యధికంగా 40 వేల హెక్టార్లలో తోతాపురి రకమే సాగవుతోంది. ఇలా అన్ని రకాల మామిడి కలిపి గతంలో 6.45 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. తోతాపురి అయితే 5.60 లక్షల టన్నుల వరకు వచ్చిందని అంచనా. అయితే, తోతాపురి వెరైటీ మామిడిని అమ్ముకునేందుకు రైతులు గత సీజన్లో ఎన్నడూలేని రీతిలో పడరాని పాట్లు పడ్డారు. ధరలేక.. కొనేవారు లేక రోడ్డెక్కిన వీరికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలవడంతో కిలో రూ.12లకు తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కిలో రూ.12 చొప్పున 5.60 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.672 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. కానీ, ఆ రేటుకు కొనేందుకు గుజ్జు పరిశ్రమలు ముందుకురాకపోవడంతో సబ్సిడీ రూపంలో కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే, తాము చెల్లిస్తామన్న సబ్సిడీ మొత్తం విడుదలలో తొలుత చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, షార్ట్టర్మ్ రుణం రూపంలో కార్పొరేషన్ల ద్వారా సమీకరించుకోవాలంటూ ఉద్యాన శాఖను ఆదేశించింది. -
‘ఉత్త’ షోకు రంగం సిద్ధం!
‘అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ సామెత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లు సరిపోతుంది.. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే ఈ పథకానికి గోదావరి జలాలు తరలిస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేసింది లేదు.. 2014–19 మధ్య, ఇప్పుడు ఈ 18 నెలల్లో చేసిందంటూ ఏమీ లేదు. కనీసం తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు. అలాంటిదిప్పుడు ఈ నెలలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిధులు వెదజల్లుతారట! గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు కొనసాగేలా కూడా దృష్టి పెట్టని ఈ సర్కారు.. ప్రజలను మభ్యపెట్టడానికి సరికొత్త ‘షో’కు ఉద్యుక్తమవుతుండటం విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తి తీర్చే బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉత్తుత్తి ‘షో’ చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని యత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు పథకానికి 2024–25 బడ్జెట్లో రూ.79.97 కోట్లు చూపి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించినా పైసా విదిల్చలేదు. ఫలితంగా ఈ పథకానికి గ్రహణం పట్టిందని సాగు నీటి రంగ నిపుణులు వాపోతున్నారు.పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలిండం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. కానీ, ఆయన హఠాన్మరణంతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఈ పథకాన్ని పట్టించుకోలేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టినట్టు చూపుతూ 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. కానీ, పైసా పని అయినా చేయనే లేదు.వైఎస్ జగన్ చొరవతో అడుగులు ముందుకు..సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను రూ.17,411 కోట్లతో చేపట్టేందుకు అనుమతిచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.954.09 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.రెండో దశలోనూ పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కిలోమీటర్ల పొడవునా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రెండు ప్యాకేజీల కింద రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. వాటికి అనుబంధంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనుల డిజైన్లు అన్నింటిని 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులకు 3,822 ఎకరాలు, రెండో దశకు 12,214.36 ఎకరాల భూ సేకరణను కొలిక్కితెచ్చారు.చంద్రబాబు రాకతో ఎక్కడి పనులు అక్కడే!⇒ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకు.. అంటే 2024 జూలై 11న అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తానని హామీ ఇచ్చారు. కానీ, 17 నెలలైనా పనుల్లో కదలిక లేదు. 2024–25 బడ్జెట్లో తొలుత రూ.63.02 కోట్లు, సవరించిన బడ్జెట్లో రూ.79.97 కోట్లు కేటాయించినా, పైసా వ్యయం చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 11న నిర్వహించిన సమీక్షలో ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి, తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటిదాక రూపాయి కూడా విడుదల చేయలేదు.ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా⇒ వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ⇒ పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ. నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లాలో పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, 106 కి.మీ పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ పురం (వీర నారాయణపురం) వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీలతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు.⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నంలో 3.21 లక్షలు, విజయనగరంలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీరందిస్తారు. -
న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి
సాక్షి, అమరావతి: న్యాయాధికారులకు జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే... న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. సీనియర్, యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదట సహకారం అందించే వ్యక్తిని తానే అవుతానని కూడా ఆయన ప్రకటించారు. న్యాయవాదులకు లీగల్ అకాడమీ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థలో తాజా పరిణామాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు.మారిన పరిస్థితుల్లో కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారని పేర్కొంటూ అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలన్నారు. గుంటూరులో శనివారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహ శుక్రవారం హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏఐ విప్లవాత్మక పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అత్యంత అవసరమన్నారు. ఘన సన్మానంఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గం జస్టిస్ శ్రీనరసింహను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు గ్రంథాలయాన్ని, హైకోర్టు నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం రాత్రి జస్టిస్ నరసింహ గౌరవార్థం హైకోర్టు న్యాయమూర్తులందరూ విందు ఏర్పాటు చేశారు. కాగా, హైకోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహను ఆయన పూర్వీకుల గ్రామమైన ప్రకాశం జిల్లా, మేదేపల్లి గ్రామానికి చెందిన పలువురు కలిసి, ఆయన తండ్రి దివంగత కోదండరామయ్య చిత్ర పటాన్ని అందచేశారు.పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు: జస్టిస్ శ్రీనరసింహ వన్టౌన్(విజయవాడపశి్చమ): పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని జస్టిస్ శ్రీనరసింహ పేర్కొన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ శ్రీనరసింహ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పుస్తక పఠనం గొప్ప సంస్కృతిగా అభివర్ణించారు. పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. -
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
⇒ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు. ⇒ తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు.. రెండో ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగనామం. ⇒ దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు.. తొలి ఏడాది రూ.3,218.48 కోట్లు, రెండో ఏడాది రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తంగా రూ.4,700.96 కోట్లు ఎగవేశారు. ⇒ ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేల చొప్పున రెండేళ్లలో రూ.36 వేలు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఒక్కపైసా ఇవ్వకుండా రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు చొప్పున ఇవ్వాలి. కానీ, సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా రూ.14,400 కోట్లు బకాయిపెట్టారు. ⇒ అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలే ఇచ్చి.. రూ. 30 వేలు ఎగ్గొట్టారు. తద్వారా రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ఇంటింటికీ బాండ్లు పంచిన టీడీపీ కూటమి నయవంచనకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ..’ అంటూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇంటింటికీ పంచిన బాండ్లు ప్రకారం తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి వడ్డీతో సహా కొత్త ఏడాదిలోనైనా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే.. 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రకటించారు.సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. ఐదేళ్లలో చేకూరే లబ్ధిపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా కుచ్చుటోపీ పెట్టారు! చంద్రబాబు ప్రజలకు ఎగ్గొట్టిన ఆ మోసాల ఖరీదు ఏకంగా రూ.లక్షన్నర కోట్లు!!ఆ మోసాలకు సాక్ష్యాలు.. ఇంటింటా బాబు బాండ్లుమహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నంబరును టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లలో ఒనగూరే ప్రయోజనాలను హోరెత్తించారు.టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో చెప్పారు. కానీ ఇంతవరకు ఆ బాండ్లలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో మోసపోయామని ప్రతి ఇంటా ప్రజలు ఆక్రోశిస్తున్నారు. సూపర్ సిక్స్ సహా వివిధ హామీల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఎగవేత..సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంటే.. ఈ ఏడాది నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.72 వేలు! ఇప్పటికే నిరుద్యోగ భృతి కింద యువతకు సీఎం చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయిపడ్డారు. సుఖీభవ బకాయిలు రూ.16,747.52 కోట్లుప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది దీన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. అంటే.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలకుగానూ రూ.పదివేలే విదిల్చి.. ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.ఆడబిడ్డ నిధితో ఎగ్గొట్టింది రూ.64,800 కోట్లు సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం మరొకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఏటా రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26 బడ్జెట్లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేలు చొప్పున చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.36 వేలు! ఆడబిడ్డ నిధి కింద సీఎం చంద్రబాబు మహిళలకు ఇప్పటికి రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే పెన్షన్ల పేరుతో వంచన..50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. తొలి ఏడాది వారికి పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాది కూడా ఎగ్గొట్టినట్టే. ఈ వర్గాలకు చెందిన వారికి ఎన్నికల హామీని నెరవేర్చకుండా రెండేళ్లలో పెన్షన్ కింద చంద్రబాబు రూ.96 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద ఇప్పటికే 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం చంద్రబాబు పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.తుస్సుమన్న ఉచిత బస్సు..మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు.తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు.తల్లులకు ఎగ్గొట్టింది రూ.19,848.64 కోట్లకుపైనే!తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు.‘దీపం’లో రూ.4,700.96 కోట్లు ఎగవేత..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855 ఉంది. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. -
‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా’.. ఇలా చేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే!
సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.సీసీ కెమెరాలుసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఇళ్ల భద్రతా చర్యలు ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.వాహనాల భద్రత విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.టెక్నాలజీ ఆధారిత భద్రత ఇళ్లలో టైమర్తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలిసోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
సాక్షి, విజయవాడ: మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జోగీ రమేష్పైకు డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సందర్భంగా జోగి రమేష్ను కలిసేందుకు వచ్చిన భార్య, కుమారుడితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు అందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జోగి రమేశ్ను అరెస్టు చేసింది. -
చంద్రబాబు ‘కనబడుటలేదు’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ల ఆచూకీ లేకుండా పోవడంతో, సోషల్ మీడియాలోనూ ప్రజల్లో వీరి ఆచూకిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్ఫష్టీకరించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తమ విదేశీ పర్యటలపై తండ్రీకొడుకుల ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీసిన ఆయన... సీఎస్, డీజీపీలే ప్రజలకు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా.. తెచ్చిన అప్పంతా దోచుకుంటోందని మండిపడ్డారు. చివరకు టీడీపీ కార్యకర్తల నూతన సంవత్సర అభినందనలకు కూడా అందకుండా తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ ల కోసం టీడీపీ కార్యకర్తలు వెదుకుతున్నారని... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రహస్య పర్యటనలేంటని వెంకటరెడ్డి ఆక్షేపించారు.ప్రతి 3 నెలలకు చంద్రబాబు, 2 నెలలకు లోకేష్ ప్రత్యేక విమానాల్లో దోచుకున్నది దాచుకోవడానికే రహస్య పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఆచూకీ లేని సీఎం చంద్రబాబునాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఏమైపోయాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కనబడుట లేదు. ఆచూకీ ఎక్కడ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆచూకీ గురించి రాష్ట్ర డీజీపీ, సీఎస్ల వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు చెప్పాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఆచూకీ కనుగోనమని కోరాలి. సీఎం చంద్రబాబుతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ సైతం గడిచిన వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చంద్రబాబు ఆచూకీ గురించి ఎల్లో మీడియా సైతం పలు దేశాల పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఎవరూ క్లారిటీగా ఫలానా దేశం వెళ్లాడని కూడా చెప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు, ఇలా రహస్యంగా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడం లేదు.శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో జంప్రాష్ట్రమంతా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకుంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం అదే రోజు (30.12.2025)న శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉదయం 10.28 గంటలకు వీజేటీ 101 అనే స్పెషల్ ఫ్లైట్లో బాలి వెళ్లాడని తెలుస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్లాడని ప్రచారం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ మీటింగ్ కూడా వదిలేసి 28-12-2025న శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్లాడని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగా కీలకస్థానాల్లో ఉండి ఇలా రహస్య పర్యటనలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేకుండా కేబినెట్ మీటింగ్లు కూడా వదిలేసి ప్రత్యేక విమానాల్లో ఎందుకు వెళ్లారు? వారి పర్యటన వివరాలు ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారు? కనీసం వారు తిరిగి ఎప్పుడోస్తారో కూడా చెప్పకపోవడానికి ఏవైనా కారణాలున్నాయా? ఇవన్నీ ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.ప్రతి మూడు నెలలకు చంద్రబాబు, రెండు నెలలకు లోకేష్చంద్రబాబు సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఆరుసార్లు విదేశీ పర్యటనలు చేస్తే, అందులో రెండుసార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి చేసిన రహస్య పర్యటనలే ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ పర్యటనలకు వెళ్లాడు. ప్రస్తుతం బాలి వెళ్లినట్టు తెలుస్తోంది. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఇప్పటికే 9 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. ప్రతి రెండు నెలలకోసారి ప్రత్యేక విమానాల్లో ఆయన విదేశాల్లో విహరించి వస్తున్నాడు. యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఏ దేశ పర్యటనలో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయకులకే క్లారిటీ లేదు.దోచుకున్నది దాచుకోవడానికేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రూ. 2.93 లక్షల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ సంపదను తన బినామీలకు అప్పనంగా దోచిపెడుతున్నాడు. ఆ డబ్బును విదేశాల్లో దాచుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఏపీ ప్రజల సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకోవడానికే తండ్రీకొడుకులు రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు.అరాచకాలకు కేరాఫ్గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేల బాగోతాలు చూస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి దారుణాలన్నీ కూటమి ఎమ్మెల్యేల కేంద్రంగానే జరుగుతున్నాయి. మహిళలను వేధిస్తూ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోల సాక్షిగా దొరికిపోయారు. మరికొందరి బాగోతాలు బాధితుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి.ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు పోలీసులు ఆయనతోపాటు అతడి అనుచరుడు సుజిత్ రెడ్డి, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన, టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో ఒక అమాయకుడు బలైపోయాడు. డ్రైవర్ రాయుడి హత్యలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పూనుకున్నాడని అభియోగాలున్నాయి. ఆ కుట్రలో పావుగా మారిన డ్రైవర్ రాయుడు హత్యకు గురైనట్టు తెలుస్తోందని వెంకటరెడ్డి తెలిపారు. రాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినా.. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా మీడియా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని.. తక్షణమే వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు. వాదనల విన్న తర్వాత ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. కథనాలపై ఇంటెరిం ఇన్జంక్షన్ ఇవ్వాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ ప్రసాద వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సహా పలు మీడియా సంస్థలు కల్పిత కథనాలు రాస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అంటూ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఏపీలో పదే పదే అదే తప్పు!
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపటత్వంపై మాత్రమే ఆధారపడి పనిచేస్తోందని పదే పదే రుజువు అవుతోంది. స్వయానా మంత్రులే ఫేక్ వీడియోల ప్రదర్శనకు దిగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు సైతం చెబుతూండటం అత్యంత బాధాకరం. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ రౌడీయిజం చేయాలని చూస్తున్నాయని, జగన్ పుట్టిన రోజున జంతుబలి చేస్తారా? పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా విమర్శించారు. ఇది కూడా పక్కదోవ వ్యూహంలో భాగమే.జగన్ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అతడికి వచ్చిన మద్దతు, జరిగిన సంబరాలను కూటమి పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతే.. కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి బైకులు ర్యాలీలు తీసినా కేసులు పెట్టారు. కేక్ కట్ చేసినా అరెస్టు చేశారు. జాతరలో మాదిరి పొట్టేళ్లను నరికారంటూ పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని అమానుషంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చివరకు పోలీసు శాఖ ఇవన్నీ ఏవో గొప్ప పనులైనట్లు ప్రచారం చేసుకునే దుస్థితికి చేరింది. దీనికి డిజిపి గుప్త సమర్థన మరీ ఘోరంగా ఉంది.తమ వద్ద వాహనాలులేవని, అందుకే నడిపించామని ఆయన చెప్పారు.నిజమే! ఎవరు చట్ట ఉల్లంఘన చేసినా తప్పే. కేసులు పెట్టవచ్చు. అలా కాకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతామని, టీడీపీ, జనసేనలకు చెందిన వారు ఎలాంటి తప్పులు చేసినా, తీవ్ర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమని పోలీసులు బాహాటంగా చెబుతున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? నీతులు చెప్పే చంద్రబాబు ఏమని ఆదేశాలు ఇవ్వాలి? ఎవరు బహిరంగంగా జంతు బలి చేసినా ఒప్పుకోరాదని, వివక్ష లేకుండా కేసులు పెట్టాలి అని. ఆ పని చేయలేదు. కొంతకాలం క్రితం టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పొటేళ్లలను రోడ్డుపైనే నరికారు.చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.అంతకన్నా దారుణం ఏమిటంటే ఆయన బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కటౌట్ కు పోటేళ్ల తలల దండ వేశారు. ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్, కొందరు టీడీపీ నేతల సమక్షంలోనే పొటేళ్లను నరికి వేడుక చేస్తుంటే ఇదే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు.అంతే తప్ప వీరెవ్వరిపైన కేసులు పెట్టలేదు. చంద్రబాబు మాటలలోని డొల్లతనం ఈ ఘటనలు తెలియచేయడం లేదా?నిందితులను పెరేడ్ చేయించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి డీజీపీకి తెలియదా? లేక నిందితులను శిక్షించే హక్కు నేరుగా ఏమైనా రాజ్యాంగం ఇచ్చిందా? డీజీపీ అలా మాట్లాడితే కింది స్థాయి పోలీసులకు ఏమి సంకేతం ఇస్తున్నట్లు? అన్ని రంగాలలో విఫలమైన నేపథ్యంలో పోలీసులే కూటమి పెద్దలకు దిక్కయ్యారు.అందులో వీర విధేయతతో, రాజును మించిన రాజభక్తితో వ్యవహరించే కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అరాచకంగా నడుపుతున్నారు. ఇంత అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ పరిస్థితి అవమానకరం అని వేరే చెప్పనవసరం లేదు.పోలీసు అధికారులు చంద్రబాబు మాటకన్నా ఆయన కుమారుడు ,మంత్రి లోకేశ్ ఆదేశాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఏపాటి ప్రతిష్టో ఆయనే ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి రఫ్ఫా, రఫ్ఫా అంటే తప్పన్నారు.ఒకే! అలాగే అనుకుందాం? మరి లోకేశ్ రడ్బుక్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్టా? దాని ప్రకారం పోలీసులను పని చేయించడం సరైనదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాళ్లు విరగగొడతాం, కీళ్లు విరగగొడతాం, చేతులు అరగదీస్తాం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తోంది? కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి? వారు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదే.పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ బెదిరిస్తున్నారే! వినుకొండలో రషీద్ అనే యువకుడిని టీడీపీ వారే నడిరోడ్డుపై నరికి చంపితే దానిని ఏమంటారు. కనీసం ప్రభుత్వం ఆ ఘటనను ఖండించిందా? అంతదాక ఎందుకు ! చంద్రబాబు ఇన్ని సుద్దులు చెబుతున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని రోడ్డుపై ప్రదర్శన చేశారే. వారిపై కేసులు పెట్టారా? రోడ్డుపై నడిపించి అవమానించారా? ఈ రెడ్బుక్ అండ చూసుకుని పోలీసులు పలు చోట్ల సామాన్య ప్రజలపై కూడా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులో సీఐ బెదిరింపులు భరించలేక ఓ ఆర్యవైశ్య మహిళ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నం చేసింది. ఇది మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తున్న తీరా!పొదిలిలో ఒక వ్యాపారిపై పోలీసులు దాడి చేసి కొట్టడంపై ఆర్యవైశ్య సంఘం వారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారే. సీపీఎం నాయకుడు అప్పలరాజు పై పిడి చట్టం పెట్టడంపై టీడీపీకి చెందిన కొందరు మేధావులు కూడా ఖండిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయే! అనంతపురంతో సహా పలు చోట్ల భూ కబ్జాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? ఇవి కాకుండా అనంతలో గన్ కల్చర్ కూడా పెరుగుతోందని వార్తలు సూచిస్తున్నాయి.తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రాజ్యాంగం నడుస్తోందే! ఆయన పోలీసు అధికారులనే అవమానిస్తే నోరు విప్పలేకపోయిన వ్యవస్థ మనది. అమాయకులపై మాత్రం లాఠీ ఝళిపిస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? హోం మంత్రి అనిత వాటికి సమర్థన ఇవ్వడమా? నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఏదో గొప్ప విషయంగా ఆమె చెబుతారా? రేప్, హత్యల వంటి సీరియస్ నేరాలకు పాల్పడిన వారెవరికి ఇలా చేయలేదే? తెనాలిలో పోలీసుల ముగ్గురు దళితుల అరికాళ్లపై బహిరంగంగా కొట్టి అరాచకంగా ప్రవర్తించినా చర్య తీసుకోకపోగా, అది తప్పు కాదన్నట్లు మాట్లాడితే ఏపీ ప్రజలను కాపాడేదెవ్వరు? కదిరి వద్ద ఒక గర్భిణిపై వైసీపీ కార్యకర్త ఒకరు కాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా హోం మంత్రే ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారట.ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ప్రభుత్వం ఖండించలేకపోయింది. తీరా చూస్తే అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ నాయకుడు చెప్పినా, అతని సోదరి తెలిపినా హోం మంత్రి మాత్రం అదే అసత్యాన్ని వల్లెవేసే యత్నం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు హింసించి నడిరోడ్డుపై నడిపించారు. ఒక వైపు ఫేక్ వీడియోలు, మరో వైపు ఫేక్ ఆరోపణలు, ఇంకో వైపు కక్షపూరితంగా ఏకపక్షంగా వైసీపీ వారిపై కేసులు,అరెస్టులు..ఇవన్ని ఈ ప్రభుత్వం ఎంత నీచంగా పనిచేస్తుంది తెలియచేస్తుంది తప్పమరొకటి కాదు.ఇలాంటి దుష్టచర్యలను ఉన్మాదం అంటారన్న సంగతి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.వైసిపివారిని ఎంత వేధిస్తే వారు అంతగా రాటు తేలుతున్నారన్న విషయం కూడా ప్రజలకు అర్ధం అవుతోంది.కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలకు ఎప్పుడో అప్పుడు చెక్ పడకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
సాక్షి, అమరావతి: కేంద్రం మంజూరు చేసిన సంఖ్య మేర ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఉపాధి కూలీల పొట్టకొట్టింది. నోటిఫై చేసిన రోజువారీ కూలి కూడా ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్మాణాత్మక బలహీనతలకు తోడు నిధుల దుర్వినియోగమేనని ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.⇒ 2024–25లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో 64.2 లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు 46.9 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపింది. అంటే, 17.3 లక్షల కూలీల కుటుంబాలకు నష్టం వాటిల్లింది.⇒ దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే చెల్లించింది. ఒక్కో కూలీకి రూ.44 మేర చూస్తే 46.9 లక్షల కుటుంబాలకు తక్కువ చెల్లించింది.⇒ ఓపక్క కేంద్రం మంజూరు చేసిన మేర ఉపాధి కల్పించకుండా 17.3 లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చిన బాబు సర్కారు మరోపక్క నోటిఫై చేసిన రోజువారీ వేతనం ఇవ్వకుండా కష్టార్జితాన్ని దోపిడీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.⇒ ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26) రోజువారీ ఉపాధి హామీ కూలిని రూ.307గా నోటిఫై చేశారు. డిసెంబర్ 29 వరకు డేటాను విశ్లేషిస్తే ఒక్కో కూలీకి రూ.268 మాత్రమే చెల్లించారు. నిర్దేశిత మొత్తానికి ఇది రూ.39 తక్కువ. దీనివల్ల 41 లక్షల కుటుంబాల శ్రమదోపిడీ చేసినట్లైంది. -
నాడు రూ.16.. నేడు రూ.20
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కిలోకి రూ.4 చొప్పున పెంచేసి... వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. అరకొర పంపిణీకే హడావిడి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.బినామీల కోసమే రేటు పెంచేసి..చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. -
కొండవీటి వాగు ఎత్తిపోతల్లో రూ.150 కోట్ల అవినీతి వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి కొండవీటి వాగు వరద ముప్పు తప్పించేందుకు, ఉండవల్లి వద్ద ఆ వాగు నుంచి 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేలా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్ల విలువతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్టు విలువ కంటే రూ.4.75 శాతం అధిక ధర... రూ.443.76 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు పనులను అప్పగించేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాయి.ఈ మేరకు పనులను మేఘాకు అప్పగిస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనుల కేటాయింపుతో ఖజానాపై రూ.20.12 కోట్ల భారం పడింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను కాంట్రాక్టర్కు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.523.18 కోట్లకు చేరుకుంది.5 వేల క్యూసెక్కుల ఎత్తిపోతకు రూ.222.44 కోట్లుకొండవీటి వాగు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేందుకు ఉండవల్లి వద్ద 2017–18లో రూ.222.44 కోట్లతో ప్రభుత్వం ఎత్తిపోతలను పూర్తి చేసింది. వీటిని మేఘా సంస్థనే చేపట్టింది. నాటితో పోల్చితే ఎత్తిపోతల పనుల్లో వినియోగించే స్టీల్, సిమెంటు, పంప్లు, మోటార్లు, విద్యుత్ ఉపకరణాలు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ, ప్రస్తుతం 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసే పనులను రూ.523.18 కోట్లకు మేఘా సంస్థకే ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, దీని వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.380 కోట్లకు మించే అవకాశం లేదని, అంచనాల దశలోనే రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల మేర భారీగా అక్రమాలు జరిగాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కట్టబెట్టడం వల్ల కాంట్రాక్టర్కు ప్రయోజనం చేకూర్చారని.. ఆ మేరకు ఖజానాకు నష్టం కలిగిందంటున్నారు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే..!జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానంతో టెండర్ల వ్యవస్థకు 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవం పోసింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన వెంటనే వీటిని రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సు పద్ధతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించింది. ఒకవేళ జ్యుడీషియల్ ప్రివ్యూ ఇప్పుడు అమల్లో ఉన్నట్లైతే... టెండర్ నోటిఫికేషన్కు ముందే ఆ ప్రతిపాదనలోని తప్పులను ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు నుంచి సాధారణ ప్రజల వరకు ఎత్తిచూపే అవకాశం ఉండేది. వాటిని పరిగణనలోకి తీసుకుని అంచనా వ్యయాన్ని సరి చేయాలని ఏడీసీఎల్ అధికారులను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించి ఉండేవారు అని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే 5 శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు కనీసం రూ.20 కోట్లు ఆదా అయ్యేదని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే ఎత్తిపోతల పనుల్లో రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని, దాన్ని కాంట్రాక్టర్తో కలిసి ముఖ్య నేత నీకింత, నాకింత అంటూ పంచుకు తినేందుకు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. -
ఏపీలో అత్యంత దారుణంగా 108 సేవలు
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరి వేస్తోంది! కుయ్ కుయ్ మూగబోతోంది..! నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయ్! 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు! 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం.. సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం.. రోడ్డుపై రయ్ రయ్మంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలో 108 సేవల తీరును ‘సాక్షి’ బృందం రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా మారిన 108వాహనాలు శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపైనా రాలేదు. చివరకు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ.. విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. రణస్థలం జాతీయ రహదారి–16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 సేవల నెట్వర్క్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం.‘ఊపిరి’ ఆగుతోంది..! పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా త్రిపురాపురం వద్ద ట్రిప్పర్ ఢీకొని గాయాలపాలయ్యాడు. 108 కోసం ఫోన్ చేయగా 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. ఇక్కడ రెండు మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోనే జలాల్పురంలో ఇటీవల మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవటంతో మెరుగైన వైద్యం కోసం సీహెచ్సీ నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ చార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్స్లకు రంగులేసి నడిపిస్తున్నారు. అవి ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని దుస్థితి.ఏలూరు జీజీహెచ్లో మూలపడి ఉన్న 108 వాహనాలు పయ్యావుల ఇలాకాలో ‘హ్యాండ్సప్’.. అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందిన వాటిని బ్యాకప్గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. కానీ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. బెడ్డు వద్దకు కాదు.. షెడ్డుకే! వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలో ఇటీవల స్పృహ కోల్పోయిన ఓ వ్యక్తిని కాపాడాలని కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వగా ‘108 వాహనం మరో చోటకు వెళ్లింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాహనాలను పాత రిమ్స్లో షెడ్డుకు తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడానికి దాదాపు గంట పడుతోంది. వచ్చే వరకు వేచి చూడాలి. లేదంటే ఆటో తీసుకొని కడపలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సిబ్బంది సలహా ఇచ్చారు. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు.. నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బిల్లా బక్కన్న అనే వృద్ధుడిని 108లో తరలిస్తుండగా బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద ఆగిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు, బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్డుకు పరిమితమయ్యాయి. దయచేసి వేచి ఉండండి...! విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకుగానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని (కండెమ్) 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు. ప్రైవేట్ సేవలకు వేలకు వేలు.. చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి సైరన్ కూడా పని చేయడంలేదు. ఆపదలో పది మందికి సాయపడాల్సిన 108.. నలుగురు తోస్తేగానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకు (30 కి.మీ) ప్రైవేటు అంబులెన్స్లో వెళ్లాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజూ 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి.అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలను కాదని అస్మదీయ సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించింది. ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకు బాగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేయడం గమనార్హం. – సాక్షి నెట్వర్క్ -
దోపిడీ ‘అంచనా’!
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి సమీకరణ (పూలింగ్) కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇచ్చే మాటేమో గానీ... లే అవుట్ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత భారీఎత్తున దోచుకుంటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జోన్–8 (కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి) లేఅవుట్ అభివృద్ధి పనుల అంచనాలను ప్రతిపాదన దశలోనే భారీగా పెంచేయడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున రూ.2 కోట్ల మేర వ్యయం చేస్తున్నారని... దేశ చరిత్రలో ఇది ఎక్కడా లేదని ఎత్తిచూపుతున్నారు. ⇒ రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్లు, మురుగు శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్ వినియోగించేందుకు పైప్లైన్, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు రూ.1305.39 కోట్ల వ్యయంతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీఎసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.వీటిని 4.03 శాతం అధిక ధర... రూ.1,358 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించడానికి సీఆర్డీఏ, కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఆ మేరకు ఏడీసీఎల్కు అనుమతి ఇస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానాపై రూ.52.61 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.277.85 కోట్లను రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్టు విలువ రూ.1,635.85 కోట్లకు చేరనుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే...రాజధాని జోన్–8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు రూ.వంద కోట్లు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ విధానం అమల్లో ఉండి ఉంటే... టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అక్రమాలు వెలుగులోకి వచ్చేవని, తద్వారా అంచనా వ్యయం తగ్గేదని చెబుతున్నారు. ప్రజాధనం భారీగా ఆదా అయ్యేదని స్పష్టం చేస్తున్నారు.మొబిలైజేషన్ అడ్వాన్సులో నీకింత నాకింతకాంట్రాక్టర్కు రూ.1,358 కోట్లకు పనులను అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఆ మేరకు ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే కాంట్రాక్టు విలువలో పదిశాతం రూ.135.80 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ముట్టజెప్పనుంది. ఇందులో 8 శాతం ముఖ్య నేత తొలి విడత కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కాంట్రాక్టర్కు దోచిపెట్టి నీకింత నాకింత అంటూ పంచుకుతినడాన్ని ముఖ్య నేత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. -
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి.. రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు.. కొత్తగా సంపద సృష్టించగా పోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.1,785 కోట్లు పడిపోయింది.2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రూ.33,371 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34 శాతం తగ్గి రూ.31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8 శాతం పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1 శాతం, తమిళనాడు 8.1 శాతం, కేరళ 8.4 శాతం, తెలంగాణ 5.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.నెలనెలా తగ్గుతున్న ఆదాయంరాష్ట్ర జీఎస్టీ ఆదాయం ప్రతినెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రూ.4,686 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6 శాతం వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు.చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. రెడ్బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలోనే డెంగీ మరణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అమాయకులు డెంగీకి బలయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ అంగీకరించింది. గత ప్రభుత్వంలో 2021 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు చొప్పున రెండేళ్లలో ఏడుగురు డెంగీతో మరణించారని తెలిపింది. ‘డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం’ శీర్షికతో సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. 2024, 2025ల్లో దేశంలో డెంగీ వ్యాప్తి, నమోదైన మరణాలపై ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉందని సాక్షి పేర్కొంది.దీనికి గురువారం రాష్ట్ర వైద్యశాఖ ఇచ్చిన వివరణలో 2021 నుంచి దేశంలో డెంగీ వ్యాప్తి, మరణాల నివేదికను వెల్లడించింది. దీనిని గమనిస్తే 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా 2021లో 346 మంది, 2022లో 303 మంది, 2023లో 485 మంది డెంగీతో మరణించారు.రాష్ట్రంలో డెంగీ బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు పోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో 2024లో 297, గతేడాది 95 మరణాలు నమోదయ్యాయి. కాగా.. 2025లో దేశం మొత్తం మరణాలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో నమోదైన మరణాల్లో 5 శాతానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్రజారోగ్య పరిరక్షణలో బాబు ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందో తెలుస్తోంది. -
పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు?
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగు నీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 453 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదని ప్రస్తావించింది. హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? అందుకు సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదని ఆక్షేపించింది. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సాధారణంగా ఉందని ధర్మాసనం తప్పుబట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా హాస్టళ్లు ఉన్నందున ప్రతి చోటా తాము స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని, అందువల్ల, తాలూకా/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కాల పరిమితితో సమగ్ర ప్రణాళికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులే లేవు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లో 86 మంది విద్యార్థులు కామెర్లకు గురికావడం, విద్యార్థి మరణించడం, 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనపై సీజే ధర్మాసనం విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని విచారణకు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆ హాస్టల్ను తనిఖీ చేసి నివేదికను హైకోర్టుకు సమరి్పంచారు. బావి నుంచి నేరుగా ట్యాంక్లోకి పంపిన నీటినే విద్యార్థులు తాగుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.611 మంది విద్యార్థులు ఉంటే కేవలం 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తరువాతే నిరి్మంచారని కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 11 మరుగుదొడ్లకు, 2 సాన్నపు గదులకు అసలు తలుపులే లేవని నివేదించారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ ఆ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. ప్రణతి నివేదించిన వివరాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు ఎక్కడ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు, కాగితాలకే పరిమితం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46 అమలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, విద్య నాణ్యతను పెంపొందించటానికి ఉద్దేశించినవని గుర్తు చేసింది.హాస్టళ్లలో పిల్లలకు శుభ్రమైన తాగునీరు ఎప్పటిలోపు అందిస్తారో కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించింది. 320 కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అవి ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల సంఖ్యకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కమిటీ పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని తేల్చి చెప్పింది. సంక్షేమ శాఖల అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించింది. నెలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని పేర్కొంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లలో ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పిల్ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది.2025లో హైకోర్టు అడిగినా సీఎస్ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆహారం, వ్రస్తాలు, ఆశ్రయం ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని 2025 జూలైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినా ఇంతవరకు తమకు సమరి్పంచలేదని ధర్మాసనం తెలిపింది. హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు్ల క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించకపోవడం, ఆ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. నెలకొకసారి తనిఖీలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమస్యను అధిగమించేందుకు పరిష్కార చర్యలు చేపట్టకుంటే ఎన్ని తనిఖీలు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. -
‘పోలవరం–నల్లమలసాగర్’ డీపీఆర్ టెండర్కు ఆమోదం
సాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధానం (లింక్) ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. రూ.7.67 కోట్లకు ఐఐసీ టెక్నాలజీస్కు అప్పగించింది. పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును నల్లమలసాగర్ వరకే పరిమితం చేస్తూ.. ఆ లింక్ ప్రాజెక్టు చేపట్టడానికి డీపీఆర్ తయారీతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు నవంబరు 27న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్లో రూ.7,67,56,539లకు కోట్చేసి ఐఐసీ టెక్నాలజీస్ ఎల్–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని గుంటూరు జిల్లా ఎస్ఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డీపీఆర్ తయారీలో భాగంగా లైడార్ సర్వే చేయాలని నిర్దేశించింది. ఈ లింక్ ప్రాజెక్టును మూడు భాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.పోలవరం నుంచి కృష్ణా నదిలోకి గోదావరి జలాల మళ్లింపు.. రెండో దశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు మళ్లింపు.. మూడో దశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్కు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్మెంట్ను ఖరారు చేసి.. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది. అక్టోబరు 7న పిలిచిన టెండర్లు రద్దు..ఇక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు జలవనరుల శాఖ అక్టోబరు 7న టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువను రూ.9.20 కోట్లుగా నిర్ణయించింది. టెండర్లో బిడ్ల దాఖలు గడువు గత అక్టోబరు 22తో ముగిసింది. కానీ, ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్ను రద్దుచేసింది.ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్కే పరిమితం చేసి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత ఏడాది మే 22న పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీఓఆర్–టెరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) జూన్ 30న తోసిపుచ్చింది.గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీఓఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్లైఫ్ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను గతేడాది జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. -
అదుపు తప్పి నోళ్లకు క్యాన్సర్ !
సాక్షి, అమరావతి: క్యాన్సర్ మహమ్మారి ఏటా దేశంలో లక్షలాది మందిని కబళిస్తోంది. రోజురోజుకూ జబ్బు విజృంభణ పెరుగుతూనే ఉంది. పలు క్యాన్సర్ల వ్యాప్తికి ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధుల్లో నోటి క్యాన్సర్ ఒకటి. దేశంలో 62 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగమే అని తెలుస్తోంది. ఈ అంశాన్ని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ ఎపిడమాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవల ఈ విషయం వెల్లడించారు. 2010–2021 మధ్య 1,803 మంది నోటి క్యాన్సర్ బాధితులు, 1,903 మంది ఆరోగ్యవంతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అధ్యయనంలోని అంశాలు ఇటీవల బీఎంజీ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ఆ కాంబినేషన్ యమా డేంజర్ మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు నోటి క్యాన్సర్తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మితమైన చెడు అలవాట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవనే భావనను ఈ అధ్యయనం పూర్తిగా కొట్టిపడేసింది. ఆరోగ్యకరమైన స్థాయిలో మద్యపానం అపోహేనని తోసిపుచ్చారు. వ్యసనాలు అత్యంత మితంగా ఉన్నా.. క్యాన్సర్ ముప్పు మాత్రం అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రోజుకు 11.4 ఎంఎల్ మద్యం సేవించినా నోటి క్యాన్సర్ బారినపడే అవకాశం 50 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.రోజూ బీర్ తాగేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. మద్యం సేవించని వారితో పోలిస్తే, సేవించే వారిలో జబ్బు బారిన పడే ముప్పు 68 శాతం ఎక్కువేనని గుర్తించారు. మద్యపానంతోపాటు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో మహమ్మారి ముప్పు అత్యధికంగా ఉంటుందని తేల్చారు. ఆల్కహాల్లోని ఇథనాల్ నోటి లోపలి పొరను పల్చబరుస్తుందని, పొగాకు వినియోగించే వారిలో క్యాన్సర్ కారకాలు సులభంగా కణాల్లోకి చొచ్చుకుని పోతాయని వివరించారు. మద్యం, పొగాకు కాంబినేషన్ ఆరోగ్యాన్ని త్వరగా క్షీణింపజేయడంతోపాటు, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. దేశంలో సుమారు 11.3 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ఆల్కహాల్ ప్రధాన కారణమని అధ్యయనం తేలి్చంది.కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం దేశంలో ఏటా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు (అంచనా) సంవత్సరం కేసులు 2022 14.61 లక్షలు 2023 14.96 లక్షలు 2024 15.33 లక్షలు 2025 15.62 లక్షలు -
జేఈఈ మెయిన్స్కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్–2026 జనవరి ఒక్క సెషన్కు మాత్రమే 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది గత ఏడాది జనవరి సెషన్ కంటే లక్షకుపైగా ఎక్కువ. ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి రెండు సెషన్లు కలిపి 17లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తోందని చెబుతున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అంటే, ఈసారి రెండు సెషన్లలోనూ భారీగా పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. ఈ వారంలో విద్యార్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేయనుంది. మూడో వారంలో అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. -
‘కిక్కు’రేగ్గొట్టింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మందుబాబుల తుక్కురేగ్గొట్టింది. జేబులకు భారీగా చిల్లుపెట్టింది. ‘ఫుల్లుగా తాగండి...తాగి ఊగండి..’ అన్నదే తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేట్ ఖజానా అంతగా కాసులతో గలగల లాడుతుంది. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను అవకాశంగా మలుచుకుని మద్యం ఏరులై పారించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులిచ్చి మరీ మందుబాబుల జేబులు గుల్ల చేసింది. చివరి నాలుగు రోజుల్లోనే భారీగా రూ.585.70 కోట్ల విలువైన మద్యాన్ని తాగించేసింది. 2024లో చివరి నాలుగు రోజులతోపోలిస్తే 2025లో చివరి నాలుగు రోజుల్లోనే ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం, బీరు అమ్మకాలు 34.4 శాతం పెరగడం విభ్రాంతి కలిగిస్తోంది. సిండికేట్కు ఫుల్ జోష్.. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పాత రికార్డులను తిరగరాయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. అందుకే మద్యం విక్రయ వేళలను ఉదయం 6గంటల నుంచి అర్దరాత్రి 1గంట వరకు అధికారికంగా పొడిగించింది. తెల్లవారే వరకు మద్యం విక్రయించినా పట్టించుకోవద్దని ఎక్సైజ్, పోలీసు అధికారులను అనధికారికంగా ఆదేశించింది. ఫలితంగా 2024తో పోలిస్తే 2025 చివరి నాలుగు రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవిగో గణాంకాలు.. ⇒ 2024 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 5,18,844 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2,42, 351 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.445.22 కోట్లు. ⇒ 2025 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 7,32,658 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,91,082 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.585.70 కోట్లు. ⇒ అంటే 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచి్చంది. ⇒ ఇక 2024 డిసెంబర్తో పోలిస్తే 2025 డిసెంబర్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు. ⇒ కాగా 2025 డిసెంబర్లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. ఈ గణాంకాలన్నీ ఎక్సైజ్శాఖ అధికారికంగా వెల్లడించినవి. ఎమ్మార్పీ కంటే అధిక బాదుడు అదనం కాగా టీడీపీ మద్యం సిండికేట్ ఎమ్మార్పీ కంటే అదనంగా మందుబాబుల నుంచి దండుకుంది ప్రతి క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.50, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30 అదనంగా వసూలు చేసింది. తద్వారా అనధికారికంగా మరో రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. టాప్లో విశాఖ డిసెంబర్లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. రూ.30.7 కోట్ల మద్యం అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ 34.4 శాతం నాలుగురోజుల్లోనే పెరిగిన బీర్ల అమ్మకాలు⇒ 11 శాతంనాలుగు రోజుల్లోనే పెరిగిన లిక్కర్ విక్రయాలు⇒ రూ.178.6 కోట్లు డిసెంబర్లో ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం మద్యం అమ్మకాల విలువ⇒ రూ. 169.4 కోట్లు డిసెంబర్లో మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా


