Amaravati
-
ఆ ఘనత వైఎస్ జగన్దే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని.. దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుంది. మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేద్దాం. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 90 శాతం పథకాలు మహిళల గౌరవం పెంచే పథకాలే. అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి పథకం మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదే...మహిళలకు వైఎస్ జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళల పట్ల వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా ఆలోచన చేశారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదు. చంద్రబాబు అజెండా రెడ్బుక్ పాలనే’’ అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ జగనే. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చేయూత అందించారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు రక్షణ లేదు. వేధింపులు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిందనేదానికి నిదర్శనం. మహిళల కోసమే జగన్ దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు తెచ్చారు. కానీ చంద్రబాబు మహిళల కోసం ఏం చేశారు?. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని మా హయాంలో ఆరోపణలు చేశారు. మరి నిజంగానే అదృశ్యమైతే వారిని చంద్రబాబు, పవన్ వెనక్కి తెచ్చారా?. మహిళల మీద లైంగికదాడి చేసిన కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ విడదల రజని నిలదీశారు. -
ఖాకీల ‘పైశాచికత్వం’
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చినబాబు కళ్లలో ఆనందం కోసం శ్రీహరిపై కక్ష సాధింపు చర్యలకు దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయన అరెస్టుపై వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడం.. ఇదే కేసులో అరెస్టయిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నేత గిరీష్ ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించేందుకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో పోలీసులు ఒత్తిడికి గురయ్యారు. శ్రీహరిని ఎలాగైనా కస్టడీకి తరలించాలని భావించి రాత్రంతా కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. కోర్టులో హాజరుపరిచే విషయంలో కుంటిసాకులు చెబుతూ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేశారు. చివరకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో శ్రీహరిని అరెస్టు చేసిన 33 గంటల తర్వాత గురువారం సాయంత్రం కుప్పం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శ్రీహరిని విడుదల చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. పత్రిక క్లిప్పింగ్ను పార్టీ గ్రూపులో పంచుకున్నారని.. పత్రికలో ప్రచురితమైన ఓ క్లిప్పింగును తమ పార్టీ గ్రూపులో శ్రీహరి పంచుకున్నారు. దీనిపై కుప్పం ఐ.టీడీపీ నేత నుంచి 13న రాత్రి 10 గంటలకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై పరుగులు తీశారు. 14వ తేదీన రాత్రి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్లి వైఎస్సార్సీపీ సోషల్ యాక్టివిస్ట్ గిరీష్ రెడ్డిని, 15న ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పూడి శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసిన పోలీసులు హుటాహుటిన కుప్పం తీసుకొచ్చారు. కేవలం చినబాబు కళ్లల్లో ఆనందం చూడటానికి జిల్లా పోలీసు బాస్ ప్రణాళికలో స్థానిక పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. శ్రీహరిని ఓ తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా వలపని అరెస్టు చేసిన పోలీసులు ఆయన వద్ద ఉన్న ఫోన్, ల్యాప్టాప్ స్వా«దీనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో తాడేపల్లి నుంచి కుప్పం తీసుకొచ్చారు. ఏ–1 నిందితుడిగా గిరీష్ కుమార్రెడ్డిని, ఏ–2గా శ్రీహరిని చూపించిన పోలీసులు వేధింపులే లక్ష్యంగా ముందుకెళ్లారు. తొలుత గిరీష్ ను బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో కుప్పం కోర్టులో హాజరుపర్చారు. అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో రిమాండ్ ఇవ్వడం కుదరదని గిరీష్కు జ్యుడీషియల్ కస్టడీని న్యాయమూర్తి తిరస్కరించారు. సొంత పూచీకత్తుపై గిరీష్ ను విడుదల చేశారు. ఈ ఘటనతో పోలీసుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయితే, చినబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో శ్రీహరిని మానసికంగా వేధించి, స్టేషన్లో ఉంచి మరుసటి రోజు కోర్టుకు తీసుకెళ్లాలని పోలీసు బాస్ నుంచి సమాచారం అందింది. దీంతో రాత్రంతా శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. ఇదిగో, అదిగో కోర్టుకు తీసుకెళుతామంటూ ఉద్దేశ్యపూరకంగా కాలయాపన చేశారు. కనీసం న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను కలవడానికి కూడా ఒప్పుకోలేదు. తీరా గురువారం ఉదయం మళ్లీ కోర్టుకు తీసుకెళ్లడానికి ముందు వైద్యపరీక్షలు నిర్వహించినా.. ఆ తరువాత పోలీస్ స్టేషన్లోనే ఉంచేశారు. ఇలా గంటల కొద్దీ శ్రీహరిను స్టేషన్లో ఉంచి పైశాచిక ఆనందం పొందారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు కుప్పం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి, ఆపై సాయంత్రం 5 గంటలకు కుప్పం కోర్టులో హాజరుపరచారు. ఆ వారెంట్ల పరిస్థితి ఏమిటి?శ్రీహరి, గిరీష్లపై నమోదు చేసిన కేసుల్లో కనీసం 41ఏ నోటీసులు కూడా ఇవ్వని పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అతి సాధారణ ఫిర్యాదు ఆధారంగా వారిద్దరిపై కక్షసాధించేందుకు యత్నించారు. అయితే, జిల్లాలో హత్యలు, దోపిడీలు, అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉండి.. విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న వారిపై కోర్టులు నాన్–బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) జారీ చేశాయి. జిల్లాలో దాదాపు 280కి పైగా నాన్–బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. వారెవరినీ కోర్టులో హాజరుపరిచేందుకు సమయం లేదని చెబుతున్న పోలీసులు.. ప్రతిపక్ష నేతలను మాత్రం అప్పటికప్పుడు అరెస్టు చేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మహిళలు తీసుకునే రుణాల్లో భారీ పెరుగుదల
సాక్షి, అమరావతి: దేశంలో మహిళలు తీసుకునే రుణాలు భారీగా పెరిగాయి. ఇందులో వ్యాపార రుణాల్లో అత్యధిక వృద్ది నమోదైంది. దేశంలో మహిళలు–అభివృద్ధి చెందుతున్న రుణ మార్కెట్పై నీతిఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2017లో మహిళలు తీసుకున్న రుణాలు రూ.16 లక్షల కోట్లు ఉండగా 2025 నాటికి 4.8 రెట్లు పెరిగి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. వ్యాపార రుణాల విషయంలో మహిళా పారిశ్రామికవేత్తలు బలమైన వృద్ధి సమూహంగా ఆవిర్భవించారు. 2017 నుంచి వారి పోర్ట్ఫోలియో నిల్వలు 7.5 రెట్లు పెరిగాయి. క్యాష్ క్రెడిట్, ఓవర్డ్రాఫ్ట్ వంటి రివాల్వింగ్ క్రెడిట్ ఉత్పత్తుల వైపు క్రమంగా మళ్లడం.. పెరుగుతున్న ఆర్థిక పరిజ్ఞానాన్ని, వ్యాపార పరిపక్వతను సూచిస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో మహిళలు తీసుకునే రుణ మార్కెట్ సగటు వార్షిక వృద్ధి రేటు 20 శాతంగా ఉంది. ఏటా స్థిరమైన వృద్ధిని సూచిస్తోంది. రిటైల్ రుణాల విభాగం ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వ్యాపార రుణాల్లో ఎక్కువ వృద్ధి నమోదైంది.మహిళలు తీసుకునే రుణాల్లో వ్యాపార రుణాల వాటా 2017 నుంచి 2025 మధ్య 16 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. దేశంలో మహిళలకు రుణ లభ్యత 2017లో 19 శాతం ఉండగా 2025 నాటికి 36 శాతానికి పెరిగింది. ఈ వృద్ధి మహిళల ఆర్థిక ప్రవర్తనలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పును ప్రతిబింబిస్తోంది. దీని ప్రకారం ఎక్కువమంది మహిళలు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి రుణాలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. -
ఇక ఉద్యమం ఉధృతం
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘తెలంగాణ సీఎం అయిన శిష్యుడు రేవంత్రెడ్డి కోసం గురువు చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించారు. దీనికి సిగ్గుపడాలి. రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సిన రాయలసీమకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాయలసీమ లిఫ్ట్ ఎందుకు అని ప్రశి్నస్తున్నారు. హంద్రీ–నీవా వెడల్పు చేయకుండా తగ్గించి లైనింగ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఆపారు. 1995–2004 వరకు, మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీమకు తీరని ద్రోహం చేశారు. ఈ ద్రోహంపై ఉద్యమించకపోతే మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసినట్లే. గ్రామస్థాయి నుంచి ఉద్యమించి ప్రాజెక్టులు సాధించుకోవాలి!’ అని రాయలసీమ వైఎస్సార్సీపీ నేతలు ముక్తకంఠంతో నినదించారు. రాయలసీమ లిఫ్ట్ ఆపేసిన క్రమంలో ‘సీమ ప్రాజెక్టులు–సమాలోచన’ పేరుతో కర్నూలులో గురువారం వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అనంతపురం, నంద్యాల జిల్లాల అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీమంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు విరూపాక్షి, బాలనాగిరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడారు. గ్రేటర్ రాయలసీమ నీటి అవసరాలు, భవిష్యత్ కాపాడుకునేందుకు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాలని చెప్పారు. ప్రాజెక్టుల సాధనకు మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో రాయలసీమపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ సాధనకోసం అందరం సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాగా, గుండ్రేవుల–వేదవతి ప్రాజెక్టులు వెంటనే పూర్తిచేయాలని, గ్రామస్థాయి నుంచి ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాలని, గుండ్రేవుల సాధన కోసం పాదయాత్ర చేయాలని, హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచాలని తీర్మానాలు చేశారు. -
ఆదాయార్జన శాఖలు లక్ష్యాలను చేరుకోవాలి
సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలు రెవెన్యూ లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా మైక్రో, మాక్రో స్థాయిలో ప్రణాళికలు అమలుచేయాలన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా పూర్తిస్థాయి ఉత్పాదకతను చేరుకోవాలని ఆర్థికశాఖకు సూచించారు. 15 శాతం మేర వృద్ధి రేటు లక్ష్యాన్ని చేరుకునేలా క్షేత్రస్థాయి వరకూ ఈ ప్రణాళికల్ని అమలుచేయాలని సీఎం స్పష్టంచేశారు. సచివాలయంలో ఆర్థిక శాఖపై గురువారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సంక్షేమ క్యాలెండర్కు అనుగుణంగానే పథకాలను అమలుచేస్తామని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలిరాష్ట్రంలో గురువారం ప్రారంభమైన స్వీయ జనగణనలో కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్– హౌస్ సెన్సెస్లో భాగంగా ఈ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. మరోవైపు.. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని దేవదాయ శాఖపై జరిగిన సమీక్షలో చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న ఐదువేల దేవాలయాలను రెండేళ్లలో పూర్తిచేయాలన్నారు. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్నప్రసాదం అందించాలని సూచించారు. -
పరిశ్రమల భూములు అమ్ముతాం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ని చంద్రబాబు సర్కారు పూర్తి రియల్ ఎస్టేట్ బ్రోకింగ్ సంస్థగా మార్చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంలో రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరిట విశాఖలోని రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అతిచవకగా కట్టబెట్టిన ప్రభుత్వం.. తాజాగా తాను అభివృద్ధి చేసిన పార్కులు, వాణిజ్య సముదాయాల్లోని స్థలాలను రియల్ ఎస్టేట్ సంస్థలకు ఏపీఐఐసీ ద్వారా అమ్మేస్తోంది. రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక పార్కుల్లో అందుబాటు ధరల్లో గృహ సముదాయాలు నిర్మించడానికి పూర్తిస్థాయి అమ్మకపు హక్కులతో అప్పగించనుంది. కేటాయించిన స్థలంలో 60 శాతం గృహ అవసరాలకు వినియోగించి మిగిలిన 40 శాతం వాణిజ్య అవసరాలకు వినియోగంచుకోవడమే కాక, చార్జీలు వసూలు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందడానికి అనుమతించింది. ఇందుకోసం ఆసక్తిగల సంస్థల నుంచి ఏపీఐఐసీ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానించింది. బిడ్ గెలిచిన సంస్థ ఏపీఐఐసీకి భూమి ధరను చెల్లించి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. ఆ ప్రాజెక్టు డిజైన్, నిధుల సమీకరణ, నిర్వహణ అంతా గెలిచిన బిడ్డింగ్ సంస్థే చూసుకోవాలని, ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను మంజూరు చేయడంలో మాత్రమే ఏపీఐఐసీ సహాయం అందిస్తుందని ఆ టెండర్ డాక్యుమెంట్స్లో పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో వాణిజ్య సముదాయాలుఇవేకాకుండా నగరం నడిబొడ్డున ఉన్న జోనల్ కార్యాల యాలు, లేదా పారిశ్రామిక పార్కుల్లో వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేయడానికి ప్రైవేటు సంస్థలకు ఏపీఐఐసీ భూములను కేటాయిస్తోంది. ఇందుకోసం విలువైన భూముల్లో సుమారుగా ఒక ఎకరం స్థలాన్ని కేటాయించనుంది. ఈ స్థలంలో వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి 33 ఏళ్లకు లీజుకు ఇవ్వనుంది. అలాగే, అభివృద్ధి చేసిన స్థలంలో ఏపీఐఐసీకి 10,000 చదరపు అడుగులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మిగిలిన ఆదాయమంతా ఆ బిల్డరే తీసుకోవచ్చని టెండరు డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా 27 చోట్ల స్థలాలను కేటాయించనున్నారు. ఇందులో అత్యధికంగా జోనల్ ఆఫీసు కార్యాలయాలు ఉండగా మరికొన్ని చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులు, ఇతర పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ఈ 27 చోట్ల వాణిజ్య సముదాయాలు నిర్మించి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థ నుంచి బిడ్లను ఆహ్వానించింది. -
‘ఇచ్చిన హామీలను చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్’
తాడేపల్లి : ఇచ్చిన హామీలను మాటలతోనే సరిపెట్టకుండా చేతల్లో చూపిన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ బీసీలకు వైఎస్ జగన్ అండగా నిలిచారని సజ్జల తెలిపారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సాధికార విభాగ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘బీసీల సాధికారతకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇచ్చిన హామీలను మాటల్లో కాదు, చేతల్లో చూపిన నాయకుడు జగన్. అన్ని రంగాల్లోనూ జగన్ బీసీలకు అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలు నష్టపోయారు. ఏ సంక్షేమ పథకమూ అందటం లేదు.కూటమి ప్రభుత్వంలో వ్యవస్థీకృత అవినీతి, రాజకీయ జోక్యం పెరిగింది. అమరావతి పేరుతో భారీ దోపిడీ జరుగుతోంది. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుంది..’అని స్పష్టం చేశారు. ఈ నెల 26న బీసీ గళం సమావేశంఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు సజ్జల. దీనిలో భాగంగా ఆ సమావేశం పోస్టర్ను విడుదల చేశారు. -
కుప్పం కోర్టుకు పూడి శ్రీహరి
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పూడి శ్రీహరి అరెస్టుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఒత్తిడితో పోలీసులు తలొగ్గారు. అరెస్టు చేసిన 33 గంటల తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ ఉదయం పూడి శ్రీహరికి పోలీసులు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పం కోర్టుకు తరలిస్తున్నారు. కాగా,తాడేపల్లిలో నిన్న ఉదయం పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీ విభజనపై ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ విభజనపై బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ విభజనతో ఏపీ విభజనను పోల్చారు. ఏపీ విభజనను బ్రిటీష్ కంటే చెత్తగా కాంగ్రెస్ చేసింది’ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తాము సీట్లను, ప్రభావం తగ్గిపోతుందనే భావన దక్షిణాది ప్రాంతాల్లో నెలకొంది. అయితే, ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచుతుంది. తద్వారా ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు. -
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/VYYbUHYVtN— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2026 -
ఆరోగ్యానికి 'సెగ'!
ఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది.. సాయంత్రం చీకటిపడేదాకా తాపం తగ్గేది లేదంటోంది.. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో «థలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. లక్షణాలు..కారణాలు.. » చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం » వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. »ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. » శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో కలిగే మార్పులు... » వేడి వల్ల చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గుతుంది. » ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు ఎవరంటే.... 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు » అనారోగ్యంతో బాధపడుతున్న వారు. ఉదాహరణకు అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలిగిన తదితరులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.ప్రథమ చికిత్స ఇలా... » వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ గల ప్రదేశానికి చేర్చాలి. » చల్లని నీటితో ముంచిన తడి గుడ్డతో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తడి గుడ్డతో తుడవాలి. ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి. » ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ (ఓరల్ రీ హై డ్రేషన్) ద్రావణాన్ని తాగించాలి. » వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకుపోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు» తలకు టోపీ, రుమాలు వాడాలి. వేడిగాలి తగలకుండా చూసుకోవాలి. » గొడుగు వాడాలి. తెలుపు రంగు, పలచటి చేనేత వస్త్రాలను ధరించాలి. » ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పని చేయకుండా ఉండాలి. » శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. » ఇంటి నుంచి బైటకు వెళ్లే ముందు ఒక గ్లాసు మంచి నీరుతాగాలి. వీలైనన్ని సార్లు మంచి నీటిని తాగడం మంచిది. » ఎండలో తిరిగే సమయంలో చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు, చల్లని మంచి నీరు తాగాలి » తీవ్రమైన ఎండలో బయటికి వెళ్లినప్పుడు తల తిరగిడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి. కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం వేసవి కాలంలో డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతా యి. ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు ను తగ్గించాలి. –డాక్టర్ దినేష్కుమార్రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప. -
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన బాలికలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా జనరల్, ఒకేషనల్ కలిపి 10,57,312 మందికి గాను 10,15,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 7,21,342 మంది జనరల్, 48,720 మంది ఒకేషనల్ కలిపి మొత్తం 7,70,062 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండో ఏడాది విద్యార్థులు 3,84,967 మంది(81 శాతం).. మొదటి ఏడాదిలో 3,85,095 మంది(77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ‘ఎక్స్’లో విడుదల చేశారు. ఉత్తీర్ణత శాతం మొదటి ఏడాదిలో పెరగ్గా.. రెండో ఏడాదిలో తగ్గింది. 2025 మార్చిలో జరిగిన పరీక్షల్లో మొదటి ఏడాది 70 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది పాసయ్యారు. ఈసారి ఉత్తీర్ణత మొదటి ఏడాది 7 శాతం పెరిగితే, రెండో ఏడాది 2 శాతం తగ్గింది. బాలికలదే హవా.. ఫలితాల్లో బాలికలే అత్యధిక ప్రతిభ కనబరిచారు. రెండో ఏడాదిలో 85 శాతం, మొదటి ఏడాదిలో 81 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలురు రెండో ఏడాది 76 శాతం, మొదటి ఏడాదిలో 72 శాతం మంది పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలోనూ బాలికలు మొదటి ఏడాది 71 శాతం, రెండో ఏడాది 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. బాలురు మొదటి ఏడాది 49 శాతం, రెండో ఏడాది 62 శాతం మందే పాస్ అయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు మొదటి ఏడాది 38,443 మంది హాజరవ్వగా.. 23,569 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో ఏడాదిలో 33,852 మందికి గాను 25,151 మంది విజయం సాధించారు. టాప్లో కృష్ణా, గుంటూరు ఇంటర్ ఫలితాల్లో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలు టాప్లో నిలిచాయి. మొదటి ఏడాది ఫలితాల్లో కృష్ణా 90 శాతం, గుంటూరు 88 శాతం, విశాఖపట్నం 85 శాతంతో మొదటి మూడుస్థానాల్లో ఉన్నాయి. రెండో ఏడాదికి సంబంధించి కృష్ణా 92 శాతం, గుంటూరు 88 శాతం, ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంటర్ మొదటి, రెండో ఏడాదికి సంబంధించి చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా ఉంది. 27 వరకు రీకౌంటింగ్కు అవకాశం ఇంటర్ ఫలితాల్లో అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. రీ వెరిఫికేషన్ జవాబు పత్రానికి రూ.1,300, రీ కౌంటింగ్ కోసం జవాబు పత్రానికి రూ.260 చొప్పున చెల్లించాలని సూచించారు. ఇంటర్లో కేజీబీవీల ఉత్తమ ఫలితాలుసాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (ఐపీఈ–2026) ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ) గణనీయమైన ప్రగతి సాధించాయి. రాష్ట్రంలోని 352 కేజీబీవీల నుంచి మొదటి సంవత్సరంలో 9,367 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా.. 7,904 మంది (84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 15 శాతం పెరిగింది. ఈ ఉత్తీర్ణత రాష్ట్ర బాలికల సగటు 77%తో పోలిస్తే 7 అధికం. ద్వితీయ సంవత్సరంలో 8,073 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,022 మంది (87 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత (81%) కంటే మెరుగ్గా నమోదైంది. యాజమాన్యాల వారీగా చూస్తే కేజీబీవీలు గతేడాది 6వ స్థానం ఉండగా, ఈసారి 5వ స్థానానికి పెరిగింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్ర సగటుతో పోలిస్తే కేజీబీవీ విద్యార్థినులు అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని ప్రశంసించారు. విద్యార్థినులు, కేజీబీవీ కార్యదర్శి డి.దేవానందరెడ్డి, ఇతర సిబ్బందిని అభినందించారు. విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి రూపొందించిన ‘విజయపథం’ శిక్షణ ఫలితాలు సాధనకు ఉపకరించిందని దేవానందరెడ్డి పేర్కొన్నారు. మే 21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుఈనెల 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపునకు అవకాశంసాక్షి, అమరావతి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. మే 21 నుంచి జూన్ 4 వరకు మొదటి ఏడాది ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో ఏడాదికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రంజిత్ బాషా తెలిపారు. ఈనెల 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించవచ్చని సూచించారు. మొదటి ఏడాది అన్ని పేపర్లకు రూ.600, ప్రాక్టికల్స్కు రూ.275, బ్రిడ్జి కోర్సులకు రూ.165, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సుకు రూ.275 చెల్లించాలన్నారు. మొదటి, రెండో ఏడాదికి కలిపి అన్ని పేపర్ల కోసం రూ.1,200, ఒకేషనల్ ప్రాక్టికల్స్కు రూ.550, బ్రిడ్జి కోర్సులకు రూ.330 చెల్లించాలని సూచించారు. ఇంటర్ రెండేళ్లు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు బెటర్మెంట్ రాయాలనుకుంటే ఆర్ట్స్ సబ్జెక్టులకు రూ.1,350, సైన్స్ సబ్జెక్టులకు రూ.1,600 చెల్లించాలని స్పష్టం చేశారు. జూన్ 7 నుంచి ప్రాక్టికల్స్.. ఎథిక్స్, మానవ విలువల పరీక్ష జూన్ 5న, పర్యావరణ విద్య పరీక్ష జూన్ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. జనరల్, ఒకేషనల్ కోర్సులకు రెండు సెషన్లలో అంటే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. -
రెడ్ బుక్ అరాచకం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెడ్బుక్ అరాచకం వెర్రితలలు వేస్తోంది. రాజ్యాంగ హక్కుల హననం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఏకంగా సుప్రీంకోర్టు తీర్పు, మార్గదర్శకాలనే కాలరాస్తూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది. ఈ 20 నెలల్లో ఇప్పటికే 270కుపైగా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల్లో దాదాపు 100మందిని అక్రమంగా అరెస్టులకు తెగబడింది. ఆ క్రమంలోనే ఈసారి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. చిత్తూరుజిల్లా కుప్పం పోలీసులు మఫ్టీలో వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం ఉదయాన్నే శ్రీహరిని అపహరించుకుపోయారు. తక్షణం స్పందించిన వైఎస్సార్సీపీ న్యాయపోరాటానికి ఉపక్రమించి పోలీసుల కుట్రకు సమర్థంగా అడ్డుకట్ట వేసింది. అయినా సరే పోలీసులు శ్రీహరిని బుధవారం అర్ధరాత్రి దాటినా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించి వేధిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ మార్కు బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. సీఎంవో, డీజీపీ కార్యాలయం కనుసన్నల్లోనే... ముఖ్యమంత్రి కార్యాలయం, డీజీపీ కార్యాలయం స్థాయిలోనే పక్కాగా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే ఓ సోషల్ మీడియా పోస్టుపై కుప్పం టీడీపీ నేత వినోద్ కుమార్ మూర్తితో ఫిర్యాదు ఇప్పించారు. ఆ వెంటనే అనంతపురం జిల్లా రాప్తాడులోని సోషల్ మీడియా కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిని మంగళవారం అక్రమంగా అరెస్టు చేశారు. ఆ వెంటనే వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి( మీడియా) పూడి శ్రీహరిని పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం కుప్పం పోలీసులు మఫ్టీలో మంగళవారం రాత్రే తాడేపల్లి చేరుకున్నారు. శ్రీహరి నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీలో ఉన్నవారు పోలీసులో.. ఎవరైనా అసాంఘిక శక్తులో కూడా అంతుబట్ట లేదు. ‘అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు... సోషల్ మీడియా పోస్టుతో నాకేం సంబంధం... నా సోషల్ మీడియా ఖాతా నుంచి ఎటువంటి పోస్టు పెట్ట లేదు కదా.. అసలు బీఎన్ఎస్ 35(3) కింద నోటీసులు ఇవ్వాలి కదా’అని శ్రీహరి పోలీసులను అడిగినా సరే పోలీసులు బలవంతంగా వారి వాహనంలోకి ఎక్కించి తీసుకుపోయారు. ఆయన ఫోన్, ల్యాప్టాప్ను స్వాదీనం చేసుకున్నారు. శ్రీహరిని అక్రమంగా నిర్బంధించి తరలిస్తున్న పోలీసు వాహనాన్ని ఆయన వ్యక్తిగత సహాయకుడు సింహాచలం నాయుడు కొద్ది దూరం అనుసరించారు. కానీ పోలీసులు ఆయన్ని బలవంతంగా వెనక్కి పంపించి వేశారు. అనంతరం మరో బృందం పోలీసులు శ్రీహరి నివాసంలో దాదాపు 3గంటల పాటు సోదాలు చేసింది. ఆయన నివాసంలో పలు రికార్డులు, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. బెడిసికొట్టిన కుట్ర... గిరీశ్కు బెయిల్ మంజూరు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులు తెగబడ్డ అక్రమ అరెస్టును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన గిరీశ్ కుమార్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆయనకు రిమాండ్ విధించాలని పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. కాగా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా పోలీసులు అక్రమ అరెస్టు చేశారని నిందితుల తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం అక్రమమని వాదనలు వినిపించారు. సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. గిరీశ్కు వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం ఏమిటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ సోషల్ మీడియా కేసులకు వర్తించదని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏ1 గా పేర్కొన్న గిరీశ్ కుమార్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో పోలీసుల కుట్ర బెడిసికొట్టింది. శ్రీహరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిస్తే బెయిల్ మంజూరు అవుతుందని పోలీసులకు స్పష్టమైంది. అందుకే కుప్పం పోలీస్ స్టేషన్లోనే విచారణ పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారు. సాయంత్రం 6గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన శ్రీహరిని అర్ధరాత్రి వరకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచలేదు. శ్రీహరితో మాట్లాడేందుకు ఆయన తరపు న్యాయవాదులను కూడా పోలీసులు అనుమతించలేదు.హెబియస్ కార్పస్ పిటిషన్తో... కిడ్నాప్ పన్నాగానికి తెర...శ్రీహరి అరెస్టుతో అప్రమత్తమైన వైఎస్సార్సీపీ న్యాయ విభాగం వెంటనే హైకోర్టును ఆశ్రయించింది. శ్రీహరి ఆచూకీ తెలియజేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ బుధవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును గురువారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. దాంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో పూడి శ్రీహరిని సాయంత్రం 6 గంటలకు కుప్పం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటించి కుప్పం న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్ నమోదులోనూ పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సోషల్ మీడియా పోస్టులపై బీఎన్ఎస్ 111 కింద కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే పలు సార్లు స్పష్టం చేశాయి. వ్యవస్థీకృత నేరాల కేసుల్లో నమోదు చేయాల్సిన బీఎన్ఎస్ 111 సెక్షన్ను సోషల్ మీడియా పోస్టులకు వర్తింపజేయడం చెల్లదని తేల్చి చెప్పాయి. అయినా సరే కుప్పం పోలీసులు బీఎన్ఎస్ 111 తోపాటు 196(1)ఎ, 352(2), 336(1), 340(2), 61(2) సెక్షన్లు, ఐటీ చట్టం 67 కింద కేసు నమోదు చేయడం విస్మయపరుస్తోంది. ఈ కేసులో గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ1గా, పూడి శ్రీహరిని ఏ2గా పేర్కొన్నారు. -
వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగంపై అక్రమ కేసులతో రెడ్బుక్ వేధింపులకు పాల్పడుతున్న పోలీసులు ... టీడీపీ సోషల్ మీడియా విభాగం బరితెగించి సాగిస్తున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హనన పోస్టులపై మాత్రం చోద్యం చూస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడే దు్రష్పచారానికి టీడీపీ సోషల్ మీడియా 2014లోనే తెరతీసింది. అప్పటి నుంచి అసభ్యకర, జుగుప్సాకర పోస్టులతో బరితెగించడమే పనిగా పెట్టుకుంది. ఇక 2014లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ సోషల్ మీడియా విభాగం విశ్వంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు, టీడీపీ నేతల జుగుప్సాకర వ్యాఖ్యలతో పోస్టులను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తోంది. అది కూడా టీడీపీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఈ విష ప్రచారం సాగిస్తుండటం గమనార్హం. వైఎస్ జగన్ చేతిలో గొడ్డలి, ఇతర ఆయుధాలు పెట్టినట్టుగా మార్ఫింగ్ ఫొటోలతో టీడీపీ అధికారిక వెబ్సైట్లో పుంఖానుపుంఖాలుగా పోస్టులు పెడుతున్నారు. మహిళలు, చిన్నారులను కూడా కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పోస్టులు పెడుతుండటం టీడీపీ బరితెగింపునకు నిదర్శనం. వాటిని టీడీపీ సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీ కార్యకర్తలు పక్కా పన్నాగంతో వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను కట్డడి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు టీడీపీ నేతలకు వర్తించవన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తోంది. అందుకే టీడీపీ సోషల్ మీడియా విభాగం విష ప్రచారాన్ని కట్టడి చేసేందుకు ఏమాత్రం యత్నించడమే లేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న అసభ్యకర, అభ్యంతరకర పోస్టులను ప్రశ్నిస్తూ...నిలదీస్తూ వైఎస్సార్సీపీ పోస్టులు పెడితే మాత్రం పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తుండటం గమనార్హం. పోలీసులు టీడీపీ సోషల్ మీడియా సైకో కార్యకర్తలుగా వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఇక డీజీపీ కార్యాలయం టీడీపీ కార్యాలయంగా రూపాంతరం చెందిందా అన్న రీతిలో వ్యవహరిస్తోంది. -
నేటి నుంచి జనగణన
సాక్షి, అమరావతి: జనాభా గణన–2027 ప్రక్రియ రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర జనాభా గణన డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. తొలి దశగా ఇళ్ల జాబితా, ఇళ్ల గణనతోపాటు స్వీయ గణన మొదలవుతుందని చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా గణన–2027 ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా గణన యాప్లో నమోదు చేసేందుకు గురువారం నుంచి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు. ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. స్వీయ గణన అనేది మంచి విధానమని, ప్రజలు తమ వివరాలను సరిగా నమోదు చేశామనే విశ్వాసం పొందుతారన్నారు. స్వీయ గణన అనంతరం జనాభా గణన సిబ్బంది కూడా ప్రజలు సరిగా నమోదు చేశారా? లేదా ? అని పరిశీలన చేస్తారన్నారు. దీనివల్ల జనాభా గణన సిబ్బంది పని సులభమవుతుందన్నారు.జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు జనాభా గణనకు 1.10 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లను వినియోగిస్తామని నివాస్ చెప్పారు. జనాభా గణన సిబ్బంది 80 శాతం మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే ఉంటారని తెలిపారు. జనాభా గణనకు వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని, వాస్తవ సమాచారం ఇవ్వాలని కోరారు. జనాభా గణన సిబ్బందికి ఆటంకాలు కల్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. 2027 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉన్న జనాభా ఆధారంగా జనగణన జరుగుతుందన్నారు. 2011లో చివరి జనగణన నిర్వహించగా, 2027లో జరగబోయేది 16వదని, స్వాతంత్య్రం వచ్చాక ఎనిమిదో విడత అని వివరించారు.స్వీయ గణన ఇలా...» ప్రజలు https://se.census.gov.in పోర్టల్లో తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యి, ఇంటిని జియో–ట్యాగ్ చేసి వివరాలు నమోదు చేయాలి. అది పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేకమైన స్వీయ గణన ఐడీ జనరేట్ అవుతుంది. ఈ ఐడీని ఎన్యూమరేటర్కు అందజేసి క్షేత్రస్థాయి తనిఖీ సమయంలో ధ్రువీకరించాల్సి ఉంటుంది.» వాటికి అదనంగా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వంట ఇంధనం, స్నాన సౌకర్యం, వంటగది వంటి సౌకర్యాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తులు (టీవీ, ఇంటర్నెట్, మొబైల్, వాహనాలు), ప్రధాన ఆహారం, మొబైల్ నంబర్ వంటి వివరాలు కూడా నమోదు చేయాలి. » జనాభా గణన సందర్భంగా విద్య, కులం వంటివాటి ధ్రువీకరణకు ఎటువంటి రుజువులు, పత్రాలు అడగరు. » జనాభా గణనకు ఆధార్ నంబర్తో సంబంధం లేదు. » జనాభా గణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. ఆ సమయంలో కుల గణనకు కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుంది.» ఇళ్ల జాబితా, ఇళ్ల గణన మే 1 నుంచి 30 వరకు కొనసాగుతుంది. ఇళ్ల జాబితా సేకరణలో భవనాలు, ఇళ్లకు నంబర్లు ఇస్తారు. గృహ జాబితా దశలో మొత్తం 33 ప్రశ్నలకు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. ఇందులో గృహ నిర్మాణ అంశాలు (ఫ్లోర్, గోడ, పైకప్పు), గృహ వినియోగం, గృహ స్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక స్థితి, గదుల సంఖ్య, నివాసం ఉంటున్న వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయి. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77 శాతం ఉత్తీర్ణత, సెకండ్ ఇయర్లో 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను వేగంగా, సులభంగా చూసుకోవడానికి కింద లింక్ను ఉపయోగించగలరు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.కాగా, మే 21 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ జరగనుంది. జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈ నెల 20 నుంచి 27 వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
రాజకీయ రాబందు.. అవినీతి చంద్రిక
సాక్షి, అమరావతి: రావణుడి గుట్టు విభీషణుడికి తెలుసు అన్నట్టు.. తెలుగు రాజకీయ రావణుడు చంద్రబాబు గుట్టు, గూడుపుఠాణి అంతా ఆయన సొంత కుటుంబ సభ్యుల కంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది...! అందుకే చంద్రబాబు అవినీతి చరిత్ర, రాజకీయ కుట్రల గురించి ఆయనకు సొంత మామ ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎనాడో సవివరంగా వెల్లడించారు. 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర అనంతరం ఎన్టీ రామారావు ఆనాడు ఓ టీవీ చానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ నైచ్యాన్ని ఎండగట్టారు. చంద్రబాబును ఏకంగా ‘గొడ్డు కన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం’అని దుయ్యబట్టారు. తెలుగు చరిత్రలో అభినవ ఔరంగజేబ్ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక చంద్రబాబు కుతంత్రాల చరిత్ర మాటలతో చెప్పడం సాధ్యం కాదని చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావించారు. అందుకే ‘ఒక చరిత్ర.. కొన్ని నిజాలు’ శీర్షికతో ఓ పుస్తకమే రాశారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, అవినీతి గురించి సోదాహరణంగా ఎండగట్టారు. ఎన్టీ రామారావు ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు గురించి చేసిన విమర్శలనూ ఆ పుస్తకంలోనే ప్రస్తావించారు. చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ఒక చరిత్ర – కొన్ని నిజాలు పుస్తకంలోని కొన్ని భాగాలు ఇవీ... ఒక చరిత్ర.. కొన్ని నిజాలు పుస్తకంలోని అంశాలు సంక్షిప్తంగా.. కాంగ్రెస్లో ఉండగానే అవినీతికి శ్రీకారంచంద్రబాబు కాంగ్రెస్ పారీ్టలో ఉండగానే అవినీతికి పాల్పడ్డారు. అసలు మంత్రి పదవి కోసమే చేయరాని పనులు చేశారు. మద్రాసులోని సవేరా హోటల్లో ఎన్నో చెప్పలేని, చేయరాని పనులు చేశారు. ఇక మంత్రి అయిన తరువాత అవినీతికి బరితెగించారు. ఆయనకు టార్చ్లైట్ మినిస్టర్ అని ఆనాడే ముద్ర వేశారు. అంటే రాత్రి వేళల్లో టార్చ్లైట్లతో పనులను తనిఖీ చేస్తున్నట్టు హడావుడి చేసి కాంట్రాక్టర్లను బెదిరించేవారు. అనంతరం వారి నుంచి భారీగా కమీషన్లు వసూలు చేసేవారు. ఎన్టీఆర్ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు కూడా రావని ఎద్దేవా సీనీ రంగంలో ఉన్న ఎనీ్టరామారావు 1982లో టీడీపీని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు ఆయన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయన తాను టీడీపీలో చేరనని ప్రకటించారు. అంతేకాదు ఎన్టీ రామారావు తిరుపతి నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే చంద్రబాబు ఆయన్ని ఎగతాళి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే సొంత మామ అయినా ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానన్నారు. చంద్రబాబును టీడీపీలో చేరాలని కోరినప్పుడు ఎద్దేవా చేశారు. కాగితాలపై ఏవేవో లెక్కలు వేసి ఎన్టీ రామారావు సినీ గ్లామర్కు ఐదు శాతం ఓట్లు రాలవని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు చేతి నుంచి పైసా కూడా తీయరని కూడా హేళన చేశారు. అటువంటి ఎన్టీ రామారావు పార్టీని నడపలేరని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిన చంద్రబాబు 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచి్చంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. సిట్టింగ్ మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబూ ఓడిపోయారు. దాంతో ఆయన వెంటనే ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానన్నారు. చంద్రబాబును పారీ్టలో చేర్చుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా సరే ఎన్టీ రామారావు పార్టీ నేతలను ఒప్పించి చంద్రబాబు టీడీపీలో చేరికకు సమ్మతించారు. టీడీపీలో చేరగానే వసూళ్ల పర్వం చంద్రబాబు టీడీపీలో చేరగానే తన నైజాన్ని చూపించారు. మహానాడు, ఇతర పార్టీ కార్యక్రమాల పేరిట రాష్ట్రంలో భారీగా వసూళ్లు మొదలుపెట్టారు. ఇవన్నీ ఎన్టీ రామారావుకు తెలియకుండానే చేసేవారు. వసూలు చేసిన నిధులను పార్టీ ఖాతాలో జమ చేసేవారు కూడా కాదు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా కొనుగోలు చేసే సామగ్రిలో కూడా చంద్రబాబు కమీషన్లు తీసుకునేవారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తూ టీడీపీలో అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. ఎనీ్టఆర్ కుటుంబ సభ్యులను అణచివేసిన చంద్రబాబు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు టీడీపీలో రాజకీయంగా ఎదగకుండా చంద్రబాబు అణచివేశారు. హరికృష్ణను తన వారసుడిగా చేయాలని ఎన్టీ రామారావు భావించారు. దాంతో హరికృష్ణను పార్టీ కార్యక్రమాలకు చాకచక్యంగా దూరం చేశారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ ఎదుగదలను అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడ్డారు. 1986లో మదనపల్లి సభలో ఎన్టీ రామారావు బాలకృష్ణను తన వారసుడిగా ప్రకటించారు. దాంతో చంద్రబాబు ఎన్టీ రామారావుపై ఒత్తిడి తెచ్చి ఆ ప్రకటనకు ఆయనతోనే ఖండన ఇప్పించారు. బరితెగించి దోపిడీఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్చగా అవినీతికి పాల్పడ్డారు. మద్యం బాట్లింగ్ ప్లాంట్ల లైసెన్సుల వ్యవహారంలో చంద్రబాబు అవినీతి విస్మయపరిచింది. తమిళనాడుకు చెందిన పురుషోత్తం అనే కాంట్రాక్టరు ఉన్న తాజ్ బంజారా హోటల్కు తానే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లారు. ఆయన నుంచి రూ.3కోట్లను గోతం సంచులలో వేసుకుని తెచ్చుకున్నారు. ఆ విధంగా కాంట్రాక్టులు ఇప్పిస్తామని భారీగా కమీషన్లు తీసుకునే సంస్కృతి టీడీపీలోకి తెచి్చంది చంద్రబాబే. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారు. కమీషన్లు తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి కొమ్ముకాశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్ష టీడీపీ శాసనసభలో నిలదీసింది. దాంతో ఆ ప్రాజెక్టు ఫైళ్లను ప్రతిపక్ష నేతలు స్పీకర్ కార్యాలయంలో పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రతిపక్ష టీడీపీ తరపున చంద్రబాబు స్పీకర్ కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని పత్రికలకు తెలిపారు. విషయం ఏమిటంటే... శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు పెద్ద మొత్తం చంద్రబాబుకు కమీషన్గా సమర్పించారు. ఆ విషయం తెలిసీ ఎన్టీ రామారావు చంద్రబాబుకు చెప్పరాని విధంగా చివాట్లు పెట్టారు. పార్టీని తాకట్టు పెడుతున్నారని ... అమ్మేస్తున్నారని కడిగిపారేశారు. వైస్రాయ్ కుట్ర.. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన చంద్రబాబు మనుషులు1994లో టీడీపీ అఖండ మెజారీ్టతో అధికారంలోకి వచి్చనప్పటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రకు తెరతీశారు. ఆ రోజు వైస్రాయ్ హోటల్కు వచ్చిన ఎన్టీ రామారావుపై చంద్రబాబు మనుషులు చెప్పులు విసిరారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ మనోవేదనతో ఎన్టీ రామారావు మరణించారు. అనంతరం టీడీపీ సభ్యత్వ పుస్తకాలపై ఎన్టీ రామారావు బొమ్మలు తీయించి వేశారు. ‘ఇంకా ఎన్నాళ్లు ఎన్టీఆర్ బొమ్మ పట్టుకుని పాకులాడతాం... ఎనీ్టఆర్ బొమ్మ పోవాలి.. మన బొమ్మ రావాలి’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ పార్లమెంటులో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టకుండా అడ్డుకున్నారు. అవినీతి చక్రవర్తి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు అవినీతి మరింత పెచ్చుమీరింది. ఏలేరు భూముల నష్టపరిహారం కుంభకోణం, లిక్కర్ అమ్మకాల్లో ముడుపులు, బిల్లీరావు ప్రమేయం ఐఎంజీ అనే బోగస్ సంస్థకు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయలు విలువ చేసే వేయిఎకరాలను ఎకరా రూ.25 వేల చొప్పున కట్టబెట్టడం, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు ఇలా బరితెగించి అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీ రామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డు కన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. ఎమ్మెల్యేలు అందరికీ డబ్బులు ఇచ్చారు. ఆయన పేరు చెప్పడం లేదు. పేరు చెప్పడానికి కూడా అర్హుడు కాదు. దేవుడు కూడా క్షమించనంత ఘాతుకం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇది జాతి, చరిత్ర ఎప్పటికీ విస్మరించదు. మీరే న్యాయ నిర్ణేతలు. -
‘ఉపాధి’ పనుల నిలిపివేత
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలం శివారు ప్రాంతమైన కల్లూరుపల్లె గ్రామం దిద్దుకుంట వాండ్లపల్లెలో టీడీపీ నేత ఆదేశాలతో ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిద్దుకుంట వాండ్లపల్లెలో సుమారు 50 కుటుంబాల వారు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లారు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న టెక్నికల్ అసిస్టెంట్ ‘మీకు పనులు లేవు... ఇళ్లకు వెళ్లిపోండని’ ఆదేశించారు.ఇదేమని అడిగితే ‘పనులు పెట్టొద్దన్నారు... అందుకే మీకు పనులు పెట్టేది లేదు’ అని తేల్చి చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా ఏకమై వాదనకు దిగి... నిన్న పనులు ప్రారంభించి ఈ రోజు లేవంటే ఎలా అని నిలదీయడంతో... టీడీపీ నేత ఆదేశాలతోనే పనులు నిలిపేశామని టెక్నికల్ అసిస్టెంట్ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు తమకు పనులు కల్పించకపోతే ఎంత దూరమైనా వెళ్తామని... ఎవ్వరినీ వదలమని తేల్చిచెప్పారు. అధికారులు స్పందించి వెంటనే ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభిమానులు కావడంతో... దిద్దుకుంట వాండ్లపల్లెలో నాలుగైదు ఇళ్లు మినహా మిగిలిన వారంతా వైఎస్సార్సీపీ అభిమానులు కావడంతో పచ్చ నేతకు కంటగింపుగా మారింది. ఎలాగైనా అక్కసు తీర్చుకోవాలని అనుకున్నదే తడవుగా అధికార బలాన్ని ప్రదర్శించి... ఆ ఊర్లో ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. పచ్చ చొక్కాలు తొడుక్కున్న అధికారులు వెంటనే సదరు టీడీపీ నేత ఆదేశాలను అమలు చేశారు. అయితే ఊరి జనమంతా ఏకమై ఉపాధి సిబ్బందిపై ఎదురుతిరగడంతోపాటు... ‘ఈ ఊర్లోనే ఉపాధి పనులు ఎందుకు పెట్టరు’ అని నిలదీయడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. -
బీద వెన్నుబోట్లకు సాక్ష్యం ఇదిగో
సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా మన రాష్ట్ర సరిహద్దు సముద్ర జలాలను దాటి వచ్చిన తమిళనాడు బోట్లను నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే... స్వార్థం కోసం వాటిని రాత్రికి రాత్రే మాయం చేసిన ఘనులు కూటమి నేతలేనని తేలిపోయింది. ముఖ్యంగా ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఇన్నాళ్లూ బుకాయించిన టీడీపీ ఎంపీ బీద మస్తాన్ రావు అసలు సూత్రధారి అని స్పష్టమైంది. బోట్ల మాయం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారితో ఎంపీ స్వయంగా మాట్లాడారు.ఇతర రాష్ట్రానికి చెందిన నిందితులతో బీద అనుచరులు ఫోన్లో సంప్రదింపులు జరిపారు. వీరే బోట్లు వదిలేశారనే విషయం ఫోన్ ‘కాల్ రికార్డ్స్ డేటా’ ఆధారంగా బయటపడింది. ఇతర రాష్ట్రాల వారు ఏపీ పరిధిలోకి వచ్చి తమ పొట్టగొడుతున్నారని, న్యాయం చేయాలని స్థానిక మత్స్యకారులు వేడుకుంటే, వారిని ఏమార్చి, వారి నాయకులను కొనేసి, ఎంపీ తన అనుచరుల సాయంతో తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను దొంగచాటుగా విడిపించి పంపించేసిన బాగోతానికి తిరుగులేని సాక్ష్యంగా కాల్ డేటా వెలుగులోకి వచ్చింది. బీదా... ఇప్పుడేమంటారు? బోట్ల వివాదంలో మత్స్యకారులు తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వదిలేసిన బోట్లను వెనక్కు రప్పించాలని అడుగుతున్నారు. అలాగే వాటిని వదిలేసిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోన్ కాల్ డేటా సంచలన విషయాలను వెల్లడించింది. బీద మస్తాన్రావుతోపాటు ఆయన అనుచరులు సైతం బోట్ల మాయం వ్యవహారంలో నిందితులతోనూ, బోట్ల యజమానులతోనూ మాట్లాడినట్లు కాల్ డేటా బయటపెట్టింది. ⇒ ఎంపీ బీద మస్తాన్ అనుచరుడు, బోట్ల వ్యవహారంలో నిందితుడైన కొండూరు పోలిశెట్టి అనే పాతపాళెంకు చెందిన వ్యక్తి తమిళనాడు మత్స్యకారులు తీసుకువెళ్లిన బోట్ల యజమాని అశోక్తో ఫోన్లో గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకూ దాదాపు 77 సార్లు మాట్లాడారు. ఇందులో ఒకసారి పోలిశెట్టి ఫోన్ చేస్తే మరోసారి అశోక్ చేశారు. ఇలా ఇద్దరూ మూడు నెలల పాటు మాట్లాడుకున్నారు. ⇒ అదే విధంగా బోట్ల మాయం వ్యవహారంలో నిందితుడిగా ఉన్న అల్లూరు మండలం ఇసుకపల్లిపాలెం గ్రామానికి తోటయ్య అనే వ్యక్తితో బీద మస్తాన్ అనుచరుడైన పోలిశెట్టి అదే డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 9 వరకూ 19 సార్లు ఫోన్ చేసి సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ కాల్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక తోటయ్య సైతం బోట్ల యజమాని అశోక్తో మాట్లాడారు. అది కూడా గతేడాది డిసెంబర్ 1 నుంచే మొదలైంది. దాదాపు 46 సార్లు వీరిద్దరూ ఫోన్లో సంప్రదింపులు జరుపుకున్నారు. ⇒ అన్నిటికంటే ముఖ్యంగా తోటయ్య ఎంపీ బీద మస్తాన్రావుతోనూ ఫోన్లో మాట్లాడినట్లు బయటపడింది. గతేడాది అక్టోబర్ 30, నవంబర్ 8, డిసెంబర్ 31, ఈ ఏడాది జనవరి 15, ఫిబ్రవరి 28 తేదీల్లో ఎంపీకి ఫోన్ చేసి తోటయ్య అన్ని విషయాలనూ అప్ డేట్ చేస్తూ వచ్చారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు బోర్డు మంగళవారం తెలిపింది. ఉదయం 10.31 గంటలకు https://resultsbie.ap.gov.in/ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. విద్యార్థులు sakshieducation.comలో కూడా ఫలితాలు చూసుకోవచ్చు. -
టీడీఆర్ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు
సాక్షి, అమరావతి: భూ సేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడానికి భూ యజమానులు నిరాకరిస్తే చట్టం నిర్దేశించిన మేరకు పరిహారం చెల్లించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. పరిహారానికి బదులు టీడీఆర్ బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదంది. టీడీఆర్ బాండ్లు తీసుకోవడమన్నది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని పేర్కొంది. తీసుకున్న భూమికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని భూ యజమానులను ఒంగోలు మున్సిపల్ అధికారులు బలవంతం చేయడాన్ని తప్పుపట్టింది. బాండ్లు తీసుకునేందుకు భూ యజమానులు నిరాకరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు.బెదిరింపులకు దిగటంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులుఒంగోలు మున్సిపల్ అధికారులు జేఎంబీ చర్చి సెంటర్ నుంచి ఓల్డ్ మార్కెట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. టీడీఆర్ బాండ్లు లేదా పరిహారానికి ఆమోదం తెలిపాలని సదరు భూ యజమానులను కోరారు. అయితే, భూ యజమానులు టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు నిరాకరించారు. తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో ఒంగోలు పురపాలక శాఖ అధికారులు టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇల్లు కూల్చేస్తామంటూ మౌఖికంగా బెదిరింపులకు దిగారు. దీంతో భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. టీడీఆర్ బాండ్లు కాకుండా తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది షేక్ ఆసిఫ్ వాదనలు వినిపిస్తూ.. టీడీఆర్ బాండ్లు తీసుకోవాల్సిందేనని పిటిషనర్లను అధికారులు బలవంతం చేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా ఎగవేసేందుకే అధికారులు టీడీఆర్ బాండ్లను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు.బలవంతంగా రుద్దడానికి వీల్లేదువాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుపట్టారు. బాధితులపై టీడీఆర్ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాధితులైన భూ యజమానులు టీడీఆర్ బాండ్లను తిరస్కరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్కు 2013 చట్ట ప్రకారం మార్కెట్ ధరను ఖరారు చేసి అందుకు అనుగుణంగా పరిహారాన్ని చెల్లించాలని ఒంగోలు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. -
గంగపుత్రులకు వెన్నుదన్నుగా
సాక్షి, అమరావతి: వేటకు వెళ్తేగానీ పూట గడవని గంగపుత్రులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం.. ఇలా ప్రతి సంక్షేమ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా క్రమం తప్పకుండా అందించిన వేట నిషేధ భృతి (మత్స్యకార భరోసా), ఆయిల్ సబ్సిడీ పెంపుతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య, వేటపై ఆధారపడి జీవనోపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్లు క్రమం తప్పకుండా.. ఎన్నికల హామీ మేరకు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. ఆరంభంలోనే నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా నిషేధ భృతిని అందించి వారికి అండగా నిలిచారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ పడవలపై వేట సాగించే వారికి సైతం సాయాన్ని అందజేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది.2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఏటా సగటున 60 వేల మంది మాత్రమే లబ్ధి పొందితే 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్లకుపైగా భృతిని అందజేశారు. గతంలో డీజిల్పై లీటర్కు రూ.6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9కు పెంచింది. వేటకు వెళ్లే్టప్పుడు సబ్సిడీని మినహాయించుకుని ఆయిల్ నింపుకొనే వెసులుబాటు కల్పించారు.2014–19 మధ్య 1,100 బోట్లకు మాత్రమే ఆయిల్ సబ్సిడీని వర్తింప చేస్తే.. 2019–24 మధ్య ఈ సంఖ్య ఏకంగా 23,209కి పెరిగింది. ఆయిల్ సబ్సిడీ ద్వారా రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇక 50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు ఇస్తున్న పింఛన్ 2018–19 నాటికి 42,729 మందికి వర్తింప చేయగా 2019–24 మధ్య ఏకంగా 69,741 మందికి అందచేశారు. టీడీపీ హయాంలో పింఛన్ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.759.47 కోట్లు వెచ్చించింది. పరిహారం రెట్టింపు.. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ఆదుకుంది. 2019–24 మధ్య 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మరోవైపు డాక్టర్ కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.647.44 కోట్లు సాయాన్ని అందించారు. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో గత ప్రభుత్వం రూ.4,913 కోట్ల మేర మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది.గత ప్రభుత్వంలో ఏపీకి అవార్డులు..వైఎస్ జగన్ ప్రభుత్వ తోడ్పాటుతో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39.92 లక్షల టన్నుల (2018–19లో) నుంచి 51.58 లక్షల టన్నులకు (2023–24లో) చేరాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో 19.37 శాతం వృద్ధి రేటు నమోదైతే.. ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కడం గమనార్హం.చంద్రబాబు, కూటమి వచ్చాక ఆ భరోసా మచ్చుకైనా కానరావడం లేదని మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందని, రెండో ఏడాది అరకొరగా విదిలించి చేతులు దులుపుకొందని మండిపడుతున్నారు. ఇక డీజిల్ సబ్సిడీ ఎప్పుడిస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. ఆయిల్ కంపెనీలు డీజిల్పై లీటర్కు రూ.24 మేర పెంచిన భారాన్ని తగ్గించాలని మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెన్నుదన్నుగా నిలిచారు.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు జరిగినంత మేలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు బాటలు వేశారు. ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందించి వెన్నుదన్నుగా నిలిచారు. చేయూత, ఆసరా, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. –వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఏ ఒక్క పథకం లేదు.. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు మహర్దశ. నేడు మమ్మల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. తొలి ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టారు. మత్స్యకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదు. కొత్తగా మత్స్యకార పింఛన్లు మంజూరు చేయడం లేదు. బతుకు భారంగా తయారైంది. –చోడిపల్లి శ్రీను, మత్స్యకారుడు, పాయకరావుపేట -
పోర్టులు, హార్బర్లపై 'బాబు' వల!
సాక్షి, అమరావతి: కొత్తగా సంపద సృష్టిస్తానని నమ్మబలికి ఉన్న సంపదనే బినామీల చేతుల్లో పెట్టేస్తున్నారు..!అభివృద్ధికి తానే కేరాఫ్ అంటూ జబ్బలు చరుచుకుంటూ.. జరిగిన అభివృద్ధిని నాశనం చేసేస్తారు! ప్రజోపయోగ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి ప్రజాధనాన్ని వాటాలతో పంపకాలు చేస్తుంటారు!వారం వారం రూ.వేల కోట్ల అప్పులు చేస్తూ.. పైసాకి కూడా లెక్కలు చెప్పరు..! టోటల్గా చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర సంపదను కరగబెట్టి తన బినావీులకు ధారపోయడం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ముందుచూపు, విజన్తో శ్రీకారం చుట్టిన 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు అధికారంలోకి రాగానే పనులను కుట్రపూరితంగా నిలిపివేయడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో 1,053 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.26,501 కోట్లతో చేపట్టిన పోర్టులు, షిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొక్కిపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన వాటిని కూడా అందుబాటులోకి తేకుండా మోకాలడ్డారు. ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నెను అందుబాటులోకి తేకుండా...రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట వద్ద 4 కొత్త పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ల్యాండ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించి ఎక్కడా మధ్యలో పనులు ఆగకుండా పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి ప్రారంభించింది. 2024 ఎన్నికల నాటికే రామాయపట్నం పోర్టు 90 శాతానికిపైగా పూర్తయింది. బల్క్ కార్గో బెర్త్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. దీనిని 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినాసరే.. దాదాపుగా పూర్తయిన రామాయపట్నం పోర్టుతోపాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె హార్బర్ను అందుబాటులోకి తేకుండా చంద్రబాబు నిలిపివేశారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. కూటమి సర్కారుపై మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు..తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్ర తీరంలోకి అక్రమంగా చొరబడి మత్స్య సంపదను అపహరిస్తున్నట్లు స్వయంగా నెల్లూరు కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు ఎదురొడ్డి తమిళనాడు బోట్లను పట్టుకొని బంధిస్తే కూటమి సర్కారు దొడ్డిదారిన వదిలేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. డబ్బులు తీసుకుని బోట్లను వదిలేసిన గ్రామాలను గుర్తించి జరిమానా విధించడమే కాకుండా అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుతో మత్స్యకారులు ఎవరూ మాట్లాడకూడదంటూ మత్స్యకార సంఘాలు అంతర్గతంగా ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో ముఖ్యమంత్రి హడావుడిగా సమీక్ష నిర్వహించి రెండో విడత హార్బర్ల నిర్మాణం చేపట్టాలంటూ బుజ్జగించే యత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు.ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులుపీపీపీ విధానంలోకి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లుతూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో టీడీపీ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. మిగిలిన పోర్టులు, హార్బర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టనుంది. ఈ కుట్రలో భాగంగానే తీరప్రాంతం అభివృద్ధి ముసుగులో ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ 2026 తాజాగా విడుదల చేసింది. దీనిద్వారా తీర ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను టీడీపీ పెద్దలు తమకు నచ్చినవారికి కేటాయించనున్నారు. తీర ప్రాంతంలో ‘ఏ’ కేటగిరీ భూములను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా, బీ కేటగిరీ కింద భారీ స్థాయిలో భూ కేటాయింపులను ప్రభుత్వ ఆమోదంతో చేపట్టనున్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 30 సంవత్సరాల వరకు లీజు విధానంలో ఈ భూములను కట్టబెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలోకి మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బందరు పోర్టు నిర్మాణ కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గతేడాది మార్చిలో రూ.402.62 కోట్ల పనులను కేటాయించగా తాజాగా మరో రూ.395.38 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ బందరుపోర్టు కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం నజరానా అందించింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాల్సిన పోర్టు పనులను నిలిపివేసి చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.మత్స్యకారులకు దగా..ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలుచేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,520.64 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిదశలో సుమారు రూ.2,113.06 కోట్లతో ఐదు హార్బర్లు నిర్మించాలని ప్రతిపాదించగా కూటమి సర్కారు వాటిని నాలుగుకు కుదించడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని రూ.632 కోట్లకు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవుల్లో మాత్రమే హార్బర్లు నిర్మిస్తోంది. బియ్యపుతిప్పను ఫిషింగ్ హార్బరు నుంచి ఫిష్ల్యాండ్ సెంటర్గా మార్చేసింది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చేసే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయంలో కోత పెట్టడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. అంతేకాదు.. ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు మత్స్యకారుల పొట్ట కొడుతోంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరులో 29.58 ఎకరాలను పుణెకు చెందిన సాగర్ డిఫెన్స్కు అప్పగించగా.. మచిలీపట్నం హార్బర్ వద్ద కూడా నౌకా తయారీ కేంద్ర నిర్మాణం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.జగన్పై నమ్మకంతోనే భూములిచ్చాం.. వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతోనే మా భూములను, గ్రామాన్ని మూలపేట పోర్టుకు త్యాగం చేశాం. పోర్టు పనులు కూడా వేగంగా జరిగాయి. ఈ ప్రాంత అభివృద్ధికి జగన్ చేసిన కృషిని భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి. – జీరు శివ, నిర్వాసితుడు, మూలపేట, సంతబొమ్మాళి మండలంప్రాణాలైనా అర్పిస్తాం.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మా మత్స్యకారుల భవిష్యత్తు. వైఎస్ జగన్ మా బతుకులు మార్చాలని గట్టి సంకల్పంతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ మా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కట్టించిన ఫిషింగ్ హార్బర్ భూముల్లో కొంత భాగం ప్రైవేట్కు అప్పగించారంటే.. మిగతాది కూడా వారికి కట్టబెట్టే ఉద్దేశం ఉన్నట్లే. ప్రాణాలైనా అర్పించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కాపాడుకుంటాం. – మామిడి గోవిందస్వామి, మాజీ సర్పంచ్, జువ్వలదిన్నె, బోగోలు మండలం జగన్ వరమిస్తే.. చంద్రబాబు ద్రోహం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించి వైఎస్ జగన్ వరమిస్తే.. చంద్రబాబు వచ్చి ద్రోహం తలపెట్టారు. మా ప్రాంతాన్ని ప్రైవేట్కు అప్పగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది? మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి పేరొస్తోందనే దుగ్ధతోనే మా బతుకులు, భవిష్యత్ను అంధకారం చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. మత్స్యకారులంతా ఏకమై మా అభిప్రాయాలను వైఎస్ జగన్కు తెలియజేయాలని తీర్మానించుకున్నాం. – ప్రళయ కావేరి రాంబాబు, తుమ్మలపెంట, కావలి మండలంఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు..బందరు పోర్టుతో ఈ ప్రాంతవాసుల కల సాకారమైంది. ఎన్నో సంవత్సరాలుగా పోర్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్టు ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. – మద్దుల గిరీష్, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మచిలీపట్నం, కృష్ణాజిల్లాగత ప్రభుత్వం సఫలీకృతం.. పోర్టు నిర్మాణంతో బందరుకు మహర్దశ రానుంది. 20 సంవత్సరాలుగా పోర్టు నిర్మాణం కోసం పోరాటం చేశాం. పోర్టు తీసుకురావటంలో గత ప్రభుత్వం సఫలీకృతమైంది. శరవేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.– డాక్టర్ బి.శ్రీనివాసాచార్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడుహార్బర్తో మత్స్యకారులకు మేలుమచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. మత్స్యసంపదకు మంచి ధర లభించేలా ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. సముద్ర ముఖ ద్వారాన్ని మెరుగుపరచాలి. – సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
నేడు వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జువ్వలదిన్నెలో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె చేరుకుంటారు.10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
కాలేయం కొవ్వెక్కుతోంది
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణం పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్/మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్’ ప్రచురించిన అధ్యయనం మద్యపానం అలవాటు లేని వారిలో బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు.జీవనశైలి జబ్బులే ప్రధాన కారణంభారత్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండటానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అదికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు. 1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆహారమే ఔషధందేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ను పూర్తిగా విడనాడాలి. మనిషికి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.– డాక్టర్ కె.జగదీశ్వర్రెడ్డి, గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్, ఒంగోలు -
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వైఎస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ప్రైవేట్ కేసు వేద్దాం.. న్యాయ సాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్కుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్కు కృష్ణార్జునరెడ్డి చూపారు.టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
‘మా బాబును రాష్ట్రపతి తెగ పొగిడేశారు తెలుసా!’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. బాబును పొగిడారంటూ ప్రచారం భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు. -
కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..!
సాక్షి, అమరావతి: కోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘన ఎంతమాత్రం క్షమార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. దీంతోపాటు రూ.10వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీకి జమ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆస్తి వివాదానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగి నగతం ముకుందరెడ్డి, మరికొందరిపై నగతం సునీత, మరో ముగ్గురు 2009లో తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.విచారణ జరిపిన తిరుపతి కోర్టు, ఆస్తిలో 1/4 వాటా సునీత తదితరులకు చెందుతుందని 2017లో డిక్రీ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ముకుందరెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీల్ చేయడంతో తీర్పు అమలు ఆగిపోయింది. కాగా తిరుపతి కోర్టులో తాము దాఖలు చేసిన తమ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముకుందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తాకట్టు పెట్టడం గానీ, ఆస్తిపై మూడో పక్షానికి హక్కులు సృష్టించడం గానీ చేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు.దీంతో ఈ మేరకు 2021లో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. అయితే ముకుందరెడ్డి కోర్టు నుంచి తీసుకున్న ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టారని, ఆ ఆస్తిని థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేంటూ సునీత మరికొందరు 2025లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ తిల్హరీ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. ముకుందరెడ్డి ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చింది. -
తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు
సాక్షి అమరావతి: ‘టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. రాయచోటి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పదుల వార్డుల్లో మనకు అభ్యర్థులే లేరు. కూటమికి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్ బూత్లలో మైనస్ కనిపించింది. ఇతర పార్టీలతో పొత్తు టీడీపీని దెబ్బతీస్తోంది..’ అంటూ మంత్రి రాంప్రసాద్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. రాయచోటిలో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేయలేని హామీలతో అధికారంలోకి రావడంతోపాటు పాలనలో అన్ని విధాలుగా విఫలమయ్యారంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలకు రక్షణ కరువైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అమరావతి పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరడంతో ఆ పార్టీ నాయకులకే భయం పట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలన్న అధినేతల సూచనలు మంత్రులు, ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే చేతులెత్తేసే దశకు చేరుకుంటున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా, యువజనశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలోనే రాయచోటి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో వార్డుల్లో పోటీచేయడానికి పార్టీకి అభ్యర్థులే లేరంటూ వ్యాఖ్యానించడమే దీనికి ఉదాహరణ. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తువల్లే భారీ మెజారిటీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడూ రాలేదని, ఇకపై రాదని కూడా పేర్కొన్నారు. అలా గెలిచిన నియోజకవర్గాల్లో రాయచోటి కూడా ఉందన్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూత్లలో చెత్తగా ఫలితాలు వచ్చాయని నిషూ్టరంగా మాట్లాడుతూనే ఇక్కడ (ముస్లింలు, దళితులు, క్రిస్టియన్) కులాలు, మతాలకు ఇంకా ఓ పార్టీ (వైఎస్సార్సీపీ)తో ప్రేమలు చావలేదంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో దెబ్బతిన్నామంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఆ పార్టీ కారణంగానే 89 బూత్లలో టీడీపీకి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. మన పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంతో రాయచోటిలో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పారు. సొంత పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారంటూ పరోక్షంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అన్ని వార్డులకు అభ్యర్థులు ముందుకొచ్చేలా సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ ఓడిపోతే వచ్చే కష్టాలను ఊహించుకుని కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పెంచాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీడీపీ నేతల్ని కలవరపరుస్తున్న ప్రజావ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్న నేతల పిలుపుతో మరింత ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవనే స్పష్టమైన అంచనాకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్థానిక ఎన్నికల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
నేటి అర్ధరాత్రి నుంచి వేటకు విరామం
సాక్షి, అమరావతి: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకైఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో మోటారు వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంది.కాగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై మాత్రం లోతు జలాల్లో వేట నిషేధం. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్య సంపదను స్వాదీనం చేసుకోవడంతోపాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దికరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులు. నిషేధం పక్కాగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. -
టీడీపీలో ‘రాజ్య’కాంక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండడంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితమే ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్బాబు (కాల పరిమితి ముగియనుంది)కు రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతోంది. చినబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతోపాటు ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన్ను పక్కనపెట్టే అవకాశం లేశ మాత్రం కూడా లేదనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరో స్థానంపై మాత్రం విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే తన అనుయాయుడికే ఇస్తానని చినబాబు స్పష్టం చేస్తున్నారు. ఆ అనుయాయుడు ఇప్పటికే ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని విషయాలు చూసుకుంటూ సూపర్ బాస్గా మారిపోయారు. ఆయనకు మరింత ‘రాజసం’ కల్పించేందుకు రాజ్యసభ ఎంపీ పదవి కావాల్సిందేనని తద్వారా తన మనిషిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని చినబాబు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీనియర్ నేతలు మండిపడుతూ అనుచరుడిగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద పదవి కట్టబెడితే ఇక తాము ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న తమను కాదని ఎన్నికల్లో డబ్బు సమకూర్చిన వారికి, తమ పనులు చేసే వారికి పదవులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదని వాపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు చంద్రబాబుకే చెప్పినా ఆయన కూడా ఆర్థికంగా అండదండలు అందించిన వారిని కాదనలేమని అంటున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు.జయదేవ్ లాబీయింగ్మరోవైపు రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటును వదులుకుని తప్పు చేశానని మదనపడుతున్న ఆయన ఎలాగైనా సరే మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టాలనే పట్టుదలతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన భాష్యం రామకృష్ణ కూడా ఎన్నికల్లో అండగా నిలిచాను కాబట్టి రాజ్యసభకు పంపాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తదితరులు రాజ్యసభ స్థానంపై కన్నేసి చంద్రబాబుపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరికీ మాట ఇవ్వకుండా చూద్దాం అని చెబుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తమను అన్ని రకాలుగా పార్టీ కోసం ఉపయోగించుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జనసేన తరఫున లింగమనేని పేరు జనసేనకు ఈసారి ఒక స్థానం దక్కుతుందని అది లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. ఆయన అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్కి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మారితే తప్ప జనసేనకు ఒక స్థానం కేటాయిస్తే అది రమేష్కి ఖరారవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా ఖాళీ అయ్యే నాలుగు ఎంపీ స్థానాల్లో కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ తరచూ చేసే ఢిల్లీ పర్యటనలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీల్లో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగింటిలో ఒక్కోటి బీజేపీ, జనసేనకు వదిలినా రెండు కచ్చితంగా టీడీపీకి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే తమకు మూడు స్థానాలు ఇస్తే బాగుంటుందని ముఖ్య నేత అడుగుతున్నా అందుకు బీజేపీ సుముఖంగా లేదనే వాదన వినిపిస్తోంది. -
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్పై చర్చ జరగకుండా జగన్ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే... టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు. అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. ‘మావిగన్’కు ప్రజామోదం.. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. ‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం... అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. బాబు నైచ్యానికిదే నిదర్శనం! 2009 ఆగస్టులో వైఎస్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే ⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్లో ‘హైదరాబాద్ను ప్రపంచ మ్యాప్పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..! అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు. ⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్మీట్లో.. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు..!-నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు) చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...! చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు -దగ్గుబాటి వెంకటేశ్వర రావు‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు. రంగా హత్య వెనుక చంద్రబాబు-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ చంద్రబాబు అరాచక శక్తి-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు. అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) ‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’ -
అధికారులపై వృద్ధురాలి ప్రతీ‘కారం’!
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతున్న సమయంలో ఓ వృద్ధురాలు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ భూసేకరణ విభాగం కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి అధికారులపై కారం చల్లేందుకు యత్నించింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 65 ఏళ్ల మల్లెంపూడి లక్ష్మీతులసి భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి ఆమెకు 2022వ సంవత్సరంలో రూ.6,51,821 నష్టపరిహారం చెల్లించారు.అయితే తన నుంచి సేకరించిన భూమి మొత్తానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కొంత భాగానికి మాత్రమే ఇచ్చారని లక్ష్మీతులసి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులకు ఎక్కువ విస్తీర్ణానికి పరిహారం చెల్లించారని ఆరోపించింది. పరిహారం కోసం తాను కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తన చేయి విరిగిందని కన్నీరు పెట్టుకుంది. భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న అధికారి తనను ఇబ్బంది పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో సోమవారం పీజీఆర్ఎస్ జరగుతున్న సమయంలో కలెక్టరేట్కు చేరుకుంది.అక్కడ భూ సేకరణ విభాగంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కారం ప్యాకెట్ విసిరింది. కారం అంతా బల్లలపై, కుర్చిలపై పడింది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆవరణలో బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. లక్ష్మీతులసికి చెందిన 28 చదరపు మీటర్లు మాత్రమే భూమి సేకరించామని, అందుకు ఆమెకు రూ.6,51,821 పరిహారం కూడా చెల్లించామని కలెక్టర్ జి.లక్ష్మీశకు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం నివేదించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ విషయాన్ని పునః పరిశీలించాలని నందిగామ తహసీల్దార్ను ఆదేశించారు. ఈ మేరకు డీఆర్వో ప్రకటన విడుదల చేశారు. -
ఫీజుల వసూళ్ల పేరుతో వడ్డీ వ్యాపారమా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు 6, 9 నెలల కాలపరిమితితో విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలో అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని.. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కూరగాయాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూరగాయ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి అప్పులతో సాగుచేసి పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40 తక్కువ లేదు. కానీ, అందులో పదో వంతు కూడా రైతుకు దక్కడంలేదు. ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయానికి వాటి ధరలు తగ్గిపోవడం, రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం దళారీల పాలవుతుండడంతో చివరకు పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రైతు కష్టం దళారీల పాలు.. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి లంక గ్రామాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద అధిక సంఖ్యలో రైతులు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. రాయలసీమ (కర్నూలు, నంద్యాల, అనంతపురం) ఉల్లి సాగుకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో పంట కోసిన వెంటనే అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. కోస్తాంధ్ర (ప్రకాశం, పల్నాడు, గుంటూరు)లో దోస, వంకాయ, బెండ సాగుతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తట్టుకుని, ట్యాంకర్లతో నీరుపోసి పండించిన దోసకాయను కిలో రూపాయికి కూడా కొనేవారు కనిపించడంలేదు. కోస్తా – ఉత్తరాంధ్రలో కాకర, బీర వంటి తీగజాతి పంటలకు పందిరి పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి దారుణం.. ముఖ్యంగా.. ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పంట మార్కెట్లోకి రావడంతో ఎగుమతుల్లేక ఉల్లి పంటను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన ఉల్లికి సైతం క్వింటా రూ.300–రూ.400కు మించి ధర దక్కడంలేదు. కూరగాయల రైతుల పరిస్థితి కూడా ఇంతే. రెండునెలల కిందట కిలో టమాట రూ.50 వరకు పలకగా.. నేడు రూ.3–4 కు దిగజారింది. వాటిని కోయడానికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో వందలాది మంది రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా 30 శాతం చొప్పున పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఏమాత్రం పెంచలేదు. పైగా.. రెండేళ్లుగా రైతులకు సబ్సిడీ విడుదల చేస్తున్న దాఖలాల్లేవు. మరోవైపు కూలీల రేట్లు (మగ కూలీ రూ.600, ఆడ కూలీ రూ.400), డీజిల్ ధరలు, విత్తన ధరలు తడిసిమోపడవుతున్నాయి. ఏ కూరగాయ ధర చూసినా గుండె గుబులే.. ఏ కూరగాయ ధర చూసినా రైతు గుండెలు బాదుకుంటున్నాడు. దోసకాయల బస్తా ధర మూడు నెలల కిందట రూ.రెండున్నర వేలు ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వందలకు కూడా కొనేవారు లేరు. క్యాబేజీ నెల క్రితం కిలో రూ.40లకు పైగా ఉండగా నేడు కిలో రూ.4–6కు పడిపోయింది. బెండ, వంకాయలు కిలో రూ.8–10.. కాకర, పెద్ద చిక్కుళ్లు కిలో రూ.15–20లు మాత్రమే పలుకుతున్నాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికొస్తోందని, సాగుకు నీరులేకపోయినా రూ.లక్షలు వెచి్చంచి బోర్లు వేసి కూరగాయల పంటలు సాగుచేస్తే చివరికి పెట్టుబడి కూడా రాక నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తా లేని ప్రభుత్వం.. ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘ధర స్థిరీకరణ నిధి’ ఎక్కడా అమలుకాకపోవడంతో దళారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవు తున్నారు. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. టమాటా, ఉల్లి వంటి పంటలను కొనేవారులేక చేలల్లో, రోడ్లపక్క పంటను పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దళారీలు, వ్యాపారులు సిండికేట్గా మారి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉల్లి, టమాటా వంటి పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచకపోతే, వచ్చే ఏడాది సాగుచేసే వారు కరువయ్యే ప్రమాదం ఉంది.కూరగాయల సాగుతో తీవ్ర నష్టాలు మూడెకరాల్లో టమోటా సాగుచేశా. ధర లేకపోవడంతో తీసేశా. ప్రస్తుతం నాలుగెకరాల్లో ఉల్లి పంట, ఎకరాలో వంకాయ, రెండెకరాల్లో బెండ సాగుచేశా. ఉల్లి కొనేవారు లేరు. కూరగాయలకు మార్కెట్లో కనీస ధరలేక ఆర్థికంగా నష్టపోతున్నా. టమోటా ఎకరాకు రూ.60 వేల చొప్పున రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. ఎకరాకు రూ.లక్ష చొప్పున నాలుగెకరాల్లో ఉల్లి పెట్టుబడి నష్టపోయా. బెండ ఎకరాలో రూ.40వేలు.. వంకాయ ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టా. కానీ, ఏ ఒక్క పంటకూ పెట్టుబడి దక్కలేదు. – ఆంజనేయులు, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా -
హజ్ కమిటీలో బాబు అపవిత్ర రాజకీయం
సాక్షి, అమరావతి: పవిత్ర హజ్ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం అపవిత్ర రాజకీయం చేస్తోంది. హజ్ కమిటీ చట్టం–2002 నియమ నిబంధనలను గతేడాది యథేచ్ఛగా ఉల్లంఘించింది. కమిటీలో ధార్మిక ప్రతినిధులుగా పేర్కొంటూ ఇద్దరు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఏడాది అనంతరం పాత జీవో స్థానంలో మరో జీవోను బాబు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ నియామకంలోని కూడా ప్రభుత్వం అదే తప్పు చేసింది. ఈసారి స్థానిక సంస్థల ప్రతినిధుల పేరుతో పదవీకాలం ముగిసిన ముగ్గురు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై మళ్లీ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.టీడీపీ నేతలే ధార్మిక ప్రతినిధులా?ఏపీ హజ్ కమిటీనీ నియమిస్తూ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 16న జీవో 38 జారీ చేసింది. ఏపీ హజ్ కమిటీ చట్టం–2002 సెక్షన్ 18(1), (2) ప్రకారం చేపట్టిన ఈ నియామకంలో సబ్ క్లాజ్–3 ప్రకారం ముగ్గురు ధార్మిక పండితులను నియమించాల్సి ఉంది. అయితే ధార్మిక పండితులను నియమించకుండా వారి పేరుతో టీడీపీ ప్రతినిధులైన పఠాన్ ఖాదర్ ఖాన్, షేక్ హసన్ బాషాలను నియమించడం వివాదాస్పదమైంది. దీంతో బాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని రాజమహేంద్రవరానికి చెందిన షేక్ నిజాముద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ చేసిన హైకోర్టు 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది జూన్ 21న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అమలును ప్రభుత్వం జాప్యం చేసి ఈ ఏడాది మార్చి 29న జీవో 34ను జారీ చేసింది. అయితే కొత్తగా నియమించిన హజ్ కమిటీలోనూ చంద్రబాబు ప్రభుత్వం అదే తప్పు పునరావృతం చేసింది. ఈ ఏడాది మార్చి 29న ఇచ్చిన జీవో 34లో స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న షేక్ అబ్దుల్ హుస్సేన్, రమేష్ పర్వీన్, షేక్ జబీన్లను కమిటీలో నియమించింది. రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పంచాయతీలకు పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవో ఇచ్చే నాటికి వారు పదవిలో ఉన్నప్పటికీ.. పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా కొత్త కమిటీలో ఎలా కొనసాగిస్తారని ముస్లిం సంఘాలు కొత్త జీవోను తప్పుపడుతున్నాయి. దీనిపై న్యాయపోరాటానికి మళ్లీ సిద్ధపడుతున్నాయి.నిబంధనలను ఉల్లంఘిస్తారా?పవిత్రమైన హజ్ కమిటీ నియామకంలో టీడీపీ ప్రతినిధులను నియమించుకోవడం కోసం చట్టంలోని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తారా? గత జీవోలో ధార్మిక పండితుల పేరుతో ఇస్లామిక్ ధర్మశాస్త్రంపై ఎటువంటి అవగాహన లేని టీడీపీ నేతలను నియమించారు. ఇప్పుడు జీవోలో పదవీకాలం ముగిసిపోయిన వారిని కమిటీలో ఎలా కొనసాగిస్తారు? –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్హజ్ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన జగన్వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ హజ్ కమిటీ నియామకం పారదర్శకంగా చేపట్టారు. హజ్ కమిటీ పనితీరులోను వైఎస్ జగన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏపీ హజ్ కమిటీ చట్టం–2002లోని సెక్షన్లకు లోబడి నియామకం చేపట్టడంలో నిబంధనలు పాటిస్తూ ఏ ఒక్క విమర్శకు కూడా తావులేకుండా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హజ్ కమిటీ నియామకంలో తప్పు మీద తప్పు చేస్తోంది. చివరకు కోర్టు ధిక్కారం కేసు నుంచి బయటపడేందుకు ఇచ్చిన కొత్త జీవోలోనూ నిబంధనలు ఉల్లంఘించింది. – ఇస్సాక్ బాషా, ఎమ్మెల్సీ, హజ్ కమిటీ మాజీ సభ్యుడుకూటమిలో ముస్లిం ప్రతినిధులు మూగబోయారా?హజ్ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే..కూటమిలోని ముస్లిం ప్రతినిధులు మూగబోయారా? నిబంధనలను అతిక్రమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, మైనారిటీ సలహాదారు ఎంఏ షరీఫ్, ముస్లిం నేతలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? వెంటనే జీవో 34ను రద్దు చేసి నిబంధనల మేరకు నియామకాలు చేపట్టకపోతే న్యాయ పోరాటం చేస్తాం. –షేక్ నాగుల్ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
ఫీజు కట్టండి.. లేదంటే వడ్డీ విధిస్తాం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలనే కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థికస్థితిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోనో, మధ్యలోనో, చివరిలోనో ఫీజులు చెల్లిస్తుంటారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్న వీరికి గుండెల్లో గునపాలు గుచ్చేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజు చెల్లించాలని గడువు విధించడం, నిర్దేశిత సమయంలోపు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే... సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాతే స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తుంటాయి. విద్యా సంవత్సరంలో టర్మ్ ఫీజులను తల్లిదండ్రులు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి చెల్లిస్తుంటారు. పాఠశాలల్లో ఇప్పటివరకు సంవత్సరాంతపు పరీక్షలు కూడా జరగలేదు. వేసవి సెలవులూ ఇవ్వలేదు. అప్పుడే వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టడమేమిటని, లేకపోతే వడ్డీ పడుతుందని చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చట్టపరంగా ఎదుర్కొంటాం ఫీజు చెల్లింపు ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ విధిస్తామనడం తాము ఎన్నడూ చూడలేదని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, ఫీజు కట్టకుంటే వడ్డీ అనే విధానం పూర్తిగా చట్ట విరుద్ధమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. ఇటువంటి వి«ధానం అవలంబిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపడతామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజులు కట్టించుకోవడం నేరమన్నారు. అంతేగాక గడువు విధించి ఆ సమయానికి ఫీజు చెల్లించకపోతే వడ్డీ సహా చెల్లించాలని చెప్పడం కూడా తప్పేనని స్పష్టం చేశారు. ఇలా మెసేజ్లు పంపే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకారం చార్జీలు విధిస్తాం రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి ప్రాంతంలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఈ వింత పరిస్థితి ఎదురైంది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ మెసేజ్లో ‘2026 ఏప్రిల్ 10 లోపు ఫీజులు చెల్లించాలి. ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ రేట్ల ప్రకారం అదనపు చార్జీలు విధిస్తాం’ అని స్పష్టంగా పేర్కొంది. ఈ స్కూల్ విధించిన కొత్త నిబంధనేదో బాగుందని భావించిన మిగిలిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా ‘వడ్డీ’ విధానాన్ని అవలంబించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
సెగలు కక్కుతున్న భానుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకీ ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అధికం అవుతోంది. దీనికితోడు గాలిలో తేమ తక్కువగా ఉండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. వైఎస్సార్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తేరన్నపల్లెలో 42.3, కర్నూలు జిల్లా గూడూరులో 42.1, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.2, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఉంటుందని, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మున్ముందు మరింత తీవ్రం వచ్చే వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, దక్షిణ కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. -
ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో వసూల్రాజాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఓ వైపు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ (ఫిఫో) విధానాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు బావమరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి అడ్డదారుల్లో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా.. మరోవైపు బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటూ ఆ ట్రస్ట్లోని ఫైనాన్స్ విభాగంలో కొందరు వివిధ ఆస్పత్రుల యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ బాగోతంపై ఇటీవల ట్రస్ట్కు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. బిల్లింగ్ మీద ఒక శాతం నుంచి ఐదు శాతం వరకూ కమీషన్ను వారు ఆస్పత్రులకు ఫోన్చేసి డిమాండ్ చేస్తున్నారు. పైగా.. వెనకున్న బిల్లులను ఆన్లైన్లో ముందుగా అప్లోడ్ చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే మీ ఆస్పత్రికి ఇంత మొత్తంలో నిధులు వస్తాయని ఉప్పందించడం ద్వారా కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటాల్లో తేడా రావడంతో..ఈ బాగోతంలో ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్ సంస్థ తెలంగాణాతో పాటు, ఏపీ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్పత్రులను నడుపుతోంది. ఈ సంస్థ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పిస్తామంటూ ఫైనాన్స్ విభాగంలోని వారు కొందరు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేట్ సంస్థ ఉద్యోగి ఒకరు ట్రస్ట్ ఫైనాన్స్ విభాగంతో నిత్యం టచ్లో ఉంటూ బిల్లులను అప్లోడ్ చేయించడం, నిధులు జమ అయ్యాక కమీషన్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. బిల్లులు జమయ్యాక ట్రస్ట్కు ఇచ్చే కమీషన్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్ సంస్థ ఉద్యోగి కూడా నొక్కేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో.. ఈ ఉద్యోగిని సైడ్చేసి ట్రస్ట్ ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ఆస్పత్రి యాజమాన్యంతో నేరుగా టచ్లోకి వెళ్లి, బిల్లులు జమ అయిన వెంటనే హైదరాబాద్కు వెళ్లి ముడుపులు తెచ్చుకుంటున్నాడు. ఇది పసిగట్టిన సదరు ఉద్యోగి మొత్తం బండారాన్ని బట్టబయలు చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కార్పొరేట్ ఆస్పత్రి నుంచి గతేడాది రూ. లక్షల్లో ఫైనాన్స్ విభాగానికి కమీషన్లు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాణిజ్య పన్నుల విభాగం నుంచి డిప్యూటేషన్పై ట్రస్ట్లో పనిచేస్తున్న ఓ అధికారిపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన డిప్యూటేషన్ ముగిసినా, సదరు అధికారిపై ట్రస్ట్ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందినా ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రగిలిపోతున్న నెట్వర్క్ ఆస్పత్రులు..నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫిఫో విధానాన్ని తుంగలో తొక్కింది. ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపుల పేరిట ప్రత్యేక ఉత్తర్వులిచ్చి నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి వేగంగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం అరకొరగా చేపడుతున్న మిగిలిన చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లోను ప్రస్తావించాయి. ఇప్పుడు తాజాగా వసూళ్ల పర్వం వెలుగుచూడటంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు రగిలిపోతున్నాయి. -
విజిలెన్స్లో అచ్చోసిన అన్నదే ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి: అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అవినీతి కట్టలు తెంచుకుంటోంది. ఉత్తరాంధ్రకు చెందిన రిటైర్డ్ అధికారి ఇష్ట ప్రకారమే అంతా సాగుతోంది. ప్రభుత్వంలో కీలక నేతలుగా ఉన్న బాబాయ్, అబ్బాయ్ కుటుంబ సభ్యుడు కావడంతో విజిలెన్స్ – ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏకంగా సొంత సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఆయన వర్గంలోని అధికారులకే కీలక జిల్లా పోస్టింగులు ఇస్తున్నారు. గ్రానైట్, ఇసుక, ఇతర వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతూ ఈ సిండికేట్ బరితెగించి అవినీతికి పాల్పడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఓఎస్డీగా నియమించి.. వైజాగ్లో పోస్టింగ్ ప్రభుత్వంలో అచ్చోసిన వ్యాఖ్యలు చేసే కీలక నేత సోదరుడి ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందలం ఎక్కించింది. ఆయన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు అద నపు ఎస్పీగా పదోన్నతి కల్పించింది. అంతేకాదు ఆయన రిటైరైన తరువాత విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఓఎస్డీగా నియమించింది. సాధారణంగా ఓఎస్డీ అంటే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పోస్టింగు ఇస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఆ అధికారి కోరుకున్న ట్టుగా విశాఖపట్నంలో పో స్టింగ్ ఇస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. ఓఎస్డీగా ఆయన పదవీ కాలాన్ని ఇటీవల మరోసారి పొడిగించారు కూడా. కాగా తాజాగా గోదావరి జిల్లాల బాధ్యతలను కూడా ఆ అధికారికే కట్టబెట్టడం గమనార్హం. సిండికేట్లోని సొంత వర్గీయులకే కీలక పోస్టింగ్లు ఇక ఆ అధికారి రాష్ట్రవ్యాప్తంగా తన వర్గీయులైన అధికారులతో ఓ సిండికేట్ను ఏర్పాటు చేశారు. ఆ సిండికేట్లోని అధికారులకే మైనింగ్, గ్రానైట్, ఇతర కీలక వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్న జిల్లా అధికారులుగా పోస్టింగ్లు ఇస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులుగా ఆయన వర్గీయులకే పోస్టింగులు దక్కడం గమనార్హం. ఆ జిల్లాల్లోనే భారీగా ఇసుక, గ్రానైట్, ఇతర మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయి.అవే ప్రాంతాలు రియల్ ఎస్టేట్, బంగారం, వస్త్ర వ్యాపారాలకు కేంద్ర స్థానాలుగా ఉన్నాయి. ఇసుక, గ్రానైట్, మైనింగ్ వ్యాపారుల నుంచి ఈ సిండికేట్ భారీగా వసూళ్లకు పాల్పడుతోంది. తమ అధికార పరిధిని అతిక్రమించి మరీ రియల్ ఎస్టేట్, బంగారం, వస్త్ర, ఇతర వ్యాపారులను తనిఖీల పేరుతో వేధిస్తున్నారు. ఆ ముసుగులో వారి నుంచి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నారు.ఉన్నతాధికారి అండతోనే వసూళ్ల దందా ఈ సిండికేట్కు విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ విభాగం కీలక ఉన్నతాధికారి పూర్తి దన్నుగా నిలుస్తున్నారు. తన చేతికి మట్టి అంటకుండా సిండికేట్ మొత్తం వసూళ్ల దందా సాగిస్తుండటమే అందుకు కారణం. ఆ ఉన్నతాధికారిని తగిన రీతిలో సంతృప్తిపరుస్తూ ఈ విజిలెన్స్– సిండికేట్ ఇష్టారాజ్యంగా దందాకు పాల్పడుతోంది. అందుకే ఆ కీలక ఉన్నతాధికారి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి రెగ్యులర్ అధికారిని నియమించకుండా తన గుప్పిట్లోనే ఉంచుకున్నారని కూడా అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఇప్పుడిక పశుసంవర్ధక సహాయకుల వంతు
సాక్షి, అమరావతి: రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకే) ద్వారా పాడి రైతులకు గ్రామ స్థాయిలో వెన్నుదన్నుగా నిలుస్తున్న గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ)పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. వైఎస్ జగన్ హయాంలో నియమితులైన 6,105 మందిలో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారని ఒక్క ఫిర్యాదు అందడంతో ఇదే అదునుగా ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి, వారిని తొలగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ (ఐవీఆర్ఎస్ సర్వే) పేరిట గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిపై సస్పెన్షన్ల వేటు వేస్తూ వేధింపులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఏహెచ్ఏలను సాగనంపేందుకు గురిపెట్టింది. రాతపరీక్షలు, సర్టీఫికెట్ల పరిశీలనల తర్వాతే తమను నియమించారని, ఇప్పుడిలా వేధింపులకు గురిచేయడం ముమ్మాటికి తమ మనోభావాలను దెబ్బతీయడమేనని వీఏహెచ్ఏ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సహాయకులకు సర్కార్ సహాయ నిరాకరణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ) పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఒక్కో సహాయకునికి 3–4 గ్రామాలు మ్యాపింగ్ చేశారు. సర్వేల పేరిట వీరిని అడ్డమైన పనులకు వినియోగించుకుంటూ వేధిస్తున్నారు. 2023లో మూడో విడతలో పోస్టింగ్లు పొందిన 1,896 మందికి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీతో ప్రొబేషన్ పిరియడ్ పూర్తయ్యింది. మార్చి నుంచి వారికి పే స్కేల్ వర్తింపచేయాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు రెండేళ్లుగా సకాలంలో జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రేపో మాపో ప్రొబేషన్ కన్ఫర్మ్ చేస్తారని, పే స్కేల్ వర్తింప చేస్తారన్న ఆశతో పనిచేస్తున్న దశలో ‘నకిలీ’ అభాండం వారిని కుంగదీస్తోంది. పటిష్ట ప్రక్రియతో నియామకం ఏ ప్రభుత్వ ఉద్యోగయినా నోటిఫికేషన్ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటారు. రాత పరీక్షల్లో మెరిట్.. ఇంటర్వ్యూలలో అర్హత.. సర్టిఫికెట్ పరిశీలన.. తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుకుంటారు. పశుసంవర్ధక సహాయకుల నియామకాలు కూడా ఇలా జరిగినవే. జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ), పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందడమే కాదు, నిర్దేశిత జీవో ఆధారంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా జరిగిన సర్టీఫికెట్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియల ద్వారా అర్హుల ఎంపిక జరిగింది. పైగా ప్రతీ ఉద్యోగికి నాలుగు నెలల శిక్షణ అనంతరం శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అర్హత పరీక్ష నిర్వహించారు. తరువాత వారు ఆర్ఎహెచ్ఎసీ (రీజనల్ యానిమల్ హజ్బెండరీ ట్రైనింగ్ సెంటర్) లో పశువులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రత్యేక శిక్షణ కూడా పొందారు. నాడు ఓకే అన్న అధికారులే నేడు ‘నకిలీ’ అంటున్నారు ఉద్యోగుల్లో దాదాపు 1,200 మంది నకిలీ సర్టీఫికెట్లతో చేరారంటూ ఏపీ వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ పీవీ లక్ష్మయ్య చేసిన ఆరోపణలతో తాజా కుట్ర ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అప్పట్లో ప్రతి సర్టిఫికెట్ను క్షుణ్ణంగా పరిశీలించి, నియామకాలకు ఓకే చెప్పిన అధికారులే ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత ఉద్యోగులపై ‘నకిలీ’ ముద్ర వేస్తున్నారు. లోకాయుక్త పేరిట భయ భ్రాంతులకు గురిచేస్తున్నారు.పైగా ఏప్రిల్ 25వ తేదీలోగా ఈ నకిలీల నిగ్గు తేల్చాలంటూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి.దామోదరనాయుడు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారులకు ఈ నెల 6వ తేదీన సర్క్యులర్ జారీచేయడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ డైరెక్టర్గా కొనసాగుతున్న వ్యక్తి ఈ తరహా వేధింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఆర్బీకేలను నిరీ్వర్యం చేయడం, టీడీపీ కార్యకర్తలను సాధ్యమైనంతమేర నింపుకోవడం ఈ వేధింపుల వెనుక కుట్రగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పాడి రైతులకు జగన్ సర్కార్ వెన్నుదన్నుసచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలిచేందుకు గ్రామానికి ఒక గ్రామ పశుసంవర్ధక సహాయకుని (వీఏహెచ్ఏ)నియామకానికి శ్రీకారం చుట్టింది. 7,272 ఆర్బీకేల్లో పాడి సంపద అధికంగా ఉన్నట్టుగా గుర్తించగా, మూడు విడతల్లో 6,105 మంది వీఏహెచ్ఏలను నియమించింది. మిగిలిన చోట్ల గోపాలమిత్రలు, ఆర్ఎల్యూ సిబ్బంది సేవలను అనుసంధానం చేశారు. పశువైద్యసేవల కోసం ప్రతీ ఆర్బీకేలో ప్రత్యేకంగా రూ.10 వేల విలువైన ట్రెవీస్ (ఇనుప చట్రాలు)ను ఏర్పాటు చేశారు.పశువీర్యాన్ని నిల్వ చేసేందుకు రూ.16.90 కోట్ల ఖర్చుతో లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లను సమకూర్చారు. ప్రతీ నెలా రూ.2,700 చొప్పున ఏడాదికి రూ.32,400 విలువైన 105 రకాల మందులను అందుబాటులో ఉంచేవారు. ఇలా 4 ఏళ్లలో రూ.50 కోట్ల విలువైన మందులను సరఫరా చేశారు. పాడి రైతులు ఫోన్ చేయగానే క్షణాల్లో వారి గడపవద్దకు వెళ్లి ప్రాథమిక వైద్యసేవలందించేవారు. ఇప్పుడు ఆ స్వర్ణయుగాన్ని గుర్తుతెచ్చుకుంటూ రైతులు మళ్లీ జగన్ పాలన రావాలని కోరుకుంటున్నారు. -
‘పచ్చ’ నేతలకు జీ హుజూర్!
సాక్షి, అమరావతి: ప్రాణాలకు రక్షణ కల్పించండి అని పోలీసు స్టేషన్లో బాధితుడు గగ్గోలు పెట్టినా దిక్కులేదు.. కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఓ యువతి కన్నీరు పెట్టుకున్నా పట్టించుకోనే పరిస్థితి లేదు.. ఫలితంగా ఆ ఇద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో పోలీసుల తీరు ఇది. అసలు ప్రజల భద్రత తమ బాధ్యతే కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అధికార టీడీపీ కూటమి రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడానికి అలవాటుపడ్డ పోలీసు శాఖ.. అసలు వృత్తి ధర్మాన్ని విస్మరిస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారుతున్నాయి. సామాన్యుల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఘటనలు ఇలా ఉన్నాయి.రక్షణ కల్పించమంటే ముఖం చాటేసిన పోలీసులుతన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసు స్టేషన్లోనే బాధితుడు వేడుకున్నా కడప పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించలేని పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. గంజాయి బ్యాచ్ ఏకంగా కడపలోని రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ ఆ యువకుడిని హత్య చేసింది. కడపలోని అలంకాపల్లిలో 4వ తేదీన జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. జాతర సందర్భంగా ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిసినా, ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జాతరలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే పోలీసులు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు.మరోసారి ఆ వర్గాలు ఘర్షణ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇరువర్గాల మధ్య గత ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. ఏకంగా గంజాయి బ్యాచ్లు రంగంలోకి దిగి కత్తులు పట్టుకుని మరీ వీరంగం సృష్టించాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు.. ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. గంజాయి బ్యాచ్ చేతిలో తీవ్రంగా గాయపడిన పెద్ద దస్తగిరిని కూడా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లడం గమనార్హం. ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలనే విషయాన్ని పోలీసులు పట్టించుకోనేలేదు. కాసేపటి తర్వాత వారిని ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు. తాను బయటకు వెళితే గంజాయి బ్యాచ్ చంపేస్తుందని ఆయన వాపోయారు.అయినా పోలీసులు వినిపించుకోలేదు. ‘పోలీస్ స్టేషన్లో ఉండొద్దు.. వెళ్లిపోండి.. రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మీరే చికిత్స చేయించుకోండి’ అని ఆదేశించారు. కనీసం రిమ్స్ ఆస్పత్రి వరకు తోడు రావాలని ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో పెద్ద దస్తగిరి ఒక్కరే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన్ను ఆసుపత్రి సిబ్బంది వార్డులో చేర్చుకుని చికిత్స చేశారు. కాగా అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి బ్యాచ్ ఏకంగా రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరీ దస్తగిరిపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. అందరూ చూస్తుండగానే కత్తులతో స్వైర విహారం చేసి పాశవికంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది.తన ప్రాణాలకు హాని ఉందని పెద్ద దస్తగిరి ఎంతగా చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటుచేసుకుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన ఇరువర్గాలను వెంటనే పంపించి వేయాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశించారు. దాంతోనే బాధితులు తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎంతగా వాపోయినా సరే పోలీసులు పట్టించుకోకుండా బయటకు వెళ్లగొట్టారు. ఫలితంగా గంజాయి బ్యాచ్ బరితెగించి హత్యకు పాల్పడింది. టీడీపీ నేతల అండదండలు ఉన్న గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించడంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారి తటపటాయించారని తెలుస్తోంది. టీడీపీ నేతల ఒత్తిడితోనే బాధితులను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పంపించి వేశారని సమాచారం.ప్రాణహాని ఉందన్నా పోలీసులు బేఖాతరుకుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఓ కొత్త పెళ్లి కూతురు ఎంతగా వేడుకున్నా పల్నాడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకంగా ఓ పరువు హత్యకు సహకరించడంతో యావత్ రాష్ట్రం విభ్రాంతికి గురైంది. ఈ ఉదంతం బయట పడటంతో సీఐని సస్పెండ్ చేసి పోలీసు శాఖ కనికట్టు చేస్తోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాలతోనే ఆ సీఐ అలా వ్యవహరించారని సమాచారం. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి, జమ్మలమడకకు చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చౌడేశ్వరి కనిపించడం లేదని ఆమె తండ్రి చంద్ర శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేజర్లు అయిన చౌడేశ్వరి, నాగరాజు వివాహం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. వారిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ద్వారా కథ నడిపించారు. ఆమెను తమకు అప్పగించేలా మాచర్ల పోలీసులను ఆదేశించాలన్నారు. టీడీపీ నేతల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి సమ్మతించారు. మాచర్ల సీఐ వెంకటరమణతో కూడా చంద్ర శ్రీను డీల్ కుదుర్చుకున్నారు. ఆయనకు రూ.6.50 లక్షలు లంచం ఇచ్చారు. ఓ వైపు పోలీసు ఉన్నతాధికారి ఆదేశించగా, మరోవైపు భారీగా లంచం కూడా ముట్టడంతో సీఐ వెంకటరమణ చెలరేగిపోయారు. ఈ క్రమంలో చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, చంపేస్తారని తాను వెళ్లనని ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినా సీఐ తురకా వెంకట రమణ వినిపించుకోలేదు. మేజర్ అయిన తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నానని చెప్పినా వినకుండా చౌడేశ్వరిని తీవ్రంగా బెదిరించారు.ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫలితంగా తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని చంద్ర శ్రీను గత నెల 18న హత్యచేశారు. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పరువు హత్య వ్యవహారం, అందుకు సహకరించిన సీఐ వెంకటరమణ బాగోతం బయట పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు శాఖ సీఐ వెంకటరమణను సస్పెండ్ చేసింది. కానీ చౌడేశ్వరిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆయన పాత్రను పోలీసు శాఖ కప్పిపుచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత కాదన్నట్టుగా పోలీసు శాఖ వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. -
అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని, ప్రభుత్వం చేతిలో ఉన్న ఐదు వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ విలువ ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.50 వేల కోట్లు పైమాటేనంటూ కాకి లెక్కలతో నమ్మించటానికి యత్నించి సీఎం చంద్రబాబు మరోసారి అడ్డంగా దొరికిపోయారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతిపై ద్వేషంతోనే వైఎస్సార్సీపీ విమర్శలు చేస్తోందంటూ చంద్రబాబు మరోసారి పచ్చి అబద్ధాలాడుతున్నారని ధ్వజమెత్తారు.అమరావతి పేరుతో రాష్ట్రాన్ని శాశ్వతంగా అప్పుల ఊబిలో ముంచే చంద్రబాబు మార్క్ ‘ఎండమావి’ కావాలా? లేక అందులో పదో వంతు ఖర్చుతో (అది కూడా దశలవారీగా) రాష్ట్ర రాజధానిని అతి స్వల్ప కాలంలోనే అగ్రశ్రేణి నగరాల సరసన నిలిపే జగన్ మార్క్ గ్రోత్ ఇంజన్ ‘మావిగన్’ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.అమరావతిలో చంద్రబాబు ఇంటి కోసం కొనుగోలు చేసిన 25 వేల గజాల (5 ఎకరాలు) స్థలం ధర గజం రూ.7,500 మాత్రమే. దస్తావేజుల ప్రకారం ఎకరం భూమి విలువ రూ.3.63 కోట్లు. నిజానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ రికార్డుల (ఎస్ఆర్ఓ) ప్రకారం గజం ధర రూ.6 వేలు మాత్రమే. ఆ ప్రకారం అక్కడ ఎకరం భూమి విలువ రూ.2.91 కోట్లు. చంద్రబాబు కొనుగోలు చేసిన ధర ప్రకారం ఐదు వేల ఎకరాలు అమ్మితే వచ్చేది దాదాపు రూ.18 వేల కోట్లు మాత్రమే. అంతకు మించి పైసా రాదు. రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? అమరావతిలో చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్ట్ల విలువ రూ.50 వేల కోట్లకు పైనే. అక్కడ రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన చెబుతున్న ప్రకారమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది అంతా అప్పులు చేసే. ఇంకా తెచ్చేది కూడా అప్పే. దానికి వడ్డీ లెక్క వేస్తే రూ.2 లక్షల కోట్లకు ఏటా రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అవుతుంది. ఎకరం రూ.20 కోట్లు పలికేలా అభివృద్ధి చెందడానికి 20 ఏళ్లు పడుతుందని చంద్రబాబు చెబుతుండగా 15 ఏళ్లు పడుతుందని ఆయన కుమారుడు అంటున్నారు. అప్పటికి వడ్డీ రూ.3 లక్షల కోట్లో రూ.4 లక్షల కోట్లో అవుతుంది. ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్లీ అప్పు చేయాల్సిందే కదా? చంద్రబాబు ఆయన కోసం సంపద సృష్టించుకుంటే, రాష్ట్రం మీద పడే భారం మాటేమిటి? దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. -
విద్యాశాఖ అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బోధన నుంచి పరీక్షల నిర్వహణ వరకు పద్ధతి లేకుండా అస్తవ్యస్తం చేశారు. ఇష్టారీతిన చేస్తున్న ప్రయోగాలతో అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు ప్రయోజనం లేకపోగా.. అదనపు భారంతో అవస్థలు పడుతున్నారు. పాఠశాల విద్యలోనూ, ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో ఇవే విధానాలు కొనసాగుతున్నాయి. ఎక్కడైనా శాఖలో వ్యతిరేక ఫలితాలు వస్తే దానిపై సంబంధితశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించి తప్పులను సరిచేస్తారు. కానీ విద్యాశాఖలో మాత్రం అన్నీ అధికారులకు అప్పగించి మంత్రి చోద్యం చూస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో మొదలైన ప్రయోగాలు వికటించి ఆయా స్కూళ్లు మూతబడే స్థితికి చేరుకున్నాయి.జూన్లో ప్రారంభించాల్సిన విద్యాసంవత్సరాన్ని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏప్రిల్ ఒకటినే ప్రారంభించారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా, లెక్చరర్లు లేకుండా బోధన మాత్రం జరిగిపోతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఒక విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ఒకసారి, 1–9 తరగతుల వార్షిక పరీక్షలు ఒకేసారి జరుగుతాయి. అలాగే విద్యాసంవత్సరం జూన్ రెండోవారంలో ప్రారంభమవుతుంది. కానీ గత విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో ఏడాది విద్యార్థులకు విద్యాసంవత్సరం ప్రారంభిస్తున్నారు.అన్ని కాలేజీల్లోనూ ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించాలని సిలబస్ సైతం ఇచ్చారు. ఈ సమయంలో జూనియర్ లెక్చరర్లు వార్షిక పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం విధుల్లో ఉన్నారు. మూల్యాంకనం జూనియర్ కాలేజీల్లోనే జరుగుతుండడంతో విద్యార్థులను అనుమతించే పరిస్థితి కూడా లేదు. మరోపక్క అవసరమైన పాఠ్యపుస్తకాలు సైతం ప్రభుత్వం ఇవ్వకుండా తరగతులు ఎలా నిర్వహిస్తుందనే విషయం ఎవరికీ అంతుబట్టని అంశంగానే మిగిలిపోయింది. వేసవి ఎండల్లో కాలేజీలకు విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో తరగతులను ఎవరికి కోసం.. ఎందుకోసం తలపెట్టారో ఎవరికీ అర్థం కావడం లేదు. పరీక్షలతోనూ ప్రయోగాలు.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి పరీక్షలు జరిపే విధానం కూడా ఈ ఏడాది అస్తవ్యస్తంగా తయారైంది. విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారి 9వ తరగతికి ఒకసారి, 6, 7, 8 తరగతులకు మరోసారి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ స్కూల్ అసిస్టెంట్లే చూడాలి. కానీ ఈ ఏడాది ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. తొమ్మిదో తరగతికి మార్చి 2 నుంచి 12వ తేదీ వరకు ఎస్ఏ–2 పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఆ విద్యార్థులకు పదో తరగతి సిలబస్ ఏప్రిల్ 23 వరకు బోధించాలని ప్రత్యేకంగా బ్రిడ్జి కోర్సు రూపొందించారు. ఈ బోధన ప్రారంభం కాకుండానే పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభించడంతో స్కూల్ అసిస్టెంట్లు, ప్రధాన ఉపాధ్యాయులు పబ్లిక్ పరీక్షల విధుల్లో నిమగ్నమయ్యారు. దీంతో 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు బోధనను గాలికి వదిలేశారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిశాయి. అనంతరం బ్రిడ్జి కోర్సు బోధన చేపట్టాలని భావించినా ఏప్రిల్ 6 నుంచి పదోతరగతి మూల్యాంకనం ప్రారంభమైంది.స్కూల్ అసిస్టెంట్లు అందరికీ ఆ విధులు అప్పగించారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 6వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. ఉపాధ్యాయుల కొరతతో ఒకే గదిలో మూడు తరగతులకు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క మూల్యాంకనం, ఇంకోపక్క ఉన్నత తరగతులకు పరీక్షలు, మరోపక్క తొమ్మిదో తరగతికి బ్రిడ్జికోర్సు బోధన ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేకుండా విధానాలు అమలు చేయడంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. -
చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతుల అల్టిమేటం
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. -
‘ఉపాధి’కి పచ్చ చెదలు!
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో 2017–19 మధ్య వందకు పైగా పండ్ల తోటల పెంపకం పనుల పేరిట 2025 ఆగస్టులో ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు మురళి ఒక్కరే లక్షల రూపాయలకు బిల్లులు పెట్టుకొని ఉపాధి హామీ పథకం నుంచి నిధులు దండుకు న్నారు. బండమీదపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 60 పనులకు రూ.7,28,276, చెర్లోపల్లెలో 18 పనులకు రూ.2,64,909, మండల కేంద్రమైన రాప్తాడులో 17 పనులకు రూ.1,20,807, హంసాపురంలో 21 పనులకు రూ.83,847.. ఇలా పలు గ్రామాల్లో పనులకు ఆయన పేరిట బిల్లుల చెల్లింపు కూడా పూర్తయింది. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు ‘ఉపాధి’ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్లలో దోపిడీ పర్వాన్ని యథేచ్ఛగా కొనసాగించారు. కూలీలతో చేయించే పనులే కాకుండా, రోడ్ల నిర్మాణం తదితర మెటీరియల్ కేటగిరీ పనుల్లో సైతం కాంట్రాక్టర్ల వ్యవస్థకు ఈ పథకంలో తావుండదు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో లేదా వివిధ ప్రభుత్వ విభాగాల ప్రత్యేక పర్యవేక్షణలో ఆ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే 2014–19 మధ్య జరిగిన మొత్తం 4,47,344 పనులకు సంబంధించి రూ.331.66 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం 2024 నవంబర్ 6న మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అదే నెల 15న ఆదేశాలు జారీ చేసింది. వాటికి సంబంధించి 2025 ఆగస్టులో దాదాపు రూ.300 కోట్ల దాకా చెల్లింపులు పూర్తయ్యాయి. అప్పట్లో వివిధ గ్రామ పంచాయతీల పేరుతో జరిగిన పనులకు సంబంధించి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి టీడీపీ నాయకులు పలువురు పెద్ద సంఖ్యలో నేరుగా ‘వెండార్’ పేరిట బిల్లులు పెట్టుకొని డబ్బులు దండుకున్నారు. కొన్ని చోట్ల ఎంపీడీవోలు లేదా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. 90 శాతం వెండార్లకు జీఎస్టీనే లేదు2014–19 మధ్య కాలానికి ఉపాధి హామీ పథకం నిధుల చెల్లింపులకు ఉన్న నిబంధనల్లో 2021 తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. మారిన నిబంధనల ప్రకారం ఈ పథకంలో ఏ పనికి సంబంధించిన బిల్లులైనా నేరుగా ఆ పనికి అవసరమైన వస్తువులు సరఫరా చేసే వెండార్ (సరఫరాదారుడు లేదా వ్యాపారి)కు లేదంటే పని చేసే కూలీలకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ పనుల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వెండార్ల పేర్లు, బ్యాంకు అకౌంట్ల వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పాత బకాయిల పేరిట వందల కోట్ల రూపాయలు టీడీపీ నేతలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రామాల్లో టీడీపీ నేతలకు వెండార్ల ముసుగు వేసింది. ఆయా టీడీపీ నేతల పేర్లనే సిమెంట్ తదితర వస్తువులు సరఫరా చేసే, సేవలు అందించే వ్యాపారవేత్తలంటూ నమోదు చేయించింది. ఈ పథకం కింద వెండర్ల పేర్లను నమోదు చేసే అధికారం మండలాల్లో ఎంపీడీవోలకే ఉండటంతో అధికార పార్టీ పెద్దలు ఇష్టమొచ్చినట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులకు వివిధ రకాల వస్తువులు, సామగ్రి తదితర వస్తువులు సరఫరా చేసే వెండార్లుగా దాదాపు 14 లక్షల మంది పేర్లు నమోదయ్యాయి. ఇందులో ఏకంగా 13.94 లక్షల మంది వెండార్లకు కనీసం జీఎస్టీ నంబరు కూడా లేదని అధికార గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ లెక్కన దోపిడీ ఎలా సాగిందో ఇట్టే స్పష్టమవుతోంది. మూసిన రికార్డులు తెరిపించి మరీ బిల్లులు ఉపాధి పనుల మంజూరు, పురోగతి, బిల్లుల నమోదు, చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. 2014–19 మధ్య జరిగిన పనులకు బిల్లుల చెల్లింపులు జరిగి ఆ పనుల నిర్వహణ అన్ని దశల్లో పూర్తయినట్టు కేంద్రం వెబ్సైట్లో సైతం నమోదు చేసింది. అయినప్పటికీ బకాయిల పేరిట టీడీపీ నేతలకు నిధులను దోచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖ రాసి పనుల రికార్డులను తిరిగి ఓపెన్ చేయించింది. -
ఖాకీ ముసుగేసుకున్న కీచకుడు
సాక్షి, నరసరావుపేట: మహిళలకు అండగా నిలవాల్సిన రక్షకభటులే వారి పాలిట కీచకులుగా మారిన ఉదంతం రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఏకాంతంగా ఉండే జంటల వీడియోలు తీసి.. వారిని బెదిరించి నగదు గుంజుకోవడంతోపాటు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని పరువు హత్యకు కారణమైన సీఐ వెంకటరమణ వ్యవహారం మరువక ముందే మాచర్లలో మరో ప్రబుద్ధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. టౌన్ పోలీసుస్టేషన్ ఏఎస్ఐగా పనిచేస్తున్న శ్రీనివాసరావు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గస్తీ పేరుతో పర్యాటక, నిర్మానుష్య ప్రాంతాల్లో తిరుగుతుంటారు. ఏకాంతంగా గడపటానికి వచ్చిన ప్రేమజంటలతోపాటు భార్యాభర్తల వీడియోలు తీసి వారిని బెదిరిస్తుంటాడు.‘స్టేషన్కు పదండి’ అని గద్దిస్తూ బాధితులను భయపెట్టి నగదు గుంజుకునే ప్రయత్నం చేస్తాడు. అతడి మాటల్ని ఖాతరు చేయని వారి వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించి వారినుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నాడు. కొందరు మహిళలను లైంగికంగా కూడా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాగిన మత్తులో ఏఎస్ఐ శ్రీనివాసరావు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించిన వీడియోలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఓ నవజంట సరదాగా రోడ్డు పక్కన బండిమీద కూర్చుని మాట్లాడుతుండగా ఏఎస్ఐ వారిని బెదిరించిన తీరును చూస్తుంటే అతడు ఎంతటి దుర్మార్గుడో అర్థమవుతోంది. ఆటోడ్రైవర్ సాయంతో.. ఏఎస్ఐ శ్రీనివాసరావు ప్రేమ జంటల వీడియోలు తీసి, ఆ తరువాత విచారణ పేరుతో వారి నుంచి డబ్బు గుంజేవాడు. యువతులకు ఫోన్చేసి తన కోరిక తీర్చకపోతే వీడియోలు బయటపెడతానని బెదిరించి పలువురి మహిళలను ఇబ్బందులకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో వీడియోలు తీయడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సైదులును సహాయకుడిగా నియమించుకున్నాడు. ఏఎస్ఐ చేసిన దుర్మార్గాలను సైతం ఆటో డ్రైవర్ వీడియోలు తీయడంతో ఈ వ్యవహారం బయటపడింది.నిత్యం రాత్రివేళ ఆటోలో కానిస్టేబుళ్లు, హోంగార్డులతో ఏఎస్ఐ హైవేలపై సంచరించేవాడు. ఎవరు కనిపించినా బెదిరించి దౌర్జన్యం చేసేవాడు. అతిగా మద్యం సేవించడమే కాకుండా వాహనాలు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తానని డబ్బులు గుంజేవాడు. వ్యభిచార గృహాలపై దాడులు చేసి వారినుంచి డబ్బులు వసూలు చేయడంతోపాటు అక్కడి మహిళలపైనా లైంగికంగా వేధింపులకు దిగాడు. పోక్సో కేసు ఉన్నా పోస్టింగ్లోనే.. గతంలోనూ ఏఎస్ఐ శ్రీనివాసరావుపై లైంగిక ఆరోపణలున్నాయి. ఇప్పటికే అతనిపై మేడికొండూరు పోలీసుస్టేషన్లో పోక్సో కేసు నమోదు కాగా.. వాయిదాల నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయిఆ అధికారులు అతనికి పోస్టింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రవర్తన మార్చుకోకుండా స్టేషన్కు వచ్చే బా«ధిత మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడని తోటి ఉద్యోగులు చెబుతున్నారు.ఫిర్యాదుదారులకు ఫోన్లుచేసి సమస్య పరిష్కరిస్తానని.. తన కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేసేవాడని బా«ధిత మహిళల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. అయితే, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏఎస్ఐ ఆగడాలు పెచ్చుమీరాయి. ఎక్కడ పనిచేస్తే అక్కడ మహిళలతో వివాహేతర సంబంధాలు నెరపడం ఏఎస్ఐ అలవాటుగా మార్చుకున్నాడు. ఇతనిపై గతంలో భార్య సైతం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు కాగా.. మాచర్ల టౌన్ ఏఎస్ఐ శ్రీనివాసరావు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరలై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసుశాఖ స్పందించింది. ఏఎస్ఐ శ్రీనివాసరావుపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ వేటు వేశారు. అతనిపై పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. మరోవైపు ఏఎస్ఐతో పాటు ఇదే స్టేషన్లో పనిచేసే మరో అధికారి, మరికొందరు సిబ్బంది సైతం ఇదే తరహా వ్యవహారాలు చేస్తున్నారని, వారిపైనా విచారణ జరపాలని మాచర్ల వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్ పనులను టెండర్లలో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్ను డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. టెండర్ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్ కనెక్షన్ ఇంజినీరింగ్, ప్రిసిసిన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్ స్ట్రక్చరల్ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్కు సమీపంలో శామీర్పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్ పుడ్స్కు ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ ప్లాంట్ను సీహెచ్ సీతారాం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.హెరిటేజ్కు ఐస్క్రీమ్ ప్లాంట్ను నిర్మించిన భీమాటెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.కానీ.. భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కు హైదరాబాద్కు సమీపంలోని శామీర్పేట్ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపుముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎన్సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. -
అమరావతి x మావిగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి రోజు నుంచే పరుగులుఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.అందుబాటులో అన్ని మౌలిక వసతులుమావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధిచెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. -
మొక్కల పేరుతోనూ మంత్రి నారాయణ మేత
నెల్లూరు రూరల్: నెల్లూరు నగరపాలక సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. మొక్కుబడిగా మొక్కలు నాటి ఏకంగా రూ.60 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. 48 వేల మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు, నీరుపోసే పేరుతో మంత్రి నారాయణ ఒక్కో మొక్కకు ఏకంగా రూ.12,500 ఖర్చు చేస్తూ.. రూ.60 కోట్ల నిధులు మేసేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్కో మొక్కకు చేసిన ఖర్చు కేవలం రూ.750 మాత్రమేన్నారు. శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరులో మొక్కల నాటే కార్యక్రమం పేరుతో భారీ దోపిడీకి మంత్రి నారాయణ వ్యూహరచన చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడని పనులతో యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు.టీడీపీ నేతలకే కాంట్రాక్టులిచ్చి .. నగరంలో తొలి విడతలో 14,741 మొక్కలకు సంబంధించి టీడీపీకి చెందిన 25 మంది కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చారని, మొదటి విడతలో నాటిన చెట్లకు రూ.8.03 కోట్లు చెల్లించారని చంద్రశేఖర్రెడ్డి చెప్పారు. ఒక్కో మొక్క నాటి దానికి ట్రీగార్డు ఏర్పాటు చేసేందుకు రూ.5,500 ఖర్చుచేస్తే.. ఒక డివిజన్లో 1,800 మొక్కలకు నీళ్లు పోయడానికి రూ.1.24 కోట్ల కేటాయించారన్నారు. ఈ లెక్కన ఒక్కో మొక్కకు నీరు పోసేందుకే రూ.6,888 ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.12,500 పైగా ఖర్చు చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు.మంత్రి నారాయణ కేవలం 12 అడుగుల రోడ్డులో ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నారని, ఈ మొక్కలకు రెండు నెలలే ఆకులు, పూలు ఉంటాయని, ఆక్సిజన్, నీడను ఇవ్వని ఇలాంటి చెట్ల వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. సిమెంట్ రోడ్డును కట్చేసి మొక్కలు నాటుతున్నట్టు టెండర్లలో పేర్కొంటూ గ్రావెల్ రోడ్డులో నాటుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నాటిన మొక్కలకు మెష్ ఏర్పాటు చేసి బిల్లులు పెట్టుకున్నారని చెప్పారు. ఎవరైనా వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు మొక్కలు నాటుతారని.. నారాయణ మాత్రం బిల్లులు వస్తే చాలన్నట్టు మండే ఎండల్లో నాటిస్తున్నారని ధ్వజమెత్తారు.మరో వైపు పన్నుల పేరుతో నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్పై కోడి గుడ్లు అమ్మకుంటున్న చిరు వ్యాపారిని ఆక్రమణ పేరుతో పెనాల్టీ వేశారని, ఒక దగ్గర నేమ్ బోర్డు ఒక అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారని, ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటిబిల్లు రూ.350 కట్టలేదని పైప్లైన్ కట్ చేసి డమ్మీలు పెట్టారని వివరించారు. ‘ఎన్’ టీమ్తో దోపిడీకి మాస్టర్ ప్లాన్ అవినీతి, దోపిడీ విషయాల్లో నారాయణ ‘మాస్టార్’ ప్లాన్ సక్సెస్గా కొనసాగుతోందని చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్’ టీమ్ దోచుకుతింటోందన్నారు. స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే.. పెయింటింగ్స్, ట్రాఫిక్ సిగ్నల్స్, బయోటాయ్లెట్, చెత్తను తరలించే ట్రాక్టర్లు, సిల్ట్ క్లీనింగ్, దోమల నివారణ, ఎండ్ టు ఎండ్ రోడ్, ప్యాచ్వర్కులు ఇలా అన్నింట్లోనూ రూ.వందల కోట్ల పనులు నామినేటెడ్ కింద తన వారికి ఇప్పించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే జాఫర్ సాహెబ్ కెనాల్, వీఆర్ కాలేజీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుకొచ్చామని చెప్పారు. -
చేయించేది.. నిందలు వేసేది నారా బాబే!
సాక్షి, అమరావతి: హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు తెరతీసిందే చంద్రబాబు అని, ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం అని వక్కాణిస్తున్నారు. గతంలో రౌడీలు, అసాంఘిక శక్తుల పరస్పర ఘర్షణల్లో అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలకు తెగబడే ఒరవడిని తీసుకువచ్చింది మాత్రం కచ్చితంగా చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు గతంలోనే కుండబద్దలు కొట్టారు.అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడే విధానాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసిందీ చంద్రబాబే అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. ఇక తన ప్రభుత్వ హయాంలో ఇంకెతంగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం అని పలు ఘటనలను ప్రస్తావిస్తున్నారు. నాడు విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లో అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చకొచ్చిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి.. 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు.కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వా«దీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి.. అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం.. అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబుపైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరుస్తోంది. పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్య టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథ రామ్పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మారణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథ రామ్ను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు.కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథ రామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథ రామ్ హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనుక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. రంగా హత్య కుట్రదారు చంద్రబాబే చంద్రబాబు హత్యా రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహన రంగా దారుణ హత్యే అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజా నాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన అప్పటి హామ్ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెర తీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మూకలు నరికి చంపాయి.ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు అండతో టీడీపీ మద్యం సిండికేట్కు రింగ్ మాస్టర్గా దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజులపాటు చంద్రబాబే హైదరాబాద్లో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది.ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం. ప్రతిపక్షంలో ఉంటే బాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం.బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షిపిల్లనిచ్చిన సొంత మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోవడంతో పాటు చంద్రబాబు సీఎం కావడం వెనుక సత్యాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు. ఒక చరిత్ర కొన్ని నిజాలు – సత్యానికి మరో కోణం పుస్తకాల్లో బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారు. ఆగస్టు తిరుగుబాటులో చంద్రబాబు పోషించిన పాత్రను దగ్గుబాటి బట్టబయలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో వివరించారు. -
అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం
అమరావతి: ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్లో హెరిటేజ్ కొత్త యూనిట్ను నిర్మించిన భీమా ఇన్ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్లో కొత్త హెరిటేజ్ యూనిట్ను భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్ హెరిటేజ్, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్ యూనిట్ పూర్తి చేసినట్లు భీమా ఇన్ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమా ఇన్ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. -
ఏపీపై బట్టబయలైన చంద్రబాబు కపట ప్రేమ
సాక్షి,అమరావతి: ఏపీపై సీఎం చంద్రబాబు కపట ప్రేమ బట్టబయలైంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తూనే, పెట్టుబడులను మాత్రం తెలంగాణలో పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.తెలంగాణలో హెరిటేజ్ సంస్థ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేసింది. శామీర్పేటలో 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పుతో హెరిటేజ్ ఐస్క్రీమ్ ప్లాంట్ను ప్రారంభించింది. ఈ ప్లాంట్లో చంద్రబాబు కుటుంబం రూ.204 కోట్ల పెట్టుబడి పెట్టింది. వచ్చే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రూ.500 నుంచి రూ.700 కోట్ల వరకు పెంచాలని నిర్ణయించింది.అయితే, కొత్త ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు కుటుంబం ఆసక్తి చూపలేదని విమర్శలు వస్తున్నాయి. సొంత రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోయినా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తనని చూసే ఏపీకి పెట్టుబడులు వస్తాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు.. తన కుటుంబ వ్యాపారాన్ని మాత్రం తెలంగాణలో విస్తరించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. -
కీసర టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా: కీసర టోల్గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్గేటు దాటే సమయంలో బీఎండబ్ల్యూ కారు (టీఎస్09ఎఫ్టీ662)పై ట్యాంకర్ పడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి, వారి పరిస్థితి విషమంగా మారింది.కారుపై పడిన ట్యాంకర్ను తొలగించేందుకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ క్రెయిన్ సహాయంతో కారుపై పడిన ట్యాంకర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ప్రమాదానికి గురైన కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. కారు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడాకు చెందిన శ్రీనివాసరావుదిగా పోలీసులు గుర్తించారు. ట్యాంకర్ ఏపీ రిజిస్ట్రేషన్ పేరుతో తమిళనాడులో ఎక్కువగా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం తరువాత పరారీలో ఉన్న ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైఎస్ జగన్ పాలనలోనే బీసీలకు న్యాయం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతీరావ్ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీవై రామయ్య, నారాయణమూర్తి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్. ఐదేళ్ల పరిపాలన కాలంలో చదువుకు పెద్దపీట వేశారన్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించాం. సంఘ సంస్కర్త, సామాజికవేత్త జ్యోతి రావు పూలే.. సమాజం కోసం అహర్నిశలు పాటు పడిన వ్యక్తి పూలే అయితే, ఆయన ఆశయాలని అమలు చేసిన మహనీయుడు వైఎస్సార్. సామాజిక న్యాయం ఉంటే చంద్రబాబు చెప్పాలి. సవాల్ స్వీకరించాలి. నలుగురు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వైఎస్ జగన్.. డిప్యూటీ సీఎం ఇచ్చారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేకపోయాడు. సామాజిక న్యాయం చేస్తా బీసీలే నా వెన్నుముకని చెప్పిన చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలి.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. యావద్దేశం జ్యోతిబాపూలేకి ఘనమైన నివాళులర్పిస్తుంది. అనేక సంస్కరణలకు మూలపురుషుడు జ్యోతిరావు పూలే. చంద్రబాబు క్యాబినెట్లో 8 మంది బీసీలు ఉంటే జగన్ క్యాబినెట్లో 11 మంది బీసీలు ఉన్నారు. రాజ్యసభ సీట్ల కేటాయింపులో కూడా బీసీలకు పెద్ద పేట వేశారు. డీబీటీ ద్వారా లక్షలా కోట్ల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ వేశారు. అన్ని పదవుల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ 50 శాతం సీట్లు బీసీలకు ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకి.. సీనియర్ ఎందుకు పక్కన పెట్టాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. బీసీలు స్థితిగతులు మెరుగుపడాలంటే.. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే అది వైఎస్సార్సీపీలోనే సాధ్యం. -
మండిన ఎండ.. అక్కడక్కడ వాన
రాష్ట్రంలో ఒకవైపు తీవ్రమైన ఎండలు కాస్తుండగా.. మరోవైపు కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ సీజన్లోనే గరిష్టంగా కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా.. అన్నమయ్య జిల్లా పుంగనూరు, అనకాపల్లి జిల్లా రావికమతం, విశాఖ జిల్లా ఆనందపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. -
అస్మదీయ ఆస్పత్రులకే నిధులు!
సాక్షి, అమరావతి: ఒకవైపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా తొక్కిపెడుతున్న చంద్రబాబు సర్కారు.. కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులకు చెందిన ఆస్పత్రులకు మాత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) రూపంలో నిధుల వరద పారిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ లాంటి ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. అయితే వీటికి ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాకుండా ఎల్ఓసీల రూపంలో రెండు మూడు రెట్లు అధికంగా ఖజానా నుంచి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.ఆరోగ్యశ్రీలో నిరాకరణక్యాన్సర్ రోగులకు జబ్బు తీవ్రతను బట్టి రేడియేషన్ థెరపీకి ఆరోగ్యశ్రీలో రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షల మేరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా ఇస్తుంది. అయితే కూటమి నేతలకు చెందిన ఆస్పత్రులు మాత్రం ఆరోగ్యశ్రీ సేవలను నిరాకరిస్తూ ఎల్ఓసీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఎన్నికల అనంతరం పక్క రాష్ట్రంలో ‘ముఖ్య’నేత బంధువుకు చెందిన క్యాన్సర్ ఆస్పత్రిలో బోన్మ్యారో సహా ఇతర ఖరీదైన చికిత్సలను ఆరోగ్యశ్రీ కింద నిరాకరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వారి సన్నిహితులకు చెందిన ఆస్పత్రులు ఎల్ఓసీలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు వైద్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.‘స్వాహా’పై దాటవేత..!‘సాక్షి’ గురువారం సంచికలో ప్రచురించిన ‘సీఎంఆర్ఎఫ్ స్వాహా!’ కథనంపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారమే సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరు, ఎల్ఓసీ జారీ చేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రక్రియ అంతా ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపింది. అయితే వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన తుంటి ఎల్లయ్యకు సీఎంఆర్ఎఫ్ సాయం ముసుగులో టీడీపీ నాయకుడు వేణుగోపాల్ రూ.8 లక్షలు కాజేసిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించకుండా దాటవేయడం గమనార్హం. -
బాబు సర్కార్ దగాపై అంగన్వాడీల ఉద్యమబాట
సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నెల 23న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టి.. చంద్రబాబు సర్కార్ మోసాన్ని ఎండగడతామని వెల్లడించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూలకు చెందిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకులు శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఉపాధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ.. చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సార్లు మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారని, సీఎంతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయినా ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. అందుకే మరోసారి ఉద్యమ బాట పడుతున్నామని చెప్పారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) అధ్యక్షురాలు జె.లలితమ్మ మాట్లాడుతూ.. దేశంలోని పలు రాష్ట్రాల్లో అంగన్వాడీల వేతనాలు పెంచినా.. ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్టీయూ) నాయకురాలు పి.పద్మ మాట్లాడుతూ.. నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రధాన హామీలు నెరవేర్చడం లేదని, ఇచ్చిన జీవోలు కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు టి.గజలక్ష్మి, ఎం.శారమ్మ, కె.పద్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలపై మంత్రి సంధ్యారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారికి అంగన్వాడీ నాయకులు శుక్రవారం సచివాలయంలో వినతిపత్రం అందించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ప్రధాన డిమాండ్లు.. 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతామన్న హామీ అమలు చేయాలి. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు, మినీ వర్కర్లను మెయిన్గా మార్చుతూ ఇచ్చిన మూడు జీవోలు అమలు చేయాలి. హెల్పర్ల పదోన్నతికి మార్గదర్శకాలు రూపొందించాలి. అంగన్వాడీ పనులు మాత్రమే అప్పగించాలి. పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్, సంక్షేమ పథకాలు అందించాలి. పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో 1,810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలి. -
వారాలకు వారాలు.. వాకిట్లో ఎదురుచూపులు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం సామాన్య గృహ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ్యాస్ బుకింగ్ చేసి వారాలు గడుస్తున్నా డెలివరీ చేయకపోవడంతో నిత్యం ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో ఓటీపీ సమస్య వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఫలితంగా గ్యాస్ లోడ్ల కోసం సామాన్యులు ఆశగా ఎదురుచూడాల్సిన దుస్థితి దాపురించింది. మరోవైపు వాణిజ్య గ్యాస్ కొరత హోటల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా హోటళ్లు, చిరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో 14.2 కిలోల సిలిండర్ను రూ.2వేలు, 19 కిలోల వాణిజ్య సిలిండర్ను రూ.4 వేలు పెట్టి అధికరేట్లకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. ఈ ఆర్థిక భారాన్ని పూడ్చుకునేందుకు వ్యాపారులు టిఫిన్లు, కర్రీలపై రూ.10 చొప్పున పెంచి విక్రయిస్తున్నారు. దీంతో రోజువారీ కూలి పనులు చేసుకునే బడుగు జీవులకు నెలకొచ్చే స్వల్ప ఆదాయంలో రూ.2వేల నుంచి రూ.3 వేల వరకూ చిల్లుపడుతోంది. వెరసి సామాన్య ప్రజలు ఇంటిలోవంట చేసుకోలేక.. బయట అధిక రేట్లకు కొని, తినలేక నరకయాతన అనుభవిస్తున్నారు.మూడు వారాలకుపైనే బ్యాక్ లాగ్స్రాష్ట్రంలో గ్యాస్ బుకింగ్స్ బ్యాక్ లాగ్స్ మూడు వారాలకు పైనే ఉంటున్నాయి. అంటే, బుకింగ్ చేసుకున్న 10 నుంచి 21 రోజుల తర్వాత కూడా డెలివరీ అవుతుందన్న గ్యారెంటీ లేదు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే గ్యాస్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ అవసరం కాగా మూడున్నర రోజులకు మించి నిల్వలు ఉండట్లేదు. రోజువారీ బుకింగ్లతో పోలిస్తే డెలివరీలు పెంచామని ప్రభుత్వం కాకిలెక్కలు చెబుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సైతం గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులకు పెట్టే ఆహారంలో మెనూలు కుదించడంతో కడుపునిండా తిండి దొరకట్లేదు. ఇక సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారుల పరిస్థితి దయనీయంగా మారింది.బ్లాక్ మార్కెట్ దందాదేశవ్యాప్తంగా గ్యాస్ డెలివరీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఓటీపీ విధానం ఏపీలో ఘోరంగా విఫలమైంది. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి రోజులు గడిచినా ఓటీపీలు రాకపోవడంతో గ్యాస్ కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక స్థానిక అధికారులు కొందరు దగ్గరుండి ఓటీపీ లేకుండా గ్యాస్ పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ అనుకూల ఏజెన్సీలు, కొందరు ప్రజా ప్రతినిధులు గ్యాస్ను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ జేబులు నింపుకోవడం సమస్యకు మరోకోణం. ఇక్కడ ఓటీపీతో పాటు ఈ–కేవైసీ సమస్య జటిలంగా మారింది. ప్రభుత్వం 90 శాతానికిపైగా ఈ–కేవైసీ చేశామని ఆర్భాటంగా ప్రకటిస్తే.. గ్యాస్ ఏజెన్సీల అసోసియేషన్ 75 శాతం మాత్రమే ఈ–కేవైసీ పూర్తయినట్టు చెప్పడం గమనార్హం.పీఎన్జీ కోసమే ఎల్పీజీ జాప్యం..!రాష్ట్రంలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున 84 లక్షల వరకు గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఇప్పుడు అది కాస్త పడిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం వినియోగదారులను పైప్డ్ నేచ్యురల్ గ్యాస్ (పీఎన్జీ)కు మారాలని ఉచిత సలహా ఇస్తోంది. వాస్తవానికి 3 లక్షల పీఎన్జీ కనెక్షన్ల సామర్థ్యం ఉన్న నెట్వర్క్లో కేవలం 65 వేల కనెక్షన్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. అధిక డిపాజిట్లు, నెలవారీ బిల్లు కట్టాల్సి రావడంతో ఇది సామాన్యులకు భారంగా మారుతోంది. అందుకే పెద్దగా ఇష్టపడట్లేదు. కానీ, ప్రభుత్వం మాత్రం బలవంతంగా 6 నెలల్లో 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో.. ఎల్పీజీ సరఫరాలను కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1.61 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లలో కనీసం 2 శాతం కూడా లేని పీఎన్జీకి విస్తృత ప్రచారం చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకోవడం విస్తుగొలుపుతోంది. దీపం–2.0లో లబ్ధిదారులకు ఖేదంచంద్రబాబు ప్రభుత్వం సామాన్యులను మోసం చేయడమే అజెండాగా పాలన సాగిస్తోంది. ముఖ్యంగా దీపం.–2.0 పథకంలో మహిళలను తీవ్రంగా వంచించింది. ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డుదారులు ఉన్నారు. వీళ్లందరూ అల్పాదాయ, పేద వర్గాలే. ఇక్కడ 1.61 కోట్ల ఎల్పీజీ గృహ కనెక్షన్లలో పేదలే ఎక్కువగా గ్యాస్ వినియోగిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఏటా 85–90 లక్షల మందికి మాత్రమే ఉచిత గ్యాస్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. దాదాపు 60 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది. -
మంత్రివర్గంలో మావిగన్!
సాక్షి, అమరావతి : మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మావిగన్పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన అంశానికి పెద్దగా ప్రచారం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మంత్రులు వెనుకబడ్డారని, మావిగన్ను తిప్పికొట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసి.. వ్యతిరేకంగా పని చేయించినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మాత్రం దీటైన స్పందన రాలేదని అన్నట్లు తెలిసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని, అందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు అన్నిచోట్లా పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. కనీసం ఆయా పనులు మొదలయ్యేలా అయినా చర్యలు తీసుకుంటేనే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడారనే విషయంతో సంబంధం లేకుండా పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అజెండా, అందులో చర్చించే అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా జరక్కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. లీకులు మంత్రుల నుంచి జరుగుతోందా, అధికారుల నుంచా అని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో తమకు కేబినెట్ అజెండా ఇప్పటి వరకు అందలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్న అవినీతిపై సాక్షిలో ప్రచురితమైన కథనంపైనా చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి, తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
కొత్త డిస్కం.. జగన్ విజన్కు తార్కాణం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పాతికేళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ను ఉచితంగా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగించక తప్పలేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా.. తుదకు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే మంచివనే నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం మూడు డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి (క్యాబినెట్) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో విజన్ ఉన్న నాయకుడు జగన్ అని మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చాక వారికి మంచి చేయాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్కు అప్పట్లో పంట చేలల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తమ గోడును చెప్పుకున్నారు. రాత్రనకా, పగలనకా సాగు నీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ, విద్యుత్ కోసం పడుతున్న బాధలను కన్నీళ్లతో వివరించారు. వారి కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా చేయాలనుకున్నారు. అది కూడా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా అందించాలనుకున్నారు. అది సౌర విద్యుత్ వల్లనే సాధ్యమవుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లను అప్గ్రేడ్ చేయడం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారు.కొత్త డిస్కంకు అప్పుడే అంకురార్పణ అన్నదాతలకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 15న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ సమీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) 2021 సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రైతుల శ్రేయస్సు కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ సేకరణకు ప్రయత్నించడం అభినందనీయమని ఆ లేఖలో పేర్కొంది. యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తామే సరఫరా చేస్తామంటూ ప్రతిపాదన చేసింది. సెకీతో ఒప్పందం కోసం ఏపీజీఈసీఎల్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎస్సీఎల్)గా మార్పు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం జీఓ నంబర్ 152ను విడుదల చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు పొందడంలో భాగంగానే వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇది వ్యవసాయానికి అత్యంత అవశ్యకం కావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎస్సీఎల్కు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎల్) అనే పేరును ఖరారు చేసింది.నాడు అంతా విష ప్రచారమని తేటతెల్లంరాష్ట్రంలో తూర్పు (ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నిటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏపీఆర్ఏపీఎల్కు బదిలీ చేస్తున్నారు. సర్వీసులు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, స్తంభాలు ఇలా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నవన్నీ కొత్త డిస్కంలో విలీనం చేస్తారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఇంధన శాఖ ఏపీఈఆర్సీకి ఫైలును పంపనుంది. మండలి ఆమోదం అనంతరం ఏపీఆర్ఏపీఎల్కు ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని ఇంధన శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ సెకీ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం పడుతుందని చంద్రబాబు అండ్ కో చేసిందంతా కూడా తప్పుడు, విష ప్రచారం అని తేలిపోయింది. -
బాబు సర్కారుకు బలుసు ఇం‘ధనం’!
సాక్షి, అమరావతి: ఫేక్ సబ్ కాంట్రాక్టులు సృష్టించి.. చేయని పనులకు డబ్బులు వసూలు చేసుకుని.. దాన్ని టీడీపీ పెద్దలకు ఎన్నికల ఇం‘ధనం’ కింద సమకూర్చినందుకు ప్రతిఫలంగా అస్మదీయ కాంట్రాక్టర్లకు రాజధానిలో పనులు కట్టబెట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు స్పష్టంచేస్తున్నారు. ఆ ఫేక్ కాంట్రాక్టులు ఎవరివి? ఎంత విత్డ్రా చేశారు? అనే సమగ్ర సమాచారం వివరాలు తీగ లాగితే డొంక కదలడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతిని అవినీతి గనిగా మార్చేశారని, దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో దోచేయడానికి అక్షయపాత్రగా చేసుకున్నారని పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ సంస్థకు ఇప్పటికే రూ.7,440.08 కోట్ల విలువైన 19 ప్యాకేజీల పనులు ఇష్టారాజ్యంగా కట్టబెట్టడం దీనికి నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. కర్ణాటకలో బెంగళూరు, మైసూర్ లాంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు 2014, 2024 ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇం‘ధనం’ చేకూర్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో కింద అమరావతిలో అధిక ధరలకు పెద్ద ఎత్తున పనులు అప్పగించి, మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.744 కోట్లు ఇచ్చేసి.. అందులో 8 శాతం కమీషన్లు వసూలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. నిబంధనలు తుంగలో తొక్కేసి రాజధానిలో రూ.1,082.44 కోట్ల విలువైన 220 కేవీ విద్యుత్తు లైన్ పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ సంస్థకు అప్పగించడం ఈ దోపిడీకి మరో నిదర్శనమని ఉదహరిస్తున్నారు.నాడు రూ.211.53 కోట్లే... నేడు రూ.470.41 కోట్లు బంగ్లాల నిర్మాణం పేరుతో బరి తెగింపు..రాజధాని అమరావతి ప్రాంతంలో 26.09 ఎకరాల్లో ఒక్కొక్కటి 6,600 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో మంత్రుల కోసం జీ+1 పద్ధతిలో 35 బంగ్లాలు.. 24.13 ఎకరాల్లో ఒకొక్కటి 6,745 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో హైకోర్టు న్యాయమూర్తుల కోసం జీ+1 పద్ధతిలో 36 బంగ్లాల నిర్మాణ పనులను 2017–18లో రూ.211.54 కోట్లకు టెండర్లలో బీఎస్సార్కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. 2019 నాటికి రూ.35.18 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు 2023లో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చిన నివేదికలో తేల్చింది. అంటే మిగిలిన పని విలువ రూ.176.36 కోట్లు మాత్రమే. కానీ.. టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ పని అంచనా వ్యయాన్ని రూ.401.37 కోట్లకు పెంచేసి గతేడాది టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.419.07 కోట్లకు కోట్ చేసి మళ్లీ బీఎస్సార్ సంస్థే ఆ పనులను దక్కించుకోవడం గమనార్హం. స్టీలు, సిమెంటు సహా నిర్మాణ సామగ్రి ధరల్లో నాటికీ నేటికీ పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే రూ.176.36 కోట్ల విలువైన పనిని ఏకంగా రూ.419.07 కోట్లకు బీఎస్సార్ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. ఇది గూడుపుఠాణి కాక మరేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక సీనరేజీ, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో రూ.76.59 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.495.66 కోట్లు. 2019కి ముందు ఇదే పనులకు రూ.35.18 కోట్లు వ్యయం చేశారు. అంటే.. ఈ బంగ్లాల నిర్మాణ విలువ రూ.530.84 కోట్లు.చదరపు అడుగుకు రూ.11,203.41.. మెట్రో నగరాలకు మించి వ్యయం..మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న 71 బంగ్లాలలో మొత్తం నిర్మిత ప్రాంతం 4,75,920 చదరపు అడుగులుగా టెండర్లో పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఒక్కో బంగ్లా నిర్మిత ప్రాంతాన్ని బట్టి చూస్తే మొత్తం నిర్మిత ప్రాంతం 4,73,820 చదరపు అడుగులే. అంటే టెండర్లలో నిర్మిత ప్రాంతాన్ని 2,100 చదరపు అడుగులు పెంచినట్లు స్పష్టమవుతోంది. మౌలిక సదుపాయాలతో కలిపి సగటున చదరపు అడుగుకు రూ.11,203.41 చొప్పున వ్యయం చేస్తుండటం గమనార్హం. ఒక్కో బంగ్లా నిర్మాణ వ్యయం రూ.7.47 కోట్లు. ఇదే తరహా బంగ్లా ధర బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో భూమితో కలిపి రూ.5 కోట్ల లోపే ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు.ఒకే ప్యాకేజీని రెండుగా విభజించి.. అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంపుఅనంతవరం, నెక్కళ్లు, తుళ్లూరు, నేలపాడు, శాఖమూరు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ పనులను జోన్–2 కింద 2017 ఆగస్టు 7న టెండర్లలో రూ.725.71 కోట్లకు బీఎస్సార్ సంస్థకు నాటి చంద్రబాబు సర్కార్ అప్పగించింది. అనంతరం 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లను రద్దు చేసింది. అప్పట్లో ఒకే ప్యాకేజీ కింద జోన్–2 లేఅవుట్ పనులకు టెండర్లు పిలిచిన సీఆర్డీఏ.. గతేడాది వాటిని రెండుగా విభజించి జోన్–2ఏ (అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు ల్యాండ్ పూలింగ్ లేఅవుట్), జోన్–2బీ (అనంతవరం, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు ల్యాండ్ పూలింగ్ లే అవుట్) టెండర్లు పిలిచింది. జోన్–2ఏ పనులను రూ.416.62 కోట్లు, జోన్–2బీ పనులను రూ.432.37 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ సంస్థకే మళ్లీ అప్పగించడం గమనార్హం. అంటే.. అప్పటికీ ఇప్పటికీ అంచనా వ్యయం రూ.123.28 కోట్లు పెంచేసి బీఎస్సార్కే కట్టబెట్టడం వెనుక మర్మమేటన్నది బహిరంగ రహస్యమే.నిబంధనలు తుంగలో తొక్కి.. ఇష్టారాజ్యంగా విద్యుత్తు పనులు..టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ నిబంధనలను తుంగలో తొక్కింది. రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్వీ) అండర్ గ్రౌండ్ లైన్ ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు రూ.1,082.44 కోట్లకు పనులు కట్టబెట్టింది. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు దాదాపు రూ.90 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు బీఎస్సార్కు లబ్ధి చేకూరింది. -
ఇక విద్య ప్రైవేటీకరణ.. ప్రైవేట్ వర్సిటీలకు పచ్చజెండా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్య ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2016 చట్ట సవరణ ఆర్డినెన్స్ జారీని ఆమోదిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేట్ యూనివర్సిటీలు తక్కువగా ఉన్నాయని, వాటిని ప్రోత్సహించడంలో భాగంగా నిబంధనలను సరళతరం చేసినట్లు మంత్రి తెలిపారు. 2016 చట్టం ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటుకు కనీసం 50 ఎకరాలు అవసరం కాగా దీన్ని 10 ఎకరాలకు తగ్గించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వర్సిటీల కార్పస్ ఫండ్ రూ.15 కోట్లు నుంచి రూ.5 కోట్లకు తగ్గించామన్నారు. యూనివర్శిటీ ఏర్పాటుకు మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టాలనే నిబంధనను సైతం సడలించినట్లు తెలిపారు. మూడేళ్లలో రూ.250 కోట్లు పెట్టుబడులు పెట్టకుంటే ప్రైవేట్ యూనివర్సిటీని అధికారులు, విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తారని, అందువల్ల ఈ నిబంధనను సడలించినట్లు మంత్రి చెప్పారు. నిబంధనల సడలింపుతో ప్రైవేట్ వర్సిటీలు నిర్భయంగా, పారదర్శకంగా వ్యాపారం చేసుకునే వెసులుబాటు కలుగుతుందని మంత్రి తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కోటాలేమీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా..» ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2025 తుది గెజిట్కు ఆమోదం. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాలుగు జోన్లు ఉండగా ఇప్పుడు ఆరు జోన్లు కానున్నాయి. ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికత తదితరాలు గతేడాది డిసెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. » ప్రభుత్వ భూమి ధరల నిర్ధారణకు సంబంధించి ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అధారిటీ (ఏపీఎల్ఎంఏ) ద్వారా ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత సీసీఎల్ఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈమేరకు సంబంధిత జీవోలో సవరణలకు ఆమోదం. » పట్టా భూములు మంజూరు చేసిన తేదీ నుంచి పదేళ్ల తరువాత వాటిపై హక్కులు కల్పిస్తూ గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు. రెండేళ్లకే హక్కులు కల్పించేందుకు ఆమోదం. » 22 ఏ నిషేధిత జాబితాలోని ఆస్తుల రెగ్యులరైజ్కు దరఖాస్తు గడువు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగింపు.» రాష్ట్రంలో వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణ ప్రైవేట్ సంస్ధలకు, వ్యక్తులకు అప్పగించేందుకు ఆమోదం. ‘అడాప్ట్ ఏ మాన్యుమెంట్’ పాలసీ’కి ఆమోదం.» ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ యాక్ట్ 2019 సవరించి ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. కమిషన్కు బదులు ఉన్నత విద్య ఫీజు నిర్ధారణ కమిటీ ఏర్పాటు. » ఏపీ డిస్కమ్ల నుంచి 11 కేవీ వ్యవసాయ ఫీడర్ ఆస్తులు (11 కేవీ లైన్లు, డీటీఆర్లు, ఎల్టీ లైన్లు) దశలవారీగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్కు బదిలీ చేసేందుకు ఆమోదం. » ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2,000 కోట్ల ప్రత్యేక రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. » విశాఖలో సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నిర్మాణ గడువు 2027 జూన్ వరకు పొడిగించేందుకు ఆమోదం. » విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సేల్ అగ్రిమెంట్కు బదులు సేల్డీడ్గా పరిగణించేందుకు ఆమోదం. » ఇంజినీర్ల మధ్య సీనియారిటీ వివాదాల పరిష్కారం, పరిపాలనా అవసరాలు తీర్చేందుకు 58 మంది అర్హులైన డిప్యుటీ ఈఈలకు అడ్హాక్ పదోన్నతిపై ఈఈలుగా గుర్తించేందుకు ఆమోదం. » ఏపీఐఐసీకి గతంలో ఉచితంగా కేటాయించిన 11,039 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఎకరాకు రూ.14 లక్షల చొప్పున ఏపీఐఐసీ మొత్తం రూ.1,545.46 కోట్లు ప్రభుత్వానికి చెల్లించేందుకు ఆమోదం. » ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ అమలుకు సవరించిన విధివిధానాలతో జారీ చేసిన ఉత్తర్వులకు ఆమోదం. దీనిద్వారా జీఎస్డీపీలో 0.42 శాతం అదనంగా ప్రభుత్వానికి అప్పు చేసే అవకాశం. » ఇటీవల ఎస్ఐపీబీలో తీసుకున్న పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం -
విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : వైఎస్సార్ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్.కాగా, వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్ వెళ్లే దారిలోనే..!
విజయవాడ: ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్ను టెంట్ల్లో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో బార్ అండ్ రెస్టారెంట్కు టెంట్ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్ వెలిసింది. సీఎం, సీఎస్లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది. రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..! -
‘చంద్రబాబు.. అన్ని రూ. లక్షల కోట్లు ఎందుకు?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న ప్రాంతంలో రాజధాని అనేది 30-40 ఏళ్లు అయినా పూర్తి కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీనికి చత్తీస్గఢ్లో నిర్మించిన నవ రాయ్పూర్ ఉదాహరణ అని ఆయన తెలిపారు. నవ రాయపూర్లో బిల్డింగ్లు మాత్రమే ఉన్నాయని.. కానీ జనం లేరని సజ్జల పేర్కొన్నారు. ‘చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి రూ.2-3 లక్షల కోట్లు కావాలి. ఇప్పుడు కేవలం పనిచేసే ఉద్యోగులు ఉండడానికి మాత్రమే కడుతున్నాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జిలు.. వీరికి బంగ్లాలు మాత్రం కడుతున్నాడు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డెవలప్ చేయాల్సి ఉంది. అది ఎప్పటికి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎలాంటి సౌకర్యాలు, సదుపాయాలు లేని చోట అంతంత డబ్బు పెట్టి ప్రజలు ఎలా ఉంటారు?, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ రేట్లు పెట్టి ప్రజలు అక్కడికి ఎందుకు వస్తారు?, ప్రజలు భరించలేని రేట్లతో, ఏ సదుపాయాలూ లేని చోట ఎందుకు ఉంటారు?, మౌలిక సదుపాయాల కోసమే ఎన్ని లక్షల కోట్లు పెట్టాలి?, ప్రజలు రాకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది. మావిగన్తో మరుసటి రోజే రాజధాని..‘మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మావిగన్ అలా కాదు.. అమరావతిలో 10 శాతంతో ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుంది. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లతో ప్రపంచంతో అనుసంధానం అయ్యింది. త్వరలో పోర్టుకూడా వస్తుంది. జగన్ చెప్పినదానికీ, చంద్రబాబు చెప్పిన దానికీ తేడా ఇది’ అని తెలిపారు. ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారు?చంద్రబాబు నాయుడు ఎంతకాలం ప్రజలను భ్రమలో పెడతారని సజ్జల ప్రశ్నించారు. రాని క్యాపిటల్ గురించి చంద్రబాబు భ్రమలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు నడిపిస్తున్న హెరిటేజ్ కంపెనీని కూడా అమరావతి లాంటి ఆలోచనలతోనే నడుపుతారా?, మొత్తం లోన్లు తెచ్చి, ఆకాశహర్మ్యం కట్టి నడుపుతాడా?, హెరిటేజ్ నిర్వహణలో తీసుకున్న జాగ్రత్తలను చంద్రబాబు రాజధాని విషయంలో ఎందుకు తీసుకోవడంలేదు?, రాజధాని పేరుతో విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, దానికి ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్టు?’ అని నిలదీశారు.చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం‘భావితరాలకు అన్యాయం చేస్తున్నారని జగన్ చెప్తున్నారు. మావిగన్ ఆలోచనను పలు దఫాలుగా జగన్ చెప్పారు. జగన్మోహన్రెడ్డి వేసిన ప్రశ్నలకు సూటిగా చంద్రబాబు సమాధానం చెప్పడంలేదు. అమరావతికి ఆదాయం ఎలా వస్తుందో స్పష్టంగా చెప్పడంలేదు. చంద్రబాబు సమాధానాల్లో డొల్లతనం ఉంది. భూములు ఇప్పుడు అమ్మితే రేట్లు రావని చంద్రబాబు చెప్తున్నారు. ఎప్పడు అమ్మితే వస్తాయో చెప్పగలరా?, అమ్మేంతవరకూ ఎన్ని డబ్బులు పెడతారు?, అప్పటివరకూ పెట్టే డబ్బు ఎంత? వడ్డీ ఎంత?, కాంట్రాక్టు కంపెనీలకు జీఎస్టీ సహా అనేక రాయితీలు ఇచ్చారు. ఇక పన్నుల ద్వారా ఏరకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు. అమరావతి ఆలోచన ఆసాధ్యమైనది. దీనిపై ప్రశ్నలు అడిగితే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.చంద్రబాబు అమరావతి ఏరకంగా ఆచరణాత్మకమో చెప్పగలరా?, అప్పు చేయకుండా ఏం కట్టినా తప్పు లేదు. అప్పులు చేస్తున్నప్పుడు, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అవినీతికి తరగని గనిలా అమరావతి‘చంద్రబాబు అవినీతికి తరగని గనిలా అమరావతిని ఎంపిక చేసుకున్నారు. అమరావతిని కామధేనువులాగ, అక్షయపాత్ర లాగ చూస్తున్నారు. గ్రో ఇంజిన్లాంటి క్యాపిటల్ను తీసుకు రావాలన్న ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఇప్పడు చేస్తున్న వాటిని అక్కడితో ఆపేస్తే డబ్బు వృథాకాకుండా ఉంటుంది. ఆ డబ్బును మావిగన్ చోట పెడితే సత్వరమే రాజధాని అందుబాటులోకి వస్తుంది. ఆరోజైనా, ఈరోజైనా, రేపైనా రాష్ట్ర వనరులను సక్రమంగా నిర్వహించుకోవాలన్నదే మా ఆలోచన. వాటిని సహేతుకంగా ఖర్చు చేసి రాజధానిని అందుబాటులోకి సత్వరమే తీసుకు రావాలన్నదే వైయస్.జగన్ ఆలోచన. రూ.2-3లక్షల కోట్లు పెట్టినా చంద్రబాబు రాజధానిని పూర్తిచేయడం అసాధ్యం. పైగా అన్ని అప్పులు ఇచ్చేవారు ఎవరు ?, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం. చంద్రబాబు, ఆయన మనుషుల కుబేరులు అవడానికే పనికి వస్తుంది. కోర్టుల ద్వారా తెచ్చిన చిక్కుల వల్లే మూడు రాజధానుల నిర్ణయం ఆగింది. చంద్రబాబు విశాఖపట్నం, కర్నూలుకు వ్యతిరేకమని గతంలో చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు. కేవలం అమరావతిలో కాంట్రాక్టులు కోసమే ఆరాటపడుతున్నారు. చివరకు అమరావతి ప్రాంత ప్రజలనుకూడా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. చంద్రబాబు తన ఆర్థిక ప్రయోజనాలకోసం వారి మనోభావాలను సొమ్ము చేసుకున్నారుమావిగన్ను ప్రజలు స్వాగతించారుమావిగన్ అనే నినాదం చంద్రబాబుకు తగాలాల్సిన చోట తగిలింది. అందుకనే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అమరావతికోసం కేంద్రం నుంచి రూ.30-40వేల కోట్లు గ్రాంటు తెస్తే ఎవరు అడ్డుకుంటారు?, మావిగన్ను ప్రజలు స్వాగతించారు. కావాలనుకుంటే చంద్రబాబు ఏ పేరైనా పెట్టుకోవచ్చు:మావిగన్ పేరు అనగానే చంద్రబాబు ఉలిక్కిపడ్డారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనపై పూర్తిస్థాయిలో చర్చజరుగుతోంది. ఈ ప్రతిపాదన సహేతుకంగా ఉందని ప్రజలంటున్నారు’అని తెలిపారు.ఆ కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది..‘రాజధాని ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అన్న చంద్రబాబు సృష్టించిన కృత్రిమ భావనను మావిగన్ బద్దలు చేసింది. అందుకనే ఈ ప్రాంత నాయకులు, ప్రజలుకూడా గట్టిగా చర్చిస్తున్నారు. మావిగన్ చాలా మంది ఆలోచన అని అందరూ అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని,మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అందుకనే చంద్రబాబుకు అదురు, బెదురు పుట్టింది. అందుకనే ఇష్టానుసారం బూతులు తిడుతున్నారు. ఎల్లోమీడియా ద్వారా కూడా తిట్టిస్తున్నారు. దాన్ని ప్రశ్నిస్తుంటే.. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారు. చంద్రబాబు అనుకూల వాయిద్యాల్లో షర్మిల ఒక వాయిద్యం. ఎన్డీయే కూటమిలో ఉన్న చంద్రబాబుకు షర్మిల మద్దతు ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు.వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహంఏబీఎన్లో దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా 30-40 మంది వైఎస్సార్సీపీ ప్రధాన నాయకులు ఆందోళన చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ లీడర్లు ఉన్నారు. వాళ్లు వ్యక్తంచేసింది ధర్మాగ్రహం. భార్యలను తారుస్తారనే సారాంశంతో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలకు నిరసన తెలియజేయాలా వద్దా?, మీడియాలో టెర్రరిస్టులు లాంటి వ్యక్తులు వీళ్లు. ఇలాంటి దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ సమర్థించడం ఘోరం. పైగా మేం దాడిచేశామని మాపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. పైగా ఏబీఎన్ రాధాకృష్ణ దుర్మార్గ వ్యాఖ్యలను చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్లు సమర్థించడం ఘోరం. గతంలో తన తల్లిగారిని ఏదో అన్నారని, ఏకంగా ఆ మీడియాను బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు వేరేరకంగా మాట్లాడారు. గతంలో సాక్షిలో ఒక వక్త మట్లాడిన మాటలకు సాక్షిపై దాడులు చేశారు. దాడి అంటే అది. చాలా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. మూడు రోజులుగా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సైకో అంటూ ఇష్టాను సారం మాట్లాడుతున్నారు. చంద్రబాబుకి ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయి. టీడీపీ వాళ్లు అంటున్న మాటలు చంద్రబాబుకే పూర్తిగా వర్తిస్తాయి. రాజధానిపేరుతో అవినీతి యజ్ఞం చేస్తున్న చంద్రబాబుకే ఇవి వర్తిస్తాయిరాజధాని పేరుతో రాష్ట్రాన్ని ముంచే యజ్ఞం చేస్తున్నందుకు ఈ వ్యాఖ్యలు చంద్రబాబుకే వర్తిస్తాయి.మావిగన్ పేరు వింటనే చంద్రబాబుకు భయంమావిగన్ పేరు వింటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మావిగన్ ఆచరణాత్మక ఆలోచన అని ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అందుకనే చంద్రబాబు ఉలికిపడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. -
వైద్య శాఖలో కమీషన్ల మాయాజాలం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రులకు వైద్య పరికరాలు, మందులు కొనుగోలు మాటున చంద్రబాబు సర్కారు అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణలో రూ.1.04 లక్షలకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్టర్ పరికరాన్ని ఏపీలో రూ.3.13 లక్షలకు కొనుగోలు చేయడంతోపాటు అధిక ధరకు అజిత్రోమైసిన్ మందుల కొనుగోలు చేయడం వంటి అక్రమాలు ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్ఐడీసీ)లో ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. తాజాగా సిమ్యులేటర్ ఫర్ ఇయర్, నోస్ (చెవి, ముక్కు) సర్జరీ పరికరాల కొనుగోలులో మరో కుంభకోణం వెలుగు చూసింది. ఒకే కంపెనీ పరికరాల కోసం టెయిలర్ మేడ్ నిబంధనలు.. వాటి సరఫరా కోసం ఇద్దరు బిడ్లు దాఖలు చేయడం ద్వారా కృత్రిమ పోటీ సృష్టించడం రూపంలో ప్రజాధనం లూటీకి తెరలేపారని వైద్య శాఖలో చర్చ నడుస్తోంది. రూ.39 లక్షల వ్యత్యాసంతో వేర్వేరు బిడ్లుఈఎన్టీ వైద్య విద్యార్థులు సర్జరీలను నేరుగా రోగులపై కాకుండా వర్చువల్గా ప్రాక్టీస్ చేయడం కోసం ఈఎన్టీ సిమ్యులేటర్ ఉపయోగపడుతుంది. వీటిని విశాఖపట్నం, ఒంగోలు, విజయవాడ జీజీహెచ్లకు సమకూర్చడంతోపాటు భవిష్యత్లో సరఫరా కోసం రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారుకు ఏపీ ఎంఎస్ఐడీసీ కొద్ది నెలల కిందట టెండర్ పిలిచింది. సాధారణంగా ప్రభుత్వం నిర్వహించే టెండర్లలో వేర్వేరు కంపెనీల మధ్య పోటీ ఉండాలి. అయితే, సిమ్యులేటర్ టెండర్లో మాత్రం జర్మనీకి చెందిన వొక్సెల్ మ్యాన్ సైనస్ టెంపోకు చెందిన ఒకే రకం వైద్య పరికరం, సాఫ్ట్వేర్ సమకూరుస్తామని రెండు సంస్థలు వేర్వేరుగా టెండర్లు దాఖలు చేశాయి. ఒకే కంపెనీ తయారు చేసిన పరికరాల పేరిట ఓ సంస్థ రూ.4.44 కోట్లు, మరో సంస్థ రూ.4.83 కోట్ల చొప్పున ఒక్కో పరికరాన్ని సరఫరా చేసేలా టెండర్లు వేశాయి. ఒకే కంపెనీ పరికరాన్ని రెండు సంస్థలు రూ.39 లక్షల వ్యత్యాసంతో బిడ్లు వేయడం వెనుక పెద్ద నాటకమే దాగి ఉందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఒకే కంపెనీకి చెందిన పరికరాన్ని సరఫరా చేస్తామని వేర్వేరు సంస్థలు టెండర్లు వేస్తే దాన్ని సింగిల్ బిడ్గా పరిగణించి అధికారులు టెండర్ రద్దు చేసి మళ్లీ పిలవాలి. అనూహ్యంగా రూ.4.44 కోట్లతో పరికరాన్ని సమకూరుస్తామన్న పురా సంస్థ ఎల్–1గా నిలిచిందని, ఆ సంస్థ బిడ్ను బుధవారం వైద్య శాఖలోని బిడ్ ఫైనలైజేషన్ కమిటీ (బీఎఫ్సీ) వెల్లడించింది. ఈ లెక్కన పరిశీలిస్తే ప్రస్తుతం మూడు జీజీహెచ్లకు ఈ పరికరాల కొనుగోలు రూపంలో రూ.13.34 కోట్లు, భవిష్యత్లో మరికొన్ని ఆస్పత్రులకు సరఫరా రూపంలో మరింత ప్రజాధనాన్ని లూటీ చేయనున్నారు. తక్కువ ధరకే పరికరాలను కొనుగోలు చేస్తున్నామని భ్రమింపజేయడానికి ఎల్–1, ఎల్–2 మధ్య భారీ వ్యత్యాసం ఉండేలా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెండర్ వేసిన రెండు సంస్థల మధ్య ప్రత్యక్ష సంబంధాలున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి.అజెండా మార్పించేసిన ఉన్నతాధికారిటెండర్లకు సంబంధించి బీఎఫ్సీలో నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మందులు, సర్జికల్స్, పరికరాల ధరలను చాట్ జీపీటీ, జెమ్ పోర్టల్, ఏఐ, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా కూడా పోల్చాలని, ఆ ధరలను కూడా అజెండాలో పొందుపరచాలని కొద్ది నెలల క్రితం కీలక అధికారి ఏపీ ఎంఎస్ఐడీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన బీఎఫ్సీ సందర్భంగా ఈఎన్టీ సిమ్యులేటర్ల ధరలను చాట్ జీపీటీ, జెమ్ పోర్టల్ వంటి మాధ్యమాల్లో పరిశీలించి రూ.కోటి నుంచి రూ.3 కోట్ల మేర ధర పలుకుతున్నట్టు అధికారులు అజెండాలో పెట్టినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సదరు కీలక అధికారి ‘ఆడిట్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారా’ అంటూ అధికారులను మందలించినట్టు తెలిసింది. బుధవారం ముగిసిన బీఎఫ్సీ సమావేశ అజెండాలో గురువారం మార్పులు చేయించారని విశ్వసనీయ సమాచారం. -
దేశంలోనే ప్రత్యేకం.. వైఎస్సార్ ప్రజాప్రస్థానం
సాక్షి, అమరావతి: ‘మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశంలోనే ఎప్పటికీ ప్రత్యేకమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనకు నాందిపలికాయి. తండ్రి, కుమారుడు పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వాటిని పరిష్కరించిన ఘనత దేశంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుంది’ అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశంసించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలతో మమేకమవుతూ..ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో తెలంగాణలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. సాధారణ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత సంక్షేమ పాలనకు బాటలు వేసింది. వైఎస్సార్ పాదయాత్ర కారణంగానే 2004లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తండ్రికి మించిన తనయుడిగా నిలిచారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చి అద్భుత పాలనను అందించారు.’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, కాకమాను రాజశేఖర్, చల్లా మధు తదితరులు పాల్గొన్నారు. -
అర్హతలేని వ్యక్తికి అందలమా!?
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన వ్యవస్థలో అర్హతలేకుండా అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమితులైన సూర్యదేవర ప్రసన్నకుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వోద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ (ఎస్వో) కంటే తక్కువ కేడర్ వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో అత్యున్నత పదవిని కట్టబెట్టడమే కాక ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్థాయి హోదాను కల్పించడం చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన ప్రసన్నకుమార్ను ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా తప్పుడు పద్ధతిలో నియమించారని చెప్పారు. కాకర్ల ఏమన్నారంటే..2024 ఆగస్టులో అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా సూర్యదేవర ప్రసన్నకుమార్ను ప్రభుత్వం నియమించింది. అందులో ప్రసన్నకుమార్ సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్గా పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్గా ప్రసన్నకుమార్ నియామకం చెల్లదని అన్ని మీడియాల్లో వచ్చింది. సుప్రీంకోర్టు అతని డెçప్యుటేషన్ నియామకాన్ని రద్దుచేసి ఆయన మాతృసంస్థ ప్రసార భారతికి తిరిగి పంపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.చట్టసభల్లో పనిచేసిన అనుభవమే లేదు..లోక్సభ/రాజ్యసభలో లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారిని మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా నియమించాలి. కానీ, ప్రసన్నకుమార్కు ఎక్కడా ఈ అనుభవంలేదు. మరి అలాంటి వ్యక్తిని ఎలా నియమించారు? కనీసం విద్యార్హతలైనా ప్రభుత్వం చూసిందా? అసెంబ్లీ సర్వీసు నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఉప కార్యదర్శి, ఆపై పోస్టుల్లో వ్యక్తులు తప్పనిసరిగా న్యాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రసన్నకుమార్కు ఆ అర్హత ఉందో లేదో ఎవరికీ తెలీదు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాటవేశారు. ప్రసన్నకుమార్కు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పోస్టు కట్టబెట్టి అసెంబ్లీ శాశ్వత ఉద్యోగులను నిలువునా ముంచేసింది. వాస్తవానికి.. ప్రసన్నకుమార్ ప్రసార భారతిలో న్యూస్ రీడర్–ట్రాన్స్లేటర్గా మాత్రమే పనిచేశారు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో సెక్షన్ ఆఫీసర్ కంటే కిందస్థాయి పోస్టు. ఇక సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు అడిగితే.. మీరు సరిగ్గా పనిచేయరు, నేను బయటి వ్యక్తులను తెచ్చుకుని పనిచేసుకుంటానని ప్రసన్నకుమార్ బెదిరిస్తున్నారు. దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం..ప్రస్తుతం అసెంబ్లీ సీనియర్ ఉద్యోగుల్లో జాయింట్ డైరెక్టర్ విజయరాజు పదోన్నతులకు ముందువరుసలో ఉన్నారు. ఆయనకు పదోన్నతి లభిస్తే అడిషనల్ సెక్రటరీ, ఆ తర్వాత సెక్రటరీ హోదా వస్తుంది. కానీ, తప్పుడు ఆరోపణలతో విజయరాజును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్వీసులోకి తీసుకున్న సమయంలో ప్రభుత్వం ‘పెండింగ్ ఎంక్వైరీ’ వేసింది. కానీ, ఏడాది నుంచి విచారణ కమిటీని నియమించకుండా.. తప్పు జరిగిందో లేదో తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. విచారణ జరిపితే విజయరాజు తప్పులేదని తేలడమే కాక అప్పుడు ఆయనకు పదోన్నతి కల్పించాల్సి వస్తుంది. ఇదే జరిగితే తన పోస్టును కోల్పోతాననే దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం అడుతున్నారన్నారు. -
డ్రోన్ ఎగరేస్తే ఫీజు కట్టాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డ్రోన్ సేవలపై సేవా రుసుములను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్(ఏపీడీసీ)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. వివిధ సేవలకు సర్వీసు చార్జీలను 2.5 శాతం నుంచి 5 శాతంగా నిర్ధారించారు. రూ.50 లక్షలలోపు డ్రోన్ సేవలపై 5 శాతం, రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు 3.75 శాతం, ఆ పైన మొత్తానికి 2.50 శాతం సర్వీసు చార్జీగా నిర్ణయించారు. ఇక నుంచి రాష్ట్రంలో అందించే ప్రతీ డ్రోన్సేవలు ఏరియల్ సర్వే, మ్యాపింగ్, లాజిస్టిక్స్, వ్యవసాయ అనుబంధ సేవలు, మౌలిక వసతుల నిర్వహణ, విపత్తుల నిర్వహణ, పరిశోధన, ప్రజాసేవతో పాటు డ్రోన్ పైలెట్ శిక్షణ వరకు అన్ని సేవలను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించుకునే డ్రోన్ సేవలను ఏపీడీసీ ద్వారానే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంబంధిత డిపార్ట్మెంట్లు, ఏజెన్సీల నుంచి ముందస్తు రుసుములు తీసుకోవడానికి ఏపీడీసీకి అనుమతించారు. -
సీఆర్డీఏనే మావిగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారని, తాము చేస్తున్నది కూడా అదేనని, అదే సీఆర్డీఏ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సైకో ప్రవర్తనలతో రౌడీయిజం బ్యాచ్ వితండవాదాలు చేస్తోందని.. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వెనుక రాజకీయ పార్టీ లేకపోతే ఇంటినుంచి బయటకు రాగలడా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వీరు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. మనమంతా కలిసి కాపాడుకోవాలన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఇప్పటికే విభజనవల్ల, గత పాలకులవల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోతారు. ఇతను కూడా అంతే. ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దుష్ప్రచారం చేసి పారిపోతాడు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారు. అది సీఆర్డీఏ రీజియన్. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతిని కదపలేరు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికినాకు నిమిషం పట్టదు. కానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది. నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టుచేసి జైల్లో పెట్టారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం మేం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తిచేసి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేస్తాం. ‘22ఏ’ నుంచి 1.37 లక్షల ఎకరాలకు విముక్తి ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. -
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధాని ప్రతిపాదనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, అన్ని వర్గాలలోనూ మద్దతు పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండానే ఒక మహానగరాన్ని అభివృద్ధి చేసుకునే మార్గమున్నప్పుడు ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఉపయోగమేమిటన్న చర్చ జరుగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. మూడు నగరాలను కలుపుతూ హైవేలు ఉండడం, పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఉండడం.. తక్కువ ఖర్చుతోనే, తక్కువ కాలంలోనే మావిగన్ను ఓ మహానగరంగా అభివృద్ధి చేసుకునేందుకు కలసివచ్చే అంశాలుగా ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రతికూలాంశాలను, మావిగన్ సానుకూలాంశాలను జనం బేరీజువేసుకుంటున్నారు. ఇది మింగుడుపడని చంద్రబాబు వెంటనే డైవర్షన్ అస్రా్తన్ని బయటకు తీశారు. అచ్చెన్నాయుడుతో ఓ విలేకరుల సమావేశం పెట్టించి అవాకులు, చెవాకులు పలికించారు.. అచ్చెన్నాయుడి అసందర్భ ప్రేలాపనలు బాబుగారి డైవర్షన్ రాజకీయంలో భాగమేనన్న విషయం అందరికీ అర్థమైపోయింది.. రూ. 2 లక్షల కోట్లతో రోడ్లు, డ్రైనేజీలా.. ఇక రాజధాని ఎప్పుడు?అమరావతి కోసం మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సౌకర్యాల కల్పనకు కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. అంటే లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి.ఇంకా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? రాష్ట్రానికేమన్నా అంత ఆదాయముందా..? ఇది అదనంగా చేయాల్సిన అప్పే కదా.. అసలు ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంత సుదీర్ఘ కాలంలో రూ.2 లక్షల కోట్లు వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అసలు ఇదంతా సాధ్యమయ్యేదేనా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు భవనాలు కట్టగానే రాజధాని తయారైపోవడం మనం చూడలేదు.ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నగరాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు అమరావతిలో సదుపాయాలు లేవు.. ప్రభుత్వం కడతానంటున్న బిల్డింగులూ లేవు.. ఇక ఆర్థిక కార్యకలాపాలెక్కడ? మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే అన్ని సదుపాయాలున్నాయి. పోర్టు, ఎయిర్పోర్టు, హైవేలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే సరిపోతుంది.. ఇలాంటి విషయాలన్నీ జనం బేరీజు వేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ‘మావిగన్’ హోరు..అమరావతి కంటే మావిగన్ బెస్ట్ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మావిగన్లో ఇప్పటికే పోర్టు ఉంది, సముద్ర తీరం, విమానాశ్రయం ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులు ఇలా అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతిలో ఏముంది? అని వారు నిలదీస్తున్నారు. అమరావతిలో కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, ఇందులో 10 శాతం అంటే కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే మావిగన్ అత్యుత్తమ రాజధాని అవుతుందని లెక్కిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మాణాలకు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు విషయంలో భారీ వ్యత్యాసం ఉండటం వెనుక అవినీతి దాగుందని ఉదాహరణలతో సహా బయటపెడుతున్నారు.అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం భ్రమరావతి చేస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ వైఎస్ జగన్ ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బే.. అవన్నీ ఫేక్ వీడియోలని మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో మావిగన్ రేపిన కల్లోలం అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు. లోకేశ్ ట్వీట్ను ఖండిస్తూ నాడు చంద్రబాబు ప్రసంగించిన వీడియోలతో పాటు ఎకనమిక్ టైమ్స్ సహా పలు జాతీయ పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సమాధానాలు లేకే డైవర్షన్ కుట్రలు..తక్కువ ఖర్చుతోనే మావిగన్ను మహానగరంగా అభివృద్ధి చేసుకునే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రతిపాదనను పక్కనపెట్టేసి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతివైపు చంద్రబాబు ఎందుకు పరుగులు తీస్తున్నారని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అమరావతి ప్రాజెక్టు పనుల కోసం అయినవారికి అధిక ధరలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు వంటివన్నీ రోజుకొకటి బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, టీవీ చర్చలలోనూ ఇది ప్రధానాంశంగా మారడం చంద్రబాబు అండ్కో కు తలనొప్పిగా తయారయ్యింది. దాంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి అసందర్భంగా మాట్లాడించడం.. మావిగన్పై ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ..?⇒ పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు ఉన్న మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే మహానగరాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్న మాట నిజం కాదా?⇒ అమరావతిలో లక్ష ఎకరాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు సదుపాయాలకు రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేబోతున్నారు? ఇవి కాకుండా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎంత సమయంలో పూర్తి చేస్తారు? మొత్తం ఎన్ని దశాబ్దాలు పడుతుంది?⇒ ఆ రూ.2 లక్షల కోట్లలో పది శాతం అంటే రూ.20 వేల కోట్లతోనే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయవచ్చన్న ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన, బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?⇒ దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది?⇒ అమరావతి ప్రాంతంలో పనుల కోసం అధిక ధరలకు టెండర్లు పిలవడం, అయినవారికే అప్పగించడం.. ఎలాంటి పనులు చేయకుండానే ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేయడం, అందులో కమీషన్లు కాజేయడంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఏమేమి కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? -
పిల్ పెండింగ్లో ఉండగానే బాబు కేసును మూసేసిన ఏసీబీ కోర్టు
సాక్షి, అమరావతి: చంద్రబాబు కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) హైకోర్టులో పెండింగ్లో ఉండగానే, ఏసీబీ కోర్టు తొందరపాటు నిర్ణయం తీసుకుందని న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పిల్ పెండింగ్లో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో సీఐడీ నమోదు చేసిన మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసిందని ఆయన వివరించారు. పైపెచ్చు ఈ కేసు డాక్యుమెంట్లను కోరితే అందుకుసైతం ‘థర్డ్ పార్టీ పేరుతో’ ఏసీబీ కోర్టు తిరస్కరించిందన్నారు. ఇదే తరహా వ్యాజ్యాలు ఇప్పటికే ఇదే హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. పిటిషనర్ తిలక్కు చంద్రబాబుపై నమోదైన కేసులతో సంబంధం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇదే తరహా అంశాలపై ఇప్పటికే దాఖలైన వ్యాజ్యాలతో ఈ వ్యాజ్యాన్ని జత చేయాలని, అన్నింటినీ కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశి్నస్తూ తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ సరి్టఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని హైకోర్టును ఆయన అభ్యర్థించారు. -
నాన్న పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 2003 ఏప్రిల్ 9వతేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్ తన పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. రాష్ట్ర గతిని మార్చేసిన వైఎస్సార్ చరిత్రాత్మక పాదయాత్ర ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గురువారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది..ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర నిరూపించింది. నాకు బాగా గుర్తు.. ఏప్రిల్ 9, 2003న ఎర్రటి ఎండలో.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి.రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసాను కల్పించాయి. ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్ర ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది. -
ఎల్వోసీ.. దోచేసి 'సీఎంఆర్ఎఫ్ స్వాహా'!
కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్ కడప జిల్లా నందలూరు మండలం కుందా నెల్లూరుకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తుంటి ఎల్లయ్య ఒక కంటిచూపు కోల్పోయాడు. చెన్నైలో చికిత్స కోసం రూ.35 లక్షలు ఖర్చైంది. సీఎం సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కింద డబ్బులు ఇప్పిస్తామంటూ టీడీపీ నాయకులు ఎల్లయ్యతో పలు కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. ఇంటికి వచ్చాక బాధితుడి ఖాతాకు రూ.14 లక్షలు జమ కాగా... అందులో రూ.8 లక్షలు టీడీపీకి చెందిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బ్యాంకు ఖాతాకు బదిలీ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఎల్లయ్యతో ముందుగానే బ్యాంకు కాగితాలపై సంతకాలు పెట్టించుకుని డబ్బులు బదిలీ చేసుకున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ‘మాకు ఖర్చులు ఉంటాయి. అందరికీ పర్సంటేజీలు ఇవ్వాలి.. !’ అని టీడీపీ నేతలు చెబుతున్నారని ఎల్లయ్య గోడు వెళ్లబోసుకున్నాడు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు, అవినీతిని చంద్రబాబు సర్కారు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కిస్తోంది. అనారోగ్యం పాలై ఆపదలో ఉన్న పేదవాడిని ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)ని అక్రమార్కులకు అక్షయపాత్రలా మార్చేసింది. ఇసుక, మట్టి, సిలికా, గ్రానైట్, క్వార్ట్జ్, లేటరైట్, గనులు, ప్రకృతి వనరులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పచ్చముఠాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నా సరిపోలేదన్నట్లుగా.. బినావీులకు 99 పైసలకే భూములను పందేరం చేస్తూ, బంధుగణానికి విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దోచిపెట్టడంతోపాటు కుటుంబ కంపెనీకి రూ.వంద కోట్ల మేర రాయితీలు ఇచ్చినా ఇంకా చాలదన్నట్లుగా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పేదలకు అందాల్సిన అన్ని పథకాలు ఆపేసి ఆరోగ్యశ్రీని అంపశయ్యపైకి చేర్చారు. ఆరోగ్య ఆసరా అసలే లేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. చివరకు ఎంతకు బరి తెగించారంటే.. అనారోగ్యం పాలైన పేదలను ఆదుకోవాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బుల్లోనూ కమీషన్లు వసూలు చేస్తున్న వైనం ఆధారాలతో బహిర్గతమైంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, ఆస్పత్రులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) జారీ, బిల్లుల చెల్లింపుల్లో భారీ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఎన్నడూ ఆస్పత్రి ముఖం కూడా చూడని వ్యక్తులను రోగులుగా చిత్రీకరించి రూ.లక్షల్లో నకిలీ బిల్లులు పెట్టడం.. కూటమి ప్రజాప్రతినిధులకు చెందిన వారు డీల్ కుదుర్చుకున్న ఆస్పత్రులకే పెద్ద ఎత్తున ఎల్ఓసీలు జారీ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ కాంట్రాక్టుల్లో వాటాలు వసూలు చేసుకోవడం చూశాం.. 79 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇలాంటి నీతి బాహ్యమైన, సిగ్గుమాలిన, దిక్కుమాలిన వ్యవహారాలను ఇప్పుడే చూస్తున్నామని, చంద్రబాబు సర్కారు దిగజారుడు, అవినీతి బాగోతాలకు ఇది పరాకాష్ట అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దందాలో 10 మంది ఎమ్మెల్యేల పీఏలు..అనారోగ్యం బారినపడ్డ అభాగ్యులు, నిరక్ష్యరాస్యులను ప్రధానంగా టార్గెట్గా చేసుకుని కూటమి ప్రజాప్రతినిధుల అనుచరులు, దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందక అప్పుల పాలైన రోగులను ట్రాప్ చేసి నకిలీ బిల్లులను సృష్టిస్తున్నారు. వాటిని సచివాలయంలో ప్రాసెస్ చేయించి చెక్కుల జారీ వరకూ ఆద్యంతం ఫాలో అప్ చేస్తున్నారు. రోగుల పేరుతో డబ్బు జమ కాగానే తమ జేబులో వేసుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్న ఈ అక్రమాలు ఇటీవల బహిర్గతమయ్యాయి. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీల కోసం పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా అందిన దరఖాస్తులు బోగస్ అని గుర్తించినట్లు సమాచారం. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేయకుండా బాపట్ల, పోలవరం, శ్రీకాకుళం, తిరుపతి, అనకాపల్లి తదితర జిల్లాలకు చెందిన పది మంది ఎమ్మెల్యేల పీఏలను బాధ్యులుగా తేల్చి చేతులు దులిపేసుకున్నట్లు తెలుస్తోంది. నకిలీ బిల్లుల వ్యవహారంలో ‘ముఖ్య’ కార్యాలయం ఉద్యోగుల హస్తం ఉన్నట్లు స్పష్టంగా వెల్లడైందని సచివాలయ అధికారుల్లో చర్చ నడుస్తోంది. డీల్ కుదుర్చుకుని ఎల్ఓసీలు..రోగులకు చికిత్సకు ముందుగా ఆస్పత్రులకు ప్రభుత్వం జారీ చేసే ఎల్ఓసీలకు సంబంధించి భారీ అక్రమాలు జరుగుతున్నట్లు వైద్య వర్గాల్లో చర్చ సాగుతోంది. గుండె, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, వివిధ ప్రమాదాల్లో గాయపడిన నిజమైన బాధితులకు ఎల్ఓసీలు అందక అల్లాడుతుండగా.. దళారులు, కూటమి ప్రజాప్రతినిధుల ద్వారా వచ్చిన ఫైళ్లు మాత్రం నిమిషాల్లో క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులతోపాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తులకు కోరినంత కమీషన్ ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకున్న ఆస్పత్రులకే పెద్ద మొత్తంలో ఎల్ఓసీలు అందుతున్నాయి. మరోవైపు కూటమి పార్టీల్లో కొందరు ఎమ్మెల్యేలు స్వతహాగా వైద్యులు కావడంతో సొంతంగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వాటి ద్వారా ఇష్టారాజ్యంగా ఎల్ఓసీ దరఖాస్తులు పంపుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ టీడీపీ ఎమ్మెల్యే ఆస్పత్రి.. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన మహిళా నాయకురాలి ఆస్పత్రి.. గుంటూరు, విజయవాడ, విశాఖ, కర్నూలు ప్రాంతాల్లోని టీడీపీ నాయకుల ఆస్పత్రులకు పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ ద్వారా నిధులు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్లోని తమ బంధువు ఆస్పత్రికి ఎడాపెడా ఎల్ఓసీలు ఇచ్చేస్తున్నారు. క్యాన్సర్ వైద్యం అందించే ఈ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా కవర్ అయ్యే ప్రొసీజర్లకూ ఎల్ఓసీలు అడుగుతూ రెండు రెట్లు అధికంగా నిధులు రాబట్టుకుంటున్నారు.ఆరోగ్యశ్రీని అస్తవ్యస్థం చేసి..గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 ప్రొసీజర్లను తెచ్చారు. దీంతో అన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఇతర జబ్బులకు ఆరోగ్యశ్రీలోనే ఉచిత చికిత్సలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అస్తవ్యస్థం చేసి సీఎంఆర్ఎఫ్ సాయం పేరిట పచ్చముఠాల దోపిడీకి తెర తీసింది. ముఖ్యనేత కార్యాలయం నుంచి మండల స్థాయిలో కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల వరకూ కాసులు పిండుకుంటున్నారు. వైద్యం కోసం అప్పుల పాలైన రోగులను ఆసరాగా చేసుకుని సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేస్తున్నారు. -
మావిగన్పై ఆగని టీడీపీ డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మావిగన్పై తెలుగుదేశం పార్టీ డైవర్షన్ కుట్రలకు తెరలేపింది. ప్రజలు పాజిటివ్గా చర్చిస్తుంటే అధికార పక్షం ఓర్వలేకపోతోంది. ఎలాగైనా మావిగన్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు, కుతంత్రాలకు తెర తీసింది. వైఎస్ జగన్.. మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చిన రోజే సైకో అంటూ టీడీపీ నేత పట్టాభి చిందులు తొక్కారు. జగన్ను నంగనాచి అంటూ మంత్రి అనిత దుర్భాషలాడారు. వైఎస్సార్సీపీ నేతల భార్యల గురించి పచ్చపత్రిక అధినేత ఆర్కే రాతరోతలు రాశారు.ఇలా.. రోజుకో డైవర్షన్ స్కీంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని తిడుతూ మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ కుట్రలు తెరతీసింది. ఇప్పుడు వైఎస్సార్ మరణంపై అచ్చెన్నాయుడు నీచపు మాటలు మాట్లాడుతూ.. మాజీమంత్రి బొత్స సత్యనారాయణపై అభాండాలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. మహానేత కుమారుడిపై అభాండాలను తట్టుకోలేక బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్సార్ మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న బొత్స.. భావోద్వేగానికి గురయ్యారు.అచ్చెన్నాయుడు దిగజారుడు రాజకీయాలపై బొత్స మండిపడ్డారు. దేశం గర్వించే వ్యక్తుల్లో వైఎస్సార్ ఒకరని.. ఆయన పాదయాత్ర ముగించిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు మాటలను ఖండిస్తున్నానని బొత్స అన్నారు. -
అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూలగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు.‘‘ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాధాకృష్ణ బూతు రాతలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి, మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి: వెల్లంపల్లిమహిళలను కించపరిచేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఏబీఎన్ వద్ద ఆందోళనకు వెళితే కిలోమీటర్ దూరంలో ఆపేశారు. గతంలో సాక్షి కార్యాలయంపై దాడి చేసి తగలబెడితే పోలీసులు కనీసం అడ్డుకోలేదు. ఏబీఎన్ తప్పుచేసినా వందలాది మంది కాపలాకాశారు. సాక్షికి ఒక న్యాయం? ఆంధ్రజ్యోతికి ఒక న్యాయమా?. వైఎస్సార్సీపీ నేతల భార్యల గురించి మాట్లాడితే కూటమి నేతలు సమర్థిస్తున్నారు. ఇంతమంది మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించరా?మాచవరం పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వైఎస్సార్సీపీ నేతలు..మాచవరం పోలీస్ స్టేషన్కి ర్యాలీగా వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల నీచమైన రాతలు రాసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాచవరం పోలీసులకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.పశ్చిమగోదావరి జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్సీపీ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు రాతలను వెనక్కి తీసుకోవాలని.. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఉండి పోలీస్ స్టేషన్లో ఆ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్ పివిఎల్ నరసింహారాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.కాకినాడ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై తుని టౌన్ పీఎస్లో వైఎస్సార్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఫిర్యాదు చేశారు. ఎస్. అన్నవరం నుండి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఏబీఎన్ రాధాకృష్ణ వికృత మనస్తత్వం బయట పడిందని దాడిశెట్టి రాజా మండిపడ్డారు. రాజధాని కోసం వైఎస్ జగన్ సూచించిన మావిగాన్ను డైవర్ట్ చేయడం కోసమే ఏబీఎన్ రాధాకృష్ణ.. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేశారని రాజా ధ్వజమెత్తారు.వైఎస్సార్ జిల్లా: ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఆయన ఫిర్యాదు చేశారు. నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ.. మావిగన్ అనేది రాష్ట్రానికి ఓ ఆర్థిక వనరు. అమరావతి రాష్ట్రానికి ఓ గుదిబండ. చంద్రబాబు అసమర్థత వల్లే మావిగన్ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారని రామాంజులరెడ్డి వివరించారు. -
‘రావాలి జగన్- కావాలి మావిగన్’
సాక్షి, గుంటూరు: ఏపీలో ‘మావిగన్’కు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘రావాలి జగన్- కావాలి మావిగన్’ పేరుతో తాడేపల్లి జాతీయ రహదారి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ ఏపీ గ్రోత్ ఇంజిన్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్తోనే సాధ్యం. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే ‘మావిగన్’ కావాలి. మన రాజధాని- మన మావిగన్- మన ఆంధ్రప్రదేశ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మావిగన్ వల్ల ప్రయోజనాలు వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.వైఎస్ జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. -
వర్మకు జాక్పాట్!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ భూ దందా కొత్త పుంతలు తొక్కుతోంది. స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ బుజ్జగింపుల కోసం ప్రభుత్వ భూమి ఎడాపెడా దోచి పెట్టడం రివాజుగా మారింది. ముఖ్యంగా పర్యాటక హోటళ్ల ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా భూ దోపిడీ సాగిస్తుండటం విస్తుగొలుపుతోంది. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి, అంతర్గత కలహాలతో నిత్యం రచ్చ రేపుతున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు తాజాగా ప్రభుత్వ భూమినే కట్టబెట్టేసింది. ఆతిథ్య రంగంలో ఎటువంటి అనుభవం లేని వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్కు కాకినాడలో రూ 240– 340 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేసింది. వాస్తవానికి ఇక్కడ ప్రాజెక్టు విలువ కేవలం రూ.104 కోట్లు మాత్రమే. కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం రాజకీయ ప్రైవేటు సంస్థకు ప్రాజెక్టు ప్రతిపాదిత విలువ కంటే మూడు రెట్ల మేర లబ్ధి కలిగిస్తూ భారీ ఎత్తున భూ పందేరం చేస్తోంది. పెట్టుబడి గోరంత.. లబ్ధి కొండంత వర్మ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షిక టర్నోవర్ రూ.85.66 కోట్లు. అయితే ఈ సంస్థ రూ.104 కోట్లతో 2 వేల మంది కూర్చునేందుకు కన్వెన్షన్ హాలుతో కూడిన 5 స్టార్ హోటల్ నిర్మాణానికి దరఖాస్తు చేయడమే తడవుగా కాకినాడలో అత్యంత విలువైన భూమిని చంద్రబాబు సర్కార్ కట్టబెట్టేసింది. కాకినాడ పారిశ్రామిక వాడతో పాటు పోర్టు ఏరియా, బీచ్ ఫ్రంట్, నగర శివార్లలోనూ భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం వర్మ సంస్థకు కాకినాడ నడి»ొడ్డున ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ (జీపీటీ) కళాశాలకు సమీపంలో హాట్ కేక్ వంటి 3.4 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఎకరం రూ. 70 నుంచి రూ.100 కోట్లు వరకు ఉంటుందని అంచనా. వాస్తవానికి కాకినాడ సిటీలో ఎక్కడా ప్రభుత్వ భూములు ఖాళీగా లేవు. ఏ ప్రాజెక్టు కట్టాలన్నా ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిన పరిస్థితి. అంతటి డిమాండ్ కలిగిన ప్రాంతంలో ఎప్పుడో పిఠాపురం మహారాజు ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వానికి దానంగా ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ నేత వర్మకు ధారాదత్తం చేయడం విస్మయపరుస్తోంది. ఆ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం ఆ భూమి విలువ రూ.240–340 కోట్లు. ఇది ఇప్పటి విలువ. భవిష్యత్తులో మరింత భారీగా పెరగడం ఖాయం. అలాంటిది రూ.104 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.240– 340 కోట్లు విలువైన భూమి ఇవ్వడమే కాకుండా, పెట్టుబడిలో 10 శాతం అంటే రూ.10 కోట్లు ప్రభుత్వమే తిరిగి వర్మ సంస్థకు చెల్లించనుంది. అంతేకాదు ఇతరత్రా రాయితీలు కూడా భారీగా ప్రకటించింది. పదేళ్ల పాటు స్టేట్ జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని మినహాయింపునిచ్చింది. విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ, ఐదేళ్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్మెంట్, ఆస్తి పన్ను, నీటిపన్ను, సీవేజ్ పన్నుల్లో రాయితీలతో కలిపి చూస్తే ఈ సంస్థకు ప్రోత్సాహకాల కిందే రూ.40 కోట్ల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. అంటే వర్మ సంస్థకు భూమితో పాటు ప్రోత్సాహకాల పేరిట ప్రభుత్వం రూ.280– 380 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది. పైగా వర్మ ప్రాజెక్టుకు లబ్ధి కలిగించేందుకే చీడిలపొర కాలువ మీదుగా రహదారిని సైతం నిర్మిస్తోంది. అంటే వర్మ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. కాగితాలపైనే బ్రాండింగ్ఆతిథ్య రంగంలో వర్మ రియల్ ఎస్టేట్ సంస్థకు ఎటువంటి అనుభవం లేదు. అందుకనే చంద్రబాబు సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. బ్రాండింగ్ పేరుతో మసిపూసి మారేడు కాయ చేస్తోంది. వర్మ సంస్థ ‘తాజ్ బ్రాండింగ్’ పేరిట హోటల్ నిర్మిస్తున్నట్టు నమ్మబలికింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు సంస్థలు కన్సార్షియంగా ఏర్పడినప్పుడు ప్రాజెక్టులో ఒకరి వాటా కనీసం 26 శాతంగా ఉండాలి.కానీ, ఇక్కడ పెట్టుబడి అంతా వర్మ సంస్థ చూపిస్తోంది. పైగా వాస్తవ ‘తాజ్’ నుంచి బ్రాండింగ్ వస్తే అది కచ్చితంగా ‘ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సీఎల్)’గా పరిగణిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా అగ్రిమెంట్లు, ఎంఓయూలు ఉంటాయి. ముఖ్యంగా తాజ్ గ్రూప్కు వాటా ఉంటుంది. కానీ, వర్మ ప్రాజెక్టులో కేవలం కాగితంపై మాత్రమే తాజ్ బ్రాండింగ్కు సహకారం అందిస్తున్నట్టు చూపించి, రూ.కోట్లు విలువైన భూమి 99 ఏళ్ల పాటు లీజు పేరుతో కాజేస్తుండడం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వం పర్యాటక ల్యాండ్ బ్యాంక్ను అంగట్లో సరుకు మాదిరిగా ఆన్లైన్లో పెట్టి అప్పనంగా దోచిపెడుతోంది. వందల ఎకరాల పర్యాటక భూములను ఎటువంటి టెండర్లు లేకుండా డీపీఆర్ ఆధారంగా కట్టబెడుతోంది. వర్మ సంస్థకు కేటాయించిన భూమికి ఎనిమిది నెలల తర్వాత ఒక్కటే ప్రపోజల్ రావడంతో నెల రోజులు ఎదురు చూసిన తర్వాత ఖరారు చేసినట్టు చెప్పడం ప్రభుత్వ కుట్రను స్పష్టం చేస్తోంది. -
తూచ్.. అది పైలట్ ప్రాజెక్టే
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో కొత్తగా ప్రవేశపెట్టిన ట్యాబ్ల్లో మార్కుల నమోదుపై విద్యాశాఖ వెనక్కి తగ్గింది. సెంటర్లలోనే మార్కుల డిజిటలైజేషన్ పైలట్ ప్రాజెక్టు అంటూ మంగళవారం ప్రకటించింది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లకు దీనిపై ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ఈ ఏడాది ఆన్లైన్ మార్కుల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.50 లక్షలు వెచ్చించి మూల్యాంకన కేంద్రాల్లో ఇంటర్నెట్ సైతం ఏర్పాటు చేశారు. ట్యాబ్ల్లో మార్కులు ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నించగా.. ఒక్క ట్యాబ్ కూడా పనిచేయకపోవడంతో మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్ రూముల్లోకి తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెంటర్లలోనూ ఆందోళన వ్యక్తమవడంతో వెనక్కి తగ్గిన పాఠశాల విద్యాశాఖ ఇప్పు డు ఇది పైలట్ ప్రాజెక్టు అంటూ ప్రకటించింది. అలాగే, ఓపెన్ స్కూల్ పదో తరగతి పేపర్ల మూల్యాంకనాన్ని ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభించడంతో పాటు ఈ మార్కులను కూడా పాత విధానంలోనే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పులు సరిదిద్దుకునేందుకు పాట్లు పాఠశాల విద్యాశాఖ ఈనెల 6వ తేదీ నుంచి 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించింది. ఇందులో మార్కులను ‘ట్యాబ్లెట్ ఆధారిత డిజిటల్ మార్క్స్ ఎంట్రీ సిస్టమ్’ (టీడీఈఎస్)ను ప్రవేశపెట్టింది. వీటి వినియోగంపై శిక్షణ ఇవ్వకపోవడం, ట్యాబ్లు పనిచేయకపోవడం, సరైన ఇంటర్నెట్ లేకపోవడం వంటి కారణాలతో అనేక సమస్యలు తలెత్తి మార్కుల నమోదు ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారింది. ఈ అంశంపై మంగళవారం ‘టెన్త్ స్పాట్.. ఫెయిల్’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర విద్యాశాఖ రెగ్యులర్ ఎస్ఎస్సీ మూల్యాంకనంలో ట్యాబ్లెట్ మార్కుల నమోదు విధానాన్ని కొనసాగిస్తూనే.. ఇది పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని ప్రకటించింది. అలాగే, ఓపెన్ స్కూల్ పదో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్లో కూడా ట్యాబ్తో మార్కులు ఎంట్రీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 11 నుంచి 15 వరకు జరిగే ఓపెన్ స్కూల్ స్పాట్ కేంద్రాల్లో పాత పద్ధతిలోనే మూల్యాంకనం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, పైలట్ అంటే ఒకటి రెండు సబ్జెక్టులకు అమలు చేయాలి లేదా ఒక జిల్లాలో అమలు చేసి ఫలితాలను బట్టి వచ్చే ఏడాది ఈ విధానం కొనసాగించాలి. కానీ రెగ్యులర్ టెన్త్ మార్కులు పూర్తిస్థాయిలో ట్యాబ్స్లో ఆన్లైన్ చేయిస్తూనే పైలట్ ప్రాజెక్టు అనడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో జరిగే తప్పులకు ఎవరిని బలిచేస్తారోనని సెంటర్లలోని చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం
మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాక్షి నెట్వర్క్: మహిళలను కించపరిచేలా, సభ్యసమాజం తలదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ‘రాధాకృష్ణది జర్నలిజం కాదు. ముమ్మాటికీ బ్రోకరిజం’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండించారు. మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలుచోట్ల ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట శాంతియుత ఆందోళనలు చేపట్టారు. నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలుచోట్ల పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదం నెలకొనగా.. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై జులుం ప్రదర్శించారు. ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అతనిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందే విజయవాడ రామవరప్పాడు సమీపంలోని ముస్తాబాద రోడ్డులో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు పెద్దపెట్టున నిరసనకు దిగారు. ‘బూతు రాధాకృష్ణ డౌన్డౌన్’ అని రాసిన ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయం రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. శాంతియుత నిరసన తెలియజేయడానికి మాత్రమే వచ్చామని చెప్పినా వినకుండా అనుచితంగా ప్రవర్తించారు. పోలీసులు తోపులాటకు దిగటంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గుంటూరులో లాఠీచార్జ్ గుంటూరు బ్రాడీపేటలోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలను పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుడిచేతికి గాయమైంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిరసన ప్రదర్శన చేశారు. మల్లమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. పల్నాడు రోడ్డులోని పాత ఆంధ్రజ్యోతి కార్యాలయం ఉన్న కాంప్లెక్స్కు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. రోత రాతలపై కన్నెర్ర ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మహిళలను అడుగడుగునా అడ్డుకున్నారు. నెల్లూరు అయ్యప్పగుడి సమీపంలోని ఆంధ్రజ్యోతి ఎడిషన్ సెంటర్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలు, మహిళలను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని మార్గాల్లో బారికేడ్లను, ఇనుప ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రోప్ పార్టీలతో అడ్డుకున్నారు. పోలీసులను ఛేదించుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన ముఖ్యనేతలతోపాటు మహిళలు, పార్టీ కార్యకర్తలను బలవంతంగా పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేసిన మహిళలు ‘రాధాకృష్ణా ఖబడ్దార్’ అంటూ హెచ్చరికలు జారీచేశారు. మురికి వ్యాఖ్యలపై నిరసనలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. తణుకు నరేంద్ర సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, మహిళలు నిరసన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలచెరువు సెంటర్లో గల ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, మహిళలు బైఠాయించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో నిరసన చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు వేసిన టెంట్ను పోలీసులు తొలగించారు. హైస్కూల్ సెంటర్ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న నాయకులు, కార్యకర్తలు, మహిళలను అడ్డుకుని వెనక్కు నెట్టేశారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు హైసూ్కల్ సెంటర్లోనే నిరసనకు దిగి ఆంధ్రజ్యోతి, రాధాకృçష్ణకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉత్తరాంధ్రలోనూ పెల్లుబికిన నిరసనలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. విశాఖలోని అక్కయ్యపాలెం వద్ద గల ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అక్కడే బైఠాయించి రాధాకృష్ణ రాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాయలసీమలో నిరసనల వెల్లువ అనంతపురంలోని ఏబీఎన్ ప్రాంతీయ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు ఆందోళన చేశారు. అక్కడ పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అడ్డుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏబీఎన్ రాధాకృష్ణ దిష్టి»ొమ్మను దహనం చేశారు. కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వైఎస్సార్సీపీ నేతలు, మహిళలు ప్రయత్నించారు. పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ధర్నా చేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. రాధాకృష్ణ డౌన్ డౌన్, బూతు చానల్ ఏబీఎన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో పార్టీ నేతలను బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు. మొత్తం 57 మందిని అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు కర్నూలులో ఆందోళన చేపట్టారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్లకార్డులు చేతబూని ఆర్ఎస్ రోడ్డు నుంచి రాజ్విహార్ సెంటర్లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం రాధాకృష్ణ ఫొటోలను మహిళలు చెప్పులతో కొట్టి అక్కడే కాల్చారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదేం పని.. బాలస్వామీ! మహిళా కానిస్టేబుల్పై చేతులు వేసిన డీఎస్పీ కడప (కార్పొరేషన్): కడపలో ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన మహిళలను అరెస్ట్ చేసే క్రమంలో డీఎస్పీ బాలస్వామిరెడ్డి వారిని చేతులు పట్టి లాగుతూ వీపు, నడుముపై తోస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ, మాజీ కో–ఆప్షన్ సభ్యురాలు బి.మరియను మహిళా కానిస్టేబుళ్లు జీపులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంటే డీఎస్పీ బాలస్వామిరెడ్డి మహిళా కానిస్టేబుల్ చేయిపట్టి లాగుతూ వీపు, నడుముపై చేతులు వేసి తోశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మహిళలపైనా చేతులు వేశారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ చేతులు వేసి తోయడంతో సదరు మహిళా కానిస్టేబుల్ చిన్నబుచ్చుకుంది. -
9.25 లక్షల ఎకరాలుఫ్రీహోల్డ్ సక్రమమే
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు భారీ ఊరటనిస్తూ ‘ఫ్రీహోల్డ్’తో సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం ముమ్మాటికీ సక్రమమేనని మరోసారి తేలిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఫ్రీహోల్డ్ అయిన భూముల్లో 9.25 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించాలని తాజాగా టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. ఈమేరకు ఫ్రీహోల్డ్ భూములపై చంద్రబాబు సర్కారు యూటర్న్ తీసుకుంది. 21 నెలల తర్వాత తాను చేసింది తప్పని గుర్తించడంతో ఎట్టకేలకు ఇప్పుడు ఆ భూములపై మళ్లీ యాజమాన్య హక్కులు కల్పిస్తోంది. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు విధించి అవే భూములు మళ్లీ ఫ్రీహోల్డ్.. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ భూములన్నింటినీ గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని సీఎం చంద్రబాబు పదేపదే ఆరోపణలు చేశారు. ఆ సాకుతో ఫ్రీహోల్డ్ అయిన (యాజమాన్య హక్కులు వచ్చిన) భూములపై ఆంక్షలు విధించారు. దీంతో గత ప్రభుత్వంలో చరిత్రాత్మక రీతిలో యాజమాన్య హక్కులు పొందిన 13.59 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల రైతులు తమ భూములపై హక్కులు కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆ భూములన్నీ అక్రమం అని తేల్చడం కోసం చంద్రబాబు సర్కారు అధికారులతో పలుమార్లు వెరిఫికేషన్లు చేయించింది. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి అనేక దఫాలుగా నివేదికలు, వెరిఫికేషన్లపై చర్చలు జరిపారు. చివరికి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే ఫ్రీహోల్డ్ చేసిన 9.25 లక్షల ఎకరాలను ఇప్పుడు మళ్లీ ఫ్రీహోల్డ్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసిన భూములనే ఇప్పుడు తాను ఫ్రీహోల్డ్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తోంది. గత ప్రభుత్వంలో చరిత్రాత్మక చట్టం.. పేదలకు కేటాయించి 20 సంవత్సరాలు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం కోసం 2022లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక రీతిలో అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఆ తర్వాత వెంటనే తొలిదశలో 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి పేద రైతులకు వారి భూములపై యాజమాన్య హక్కులు కల్పించింది. అయితే వైఎస్సార్సీపీ నేతలు భూములు కొట్టేశారని దు్రష్పచారం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు ఎన్నికల్లో లబ్ధి పొందారు. అనంతరం 2024లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారంటూ వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టారు. ఇప్పుడు తాపీగా అందులో 9.25 లక్షల ఎకరాలను సక్రమమేనంటూ తేల్చి 22 ఏ జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించడం గమనార్హం. ఈనాం భూములపైనా అదే తీరు వైఎస్ జగన్ హయాంలో 22 ఏ జాబితా నుంచి తొలగించిన సర్వీస్ ఈనాం భూములనే ఇప్పుడు మళ్లీ 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 2022లో 1.59 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిపై ఆంక్షలు పెట్టి ఇప్పుడు తాను కొత్తగా 22 ఏ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం గమనార్హం. వీటితోపాటు సర్వీస్ ఈనాం లోని మరో లక్ష ఎకరాల భూములకూ విముక్తి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కొత్తగా చట్టం తేవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. » 2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను సమీక్షలో చంద్రబాబు ఆదేశించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ చేయాలని సూచించారు. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక గ్రామంలో కూడా రీ సర్వే పూర్తి కాకపోవడం గమనార్హం. ఇక 2016కు మందు ఏదైనా ప్రభుత్వ హౌసింగ్ పథకం కింద పట్టా పొందిన ప్రతి ఇంటికీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా 2016 ముందు పట్టా ఉన్న యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, విక్రయించేందుకు, గిఫ్ట్ డీడ్గా ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీసీఎల్ఏ జయలక్షి్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు భారీగా అప్పులు చేస్తూ వాటిని దాచిపెట్టి చట్టసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. బడ్జెట్లోనూ, బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో భారీగా అప్పులు చేస్తూ వాస్తవ వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందన్నారు. చట్ట సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రజలను మోసగించడమేనని గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఈ మేరకు బొత్స బుధవారం గవర్నర్కు లేఖ రాశారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలతో పాటు శాసన మండలి సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ ఇచ్చిన తప్పుడు వివరాలను ప్రస్తావిస్తూ గవర్నర్కు లేఖ రాశారు. అప్పులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇవ్వడమంటే ఆర్థిక శాఖ అధికారులు సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. సభకు సమాధానం ఇచ్చేటప్పుడు మరింత జాగ్రత్తగా, జవాబుదారీతో ఉండాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులకు గట్టిగా చెప్పాలని ఆ లేఖలో బొత్స విజ్ఞప్తి చేశారు. ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టారు.. 2024–25, 2025–26లో రాష్ట్ర అప్పుల వివరాలపై మండలి గత సమావేశాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ తప్పుడు గణాంకాలతో సమాధానం ఇచ్చిందని బొత్స లేఖలో పేర్కొన్నారు. 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని ‘కాగ్’ (కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మార్చి 6వ తేదీన సభకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసిందని, అయితే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం 2024–25లో అప్పు రూ.60,485.40 కోట్లుగా పేర్కొన్నారని బొత్స గవర్నర్ దృష్టికి తెచ్చారు. మరోవైపు 2025–26 ఆర్థిక ఏడాది తొమ్మిది నెలల్లో రూ.85,269.19 కోట్లు అప్పులు చేస్తే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి మాత్రం రూ.53,878.71 కోట్లుగా> సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే అప్పులను దాచిపెట్టి తక్కువగా చూపించినట్లు తేలిందన్నారు. కాగ్ నివేదికతో పాటు బడ్జెట్ డాక్యుమెంట్లలో 2024–25లో ప్రజా రుణం రూ.81,071.18 కోట్లు అని స్పష్టంగా ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 2024–25, 2025–26లో బడ్జెటేతర అప్పుల వివరాలను వెల్లడించాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఈ విషయంలో కూడా తప్పుడు సమాచారాన్ని సభకు సమర్పించినట్లు తెలిపారు. రూ.53,878.71 కోట్లు మినహా 2025–26లో ప్రభుత్వం మరే ఇతర రుణం తీసుకోలేదని తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. పలు కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు చేస్తున్నా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఉద్దేశపూర్వకంగానే సభకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ అధికారి ఇలా చట్టసభకు తప్పుడు సమాచారం ఇవ్వడం ఆ శాఖ ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. తప్పుడు సమాధానాలు ఆర్థిక శాఖ సమగ్రతకు హాని కలిగించమే కాకుండా చట్ట సభ స్థాయిని దిగజార్చి కించపరచడమే అవుతుందని బొత్స పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బడ్జెటేతర అప్పులను మాత్రమే సమాధానంలో ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంలో చేసిన అప్పులను దాచి పెట్టడం ద్వారా ఆర్థిక శాఖ ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికారులు రాజకీయ వైఖరితో సమాధానాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. జవాబుదారీతనంతో చట్టసభలకు వాస్తవ సమాచారాలను అందించాల్సిన కార్య నిర్వాహక వర్గం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని, ఇలా తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించడమేనని బొత్స స్పష్టం చేశారు. -
అమరావతిలో ‘అసైన్డ్’ దురాక్రమణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించడం వెనుక పక్కా కుట్ర దాగి ఉంది. అమరావతి ముసుగులో చంద్రబాబు ముఠా బరి తెగించి భూ దోపిడీ సాగించింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ‘పచ్చ ముఠా’ పెద్ద ఎత్తున కొల్లగొట్టింది. అందుకోసం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చంద్రబాబు – నారాయణ సూత్రధారులు, పాత్రధారులుగా దేశ చరిత్రలో అతిపెద్ద అసైన్డ్ భూ దోపిడీకి బరి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములను గుంజుకున్నారు. ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూదోపిడీకి పాల్పడి పేదల భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించిన టీడీపీ పెద్దలు వారి భూములను 1,336 మంది బినామీల ముసుగులో కొల్లగొట్టారు. అనంతరం తాపీగా అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడం ద్వారా కుతంత్రానికి పాల్పడినట్లు సీఐడీ గతంలోనే నిర్ధారించింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో చార్జ్ïÙట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. అయితే 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అనంతరం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో ఈ కేసును క్లోజ్ చేసింది. చంద్రబాబు ముఠా అసైన్డ్ భూదోపిడీకి అమరావతి మూగసాక్షిగా నిలుస్తోంది. ఆ భూ బాగోతం ఇదిగో ఇలా ఉంది...! సిట్ విచారణలో ఆధారాలతో సహా బయటపడ్డ వాస్తవాలు.. 1954 తర్వాత అసైన్డ్ భూములు పంపిణీ జరిగినట్లు రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదిక జీవో 1తో భయపెట్టి.. జీవో 41తో భూదోపిడీ విభజన తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు పన్నాగం పన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి వారి అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని పేరుతో భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న జీవో నంబరు 1 జారీ చేశారు. ఆ జీవోలో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ప్రచారం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు ముట్టచెబుతామని ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయించారు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. ఇలా చంద్రబాబు, నారాయణ, లోకేశ్ ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలు చేసి అసైన్డ్ భూములన్నీ తమ బినామీల పరం చేశారు. అనంతరం చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చేశారు. అందుకోసం సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ జీవో జారీ చేశారు. ఆ చట్టం ప్రకారం సీఆర్డీఏ పరిధిలో భూవ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా కేబినెట్ ఆమోదం తప్పనిసరి. కానీ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టం–1977కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం జీవో 41ను తెచ్చింది. అందుకు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. కేబినెట్లో చర్చించకుండానే ఏకపక్షంగా జీవో 41ను అడ్డదారిలో జారీ చేసింది. తద్వారా కేబినెట్ ఆమోదంతోనే భూవ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలన్న సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించింది. 1954 తర్వాత అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు పంపిణీ చేయలేదని టీడీపీ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన నివేదిక న్యాయస్థానం కళ్లుగప్పి... కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. ఆ చట్టం ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు తమ బినామీల ద్వారా కొల్లగొట్టిన భూములకు ప్యాకేజీ ప్రకటించారు. ఆ అసైన్డ్ భూములన్నీ 1954కు ముందు పంపిణీ చేసినవేనని... ఆ తరువాత 2015లోపు అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేశారు. అయితే అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి రావడంతో చంద్రబాబు ముఠా దోపిడీ బయటపడింది. రూ.5,500 కోట్ల అసైన్డ్ భూదోపిడీ అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాలను మొత్తం 1,336 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించిన లెక్కల ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500కోట్లు. అంటే చంద్రబాబు ముఠా ఎంతటి భారీ భూదోపిడీకి పాల్పడిందన్నది స్పష్టమవుతోంది. ఏ1 చంద్రబాబు, ఏ 2 నారాయణ నిబంధనలకు విరుద్ధంగా జీవో 41ను అప్పటి పురపాలక–సీఆర్డీఏ శాఖ మంత్రి పి.నారాయణ 2016 ఫిబ్రవరి 29న ఆమోదించారు. అనంతరం 2016 మార్చి 22న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పోస్ట్–ఫాక్టో–ర్యాటిఫికేషన్ చేసి మరీ ఆమోదించారు. అంటే అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు జీవో 41 కుట్ర పూర్తిగా చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే సాగింది. సీఐడీ సిట్ దర్యాప్తులో ఈ కీలక అంశాలను అప్పటి ఉన్నతాధికారులు వెల్లడించినట్లు సమాచారం. ఆమేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, సీఆర్డీయే, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వాంగ్మూలాలు ఇచ్చారు. అసైన్డ్ చట్టానికి విరుద్ధమైనప్పటికీ చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే జీవో 41 జారీ చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆ విధంగా జారీ చేసిన జీవో 41తో అమరావతి పరిధిలోని 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. తమ భూదాహం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల పొట్ట కొట్టింది. చంద్రబాబు ముఠా అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. కాగా 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసు దర్యాప్తును నిలిపివేసింది. సిట్ను రద్దు చేసింది.ప్రధాన నిందితుడైన చంద్రబాబే ఆ కేసులను ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించారు. తద్వారా సీఐడీ అధికారులకు ‘కర్తవ్యబోధ’ చేశారు. అనంతరం సీఐడీ అధికారులు అసైన్డ్ భూముల కేసులో రివైజ్డ్ చార్జ్షీట్ను న్యాయస్థానంలో దాఖలు చేయలేదు. అంతేకాదు ఈ కేసులో సాక్షులుగా ఉన్న అప్పటి సీఆర్డీయే అధికారులు, రెవెన్యూ అధికారులను బెదిరించారు. వారు గతంలో న్యాయస్థానంలో ఇచ్చిన 164 సీఆర్పీసీ వాంగ్మూలాలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. అనంతరం ఆ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’అని ముద్ర వేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ కేసును మూసివేసేందుకు అనుమతించాలని కోరారు. అధికార దుర్వినియోగంతో అసైన్డ్ భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేసినా సరే ప్రజాన్యాయస్థానంలో చంద్రబాబు దోషిగానే నిలబడ్డారన్నది ముమ్మాటికీ నిజం. అమరావతి సాక్షిగా చంద్రబాబు ముఠా భూదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా అసైన్డ్భూముల దోపిడీ కేసును అడ్డగోలుగా మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
రాష్ట్ర ప్రయోజనాల కోసమే 'మావిగన్': వైఎస్ జగన్
చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడ రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్ల వంటి బేసిక్ వసతులు కల్పించడానికే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని నీ అంతట నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు డీపీఆర్లు ఇచ్చావు. మరోవైపు లక్ష ఎకరాల్లో అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అందుకే చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్గా 10 శాతం ఖర్చుతో ‘మావిగన్’ను సూచించాం. కూటమి పాలనలో సగం టర్మ్ అయిపోయింది. అన్ని రంగాల్లోనూ ఘోర వైఫల్యం. అంతటా అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో ఏడాది దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర మొదలైన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం.దోచుకునేది.. పంచుకునేది.. తినుకునేది కట్ అయిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తెగబాధ పడిపోతున్నాడు. వైఎస్సార్సీపీ శ్రేణులందరిపై అన్యాయమైన, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఇదే రాధాకృష్ణకు చెబుతున్నా.. నువ్వన్న మాటలకు రేప్పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం. వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తోందా రాధాకృష్ణా?వారికైనా భార్యలు ఉంటారు. వాళ్ల భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా అలా మాట్లాడితే వారికి నచ్చుతుందా? ఎవరికీ నచ్చదు. నచ్చనప్పుడు కనీసం అలాంటి మాటలు మాట్లాడటం తప్పు అని ఈ నాయకులైనా చెప్పాలి కదా? ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు. ఈ లోకేశ్ చెప్పడు. ఈ దత్త పుత్రుడు చెప్పడు. సిగ్గు లేకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాటలు మాట్లాడితే.. వాటిని సమర్థిస్తారు. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోయాయి. ఈ రోజు సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో కామెంట్లు పెట్టిన పిల్లలను తీసుకువచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. జైళ్లలో పెడుతున్నారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. కొడుతున్నారు. రేప్పొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. మహిళలను తక్కువగా చూసే.. తక్కువగా మాట్లాడే పరిస్థితులు ఎందుకొచ్చాయి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణ భారం పడదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ‘మావిగన్ కారిడార్’తో తొలి రోజు నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుందన్నారు. కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలని.. ఆ ప్రాంతంలో పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు 110 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉన్నందున రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ లాంటి కనీస మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ గుర్తు చేశారు. అమరావతిలో ఆ పనులు పూర్తయ్యే సరికి ఎన్నో ఏళ్లు, దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పటికి నిర్మాణ వ్యయం ఎంతకు పెరుగుతుందని.. దాని వల్ల రాజధాని రుణాలు ఇంకెంత పెరుగుతాయని.. అసలు రాజధాని ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని.. అందుకే ప్లాన్ బి కింద మావిగన్ ప్రతిపాదించామని చెప్పారు. అయితే దీని వల్ల అమరావతిలో తమ అవినీతి కోటలు బద్దలవుతాయని చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. మరోవైపు ఓర్చుకోలేక రెచ్చిపోతున్న ఏబీఎన్ రాధాకృష్ణ గతి తప్పి మన పార్టీ నాయకులపై విమర్శలు చేశారని, ఇళ్లలోని మహిళలపైనా అసభ్య పదజాలం ఉపయోగించారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక గట్టిగా బుద్ధి చెబుతామని.. ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మావిగన్.. మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ‘‘చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు. ‘మావిగన్’. నిజంగా చంద్రబాబుకు మోస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇచ్చాం. మనం చాలా లౌక్యంగా అయ్యా చంద్రబాబు గారూ.. మీ చర్యలతో రాష్ట్రానికి ఎప్పటికీ క్యాపిటల్ లేకుండా చేస్తున్నారు. అమరావతి అని మీరు రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికే నీ అంతట నువ్వే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు డీపీఆర్లు ఇచ్చావు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకే రూ.లక్ష కోట్లకు దిక్కులేదు అనుకుంటే మరో 50 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ భూ సమీకరణ చేపడుతూ.. లక్ష ఎకరాల అమరావతి అని చెబుతున్నావు. ఈ లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లతో నీవు నిరంతరం రోడ్లు వేయడం, కరెంట్ ఇవ్వడం, డ్రైనేజీ పనులు చేసూ్తనే ఉంటావు. నిరంతరం నీళ్లు ఇచ్చేందుకే అవస్థలు పడుతుంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇప్పటికే 12 ఏళ్లు గడిచాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. డబ్బంతా రోడ్లు, కరెంట్, డ్రైనేజీ, నీళ్లకే ఖర్చు అవుతుంది. ఆ రెండు లక్షల కోట్ల విలువ దశాబ్దాలకు రూ.4 లక్షల కోట్లు అవుతుందో, ఇంకా ఎంత అవుతుందో తెలియదు. చివరికి 12 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటుంది. అయ్యా చంద్రబాబూ.. ఇది మానుకో. ఆ రెండు లక్షల కోట్లలో 10 శాతం ఖర్చు చేస్తే చాలు మావిగన్తో మంచి రాజధాని తక్షణమే అందుబాటులోకి వస్తుంది.ప్లాన్–ఏ వద్దన్నారు.. ప్లాన్–బీ ఎందుకు ఆలోచించడం లేదు? ప్లాన్–ఏ వద్దన్నారు సరే.. మరి ప్లాన్–బీపై ఎందుకు ఆలోచన చేయడం లేదు? నేను ఇంతకు ముందు రాజధాని విషయంలో మంచి ఆలోచన చెప్పాను. ప్లాన్–ఏ కింద రాష్ట్రంలో అన్నింటి కన్నా పెద్ద నగరం విశాఖపట్నం. అందులో కార్యనిర్వాహక రాజధాని పెడితే ఎలాంటి ఖర్చు అవసరం ఉండదు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అప్పట్లో మనం కర్నూలుకు మాటిచ్చాం. అది నెరవేర్చుతూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ, ఇక్కడే అమరావతిలో శాసన రాజధాని తీసుకువస్తే బాగుంటుందయ్యా అని చెబితే.. నానాయాగీ చేసి, రాజకీయాలు చేసి అవి వద్దు అన్నారు. సరే పోనీ అనుకుంటే ఈ ప్రాంతంలో నీవు చేసే పనికి రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా ప్లాన్–బీ కింద మావిగన్ ప్రతిపాదన తెచ్చాం.10 శాతం ఖర్చు చేస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రాజధాని మచిలీపట్నంలో పోర్టు కట్టింది నీవు కాదు చంద్రబాబూ.. మేం కట్టాం. వైఎస్సార్ర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పోర్టుకు భూ సేకరణ చేపట్టాం. మా హయాంలోనే అనుమతులు తీసుకువచ్చాం. మా హయాంలోనే ఫైనాన్షియల్ క్లోజర్ చేశాం. అప్పట్లోనే బ్యాంకులతో నీట్గా టై అప్ చేసి 30–40 శాతం వర్క్ కూడా పూర్తి చేశాం. ఆ పోర్టు పూర్తవుతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు 70 కిలోమీటర్లు.. విజయవాడ నుంచి గుంటూరుకు 40 కిలోమీటర్లు. మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉంది. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. మచిలీపట్నంలో పోర్టు వస్తుంది. ఈ హైవేకు అటూ ఇటుగా అమరావతిలో కట్టే బిల్డింగ్లు ఇక్కడ కడితే బాగుంటుంది. మచిలీపట్నం నుంచి (మా), విజయవాడ నుంచి (వి), గుంటూరు నుంచి (గన్) అంటూ మావిగన్ ప్రతిపాదన చేశాం. ఈ 110 కిలోమీటర్ల ఎకనావిుక్ కారిడార్ను కేపిటల్ కారిడార్గా డిక్లేర్ చేసి, ఆ కట్టే బిల్డింగ్లు ఇక్కడ కట్టండి. రూ.రెండు లక్షల కోట్లలో 10 శాతం ఇక్కడ ఖర్చు చేసి రోడ్లకు కనెక్టివిటీ ఇస్తే చాలు.. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారు అవుతుంది. డే వన్ నుంచే రాజధాని వస్తుంది. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ల తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం ఉండదు. మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయి అని చిలుకకు చెప్పినట్లు చెప్పినా, చంద్రబాబు ఒప్పుకోవడం లేదు.జగన్ ఏం చెప్పినా ససేమిరా..మనమంత బాగా, లౌక్యంగా చెప్పినా ఊహూ అంటున్నాడు. ఎందుకు అహం? ఎందుకు వద్దంటున్నారంటే.. కారణం అక్కడ రూ.రెండు లక్షల కోట్లలో మొబిలైజేషన్ వర్కుల పేరుతో 8 శాతం కమీషన్లు తీసుకోవచ్చు. మావిగన్లో ఈ ఆదాయాలు ఉండవు కదా.. కాబట్టి మావిగన్ వద్దు. అమరావతిలో అన్నీ స్కామ్లే. ఇక్కడ కాంట్రాక్టర్లు ఎవరంటే ఒకరు ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయలరఘు (ఆర్జీవీ), ఇంకొకరు బీఎస్ఆర్ (బలుసు శ్రీనివాసరావు). వీరు చంద్రబాబు బినావీులు. వారి సంస్థలకు కాంట్రాక్ట్లు. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. అమరావతి కాంట్రాక్టర్లు అంతా వీళ్లే. దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. అందుకనే మావిగన్ అంటే అహం.. వైఎస్ జగన్ ఏం చెప్పినా ఊహూ అంటున్నారు. చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ⇒ జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఇస్తాను.. ఇంకా అవి కాకుండా అంతకు మించి సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు కూడా ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. కానీ, ఈ రోజు బిర్యానీ పెట్టలేదు.. ఉన్న పలావు కూడా పోయిందని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, మన పథకాలన్నీ కూడా రద్దయిపోయి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోవడం కనిపిస్తోంది.⇒ విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఎక్కడా పలాన మంచి చేశామనే చెప్పే పరిస్థితి లేదు. మన ఐదేళ్ల పాలనలో మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా మీ జగన్ బటన్లు నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2.73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయి.. వారి ఆధార్ నంబర్లు సహా జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ⇒ కానీ ఇదే చంద్రబాబు రెండు సంవత్సరాలు కూడా తిరక్క ముందే రూ.3.52 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి ఈ అప్పు అంతా ఏమైంది? ప్రజల ఖాతాల్లోకి ఎందుకు రావడం లేదు? ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఎవరి జేబుల్లోకి పోతోంది? అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు, ముఖ్య కార్యకర్తలు ఏం జరిగినా రైతులను ఆదుకునే నాథుడు లేడు ⇒ కూటమి పాలనలో ఏ రైతుకూ గిట్టుబాటు ధర రావడం లేదు. అంతటా దళారీల వ్యవస్థ. మన హయాంలో ఆర్బీకే, – ఈ క్రాప్, సీఎం యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్) పెట్టి మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేసే వాళ్లం. ఆ రకంగా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చిన పరిస్థితి. నేడు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు.⇒ రైతులకు ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు కరువొచ్చినా, తుపాన్ వచ్చినా ఆదుకునే నాథుడు లేడు. వాళ్ల ఖర్మకు వదిలేసిన పరిస్థితి. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, మరుసటి సీజన్కి రైతును సన్నద్ధం చేసేవాళ్లం. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడేవాడే లేడు. ఆక్వాదీ అదే పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం ⇒ చదువుల పరిస్థితి ఇంకా ఘోరం. మన ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేసే వాళ్లం. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు క్రమం తప్పకుండా ఇచ్చే వాళ్లం. ఇప్పటికే రూ.7 వేల కోట్లకుపైగా బకాయిలున్నాయి. ఈ ఏడాది చేయాల్సిన చెల్లింపులు మరో రూ.2,600 కోట్లు కూడా చూస్తే మొత్తం రూ.10 వేల కోట్ల బకాయిలు అవుతాయి. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే బడ్జెట్లో రూ.2,600 కోట్లు పెట్టారు. అందులో ఎంత ఇస్తారో తెలియదు.⇒ పిల్లలతో తల్లిదండ్రులు చదువులు మాన్పించి పనికి పంపిస్తున్న పరిస్థితి. స్కూల్స్లో నాడు–నేడు పూర్తిగా ఆగిపోయింది. పిల్లలకు బ్రహ్మాండమైన భోజనం పెట్టాలనే ఆరాటంతో మనం గోరు ముద్ద అనే కార్యక్రమం తీసుకొస్తే, ఈ రోజు కనుమరుగైన పరిస్థితి. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనిపించేవి. ప్రతి స్కూల్ ఇంగ్లిష్ మీడియం. ఆరో తరగతి నుంచి డిజిటలైజ్ క్లాస్ రూమ్లు. గవర్నమెంట్ స్కూళ్లు ప్రైవేటు స్కూల్స్తో పోటీ పడే పరిస్థితికి మన హయాంలో తీసుకొచ్చాం. ఈ రోజు ఆ స్కూల్స్ అన్నీ నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి మన కళ్లెదుటే కనిపిస్తోంది. వైద్యంపై ఆలోచన చేసే నాథుడే లేడు⇒ ఆరోగ్యశ్రీ పరిధి ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.25 లక్షలకు పెంచాం. ప్రొసీజర్లను దాదాపు 3,300కు పెంచాం. ఆరోగ్యం బాగా లేకపోతే వైద్యం కోసం పేద, మధ్య తరగతి వాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని చేయి పట్టుకుని నడిపించాం. రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పేరుతో నెలకు రూ.5 వేలు చేతిలో పెట్టి పంపించాం. ఈరోజు నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,200 కోట్లు బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు వాటిని చెల్లించకపోతే చేతులు ఎత్తేస్తున్నాం.. మేం బోర్డు తిప్పేస్తాం.. అని ఆస్పత్రుల యాజమాన్యాలు ధర్నాలు చేస్తున్న పరిస్థితి. పేదవాడికి వైద్యం అందకపోయినా కనీసం ఆలోచన చేసే నాథుడే ఈ రోజు కనిపించడం లేదు. ⇒ ఉద్యోగుల బకాయిలు ఎప్పుడిస్తారో తెలియదు. మూడు డీఏలు పెండింగ్. ఐఆర్ ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ కమిషన్ను రద్దు చేశారు. కొత్త కమిషన్ను ఎప్పుడేస్తారో తెలియదు.మిగిలినవి రెండే బడ్జెట్లు.. హామీల అమలు లేదు⇒ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిపాలన ఎలా ఉంది అన్నది మీలో ఎవరికి మైక్ ఇచ్చినా నాకన్నా చక్కగా చెబుతారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఇటీవల మూడో సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాడు. మిగిలి ఉన్నది కేవలం రెండే బడ్జెట్లు. ఈ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు మనకు కనిపించేవన్నీ మోసాలే. ⇒ సూపర్ సిక్సులు.. సూపర్ సెవెన్లు అన్నాడు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల మీద ఈయన (చంద్రబాబు), పవన్ కళ్యాణ్ సంతకం పెట్టారు. త్రికరణ శుద్ధితో మేం ఇద్దరం కలిసి ప్రమాణం చేస్తున్నాం.. జూన్ 2024 నుంచి ఇవన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చి మోసం చేసిన పరిపాలన చూస్తున్నాం.⇒ మేనిఫెస్టో అన్నది మన హయాంలో భగవద్గీత, బైబిల్, ఖురాన్లుగా భావిస్తూ 99 శాతం హామీలను నెరవేర్చాం. ఈ మేరకు ప్రజల దగ్గరకు వెళ్లి గర్వంగా తలెత్తుకుని చెప్పేలా మన పార్టీ హయాంలో జరిగింది. ఈ రోజు మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన పరిస్థితులు మళ్లీ చూస్తున్నాం. జగన్ ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి.. జగన్ లేకపోతే పరిస్థితి ఏమిటి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.అంతా దోచుకో పంచుకో తినుకో.. డీపీటీ⇒ జగన్ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే దానిపై కూడా ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. కారణం ఒక్కటే. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు జగన్ హయాంలో పుష్కలంగా వచ్చేవి. ఈ రోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ). రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలన్నీ వీళ్లు దోచుకోవడానికి, వీళ్లు పంచుకోవడానికి, వీళ్లు తినుకోవడానికే సరిపోతున్నాయి. ⇒ ఈ రోజు ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. ఏ గ్రామంలో చూసినా వీధి వీధినా బెల్ట్ షాపులు. పోలీసులే దగ్గరుండి ఆ బెల్టు షాపుల్లో అమ్మించే కార్యక్రమం. ఎమ్మార్పీ కంటే రూ.10, రూ.20 ఎక్కువకు అమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అంతా వీళ్ల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, ల్యాటరైట్, గ్రానైట్, చివరికి చికెన్ అమ్మాలన్నా కూడా వీళ్లకు రావాల్సింది వీళ్లకు ఇస్తేనే సరి. లేదంటే చికెన్ కూడా అమ్మనివ్వడం లేదు చాలా నియోజకవర్గాల్లో. ఆ స్థాయిలో దోచుకుంటున్నారు. ⇒ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. పీపీఏలు. మన హయాంలో మనం రూ.2.49కి యూనిట్ ఇచ్చేలా పీపీఏ చేసుకున్నాం. రైతులకు మరో 25–30 ఏళ్లపాటు ఉచిత కరెంటు అన్నది ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా అందించాలన్న ఆరాటంతో ఆ మేరకు పీపీఏలు చేస్తే ఆరోజు నానా యాగీ చేసిన వీళ్లు ఈ రోజు రూ.4.60తో పీపీఏ చేస్తున్నారు. ఎంత తేడా! కళ్ల ముందే కనిపిస్తున్నాయి వీరి అక్రమాలన్నీ. ⇒ ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి. కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా రూ.5 వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు తన సమీప బంధువు అయిన విశాఖపట్నం ఎంపీకి ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు. అమరావతిలో కళ్ల ఎదుటే యథేచ్ఛగా దోపిడీ ⇒ అమరావతి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత దారుణమైన స్కాములు జరుగుతున్నాయన్నది మనందరికీ ఇప్పటికే అర్థమైంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ లెవెల్లో.. ఇటాలియన్ మార్బుల్ వంటి సదుపాయాలతో కట్టినా చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.4,500కు మించదు. కానీ అమరావతిలో మాత్రం అడుగుకు రూ.12 వేల నుంచి రూ.14 వేలు ఖర్చవుతోంది. ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరు రోడ్డు రూ.20 కోట్లకు పూర్తవుతోంది. ఇక్కడ మాత్రం రూ.53 కోట్లవుతోంది. ఎక్కడా లేని స్కాములు.⇒ ఈ స్కాముల్లో భాగస్వాములు ఎవరంటే ఈనాడు కిరణ్ వియ్యంకుడు ఒకరు. ఇంకొకరు చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు (బీఎస్సార్). అంతా వీళ్లే. వీళ్లకు కొత్తగా మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్సులు. ఇంతకు ముందు వర్కులు చేస్తే బిల్లులు చెల్లించే వాళ్లం. చంద్రబాబు పాలనలో వర్కులు చేయాల్సిన పని లేదు. చంద్రబాబు మనుషులే కాబట్టి ముందుగానే 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు. ఒక్కొక్కరికీ రూ.6 వేల కోట్ల పనులు.. దానికి రూ.600 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. పనులు చేయడం కథ దేవుడెరుగు.. మొదట మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తూ ఆ స్థాయిలో దోచేస్తున్నారు. ఇలా కొల్లగొడుతూ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది? రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాల పరిస్థితి ఏంటి?రాక్షస పాలనలో ఇదీ యుద్ధం⇒ ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటి ప్రాజెక్టులు ఆపేయడం కనిపిస్తోంది. రైతులు, పిల్లలు, అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. స్కీముల కథ దేవుడెరుగు.. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని దుస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. ⇒ రాష్ట్రంలో ఏ మాదిరిగా పరిపాలన సాగుతుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితుల మధ్య రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది. ప్రజల తరుఫున, మంచి తరఫున, ప్రజలకు మంచి చేయాలన్న ఆరాటంతో వైఎస్సార్సీపీ ఒకవైపున నిలుచుంటే.. మరోవైపు రాష్ట్రానికి అన్ని రకాలుగా చెడు చేస్తూ.. రాష్ట్రాన్ని దోచుకుని తింటున్న తెలుగుదేశం పార్టీ. ఈ యుద్ధంలో దేవుడు కచ్చితంగా మనపక్షానే నిలుస్తాడు. రేప్పొద్దున ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఫుట్ బాల్ను తన్నినట్టు తంతారు. సింగిల్ డిజిట్ కూడా చంద్రబాబుకు రాకుండా ఉండే పరిస్థితి అతి త్వరలోనే వస్తుంది. ⇒ వైఎస్సార్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా, తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్నాను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే. కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఇంకో సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే, రేపటి సంవత్సరం వచ్చేసరికి నా పాదయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటాను. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ⇒ ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వడ్డి రఘురాం, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీకి చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.వీళ్లపై యాక్షన్ ఏదీ?రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని బాధితురాలు ఆందోళన చేస్తుంటే.. న్యాయం చేయమని కంప్లైంట్ ఇస్తే.. ఆమెనే కొడుతున్నారు. ఆ పాప రోడ్డెక్కి తనకు అన్యాయం జరిగిందని చెబుతుంటే పోలీసుల సమక్షంలోనే కొడుతున్నారు.నరసరావుపేట ఎమ్మెల్యే జిల్లా ఎస్పీ ఆఫీసుకు వెళ్లి బాత్రూంలోకి పోయి డోర్ గడియ పెట్టుకున్నాడు. ఎస్పీ ఆఫీసులోకి పోవడమేంటి? బాత్రూంలోకి వెళ్లి డోర్ గడేసుకోవడమేంటి? గడేసుకుని స్ట్రైక్ చేయడమేంటి? తీసుకెళ్లి బొక్కలో వేయకుండా చంద్రబాబునాయుడు పంచాయితీ చేస్తున్నాడు.బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడో మనందరం చూసూ్తనే ఉన్నాం. టీటీడీ చైర్మన్గా ఉండి చేయకూడని తప్పులు చేస్తుంటే ఏం చేయాలి? ఆ మనిషిని టీటీడీ పదవిలో నుంచి ఊడబెరకాలా? వద్దా? చంద్రబాబు పక్కన పెట్టుకుని తిప్పుతున్నాడు. ఇంత దారుణంగా తయారయ్యారు.ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేస్తే నో యాక్షన్. పట్టించుకునేవాడు లేడు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ మహిళలకు వీడియో కాల్స్ చేసి అశ్లీలంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆడవాళ్లకు ఫోన్ చేసి అశ్లీలంగా వ్యవహరించాడు. అది బహిరంగంగా కనపడుతూనే ఉంది. ఎలాంటి యాక్షన్ లేదు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళలపై దారుణంగా లైంగిక దాడులు చేసినా పట్టింపులేదు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన వీడియోలు బయటికి వచ్చినా ఆ ఆదిమూలంపై నో యాక్షన్. వీరంతా ఎమ్మెల్యేలు.. ఒకరు తప్పు చేస్తే ఏం యాక్షన్ లేదు.. ఆడి మీద యాక్షన్ లేదు కాబట్టి.. నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారులే అని ఇంకొకడు. ఇలా ఒకడిని చూసి ఇంకొకడు రాక్షసులవుతున్న పరిస్థితి. మహిళను లైంగికంగా వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ.. ఆ పీఏ మీద కూడా నో యాక్షన్. పైగా ఆ మహిళ మీదే ఎదురు కేసు. ఈ స్థాయిలో రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఉంటే.. చివరికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడే మాటలు. ఒకరిని చూసి ఇంకొకరు. -
చంద్రబాబు మద్యం కుంభకోణం కేసు డాక్యుమెంట్లు ఇప్పించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న 2014–2019 మధ్య కాలంలో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన వేల కోట్ల రూపాయల భారీ నష్టంపై 2023లో సీఐడీ నమోదు చేసిన కేసులో తాను కోరిన డాక్యుమెంట్లను ఇచ్చేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని ప్రశ్నిస్తూ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ హైకోర్టును ఆశ్రయించారు. తనను థర్డ్ పార్టీగా పేర్కొంటూ తాను కోరిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందని తాజా పిటిషన్లో పేర్కొన్నారు. మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్ తాలూకు సర్టిఫైడ్ కాపీలను తనకు ఇచ్చేలా ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరారు. పిటిషన్లో ముఖ్యాంశాలు.. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులు వారికి అనుకూలమైన కొన్ని డిస్టిలరీలకు, అధికారంలో ఉన్న వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, మద్యం నాణ్యత కూడా క్షీణించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో కొంతమంది ప్రజా సేవకులు (పబ్లిక్ సర్వెంట్లు) ఉన్నారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం కింద నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతి అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు.. అది మొత్తం రాష్ట్రానికి, సమాజానికి వ్యతిరేకంగా జరిగే నేరమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. కాబట్టి, చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై గతంలో నమోదు చేసిన కేసును మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ను ప్రశ్నించే హక్కు రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఆ ప్రకారమే, నాకు కూడా ఈ కేసును ప్రశ్నించే చట్టపరమైన హక్కు ఉంది. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశాను. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఈ పిల్ పెండింగ్లో ఉండగానే, మద్యం కుంభకోణం కేసును ఏసీబీ కోర్టు మూసివేసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్లో తదుపరి విచారణ నిమిత్తం మద్యం కుంభకోణానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్, సీఆర్పీసీ 161 స్టేట్మెంట్లు, క్లోజర్ రిపోర్ట్లు చాలా అవసరం. పిల్ దాఖలు చేసింది నేనే కాబట్టి ఈ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరాను. అయితే ఏసీబీ కోర్టు దీనికి నిరాకరించింది. -
ఏబీఎన్పై జాతీయ మహిళా కమిషన్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్.. మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ ప్రజా ప్రతినిధుల్ని అగౌరవ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేస్తోందని జాతీయ మహిళా కమిషన్కు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పూర్తి ఆధారాలతో జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఆమె ఓ లేఖ రాశారు.తమ పార్టీ నేతలతో పాటు మహిళల్ని కించ పరిచే విధంగా కథనాలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో వరుదు కళ్యాణి ఇంకా ఏం పేర్కొన్నారంటే..మీడియా స్వేచ్ఛ పేరుతో ఏబీఎన్ వ్యక్తిత్వ హననంఏబీఎన్ ఆంధ్ర జ్యోతి న్యూస్ ఛానల్, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యం తమ ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా, యూట్యూబ్ వీడియో లింక్ : https://youtu.be/nF_9828F18c సహా, అత్యంత అపకీర్తికరమైన, అవమానకరమైన, తప్పుదారి పట్టించే, అనైతిక విషయాలను ప్రసారం చేసినందుకు సంబంధించి తక్షణ జోక్యం, తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కథనం ప్రసారం మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణ. ఇందులో అన్నీ అవాస్తవాలతో పాటు దురుద్దేశపూర్వక, హానికరమైన విషయాలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నం చేసింది. ఇది నిష్పక్షపాత పాత్రికేయ కథనం కాదు. ద్వేషం, హేళన, పక్షపాతాన్ని ప్రేక్షకుల మనసుల్లో నింపేందుకు ఉద్దేశించిన పక్షపాతపూరిత, ఏకపక్ష కథనమే.వైఎస్సార్సీపీ నేతలపై దారుణ వ్యాఖ్యలుఏబీఎన్లో ప్రసారమైన ఈ కథనంలో 7వ నిమిషం నుండి 8వ నిమిషం మధ్య ముఖ్యంగా,యాంకర్ అత్యంత అభ్యంతరకరమైన, పరువుకు భంగం కలిగించే భాషను వాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను, మద్దతుదారులను వెన్నెముక లేని వారిగా అభివర్ణించింది. అంతేకాక వారు తమ నాయకుడికి ఆపాదించిన అసంబద్ధమైన, హాస్యాస్పదమైన వ్యాఖ్యలను కూడా గుడ్డిగా నమ్ముతారని అనుకునే విధంగా పలు అసంబద్ధమైన వ్యాఖ్యలు కూడా చేసింది.రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలు మీ భార్యలు కాదని చెప్పితే, మీరు గుడ్డిగా విశ్వసిస్తారు, అంతేకాదు మీ సొంత భార్యలను కూడా అక్కాచెల్లెళ్లుగా భావించి, పెళ్లి సంబంధాలకు కూడా చూసుకుంటారు, ఇలాంటి నాయకులే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ సిగ్గులేని వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారహితం, తీవ్ర అభ్యంతరకరం. ప్రజల దృష్టిలో వైఎస్సార్సీపీ నేతల ప్రతిష్టను పలుచన చేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.కనీస బాధ్యత లేని పాత్రికేయంఈ వివాదాస్పద కథనంలో ఏబీఎన్.. వైఎస్సార్సీపీ నేతల్ని తెలివి, హేతుబద్దత, బుద్దీ జ్ఞానం లేని వారిగా చిత్రీకరించింది. అలాగే మా పార్టీ విధానాల్ని పిచ్చి ప్రతిపాదనలు అంటూ ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసింది. ఈ కథనంలో యాంకర్ మరింత ముందుకు వెళ్లి తమ పార్టీ నేతల్ని పిచ్చి వాళ్ల సమూహంగా కూడా అభివర్ణించడం దారుణం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమైన, పరువు నష్టం కలిగించే కథనమే అవుతుంది. ఈ వ్యాఖ్యలకు ఏ విధమైన వాస్తవ ఆధారాలు లేవు. లేదా ధృవీకరించబడిన మూలాలు కూడా లేవు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా ఏకపక్షంగా సాధారణీకరించి, కేవలం ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదారి పట్టించేలా వండి వార్చినట్లు స్పష్టమవుతోంది. ఇందులో వాడిన భాష కూడా అత్యంత అసభ్యంగా ఉంది. పార్లమెంటరీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంది. బాధ్యతాయుత మీడియా సంస్థ నుంచి ఆశించే ప్రాథమిక మర్యాదా ప్రమాణాలను కూడా ఉల్లంఘించింది.ఏబీఎన్ కథనం కేబుల్, టెలివిజన్ చట్టం ఉల్లంఘనేఏబీఎన్ ప్రసారం చేసిన ఈ కథనం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ (నియంత్రణ) చట్టం, 1995 కింద నిర్దేశించిన ప్రోగ్రామ్ కోడ్ ను పూర్తిగా ఉల్లంఘించింది. ఆ కోడ్ ప్రకారం అగౌరవ, తప్పుడు, అర్థసత్యాలైన విషయాలను ప్రసారం చేయకూడదు. ఇది పూర్తిగా నిషిద్దం. ఎందుకంటే ఇది ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించేది, తప్పుదారి పట్టించేదిగా ఉంది. అలాగే నిర్లక్ష్యంగా వండి వార్చడంతో పాటు ద్వేషం కలిగించేలా దీన్ని రూపొందించారు. వాస్తవాలను ధృవీకరించకపోవడం, సమతుల్య అభిప్రాయాలు ఇవ్వకపోవడం, లేదా ప్రతిస్పందనకు అవకాశం కల్పించకపోవడం మీడియా బాధ్యత, నైతిక ప్రమాణాల తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. అలాగే ఏబీఎన్ సంస్థ సంపాదకీయ నియంత్రణ పూర్తిగా లోపించిందని అనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి బాధ్యతారహిత, హానికరమైన కంటెంట్ ప్రసారం అయ్యేందుకు అవకాశం లభించింది.తక్షణం ఏబీఎన్ పై కఠిన చర్యలు తీసుకోండిఈ కంటెంట్ డిజిటల్ వేదికలపై కొనసాగుతూ అందుబాటులో ఉండటం వల్ల తమ పార్టీకీ, అధినేత జగన్కు జరిగిన నష్టం మరింత పెరుగుతోంది. ఎందుకంటే ఇది విస్తృతంగా ప్రేక్షకులకు అందుబాటులో ఉండి వారికి పరువుకు భంగం కలిగించేలా ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రమాదకరమైన ఉదాహరణగా మారుతుంది. అలాగే మీడియా సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి గౌరవ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని, ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి, దాని యాంకర్, ఎడిటర్, యాజమాన్యంపై చట్టప్రకారం తగిన చర్యలు ప్రారంభించాలి.అందులో అభ్యంతరకర కంటెంట్ తొలగింపుతో పాటు ప్రజలకు క్షమాపణ చెప్పడం, భవిష్యత్తులో ప్రోగ్రామ్ కోడ, పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా కట్టుబడి ఉండేలా చూడాల్సిన అసరం ఉంది. ఈ మేరకు తగు ఆదేశాలు జారీ చేయాలని ఛైర్ పర్సన్ ను కోరుతున్నాం. న్యాయం, నిష్పాక్షికత, వ్యక్తులు, సంస్థల గౌరవ పరిరక్షణ కోసం తగిన ఇతర ఆదేశాలను కూడా జారీ చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విజ్ఞప్తి చేశారు. -
‘చంద్రబాబు కుట్రలో భాగమే రాధాకృష్ణ చెత్త పలుకులు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ నాయకులను, మహిళలను కించపరిచేలా జుగుప్సాకరంగా మాట్లాడిన ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలని, మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ దిగజారుడు వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు సమర్థించడం చూస్తుంటే ఇది యాధృచ్చికంగా చేసిన వ్యాఖ్యలు కావని, వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా జరిగిన పన్నాగంగానే చూడాలని చెప్పారు.రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ సూచించిన మావిగన్పై ప్రజల్లో చర్చ మొదలైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే రాధాకృష్ణతో కుట్రలు చేయించారని వరుదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పేవరకు వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసే కుట్రవీకెండ్ కామెంట్స్, కొత్త పలుకు పేరుతో ఏబీఎన్ రాధాకృష్ణ తన ఛానెల్లో వైఎస్సార్సీపీ నాయకుల భార్యల గురించి నీచంగా మాట్లాడాడు. ఆ తప్పుడు వ్యాఖ్యలను రాధాకృష్ణ తక్షణమే వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన తెలియజేసింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందిపోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఆయన్ను సమర్థిస్తున్నారు.ఆచరణ సాధ్యంకాని అమరావతికి ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ని మావిగన్ పేరుతో డెవలప్ చేసుకోవచ్చని వైఎస్ జగన్ సూచించిన క్షణం నుంచి ప్రజల్లో ఆలోచన మొదలైంది. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ప్రజలు చర్చిస్తున్నారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న వేల కోట్ల దోపిడీని ప్రజలు అర్థం చేసుకున్నారని కూటమి నాయకులకు అర్థమైపోయింది. దాన్నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే ప్లాన్ ప్రకారం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయించారు. రాధాకృష్ణ వ్యాఖ్యలతో ఎవరైనా వైఎస్సార్సీపీ నాయకులు రియాక్ట్ అయితే వారిపై అమరావతి వ్యతిరేకుల ముద్ర వేసి మావిగన్ అనే పేరెత్తకుండా చేయాలనే పథకం ప్రకారం కుట్ర చేశారు.అవే మాటలను మీకు అన్వయించుకోండిప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నిరసనను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు లేదా? వైఎస్ జగన్ చెబితే వైఎస్సార్సీపీ నాయకులు వారి భార్యలను చెల్లెళ్లుగా భావించి పెళ్లిళ్లు చేస్తారని చెప్పడం సంపాదకీయంలో భాగమని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తే దాడి అని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి సంబంధం లేని వ్యక్తి డిబేట్లో మాట్లాడితే సాక్షి కార్యాలయాలను ధ్వంసం చేశారు. మీ నాయకుల ఇళ్లలో ఉన్న తల్లి చెల్లెళ్ల గురించి మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? మీ హెరిటేజ్ షేర్లలో, మీకున్న కోట్ల ఆస్తుల్లో మీ అక్కచెల్లెమ్మలకు ఎంత ఆస్తి రాసిచ్చారో ఒక్కసారైనా చెప్పారా?ఏరోజైనా మీ తోబుట్టువులను పండక్కి పిలిచి చీరసారె పెట్టి పంపించారా? ఏ హక్కుతో జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు? పత్రికా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వ హననం చేస్తున్న చంద్రబాబుని ఏరకంగా సమర్థిస్తారు? జగనన్న కళ్లలో ఆనందం కోసం వైయస్సార్సీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారని చెబుతున్న నారా లోకేష్, ఎవరి ఆనందం కోసం ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడాడు? విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు స్థలం కేటాయించినందుకా? విజయవాడలో రాధాకృష్ణ పవర్ ప్లాంట్కి అనుమతులు ఇచ్చినందుకా?ఇదేనా భువనేశ్వరి.. లోకేష్కి నేర్పించిన సంస్కారం? మంత్రి స్థానంలో ఉండి బాధ్యత మరిచి ఆంధ్రజ్యోతి నుంచి సాక్షికి ఎంత దూరమో, సాక్షి నుంచి ఆంధ్రజ్యోతికి అంతే దూరం అని మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో మీ ఇంట్లో ఆడవాళ్లను ఇలాగే అంటే ఊరుకుంటారా? ఏబీఎన్ రాధాకృష్ణ మాటలు విశ్లేషణలు అని చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదవుల కోసం మనసు చంపుకుని మాట్లాడటం అవసరమా అని ఆలోచించాలి. ఇదే ఏబీఎన్ పేపర్, టీవీలో తన తల్లిని దూషించినందుకు వాటిని బహిష్కరించిన విషయం అప్పుడే మరిచిపోయారేమో కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు.హోంమంత్రి అనిత మహిళ అయ్యుండి రాధాకృష్ణ వ్యాఖ్యలను ఖండించకపోవడం సిగ్గుచేటు. ఆమెకు పదవి ఇచ్చింది జగన్ని తిట్టడం కోసమా? టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నిల్చోమంటే నిల్చుంటున్నారు. మోదీని తిట్టినప్పుడు సై అన్నారు. మోదీని పొగిడినప్పుడూ జై అన్నారు. రాధాకృష్ణ మాట్లాడిన ఇవే మాటలు మీకు అన్వయించుకుంటారా చెప్పండి? ఆయన యూటర్న్లకు వంతపాడిన టీడీపీ నాయకులను కూడా ఇలాగే అనొచ్చా? అనిత హోంమంత్రిగా ఉండటం మహిళల దౌర్భాగ్యం. రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా మహిళా లోకానికే కళంకం తెచ్చారు.పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ, రాధాకృష్ణ పీడఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీఎన్ రాధాకృష్ణ మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇంతదారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే వరకు వైఎస్సార్సీపీ నిరసన తెలుపుతూనే ఉంటుంది. ఇవి యాధృచ్చికంగా వచ్చి న వ్యాఖ్యలు కావు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల సమర్థింపుతో కావాలని చేసిన కుట్రేనని తేలిపోయింది.వైఎస్సార్సీపీ నాయకుల వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలో భాగంగానే పథకం ప్రకారం ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో చేస్తున్న వేల కోట్ల దోపిడీని వైఎస్ జగన్ ఆధారాలతో సహా వెలికితీయడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ ప్రస్తావించిన మావిగన్ మోడల్తో చంద్రబాబు వేల కోట్ల అవినీతి ఆశలు కుప్పకూలిపోయాయి. వాటి నుంచి ప్రజల ఆలోచనలు డైవర్ట్ చేయడం కోసం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలు చేస్తున్నారు. పత్రికా రంగానికి ఆంధ్రజ్యోతి చీడ లాంటిది. జర్నలిస్టుల సమాజంలో రాధాకృష్ణ పీడలాంటి వాడు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు -
‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
‘చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ చొరవతోనే రాయలసీమకు సాగునీరు అందిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదంటూ దుయ్యబట్టారు. రాయలసీమకు నీళ్లు వచ్చాయంటే దానికి కారణం వైఎస్సారేనని శ్రీకాంత్రెడ్డి అన్నారు.‘‘హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా?. రాయలసీమకు మేలు చేయకపోగా.. నష్టం చేస్తున్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్నింట్లోను రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాంను 100 టీఎంసీలకు పెంచి రాయలసీమ గొంతు కొస్తున్నారు. అయినా చంద్రబాబు ఆల్మట్టి ఎత్తుపై స్పందించడం లేదు’’ అంటూ శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు.‘‘వైఎస్ కుటుంబం వలనే అనంతపురం జిల్లా హార్టికల్చర్ అభివృద్ధి జరిగింది. హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టును తెచ్చింది వైఎస్సారే. చంద్రబాబుకు శంకుస్థాపనలు చేసి వదిలేయటమే తెలుసు. కరువు ప్రాంతంలో చెరువులలో నీళ్లు ఉన్నాయంటే వైఎస్సారే కారణం. వైఎస్సార్, జగన్ల వలనే రాయలసీమకు మేలు జరిగింది. కానీ అన్నీ తానే చేశానంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు వలన చివరికి వెంకటేశ్వరస్వామికి కూడా నష్టం జరిగింది. చంద్రబాబు హయాంలోనే ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అయినా ఆయన నోరెత్తటం లేదు..రాయలసీమ లిఫ్టును సైతం నిలిపేసి చంద్రబాబు తన విద్వేషాన్ని బయట పెట్టారు. అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు. తన బినామీలకు దోచి పెడుతున్నారు. అమరావతిని అవినీతికి రాజధానిని చేశారు. కొత్త సిటీల నిర్మాణం సాధ్యమయ్యే పనేనా?. జనం లేని చోట రాజధాని కట్టి ఏం సాధిస్తారు?. నయా రాయపూర్లో ఎలాంటి అభివృద్ధి లేదు. ఎన్ని వేల కోట్ల ఖర్చు చేసినా అభివృద్ధి లేదు. అలాంటిది ఇక అమరావతిలో ఎన్ని లక్షల కోట్లు పోస్తారు?. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు జాకీలు ఎత్తు తున్నారు..లక్షల కోట్లు అమరావతిలో పెడితే మా రాయలసీమ పరిస్థితి ఏంటి?. నడుస్తున్న ప్రాజెక్టులను కూడా ఆపేశారు. మా దగ్గర వసూలు చేసే పన్ను అమరావతిలో ఖర్చు చేస్తే మరి మా పరిస్థితి ఏంటి?. భూమి, ఇసుక ఫ్రీగా ఇస్తున్నా కూడా రూ.16 వేల వరకు అడుగుకు ఖర్చు పెడుతుంటే అడగవద్దా?. నీళ్లు తోడటానికి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరగాల్సిన పనిలేదు. ఒక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులోకి దూరి హల్చల్ చేస్తే కనీసం కేసు కూడా పెట్టలేదు. ఇదేనా పరిపాలన?’’ అంటూ శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై కొనసాగుతున్న ఆందోళనలు
సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన రోత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం, ఏప్రిల్ 8) కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట వైఎస్సార్సీపీ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. మహిళలను ఉద్దేశించి పైశాచిక కామెంట్స్ చేసిన రాధాకృష్ణ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తోంది. వైఎస్సార్సీపీ ఆందోళనలు.. అప్డేట్స్వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుఅనంతపురం ఆంధ్రజ్యోతి ఆఫీసు వద్ద ఉద్రిక్తతనిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుపోలీసులు, వైఎస్సార్సీపీ నేతల మధ్య వాగ్వాదంఅక్కడే కూర్చొని నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలుబహిరంగంగా క్షమాపణలు చెప్పాలి: దేవినేని అవినాష్రోత పత్రిక, రోత ఛానెల్ ఏబీఎన్లో రాధాకృష్ణ మహిళలను కించ పరిచాడురాధాకృష్ణ మహిళలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అమరావతిలో అవినీతి కోసం చంద్రబాబు పాకులాడుతున్నాడు రాధాకృష్ణ దుర్భాషలాడితే చంద్రబాబు, పవన్, లోకేష్ ఏమైపోయారుస్కీమ్లు, స్కామ్లతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారుప్రజానీకానికి ఉపయోగపడే విధంగా మావిగన్ను జగన్ ప్రతిపాదించారుగుంటూరులో పోలీసుల దౌర్జన్యంఏబీఎన్ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నేతల నిరసనమాజీ మంత్రి అంబటిని అడ్డుకున్న పోలీసులుఏబీఎన్ ఆఫీస్ ఎదుట బైఠాయించిన అంబటి, పార్టీ నేతలువైఎస్సార్సీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై జులుంపోలీసుల అరాచకంపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం నెల్లూరు ఆంధ్రజ్యోతి యూనిట్ ఆఫీస్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనమాజీ మంత్రి కాకాణి ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనవైసీపీ నేతల ఇంట్లోని మహిళలపై అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణABN రాధాకృష్ణ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆగ్రహంతో వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకురాధాకృష్ణపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలిరాధాకృష్ణ తప్పుడు కూతలపై శాంతియుత నిరసన చేపట్టాము రాధాకృష్ణది కొత్త పలుకు కాదు చెత్త పలుకుదేశంలో అతిపెద్ద స్కాం అమరావతిమావిగన్ అతిపెద్ద గ్రోత్ కారిడార్జగన్ ది స్టేట్ ఇంట్రెస్ట్ అయితే చంద్రబాబు ది రియల్ ఎస్టేట్రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ఠకు..: కేకే రాజురాధాకృష్ణపై విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కేకే రాజు ఆగ్రహంమావిగన్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం మహిళలపై పిచ్చి రాతలు రాధాకృష్ణ పిచ్చి పరాకాష్ట కు చేరుకుందిజర్నలిజం విలువలను రాధాకృష్ణ కాలరాశారు కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారురాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలిట్రాఫిక్ను మళ్లించి మరీ పోలీసుల రక్షణవైఎస్సార్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్సీపీ ఆందోళనలు ఏబీఎన్ ఆఫీసు వద్ద ఆందోళన చేసేందుకు వెళ్లిన నాయకులు, కార్యకర్తల అరెస్ట్ఏబీఎన్ కార్యాలయానికి మూడంచెల భద్రతఇప్పటికే ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుఆంధ్రజ్యోతి కోసం ట్రాఫిక్ను మళ్లించిన పోలీసులుపాఠశాలలకు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులునగరంలో తీవ్ర ట్రాఫిక్ కష్టాలుపాత బస్టాండ్కు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులుశాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులురాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వైఎస్సార్సీపీ శాంతియుత నిరసన నిరసనలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, ఉమ్మడిగి శాఖ జిల్లా నాయకులువైఎస్సార్సీపీ నిరసనపై పోలీసుల జులుంనిరసన కోసం వేసిన టెంటును తీసివేసిన పోలీసులుశాంతియుత ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే నాయకులను అడ్డుకుంటున్న పోలీసులుఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులను, అనకాపల్లి జిల్లా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ నేతలుఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్భారీగా మోహరించిన పోలీసులుఅన్నమయ్య జిల్లాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళనవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ ఆధ్వర్యంలో నిరసనఅంబేద్కర్ విగ్రహ వద్దకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం భారీగా మోహరించిన పోలీసులు ఆంజాద్ బాషా హౌజ్ అరెస్ట్వైఎస్సార్సీపీ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలువైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకుల హౌస్ అరెస్టులుమాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద మోహరించిన పోలీసులుఅంజాద్ బాషా ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుమాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్నేడు కడపలోని ABN కార్యాలయం ఎదుట నిరసనకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శ్రేణులుఈ నిరసనలకు హాజరు కావద్దంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నంవిజయవాడ ఏబీఎన్ ఆఫీస్ వద్ద.. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ఏబీఎన్ కార్యాలయం వద్ద ఆందోళనకి సిద్దమైన వైఎస్సార్సీపీఏబీఎన్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు..ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లే రహదారులలో బారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులునిరసన తెలిపి తీరతామంటున్న వైఎస్సార్సీపీ నేతలుమహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ, విలువలు దిగజార్చేలా ఉన్నాయని చెప్పారు. మహిళలను ఆయన అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసు ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నేడు ఏపీలోనూ శాంతియుత నిరసనలు తెలపనున్నారు. -
23 నెలల్లోనే రూ.3.52 లక్షల కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిన చోటల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడంలోనూ, రాష్ట్ర రాబడిని పెంచడంలోనూ ఘోర వైఫల్యం చెందారు. రాష్ట్ర ప్రజానీకంపై మాత్రం భారీ అప్పుల భారాన్ని మోపడంలో సఫలీకృతం అయ్యారు. మంగళవారం బడ్జెట్లో చేసిన అప్పుతో పాటు ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,84,259 కోట్లకు పెంచేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కొక్కరిపై తలసరి అప్పును రూ.1,85,761కి పెంచేశారు. 23 నెలల పాలనలోనే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకంపై రూ.3,52,055 కోట్ల అప్పుల భారం మోపింది.బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల అందిన కాడకల్లా అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు. కొత్తగా అభివృద్ధి లేదు.. ఉద్యోగాలూ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచలేదు. రాష్ట్ర ఖజానాకు రాబడినీ పెంచలేదు. చేసిన అప్పులన్నీ చంద్రబాబు సర్కారు రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 8.07 శాతం వడ్డీకి రూ.4,400 కోట్ల బడ్జెట్ అప్పు చేసింది. దీంతో 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్లోనే రూ.1,93,964 కోట్ల అప్పు చేసింది. మరో పక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,10,704 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ అప్పులు చేస్తున్నారు.చేసిన అప్పుల వాయిదాలను సకాలంలో చెల్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అప్పులు చేస్తోంది. మరో పక్క రాజధాని పేరుతో మరో రూ.47,387 కోట్లు అప్పు చేసింది. ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం రూ.6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు 23 నెలల పాలనలోనే రాష్ట్ర మొత్తం అప్పులను రూ.9,84,259 కోట్లకు పెంచేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.15,306 కోట్లు, రోజుకు రూ.510 కోట్లు చొప్పున అప్పు చేసింది. -
ప్రశ్నించానని పోలీసులు రిమాండ్కు పంపారు
సాక్షి, అమరావతి: తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించిన తనను పామర్రు సీఐ శుభాకర్, ఎస్ఐ భాస్కర్ పోలీస్స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్లో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి ఫిర్యాదు చేశానని, ఆయన తన అర్జీని పోలీసులకు అప్పగించగా.. వారు తనపై సెక్షన్ 307 కింద రివర్స్ కేసు పెట్టి రిమాండ్కు పంపారని వాపోయారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చానని చెప్పారు. మంగళవారం ఆమె తన తల్లిదండ్రులు ఆరోగ్యం, జుజ్జువరపు చిన్ని, బాబాయి యాకోబుతో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు గణేష్ కోసం పోలీసులు తన కుటుంబంపై ఇంత దారుణంగా వ్యవహరించారని వైఎస్ జగన్కు వివరించారు. వైఎస్సార్సీపీలో ఉత్సాహంగా పని చేస్తున్నామనే కక్షతో తన బాబాయి యాకోబు ఇంటిని టీడీపీ నేత గణేష్ తగల బెట్టించాడని, తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని చెప్పారు. సుప్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు పార్టీ ఇన్చార్జ్ కైలే అనిల్ కుమార్కు సూచించారు. పామర్రు సీఐ శుభాకర్, ఎస్ఐ భాస్కర్పై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వియ్యంకుల ప్యాకేజీ.. బాబుకు బాకా.. ‘డీపీటీ’లో వాటా!
సాక్షి, అమరావతి: నిత్యం ఉషోదయంతో సత్యం నినదించు గాక..! అంటూ తెలుగు లోగిళ్లను బురిడీ కొట్టిస్తూ తెల్లారింది మొదలు అనునిత్యం అసత్యాలను అచ్చోసి ఒక పార్టీకి కొమ్ము కాసి దశాబ్దాలుగా ‘ఈనాడు’ను ఎలా నడిపారో మనమంతా చూశాం.. చూస్తూనే ఉన్నాం.. ! ఇక ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ‘అమరావతి’ ఆచరణ సాధ్యం కాదని ప్రపంచమంతా మొత్తుకుంటున్నా.. అది ఎప్పటికీ జరగదని, రోడ్లు వేయటానికే దశాబ్దాలు పడుతుందని తెలిసినా.. దీనివల్ల రాష్ట్రానికి రాజధానే లేకుండా పోతుందని అంతా హెచ్చరిస్తున్నా.. ఎల్లో మీడియా మాత్రం గంగవెర్రులెత్తుతోంది! ఎందుకంటే... స్వయంగా ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడిని ముందు పెట్టి అమరావతి ముసుగులో ఈ ముఠా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు చేజిక్కించుకుని లబ్ధి పొందుతోంది కాబట్టే..! వీళ్లకు రాష్ట్ర ప్రయోజనాలతో ఏమాత్రం సంబంధం లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును అనుసంధానించే ‘మావిగన్’ కారిడార్ వల్ల తక్కువ ఖర్చుతో శరవేగంగా ఏపీ రాజధాని సాకారమవుతుందని నిపుణుల నుంచి యువత వరకు అంతా స్వాగతిస్తూ చెబుతున్నా.. పచ్చ ముఠా మాత్రం రూ.వేల కోట్ల దోపిడీ కోసం ‘అమరావతి’ అంటూ మభ్యపెడుతోంది. ‘మావిగన్’ ఏపీకి గ్రోత్ ఇంజన్లా మారి రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చి మేలు జరుగుతుందని స్పష్టంగా తెలుస్తున్నా... గజ దొంగల ముఠా మాత్రం దీనివల్ల తమ దోపిడీకి తెర పడుతుందని తీవ్ర ఆందోళన చెందుతోంది. దీంతో ఎల్లో మీడియా చంద్రబాబు కంటే పది అడుగులు ముందుకు వేసి అమరావతి పేరుతో జనం కళ్లకు గంతలు కడుతోంది. అమరావతిలో రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైయినేజీ లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమని స్వయంగా చంద్రబాబు ప్రభుత్వమే వెల్లడించింది. ఎప్పటికి పూర్తవుతుందో అంతుబట్టదు..! డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు..! అయినా సరే.. అదిగదిగో అమరావతి..! దేవతల రాజధాని..! అంటూ కళ్లముందు సాక్షాత్కారమైనట్లు ఈనాడు చిత్రీకరించటానికి అసలు కారణం ‘డీపీటీ’నే! రాష్ట్రంపై ఎంత భారం పడినా సరే అమరావతి కొనసాగితేనే వీళ్ల దోపిడీ కొనసాగుతుంది..! దీనికి చంద్రబాబు సర్కారు సంపూర్ణంగా సహకరించడంతోనే అమరావతిని ఎల్లో మీడియా భుజాన వేసుకుని భజంత్రీలు వాయిస్తోంది!!అమరావతి నుంచి పోలవరం దాకా డీపీటీనే..!రాజధాని అమరావతి నిర్మాణ పనుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకూ ప్రజాధనాన్ని దోచుకో– పంచుకో – తినుకో (డీపీటీ) అనే రీతిలో ప్రభుత్వ పెద్దలతో ‘ఈనాడు’ బంధం కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుతూ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా తప్పుడు కథనాలు అచ్చేయడంలో ‘ఈనాడు’ది అందెవేసిన చెయ్యి అని గుర్తు చేస్తున్నారు. ఎన్టీ రామారావుకు 1995లో వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్రబాబు గద్దెనెక్కే వరకు కుడి, ఎడమల దన్నుగా నిలిచింది రామోజీరావేనన్నది బహిరంగ రహస్యమే! ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి ప్రజా ధనం దోపిడీకి పచ్చ జెండా ఊపుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ సంస్థకు రాజధానిలో 13 ప్యాకేజీలు.. పోలవరం ఎడమ కాలువలో ఒక ప్యాకేజీ.. హంద్రీ–నీవాలో మూడు ప్యాకేజీలు కలిపి మొత్తం 17 ప్యాకేజీల్లో రూ.6,859.95 కోట్ల విలువైన పనులు (జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నులు అదనం) కట్టబెట్టడం గమనార్హం. ఇందులో పది శాతం అంటే రూ.685.99 కోట్లను రాయల రఘుకు మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ప్రభుత్వం చెల్లించింది. దీన్ని నీకింత నాకింత..! అంటూ పంచుకు తిన్నారు. రాజధానిలో 2014–15లో ‘ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో లాంటి ఆర్థిక సంస్థల నుంచి చంద్రబాబు సర్కారు అధిక వడ్డీలకు రూ.47,387 కోట్లు అప్పులు చేస్తోంది.రాజధానిలో ఆర్వీఆర్కు రూ.6,031.79 కోట్ల పనులు..ఈనాడు కిరణ్ వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్స్కు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చేపట్టిన పనుల్లో రూ.2,813.66 కోట్ల విలువైన 4 ప్యాకేజీలు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) చేపట్టిన పనుల్లో రూ.3,218.13 కోట్ల విలువైన 9 ప్యాకేజీలు వెరసి రూ.6,031.79 కోట్ల విలువైన(జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నులు అదనం) 13 ప్యాకేజీలను కట్టబెట్టారు. అంతేకాదు.. మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.600.31 కోట్లు చెల్లించారు. పనుల అంచనా వ్యయం పెంచేయడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. ఈనాడు కిరణ్ బంధువులకు ఇంత భారీ స్థాయిలో లబ్ధి చేకూరుస్తుండటం.. ఈ భారీ దోపిడీలో వాటాదారు కావడంతోనే అమరావతిని అద్భుతంగా నిర్మిస్తున్నారంటూ చంద్రబాబు సర్కారును ఎల్లో మీడియాలో కీర్తిస్తున్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచిపెట్టారన్నది స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఈనాడు కిరణ్కు ప్రయోజనం చేకూర్చారని స్పష్టం చేస్తున్నారు. ఆర్వీఆర్ ప్రాజెక్సŠట్కు అప్పగించిన పనులన్నీ రెండేళ్లలో పూర్తి చేయాలన్నది టెండర్లో పెట్టిన నిబంధన. వాటిని ఆ సంస్థకు అప్పగించి ఇప్పటికే ఏడాది పూర్తయింది. కానీ.. పది శాతం పనులు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. లక్ష్యం మేరకు పనులు చేయని ఆ సంస్థపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏమిటన్నది బహిరంగ రహస్యమే.తమ దోపిడీకి ‘మావిగన్’ అడ్డొస్తుందనే..!అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.11 వేల నుంచి రూ.14 వేల చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. పైగా ఇసుక ఉచితం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ వసతులతో చదరపు అడుగు నిర్మాణ పనులను రూ.4,500లకే చేస్తున్నారు. ఇక ఆరు వరుసల జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోంది. కానీ.. రాజధానిలో అదే తరహా రోడ్లను కి.మీ.కు రూ.53 కోట్ల వంతున కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు, విద్యావంతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రూ.2 లక్షల కోట్లు.. అది కూడా కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు చేయడం వల్ల అమరావతి రాష్ట్రానికి ఆర్థికంగా గుదిబండగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. అదే మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు (మావిగన్) 110 కి.మీ. కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి కేవలం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. స్వల్ప కాలంలోనే మహానగరంగా మారుతుందని.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా అవుతుందని.. ఆ ప్రతిపాదన ఆచరణాత్మకమైందంటూ విద్యావంతులు, మేధావులు, ఆర్థికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దీనికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండటంతో అది తమ దోపిడీకి అడ్డొస్తుందని ఈనాడు కిరణ్ ఆందోళన చెందుతున్నారు. అందుకే రాజధానిలో సాగుతున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారని మేధావులు, విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు.పోలవరంలో రూ.81.63 కోట్ల పని రూ.307.41 కోట్లకు అప్పగింత..పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5 ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరలకు అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277 శాతం అధికం) అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత.. అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2019 నాటికి.. నేటికీ డీజిల్, స్టీలు, పెట్రోల్, సిమెంటు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది. టెండర్లలో 4.68 శాతం అధిక ధరకు రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్ల మేర పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.హంద్రీ–నీవా లైనింగ్లో రూ.520.75 కోట్ల పనులు ఆర్వీఆర్ చేతికి..హంద్రీ–నీవా కాలువకు సిమెంటు లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి.. బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ. నుంచి 400.500 కి.మీ. వరకూ ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెళ్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లకు (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు) అస్మదీయ కాంట్రాక్టర్లకు అప్పగించారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లైనింగ్ పనులు చేశారు. నాణ్యత తీసికట్టుగా ఉన్నా ఆర్వీఆర్ ప్రాజెక్టŠస్ సంస్థకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. -
టెన్త్ స్పాట్.. ఫెయిల్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాలు వికటించాయి. ముఖ్యంగా సంస్కరణల పేరుతో రూ.కోట్లు ఖర్చు పెట్టి పదో తరగతి పరీక్షల విషయంలో అమలు చేసిన విధానాలు బెడిసి కొట్టాయి. ఈ విద్యా సంవత్సరంలో ఆటోమేషన్ పేరుతో అడ్డదిడ్డంగా ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. అప్పుడు జరిగిన తప్పులను సరిచేసుకోకుండానే అదే ఆటోమేషన్ను పదో తరగతి మూల్యాంకనం (స్పాట్ వాల్యూయేషన్) విధులకు కూడా వర్తింపజేశారు. దీంతో సబ్జెక్టులు బోధించని వారికి కూడా స్పాట్ వాల్యూయేషన్ డ్యూటీలు పడ్డాయి. ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా పేపర్లు దిద్దాల్సిందేనని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మార్కులు ఏ విధంగా వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస శిక్షణ లేకుండానే విధులు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం పది రోజుల్లో (ఏప్రిల్ 16లోపు) పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం విధుల్లో చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20 వేల మందిని ఆటోమేషన్ ద్వారా నియమించారు. వారికి కేడర్ల ఆధారంగా చేయాల్సిన విధులపై కనీస శిక్షణ కూడా ఇవ్వకుండా మూల్యాంకనం సెంటర్లకు పంపించారు. వాస్తవానికి మూల్యాంకనం ప్రారంభమయ్యే నాటికి సిబ్బంది ఎంపిక, శిక్షణ పూర్తవ్వాలి. కానీ, మంగళవారం కూడా చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లను ఎంపిక చేసి స్పాట్ కేంద్రాలకు పంపినట్లు తెలిసింది. దీనినిబట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనిచేయని ట్యాబులు, ఇంటర్నెట్! ఈ ఏడాది కొత్తగా పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల్లోనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.50 లక్షలతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు పేపర్లు వేల్యూ చేసిన అనంతరం మార్కులను ట్యాబ్లలో నమోదు చేయాలి. వీటిని స్పెషల్ అసిస్టెంట్లు మరో ట్యాబ్లో రెండోసారి నమోదు చేస్తే, అవి లీప్ యాప్లో అప్లోడ్ అవుతాయి. కానీ, స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంచిన ట్యాబ్లు, ఇంటర్నెట్ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మూల్యాంకనం సాయంత్రం 4 గంటలకల్లా పూర్తవ్వాలి. కానీ, ట్యాబ్లు, ఇంటర్నెట్ సక్రమంగా పని చేయకపోవడంతో సోమవారం అర్ధరాత్రి 11 గంటలు దాటినా మార్కుల నమోదు పూర్తికాలేదని తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు దిద్దిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్ రూములకు తరలించారని సమాచారం. ఇవన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. -
ఓ పక్క కుండపోత.. మరోపక్క ఎండల వాత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ పక్క వరుణుడు కాలం కాని కాలంలో వర్షాలు కురిపిస్తుండగా, మరో పక్క భానుడు భగభగమంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కాస్తున్నాయి. మంగళవారం శ్రీకాకుళం జిల్లా కోర్లాంలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురవగా, దక్షిణ కోస్తాలోని మార్కాపురంలో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.2, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.1, చిత్తూరు జిల్లా సింధురాజపురం, నెల్లూరు జిల్లా నెల్లూరు పాలెంలో 42.6, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 42.2, ఎన్టీఆర్ జిల్లా చందాపురం, కడప జిల్లా ఒంటిమిట్టలో 41.9, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 41.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 155 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు అనకాపల్లి జిల్లా రాజంలో 5.4, చూచుకొండలో 3.9, అనకాపల్లిలో 3.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.️ -
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను దారిమళ్లించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ మహిళలను ఉద్దేశించి అసహ్యకర, దిగజారిన భాషతో వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదని, రాధాకృష్ణ వ్యాఖ్యలు మహిళలను అవమానించడమే కాకుండా కించపరిచేలా చేసిన దాడిగా భావించాలన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాధాకృష్ణ వివక్ష పూరిత జర్నలిజంతో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘రేపు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముక లేని నాయకులు వైఎస్సార్సీపీలో ఉన్నారంటూ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘మావిగన్’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను దారి మళ్లించడానికి ఉద్దేశ పూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కుట్రలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకు దిగారు. మా పార్టీ నాయకులు శాంతియుతంగా నిరసనలతో రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడకుండా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అత్యంత సంయమనంతో వ్యవహరించారు. కానీ, ఇటువంటి జుగుప్సాకర వ్యాఖ్యలను ఖండించకపోగా చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్లు మద్దతు ఇవ్వడం మహిళలపై వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని చూపిస్తోంది. రాధాకృష్ణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. బాధ్యతారహిత, విషపూరిత వ్యాఖ్యలను సమర్థించిన నాయకుల వైఖరిని మేము ఖండిస్తున్నాం’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో పేర్కొన్నారు. -
రాధాకృష్ణా.. ఖబడ్దార్
విలువలన్నీ విడిచేసి.. బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సాగిస్తున్న ‘చెత్తపలుకు’పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఇలాంటి రోతరాతలు రాధాకృష్ణకు కొత్త కాదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఆంధ్రజ్యోతి ప్రధానకార్యాలయం వద్ద కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోతరాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛకిందకు ఎలా వస్తుందని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్/సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తమ మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో మహిళలను కించ పరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్లో వైఎస్సార్సీపీ నాయకులు నిరసన తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావు.. చెత్త పలుకులు అంటూ ఊరూరా ర్యాలీలు చేశారు. రాధాకృష్ణా ఖబడ్దార్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజం అని నినాదాలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతులను పలుచోట్ల మంటల్లో వేసి తగలబెట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులకు నిప్పుపెట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేశ్, హోం మంత్రి అనిత ఏబీఎన్పై, రాధాకృష్ణపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. పైగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై విష ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ ఏబీఎన్ రాధాకృష్ణను గట్టిగా హెచ్చరించారు. ఛీటర్ రాతలకు భయపడే ప్రశ్నే లేదు హైదరాబాద్ ఫిలింనగర్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్రోకరిజంపై ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ వద్ద బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసివేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయనిమచ్చగా నిలుస్తాయన్నారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను అవమానించారు. గడ్డి తిని ఈ వ్యాఖ్యలు చేశారా? రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఆయనది ఒకే ఎజెండా. రాధాకృష్ణ ఒక ఛీటర్.. ఆయన రాతలకు భయపడే ప్రశ్నే లేదు’ అని మండిపడ్డారు. ఈ ఆందోళనలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు టి.విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రమేష్ యాదవ్, భరత్, పి.రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, ఇజ్రాయిల్, కావూరి శ్రీనివాస్, సురేష్, చంద్రశేఖర్రెడ్డి, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ కూకట్పల్లిలో వైఎస్సార్ అభిమానులు ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు మనసులో ఉన్నదే రాధాకృష్ణ రాస్తున్నారు చంద్రబాబునాయుడు మనసులో ఏముందో రాధాకృష్ణ అదే రాస్తున్నారు. నిత్యం వైఎస్సార్సీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే మహిళలను కించపరిచేలా రాతలు రాశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. కుట్రలతో వైఎస్సార్సీపీ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం సరికాదు. – కాకాణి గోవర్దన్రెడ్డి, మాజీ మంత్రి ఇది వేశ్యా రాజకీయం ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో వేశ్యా రాజకీయం చేస్తున్నారు. బూతు పత్రికను పెట్టుకుని చెడు రాతలు రాస్తూ వైఎస్సార్సీపీ కుటుంబంపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే తెలుగు ప్రజలు తరిమికొడతారు. బూతు భాషపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. – జోగి రమేష్, మాజీ మంత్రి రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి ఏబీఎన్ రాధాకృష్ణకు కుల గజ్జి పట్టి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కంట్లో పడాలని మహిళలను కించపరుస్తున్నారు. పక్క రాష్ట్రంలో తల దాచుకుని.. అక్కడొక పార్టీ, ఇక్కడొక పార్టీతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు, రాతలు దుర్మార్గం ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. రాధాకృష్ణ అనే వ్యక్తి విలేకరిగా ఉంటూ అనేక తప్పుడు కార్యక్రమాలు, వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. బూతు పత్రికలు, ఛానల్లు నడపడం సమంజసమా? – అంబటి రాంబాబు, మాజీ మంత్రి రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు ఏబీఎన్ రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు. దేవుడి లాంటి ఎన్టీఆర్ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించావు. నీ బిల్డింగ్లో ఎన్నో పాపకార్యాలు చేశావు. ఇప్పుడు వైఎస్సార్సీపీ మహిళల పట్ల విపరీత వ్యాఖ్యలు చేస్తున్నావు. నీ కుటుంబం ఏమిటి? నీ భార్య, నీ కూతురు పరిస్థితి ఏమిటి? ఒకసారి వారి గురించి కూడా రాయి. నీ పాపం పండింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. – నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్సీపీ నాయకురాలు అవి చెత్త పలుకులుకొత్త పలుకు పేరిట చెత్త పలుకులు రాస్తున్న రాధాకృష్ణ జర్నలిజపు విలువలకు పాతరేశారు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఇలాంటి రాతలు రాయడం దౌర్భాగ్యం. దీనిని ఎవరూ హర్షించరు. వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
నాది న్యాయపోరాటం.. రాజకీయం కాదు
సాక్షి టాస్క్ఫోర్స్: తన పోరాటం రాజకీయం కాదని విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్ చెప్పారు. నాగమాధవికి చెందిన కంపెనీలో పనిచేసిన తన కెరీర్ను నాశనం చేయాలని చూశారని, అందుకే తాను నష్టపరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్నానని ‘సాక్షి’కి తెలిపారు. ఎమ్మెల్యే నాగమాధవికి చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విజయనగరం జిల్లా ముంజేరు పంచాయతీలో ఉన్న బ్రాంచిలో 2021 నుంచి 2024 నవంబర్ వరకు సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసినట్లు చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన నాగమాధవి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఎన్నికల కమిషన్కు గత ఫిబ్రవరిలో ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ విజయనగరం జిల్లా కలెక్టర్/ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఆధారాలతో తన కార్యాలయానికి రావాలని నెల్లిమర్ల తహసీల్దార్ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రాణభయం కారణంగా తాను స్వయంగా హాజరుకాలేనని, జూమ్ మీటింగ్లో విచారణకు అనుమతించమని ఎన్నికల సంఘానికి ఈ–మెయిల్లో విజ్ఞప్తిచేసినట్టు చెప్పారు. తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో 2025 డిసెంబర్ 22న విశాఖపట్టణం లేబర్ కమిషనర్ను ఆశ్రయించినట్లు తెలిపారు. తనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఆగిపోయిన బోనస్ ఇవ్వాలని లేబర్ కమిషనర్.. ఈ ఏడాది జనవరి 27న యాజమాన్యానికి నోటీసు ఇచ్చారని తెలిపారు. తాను రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసిందన్నారు. తన కెరీర్ నాశనం అవుతుందన్న ఆందోళనతో.. ఎన్నికల్లో కంపెనీ చేసిన ఆర్థిక అవకతవకలపై ముందుగా ఫిబ్రవరిలో భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇది తెలుసుకున్న యాజమాన్యం ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటేనే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. సర్టిఫికెట్ ఇచ్చినరోజే వెనక్కి తీసుకుంటానని చెప్పినా, వాళ్లు పట్టించుకోకపోవడంతో ఈసీ వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తనపై అసత్యప్రచారం చేస్తున్న టీవీ చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, జీవన మనుగడ కోసమే తన పోరాటమని ఆయన స్పష్టంచేశారు. -
ధర లేని 'ఉల్లి'.. రైతు 'తల్లడిల్లి'!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మార్కెట్లో ధర లేక, కొనే నాథుడు లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రబీ పంట చేతికొచ్చే సమయంలో దిగజారిన ధరలతో గగ్గోలు పెడుతున్నారు. వందలాది క్వింటాళ్ల ఉల్లిని రోడ్ల పక్కనే కుప్పలుగా పోసి కొనే వారి కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. క్వింటా కనీసం రూ.500 కూడా పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.నాణ్యత బాగున్నా కొనే వారేరీ?రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు.అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరు ప్రాంతంలో సాగయ్యే కేపీ ఉల్లికీ డిమాండ్ ఎక్కువే. 3 నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. ఖరీఫ్లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వేసిన పంట గత నెల నుంచి కోతలు మొదలయ్యాయి. నాణ్యతకు ఢోకా లేకున్నప్పటికీ మార్కెట్లో ధర లేక, కొనేవారూ లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.క్వింటా ధర రూ.300 నుంచి రూ.500లోపే..ప్రస్తుతం కర్నూలు మార్కెట్కు రోజుకు 2వేల క్వింటాళ్ల చొప్పున వస్తోంది. కేవలం 5 శాతానికి మాత్రమే క్వింటా రూ.800 పలుకుతుండగా, 95 శాతానికి పైగా పంటకు క్వింటా రూ.300 నుంచి రూ.500కు మించి ధర లభించలేదు. సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, పంట పూర్తిగా మార్కెట్కు వచ్చే సమయానికి మరింత దయనీయంగా మారుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తాము తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉల్లి రైతుకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంఉల్లి రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లూ అండగా నిలిచింది. 2019–24 మధ్య క్వింటా రూ.3,500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. ధర తగ్గిన సందర్భాల్లోనూ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా జగన్ ప్రభుత్వం కృషి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశారు. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లోనూ షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చేశారు. గతేడాది క్వింటా రూ.1,200 తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరికి రూ.800కి కొనుగోలు చేస్తామని చెప్పి మూడు రోజులు తిరక్కుండానే ‘అబ్బే అలాంటి ఆలోచనే ప్రభుత్వం దగ్గర లేదు’ అంటూ మాట మార్చి ఉల్లి రైతులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసింది.ఈయన పేరు గంగరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట అమ్ముకుందామని కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. వ్యాపారులు లేక ఇలా రోడ్ల పక్కన ఉల్లిని రాసులుగా పోసి ఎదురు చూస్తున్నాడు. కొనండి బాబూ అని కాళ్లావేళ్లా పడుతుంటే క్వింటా రూ.400కైతే తీసుకుంటామంటున్నారు. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం కూలీ ఖర్చులు కూడా రావని, ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నారు.కోత ఖర్చులు కూడా రావుఐదెకరాల్లో ఉల్లిసాగు చేశా. ఎకరాకు రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాను ఎకరాకు 10 టన్నుల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమయానికి ధర లేకుండా పోయింది. ఎంతోకొంతకు తెగనమ్ముకుందామన్నా కొనే నాథుడు కనిపించడం లేదు. బ్రతిమిలాడుతుంటే క్వింటా రూ.500 ఇస్తామంటున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రావు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు. – ఎం.షఫీ, కర్నూలు జిల్లాచంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు1.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. దాదాపు రూ.1.20లక్షల వరకు ఖర్చయ్యింది. ఎకరాకు 15 టన్నుల దిగుబడి ఉంది. క్వింటా రూ.400కి మించి ధర ఇవ్వడం లేదు. పెట్టుబడి ఖర్చులు దక్కని పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వం ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు. – జీ మిన్నల్ల, పాలకుర్తి, కర్నూలు జిల్లా -
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె తాత్కాలిక విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బకాయిలు చెల్లించాలని ఏడు రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం తాత్కాలికంగా విరమించాయి. ప్రభుత్వం పది రోజుల్లో రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా సమ్మెను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం రూ.3,000 కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1 నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిగా నిలిపివేసి సమ్మె చేస్తున్నాయి. సోమవారం రెండో దఫా ప్రభుత్వం ఆశా ప్రతినిధులతో చర్చలు జరిపింది. మొత్తం బకాయిల్లో రూ.1,000 కోట్లను పది రోజుల్లో, జూలై అనంతరం మరో రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ చెప్పారు. ప్రతి నెలా రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల మేర బిల్లులు చెల్లించడంతోపాటు నూతన బీమా విధానం రూపకల్పనలో నెట్వర్క్ ఆస్పత్రులను భాగస్వామ్యం చేస్తామని ప్రభుత్వం తెలిపిందని చెప్పారు. అందువల్ల 10 రోజులు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. నమ్మకం లేక...ప్రభుత్వం పది రోజుల్లో నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు గద్దెనెక్కాక గతంలో రెండుసార్లు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ బకాయిల కోసం సమ్మె చేశాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సమ్మె చేసిన సమయంలో డిసెంబర్కి బకాయిలన్నీ చెల్లించేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తమ సమ్మెను తాత్కాలికంగానే నిలుపుదల చేస్తున్నామని ఆశా స్పష్టం చేసింది. పది రోజుల్లోగా నిధులు విడుదల చేయకపోతే తిరిగి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించింది. -
ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల గురించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళలను ఉద్దేశించి అసహ్యకరమైన భాషను ఉపయోగించడం.. వారిని రాజకీయ చర్చల్లోకి లాగడం విమర్శ కానే కాదన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఆ వ్యాఖ్యలు మహిళలను అవమానపరచడమే. వివక్ష పూరిత జర్నలిజం చేస్తున్నారన్న అనే దానిపై ఈ వ్యాఖ్యలు తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది మహిళలను అవమానించడానికే కాదు.. ప్రజల్లో ‘MAVIGUN’ ప్రతిపాదనపై జరుగుతున్న చర్చను.. దారి మళ్లించడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. మావిగన్ ప్రతిపాదనను రాజకీయంగా ఎదుర్కోలేక బాబు, ఎల్లో మీడియా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా దూషణలకూ దిగారు. మేం శాంతియుతంగా నిరసనలు చేపట్టాం. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ మా నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు పాల్పడలేదు. శాంతియుతంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ.. అత్యంత సంయమనంతో వ్యవహరించారు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. Words uttered: “If tomorrow YS Jagan Mohan Reddy says that your wives are not your wives, they would blindly believe it and even go to the extent of treating their own wives as sisters and shamelessly look for marriage alliances; such are the spineless leaders in the YSR Congress…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 7, 2026 -
దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తిరిగి తనపై కేసులు నమోదు చేశారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ,ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.కూటమి ప్రభుత్వంలో తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాలను సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు జగన్కు వివరించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని జగన్ మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కైలే అనిల్కుమార్కు సూచించారు.పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అన్నారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో సుప్రియ,ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, అమరావతి: ఏపీ మద్యం అక్రమ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం అక్రమ కేసులో రాజ్కేసిరెడ్డితో పాటుగా రోనక్ కుమార్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు ఇచ్చింది. -
ఆరో రోజూ ఆగిన ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరో రోజు సోమవారం కూడా ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో పేద రోగులు విలవిలలాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సోమవారం మరోసారి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా)తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వం తరఫున వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆర్థికశాఖ అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. సమ్మె ప్రారంభించిన తొలి రోజు చేసిన ప్రతిపాదనలనే మళ్లీ ప్రభుత్వం చేసింది.రూ.1,000 కోట్ల మేర బకాయిలు విడుదల చేస్తామని, కొత్తగా ప్రవేశపెట్టే బీమా విధానం రూపకల్పనలో నెట్వర్క్ ఆస్పత్రులకు భాగస్వామ్యం కలి్పంచడంతోపాటు ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ హామీలన్నింటినీ రాతపూర్వకంగా ఇస్తేనే సమ్మె విరమిస్తామని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో చర్చల మీటింగ్ మినిట్స్ను రాతపూర్వకంగా అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చందని ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ ప్రకటించారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే సమ్మె విరమణపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
ఖజానాపై ‘ప్రత్యేక విమానం’ మోత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని, సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఒకవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుగుతున్న విలాసవంతమైన ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. చంద్రబాబు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల టూర్లకు, చివరికి ప్రతి శనివారం హైదరాబాద్లోని సొంత ఇంటికి వెళ్లొచ్చేందుకు కూడా ప్రత్యేక హెలికాప్టర్, విమానాలనే వినియోగిస్తున్నారు.దీంతో రెండేళ్లలోనే సీఎం చంద్రబాబు (వీవీఐపీ) ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.109.04 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.54.41 కోట్లు, 2025–26 ఆరి్థక సంవత్సరంలో రూ.54.63 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అదేవిధంగా 2026–27 ఆర్థిక సంవత్సరంలోనూ చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు అద్దె చెల్లింపు కోసం బడ్జెట్లో రూ.54.63 కోట్లను కేటాయించారు. సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లాలన్నా తాడేపల్లిలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇక వారాంతంలో చంద్రబాబు పక్క రాష్ట్ర హైదరాబాద్లో ఉన్న తన సొంత ఇంటికి సైతం ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. దీంతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల భారం ప్రభుత్వ ఖజానాపై భారీగా పడుతోంది.పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల ఖర్చు గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
సమాధానాలు చెప్పలేకే ఎదురుదాడి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, నిర్వాకాలను నిలదీస్తూ... ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గదీస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలు అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ ‘మావిగన్’గా ప్రకటించాలంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉన్నందున ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబుకు అది నచ్చ లేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం తాము ప్రతిపాదించిన ప్లాన్–బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పుడూ.. ఇప్పుడూ వైఎస్ జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకూ అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో భవనాల చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తుండటం.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే, అదే తరహా రోడ్లకు రాజధానిలో కి.మీ.కు ఏకంగా రూ.53 కోట్లను ఖర్చు చేస్తుండటాన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ‘సిండికేటు’ కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకుంటుండటం వల్లే వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేకపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దాంతో రాజధానిలో అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి నేతలు మాటలతో దాడి చేస్తూ తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్కు దిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..?1. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారు. రాజధానికి తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. ఆ 50 వేల ఎకరాలకు అయ్యే రూ.లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలకు అదనంగా అయ్యే వ్యయం మరో రూ.లక్ష కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తోంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయంలో.. ఆ 2 లక్షల కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది? రోడ్లు వేయటానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి? 2. ఏడేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి (మొదటి విడత ఐదేళ్లు, ఇప్పుడు రెండేళ్లు) కూడా భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములిచ్చి 50–60 సార్లు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 3. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నట్లు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే.. ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? లక్ష ఎకరాల అమరావతిలో ఇంత వరకు కట్టింది ఎంత? అమరావతి మానస పుత్రిక (పెట్ ప్రాజెక్టు) అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులేమిటి? 4. అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు(ఎస్ఎఫ్టీ)కి రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఆరు వరుసలతో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే.. అమరావతిలో కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంత వ్యయం ఎందుకవుతోంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది? 5. రాజధాని అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే.. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికి అవే పనులకు సంబంధించిన టెండర్లు దక్కాయి. ఇది గూడుపుఠాణి కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయాన్ని పెంచేస్తూ.. కాంట్రాక్టర్లను సిండికేటు చేస్తున్నారు. 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కే మళ్లీ అధిక ధరలకు కట్టబెడుతున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? 6. రాజధానిలో కేవలం గవర్నమెంటు కాంప్లెక్స్లో సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు? దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇంతలా ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులోనూ దోపిడీకి పాల్పడతారా? 7. బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదు.. ఎవరైనా నొక్కుతారని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రూ.3.37 లక్షల కోట్లు. అప్పు చేస్తే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు? రైతులు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థుల సంక్షేమం మాటేంటి? శిథిలమవుతున్న స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? రాజధానికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏం కావాలి?8. రాజధానికి 2015లో సమీకరించిన 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50 వేల ఎకరాలకే పరిమితమైతే అమరావతి మున్సిపాల్టిగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాటా? కాంట్రాక్టు పనులనూ అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. భూములను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకోవడానికే కదా మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు! 9. తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ.. రాజధాని అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ.. పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమీషన్ల కోసమే కదా? 10. రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందే గానీ ఎక్కడా రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా, రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆ రాష్ట్రాలే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది.. కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తోంది? ఎలా వర్తిస్తోంది? 11. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసనమండలి సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, అక్రమాలను కడిగిపారేస్తారనే భయంతోనే కదా! 12. రాజధానికి తొలి విడత భూసమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి.. అమరావతిని అలా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా అమలు చేశారా? 13. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనను తాను నిర్మించుకుంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై.. ఇలానే కదా మహానగరాలుగా అభివృద్ధి చెందాయి? లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం ప్రజలను మోసం చేయడం కాదా? ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? 14. ఒక్క రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు కేవలం రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేయాలనుకున్నారు? కమీషన్ల కోసమే కదా? 15. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారవంతమైన పంట పొలాల్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కామ్ల కోసమే కాదా? -
మండుటెండ.. జోరువాన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల భానుడు ప్రతాపం చూపగా, కొన్ని ప్రాంతాల్లో జోరువాన ఉపశమనం కలిగించింది. విజయవాడ, చుట్టు పక్కల ప్రాంతాల్లో సాయంత్రం వరకూ మండుటెండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అక్కడక్కడా చిరు జల్లులు కురవడంతో సేదతీరారు. అలాగే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరువాన కురిసింది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 5.2, ఏలూరు జిల్లా తదువైలో 4.7, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి తణుకులోనూ జోరువాన కురిసింది. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అదే సమయంలో అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెంలో 41.9, మార్కాపురం జిల్లా నందన మారెళ్లలో 40.7, నంద్యాల జిల్లా పేరుసోమలలో 40.6, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3, అన్నమయ్య జిల్లా గోపిదిన్నెలో 40.1, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉపరితల ఆవర్తనం, ద్రోణి వల్లే...రాష్ట్రంలో మరో రెండు రోజులు ఇదేవిధమైన విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆకాశం మేఘావృతమై పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండడంతో ఈ పరిస్థితి నెలకొందని వివరించారు. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. -
సర్కారు నమ్మక ద్రోహం!
సాక్షి, అమరావతి: ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. వారిని మూడో గ్రేడ్ కిందకు మార్చి, బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి, రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గ్రామ పంచాయతీల్లో రీ కేటగిరైజేషన్ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా దానిని రూ.25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు నెలల క్రితం ఇచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019–2020 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల సమయంలో గ్రేడ్–5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియలో నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేవలం ఐదు శాతం గ్రామ పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా పేర్కొంటూ, వాటి నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులను కేవలం మూడు గ్రేడ్లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చివరి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ణయించి, గతంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆ బేసిక్ వేతనాన్ని రూ.25,220కు తగ్గించేసింది. అభినందన సభ సాక్షిగా మోసం గ్రామ పంచాయతీలను రీ కేటగిరైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులందరికీ పదోన్నతులు వస్తాయని ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 4న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పదోన్నతుల అభినందన సభ కూడా నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–5 నుంచి గ్రేడ్–3కి మారినప్పటికీ, వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.మొదట ప్రకటించిన పేస్కేల్ ఇవ్వాల్సిందే ప్రభుత్వమిచ్చిన జీవో 91లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరి ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ధారించి, ఇప్పుడు దానిని రూ.25,220కు తగ్గించడం అత్యంత అన్యాయమని నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బగ్గా జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకొని, మొదట ప్రకటించిన విధంగా రూ.28,280 పే స్కేల్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘మావిగన్’ను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు వ్యూహం
ప్రొద్దుటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనపై సర్వత్రా ఆమోదం వ్యక్తమవుతోందని, ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో రాచమల్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లతో ఆమోదయోగ్యం కాని, ఆచరణకు నోచుకోని అమరావతిని నిర్మించాలనుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కేవలం రూ.20 వేల కోట్లతో గ్రోత్ ఇంజిన్గా దూసుకెళుతుందన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కారిడార్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. మావిగన్ ప్రతిపాదనను ప్రకటించిన రోజే చంద్రబాబులో వణుకు పుట్టిందని చెప్పారు. మావిగన్ ప్రతిపాదనను ప్రజలు ఆమోదిస్తుండటంతో సోషల్ మీడియాలో రూ.కోట్లు ఖర్చు చేసి విపరీతమైన పోస్టులు పెట్టారని, అపహాస్యం చేయడంతోపాటు బూతులు కూడా మాట్లాడారన్నారు.నీచాతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కువ రోజులు నిలువలేకపోయిందన్నారు. తర్వాత చంద్రబాబు ఇదే అంశంపై మంత్రులతో ప్రెస్మీట్ పెట్టించారన్నారు. అయినా సంతృప్తి చెందని చంద్రబాబు పచ్చ మీడియాను రంగంలో దింపాడన్నారు. ప్రభుత్వాన్ని జాకీలతో పైకిలేపేందుకు జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకరిజం చేస్తున్నాడన్నారు. అత్యంత జుగుప్సాకర వ్యాఖ్యలవి ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్పాకరంగా, బాధాకరంగా ఉన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. ఇంతకంటే నీచం మరొకటి ఉండదన్నారు. కండకావరంతో కొవ్వెక్కి రాధాకృష్ణ ఇలాంటి మాటలు మాట్లాడినా.. తమ నాయకుడు వైఎస్ జగన్ మాత్రం శాంతియుతమైన పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయాలని తమకు చెప్పారన్నారు. రాధాకృష్ణ నాలుక కోసి.. ఉప్పూకారంతో ఊరగాయ పెడతారు స్త్రీలను దూషిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణను ఏ మహిళ అయినా మెట్టుతో కొట్టదా అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమ ఆడబిడ్డలైతే రాధాకృష్ణ ఇంటికెళ్లి నాలుక కోసి ఉప్పుకారం వేసి ఊరగాయ పెడతారన్నారు. చంద్రబాబు ఎంతటి నీతిబాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో ప్రజలు గమనించాలని కోరారు. కేవలం వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా అన్నారు. ‘రాధాకృష్ణా.. నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా. నీలా మేం మాట్లాడితే సరిపోతుందా. ఇవే మాటలు నీ భార్య దగ్గర మాట్లాడితే నీ భార్య కూడా నిన్ను చెప్పుతో కొడుతుంది. మేం నీలా మాట్లాడలేం. జర్నలిజం ముసుగులో ఇలాంటి అక్షర వ్యభిచారం చేయొద్దు అని రాధాకృష్ణకు అతడి ఇంట్లోని మహిళలు గడ్డిపెట్టాలి’ అని రాచమల్లు కోరారు. -
లాకప్డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
సాక్షి, చెన్నై/అమరావతి: తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుల లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లను పరిహారంగా చెల్లించాలని తొమ్మిది మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం ‘అరుదైన కేసు‘గా న్యాయస్థానం అభివర్ణించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి జి.ముత్తుకుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్ డెత్ కేసులో ఇంత మంది పోలీసులకు ఓ కోర్టు మూకుమ్మడిగా మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్.శ్రీధర్ (అప్పటి ఇన్స్పెక్టర్). పి.రఘు గణేష్ (సబ్–ఇన్స్పెక్టర్), కె.బాలకృష్ణన్ (సబ్–ఇన్స్పెక్టర్), ఎస్.మురుగన్ (హెడ్ కానిస్టేబుల్), ఏ.సామిదురై (హెడ్ కానిస్టేబుల్), ఎం.ముత్తురాజ్ (కానిస్టేబుల్), ఎస్.చెల్లదురై (కానిస్టేబుల్), థామస్ ఫ్రాన్సిస్ (కానిస్టేబుల్), ఎస్.వెయిలుముత్తు (కానిస్టేబుల్) ఉన్నారు. మరో నిందితుడిగా ఉన్న స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దొరై కేసు విచారణలో ఉండగా కరోనాతో మరణించారు.షాపు ఎక్కువ సేపు తెరిచి ఉండటమే వారు చేసిన పాపం..తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్లు మొబైల్ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్ సమయంలో వీరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో (ఆ తరువాత దర్యాప్తులో ఇది అవాస్తమని తేలింది) 2020 జూన్ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్కులం పోలీసులు వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. లాకప్లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్ 22–23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10 పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.హైకోర్టు జోక్యంతో సీబీఐకి...ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై హత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సీఐడీకి అప్పగించింది. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సీబీఐ కేసు దర్యాప్తు జరిపింది.కీలకంగా మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం..మృతులు జయరాజ్, బిన్నిక్స్లపై పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రీ కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని.. లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్లు ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేలా సెట్ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ ఆధారాలన్నింటితో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు ఆరేళ్ల తరువాత తీర్పు వెలువరించింది.ముమ్మాటికీ హత్యే...జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై ఉన్న గాయాలు ‘అసాధారణమైనవి..’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు. జయరాజ్, బెన్నిక్స్లు తమను తామే గాయపరుచుకున్నారన్న నిందితుల(పోలీసులు) వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పోస్ట్మార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం, పదే పదే చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయినట్లు స్పష్టం చేశారు. జయరాజ్కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం ఆ అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. జయరాజ్, బిన్నిక్స్ ఆంగ్లేయుల కాలంలో ఇలాంటి దాడులు జరిగినట్లు విన్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రీ కుమారులను పోలీసులు కరల్రు, ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురిచేశారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు స్పష్టమైందన్నారు. ఇ¯న్స్పెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పైఅధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించింది. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసు అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్షను విధించింది. -
కాంట్రాక్టు కోసం ‘లింగ’ ప్రదక్షిణ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖలో టెండర్లన్నీ కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకే దక్కుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోందనేది ఇప్పటికే ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి రూ.5 వేలకోట్ల భారీ ప్రాజెక్టు కూడా చేరబోతోంది. ఇప్పటివరకు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక ఎత్తయితే, ఈ ఒక్క ప్రాజెక్టు మరో ఎత్తు కాబట్టి దాన్లో ఎలాగైనా భారీగా సొమ్ము వెనకేసుకోవాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. నేరుగా వారు ఈ పని చేయలేరు కాబట్టి.. ఇప్పటికే ఇలాంటి పనుల్లో ఆరితేరిన ‘లింగ’ని రంగంలోకి దింపారు. సదరు లింగ ఈ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థలకే ఇవ్వాలని ఏపీ జెన్కో అధికారులపై ఒత్తిడి చేస్తూ, టెండర్ దక్కించుకోవడం కోసం ఇంధనశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మళ్లీ టెండర్ల గడువు పొడిగింపు అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడులో 950 మెగావాట్లతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ (పీఎస్పీ) కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) ఈ ఏడాది జనవరి 22న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.5 వేలకోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ టెండర్లో కొన్ని నిబంధనలను సీఈఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా పెట్టింది. దానివల్ల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే దీనివెనుక అసలు కారణం ఈ ప్రాజెక్టును తామనుకున్న సంస్థలకు దక్కేలా ‘లింగ’ చేస్తున్న తెరవెనుక లాబీయింగ్ అని తెలుస్తోంది. కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీకి చెందిన లింగ ఎప్పటి నుంచో బినామీగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. కూటమి భాగస్వామ్య పార్టీల్లోని నేతలకు ఇప్పటికే ఈ లింగ వేలకోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో కమీషన్లు ముట్టేలా కథ నడిపారని సమాచారం. ఇదే కాంట్రాక్టు కోసం ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా కాంట్రాక్టు సంస్థ అంతా సిద్ధం చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి చెందిన మంత్రి తరఫున లింగ రంగంలోకి దిగడంతో ఆ సంస్థకు షాక్ తగిలింది. ఎలాగైనా ఇతర సంస్థలేవీ పోటీలోకి రాకుండా.. ఒకవేళ వచ్చినా తాము చెప్పిన వాళ్లకే టెండర్ దక్కేలా చూడాలని లింగ విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ తరఫున ఒకరు.. ప్రభుత్వ పెద్దల వద్ద పట్టు ఉన్న ఓ ‘మెగా’ కంపెనీ ఈ పనుల కోసం పట్టుబడుతుండంతో టెండర్ల ప్రక్రియ గత జనవరి నుంచి పూర్తికావడం లేదు. అప్పటి నుంచి గడువు ఇవ్వడం, వాయిదాలు వేయడం జరుగుతోంది. టెండర్ల దాఖలుకు తాజాగా సోమవారంతో గడువు ముగిసింది. మళ్లీ ఈ గడువును ఏపీ జెన్కో మూడువారాలు పొడిగించింది. కమీషన్ల పంపకాల కోసమే ఈ వాయిదాల పర్వం కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టుల్లో రింగ్ మాస్టర్లు.. తమ వారికి తగ్గట్టుగా నిబంధనలు విద్యుత్ సంస్థలపై పడి దోచుకుతినడానికి, కాంట్రాక్టుల్లో వాటాల కోసం కొందరు కాంట్రాక్టర్లు రింగ్ (కూటమి) మాస్టర్లుగా ఏర్పడ్డారు. టెండర్ల విలువను 20 శాతం వరకు పెంచేసి, ఎవరికి టెండర్ రావాలో వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేసి, అనుకున్నవిధంగా టెండర్లు దక్కేలా చేసి ఆపైన వాటాలను పంచుకుంటున్నారు. ఈ రింగ్ కాంట్రాక్టర్లు తమ కూటమిలో లేని సంస్థలు టెండర్లలో పాల్గొంటే వారిని ఏదో విధంగా అనర్హులుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అందుకోసం పాలకుల వద్ద నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు. టెండర్లను బడా సంస్థలకు కట్టబెట్టేందుకు.. చిన్న, మధ్యతరహా కంపెనీలను కనీసం టెండర్ దాఖలు వరకు కూడా రానివ్వకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రభుత్వం 150 మార్కులకు గాను 124 మార్కులు రావాలని నిబంధన విధించింది. గతంలో ఇది 113 మార్కులు వరకే ఉండేది. దీనివల్ల చిన్న, మధ్యతరహా సంస్థలేవీ టెండర్లలో పాల్గొనలేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను సైతం పక్కన పెట్టేలా నిబంధనలు మార్చేశారు. కేవలం తాము కోరుకున్న ప్రైవేటు సంస్థలకే టెండర్లు దక్కేలా మార్గాలు వేసుకుంటున్నారు. -
ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది. -
టీచర్ల దీర్ఘకాలిక సమస్యలపై పోరుబాట
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం పోరాటానికి పీఆర్టీయూ సిద్ధమైంది. రాజమహేంద్రవరంలో ఆదివారం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.క్రిష్ణయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 21న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, 25న విజయవాడ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. -
11, 12 తేదీల్లో సచివాలయ ఉద్యోగుల ‘ఛలో విజయవాడ’
సాక్షి, అమరావతి: న్యాయబద్ధంగా తమకు దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలని, ఉద్యోగుల నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేసే ప్రక్రియకు స్వస్తి పలకాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11, 12 తేదీల్లో ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘సచివాలయ ఉద్యోగుల ఆవేదన’ పేరిట జేఏసీ చైర్మన్ బూరాడ మధుబాబు రెండు రోజుల నిరాహార దీక్ష చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. -
రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం.. ఒకేచోట వద్దు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బ తింటాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని, ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదని స్పష్టం చేసింది. సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం ఉంటుందని అభిప్రాయపడింది. రాజధాని కోసం సారవంతమైన వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదని సూచించింది.ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకించింది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు సరికాదని తెలిపింది. విభజన చట్టంలో హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినందున హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితం, వృథాగా పరిణవిుంచవచ్చని తేల్చి చెప్పింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో సారవంతమైన పంట భూముల్లో ఏకైకమహానగరాన్ని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మాణం చేయడాన్ని శివరామకృష్ణన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.విభజిత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో పాటు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నందున రాజధాని నిర్మాణాన్ని వీలైనంత తక్కువ వ్యయంతో చేపట్టాలని, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాజధానిని వికేంద్రీకరించాలని కమిటీ సూచించింది. అధికార వ్యవస్థలను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక సమర్పించకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ప్రభుత్వం రాజధాని ఎంపిక కోసం పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సొంతంగా మరో కమిటీని నియమించుకోవడం గమనార్హం. ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ తన నివేదికలో ప్రస్తావించింది. దీంతో శివరామకృష్ణన్ కమిటీ పరిధి నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకే పరిమితం అయింది. శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య సూచనలు ఇవీ..⇒ రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. విజయవాడ, గుంటూరు.. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. అసెంబ్లీ, సెక్రటేరియెట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయవచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థలను విస్తరించాలి. ⇒ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు.⇒ ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదు.⇒ ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన ప్రభుత్వ భూములు లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రతిపాదిత రైలు, రహదారి అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు, విస్తరించవచ్చు. ఈ కారణంగా ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదు.⇒ హైదరాబాద్ తరహా సూపర్ రాజధాని వద్దు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన కార్యనిర్వాహక వర్గం హైదరాబాద్లో చాలా ఏళ్లుగా కేంద్రీకృత మైంది. ఈ కేంద్రీకరణే విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా ఉంది.⇒ భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ⇒ విశాఖలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలి.⇒ అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.⇒ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థతో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల మధ్య ఆధునిక సమాచార మార్పిడి ద్వారా భౌగోళిక దూరాన్ని అధిగవిుంచడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు దూరాలు అడ్డంకి కాదు.⇒ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదు.⇒ విశాఖపట్టణంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు.⇒ విశాఖపట్టణం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి.⇒ విశాఖపట్టణంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వచ్చు.⇒ ప్రభుత్వ భూములున్న చోటే ఏర్పాటు చేయడం మంచిది.⇒ 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది.⇒ సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం⇒ హైకోర్టుకు 100 – 140 ఎకరాలు అవసరం కాగా రాజ్భవన్కు 15 ఎకరాలు అవసరం.⇒ వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదు.⇒ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు.⇒ అసెంబ్లీని ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలి. ⇒ హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హడావిడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిది కాదు.⇒ గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు ఈ కమిటీ ఏమాత్రం సుముఖంగా లేదు.⇒ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తే తగినంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల కోసం జాగ్రత్తగా అన్వేషించాలి.⇒ ఇప్పటికే ఉన్న నగరాల విస్తరణ చేపట్టే ముందు మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణ ప్రభావంపై సరైన అంచనా వేయడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితంగా, వృథాగా పరిణవిుంచవచ్చు.⇒ ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయానికి సంబంధించి పరిమిత సంఖ్యలో కార్యాలయాల ఏర్పాటు కోసం నగర శివార్లలో వీజీటీఎంకు అవతల అనువైన ప్రదేశాల ఎంపికను ప్రభుత్వం పరిశీలించవచ్చని కమిటీ సూచించింది. -
ఆరోగ్యశ్రీకి దిన‘ధన’గండం!
పక్షవాతం బాధితుడికి వైద్యానికి నిరాకరణ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని చింతాయగారిపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సుబ్బయ్య ఆదివారం తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. ఆయనను వెంటనే ఒంగోలులోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం చికిత్సకు నిరాకరించింది. డబ్బు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని తెగేసి చెప్పింది. చేసేది లేక కుటుంబ సభ్యులు రూ.పదివేలు చెల్లించి ఆస్పత్రిలో చేర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా రూ.85వేలు అప్పుచేసి చెల్లించారు. ఐసీయూలో ఉంచి వైద్య సేవలందించడానికి రోజుకు రూ.30 వేలు ఖర్చవుతుందని చెబుతున్నారని సుబ్బయ్య భార్య కోటేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు.గత ప్రభుత్వంలో పేదింటి రోగులపాలిట ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ నేడు చంద్రబాబు పాలనలో అంపశయ్యపైకి చేరింది. అనారోగ్యం పాలై.. చేతిలో చిల్లిగవ్వ లేక ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే ధైర్యంతో ఆస్పత్రులకు వెళ్తున్న పేద, మధ్య తరగతి రోగులకు సేవలు ఆపేశామనే మాటలు శరాఘాతాల్లా తగులుతున్నాయి. ఫలితంగా వారు దినదినగండంగా బతుకులీడుస్తున్నారు. రేపోమాపో సేవలు అందుబాటులోకి వస్తాయేమోననే ఆశతో నిరీక్షిస్తున్నారు. చంద్రబాబు సర్కారులో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఆస్పత్రులకు రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. చర్చలంటూ కల్లబొల్లి కబుర్లతో కాలం వెళ్లదీస్తోంది. ఇప్పటికే చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్యాలూ వెనక్కి తగ్గడం లేదు. డబ్బులు చెల్లిస్తేనే సేవలు పునరుద్ధరిస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న రోగులు తమకు భారమైనా అప్పోసప్పో చేసి డబ్బులు చెల్లించి చికిత్స చేయించుకుంటున్నారు. సర్కారు కాఠిన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు ఐదో రోజు ఆదివారం కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం రూ.3 వేల కోట్లకు పైగా బకాయి పెట్టడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. వీరి సమ్మె నేపథ్యంలో రోజువారీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు వచ్చే చికిత్సల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఫలితంగా చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళ్లే పేదలకు నిరాశే ఎదురవుతోంది. ఉచిత చికిత్సలు అందించబోమని, చేతి నుంచి డబ్బు కట్టాల్సిందేనని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో చేతి నుంచి డబ్బు చెల్లించి పేద, మధ్యతరగతి కుటుంబాల వారు వైద్యం చేయించుకుంటున్నారు. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేశాయి. డిసెంబర్ కంతా బకాయిలన్నీ వన్టైమ్ సెటిల్మెంట్ చేసేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన గడువు ముగిసి, నెలలు గడుస్తున్నా బకాయిల సంగతి తేల్చకపోవడంతో ఆరు నెలల్లో మరోమారు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. బాబు గద్దెనెక్కాక పదే పదే నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్తుండటంతో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. జిల్లాల్లో అల్లాడుతున్న రోగులు...⇒ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికభాగం స్పెషాలిటీ ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేశారు. వచ్చిన రోగులను వైద్యం చేయబోమని చెప్పి తిప్పి పంపుతున్నారు. నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తామని తెగేసి చెబుతున్నారు.⇒ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోయాయి. దీంతో వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా రూ.వందకోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ⇒ అనంతపురం జిల్లాలో ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపివేశాయి. దీంతో రోగులు అల్లాడుతున్నారు. డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోలేని రోగులు అనంతపురం పెద్దాసుపత్రికి పోటెత్తుతున్నారు. పెద్దాసుపత్రిలో సౌకర్యాలు మృగ్యంగా మారాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రి దుస్థితిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో 22 నెట్వర్క్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేశారు. వచ్చిన రోగులను తిప్పి పంపించేస్తున్నారు. కొందరు రోగులు విధిలేక డబ్బులు చెల్లించి సేవలు పొందుతున్నారు. అత్యవసర చికిత్సలకు అప్పులు చేసి చితికిపోతున్నారు. జిల్లాలో మొత్తం దాదాపు రూ.130 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నట్టు ఆశా ప్రతినిధులు చెబుతున్నారు. ⇒ నంద్యాల జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపుగా రూ. వంద కోట్లకు పైగా బకాయిలు పెండింగ్ ఉన్నట్టు చెబుతున్నారు. జిల్లాలో ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పథకం సేవలనూ ఏడాదిగా నిలిపివేశారు. దీంతో పేద రోగులు, ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు సైతం నిలిపివేసే యోచనలో ఆస్పత్రులు ఉన్నాయి. బిల్లులు క్లియర్ అయితేనే డిశ్చార్జ్⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా సేవలు నిలిపివేయడం ఇది మూడోసారి. జిల్లాలో ఆస్పత్రులకు రూ.110 కోట్ల బిల్లు బకాయిలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఒక్క రోగికీ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించలేదు. ఇదివరకే శస్త్రచికిత్స చేసిన రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా మందుల్వివడం లేదు. దీంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యవిుత్రలనూ విధుల్లో ఉంచడం లేదు. దీంతో సమాధానం చెప్పేవారు లేక రోగులు అల్లాడుతున్నారు. మరికొన్ని ఆస్పత్రుల్లో ఇదివరకే శస్త్రచికిత్సలు జరిగి కోలుకున్న రోగులను డిశ్చార్జి చేయడం లేదు. పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాకే డిశ్చార్జి చేస్తామని చెబుతున్నట్టు సమాచారం. నేడు మరోమారు చర్చించే అవకాశంఇప్పటికే ఒకమారు ప్రభుత్వంతో ఆశా చర్చలు విఫలం అయ్యాయి. ఇదిలా ఉండగా సోమవారం మరోమారు ఆశా ప్రతినిధులతో వైద్య శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో జరిగిన చర్చల్లో మొత్తం బకాయిల్లో రూ. వెయ్యి కోట్ల మేర రెండు వారాల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే రూ. వెయ్యి కోట్ల నిధులు విడుదల చేసి, మిగిలిన బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇస్తేనే సమ్మె విరమిస్తామని ఆశా ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖతో చర్చించిన అనంతరం నిధుల విడుదలపై రోడ్మ్యాప్ ఇస్తామని సౌరభ్ సూచించినట్టు తెలిసింది. -
నేటి నుంచి పది మూల్యాంకనం
సాక్షి, అమరావతి: పదో తరగతి (ఎస్ఎస్సీ–2026) జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 26 జిల్లాల్లోని స్పాట్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మూల్యాంకన విధుల కోసం చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20 వేల మందిని నియమించారు. మొత్తం ప్రక్రియను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. గతేడాది 7 రోజుల్లోనే స్పాట్ నిర్వహించడంతో భారీగా తప్పులు జరిగాయి. ముఖ్యంగా సోషల్ స్టడీస్ మార్కుల నమోదులో విద్యార్థులకు అన్యాయం జరిగింది. దీంతో ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను 10 రోజులకు పాడిగించారు. ఈసారి కొత్తగా ట్యాబ్స్లో మార్కుల నమోదును స్పాట్ కేంద్రాల్లోనే చేపడుతున్నారు. ఇందుకోసం ఆయా కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయంతోపాటు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబ్స్ను ఇందుకోసం వినియోగిస్తున్నారు. స్పాట్ కేంద్రాల్లో జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే అసిస్టెంట్ ఎగ్జామినర్లకు రోజకు 40 పేపర్లు మాత్రమే ఇవ్వనున్నారు. మూల్యాంకనం పూర్తయ్యాక ట్యాబ్లో బార్కోడ్ స్కాన్ చేసి, సదరు పేపర్లో వచ్చిన మార్కులను నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక స్పెషల్ అసిస్టెంట్లు మరోసారి ట్యాబ్లో రెండోసారి స్కానింగ్, మార్కులు నమోదు చేయాలి. బోధించకున్నా విధుల కేటాయింపు మరోవైపు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు బోధించని ఉపాధ్యాయులకూ మూల్యాంకన విధులు అప్పగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కనీసం మూడేళ్లు పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు బోధించిన వారికే మూల్యాంకనం విధులు వేస్తారు. కానీ, ఈ ఏడాది యూపీ స్కూల్ నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయిన స్కూళ్లల్లోని సిబ్బందికి కూడా ఈ విధులు వేశారు. వాస్తవానికి ఈ స్కూళ్లల్లో 2025–26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి వరకు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఈ స్కూళ్లల్లోని సిబ్బందిని స్పాట్ విధులకు నియమించడం విస్మయపరుస్తోంది. మూల్యాంకనంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పిన పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది అన్ని రకాలుగా విఫలమైందని... ఆటోమేషన్ విధానంతో భారీగా తప్పులు చోటుచేసుకున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లో 100 శాతం సిబ్బందికి స్పాట్ విధులు వేసేశారు. సోమవారం నుంచి సమ్మేటివ్–2 పరీక్షలు ప్రారంభం కానుండడంతో జిల్లా అధికారులు సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు తలలు పట్టుకుంటున్నారు. స్పాట్ విధుల నుంచి మినహాయించండి: ఫోర్టోఅనారోగ్యం, 60 సంవత్సరాలు దాటిన వారికి పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఫోరం ఆఫ్ రిజిస్టర్డ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (ఫోర్టో) చైర్మన్ కరణం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి అంకాల్ కొండయ్య ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారికి ఇప్పటికీ పారితోషికం ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి పేపర్ వ్యాల్యూయేషన్లో పాల్గొనే సిబ్బందికి పారితోషికం పెంచాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 719 ఎయిడెడ్ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప విజ్ఞప్తి చేశారు. -
నకిలీ విత్తు.. రైతు చిత్తు
సాక్షి, అమరావతి/ఏ.కొండూరు: రాష్ట్రంలో నకిలీ, నాసి విత్తన మాఫియా రాజ్యమేలుతోంది. నాసి, నకిలీ విత్తనాల బారినపడి వేలాదిమంది రైతులు రూ.కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. గత 22 నెలల్లో వరుసగా మిరప, పత్తి, ఉల్లి, టమాటా, వరి రైతులు ఈ నకిలీ విత్తన ఉచ్చులోపడి నష్టపోగా, తాజాగా ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు ప్రైవేటు కంపెనీల నకిలీ విత్తన కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మరోవైపు మార్కెట్లో ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనచట్టం అక్రమార్కులకు చుట్టంగా మారిపోయింది. జిల్లాస్థాయి టాస్్కఫోర్స్ కమిటీలు చేవలేని కమిటీలుగా మారిపోయాయి. విత్తన కంపెనీల నుంచి నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన విజిలెన్స్ అధికారులు చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మొక్కుబడి తంతుగా తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తీసుకుంటున్న చర్యలు లేవు. రెండేళ్లలో నకిలీ విత్తనాల వల్ల దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, సుమారు 35 వేలమంది రైతులు రూ.వెయ్యికోట్లకుపైగా పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలను చవిచూసినట్టుగా అంచనా వేస్తున్నారు. ఈ నష్టపోయిన రైతుల్లో పదిశాతం మందికి కూడా పరిహారం అందిన దాఖలాల్లేవు. బిల్లులున్న వారికి సైతం అరకొరగానే పరిహారం ఇస్తున్నా.. ఇదేమిటని ప్రశ్నించేవారు లేరు. ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున పరిహారం అన్నమాటే లేదు. రాష్ట్ర రైతులను ముంచేస్తున్న నకిలీ విత్తనాల్లో 90 శాతం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న కంపెనీలకు చెందినవే కావడంతో నేరుగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. మరోవైపు పంట దెబ్బతిన్న తర్వాత విత్తన నమూనాలను ల్యాబ్లకు పంపితే రిపోర్టు వచ్చేసరికి సీజన్ ముగిసిపోతోంది. ఈలోగా ఏజెంట్లు పత్తా లేకుండా పోతున్నారు. గింజ కట్టక..కండె నిలవక కర్నూలు, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పత్తి రైతులు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో ఉల్లి, టమాటా రైతులు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వరి రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. తాజాగా ప్రస్తుత రబీ సీజన్లో ఎన్టీఆర్, మార్కాపురం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ కడప జిల్లాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న రైతులు నకిలీ విత్తనాలతో లక్షల రూపాయలు పెట్టుబడిని కోల్పోయారు. మార్కాపురం, పెద్దారవీడు మండలాల్లో వైడిపాడు, బొందలపాడు, చట్లమిట్ల, పోతంపల్లి, రాజంపల్లి, మద్దలకట్ట మొక్కజొన్న రైతులు పంట చేతికివచ్చే సమయానికి నకిలీ విత్తనాలతో నష్టపోయామంటూ పోలీసులను ఆశ్రయించారు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలో రామచంద్రపురం, కోమటికుంట తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామంటూ వందలమంది రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం వెంకటాయపల్లె గ్రామంతో పాటు పార్వతీపురం మన్యం కొమరాడ మండలం దలైపేట, తల్లికోట గ్రామాల్లో సైతం నకిలీ విత్తనాల వల్ల వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిందని రైతులు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, తీరా పంట దిగుబడి వచ్చిన తర్వాత పరిశీలిస్తే కండెలకు అసలు గింజలే రాలేదని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని కంపెనీలు చెప్పగా.. కనీసం 10–20 క్వింటాళ్లకు మించి రాలేదని తెలిపారు. కలెక్టర్లకు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధిత రైతులు తెలిపారు. ప్రైవేటు విత్తన కంపెనీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.6 లక్షలకు పైగా పెట్టుబడి కోల్పోయాం నేను, మా బంధువులు కలిసి 12 ఎకరాల్లో టాటా ఎంఎం 9375 హైబ్రీడ్ విత్తనం 10 ప్యాకెట్లు కొనుగోలు చేసి సాగుచేశాం. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశ చూపడంతో ప్యాకెట్ రూ.1,950 చొప్పున కొనుగోలు చేశాం. ఎకరాకు కౌలుతో కలిపి రూ.60 వేల పెట్టుబడి పెట్టాం. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఒక్క కండెకు కూడా గింజ రాలేదు. తీవ్రంగా నష్టపోయాం. మేమంతా కౌలురైతులమే. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – బండి వెంకటేశ్వరరావు, కోమటికుంట, ఎన్టీఆర్ జిల్లా ఎకరాకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి టాటా కంపెనీకి చెందిన హైబ్రీడ్ మొక్కజొన్న నాసిరకం విత్తనం వల్ల ఎన్టీఆర్ జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్దసంఖ్యలో రైతులు నష్టపోయారు. ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులను నమ్మించి విత్తనాలను విక్రయించారు. ఎకరాకు కనీసం 10–20 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా గింజ కట్టిన కండెలు సైతం నాణ్యత లేకుండా ఉన్నాయి. దీంతో పెట్టుబడితోపాటు ఉత్పత్తి కూడా నష్టపోయాం. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కంపెనీలద్వారా ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
స్టేషన్ గేటుకు బేడీలు ఎందుకు?.. లోపల తాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడంట
సాక్షి,రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు హర్షవీణపై దాడి కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హర్షవీణపై జనసేన నాయకులు నడిరోడ్డుపై దాడి చేసి, పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో నిందితుడు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా, తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హైడ్రామా బయటపడింది. హర్షవీణపై దాడి చేసిన కేసులో విచారణను పోలీసులు అత్యంత గోప్యంగా నిర్వహించారు. విచారణ సందర్భంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేశాడు. హర్షవీణను నడిరోడ్డుపై చితకబాదినా, ముద్దాయికి వేయాల్సిన బేడీలను స్టేషన్ గేటుకు వేసి విచారణ జరపడం పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్న తప్పులకే అమాయకులను నడిరోడ్డుపై నడిపించే పోలీసులు, ఇలాంటి ఘటనలో మాత్రం నిందితుడికి సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రకు వంతపాడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
‘అందుకే వైఎస్ జగన్ మావిగన్ పేరు సూచించారు’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గ్రీన్ జోన్ పేరు చెప్పి చంద్రబాబు.. రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఏడేళ్ల పాలనలో విజయవాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ వెల్లంపల్లి డిమాండ్ చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో విజయవాడలో అభివృద్ది పరుగులు పెట్టింది. కేవలం రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. వెస్ట్ బైపాస్లో 10 శాతం పనులను ఎందుకు ఆపుతున్నారు. పోర్టు, రైల్వేస్టేషన్ కలిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మావిగన్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు’’ అని వెల్లంపల్లి పేర్కొన్నారు.‘‘వైఎస్ జగన్ సూచించిన మావిగన్ ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. విజయవాడ అంటే చంద్రబాబుకు కక్ష. కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఒక్క అభివృద్ధి పనికూడా జరగలేదు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారు. అమరావతి బిల్లు పెట్టాక చంద్రబాబు మాట మార్చారు. అంతకుముందు 2028 కల్లా అమరావతి పూర్తవుతుందని చంద్రబాబు మొదట చెప్పారు. బిల్లు పెట్టాక అమరావతి ఎప్పుడు పూర్తవుతుందో తెలియదంటున్నారు.రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని గుదిబండగా మార్చారు. విజయవాడకు చంద్రబాబు ఏ ఒక్క మేలైనా చేశారా?. మచిలీపట్నం, గుంటూరులను కూడా పట్టించుకోవటం లేదు. ఎంతసేపూ అమరావతి పేరుతో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తారా?. లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. అందుకే జగన్ మావిగన్ పేరు సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజాప్రతినిధులు మావిగన్ కు వ్యతిరేమా? అనుకూలమా?’’ అంటూ వెల్లంపల్లి ప్రశ్నించారు.మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమరావతి పేరుతో చంద్రబాబు చేస్తున్నది షో రాజకీయాలే. ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అలాంటి అమరావతికి లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రజలే ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సూచించిన మావిగన్కు ప్రజల మద్దతు లభిస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు విజయవాడను చంపేశారు. నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయటం లేదు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని చంద్రబాబు అమరావతి కట్టగలరా?. రిటైనింగ్ వాల్ కట్టలేని చంద్రబాబు అమరావతి కడతారా?.’’ అంటూ ఆయన నిలదీశారు.‘‘విజయవాడలో అభివృద్ధి జగన్ మాత్రమే చేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణం కూడా కేవలం వైఎస్ జగనే చేశారు. విజయవాడలోని రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. కమ్మ సామాజిక వర్గం వారికి జగన్ ఎంతో మేలు చేశారు. వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు. వసంత కృష్ణప్రసాద్ ఐదేళ్లు మా పార్టీలో ఉండి డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లి జగన్పై విమర్శలు చేయటం సిగ్గుచేటు. మావిగన్కు టీడీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. అమరావతి బిల్లు సందర్భంగా కేకులు కట్ చేయమని చంద్రబాబు పిలుపిస్తే టీడీపీ క్యాడరే పట్టించుకోలేదు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనకు అందరి మద్దతూ లభించింది’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.అమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?: మల్లాది విష్ణుఅమరావతికి రూ.2 లక్షల కోట్లు అవసరమా?. గ్రోత్ ఇంజన్ లాంటి మావిగన్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారు?. రాష్ట్రం భరించలేని అప్పులు అవసరమా?. అమరావతిని ఎవరి కోసం నిర్మిస్తున్నారు?. గుంటూరు, విజయవాడలను చంద్రబాబు అన్యాయం చేశారు. మావిగన్ ప్రతిపాదనను జగన్ చెప్పగానే టీడీపీ నేతలు భయపడుతున్నారు. మచిలీపట్నం పోర్టు బేస్డుగా జరిగే మావిగన్ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు?. తెలంగాణానే మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేసుకోబోతోంది. మరి చంద్రబాబు ఆ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?అమరావతి పేరుతో భూములు తీసుకుని రైతులను ఎంతకాలం వేధిస్తారు?. మందడంలో రైతు రామారావు గుండె పగిలి చనిపోయాడు. దీన్ని కూడా ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోంది. భావితరాలకు చంద్రబాబు లక్షల కోట్ల అప్పును గిఫ్టుగా ఇస్తున్నారు. బుడమేరు వరదలకు లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. విజయవాడ వాసులపై చంద్రబాబుకు ఎంత కోపమో దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చుకృష్ణా, బుడమేరులకు వరదలు వస్తే ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు కూడా సెలవులు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతి పేరుతో జరిగే దోపిడీలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జపాన్కు చెందిన మాకీ అనే సంస్థ చంద్రబాబు అవినీతిని బయటపెట్టింది. చంద్రబాబు ఫ్రెండ్ సింగపూర్ ఈశ్వరన్ను కూడా జైల్లో పెట్టారు. అంటే వీరంతా కలిసి ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మావిగన్పై నిర్ణయం తీసుకోకపోతే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో టీడీపీ కనుమరుగు ఖాయం. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.‘‘కార్మికుల హక్కుల కోసం, రైతుల సంక్షేమం కోసం, దేశ ఆర్థికాభివృద్ధి కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన గొప్ప నాయకుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. -
వైఎస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, కరుణ ఎప్పటికీ ఓడిపోవన్న సత్యాన్ని ఏసుక్రీస్తు పునరుత్థాన తెలుపుతుంది. ఈస్టర్ పండుగ ప్రతి ఇంటినీ ప్రేమ, ఆశ, శాంతి, శ్రేయస్సుతో నింపాలని కోరుకుంటున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Today, as we celebrate the miracle of His resurrection, let us remember that truth and compassion can never be defeated. May this Easter fill every household with love, hope, peace and prosperity. Happy Easter!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 5, 2026 -
AP: ఐదో రోజుకు నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె ఐదో రోజుకు చేరుకుంది. నేటికీ బకాయిల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీతో నెట్వర్క్ ఆసుప్రతుల ప్రతినిధులు భేటీ కానున్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో పేదల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం వెంటిలేటర్పైకి చేరింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం పదేపదే హామీలిచ్చి, ఆచరణలో పైసా కూడా విదిలించకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. సిబ్బందికి జీతాలు, మందుల సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.తమ పరిస్థితిని ప్రజలకు తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆస్పత్రుల దగ్గర యాజమాన్యాలు బోర్డులు పెట్టి నిరసన చేపడుతున్నాయి. దీంతో పేద రోగులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. క్యాన్సర్, గుండె, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కొత్తగా ఎటువంటి ఆరోగ్యశ్రీ కేసులను చేర్చుకోవడం లేదు. అత్యవసరమైన కేసుల్లో చికిత్సలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు మాత్రం ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. -
పీజీ క్వశ్చన్ పేపర్ లీక్!
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు ప్రచారం సాగుతోంది. ఇంగ్లిష్ సబ్జెక్టుకు సంబంధించి శనివారం టెక్నికల్ కమ్యూనికేషన్స్ పరీక్ష జరిగింది. ఆర్యూలోని పరీక్ష కేంద్రంలో వర్సిటీ కళాశాల నుంచి 14 మంది, బయట కళాశాలకు చెందిన నలుగురు కలిపి మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ఉదయం 10.16 గంటలకు ప్రశ్నాపత్రం మొదటి పేజీ, 10.22 గంటలకు రెండో పేజీ పరీక్ష కేంద్రంలోంచి బయటకు వచ్చినట్లు జీపీఎస్ లొకేషన్లో నమోదైంది. విద్యార్థుల నుంచి సెల్ఫోన్లు లాక్కోవడంతో..పలువురు విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో సెల్ఫోన్లు ఉపయోగించడంతో ఇని్వజిలేటర్లు వాటిని స్వా«దీనం చేసుకున్నారు. దీంతో పరీక్ష కేంద్రంలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కొందరు విద్యార్థులు పరీక్ష ప్రారంభమయ్యాక బయటకు వెళ్లి సుమారు 40 నిమిషాల తర్వాత పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్వాహకులతో వాదించినట్లు సమాచారం.నిర్వాహకులు అనుమతించక పోవడంతో వారే ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వైరల్ చేసినట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్సిటీ అధికారులు మాత్రం ప్రశ్నాపత్రం లీక్ కాలేదని.. పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేయడం వల్లే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
గూడూరులో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో శనివారం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.1 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 40.9, చిత్తూరు జిల్లా నగరిలో 40.4, పార్వతీపురం జిల్లా వీరఘట్టంలో 40.3, విజయనగరం జిల్లా గుర్లలో 40.1, పల్నాడు జిల్లా గురజాల 39.8, నంద్యాల జిల్లా గుల్లదుర్తి, కర్నూలు జిల్లా తోవిలో 39.7 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 17 మండలాల్లో తీవ్ర వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, బుర్జ, హిర మండలం, జలుమూరు, లక్ష్మీనర్సంపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లా గుర్ల, సంతకవిటి మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు, పోలవరం జిల్లా గంగవరం, కూనవరం మండలాలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో సోమవారం నుంచి 3 రోజులపాటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడు
బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని, ఆయనను తక్షణం ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని ధ్వజమెత్తాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. సాక్షి,అమరావతి(సాక్షి, నెట్వర్క్): రాసలీలల బీఆర్ నాయుడు రాచపుండులా మారారని వైఎస్సార్సీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి. టీటీడీ చైర్మన్గా ఆయన అనర్హుడని, ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, ఇతర దేవాలయాల్లో కార్యకర్తలు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ల తీరుపై మండిపడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలనూ చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్పీపీ మండిపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారశైలిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని .. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి.. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. పవిత్ర క్షేత్ర బాధ్యత అందరి బాధ్యతని, హైందవ ధర్మానికి క్యాన్సర్లా ప్రమాదకారిగా పరిణవిుంచిన బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హైందవ, తిరుమల తిరుపతి పరిరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నాయకులు వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. కృష్ణాజిల్లా పామర్రులోని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ⇒ గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, ప్రత్తిపాడు, మంగళగిరి, తాడికొండ నియోజవకర్గాల్లోనూ నాయకులు, కార్యకర్తలు గుడుల్లో ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ప్రత్యేక పూజల అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ⇒ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, గూడురు నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా అనర్హుడని నాయకులు నినదించారు. ⇒ ప్రకాశం జిల్లా దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, అద్దంకి, కొండపి, యర్రగొండపాలెం, మార్కాపురం, కందుకూరు తదితర నియోజకవర్గాల్లోని ఆలయాల్లో వైఎస్సార్సీపీ నేతలు పూజలు చేశారు. బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ⇒ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నేతలు నిర్వహించారు. బీఆర్నాయుడికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ⇒ ఏలూరు జిల్లా కైకలూరు, దెందులూరు, నూజివీడు, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ⇒ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్సార్ సీపీ నేతలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఆలయాల్లో పూజలు చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని నినదించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ పవిత్రత కోసం ప్రార్థించారు. ⇒ ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, శ్రేణులు బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆయన తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే చంద్రబాబైనా ఆయనను తొలగించాలని నినదించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. ⇒ ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. హైందవ ధర్మానికి నాయుడు ప్రమాదకారి అని నినదించారు. ఆలయల్లో పూజలు చేశారు. తిరుపతి తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. మీడియా ప్రతినిధులను అడ్డుకున్నారు. ⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు అనర్హుడని నినదించారు. టెంకాయలు కొట్టి చంద్రబాబు సద్బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకున్నారు. ⇒ ఉమ్మడి అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కాయి. బీఆర్ నాయుడు రాసలీలలపై ధ్వజమెత్తారు. ఆలయాల్లో పూజలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. -
సంప్రదాయాలు పాటిస్తేనే అర్చకత్వం
సాక్షి, అమరావతి: అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భాలయంలోకి ప్రవేశించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే ఏ అర్చకుడైనా విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం (పూజా కార్యక్రమాలు) నిర్వహించడానికి అనుమతించరాదంటూ 2010లో జారీ చేసిన సర్క్యులర్ను, అలాగే 2024లో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణికతను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న వారు గర్భాలయంలోకి ప్రవేశించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పలువురు ప్రదాన అర్చకులు విదేశీయానం చేసి వచ్చారని, అయినా కూడా వారిని ప్రధాన గర్భాలయంలో అర్చకత్వం నిర్వహణకు దేవదాయ శాఖ అధికారులు అనుమతిస్తున్నారని పేర్కొంటూ ఆ దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారుగా పనిచేస్తున్న డిఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.పిటిషనర్ తరఫు న్యాయవాది కేఆర్ శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, అర్చకత్వం విషయంలో ప్రస్తుత దేవదాయ శాఖ నిబంధనలు, ఏపీ ధార్మిక పరిషత్తు జారీ చేసిన సర్క్యులర్, అలాగే 2024 డిసెంబర్ 12న శ్రీ శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. -
శనగకు ‘ధరా’ఘాతం.. రైతును ఆదు‘కొనే’వారేరి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు నిర్వాకం శనగ రైతుల పాలిట శాపంగా మారింది. కేంద్రం అనుమతులతో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది నిల్వలతో పాటు ఈ ఏడాది పంట దిగుబడిలో కనీసం 15 శాతం కూడా కొనకుండానే కూటమి సర్కారు కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. మార్కెట్లో ధర లేక.. కొనేవారు కానరాక రైతులు గగ్గోలు పెడుతున్న తరుణంలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అదనపు అనుమతుల పేరిట కేంద్రానికి లేఖలు రాస్తూ నాటకాలాడుతోంది.దక్కే ధర రూ.4,900లోపే..ఈ ఏడాది రబీలో 10.30 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. 4.57 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా. క్వింటాల్కు కనీస మద్దతు ధర రూ.5,650 కాగా.. మార్కెట్లో రూ.4,600 నుంచి రూ.4,900 మధ్య మాత్రమే చెల్లిస్తున్నారు. గతేడాది ధర లేకపోవడంతో దాదాపు 2 లక్షల టన్నులకు పైగా శనగలు కోల్డ్ స్టోరేజీల్లో మూలుగుతుండగా, ఈ ఏడాది పంట మార్కెట్కు రావడం మొదలైంది. కనీసం ఈ ఏడాదైనా ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని మద్దతు ధరకు శనగ పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులంతా ఆశగా ఎదురు చూశారు. కానీ.. కేంద్రంపై భారం నెట్టేసి.. చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకునే పనిలో నిమగ్నమైంది. అర్థంతరంగా కొనుగోలు కేంద్రాలు మూసివేత ఫిబ్రవరి నెలాఖరులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే మూసివేశారు. కేంద్రం 94,500 టన్నుల సేకరణకు అనుమతివ్వగా, కేవలం 84 వేల టన్నులు మాత్రమే సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అర్ధంతరంగా మూసివేసింది. మరోవైపు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు టీడీపీ సానుభూతిపరుల నుంచి మాత్రమే సేకరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 30–40 శాతం పంట మాత్రమే మార్కెట్కు వచ్చింది. గతేడాది నిల్వలతో కలిపితే దాదాపు 4.50 లక్షల టన్నులకు పైగా నిల్వలు రైతుల వద్ద పేరుకుపోయాయి. ఎప్పుడు కొనుగోలు చేస్తారని రైతులు అడుగుతుంటే.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన రావడం లేదు. పైగా ఈ బాధ్యత తనది కాదన్నట్టుగా అదనపు సేకరణకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటోంది. అదనపు కొనుగోళ్లకు అనుమతి కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్టు వ్యవసాయ శాఖమంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇలా లేఖలతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందే తప్ప రైతులను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.కొనుగోలు కేంద్రాల్ని మూసేశారుఐదెకరాల్లో శనగ వేశాను. ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి పెట్టాను. ఈ సీజన్లో మొక్కుబడి తంతుగా కేంద్రాలు తెరిచి.. సీజన్ ముగియకుండానే మూసేశారు. మద్దతు ధర దక్కక,.. బహిరంగ మార్కెట్లో కొనేవారు లేక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఏం చేయాలో పాలుపోక కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. పెట్టుబడులు, ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. – బి.దస్తగిరి, మాలేపాడు, ఎర్రగుంట్ల మండలం, వైఎస్సార్ కడప జిల్లారెండేళ్లుగా ఇదే పరిస్థితిమద్దతు ధర దక్కక.. పంటను కొనుగోలు చేసేవారు లేక శనగ రైతులు రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పూర్తిగా మార్కెట్కు రాకుండానే కొనుగోలు కేంద్రాలను మూసేశారు. ఈ ఏడాది దిగుబడిలో కనీసం 15 శాతానికి మించి కొనుగోలు చేయలేదు. కోతకొచ్చిన పంటను ఏం చేయాలో పాలుపోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది పంట అమ్ముడుకాక కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించి రైతుల వద్ద ఉన్న పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. – వి.కృష్ణయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
మావిగన్.. ప్రజలు అంగీకరిస్తున్న రాజధాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ మంచి ప్రతిపాదన అని, సీఎం చంద్రబాబు చెప్పే అమరావతి దోచుకోనే ప్రతిపాదన అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి కట్టే బదులు, మావిగన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని మూడు ముక్కలాట అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ చెప్పారురాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని చెప్పారు. జగన్ ఇప్పుడు చెప్పిన ప్లాన్ బీ కూడా కొత్తదేమీ కాదు. కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే పెద్దగా చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఈ కారిడార్కు మావిగన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు ఉన్నాయి. నోయిడా అసలు పేరు.. ‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ’. పేర్లు ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేసేందుకు జగన్ పోర్టు నిర్మాణం చేపట్టారు.మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే. ఒక మంచి గ్రోత్ కారిడర్ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నారు. ఈ మూడు నగరాలు కలవడం బాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్ను అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ రాకుండా అడ్డుకుంటున్నాడు. మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రాజధాని పెడితే చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుల భారం ఉండదు. జగన్ చేసిన ఈ ఆచరణాత్మక ప్రతిపాదనపై ఈ మూడు నగరాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మేధావులు చర్చిస్తున్నారు.మంచి ప్రతిపాదన అని అంగీకరిస్తున్నారు. మా పార్టీ నాయకులంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నాయకులు వ్యతిరేకించారన్నది దుష్ప్రచారమే. అమరావతికి కులం రంగు పులిమిందీ చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేశ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.అమరావతి ఇప్పట్లో కాదని బాబే చెబుతున్నారుబాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెబుతున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదనా అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్లో ఉన్న రేటు రావడానికి ఎంత కాలం పడుతుంది? చంద్రబాబువన్నీ మభ్యపెట్టే మాటలే.ఇదీ నయా రాయ్పూర్ వాస్తవ పరిస్థితిచత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. రాయ్పూర్ కోసం ఆ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అదీ తీర్చేశారు. అక్కడ చేసిన ఖర్చు రూ.7 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని వస్తే ఇలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. చత్తీస్గఢ్లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్పూర్లో పెట్టారు. ఇక్కడ వికేంద్రీకరణ పెద్ద తప్పుగా దుష్ప్రచారం చేశారు.అమరావతి రైతులకూ అన్యాయం చేశారుచంద్రబాబు అమరావతి రైతులకూ అన్యాయం చేశారు. ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.అమరావతి సంబరాలను ప్రజలు, అధికారులు పట్టించుకోలేదుఅమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా వారు కూడా పట్టించుకోలేదు. -
బకాయిలు వెంటనే చెల్లించాలి
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ఉద్యోగులకు వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ రెవెన్యూ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేయలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఐఆర్ ప్రకటించాలని, పీఆర్సీ కమిషన్ వేసి మెరుగైన వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ఖర్చులేని పీఆర్సీ కమిషనర్ నియామకం కూడా ఆలస్యం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతున్న తరుణంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఆనవాయితీ ప్రకారం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉద్యోగులు మూడేళ్లుగా ఐఆర్ పొందుతున్నారని, మన రాష్ట్రంలో మాత్రం కనీసం పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.వేల కోట్ల బకాయిలను తక్షణం చెల్లించాలని కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సొంత డబ్బు అందక ఆరి్థక ఇబ్బందులతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనూ నెరవేర్చరా? ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం దుర్మార్గమని బొప్పరాజు పేర్కొన్నారు. తక్షణమే హామీలు అమలుచేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల మద్దతుతో తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించారు. నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించిందన్నారు. 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు సుమారు రూ.6 వేల కోట్ల సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయని, వాటిని కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో 34 శాతం మంది ఉద్యోగులకు ఆ బకాయిలు అందలేద న్నారు. ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల సమయం ఇచ్చామని, ఇకపై ఓపిక పట్టే పరిస్థితి లేదన్నారు. ఏపీ జేఏసీ ,అమరావతి, సచివాలయ ఉద్యోగుల సంఘాలు ఏకమై సమస్యలపై ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జాబ్ క్యాలెండర్లో ఖాళీ పోస్టులన్నీ చేర్చాలి ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో కేవలం పోలీస్, టీచర్ పోస్టులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇతర శాఖల్లో ఖాళీలను పట్టించుకోలేదని బొప్పరాజు ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ముఖ్యంగా జూనియర్ అసి స్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగులపై పని భారం పెరిగి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జూనియర్ అసిస్టెంట్, గ్రూప్–4 ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్లో చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని కోరామని చెప్పారు. ప్రభుత్వంలో భాగమైన లక్ష లాది మంది ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరపాలన్నారు. ఆయన వెంట ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, జేఏసీ మహిళా విభాగం చైర్పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి, జేఏసీ కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, ఎస్.మల్లేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లాశాఖ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు. -
అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..
సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపాయాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు? రాష్ట్రానికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశామని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్ ఇంజన్గా మారే అవకాశమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్ ట్రిక్స్కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనలో తప్పేంటి?‘మా నాయకుడు వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఉన్నారు. -
తక్కువ వేతనంతో తాత్కాలిక ఉద్యోగం.. ‘శ్రమ దోపిడీ’నే..
సాక్షి, అమరావతి: శాశ్వత ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేయకుండా దశాబ్దాల తరబడి తక్కువ వేతనంతో ఉద్యోగుల సేవలను వాడుకోవడం ‘శ్రమ దోపిడీ’ అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అవసరమైన, నిరంతరాయమైన పనుల కోసం ‘తాత్కాలికం’ పేరుతో ఉద్యోగులను నిరవధికంగా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఎప్పుడూ ఆదర్శ యజమానిగా ఉండాలే తప్ప, పౌరులను శ్రమ దోపిడీ చేసేలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన, సరైన ఎంపిక విధానం ద్వారా భర్తీ చేయకుండా, విద్యావంతులను, అన్నీ అర్హతలున్న వారిని ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ వేతనాలకు నియమించుకుంటోందని హైకోర్టు ఆక్షేపించింది. ఇలా ఔట్సోర్స్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకున్న ఉద్యోగులను దశాబ్దాల పాటు ఉపయోగించుకుంటోందని తెలిపింది. ఇలా దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న ఉద్యోగులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని కోరితే, మీ నియామకాలు సక్రమంగా జరగలేదనో, మంజూరైన పోస్టులకు అనుగుణంగా నియామకాలు జరగలేదనో ప్రభుత్వం చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు పేర్కొంది. దశాబ్దాల తరబడి వారి నుంచి సేవలు పొందిన తరువాత ప్రభుత్వం సాంకేతిక కారణాలను సాకుగా చూపి వారి హక్కులను నిరాకరించడానికి వీల్లేదంది. ఈ మేరకు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ సుబేందు శమంతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. పిటిషనర్ల సర్వీసును రెండు నెలల్లో క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వీసుల క్రమబద్ధీకరించాలకు పిటిషన్లు...విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, ట్రేసర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్మెన్లు, గార్డెనర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లుగా దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కె.శ్రీనివాస్ మరో 36 మంది 2018లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ను ఆశ్రయించారు. అలాగే తమ సర్వీసులను కూడా క్రమబద్దీకరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలుగు గంగ ప్రాజెక్టులో పనిచేస్తున్న కె.నారాయణరెడ్డి, టీఎస్.ఖాజామైనుద్దీన్ కూడా ఏపీఏటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్, సర్వీసుల క్రమబద్ధీకరణకు పిటిషనర్లు అర్హులు కారంటూ 2018లో వారి పిటిషన్లు కొట్టేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ వీరంతా 2018లో హైకోర్టులో వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం తుది విచారణ జరిపి తీర్పునిచ్చింది. పిటిషనర్లు 1987, 1989లో నామినల్ మస్టర్ రోల్ (ఎన్ఎంఆర్) పద్ధతిన విధుల్లో చేరారు. 1993 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయలేదనే ఒకే ఒక్క కారణంతో వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించలేదు. -
పీఎస్పీ టెండర్లో ఏపీజెన్కో ఇష్టారాజ్యం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ శాఖలో అక్రమాలకు కొదవలేదు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల దగ్గర నుంచి డైరెక్టర్ల నియామకాలు, భారీ టెండర్ల వరకూ ప్రతి చోటా అవినీతికి అడ్డూ అదుపూ లేదు. తాజాగా రూ.5 వేల కోట్ల విలువైన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ (పీఎస్పీ) టెండర్ను అస్మదీయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన భారీ సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొనలేని విధంగా.. కేవలం తమకు అనుకూలంగా ఉండే ప్రైవేటు సంస్థలకే టెండర్లు దక్కేలా వింత నిబంధనలు పెట్టారు. అందుకోసం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) మార్గదర్శకాలకు సైతం తూట్లు పొడిచారు. ఇష్టానుసారం నిబంధనలు అనంతపురం జిల్లా, యాడికి మండలం, కమలపాడులో 950 మెగావాట్లతో పీఎస్పీ కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) ఈ ఏడాది జనవరి 22న టెండర్ను విడుదల చేసింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.5 వేల కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ టెండర్లో కొన్ని నిబంధనలను సీఈఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా పెట్టింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థకు టర్బైన్ అనుభవానికి సంబంధించి నిలువు విధానంలో తిరిగే ‘వెర్టికల్ ఫ్రాన్సిస్ రివర్స్బుల్ టర్బైన్’ నడిపిన అనుభవం ఉండాలని నిబంధన విధించింది. అదే విధంగా మోటార్ జెనరేటర్ అనుభవానికి సంబంధించి నిలువు అక్షంపై పనిచేసే జల మోటర్ విద్యుత్ ఉత్పత్తి యంత్రం ‘వెర్టికల్ షాఫ్ట్ సింక్రోనస్ హైడ్రో మోటార్ జనరేటర్ (118 ఎంవీఏకు పైగా) పనులు చేసిన వారే అర్హులని నిబంధనల్లో ఉంది. ఫలితంగా భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. కేంద్రానికి బీహెచ్ఈఎల్ ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ పీఎస్పీతో పాటు అనేక రాష్ట్రాల్లో పీఎస్పీలు చేపట్టిన అనుభవం తమకు ఉందని, తమకు కూడా కమలపాడు పీఎస్పీ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని బీహెచ్ఈఎల్ ఏపీజెన్కోను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జెన్కో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డికి అధికారికంగా ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఓ లేఖ కూడా రాసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొనే సంస్థకు టర్భైన్ అనుభవానికి సంబంధించి ‘వెర్టికల్ ఫ్రాన్సిస్ టర్భైన్ లేదా నీటి పంపు’ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని బీహెచ్ఈఎల్ అడిగింది. అదే విధంగా మోటార్ జెనరేటర్ అనుభవానికి సంబంధించి జల విద్యుత్ యంత్రం(హైడ్రో) మోటార్ అనుభవాన్ని కూడా పోటీకి అంగీకరించాలని కోరింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, దేశీయ సంస్థలు టెండర్లో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయని, పోటీ కూడా మెరుగవుతుందని పేర్కొంది. కానీ జెన్కో నుంచి స్పందన రాలేదు. దీంతో మార్చి 24న సీఈఏకి, మార్చి 26న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు బీహెచ్ఈఎల్ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా పీఎస్పీ టెండర్లలో తామిచ్చిన మార్గదర్శకాలను అనుసరించాల్సిందిగా ఏపీజెన్కోకు సీఈఏ సూచించింది. అయినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి మార్పు లేదు. సీఈఏ మార్గదర్శకాల ఇవీ ప్రస్తుతం దేశంలో సుమారు 7 గిగావాట్ల సామర్థ్యంతో 10 ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. మరో 12 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలో సౌర, గాలి విద్యుత్ ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, విద్యుత్ నిల్వ అవసరం కూడా పెరుగుతోంది. 2030 నాటికి 62 గిగావాట్, 2035 నాటికి 161 గిగావాట్ నిల్వ అవసరం ఉంటుందని సీఈఏ అంచనా వేసింది. 2035–36 నాటికి 100 గిగావాట్ల హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా దేశంలో పీఎస్పీలను ప్రోత్సహించడానికి ఈ ఏడాది జనవరి 8న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం..ప్రభుత్వ రంగ సంస్థలు పీఎస్పీ టెండర్లలో పాల్గొనాలంటే వాటికి పీఎస్పీ ప్రాజెక్టులు నిర్మించిన అనుభవం నేరుగా ఉండనక్కర్లేదు. దానికి సమానమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన అనుభవం ఉంటే సరిపోతుంది. హైడ్రో ప్రాజెక్టులు, డ్యామ్లు, పెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టులు చేసిన అనుభవాన్ని కూడా పీఎస్పీకి అర్హతగా పరిగణించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర సంస్థలతో కలిసి చేసిన ప్రాజెక్టుల అనుభవాన్ని కూడా అంగీకరించవచ్చు. ఇతర సంస్థలతో కలిసి బిడ్ వేస్తే కన్సార్టియం అనుభవాన్ని అర్హతగా చూపించుకోవచ్చు. ప్రాజెక్ట్ను స్వయంగా చేయకపోయినా కాంట్రాక్టర్ అనుభవాన్ని ఆధారంగా సమర్పించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ టెండర్ దక్కించుకుంటే కేంద్ర ప్రభుత్వ నుంచి అనుమతులు సకాలంలో వచ్చి ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వడానికి మార్గం సుగమం అవుతుంది. భూ సేకరణ త్వరగా జరుగుతుంది. రిక్స్ కూడా బాగా తక్కువ. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలు లభిస్తాయి. దీంతో ప్రాజెక్ట్ ఖర్చు తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో, ఒకే ప్రభుత్వ సంస్థ బిడ్ చేసినా కూడా టెండర్ను రద్దు చేయకుండా అంగీకరించవచ్చు. కానీ జెన్కో టెండర్లలో ఈ మార్గదర్శకాలను పట్టించుకోలేదు. సీఎం కల్పించుకోవాలి కమలపాడు పీఎస్పీ టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలి. టెండర్ నిబంధనలను సీఈఏ మార్గదర్శకాల ప్రకారం సవరించాలి. – విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు, సోషల్ మీడియాలో పోస్ట్ అర్హత ఉంటే ఎవరైనా టెండర్ వేయవచ్చు ఈ నెల 6 వరకూ టెండర్ దాఖలు చేయడానికి గడువు ఉంది. అప్పటికి ఎవరూ టెండర్ వేయకపోతే గడువును మరోసారి పొడిగిస్తాం. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలేవైనా అర్హత ఉంటే టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. – ఏపీ జెన్కో -
ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, తాడేపల్లి: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు.. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చినా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోకపోవటంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికీ బీఆర్ నాయుడిని వెనకేసుకువస్తున్న చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ మండిపడుతోంది.వైఎస్సార్ జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలిపై పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నాడని ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్సార్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు.బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ చేశారు. ఈ నిరసన మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ అధ్యక్షుడు హల్ గంగాధర్ రెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.అనంతపురం జిల్లా: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని కోరుతూ అనంతపురంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్లకార్డులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ మండిపడ్డారు.విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని వెంటేశ్వరస్వామి వారి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించాయి. వైఎస్సార్సీపీ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు రమణకుమారి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పూజల్లో మాజీ ఎమ్మెల్యే, మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ నాయుడిని టీడీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలంటూ నినాదాలు చేశారు.చంద్రబాబు సమాధానం చెప్పాలి: మల్లాది విష్ణుబీఆర్ నాయుడు ఛైర్మన్ అయిన రోజు నుంచి తిరుమలపై అపచారాలు జరుగుతున్నాయి. టీడీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి. ఏమొహం పెట్టుకుని చంద్రబాబు బీఆర్ నాయుడిని తన పక్కన కూర్చోబెట్టుకుని తిరుపతిలో పూజలు చేస్తారు. కళంకితమైన వ్యక్తితో కలిసి ఎలా ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణంలో పాల్గొంటారు. అసలు చంద్రబాబుకు నైతికత ఉందా?. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్గా తీసుకోవద్దని ఓ మహిళ లేఖ రాసింది. కానీ అవేమీ చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.పటమట వెంకటేశ్వరస్వామి ఆలయంలో..టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పటమట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కల్పలత, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూజలు చేశారు.తిరుపతి: టీటీడీ చైర్మన్ వైఖరి పట్ల హిందూ సమాజం సిగ్గు పడుతోందని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంఛార్జి భూమన అభినయ్రెడ్డి అన్నారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉంటూ.. ఆయన చరిత్ర ఇంత పరమ నికృష్ట మైందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలి. లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత తిరుమల సీఎం చంద్రబాబు మనవడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం, శ్రీరామ నవమి వేడుకల్లో సీఎం తో పాటు టీటీడీ చైర్మన్ పాల్గొనడం సిగ్గుచేటు.చిత్తూరు జిల్లా: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కృపాలక్ష్మీ డిమాండ్ చేశారు. కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘ బీఆర్ నాయుడు రాసలీలలు బయట పడిన తర్వాత కూడా టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గు చేటు. సీఎం చంద్రబాబు వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు.. హోంశాఖామంత్రి అనిత మహిళలకు అండగా ఉన్నామని అంటున్నారే కానీ నడిరోడ్డుపై మహిళను పదవిలో ఉన్న ఎమ్మెల్యే కొడుతుంటే ఎలాంటి స్పందన లేదు. హోం శాఖ మంత్రి విమర్శలకే పరిమితమైంది. పల్నాడు జిల్లా, మాచర్లలో ఇంట్లో వున్న మహిళను కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా అఘాత్యానికి పాల్పడిన ఘటనపై బాధ్యత మహిళలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా మహిళలకు అండగా నిలిచాము’ అని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా: బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణితో కలిసి వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత.స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలిబీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారుచంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీఆర్ నాయుడిని తొలగించాలి- కాకాణి పూజిత నెల్లూరు జిల్లా, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం కేంద్రంలోని శ్రీలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్రెడ్డి.ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణికి వేదమంత్రాల నడుమ, మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన, ఆలయ అర్చకులు, స్థానికులుకాకాణి కామెంట్స్నైతిక విలువలు లేని బీఆర్ నాయుడికి పవిత్ర పదవి ఇవ్వడం సరికాదుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి, అనైతిక కార్యక్రమాలు పెచ్చరిల్లిపోయాయిచంద్రబాబు మహిళల పై ఎవరైనా చెయ్యి వేస్తే, అదే ఆఖరి రోజు అవుతుందని చెబుతూనే ఉన్నాడు-మా ప్రభుత్వం వస్తే మహిళల వైపు చూడడానికే భయపడతారని పవన్ కళ్యాణ్ ప్రగల్బాలు పలికాడుఇప్పుడు ఇన్నీ అరాచకాలు జరుగుతున్నా నోరు మెదపరేమి వైఎస్ జగన్ పాలనలోనే మహిళలు రక్షణ పొందారు పార్వతీపురం, మన్యం జిల్లా: టీటీడీ చైర్మన్ పదవిని బీఆర్ నాయుడు అపవిత్రం చేశారంటూ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ధ్వజం. బీఆర్ నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాల్సిందేనంటూ డిమాండ్గుంటూరు: బీఆర్ నాయుడు పదవి నుంచి దిగిపోవాల్సిందే: అంబటి రాంబాబువెంకటేశ్వరస్వామి ఆలయంలో అంబటి ప్రత్యేక పూజలు -
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికితోడు పరీక్షల వ్యవస్థను సర్కారు అపహాస్యం చేస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా, బయట సిలబస్ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లిష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదమేర్పడింది. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆరు మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ.. గతేడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షల కోసం ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టీ పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ సెట్టింగ్లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి.. 35 శాతం మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థీ రాసేలా, మరో 15 శాతం కష్టతరంగా, మిగిలిన 50 శాతం మధ్యస్తంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది ఎవరికీ అర్థంగాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ఇంగ్లిష్లో పేపర్లో ఇచ్చిన తప్పు ప్రశ్నలివీ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలప్రశ్నపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూప్రింట్కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లిష్ పేపర్ను పరిశీలిస్తే.. » జంబుల్డ్ సెంటెన్స్ (ప్రశ్న నం.17)లో సాధారణంగా ఒక స్టోరీ లేదా ఒక ఘటనను ఇచ్చి, అందులోని కొన్ని పదాలను అటు ఇటుగా మార్చి (జంబుల్), ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. కానీ ఈసారి పేపర్లో ఒక స్టోరీని పూర్తిగా ‘రివర్స్’లో వెనుక నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఐదు మార్కులు కోల్పోయారు. » ఎడిటింగ్ (ప్రశ్న నం.22): ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చిన పాసేజ్లో ఎడిట్ చేయాల్సిన సెంటెన్స్ను ‘అండర్ లైన్’ చేయాలి. గతంలో జరిగిన పరీక్షల్లో ఇచ్చిన పాసేజ్లో నాలుగు వర్డ్స్ను అండర్లైన్ చేసి ఇచ్చారు. కానీ పబ్లిక్ పరీక్షలో మాత్రం ఒకే పాసేజ్ ఇచ్చి ఎక్కడ ఎడిట్ చేయాలో అండర్లైన్ చేయలేదు. 4 మార్కులు కోల్పోయారు. » అడ్వైస్ (ప్రశ్న నం.26): సెంటెన్స్లో ఇచ్చిన ‘నౌన్’ను ఉద్దేశించి అడ్వైస్ ఇస్తారు. కానీ, ఈసారి పరీక్షలో నౌన్కు కాకుండా నౌన్ తండ్రికి అడ్వైస్ ఇవ్వమని అడిగారు. అంటే విద్యార్థులకు బోధించని, సిలబస్లో లేని ప్రశ్నను ఇవ్వడంతో 2 మార్కులు కోల్పోయారు. » ఆపోజిట్ వర్డ్స్ (ప్రశ్న నం.28): ఇది పూర్తిగా సిలబస్లో లేనిది, బ్లూప్రింట్కు సంబంధం లేనిది ఇచ్చారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న కావడం గమనార్హం. ఫిజికల్ సైన్స్లోనూ అదే తీరు ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ సిలబస్లో లేని ప్రశ్నలే ఇచ్చారు. వారి ఐక్యూ స్థాయిని అంచనా వేసేవిగా మార్చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో విద్యార్థులు కచ్చితంగా ఏరోజు ఏ ప్రశ్నలు చదవాలో సిలబస్ ఇచ్చా రు. కానీ ఆ జాబితాలోని మోడల్స్కు, వెయిటేజీకి విరుద్ధంగా ప్రశ్నలు సైతం సందిగ్ధంగా, అసాధారణ రీతిలో ఇవ్వడంతో విద్యార్థులు సరిగా రాయలేకపోయారు. ముఖ్యంగా 8, 11, 14(1), 14(4), 3వ ప్రశ్నలు అసాధారణ రీతిలో ఇవ్వడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వీటికి ఆరు మార్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. -
ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో కూటమి ప్రభుత్వం విభజించు – పాలించు అనే విధానం అనుసరిస్తుండడంతో రిజిస్టర్డ్ సంఘాలు ఒక్కటయ్యాయి. ఉపాధ్యాయ సమస్యలపై ఉమ్మడిగా పోరు సాగించేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే గుర్తింపు సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పడి పోరుబాట ప్రారంభించగా, ఇకపై రిజిస్టర్డ్ సంఘాలు సైతం ఐక్యంగా ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు. మొత్తం 30 సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు సీవీ ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంఘాలు ఏకమై సమస్యల పరిష్కారం కోసం జతకట్టడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. గతేడాది ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం కేవలం గుర్తింపు సంఘాలతోనే చర్చలు జరపడం, రిజిస్టర్డ్ సంఘాలను పిలవకపోవడాన్ని ఐక్యవేదిక ఖండిస్తున్నట్టు వెల్లడించారు. విద్యారంగం, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం, పీఆర్సీ, ఐఆర్, డీఏ, పాత బకాయిలు, ఇతర ఆరి్థకపరమైన డిమాండ్ల సాధన కోసం త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రూసో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక సమావేశంలో భాగంగా రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో)ను ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీని ప్రకటించారు. చైర్మన్గా సీవీ ప్రసాద్ (ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.శ్రీనివాసరావు(పీఎంటీఎఫ్), కోశాధికారిగా ఎం.మీరయ్య(ఏపీ పీజీటీఏ), కో–చైర్పర్సన్లుగా ఎస్.రాజేశ్వరి (మహిళా ఉపాధ్యాయ సంఘం), ఆర్.సుధాకర్ రెడ్డి (ఎస్టీయూడీ), అన్నం శ్రీనివాస్ (పూలే టీచర్స్ ఫెడరేషన్), ఖాజా రహమతుల్లా (ఆర్టీఏ), ఎం.అమర్నాథ్ (ఏటీఏ), కె.పూర్ణచంద్రనాయక్ (ఏపీ టీడబ్ల్యూటీఏ), శ్రీనివాసులు (పీఎస్ హెచ్ఎంఏ), డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా డి.పెంచలయ్య (మహాజన టీచర్స్ అసోసియేషన్), గణేష్ (దివ్యాంగుల టీచర్స్ అసోసియేషన్), లక్ష్మణ్ (ఏపీ జీటీడబ్ల్యూఏ ఎస్సీఆర్టీఏ), పారయ్య (టీఆర్ఈఐటీఎల్ఏ), సు«దీర్ (ఏపీపీడీఏ), వెంకట సుబ్బయ్య (స్పెషల్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్), మహిళా కార్యదర్శులుగా గంగాభవానీ (వోజీవీటీ)తో పాటు 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. టీఎన్యూఎస్ ఏపీ రాష్ట్ర నాయకుడు కృష్ణ మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ వంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితమవుతూనే ఉంటాయన్నారు. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్, మోనిటైజేషన్ ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్నామని తెలిపారు. రాజధానిలో భూమి విలువలు పెరుగుతాయని, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను ఇచ్చారని చెప్పారు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతేనని చెప్పారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. పార్లమెంటు శాశ్వత రాజధాని అని చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్లాన్ ఏ, ప్లాన్ బీ చేస్తామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని అవుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 నాటికల్లా రాజధానిలో ప్రధానమైన పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపారు. -
మూడో రోజు కొనసాగిన నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె మూడో రోజైన శుక్రవారం నాడూ కొనసాగింది. ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు పూర్తిగా నిలిపివేసి నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు సేవలు బంద్ చేయడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోంది. తొలి రోజు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ)తో మొక్కుబడిగా చర్చలు చేపట్టిన ప్రభుత్వం తర్వాత చేతులు దులిపేసుకుంది. చర్చలు జరిపిన రోజే సమ్మె ఆపబోమని, కొనసాగిస్తామని ఆశ తేల్చి చెప్పినా, మరోమారు వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం కనీస చొరవ చూపకపోవడం గమనార్హం.ఓవైపు ఆరోగ్య శ్రీ సేవలు ఆగిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రైవేట్, పార్టీ, ఇతర కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, కేరళ ఎన్నికల ప్రచారంలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ బిజీగా గడిపేస్తున్నారు. 1.40 కోట్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన పథకానికి సంబంధించిన సేవలు నిలిచిపోతే కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారని రోగులు మండిపడుతున్నారు. -
పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి
సాక్షి, అమరావతి: క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగానికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే పవిత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కాసేపు ఆలోచించి, మనలో మనం చూసుకుని, మన విలువలను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మనలను మనం ప్రేమించినట్టే ఇతరులనూ ప్రేమించాలి అనే యేసుక్రీస్తు బోధనే సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. -
ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు
సాక్షి, అమరావతి: విలువైన భూమి కేటాయించిన తర్వాత సకాలంలో మొత్తం నగదు కట్టకపోయినా ఉన్నప్పుడు కట్టుకునే అవకాశాన్ని ఏపీఐఐసీ కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భూమి కేటాయించిన తర్వాత 60 రోజుల్లోగా నిర్దేశిత మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆ నిబంధనను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజులు దాటిన తర్వాత 9 శాతం వడ్డీతో ఎప్పుడైనా డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పించింది. అంటే 61వ రోజు నుంచి ఎప్పుడు చెల్లిస్తారో అన్ని రోజులకు 9 శాతం వడ్డీ చెల్లించడంతోపాటు 3 శాతం అదనంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలైతే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సడలింపు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతిస్తామని, 2020 నిబంధనల ప్రకారం కేటాయించిన భూములకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో భూములు కేటాయించిన బెంగళూరుకు చెందిన సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ.1500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని రూ.45 కోట్లకే కేటాయిస్తే సకాలంలో డబ్బులు చెల్లించలేదు. మంత్రివర్గంలో మరోసారి అనుమతి తీసుకొని డబ్బులు చెల్లించింది. ఇదే విధంగా ప్రీమియర్ ఎక్స్పో్లజివ్ సంస్థ కూడా సకాలంలో డబ్బులు చెల్లించలేక గడువు అడిగింది. ఇలా ఈ మధ్యకాలంలో చంద్రబాబు సర్కారు కారు చౌకగా భూములు కేటాయించిన పలు సంస్థలు నిర్దేశిత సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ నిబంధనలనే సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీవైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు. వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధిదేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్ను రాజధాని కారిడార్గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.ఇతర మౌలిక వసతులకు కొదవలేదుఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది. అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభామావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. మావిగన్తో అందరికీ మేలురాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం అత్యంత వాస్తవిక ఆలోచనమావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం -
‘అప్పు’డే తెల్లారింది!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) చేయనున్న బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. సూపర్ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? ఆర్బీఐ చేత అప్పుల క్యాలెండర్ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. 2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్ ఇలా తేదీ అప్పు మొత్తం (రూ.కోట్లలో) ఏప్రిల్ 7 4,400 ఏప్రిల్ 21 4,600 మే 5 4,400 మే 19 4,600 జూన్ 2 4,400 జూన్ 16 4,600 మూడు నెలల్లో అప్పు రూ.27,000 కోట్లు బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ రుణం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ విజయానంద్ దీంతో ఏపీపీఎఫ్సీఎల్ అప్పు రూ.13,610 కోట్లు సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్ల టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్ ఆఫ్ కంఫర్ట్ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది. -
మెడికల్ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెర తీశారు. మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!రంగంలోకి ఆ ముగ్గురు..పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మెడికల్ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్ వేశారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.న్యాయ వివాదాలు..2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇచ్చారు.5న జనరల్బాడీ సమావేశం.. రూ.250 కోట్ల కార్పస్ ఫండ్పై ముఖ్యనేత కన్నుఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది.


