breaking news
Amaravati
-
ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: తాటిపర్తి చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతలు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక మాఫియాన్ని నడుపుతున్నారా?. రాష్ట్రంలో రాజకీయ రక్తపాతాన్ని పారిస్తున్నారు. రెడ్బుక్ పేరుతో తీవ్రమైన దారుణాలకు పాల్పడుతున్నారు. ఏపీలో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘హనీట్రాప్ చేసిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదుతో పీఎస్ఆర్ ఆంజనేయుల్ని జైల్లో పెట్టారు. అక్రమాలు బయట పెట్టిన ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. రెడ్బుక్ వైఎస్సార్సీపీ నేతలపైనే కాదు.. అధికారులపై కూడా ప్రయోగించి వేధిస్తున్నారు’’ అని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ‘‘కూటమి నేతలు.. భారీగా భూ దోపిడీ, ఇసుక, మైనింగ్ స్కాంలు చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. ఏపీలో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్. కూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. కూటమి నేతలు ప్రైవేటీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. కూటమి నేతల దోపిడీని వైఎస్సార్సీపీ బయటపెడుతోంది. కూటమి నేతలు టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ను మానసికంగా వేధించారు. సతీష్ మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం. సతీష్ మృతిపై ఎల్లో మీడియా కట్టుకథలు చెబుతోంది...ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే, పోస్టుమార్టం జరగక ముందే హత్య అని టీడీపీ నేతలు ఎలా చెప్పారు?. గొడ్డలి వేటు గాయాలతోనే సతీష్ రైలు ఎక్కాడా?. రక్తపు మరకలు ఎవరూ చూడలేదా?. హత్య జరుగుతుంటే జనం ఎవరూ చూడలేదా?. కట్టుకథలను టీడీపీ నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?. సతీష్ వీపు మీద గొడ్డలి వేటు ఉన్నట్టు ఎల్లో మీడియా ఎలా ప్రచారం చేసింది?’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు...చేసిన అభివృద్ధి ఏమీ లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం మాత్రం చేసుకుంటుంది. జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు టీడీపీ స్టిక్కర్లు వేస్తున్నారు. గోమాంసం విచ్చలవిడిగా ఎగుమతి అవుతుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మహిళలపై జనసేన నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ చోద్యం చూస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులను చంద్రబాబు దారుణంగా అవమానించారు. ప్రజల సొమ్ముతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. ప్రయివేటు వ్యక్తుల భూములను హెలికాప్టర్ నుండి చిత్రీకరించే పవన్కి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఆక్రమణ ఇల్లు కనపడలేదా?’’ అంటూ చంద్రశేఖర్ నిలదీశారు. -
రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆయన జీవితకాలంలో ఏనాడూ రాయలసీమ అభివృద్ధికి కృషి చేయలేదని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాయలసీమకు చెందాల్సిన రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్ అన్నీ తరలించుకుపోయారని.. మాకు రావాల్సిన నీళ్లు, నిధులను కూడా కోల్పోయాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘శ్రీబాగ్ ఒప్పందం జరిగి నేటికి 87 ఏళ్లయినా రాయలసీమలో ఎలాంటి మార్పులూ జరగలేదు. 2020లో వైఎస్ జగన్ శ్రీబాగ్ ఒప్పందం గురించి అసెంబ్లీలో మాట్లాడారు. దివంగత వైఎస్సార్ రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వైఎస్ జగన్ తాగు, సాగు నీటి ప్రాజెక్టులు తెచ్చారు. రాయలసీమకు చేయాల్సినవి చంద్రబాబు ఏమీ చేయలేదు. హైకోర్టు బెంబ్ చాలంటూ మాట్లాడుతున్నారు. దానికి సంబంధిన ప్రతిపాదనలను కూడా ఇంకా పంపలేదు...సాగు నీరు లేక రాయలసీమ కరువుతో ఉంటే చంద్రబాబుకు కనపడటం లేదు. కృష్ణా నీరు వృధాగా పోతున్నా రాయలసీమకు తరలించే పని చేయటం లేదు. రాయలసీమ మీద చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి పనులను జగన్ చేపడితే చంద్రబాబు ఆపేశారు. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనీ చంద్రబాబు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటం ద్వారా రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. మా రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్ని చంద్రబాబు లాక్కెళ్లారు..చంద్రబాబు వలన సాంస్కృతిక వైభవాన్నే రాయలసీమ కోల్పోయింది. ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించాలి. చంద్రబాబు ఒక ప్రాంతంపైనే ప్రేమను చూపిస్తే కుదరదు. సిద్దేశ్వర అలుగు నిర్మాణం చేపట్టాలి. నీళ్లు, నిధుల విషయంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
వేల వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తు ప్రశ్నార్థకం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వేల వక్ఫ్ ఆస్తుల భవిష్యత్తుపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకపక్క ఆన్లైన్ నమోదు ప్రక్రియలో అడ్డంకులు, మరోపక్క నమోదుకు గడువు కేవలం 20 రోజులు మాత్రమే ఉండడం దీనికి కారణం. ఈ ప్రక్రియ పూర్తికాకుంటే, వక్ఫ్ ఆస్తులు వివాదాస్పదమయ్యే ప్రమాదం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం సమాజం నమోదు గడువు పెంపు కోసం ఎదురుచూస్తోంది. గడువు పొడిగించాలని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే వక్ఫ్బోర్డు అధికారులను కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని ముస్లిం సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్ ఆస్తులు ఉండగా, గడచిన ఐదు నెలల్లో ఆన్లైన్ అయినవి 1,809 మాత్రమే. డిసెంబర్ 5వ తేదీలోపు 2,939 ఆస్తుల ఆన్లైన్ కష్టమని అంచనా. నమోదు అవసరం ఏమిటి?కేంద్రం ఉమీద్–2025 (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్) తెచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తులను మరోసారి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉమీద్–2025 సెక్షన్ 3బి ప్రకారం వక్ఫ్ వివరాలను దాఖలు చేయడం, సెక్షన్ 5 ప్రకారం ఆ జాబితాను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, సెక్షన్ 36 కింద కొత్తగా వక్ఫ్ నమోదు చేయటం వంటి ప్రక్రియకు ఆరు నెలల గడువును వి«ధించారు. నమోదు ప్రక్రియలో ‘మేకర్–చెకర్–అప్రూవర్‘ విధానాన్ని అనుసరిస్తున్నారు. సంబంధిత వక్ఫ్ ఆస్తులను ఆన్లైన్ చేయడంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా నియమితులైన ముతవల్లి, ఏదైనా అధికారి మేకర్గా వ్యవహరిస్తారు. ఆ ఆస్తులను కరెక్ట్గా అప్లోడ్ చేశారా? లేదా? తదితర అంశాలను జిల్లా స్థాయి అధికారి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన అధికారి తనిఖీ(చెకర్) చేస్తారు. ఆన్లైన్ చేసిన ఆస్తులను తుది పరిశీలన చేసి తర్వాతే రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా అధికారం పొందిన ఏదైనా అధికారి ఆమోదముద్ర (అప్రూవర్) వేస్తారు.నమోదుకు అడ్డంకులు ఇవీ..» ఉమీద్ వెబ్సైట్లో వక్ఫ్ ఆస్తుల ఆన్లైన్ నమోదుకు సర్వర్ డౌన్ సమస్యతోపాటు పలు సాంకేతిక ఇబ్బందులు పెను సవాలు విసురుతున్నాయి. » సైట్ నిరంతరం ‘నిర్వహణలో ఉంది‘ అనే సమాచారం చూపిస్తోంది. » తరచూ ఓటీపీ, లాగిన్ విఫలమవుతున్నాయి.» వెబ్సైట్లో ఒక్కో ఆస్తి నమోదుకు 13 కాలమ్స్లో 56 పేజీలను అప్లోడ్ చేయడం ఆలస్యం అవుతోంది.» పలు సందర్భాల్లో డాక్యుమెంట్ అప్లోడ్ తిరస్కరణకు గురవుతోంది. » జీఐఎస్ మ్యాపింగ్ టూల్పనిచేయడంలేదు. » పరిశీలించి ఆమోదించాల్సిన కలెక్టర్ లాగిన్ యాక్టివ్గా ఉండటంలేదు. » దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం అయ్యేలా చూడాల్సిన హెల్ప్డెస్క్ అసలు రెస్పాండ్ కావడంలేదు. ప్రతి రోజు రాష్ట్ర వక్ఫ్బోర్డుతోపాటు కేంద్ర పోర్టల్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో సైతం ఆన్లైన్ సమస్యలుప్రస్తావిస్తున్నా పరిష్కారానికి నోచుకోవడంలేదు.» రాష్ట్ర విభజన జరిగి పన్నేండేళ్లు కావస్తున్నా తెలంగాణాలోనే ఏపీ వక్ఫ్ రికార్డులు ఉండిపోవడంతో ఆ రాష్ట్ర సహాయ నిరాకరణ కూడా అవరోధం కలిగిస్తోంది.» పలు అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన లోపం కూడా శాపంగా మారింది. -
25న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. సోమవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో దాడికి సంబంధించిన వీడియోతో సహా పోస్టు చేశారు. ‘హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా దీన్ని భావించాలి. చంద్రబాబు నాయకత్వం మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. -
పని చేయకున్నా జీతాలివ్వాలా?
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులపై సీఎం చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఏ పనీ చేయకుండా పడుకొని జీతాలు ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. ‘మేం పని చేయం.. అయినా కేంద్రం, రాష్ట్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదు’ అంటూ రెచ్చిపోయారు. శనివారం సీఐఐ పెట్టుబడుల సమావేశ వివరాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓ విలేకరి విశాఖ స్టీల్ పరిశ్రమ పరిస్థితిపై ప్రశ్న అడగ్గానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను మెచ్చుకుంటూ కార్మికుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు నష్టాలు వస్తున్నాయంటూ శివాలెత్తారు. దేశ వ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంటులు లాభాల్లో నడుస్తుంటే ఒక్క వైజాగ్ స్టీల్ మాత్రమే ఎందుకు నష్టాల్లో నడుస్తోంది.. ఇందుకు మీరు బాధ్యులు కారా అంటూ నిలదీశారు. ‘ఇప్పటికే రూ.12,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించాం.. ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం.. సెక్యురిటీలిచ్చాం.. ఇలా ప్రతిసారి పని చేయం.. అయినా డబ్బులు ఇవ్వాలంటే ఎలా? ఎన్నిసార్లు డబ్బులివ్వాలి మీకు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ.. మనం కష్టపడి పని చేయాలి.. పని చేయకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా?’ అని అన్నారు. పక్కనే కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ వస్తోందని, అది లాభాల్లో నడుస్తుంది చూడండని చెప్పారు. ‘ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ఉండి బెదిరిస్తే ఎలా? ఇలాగే ఈ మధ్య ఒక కెమికల్ కంపెనీలో చేస్తే వెంటనే పీడీ యాక్ట్ తీసుకొచ్చి వారిని దారిలోకి తెచ్చా’ అని విశాఖ కార్మికులను హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి విశాఖ స్టీల్పై సమీక్షిస్తానని, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాటిని ఎన్నో చూశానన్నారు. విశాఖ స్టీల్ కార్మికులు పద్ధ్దతి మార్చుకోకపోతే కంపెనీ వేరే రాష్ట్రాలకు పోతుందన్నారు. మిట్టల్ స్టీల్పై ప్రేమ ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రశ్న అడిగిన విలేకరిపై నువ్వు చదువుకున్నవాడివేనా అంటూ ఎగతాళి చేస్తూ విశాఖ స్టీల్ కార్మికులపై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్పై తనకున్న ఆవ్యాజ ప్రేమను పలుమార్లు వ్యక్తం చేశారు. లోకేశ్ మాట్లాడి ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చాడన్నారు. ఈ కంపెనీకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే.. ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించానని తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత వేగంగా అన్ని అనుమతులు మంజూరు చేయించామన్నారు. ఈ కంపెనీ త్వరలోనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబు ఇచ్చారు.చంద్రబాబు బుకాయిస్తున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు బుకాయిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, కుట్రపూరితం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.12,500 కోట్లలో కార్మికుల సంక్షేమానికి 10 రూపాయలు కూడా ఉపయోగించలేదు. ఆ డబ్బులు మొత్తం బ్యాంకులకు కట్టడానికే సరిపోయాయి. పరిశ్రమ నడుస్తున్నప్పుడు ఎవరూ ప్రశ్నించరు. ప్రభుత్వం చేయకపోతేనే అడుగుతారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు జీతాలు ఆగలేదు. ఇప్పుడు నడవడం లేదు కాబట్టి అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని ఒక పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. చంద్రబాబు బుకాయిస్తే ఎలా? ఎంపీలు అడిగితే ప్రైవేటీకరణ చేస్తామని రాత పూర్వకంగా చెబుతోంది. తాము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ నుంచి తప్పిస్తామని మీరు మా నిరసన టెంట్వ ద్దకు వచ్చి చెప్పలేదా? ఇప్పుడు ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు? ముడిసరుకు పూర్తి స్థాయిలో ఇస్తే ప్రభుత్వాలను డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. గనులు లేవు కాబట్టి ఉత్పత్తి తగ్గుతోంది. – డి.వి.రమణారెడ్డి, వైఎస్సార్టీయూసీ ప్రధాన కార్యదర్శికార్మికులపై నెపం నెట్టడం తగదు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి రాకపోవడానికి కార్మికులు కారణం కాదు. ప్రభుత్వ, యాజమాన్య విధానాల వల్ల మాత్రమే ఈ పరిస్థితి తలెత్తింది. పరిశ్రమలో 45 రోజులకు సరిపడా ముడి సరుకు నిల్వ ఉండాలి. ఈరోజు లైమ్ లేకపోవడం వల్ల ఉత్పత్తి ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరన్నది చంద్రబాబే చెప్పాలి. దీనికి నూరు శాతం యాజమాన్యానిదే బాధ్యత. ప్లాంట్లో మెషినరీ పాతదైపోయింది. మరమ్మతులకు సంబంధించి స్పేర్ పార్ట్స్ కూడా ఇవ్వడం లేదు. ఉత్పత్తి కోసం యాజమాన్యం, ప్రభుత్వం ప్లానింగ్ చేయాలి. అది మానేసి కార్మికులపై తోసేయడం సరికాదు. – జె.అయోధ్యరామ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శివైట్ ఎలిఫెంట్తో పోల్చడం తగదు విశాఖ స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ (తెల్ల ఏనుగు)తో పోల్చడం ఆయన స్థాయికి తగదు. ఈ పరిశ్రమ లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి చెల్లించి ఉపయోగపడింది. సొంత గనులు లేకపోయినా లాభాలు సాధించింది. పథకం ప్రకారం ఈ కంపెనీని నీరుగార్చుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఈ ప్రకటన చేయడం కార్మికులను కించపరచడమే. దేశంలో నష్టాలు వచ్చిన అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు రూ.వేల కోట్ల సహాయం చేశారు. భద్రావతి, సేలం, బిలాయ్ స్టీల్ ప్లాంట్లకు రూ.65 వేల కోట్లు ప్యాకేజీ ఇచ్చారు. సొంత మైన్స్ ఉన్నప్పటికీ అవి 30 ఏళ్ల నుంచి నష్టాల్లోనే ఉన్నాయి. మైన్స్ లేకుండా లాభాల్లో ఉన్న కంపెనీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కటే. వరుసగా అందరినీ ఇళ్లకు పంపిస్తూ ఇలా మాట్లాడటం భావ్యం కాదు. – డి.ఆదినారాయణ, ఉక్కు గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి ప్లాంట్ను చంపేయాలని చూస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ టన్నుల స్థాయి ఉన్నప్పుడు బ్రహ్మాండమైన ఉత్పత్తిని సాధించి రూ.12 వేల కోట్ల రిజర్వు ఫండ్ ఉండేది. ఆ తర్వాత విస్తరణకు తీసుకెళ్లాం. కేంద్రానికి రూ.50 వేల కోట్ల పన్నులు చెల్లించాం. ఇంత మొత్తంలో ఏ ప్రైవేట్ సంస్థ కట్టింది? రాష్ట్రానికి, కేంద్రానికి పన్నులు, జీఎస్టీలు నిరంతరం వెళ్లాయి. ఈ కంపెనీ ప్రగతిపై, ఉత్పత్తిపై కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికంటూ లేదు. ఉన్న ప్రణాళికల్లా ఈ కంపెనీని ఎలా చంపేయాలని చూడటమే. కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 10 వేలకు తగ్గించారు. కార్మికులు అహరి్నశలు కష్టపడి పని చేస్తున్నారు. ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వారెవరో చంద్రబాబు బయట పెట్టాలి. అసలు విశాఖ ప్లాంట్కు ఎందుకు మైన్స్ అడగడం లేదు? – మంత్రి రాజశేఖర్, ఐఎన్టీయూసీ చీఫ్ ప్యాట్రన్ చంద్రబాబు గాలి కబుర్లు మానుకోవాలి స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు తప్పుడు మాటలు మానుకోవాలి. కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చాననడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రూ.12 వేల కోట్లు ఎవరికిచ్చారు? అలాగైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేదు? స్టీల్ ప్లాంటుపై చంద్రబాబు ఇలాంటి గాలి కబుర్లు మానుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. – జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఐ జాతీయ నేత -
ఇవి సీరియస్ ఎంఓయూలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి : సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఈసారి చాలా సీరియస్ ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వచ్చే మూడేళ్లలో వీటిని అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రెండ్రోజుల పాటు విశాఖలో జరిగిన ఈ సదస్సులో 613 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామన్నారు. వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు రానున్నాయని శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరించారు. 18 నెలలో కాలంలో రూ.21 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాక.. ఇందులో ఇప్పటికే రూ.8.8 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులను మంజూరుచేసినట్లు ఆయన చెప్పారు. ఈ సదస్సులో నాలుగు వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారని, ఇందులో 640 మంది విదేశీ ప్రతినిధులు ఉన్నట్లు తెలిపారు. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగం నుంచి వచ్చాయన్నారు. ఈ రంగంలో రూ.5,33,351 కోట్ల పెట్టుబడులు వస్తే పరిశ్రమల రంగానికి రూ.2,80,384 కోట్లు, మౌలిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల బకాయిలన్నీ చెల్లించేశామన్నారు. వచ్చే ఏడాది ఇదే తేదీల్లో తిరిగి పెట్టుబడుల సదస్సును నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. మినీ వరల్డ్గా శ్రీసిటీ.. అంతకుముందు.. సదస్సు రెండోరోజైన శనివారం వివిధ కార్యక్రమాలతో పాటు ఆ తర్వాత జరిగిన సదస్సు ముగింపు సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీసిటీని ఒక మినీ వరల్డ్గా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం మరో 6,000 ఎకరాల భూమిని కేటాయించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం శ్రీసిటీలో 30కి పైగా వివిధ దేశాల కంపెనీలున్నాయని, వీటిని రెండేళ్లలో 50 దేశాలకు పెంచాలన్నారు. కియా దగ్గర్లోనే రేమాండ్స్ సంస్థ ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంటును ఏర్పాటుచేయబోతోందన్నారు. ఇక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3–4 ఏళ్లలోనే చేరుకుంటామని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది నవంబరులో విశాఖలోనే జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్కు వచ్చిన వారికి అరకు, గిరిజన అందాలను చూపిస్తామని ఆయనన్నారు. ఈ సమ్మిట్లో ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానన్నారు. ఇక రెండ్రోజుల పెట్టుబడుల సమావేశాలు విజయవంతమయ్యాయని.. దావోస్ తరహాలో సీఐఐ ఈ సదస్సును నిర్వహించిందన్నారు. మరోవైపు.. భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అలాగే, శ్రీసిటీలో ఏర్పాటైన ఐదు కంపెనీలను ప్రారంభించారు. దీంతోపాటు.. శ్రీసిటీలో కంపెనీల ఏర్పాటు నిమిత్తం వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఏఐ వర్సిటీ ఏర్పాటులో భాగస్వామ్యంకండి! అబుదాబి తరహాలో రాష్ట్రంలోని కృత్రిమ మేధ (ఏఐ) యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని.. ఇందులో భాగస్వామ్యం కావాలని ఎల్జీ కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ యున్జోకోను సీఎం చంద్రబాబు కోరారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు శనివారం ముఖ్యమంత్రి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాకినాడ, మూలపేటల్లో ఎల్జీ కెమ్ నాఫ్తా క్రాకర్ కాంప్లెక్స్, పాలిమర్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ప్రతిపాదించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇఫ్కో చైర్మన్ దిలీప్ ననూభాయ్ సంఘానీతో చర్చించారు. రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటల్ పోర్ట్ఫోలియో విస్తరణ అంశాలపై గ్లోబల్ హాస్పిటాలిటీ గ్రూప్ అట్మాస్పియర్ కోర్ దక్షిణాసియా ఎండీ సౌవగ్య మహాపాత్ర, గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితో సీఎం చర్చించారు. తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తిచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. గండికోటలో అడ్వంచర్ రిసార్ట్స్, అరకు–అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటు, బొబ్బిలి–విజయనగరం కోటలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సీఎం కోరారు. రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిరి్మంచేందుకు అటా్మస్పియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తంచేశారు.విశాఖ–కాకినాడ–భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై కోర్డెలియా క్రూయిజెస్ కలిసి రావాలని ఆ సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ జుర్గెన్ బైలామ్ను సీఎం కోరారు. క్రూయిజ్ టెరి్మనల్ సౌకర్యాలు, బీచ్ టూరిజం, వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కోర్డెలియా క్రూయిజెస్ ఆసక్తి కనబరిచింది.గతంలోవి డొల్ల ఒప్పందాలే!» ఇవి సీరియస్ ఒప్పందాలనడం ద్వారా పరోక్షంగా అంగీకరించిన చంద్రబాబు»ఇంత మంది మంత్రులు దేశ విదేశాలు తిరిగినా ఫలితం శూన్యం» ఒక్క కరణ్ అదానీ తప్ప కానరాని పారిశ్రామిక దిగ్గజాలు» ఒక గిగావాట్ డేటా సెంటర్ ఒప్పందం ఈడీతో మమ అనిపించిన రిలయన్స్» పాత ఒప్పందాలనే కొత్త ఒప్పందాలుగా చూపిస్తూ పెట్టుబడుల వెల్లువంటూ ప్రచారం» చప్పగా సాగిన బీ టు బీ, ప్లీనరీ సెషన్స్.. వెలవెలబోయిన సభా ప్రాంగణంసాక్షి, అమరావతి: సీఐఐ పార్ట్నర్ షిప్ సమ్మిట్ పేరిట 2016, 2017, 2018 సంవత్సరాల్లో కుదుర్చుకున్నది డొల్ల ఒప్పందాలేనని సీఎం చంద్రబాబు నాయుడు పరోక్షంగా అంగీకరించారు. ఈ సంవత్సరం కుదుర్చుకున్నవన్నీ సీరియస్ ఒప్పందాలంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఇన్నాళ్లూ పెట్టుబడులు వచ్చేశాయంటూ చేసుకున్నదంతా బూటక ప్రచారమేనని తేల్చేశారు. భారీ హంగామాతో ఈసారి పెట్టుబడుల సమావేశం ఏర్పాటు చేస్తే దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు ముఖం చాటేశారు. విశాఖ సదస్సుకు వచ్చిన వారిలో గౌతమ్ అదాని కుమారుడు కరణ్ అదానీ తప్ప దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ సభా వేదికపై కనింపించ లేదు. మన రాష్ట్రానికి చెందిన గ్రంధి మల్లికార్జునరావు, భారత్ బయోటెక్ సుచిత్రా ఎల్లా, అపోలో హాస్పిటల్స్ శోభన కామినేని చంద్రబాబు ఆస్థాన విద్వాంసుడు లులు గ్రూపు చైర్మన్ యూసఫ్ ఆలీ తప్ప ఇతర పారిశ్రామిక దిగ్గజాలు కానరాలేదు. 2023లో వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన సదస్సుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, బీవీఆర్ మోహన్రెడ్డి, భంగర్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరు కావడం ద్వారా సభా వేదిక కళకళలాడగా, ఈసారి వెలవెలబోయిందని గడిచిన నాలుగు సీఐఐ ఈవెంట్స్ కవర్ చేసిన పాత్రికేయులు వ్యాఖ్యానించారు. చివరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక గిగావాట్ డేటా సెంటర్ ఒప్పందం కుదుర్చుకున్నా, అది కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ చేతుల మీదుగా కానిచ్చేసింది.పాత ఒప్పందాలకే కలరింగ్పెట్టుబడుల కోసం గత ఆరు నెలలుగా మంత్రులంతా విదేశీ పర్యటనలు చేసినా, కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 2023లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి కుదుర్చుకుంటూ రూ.13.21 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 2018 పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదుర్చుకున్న రెన్యూపవర్, ఏబీసీ పవర్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, పాల్స్ ప్లస్ టాయ్స్, డైకిన్, ఈ ప్యాక్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, ఏటీసీ టైర్స్ తదితర పాత ఒప్పందాలతోనే ఇప్పుడూ మమ అనిపించారు. నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కోసం ఏర్పాటు చేసిన ప్లీనర్ సెషన్స్ కూడా చాలా పేలవంగా సాగాయి. బిజినెస్ టు బిజినెస్ (బీ టు బీ) ద్వైపాక్షిక చర్చల కోసం ఏర్పాటు చేసిన వేదిక అయితే వ్యాపారవేత్తలు లేక వెలవెలబోయింది. ఎంతో అట్టహాసంగా నిర్వహిద్దామనుకున్న సీఐఐ 30వ పార్ట్నర్ షిప్ సమ్మిట్ ఇలా పేలవంగా ముగియడం పట్ల ముఖ్యమంత్రిలో అసహనం స్పష్టంగా కనిపించింది. చివరి రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రబాబు విలేకరులపై, స్టీల్ ప్లాంట్ కార్మికులపై వేసిన రంకెలే ఇందుకు నిదర్శనం. -
ఇకపై ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు
సాక్షి, విశాఖపట్నం: ఉద్యోగులు కార్మికుల మెడపై ఎప్పటికప్పుడు కత్తి పెట్టి ప్రైవేటీకరణ దిశగా ప్లాంట్ నడుపుతున్న విశాఖ ఉక్కు యాజమాన్యం మరో వింత షరతు విధించింది. ఇప్పటికే పూర్తిస్థాయి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం తాజాగా మరో సర్క్యులర్ విడుదల చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఉత్పత్తి లక్ష్యాల శాతాలకు అనుగుణంగా ఇకపై జీతాల పంపిణీ ఉంటుందని, విభాగాల వారీగా ఇచ్చిన టార్గెట్లకి అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రోజు వారీ లక్ష్యాలు ఎంతమేర అందుకోనున్నారనేదానిపై గణించిన అనంతరం జీతం ఎంత ఇవ్వాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్లో ఉత్పత్తి లక్ష్యాల్ని చేరుకోకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్కు యాజమాన్యం స్పష్టం చేసింది. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ సాధించలేని లక్ష్యాలను ముందుంచి.. దానికనుగుణంగా జీతాలిస్తామని చెప్పడం గర్హనీయమంటూ ఉద్యోగ సంఘాల నాయకుడు అయోధ్యరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
హిందూపురంలో టీడీపీ దుర్మార్గానికి దిగింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: హిందూపురం వైఎస్సార్సీపీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఖండించారు. బాలకృష్ణ హిందూపురానికి ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నారని ఆరోపిస్తే దాడి చేస్తారా? అంటూ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని టీటీడీ గూండాలు రెచ్చి పోతున్నారు. ప్రశ్నించే వారిపై దాడి చేస్తే ఎవరూ భయపడరు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తించాలి. ఈ దాడులు చూస్తుంటే నాగరిక సమాజంలో ఉన్నామా? అనిపిస్తోంది’’ అని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సతీష్ మృతి వెనుక వాస్తవాలను బయట పెట్టాలిసతీష్ కుమార్ మృతిపై సీబిఐ, సుప్రీంకోర్టు జడ్జీతో విచారణ జరపాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. సతీష్ మృతి వెనుక ఏం జరిగిందో వాస్తవాలను బయట పెట్టాలన్నారు. ఈలోపే సతీష్ది హత్యే అని టీటీడీ నేతలు మాట్లాడుతున్నారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఇష్టానుసారం ఎలా మాట్లాడతారు?. పోస్టుమార్టం కూడా కాకముందే హత్య అని ఎలా చెబుతారు?. పోలీసుల విచారణ సజావుగా జరపాలి. సున్నితమైన కేసు కాబట్టి సీబిఐతోనో, సుప్రీంకోర్టు జడ్జితోనో విచారణ జరపాలి’’ అని శైలజానాథ్ పేర్కొన్నారు.పరకామణిలో చోరీని గుర్తించి.. ఫిర్యాదు చేసిన సతీష్నే అనేకసార్లు విచారణ పేరుతో పిలవటం ఏంటి?. రాష్ట్రంలో పోలీసుల మీద పోలీసులే విచారణ జరపటం దారుణం. చెవిరెడ్డి గన్మెన్ని కూడా విచారణ పేరుతో వేధించారు. ఇప్పటికీ పదిమంది పైనే పోలీసు ఆఫీసర్లకు పోస్టింగులు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు. తాము చెప్పిన పనులు చేయకపోతే వీఆర్కు పంపుతున్నారు. పోలీసులను కూడా అనుకూలురు, వ్యతిరేకులు అంటూ విభజించటం సరికాదు...ప్రజా వ్యతిరేకతను డైవర్షన్ చేసేందుకే కొత్తకొత్త కథలు అల్లుతున్నారు. సతీష్ కుమార్ ఎలా చనిపోయాడనే వాస్తవం ప్రజలకు తెలియాలి. సతీష్ భార్య ఫోన్ని ఎందుకు తీసుకున్నారు?. వారి కుటుంబ సభ్యులను తమ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నారు?. వీటన్నిటిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. -
పవన్ కల్యాణ్ అభ్యంతరాలను లెక్కచేయని చంద్రబాబు
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పవన్ అభ్యంతరాలను కూడా చంద్రబాబు లెక్క చేయడం లేదు. లూలూ మాల్తో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మల్లవెల్లి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్పై ఎంవోయూ జరిగింది. ఇటీవల కేబినెట్లో లులూపై పవన్ కల్యాణ్ అభ్యంతరం తెలిపారు. లులూ అతిగా షరతులు పెడుతుందంటూ పవన్ అభ్యంతరం చెప్పారు. కేబినెట్లో లూలూపై సీఎం సీరియస్ అయినట్టు డ్రామాకు తెరతీశారు. పవన్ అభ్యంతరాలు లెక్క చేయకుండా లులుతో ఎంవోయూ చేసుకుంది. వందల కోట్ల భూములు కారు చౌకగా విశాఖలో అప్పగించనుంది.మరో వైపు జనసేన పార్టీలో భూమి గోల సాగుతోంది. తనదాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు, సీఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం వెళ్లింది. అంతేకాకుండా కేబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించాల్సి వచ్చింది.రూ.350 కోట్ల విలువచేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం బోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 40/2, 30,31,39, 461/2,5,7, 477, 488, 490/1, 490/2, 52,54,56,60/2, 103, 112, 113, 114/3లోని 35 ఎకరాలకుపైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పీఆర్ఎస్ నాయుడు, పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తోంది. -
మొగలి పూలు.. రైతుకు సిరులు!
సాక్షి, అమరావతి: సుగంధ పరిమళాలు వెదజల్లే మొగలి పూలు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నాయి. పెద్దగా పెట్టుబడి అవసరం లేని ఈ పూల సాగుపై ఇప్పుడిప్పుడే రైతులు దృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో మొగలి పొదలున్న ఒడిశాలో అధ్యయనం చేసిన ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సువిశాలమైన సముద్ర తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్ ఈ మొగలి పూలసాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా గుర్తించింది. తీరంలోనే కాదు.. అంతర పంటగానూ సాగు చేసే దిశగా రైతులను చైతన్యపరచడానికి అడుగులు వేస్తోంది. మొగలి పూల నుంచి నూనె, అత్తరు, ఆకులు, రెమ్మల నుంచి నీరు, ఆకులు, రెమ్మలు, స్టెమ్లను వివిధ రకాల హ్యాండీక్రాఫ్టŠస్ను తయారు చేస్తున్నారు. గతేడాది మొగలి పూల నూనె లీటరు రూ.21 లక్షలకు పైగా పలికిందంటే దీని డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదీ సాగు విధానం.. ప్రపంచంలో మరే ఇతర వృక్ష జాతికి లేని విశిష్టత ఈ మొగలి పొదల సొంతం. మగ చెట్లు పూలు పూస్తే ఆడ చెట్లు కాయలు కాస్తాయి. ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు బతుకుతాయి. 25–30 ఏళ్ల వరకు పంటనిస్తాయి. ఒండ్రు మట్టి, ఇసుక, ఎర్రమట్టి నేలలు వీటి సాగుకు అనుకూలం. దుక్కిదున్ని 2 అడుగుల దూరంలో ఎకరాకు మట్టి స్వభావాన్ని బట్టి 150–280 మొక్కలు నాటుకోవచ్చు. లైన్ల మధ్య 8–10 అడుగులు దూరం ఉండాలి. వీటి సాగులో ఎరువులు, పురుగు మందుల అవసరం ఉండదు. ప్రారంభంలో కొద్దిగా నీళ్లుంటే చాలు. ఎకరాకు రూ.లక్ష వరకు మొదట్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వ్యయం చేస్తే చాలు. అయితే ఇప్పటి వరకు వీటికి ప్రత్యేకంగా నర్సరీలంటూ ఎక్కడా లేవు. ఇప్పటికే సాగులోని మొక్కల స్టమ్లను తీసుకొచ్చి చెరకుగడల మాదిరిగా నాటితే వాటంతటవే పెరుగుతాయి. వరి పొలాలు, కాలువ గట్ల వెంబడి, ఇళ్లకు, పశువుల కొట్టాలకు కంచెలా, రోడ్ల కిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్గానూ నాటుకోవచ్చు. కొబ్బరి, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల్లోనూ అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. క్యాజరీనా, యూకలిప్టస్, జీడి మామిడి, తాటిగచ్చక వంటి వాటికి దీటుగా తీరంలో సముద్ర కోతను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా, పొలాలకు రక్షణగా కంచెగా, మడ అడవుల్లా, తుపానులు, ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్ట తీవ్రతను తగ్గించేందుకు ఇవి దోహదపడతాయి. ఎకరాకు 11వేల పూల ఉత్పత్తి జూన్ నుంచి ఆగస్టులోపు మొగలి నాటుకునేందుకు అనుకూలం. ఈ పంటకు తేమ శాతం అధికంగా ఉండాలి. నాటిన మూడేళ్ల తర్వాత ఏటా 3 సీజన్లలో పంట (పూలు) చేతికొస్తుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు, డిసెంబర్ నుంచి జనవరి వరకు, మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఇలా మూడు సీజన్లలో పూలు పూస్తాయి. మూడో ఏట నుంచి చెట్టుకు 15–20 పూలు (ఎకరాకు 5,600)పూస్తాయి. అదే ఐదేళ్లు దాటితే 35–50 పూలు (ఎకరాకు 11,200) పూస్తాయి. ఒక్కో చెట్టు ఏడాదిలో 800–1000 వరకు పూలు పూస్తుంది. వర్షాకాలంలో పూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. తీరానికి 3 కి.మీ. వరకు సాగైన పంట నుంచి నెం.1 క్వాలిటీ పూల దిగుబడి వస్తుంది. ఉదయం 5–6 గంటల్లోపు పూచే పూలను ఫస్ట్ క్వాలిటీ పూలుగా, 6–10 గంటల మధ్య పూచే పూలను సెకండ్ క్వాలిటీగా, 10–11గంటల మధ్య థర్డ్ క్వాలిటీ పూలగా పరిగణిస్తారు. మొగ్గ దశలోనే వీటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ పూలకు ఒక్కొక్క దానికి రూ.35–45, రెండో రకానికి రూ.20–25, మూడో రకం పూలకు రూ.10–15 ధర లభిస్తుంది. పండుగ సీజన్లలో థర్డ్ క్వాలిటీ పూలు సైతం మార్కెట్లో రూ.40 వరకు ధర పలుకుతాయి. తీరానికి 3 కి.మీ.వరకు నాటిన మొక్కల ద్వారా వచ్చే ఫస్ట్ క్వాలిటీ పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. గరిష్టంగా ఎకరా పూల ద్వారా 2.75 కిలోల వరకు నూనె ఉత్పత్తి అవుతుంది. సగటున కిలో రూ.9.25 లక్షలు పలుకుతుండగా, మొగలి పూల ద్వారా తయారయ్యే అత్తరు లీటరు రూ.40–80వేలు, మొగలి జలం లీటర్ రూ.5–20వేల వరకు పలుకుతోంది. నూనెను ఫుడ్ బేవరేజస్లో విరివిగా వినియోగిస్తారు. అదే మొగలి జలాలను సెంటెడ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు. రైతుల నుంచి ఫ్యాక్టరీలు నేరుగా పూలను కొనుగోలు చేస్తాయి. ఒడిశాలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి మొగలి సాగుకు ప్రపంచంలోనే ఒడిశాలోని గంజాం జిల్లా బరంపురం పరిసర ప్రాంతాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపు 20 వేల ఎకరాల్లో మొగలి సాగవుతోంది. ఈ ప్రాంతంలో 400కు పైగా పరిశ్రమలున్నాయి. 12 వేల మందికిపైగా ఈ పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడి ఈ పూలు సాగు చేసే రైతులే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా నూనె, అత్తరు, నీరు వంటి ఉప ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఇదే తరహాలోఉత్తరప్రదేశ్లోని కనోజ్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. ఏపీలో ఉద్దానం, సోంపేట, ఇచ్చాపురం, కవిటితో పాటు ప్రకాశం, చీరాల, బాపట్ల, పశి్చమ గోదావరి జిల్లాల్లో ఈ పంట సహజ సిద్ధంగా సాగవుతోంది. ఒడిశా స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లాలో 400 ఎకరాలు వరకు రైతులు మొగలి సాగు చేస్తున్నారు.ఆదాయం వచ్చే పంటగా అభివృద్ధి చేస్తున్నాం మొగలి పొదల సాగు రైతులకు ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటగా అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకోసం లోతైన అధ్యయనం సాగుతోంది. మొగలి పొదలు పెంచే రైతులకు అవసరమైన శిక్షణ, సలహాలు, సూచనలు బోర్డు ద్వారా అందజేస్తాం. స్వల్ప వ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం ఒడిశా నుంచి నాణ్యమైన మొగలి అంట్లు అందుబాటులోకి తీసుకొస్తాం. పంట భూముల రక్షణకు ఏర్పాటు చేసుకునే మొగలి చెట్లు పెట్టుబడిలేని ఆదాయ వనరుగా ఉపయోగపడతాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో మొగలి హెర్బల్ గార్డెన్స్ పెంపకాన్ని బోర్డు ద్వారా ప్రోత్సహిస్తాం. – ఆవుల చంద్రశేఖర్, సీఈవో, ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు -
బాబు ప్రభుత్వ క్షుద్ర రాజకీయానికే బలి
సాక్షి, అమరావతి: టీటీడీ పరకామణి కేసులో కూటమి ప్రభుత్వ క్షుద్ర రాజకీయం మరింత వికృతరూపం దాలుస్తోంది. ఈ కేసులో అత్యంత కీలకమైన అప్పటి టీటీడీ ఏవీఎస్వో, ప్రస్తుత జీఆర్పీ సీఐ వై.సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతి కేంద్ర బిందువుగా కూటమి ప్రభుత్వం కొత్త పన్నాగం పన్నుతోంది. ఈ ఉదంతాన్ని రెడ్బుక్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సాధనంగా చేసుకునేందుకు తెగబడుతోంది. వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సతీశ్ కుమార్ను పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా వేధించిన విషయం కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలోనే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి. మరోవైపు ఆయన మృతి అనంతరం పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకుండా పోలీసు ఉన్నతాధికారులు సతీశ్ కుమార్ది హత్యేనని ఎల్లో మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. తద్వారా ఈ అంశాన్ని కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులకు అనుగుణంగా వక్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సతీశ్ కుమార్కు పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు.. ఆయన అనుమానాస్పద మృతిపై పోలీసుల లీకు రాజకీయాలు కూటమి ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్న తీరు ఇదిగో ఇలా ఉంది..కుటుంబ సభ్యులను కట్టడి చేసిన పోలీసులు⇒ వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని సతీశ్కుమార్ తేల్చిచెప్పిన తరువాత పరిణామాల్లోనే.. ఆయన శుక్రవారం అనుమానస్పదంగా మృతి చెందడం గమనార్హం.⇒ గుంతకల్లో గురువారం అర్ధరాత్రి 12.45 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీ బోగీలో రైలు ఎక్కిన సతీశ్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తాడిపత్రి మండలం కోమలి సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించారు. కాగా ఈ విషయం బయటకు పొక్కగానే పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు సందేహాలను మరింత బలపరుస్తోంది.⇒ ప్రధానంగా సతీశ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడకుండా పోలీసు అధికారులు కట్టడి చేశారు. ఆయన నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు, సమీప బంధువులతోసహా ఇతరులను వెళ్లనివ్వలేదు. సతీశ్ కుమార్ భార్య ఫోన్నూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రికీ ఆమె ఫోన్ను తిరిగి ఇవ్వనే లేదు. బాధిత కుటుంబం తమ ఆవేదనను ఎవరితోనూ పంచుకునేందుకు.. ఆయన మృతిపై తమ సందేహాలను వెల్లడించేందుకూ అవకాశం ఇవ్వకుండా పోలీసులు కట్టడి చేయడం పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.అధికారిక నిర్ధారణ లేకుండా కుట్రపూరిత ప్రచారంఇక సతీశ్ కుమార్ మృత దేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించిన తరువాత పోలీసుల తీరు మరింత సందేహాస్పదంగా మారింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ ప్రాథమిక నివేదికలో ఏమని తెలిపారో అధికారికంగా వెల్లడించలేదు. సతీశ్ కుమార్ మృతికి కారణమేమిటన్నది చెప్ప లేదు. కానీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచే ఎల్లో మీడియా ద్వారా తమ కుట్రను బయటపెట్టారు. సతీశ్ కుమార్ది హత్యేనని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్సైట్లు, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆ విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు.సతీశ్ కుమార్ది హత్యేనని టీడీపీ అధికారిక వెబ్సైట్ శుక్రవారం రాత్రి 7.30గంటలకే పోస్టు చేసింది. ఇక ఈనాడు వెబ్సైట్లోనూ సతీశ్ కుమార్ను హత్య చేశారని పేర్కొన్నారు. పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక పేర్కొందని కూడా చెప్పడం గమనార్హం. అంటే పోలీసులు అధికారికంగా నిర్ధారించకుండా.. ఇలా టీడీపీ వెబ్సైట్లు, ఎల్లో మీడియా ద్వారా కుట్రపూరితంగానే ఓ ప్రచారాన్ని వైరల్ చేశారన్నది స్పష్టమవుతోంది.టీడీపీ కార్యాలయం డైరెక్షన్లోనే..సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్లోనే పోలీసులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ లక్ష్యంగా నిరాధారణ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను బలపరిచేలానే పోలీసులు వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. శుక్రవారం సాయంత్రానికే అందుకు అనుగుణంగా పోలీసులు ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. ఆయన తల వెనుక భాగంలో గాయముందని.. పక్కటెముకలు విరిగాయని.. హత్యేనని వైద్యులు ప్రాథమికంగా తెలిపారని లీకులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ వెబ్సైట్, ఆ పార్టీ సోషల్ మీడియాలో అదే విషయాన్ని వైరల్ చేశాయి.కక్ష సాధింపు కోసమే పన్నాగం..సతీశ్ కుమార్ది హత్యేనని పోస్టు మార్టం ప్రాథమిక నివేదిక వెల్లడిస్తే.. ఆ విషయాన్ని పోలీసులు అధికారికంగానే వెల్లడించవచ్చు. అందుకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. కానీ పోలీసులు అలా చేయలేదు. కేవలం ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చారు. సతీశ్ కుమార్ది హత్యే అయితే... ఎవరిపై అక్రమ కేసు నమోదు చేయాలా అని ప్రభుత్వ తుది ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. లేదా.. హత్యకు కారకులైన టీడీపీ వర్గీయులను కేసు నుంచి తప్పించేందుకే కాలయాపన చేస్తూ ఉండవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.ఏది ఏమైనా సరే సతీశ్ కుమార్ మృతి వెనుక అసలు విషయాన్ని కప్పిపుచ్చి.. ప్రభుత్వ పెద్దల రాజకీయ కుట్రకు వాడుకోవాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఉందన్నది స్పష్టమవుతోంది. అందుకు ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్ను అమలు చేయడమే తమ కర్తవ్యంగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. కాగా పోలీసు అధికారి మృతిపై ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుండటంపై పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి.అబద్ధపు వాంగ్మూలం కోసం సతీశ్ కుమార్ను తీవ్రంగా వేధించడంపైనే పోలీసు వర్గాలను ఆవేదనకు గురి చేసింది. కాగా ప్రస్తుతం ఆయన అనుమానాస్పద మృతి వెనుక వాస్తవాలను వెల్లడించకుండా కక్ష సాధింపు కోసం వక్రీకరించేందుకు యత్నిస్తున్నారని పోలీసువర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దల వైపే..⇒ అబద్ధపు వాంగ్మూలం కోసం వేధింపులు⇒అందుకు సతీశ్ కుమార్ ససేమిరా⇒ ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతిటీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు పరకామణి కేసు దర్యాప్తును వక్రీకరించి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్కెచ్ వేశారు. వైఎస్సార్సీపీ కీలక నేతలను అక్రమ కేసులో ఇరికించి వేధించేందుకు పక్కా పన్నాగం పన్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ సీఐడీ అధికారులను రంగంలోకి దించారు. డీజీపీ కార్యాలయం పర్యవేక్షణలో ఈ అక్రమ కేసు దర్యాప్తు కుట్ర కార్యాచరణను వేగవంతం చేశారు. కానీ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా లభించలేదు. దీంతో సీఐడీ, పోలీసు అధికారులు టీటీడీ పూర్వ ఏవీఎస్వో సతీశ్ కుమార్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అక్రమ కేసులో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని ఆయన్ని వేధించారు.తాము చెప్పినట్టుగా సీఆర్పీసీ 161, 164 వాంగ్మూలాలు ఇవ్వాలని తీవ్రంగా బెదిరించారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితోపాటు మరి కొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. వారు చెబితేనే తాను ఈ కేసులో లోకాయుక్త ఎదుట హాజరై రాజీ ప్రక్రియను పూర్తి చేసినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధించారు. సతీశ్ కుమార్ ద్వారా అబద్ధపు వాంగ్మూలం నమోదు చేస్తే.. దాన్ని బట్టి అప్పటి తిరుపతి ఎస్పీగా ఉన్న పరమేశ్వర్రెడ్డి, మరికొందరు పోలీసు అధికారుల నుంచి అదే రీతిలో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించాలన్నది పోలీసు ఉన్నతాధికారుల ఉద్దేశం. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే ఈ కేసులో ఇరికించి... జైలు పాలు చేస్తామని కూడా సతీశ్ కుమార్ను బెదిరించినట్టు తెలుస్తోంది.పోలీసు ప్రధాన కార్యాలయ అధికారులతోపాటు, విజయవాడ పోలీసు ఉన్నతాధికారులతోనూ సతీష్కుమార్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సామాజికవర్గ కోణంలో విజయవాడలోని ఓ పోలీసు అధికారి ద్వారా సతీశ్కుమార్ను తమ దారికి తెచ్చుకునేందుకు యత్నించినట్టు తాజాగా వెలుగు చూసింది. సతీశ్ కుమార్ సామాజికవర్గానికి చెందిన అధికారితో మాట్లాడించి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. మనం మనం ఒకటి కాబట్టి చెబుతున్నా.. పోలీసు బాస్లు చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పించినట్టు సమాచారం. అంతేకాదు సతీష్ కుమార్ను విచారిస్తున్న సమయంలో లక్ష్మణరావు అనే ప్రైవేటు వ్యక్తి(రౌడీ)ని ప్రవేశపెట్టడం గమనార్హం.లక్ష్మణరావు చేత సతీశ్కుమార్ను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించినట్టు సమాచారం. సహచర పోలీసు అధికారుల సమక్షంలో ఓ పోలీసు అధికారిని ఓ ప్రైవేటు వ్యక్తి పరుషపదజాలంతో దూషించడం... బెదిరించడం.. అంతు చూస్తామని వేధించడం ఏమిటనే విభ్రాంతి పోలీసుశాఖలో వ్యక్తమవుతోంది. ఈ నెల 6న ఓసారి ఆయన్ని సీఐడీ అధికారులు విచారించారు. కాగా ఆయన్ని శనివారం విచారణకు రావాలని తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ పరిణామాలతో సతీశ్ కుమార్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని, రాజకీయ కుట్రలో పావుగా మారి అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన మనస్సాక్షి అంగీకరించ లేదని సమాచారం. తాను అబద్ధపు వాంగ్మూలం ఇవ్వలేనని ఆయన సీఐడీ అధికారులకు తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో వేళ్లన్నీ ప్రభుత్వ పెద్దలవైపే చూపిస్తున్నాయి. -
బాబు బండారం బట్టబయలు
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ప్రకటించారు. శుక్రవారం విశాఖ సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ వైజాగ్ టెక్ పార్కులో ఇద్దరం కలిసి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు స్పష్టం చేశారు. తద్వారా విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికగా సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు బట్టబయలు అయ్యింది. అదానీ గ్రూపు పేరును దాస్తూ గూగుల్ డేటా సెంటర్ను తామే తెచ్చామంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ మరోమారు చర్చకు వచ్చింది. విశాఖలో అతిపెద్ద హైపర్ డేటా సెంటర్ను గూగుల్తో కలిసి అదానీ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎదుటే కరణ్ అదానీ ప్రకటించడం కొద్ది రోజులుగా ప్రభుత్వ పెద్దలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టినట్లయింది. ఇది అన్నిచోట్లా ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ కాదని, ఇది ఇండియా డిజిటల్ చరిత్రను తిరగరాస్తుందని కరణ్ అదానీ తెలిపారు. ఈ డేటా సెంటర్ను పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని కరణ్ అదానీ చంద్రబాబు ఎదురుగానే కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కరణ్ అదానీ గూగుల్ కలిసి డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటించిన వెంటనే సీఎంతోపాటు వేదికపైన ఉన్న టీడీపీ మంత్రుల ముఖాలు ఒక్కసారిగా మాడిపోయాయి.సీఐఐ వేదికగా మళ్లీ అదే బొంకుడుఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖను అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ 2020 నవంబర్లో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకోవడంతోపాటు, డేటా సెంటర్కు డేటా తీసుకురావడం కోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్ సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేసే ప్రాజెక్టుకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దేశంలోని డేటా సెంటర్ ఏర్పాటు బాధ్యతలను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ అదానీకి అప్పగించింది. గూగుల్తో అనుబంధం ఉన్న అదానీ సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు 2023 మే 3న అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు దాని కొనసాగింపులో భాగంగానే అదానీతో కలిసి గూగుల్ 300 నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తోంది. ఇదే విషయాన్ని ఇప్పుడు కరణ్ అదానీ సీఐఐ వేదికగా చెప్పినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో సైతం ఆ విషయాన్ని దాచి పెట్టడం ద్వారా చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోమారు అంతర్జాతీయ సమాజానికి తెలిసింది. చంద్రబాబు సర్కారు తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. ఇదే విషయమై సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తల మధ్య ఇదేం విడ్డూరం అంటూ విస్తృతంగా చర్చ జరిగింది. విశాఖ సదస్సులో ప్రసంగించిన అనంతరం కరణ్ అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ పెట్టుబడుల కొనసాగింపు..అదానీ గ్రూపునకు ఆంధ్రప్రదేశ్తో దీర్ఘకాలంగా అనుబంధం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలో పోర్టులు, సిమెంట్, ఎనర్జీ డేటా సెంటర్స్ వంటి రంగాల్లో రూ.40,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని, దీన్ని కొనసాగిస్తూ వచ్చే పదేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు కరణ్ అదానీ ప్రకటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆంధ్రప్రదేశ్ ఆధునికంగా మారుతోందని, దేశంలో వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్లలో ఒకటని వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్టులో భాగం కావడం ఆనందంగా ఉంది: జీఎంఆర్భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు(జీఎంఆర్) పేర్కొన్నారు. ఇక్కడ భారీ ఎంఆర్వో యూనిట్తోపాటు ఇంటిగ్రేటెడ్ ఏరో స్పేస్ ఎకో సిస్టంను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ యువతకు అండగా ఉండేలా రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్లను విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి మాట్లాడుతూ నౌకా నిర్మాణం, పర్యాటకం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో మల్లవల్లి ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ నుంచి మామిడి, జామ రసాల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు. -
బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ రావాలి
ఎంవీపీ కాలనీ: రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నెరెడ్కో నిర్వహించిన ‘వైజాగ్ ప్రోపర్టీ ఫెస్ట్–2025’లో సంచలన వ్యాఖ్యలు చేశారు. జూదాన్ని ప్రోత్సహించకుండా పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీ తాగడానికి పర్యాటకులెవరైనా విశాఖ బీచ్కు వస్తారా? అంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్లో భార్యాభర్తలు రెండు పెగ్గులేసుకునే కల్చర్ ఉండాలని, భర్త బీచ్లో కూర్చుని రెండు పెగ్గులేసుకుంటే భార్య ఐస్క్రీం తింటూ ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. అవేం లేకుండా ప్రభుత్వం పర్యాటకులను విశాఖ రమ్మంటే ఎందుకొస్తారని ప్ర«శ్నించారు. క్యాసినో, పబ్కల్చర్ విశాఖలో అభివృద్ధి కావాలంటే లిబరల్గా ఉండాలన్నారు. ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెడితే పర్యాటకం ఎప్పటికీ అభివృద్ధి చెందదని స్పష్టం చేశారు. విశాఖలో ఇవేం లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణ పర్యాటకులు గోవా, శ్రీలంక వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారన్నారు. ఇటీవల గోవా గవర్నర్ను కలవడానికి వెళ్లినప్పుడు అక్కడి కల్చర్ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. రిస్ట్రిక్షన్స్ లేని గోవా తరహా పర్యాటక సంస్కృతిని విశాఖలో తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. ఈ దిశగా కృషి చేయాలని వేదికపై ఉన్న ఎంపీ శ్రీభరత్, మంత్రి అనగాని సత్యప్రసాద్కు సూచించారు. విశాఖలో కొంత కాలంగా రియల్ ఎస్టేట్ దోపిడీ పెరిగిపోయిందన్నారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లే అవుట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నాయన్నారు. వాటి సమాచారం ప్రభుత్వం దగ్గర లేకపోతే తాను ఇస్తానన్నారు. -
ఇదిగో ఆధారాలు..పవన్ పేషీ భూకబ్జా..!
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్న వ్యక్తిపై వంద కోట్ల విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లాకు చెందిన భీమర శెట్టి రమణబాబు అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేశారు. రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం, అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్చుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో తనకు చెందిన 11 ఎకరాల 30 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. సురేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీలో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ భూమిపై 2004 నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయని, హైకోర్టు, సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ భూమిని తమకు అప్పగించకపోవడం బాధాకరమని రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సత్య అనే వ్యక్తితో పాటు మరొకరు ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, వీరికి సురేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. తన భూమికి సంబంధించి పాస్బుక్లు ఇవ్వకుండా సురేష్ అడ్డుపడుతున్నాడని, చుట్టుపక్కల భూములకు పాస్బుక్లు వచ్చినా తన భూమికి మాత్రం ఇవ్వకపోవడం అన్యాయమని రమణబాబు అన్నారు. తన భూమి విలువ రూ.110 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని, తన పేషీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని రమణబాబు కోరారు. నా భూమిని నాకు అప్పగించకపోతే, పవన్ కళ్యాణ్ను కలసి, ఆయన పేషీలో జరుగుతున్న విషయాలను బహిరంగంగా వెల్లడిస్తాను’ అని హెచ్చరించారు. ఓవైపు అవినీతి, భూకబ్జాలపై పోరాడతానని చెబుతున్న పవన్ కళ్యాణ్, తన పేషీలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతుంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? అని రమణబాబు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. -
ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest congratulations to Dhiraj Bommadevara from Andhra Pradesh on clinching the GOLD MEDAL in the Men's Recurve at the Asian Archery Championship 2025! A true champion and a moment of immense pride. May he achieve many more victories!#IndianArchery@BommadevaraD pic.twitter.com/aCuTysqs5r— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2025 -
టీడీపీ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: టీడీపీ మాజీమంత్రి యనలమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను రోజూ సాక్షిపేపర్ చదువుతా.. సాక్షి టీవీ చూస్తా. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాం. మెడికల్ కాలేజీల నిరసన ర్యాలీతో.. ప్రతిపక్షంలో కసి పెరిగింది. ప్రజలు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు’ అని గుర్తు చేశారు. -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి, లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వివాహ వేడుకకు విచ్చేసి.. నూతన వధూవరులు ప్రణయచంద్రారెడ్డి, జానకి ప్రియను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. – గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం) కంటి‘పాప’ భావోద్వేగం ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాలులో గురువారం వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. -
ఎన్కౌంటర్ చేసి పాతరేస్తాం
సాక్షి, అమరావతి: ‘వేమన సతీశ్కు డబ్బులు ఇచ్చాననే విషయం చెబుతావా.. మాల లం.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. నిన్నూ, నీ మొగుడ్నీ, కుటుంబం మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం’ అని కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ తమను బెదిరించారని టీడీపీ దళిత నేత సుధా మాధవి వెల్లడించారు. పోలీసులు తమను కిడ్నాప్ చేసి, బంధించి, వేధించి.. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత వేమన సతీశ్కు తాము డబ్బులు ఇవ్వలేదని వీడియో రికార్డింగ్ చేయించారని కూడా తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డీఐజీ కోయా ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు టీడీపీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి, ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేత వేమన సతీశ్ తమ నుంచి రూ.7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయనకు నగదు ఇస్తున్న వీడియోలను కూడా విడుదల చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు సుధా మాధవి, ఆమె భర్తను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. సుధా మాధవి దంపతులను పోలీసులు అపహరించారని వారి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పోలీసులు వారిని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తమను డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున తదితరులు ఎలా కిడ్నాప్ చేసి వేధించిందీ వివరిస్తూ సుధా మాధవి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిర్యాదులోని అంశాలను వివరించి, పోలీసుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని వాపోయారు. సుధారాణి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. టీడీపీ కార్యాలయం ఎదుటే కిడ్నాప్ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డులో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నంబరు లేని వాహనంలో వచ్చిన పోలీసులు నా భర్తను, నన్నూ బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. అడ్డుకునేందుకు యత్నించిన మా కొడుకు, మనవడిని తీవ్రంగా కొట్టారు. నాకు, నా భర్తకు తుపాకి గురి పెట్టి అరిస్తే కాల్చేస్తామని బెదిరించారు. మా ఇద్దరు పిల్లల్ని కూడా చంపేస్తామన్నారు. రాజంపేట టౌన్ సీఐ నాగార్జున మమ్మల్ని నేరుగా మదనపల్లెకు తీసుకువెళ్లి ఓ గదిలో బంధించారు. ఎన్కౌంటర్లో లేపేస్తాం సీఐ నాగార్జున, ఓ మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు మమ్మల్ని తీవ్రంగా వేధించారు. మమ్మల్ని కులంపేరుతో బూతులు తిట్టారు. వేమన సతీశ్కు రూ.7 కోట్లు ఇవ్వలేదని చెప్పాలని, లేకపోతే ఇక్కడే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు రాస్తామని బెదిరించారు. అనంతరం సీఐ నాగార్జున తన దగ్గర ఉన్న ఓ ఫోన్ నుంచి డీఐజీ కోయా ప్రవీణ్కు ఫోన్ చేసి మాట్లాడమని నాకు ఇచ్చారు. అవతలి నుంచి డీఐజీ కోయా ప్రవీణ్ తనను పరిచయం చేసుకుని.. ‘వేమన సతీశ్ నాకు వరుసకు తమ్ముడు అవుతాడు. అతను రూ.7 కోట్లు తీసుకున్న విషయాన్ని మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తారా.. మీకు ఎంత ధైర్యం.. అలా ఫిర్యాదు చేసి బతకగలం అనుకుంటున్నారా.. మిమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తే దిక్కూ మొక్కూ ఉండదు.. అయినా మీ ముఖాలకు రూ.7 కోట్లు ఉన్నాయా.. మీరు, మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా.. మాల లం.. అని అసభ్యంగా తిడుతూ బెదిరించారు. నిన్నూ, నీ మొగుడిని, మొత్తం కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తాం అని హెచ్చరించారు. మాల, మాదిగలకు రోడ్డెక్కడం అలవాటే ఆ వెంటనే వేమన సతీశ్ మాతో ఫోన్లో మాట్లాడారు. చూశారా నా పవర్.. రాష్ట్రంలో మీరు కాదు కదా.. మిమ్మల్ని పుట్టించిన వాళ్లు కూడా నా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేరు. రూ.50 లక్షలు ఇస్తాను తీసుకోండి.. అంతేగానీ సీఎం.. పీఎం.. అంటూ తిరిగితే ఆ డబ్బులు కూడా దొరకవు. మీ మాల, మాదిగ కులాల వారికి ఇలా రోడ్డు ఎక్కడం అలవాటే.. అంటూ చెప్పుకోలేని పరుష పదాలతో తీవ్రంగా దూషించారు. అనంతరం పోలీసులు మమ్మల్ని తీవ్రంగా కొట్టి, బెదిరించి మాతో బలవంతంగా వీడియో రికార్డింగ్ చేయించారు. వేమన సతీశ్కు మేము రూ.7 కోట్లు ఇవ్వలేదని మాతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారు. పోలీసుల నుంచి మా ప్రాణాలకు ముప్పు ఉంది. మాకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. మమ్మల్ని కిడ్నాప్ చేసి వేధించిన డీఐజీ కోయా ప్రవీణ్, సీఐ నాగార్జున, మహిళా ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
పార్టీ ఆఫీస్లకు చవకగా ప్రభుత్వ భూములు
సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను చవకగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలని, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ భూముల కేటాయింపు లీజును 66 ఏళ్లకు పెంచుతూ.. పార్టీ మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజును పొడిగించాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. తాజాగా జారీ చేసిన జీవో ఆధారంగా అధికారంలో ఉన్న పార్టీలు నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, తమ పార్టీ కార్యాలయాల కోసం 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు లీజుకు కేటాయింపులు చేయించుకోనున్నాయి. ఇదిలా ఉండగా మచిలీపట్నం నార్త్ మండలంలో గతంలో రవాణా శాఖకు కేటాయించిన 1.60 ఎకరాల భూమి కేటాయింపులను రద్దు చేసి, ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు కేటాయిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించారు. ఈ భూమిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే తిరుపతి రూరల్ మండలం అవిలాలలో టీడీపీ కార్యాలయం కోసం ఖరీదైన రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున కేటాయించారు. ఈ భూమిని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి అప్పగించాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
విద్యుత్ కాంట్రాక్టుల్లో చిన్న సంస్థలకు ‘షాక్’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖలో టెండర్లన్నీ కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకే దక్కుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోందనేది ఇన్నాళ్లూ ఎవరికీ అంతుచిక్క లేదు. కానీ తాజాగా దాని వెనుక ఉన్న కొన్ని వ్యూహాలు వెలుగులోకి వచ్చాయి. తామనుకున్న కంపెనీకి కాంట్రాక్టును దక్కించడం కోసం చంద్రబాబు సర్కార్ అనేక జిమ్మిక్కులకు పాల్పడుతోంది. చట్టం ముందు దొరకకుండా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పక్కా ప్రణాళికతో అవినీతికి పాల్పడుతోంది. అందుకు నిదర్శనమే తాజాగా బయటపడ్డ ‘నిబంధనల’ కుట్రలు. అధికారం చేతికి రాగానే మొదలుపెట్టిన ఆ అక్రమాల భాగోతం ఇది.రింగ్ కాంట్రాక్టర్ల హవావిద్యుత్ సంస్థలపై పడి దోచుకుతినడానికి చంద్రబాబు సర్కారులోని నేతలు సరికొత్త దారులు వెదుకుతున్నారు. కాంట్రాక్టుల్లో వాటాల కోసం రసవత్తర డ్రామాలు ఆడుతున్నారు. వారికి తోడుగా విద్యుత్ సంస్థల్లో కొందరు కాంట్రాక్టర్లు రింగ్ (కూటమి) మాస్టర్లుగా ఏర్పడ్డారు. టెండర్ల విలువను పెంచేసి, ఎవరికి టెండర్ రావాలో వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేసి, అనుకున్న విధంగా టెండర్లు దక్కేలా చేసి ఆపైన వాటాలను దండుకుంటున్నారు. తమ మాట వినని వారి టెండర్లను తామే తప్పుబట్టినట్టు నటించి, తమ వాటా కోసం బేరాలు సాగిస్తున్నారు. ఈ రింగ్ కాంట్రాక్టర్లు తమ కూటమిలో లేని సంస్థలు టెండర్లలో పాల్గొంటే వారిని ఏదో విధంగా అనర్హులుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అందుకోసం పాలకుల వద్ద నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు. బాబు సర్కార్లో ఇప్పటి వరకూ అందరికీ తెలిసిన వ్యవహారం. కొత్త బ్రహ్మాస్త్రం.. ‘మార్కులు’టెండర్లను బడా సంస్థలకు కట్టబెట్టేందుకు, చిన్న, మధ్య తరహా కంపెనీలను కనీసం టెండర్ దాఖలు వరకూ కూడా రానివ్వకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రభుత్వం అర్హత పేరుతో తాజాగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. దానిపేరే ‘మార్కులు’. విద్యుత్ శాఖలో ఏ టెండర్ వేయాలన్నా ఆ కంపెనీకి విద్యుత్ సంస్థలు విధించిన నిబంధన ప్రకారం 150కి గానూ 113 మార్కులు రావాలనేది ఇన్నాళ్లూ ఉన్న నిబంధన. దీనివల్ల ఏ కంపెనీ అయినా తమకున్న వనరులు, పరిధులను బట్టి టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వాటిని 124కు పెంచేశారు. అంటే ఆ మేరకు నిబంధనలు అదనంగా జత చేశారు. దీనివల్ల చిన్న, మధ్య తరహా సంస్థలేవీ టెండర్లలో పాల్గొనలేవు. చెప్పేదొకటి.. చేసేది మరొకటినిజానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, విద్యుత్ వైర్లు, ఇతర విలువైన సామాగ్రి(మెటీరియల్) ఏది అవసరమైనా అందులో 50 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నుంచే తీసుకుంటామని ప్రకటించింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి కాంట్రాక్టు దక్కకుండా చేస్తోంది.చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని అడ్డగోలు టెండర్ల తీరు..బూడిద టెండర్లో గోల్మాల్నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తికి వాడే బొగ్గు నుంచి వచ్చే బూడిద టెండర్లలో కమిషన్ కోసం కూటమి ఎమ్మెల్యే పెద్ద కథే నడిపారు. ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తరఫున ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ రూ.270 కోట్ల అంచనా విలువతో ‘చెరువు బూడిద రవాణా’ ఈ–టెండర్ను పిలిచింది. ఇందులో ఎల్1, ఎల్2, ఎల్3గా వచ్చిన వారికి రూ.90 కోట్ల చొప్పున పనులు అప్పగిస్తుంది. టెండర్ దక్కించుకున్న సంస్థలు థర్మల్ ప్లాంట్కు చుట్టుప్రక్కల 300కి.మీ. పరిధిలో ఈ బూడిదను సరఫరా చేయాలి. అయితే కాంట్రాక్టర్ అర్హత ప్రమాణాలను అయిన వారి కోసం అనుకూలంగా మార్చేశారు. ఈ విషయం నెల్లూరు జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేకు తెలిసింది. కొన్ని ఇంజినీరింగ్ సంస్థలు ఆ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాయి. దీంతో వెంటనే ఆయన జెన్కోకు లేఖ రాశారు. టెండర్పై వచ్చిన ఫిర్యాదులను ఆ లేఖలో పేర్కొంటూ, అధికారులను వివరణ కోరారు. చివరికి టెండర్ వేసిన కాంట్రాక్టర్తో బేరం కుదుర్చుకుని ఫిర్యాదు చేసిన వారినే తిరిగి బెదిరించారు.సబ్ స్టేషన్ టెండర్లో రింగ్ఏపీ ట్రాన్స్విుషన్ కార్పొరేషన్లో ప్రకాశం జిల్లా పుల్లలచెరువు వద్ద 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.60.21 కోట్లకు టెండర్ పిలిచింది. కానీ ఇక్కడ ఏకంగా రూ.6.68 కోట్లు పెంచేశారు. నిజానికి రూ.60.21 కోట్ల టెండర్లోనే ఆ సంస్థల లాభాలు కూడా ఉంటాయి. అదనంగా ఎందుకు పెరిగిందని ఆరాతీస్తే.. బాబు ప్రభుత్వంలోని ఓ ప్రజాప్రతినిధితో మూడు సంస్థలు టెండర్ దక్కించుకోవడం కోసం ముందే బేరాలు కుదుర్చుకున్నాయని తెలిసింది. భవ్య కోసం... ‘టెండర్’ఏపీజెన్కో ఆధ్వర్యంలోని థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల్లో పనిచేసే ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఉన్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి కోసమంటూ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు టెండర్ అప్పగించారు. అయితే మొదట రెండు సార్లు టెండర్లు పిలిచినప్పుడు నిర్వహణ చేపట్టే సంస్థకు ఆసుపత్రి ఉండాలని, వైద్య రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. కానీ మూడవ సారి పిలిచిన టెండర్లలో అవేవీ లేవు. భవ్యకు ప్రతి నెలా రూ.1.03 కోట్లను ఏపీజెన్కో చెల్లించాలి. ఇతర సంస్థలు నెలకు రూ.67 లక్షలు మాత్రమే అడిగాయి. అంతేకాకుండా స్పెషలిస్ట్ డాక్టర్ల సేవల కోసం రూ.8 వేలు, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తే రూ.12 వేలు, ఉద్యోగుల ఆరోగ్య తనిఖీల కోసం ఒక్కొక్కరికీ రూ.3,800 చొప్పున అదనంగా ఇవ్వాలి. ఇతర సంస్థలు ఇంతకన్నా తక్కువ కోట్చేశాయి. అయినా కాదన్నారు. మరో విశేషం ఏమిటంటే ఆర్టీపీపీలో వైద్య సేవల కోసం యశోదా హాస్పిటల్ నెలకు రూ.11.50 లక్షలు ఇస్తే చేస్తామంటే వద్దని, భవ్యకు రూ.15.57 లక్షలకు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఒక్కో ప్రాజెక్టు వద్ద దాదాపు 3,500 మంది చొప్పున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మూడేళ్ల టెండర్ కాలంలో దాదాపు రూ.100 కోట్లను భవ్యకు కట్టబెడుతున్నారు.సీఆర్డీఏ టెండర్లలో భారీ పెంపుసీఆర్డీఏ పరిధిలో నిర్మించే సబ్ స్టేషన్లు, లైన్ల మార్పులపై నాలుగు టెండర్లను పిలిచారు. వీటిలో 132 కేవీ, 220కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణంతో పాటు పలు లైన్ల ఏర్పాటు పనులు ఉన్నాయి. వీటన్నిటి విలువ రూ.1,800 కోట్లు కాగా రూ.2,100 కోట్లకు టెండర్ల విలువ పెంచేశారు. బీఎస్ఆర్ ఇఫ్రా, యూనివర్శల్ కేబుల్కు అండర్ గ్రౌండ్ కేబుల్స్ టెండర్ రూ.990 కోట్లది రూ.1100 కోట్లకు ఇచ్చారు. 400కేవీ లైన్ మార్పు పనులు రూ.350 కోట్లది పీవీఆర్ కనస్ట్రక్షన్స్, కేఆర్కు రూ.390 కోట్లకు ఇచ్చారు. 220 కేవీ సబ్ స్టేషన్ జీవీపీఆర్కు రూ.215 కోట్లది రూ.237 కోట్లకు ఇచ్చారు. నేలపాడు 220 కేవీ సబ్ స్టేషన్ రూ.240 కోట్లది రూ.280 కోట్లకు ఇచ్చారు. కర్నూలు జిల్లా భావనాసి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, ఏలూరు జిల్లా కొప్పాక, విజయనగరం జిల్లా భోగాపురంలో 220 కేవీ సబ్స్టేషన్లు రూ.200 కోట్లు విలువ కాగా రూ.230 కోట్లకు టెండర్లు వేశారు.లింగయ్యపాలెం జీఐఎస్ టెండర్సీఆర్డీఏ పరిధిలోని లింగయ్యపాలెంలో 220/33 కేవీ గ్యాస్ ఇన్సూ్యలేటెడ్ సబ్ స్టేషన్(జీఐఎస్) నిర్మాణం చేపట్టాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది. దానికి రూ.267.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. దీనికి సంబంధించి టెండర్లు కూడా పిలిచి ఓ కార్పొరేట్ సంస్థకు టెండర్ను అప్పగించింది. కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న 400కేవీ సబ్ స్టేషన్ల పనులను రెండు సంస్థలు జాయింట్ వెంచర్గా టెండర్ వేస్తే వాళ్లకు అప్పగించారు. కానీ లింగయపాలెం సబ్ స్టేషన్కు మాత్రం కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని అనుసరించారు. చిత్రమేమిటంటే కాకినాడ ఎస్ఈజెడ్లో జేవీలుగా టెండర్ దక్కించుకున్న సంస్థలే ఇక్కడ విడివిడిగా టెండర్లు దాఖలు చేశాయి. అయితే, మంత్రి అండతో రింగ్ మాస్టర్లుగా మారిన కొందరు కాంట్రాక్టర్లు ఇతర సంస్థలను టెండర్లలో పాల్గొననివ్వలేదు. -
చంద్రబాబు సమర్పించు పెట్టుబడుల సినిమా.. ఉత్త ఒప్పందాలే
సాక్షి, అమరావతి: రెడీ.. యాక్షన్.. కెమెరా..! అంటూ విశాఖలో ప్రివ్యూ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తరహాలో.. క్రెడిట్ చోరీతో ప్రజలకు మరోమారు పెట్టుబడుల సినిమా చూపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! శుక్ర, శనివారాల్లో విశాఖ వేదికగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా చూపించనున్నారు. 2014– 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే తరహా సినిమాలను రాష్ట్ర ప్రజలకు చూపించారు. 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్లు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్స్ పేరిట విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ మూడు సమావేశాల్లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.19.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా 34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు.. ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చింది 45 మాత్రమే. అంటే 13 శాతమే కార్యరూపం దాల్చా యి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే వచ్చిన పలు కంపెనీలతో తాజాగా విశాఖ వేదికగా మళ్లీమళ్లీ ఒప్పందాలు చేసుకుంటూ అందుకోసం ఆర్నెల్లుగా సీఎం, పలువురు మంత్రులు విదేశీ పర్యటనలు చేసి రావడం గమనార్హం. ఎస్ఐబీపీలకూ దిక్కులేదు.. పార్టనర్షిప్ సమ్మిట్ ఒప్పందాలే కాదు.. ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సైతం 2014–19 మధ్య టీడీపీ హయాంలో దిక్కు లేకుండా పోయింది. ఎక్కడైనా ఎస్ఐపీబీ ఆమోదం లభించిందంటే ప్రాజెక్టులు పరుగులు పెట్టాల్సిందే. 2014–19 మధ్య చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 17 సార్లు ఎస్ఐపీబీ సమావేశాలు జరిగాయి. అందులో మొత్తం రూ.1,70,036 కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 2,04,183 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. అయితే నాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన వాటిలో 5.69 శాతం మాత్రమే అమల్లోకి వచ్చాయి. రూ.9,681 కోట్ల విలువైన ఒప్పందాలు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా ఉపాధి లభించింది 36,140 మందికి మాత్రమే. 2014 –19 కితకితలే కితకితలు..!చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైపర్ లూప్ దగ్గర నుంచి సుఖోయ్ యుద్ధవిమానాల వరకు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రపంచంలోనే అమల్లోకి రాని హైపర్లూప్ కాన్సెప్ట్తో అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకోవచ్చంటూ ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిపి రూ.14,000 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేశారు. సెమీ కండక్టర్స్ విభాగంలో ఎటువంటి అనుభవం లేని నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని ప్రచారం చేశారు. ఆ కంపెనీ ద్వారా 1,10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే హల్దియా రూ.62,714 కోట్లతో కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ నెలకొల్పుతోందంటూ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2023లో కుదుర్చుకున్న ఒప్పందాలలో 91 శాతం వాస్తవరూపం దాల్చినట్టుగా పరిశ్రమల శాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గుడియాన్ టెక్నాలజీస్ రూ.40,000 కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్, రూ.23,285 కోట్లతో సోలార్గైజ్ ఇండియా, రూ.22,500 కోట్లతో టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోందంటూ టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవికాకుండా హెచ్పీసీఎల్ గెయిల్ క్రాకర్ కాంప్లెక్స్ (రూ.40,000 కోట్లు), అనంత్ టెక్నాలజీస్ (రూ.4,500 కోట్లు), సిరీన్ డ్రగ్స్ (రూ.8,200 కోట్లు), రాయల విండ్ పవర్ (రూ.16,500 కోట్లు) తదితర సంస్థలు టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్న తర్వాత మొహం చాటేశాయి. 2018లో ఒప్పందం చేసుకున్న వాటిలో ఎస్బీ ఎనర్జీ (రూ.13,200 కోట్లు), మైత్ర మొబైల్ (రూ.7,000 కోట్లు), కోనసీమ ఫెర్టిలైజర్స్ (రూ.5,000 కోట్లు), బద్వే ఇంజనీరింగ్ (రూ.4,200 కోట్లు) లాంటి సంస్థలు అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. స్విట్జర్లాండ్కు చెందిన ఏరోస్పేస్ వెంచర్స్ రూ.9,600 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా భూమి కేటాయించినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఎన్టీపీసీ ఒప్పందం అప్పటిదే.. పాతవాటికి కొత్తవిగా కలరింగ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను తమ ఖాతాల్లో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా విస్తరణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2023 మార్చి4న నాటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జీఐఎస్ సదస్సులో ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరిన రూ.1.85 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ (అనకాపల్లి వద్ద)ను ఇప్పుడు చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే రూ.69,000 కోట్లతో ఇండోసోల్ ప్రాజెక్టు, తిరుపతిలో రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్, రూ.3,700 కోట్లతో రెన్యూ ఎనర్జీ, రూ.4,500 కోట్లతో సత్యసాయి జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు చేసుకోగా, ఇప్పుడు బాబు సర్కారు వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే వచ్చిన ఎన్టీపీసీ, రెన్యూ పవర్, సెంచురీయన్, ఏటీసీ టైర్స్, రిలయన్స్ ప్రాజెక్టులతో తాజాగా విశాఖ సదస్సులో తిరిగి కొత్త ఒప్పందాలకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.జగన్ హయాంలో 91 శాతానికి పైనే..వైఎస్సార్సీపీ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి 99 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ.6,60,068.72 కోట్ల విలువైన పెట్టుబడులతోపాటు 7,56,455 మందికి ఉపాధి లభించనుంది. ఆ ఒప్పందాలు జరిగిన రెండేళ్లలోపే 90కిపైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా.. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించాయి. మొత్తం పెట్టుబడుల్లో 91.06 శాతం అంటే రూ.6,01,071.72 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా తెలియచేసింది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10,000 కోట్లు) ఐవోసీ (రూ,4,300), ఇండోసోల్ (రూ.69,000 కోట్లు), జిందాల్ స్టీల్ ఆంధ్రా (రూ.7,500 కోట్లు), జేఎస్డబ్ల్యూ స్టీల్ (రూ.16,350), ఎన్టీపీసీ (రూ.1,85,000 కోట్లు), ఆ్రల్టాటెక్ సిమెంట్ (రూ.4,000 కోట్లు), ఉత్కర్ష (రూ.4,500 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.5,500 కోట్లు), అలయన్స్ టైర్స్ విస్తరణ (రూ.1,100 కోట్లు), బ్లూస్టార్ (రూ.550 కోట్లు), కలర్షైన్ ఇండియా (రూ.510 కోట్లు), దాల్మియా సిమెంట్స్ (రూ.650 కోట్లు), దివీస్ ల్యాబ్ (రూ.790 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ (రూ.1,113 కోట్లు), ఇగులా స్టెర్లెస్ (రూ.600 కోట్లు), గ్రీన్లామ్సౌత్ (రూ.825 కోట్లు), జేఎస్డబ్ల్యూ సిమెంట్ (రూ.550 కోట్లు), కింబెర్లీ క్లార్క్ ఇండియా (రూ.700 కోట్లు), లైఫస్ ఫార్మా (రూ.2,319 కోట్లు), లారస్ (రూ.1200 కోట్లు), ఎల్జీ పాలిమర్స్ (రూ.240 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.2,500 కోట్లు), టీసీఎల్ (రూ.500 కోట్లు) లాంటి పలు ప్రధాన కంపెనీలున్నాయి. -
క్రెడిట్ చోరీతో చిక్కిన చినబాబు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తరలి వచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషిని 2023లో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు సాక్షిగా రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే తాము ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నాడు లింక్డిన్లోనూ స్వయంగా వెల్లడించారు. వాస్తవం ఇలా ఉంటే.. రెన్యూ పవర్ని తామే రప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ పేరు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వ పెద్దలు.. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, వైఎస్ జగన్ కట్టించిన ఇళ్లలోకి మళ్లీ కొత్తగా గృహ ప్రవేశాలు చేయించి, తామే కట్టించినట్లు డ్రామాలాడారు. ఇప్పుడు విశాఖలో సీఐఐ సమ్మిట్ వేదికగా మరో క్రెడిట్ చోరీకి శ్రీకారం చుట్టారు. క్రెడిట్ చోరీలో తండ్రితో పోటీ పడుతున్న నారా లోకేశ్ రెన్యూ పవర్ విషయంలో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయారు. తరిమేసింది బాబు సర్కారే..! విచిత్రంగా అదే రెన్యూ పవర్ సంస్థతో తాజాగా విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే చంద్రబాబు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి రెన్యూ పవర్ను తరిమేసింది చంద్రబాబు ప్రభుత్వమే. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కర్నూలు జిల్లాకు తరలిస్తూ ఈ ఏడాది జూలై 28న బాబు సర్కార్ జీఓ నెం.56 జారీ చేసింది. ఈ నిజాలను వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు.. లోకేశ్ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ మీమ్స్తో దుమ్మెత్తిపోస్తున్నారు. రెన్యూ పవర్ను తెచ్చిందే వైఎస్ జగన్.. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ పవర్తో పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 2023 జూన్ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్థాపించేందుకు రెన్యూ పవర్కు అనుమతిస్తూ జీవో నెం.15ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 2024 ఫిబ్రవరి 5న అదే సంస్థను మరో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నెం.16ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఆ రెండు జిల్లాల్లో కేటాయించేందుకు కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నాడే అంగీకారం తెలిపింది. ఈ జీఓలపై నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ సంతకాలు చేశారు. దీన్నిబట్టి రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూ కేటాయింపులతో సహా 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయనేది సుస్పష్టం. -
క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో.. అప్పట్లోనే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లను పట్టుకుని ‘ఈ ఇళ్లన్నీ మేమే కట్టేశాం’ అంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని.. నాటకాల రాయుడు అని అంటారని చురకలు వేశారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో.. ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ట్యాగ్తో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘‘క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం.. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ‘‘ఇళ్లన్నీ మేమే కట్టేశాం’’ అంటున్నారు. కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలను బల్లగుద్ది మరీ చెబుతూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు.» మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. » ఇవికాక 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి, కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. » అయినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ను కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు గారూ! మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం.మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. -
ఇచ్చట పాత ఒప్పందాలు మళ్లీ కుదుర్చుకోబడును!
సాక్షి, అమరావతి: అన్నీ పాత ఒప్పందాలే..! అందులోనూ గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు..! పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే గతంలో కుదిరిన ఒప్పందాలనే మళ్లీ మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు సర్కారు సరికొత్త గారడీకి శ్రీకారం చుట్టింది. విశాఖలో శుక్ర, శనివారాల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండగా.. ఒక రోజు ముందే గురువారమే పాత ఒప్పందాలే మరోసారి చేసుకుని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా పోస్టు వైఎస్సార్ సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కారు ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న హడావుడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ఒక రోజు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడూ పాత ఒప్పందాలే.. గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో కోతలు⇒ 2023లో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో రూ.2.35 లక్షల కోట్ల ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్తో రూ.1,20,000 కోట్ల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్నకు చెందిన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ రూ.1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తాజాగా గురువారం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (నెడ్క్యాప్)తో ఒప్పందం కుదుర్చుకుంది.⇒ ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ.97,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని రూ.82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎంవోయూల మాయ సాక్షి, విశాఖపట్నం: టీడీపీ హయాంలో 3సార్లు విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు ఆ తరువాత పత్తా లేకుండాపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హీరో ఫ్యూచర్స్తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం(ఫైల్) ⇒ రూ.234 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా వజ్ర రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం. ⇒ రూ.300 కోట్లతో ఎకో రిసార్ట్ అండ్ వుడ్ కాటేజీ నిర్మాణానికి వాటర్ స్పోర్ట్స్ సింపిల్ సంస్థతో ఎంవోయూ ⇒ రూ.153 కోట్ల పెట్టుబడులు పెట్టేలా స్కైవాల్ట్ ్జ మెరీనా సంస్థతో ఒప్పందం ⇒ రూ.100 కోట్లతో ఎంఐసీఈ సెంటర్ ఏర్పాటుకు వైబ్ గ్రూప్స్తో ఎంవోయూ ⇒ రూ.2 వేల కోట్లతో గోల్డ్ఫిష్ అబాడ్ సంస్థతో గోల్ఫ్ కోర్స్ నిర్మాణ ఒప్పందం. ⇒ రూ.7 వేల కోట్లతో మైత్రా మొబిలిటీ సంస్థ ఎల్రక్టానిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందం. ⇒ రూ.550 కోట్లతో మాగ్నమ్ పైరెక్స్ సంస్థతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఒప్పందం.హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్తో తాజాగా మళ్లీ విశాఖపట్నంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు ⇒ వైఎస్సార్సీపీ హయాంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. -
ఇంజిన్ ఫెయిల్.. తృటిలో తప్పిన కృష్ణానది పెను పడవ ప్రమాదం
సాక్షి,కృష్ణా: కృష్ణానదిలో మరోసారి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి నుండి గుంటూరు జిల్లా గింజపల్లి వైపు వెళ్తున్న ఓ ప్రయాణికుల పడవ మార్గ మధ్యలో సాంకేతిక లోపం కారణంగా నదిలో ఆగిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ప్రయాణం మధ్యలో పడవ ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. దీంతో పడవ నది ప్రవాహానికి కొంత దూరం కొట్టుకుపోయింది. ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. అయితే, పడవలో ఉన్న సిబ్బంది వెంటనే లంగర్ వేసి పడవను నిలిపే ప్రయత్నం చేశారు.గింజపల్లి ఒడ్డున ఉన్న స్థానిక గ్రామస్తులు అప్రమత్తమై పడవను తాడులతో ఒడ్డుకు లాగారు. వారి సహకారంతో పడవను సురక్షితంగా తీరం చేరవేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. ప్రమాద సమయంలో పడవలో ఉన్న 30 మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొందరికి స్వల్ప అస్వస్థతలు తప్ప, ఎటువంటి గాయాలు సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
ఆ సెక్షన్లు చెల్లవన్న హైకోర్టు
విజయవాడ: కృష్ణ జిల్లా పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్పై పెట్టిన కేసులో పోలీసులకు చుక్కెదురైంది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కైలే అనిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ తరుఫు మనోహర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మాజీ ఎమ్మెల్యే కైలేపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు.అనంతరం కైలే అనిల్పై నమోదైన సెక్షన్లను హైకోర్టు పరిశీలించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల చెల్లవని స్పష్టం చేసింది. మనోహర్ రెడ్డి వాదనతో ఏకీభవించిన హైకోర్టు..2 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చెయ్యాలని పోలీసులుకి ఆదేశాలు జారీ చేసింది. -
పవన్ కళ్యాణ్పై YSRCP సీరియస్
సాక్షి, తాడేపల్లి: పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే పాచిపోయిన ఆరోపణలు చేయటం ఏంటని ప్రశ్నించింది. తమ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూకబ్జా ఆరోపణలు చేసిన వపన్ కళ్యాణ్పై మండిపడింది. పాత ఆరోపణలకు సినిమా రంగు పూసి కొత్తగా ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది.‘‘డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది. ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారు. పాచిపోయిన పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా?..సర్వే సెటిల్ మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్కళ్యాణ్ కాదనగలరా?. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులతో ఎన్నో కమిటీలు వేసి, విచారణలమీద విచారణలు చేశారు. కానీ ఆరోపణలను రుజువు చేయలేకపోయారు...ఇన్నిరోజుల్లో ఒక్క ఆధారాన్నీ చూపలేకపోయారు. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే వపన్కళ్యాణ్ అర్థంలేని విమర్శలు చేశారు. నిరూపించాలని మిథున్రెడ్డి సవాల్ విసిరితే ఇప్పటికీ దానిపై నోరు మెదపలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, తుపాను నష్టపరిహారం అందించలేక ఇంకా అనేక సమస్యలను పరిష్కరించలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ దుయ్యబట్టింది. 🚨 Dare to answer these questions, @PawanKalyan ?డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పవన్ కళ్యాణ్ మా పార్టీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ… https://t.co/vyPJQ0kSWp— YSR Congress Party (@YSRCParty) November 13, 2025 -
పవన్ కళ్యాణ్కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అమరావతి: పవన్ కళ్యాణ్కు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారులు ఎవరు? అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై స్పందించిన మిథున్.. ఆ ఆరోపణలను నిరూపించాలని పవన్కు రీట్వీట్ చేస్తూ సవాల్ విసిరారు.ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయనీ, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్ గుర్తు చేశారు. తమపై ద్వేషంతోనే పవన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Mr @PawanKalyan you are good at shooting and scooting. You have done that in the past (remember red sanders remarks made by you) and ran away after I demanded you to prove the allegations. What you have shot from your helicopter is our legitimate land, we bought it in 2000.— Mithunreddy (@MithunReddyYSRC) November 13, 2025 -
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారువై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. -
ఢిల్లీ ఎఫెక్ట్.. ఏపీలో నాలుగు జిల్లాలో NIA తనిఖీలు
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు నేపథ్యంలో ఏపీలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఏపీలోని పలు చోట్ల ఎన్ఐఏ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. విజయనగరంలోని టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విశాఖలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఐఏ అధికారుల సోదాలు జరుపుతున్నారు. అలాగే, గుంటూరులోని పొన్నూరులో, కర్నూలులోని పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానంగా ఉన్న వారి ఇళ్లలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్తో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు’’ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025..మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం..చంద్రబాబూ.. మేము 31.9 ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం!. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. -
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ కె.రహేజా రియల్ ఎస్టేట్ గ్రూపునకు విశాఖలో ఎకరం 99 పైసలకు 27.10 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మధురవాడలోని ఐటీ హిల్ నంబర్–3లో 27.10 ఎకరాలను ఏపీ ల్యాండ్ ఇన్సింటివ్స్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ ప్రకారం కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు రూ.91.2 కోట్లతో రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపింది.అనకాపల్లి వద్ద రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్రూవరేజస్ ప్లాంట్ కోసం ఎకరం రూ.40 లక్షల చొప్పున 30 ఎకరాలను కేటాయించింది. రూ.744 కోట్ల పెట్టుబడి పెట్టనున్న రిలయన్స్కు రూ.330.52 కోట్ల టైలర్ మేడ్ రాయితీలను ప్రకటించింది. అనంతపురంలో రూ.1,274 కోట్లతో ఏర్పాటు చేయనున్న సుగుణ స్పాంజ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రత్యేక రాయితీలు, రూ.700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్న ఎపిటోమ్ కాంపోనెంట్కు 19.06 ఎకరాలు, కుప్పంలో ఎన్పీఎస్పీఎల్కు 130 ఎకరాలు, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2 ఎకరాలు, ఫ్లూయెంట్ గ్రిడ్ రూ.150 కోట్ల పెట్టుబడులు, క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లు, మదర్సన్ టెక్నాలజీకి రూ.109.73 కోట్లతో మధురవాడలో ఐటీ క్యాంపస్, ఉప్పాడలో కాకినాడ వద్ద రూ.44,000 కోట్లతో 1 మిలియన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ప్రాజెక్టులకు పలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇస్తూ పలు ఉత్వరులు విడుదలయ్యాయి. -
నాడు ఉద్యోగాల విప్లవం నేడు అడుగడుగునా మోసం
సాక్షి, అమరావతి: అబద్ధాలు చెప్పడంలో డబుల్ పీహెచ్డీలు చేసిన సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ సీఎంను అని చెప్పుకుంటున్న ఆయన హయాంలో డీఎస్సీ తప్ప ఇతర పోస్టులు భర్తీ చేసింది అరకొరే. అదీ తప్పులు చేసి, యువతను మోసం చేసి అభ్యర్థుల కన్నీటికి కారణమయ్యారు. 1998, 2018లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా పోస్టులు భర్తీ చేయలేదు. ఆ అభ్యర్థులకు న్యాయం చేసింది మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నీ కలిపి మొత్తం 34,108 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ సీఎంగా 6,26,116 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక వివిధ పరిశ్రమలను స్థాపించి వీటిలో 24,68,146 మందికి ఉద్యోగ అవకాశాలు క ల్పించారు. రెండేళ్లపాటు కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఒక్క విద్యాశాఖలోనే 21,608 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారంటేవిద్యా రంగానికి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు. తొలి సంతకానికే దిక్కులేని పాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గత ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై చేశారు. అయితే 14 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇటీవల అరకొరగా పోస్టులు భర్తీ చేశారు. ఇంకా ఈ భర్తీలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన న్యాయ చిక్కులను పరిష్కరించడంతోపాటు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలలో 30,94,262 ఉద్యోగాలను భర్తీ చేసింది. బాబు జమానాలో చేసింది అరకొరగానే.. చంద్రబాబు పాలనతో ప్రతి నోటిఫికేషన్ను వివాదాస్పదంగా మార్చేశారు, ఇందుకు 1998, 2018 డీఎస్సీలే ఉదాహరణ. వాస్తవానికి చంద్రబాబు హయాంలో డీఎస్సీని ఓ పెద్ద నాటకంగా మార్చేశారు. 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్లో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు 300 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగిలిన పోస్టులను వైఎస్ జగన్ 2021లో న్యాయ వివాదాలు పరిష్కరించి భర్తీ చేశారు. అలాగే, గత ఐదేళ్ల జగన్ పాలనలో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,059 మంది, 2008 అభ్యర్థులు మరో 2,193 మందికి ఎంటీఎస్గా విధుల్లోకి తీసుకున్నారు. స్పెషల్ డీఎస్సీ–2019 ద్వారా 602 మందికి, 2023లో కేజీబీవీల్లో 1,250 మందికి కాంట్రాక్టు విధానంలోను, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీగా మరో 450 మంది.. ఇలా మొత్తం 15,508 పోస్టులు భర్తీ చేశారు. 2024 డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ పోస్టులను నిలిపివేసింది. ఇవికూడా భర్తీ అయితే మొత్తం 21,608 పోస్టులను భర్తీ చేసినట్టు అయ్యేది. విద్యా సంస్కరణలకు బ్రాండ్ వైఎస్ జగన్ గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడి కీర్తిని ఐక్యరాజ్య సమితిలో నిలబెట్టారు వైఎస్ జగన్. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల్లో 11 రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు టోఫెల్, ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టారు. ‘మనబడి: నాడు–నేడు’ ద్వారా రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేశారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. నాడు–నేడు రెండో దశలో రూ.8000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అంతేగాక దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరు శాతం ప్రభుత్వ బడులను డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతోపాటు సీబీఎస్ఈ సిలబస్ను సైతం ప్రభుత్వ బడిలో అమలు చేశారు. అలాగే, అంతర్జాతీయంగా పేరు పొందిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ను సైతం అమలు చేసేందుకు బాటలు వేశారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఈ విద్యా సంస్కరణలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం తన కుటిల∙బుద్ధితో ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. -
కుప్పలు తెప్పలు.. ఎడాపెడా అప్పులు
సాక్షి, అమరావతి : బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నర తిరగకుండానే భారీ స్థాయిలో అప్పులు చేసింది. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలు ఇస్తూ అప్పులు చేయడానికి కేబినెట్ సమావేశాల్లో ఆమోదించడం.. ఆ తర్వాత ఆయా శాఖలు జీవోలు జారీ చేయడం ఏడాదిన్నర కాలంగా జరుగుతూనే ఉంది. కొత్తగా అమరావతి రాజధాని, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), విద్యుత్ సంస్థల పేరుతో.. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.16,150 కోట్ల అప్పులు చేయడానికి బుధవారం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. దీంతో బడ్జెట్ బయట అప్పులు రికార్డు స్థాయిలో రూ.1,02,533 కోట్లకు చేరాయి. ఇందులో వివిధ కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట గ్యారెంటీ అప్పులు రూ.62,533 కోట్లు ఉండగా, అమరావతి రాజధాని పేరుతో అప్పులు మరో రూ.40,000 కోట్లకు చేరాయి. బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేయడాన్ని అప్పట్లో చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా తప్పుగా చిత్రీకరించాయి. అయితే బాబు సర్కారు బడ్జెట్ బయట కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.1,02,533 కోట్లు అప్పులు చేస్తూ ప్రభుత్వ గ్యారెంటీలతో జీవోలు జారీ చేసినా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించడం లేదు. వాస్తవంగా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం బడ్జెట్ బయట అప్పులు చేసింది. ఆ అప్పులను తప్పుగా ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేశారు.ఎడాపెడా ఉత్తర్వులువాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్లు అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా పౌర సరఫరాల సంస్థ అప్పుల గరిష్ట పరిమితిని రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.1,000 కోట్ల అప్పు తీసుకునేందుకు అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు, విద్యుత్ కొనుగోళ్ల కోసం ఈ అప్పు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో చెప్పింది. డిస్కమ్స్ (విద్యుత్ సంస్థలు) వివిధ బ్యాంకుల నుంచి రూ.1,150 కోట్ల అప్పులు చేసేందుకు అసలుకు, వడ్డీకి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రాజధానిలో పనుల కోసం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఎబీఎఫ్ఐడీ) నుంచి రూ.7,500 కోట్లు అప్పు చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అప్పుకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీని తీసుకుని రుణ ఒప్పందం చేసుకోవాల్సిoదిగా సీఆర్డీఏ కమిషనర్కు ఉత్తర్వుల్లో సూచించింది. అలాగే రాజధాని పనుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1,500 కోట్లు అప్పు తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఈ అప్పునకు ఆర్థిక శాఖ నుంచి గ్యారెంటీ తీసుకుని అప్పు ఒప్పందం చేసుకోవాల్సిoదిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి బాబు సర్కారు అప్పులు -
ఇది ప్రజా విజయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థులతో కలిసి వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, భావసారూప్య పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. » వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్త పరిచారు. ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ఆ సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితోపాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, మిత్రపక్షాలు.. వివిధ ప్రజా సంఘాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రజల నిబద్ధతను, సామాజిక న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజలు స్వలాభం కోసం కాకుండా, సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. » తమ బాధ్యత మరిచి, ప్రభుత్వ పెద్దల మాటలు మాత్రమే వింటున్న పోలీసులు నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎక్కడా ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ధైర్యంగా, శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. బలవంతంగా ప్రజల గొంతు నొక్కలేమని ప్రజా ఉద్యమ ర్యాలీ మరోసారి నిరూపించింది. » చంద్రబాబు గారూ.. ఇకనైనా ప్రజల మనోభావాలు గుర్తించి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చారిత్రక ఉద్యమాన్ని విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. -
కట్టించింది జగన్.. క్రెడిట్ కొట్టేస్తున్నది బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్బేగం, ఎం.హేమలతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో పక్కా ఇళ్లు మంజూరు చేయగా వారు పూర్తిచేశారు. గోడలపైనా ఇదే రాశారు. ఈ వివరాలు గృహనిర్మాణశాఖ లెక్కల్లోనే స్పష్టంగా ఉన్నాయి. కానీ, వీటిలో గృహ ప్రవేశాలంటూ బుధవారం సీఎం చంద్రబాబు ఆర్భాటం చేశారు. ముంతాజ్బేగంకు దేవగుడిపల్లెలో సొంత స్థలం ఉండగా పక్కా ఇంటికి 2022 మే 9న ఆమోదం వచ్చింది. ముంతాజ్బేగం పేరిట తహసీల్దార్ 2023 జూలై 6న పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్– 2023 జూన్ 4 వరకు మూడు బిల్లులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. రోజుకు రూ.200 లెక్కన 90 రోజుల ఉపాధి హామీ పథకం బిల్లు వచ్చింది. కేవలం రంగులు వేయించి బుధవారం గృహ ప్రవేశం చేయించారు. » హేమలతకూ సొంత స్థలం ఉండగా 2022 జూలై 9న పక్కా గృహం మంజూరైంది. 2024 మార్చికి పూర్తి చేశారు. ఈ బిల్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఉపాధి హామీ బిల్లు కూడా అందింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారురంగులు వేసింది. ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రం, ఇంటి మంజూరు పత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జారీ అయ్యాయని వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారని హేమలత చెప్పడం గమనార్హం.అద్దె బాధల నుంచి విముక్తినా పేరు ఫాతిమా. ఇదిగో ఇది నాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇంటి పట్టా. వ్యవసాయ కూలిగా జీవనం సాగించే నేను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పక్కా ఇంటి కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే స్థలం, ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షల సాయం చేశారు. నెలనెల అద్దె కట్టడానికి ఇబ్బంది పడేవాళ్లం. జగనన్న పుణ్యాన సొంతింటి కల నెరవేరింది.గత ప్రభుత్వంలోనే సొంతింటి సంబరంనలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్న నన్ను భర్త కొన్నేళ్ల క్రితమే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 30 ఏళ్లు కళ్యాణదుర్గంలోని బాడుగ ఇంట్లో ఉన్నాం. నెలకు రూ.4 వేల వరకు అద్దె కట్టేదాన్ని. గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పుణ్యమా అని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కురాకుల తోట జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మొత్తం బిల్లు రూ.1.80 లక్షలు మంజూరైంది. ఇప్పుడు సొంతిట్లోసంతోషంగా ఉంటున్నాం. –నబియా భాను, జగనన్న కాలనీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగత ప్రభుత్వంలోనే... అద్దె ఇంటి నుంచి సొంత గూటికిమేం చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. 2022లో గృహ ప్రవేశం చేసి ఇందులోనే నివసిస్తున్నాం. ఇంత సాయం అందించిన జగనన్న మా పాలిట దేవుడు. –షేక్ నాగూర్ బి, గుంటూరు జిల్లా దుగ్గిరాల జగనన్న కాలనీ సొంతింటి కల నెరవేర్చింది జగనన్నమాకు 2.50 సెంట్ల స్థలం ఉంది. కానీ, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు తగినన్ని డబ్బులు లేవు. చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే భరోసా కల్పించారు. రెండు విడతలుగా బిల్లులు నా బ్యాంక్ అకౌంట్లో వేశారు. నిర్మాణం పూర్తి చేసి 2023లోనే గృహప్రవేశం చేశాం.– నల్లమోతు రాణి, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లాజగనన్న హయాంలోనే మాకు ఇల్లునా భర్త, నేను వ్యవసాయ కూలీలం. మాకు ఇద్దరు పిల్లలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ స్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పట్టా, నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. సకాలంలో బిల్లులు రావడంతో కొంత నా డబ్బులు వేసుకుని ఇల్లు పూర్తి చేశా. ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. –సంగం త్రివేణి, గండేపల్లి గ్రామం, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా15 ఏళ్ల నిరీక్షణ... వైఎస్సార్సీపీ హయాంలో సాకారంసొంతిల్లు లేక చాలా ఇబ్బందిపడ్డాం. 15 ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. చిన్న గుడిసె, బడితెల గోడల ఇంట్లో మరికొన్నేళ్లు ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహప్రవేశం చేస్తాం. సొంతిల్లు అనే ఆలోచనే సంతోషంగా ఉంది. దీన్ని సాకారం చేసింది వైఎస్ జగన్. – రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాఅన్నీ అప్పుడే మంజూరు...జగనన్న ప్రభుత్వంలోనే మాకు పక్కాగృహం మంజూరైంది. స్థలానికి పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మొత్తం రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చేశారు.–సుజాత, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్’
నాడు‘‘సెంటు స్థలం ఇస్తారంట..! ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది...? ఒక్కదానికి సరిపోతుంది. చనిపోయిన తర్వాత పూడ్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది. అంతకుమించి ఇళ్లు కట్టడానికి పనికిరాదు. – వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబునేడుఅన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్.అల్తాబ్బేగమ్ వ్యవసాయ కూలీ. ఈమె పేరిట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవ రత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై రూ.32 వేల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి సమకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే, కేవలం తాళంచెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు. అల్తాబ్బేగమ్ మాత్రమే కాదు, బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడిపల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి మల్లక్కలకూ 2021–22లో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసింది. ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.సాక్షి, అమరావతి: ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైనా పంచిన దాఖలాల్లేవు.. పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన పాపాన పోలేదు... కానీ, తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు నిర్మించేసిందని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. అన్నింటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తున్న సీఎం చంద్రబాబు... ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ నిస్సిగ్గుగా డప్పు కొట్టుకుంటున్నారు. ఈ మేరకు ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఆర్భాటం చేశారు. ఇదంతా చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. చంద్రబాబు మూడు లక్షల ఇళ్ల కథ కమామిషు ఏమిటి? అని చూస్తే అసలు విషయం బయటపడుతోంది. పాలనలో విఫలమైన బాబు పేదలకు తాను చేయని మేలును చేసినట్టు మభ్యపెడుతున్న కుతంత్రం బయటపడుతోంది.గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లేరాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. వీటి మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్దఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇళ్లు 2.62 లక్షలు అదనం. ఎన్నికలు ముగిసేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు శ్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు శ్లాబ్ దశలో ఉన్నాయి. చాలావరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. ఇలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. బుధవారం చంద్రబాబు దేవగుడిపల్లెలో పంపిణీ చేసిన ఇళ్లు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించినవే. అక్కడి రాజీవ్ కాలనీలో ఇళ్లు లేని పేదలకు 40 ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చింది. 30 మంది లబ్ధిదారులు నిర్మాణం మొదలుపెట్టగా, ఎన్నికలు ముగిసేనాటికే కొన్ని పూర్తయ్యాయి. మిగిలినవి దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్న దశలో ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించిన ఇళ్ల తాళాలను సీఎం, మంత్రులు లబ్ధిదారుల చేతుల్లో పెట్టడం గమనార్హం.పూర్తి అండగా వైఎస్ జగన్2019–24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మందిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు కరెంట్, విద్యుత్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు రూ.355 కోట్ల దాక ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఇళ్ల పట్టాలకు భూ సేకరణ, లేఅవుట్ల అభివద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు రూ.35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సృష్టికి పాటుపడ్డారు.బాబు పాలనలో గజం స్థలమైనా మిథ్య!17 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవీ రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. వైఎస్ జగన్ హయాంలో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతిలో 50 వేలమంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. సాయం పెంపులోనూ మొండిచేయిపట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ, గజం కూడా ఇచ్చింది లేదు. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక 6 నెలల్లోనే కోవిడ్ వ్యాప్తి మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితులను అధిగమించి 2020 డిసెంబరు 25న వైఎస్ జగన్ 31 లక్షల మందిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి చరిత్ర సష్టించారు. కాగా, ఈ స్థలాలు శవాలు పూడ్చడానికి తప్ప దేనికీ పనికిరాదని పేదల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. నాడు శ్మశానాలతో పోల్చిన స్థలాల్లోని ఇళ్లనే నేడు తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.చంద్రబాబు కనీసం ఇళ్ల పట్టాల పంపిణీలో విఫలమయ్యారు. పేదలకు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేయడమే కాక సీఎం హోదాలోనూ దగా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనే పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదనపు సాయం వస్తుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. కొద్ది రోజులకే ఆ సాయం ఊసే లేకుండా చేసేశారు.1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే టిడ్కో ఇళ్లుమిగిలినవారికి లబ్ధిదారుల వాటా 50 శాతం తగ్గింపులక్షమంది లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగింత2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని, ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందన్న ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్నిచోట్ల పునాదులతో వదిలేయగా, చాలాచోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరు, రెండు–మూడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. కానీ, వైఎస్ జగన్ సీఎం కాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో, 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరలను పక్కనబెట్టి, 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, మరో 77 వేల ఇళ్లను 90 శాతంపైగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లను ఉచితంగా ఇవ్వగా రూ.10,339 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వీరి నుంచి గత టీడీపీ సర్కారు లబ్ధిదారుల వాటాగా వసూలు చేసిన రూ.500 కోట్లను తిరిగి చెల్లింపు ప్రారంభించి రూ.250 కోట్లను వెనక్కిచ్చింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాలని నిబంధన పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కారు దీన్ని 50 శాతం తగ్గించింది. ఈ రెండు యూనిట్లకు గాను 1,18,616 మంది పేదలపై రూ.482 కోట్ల భారం తగ్గింది. పైగా లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,77,546 ఇళ్లు పూర్తి చేసిందని అసెంబ్లీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ప్రకటించడం గమనార్హం. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది. నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు. -
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి మళ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు
సాక్షి, అమరావతి: ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కత్తిగట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని కక్షసాధిస్తోంది. కేసులు, నోటీసుల పరంపరను కొనసాగిస్తోంది. ఎలాగైనా సాక్షి గొంతు నొక్కాలని శతవిధాలా యత్నిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనంపై ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్కి శాసనసభ వ్యవహారాల కార్యదర్శి సభా ఉల్లంఘన నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షి ఎడిటర్ హైకోర్టును ఆశ్రయించిన విషయమూ తెలిసిందే. హైకోర్టు ఆదేశాల తర్వాతా కూటమి సర్కారు వేధింపులు ఆపలేదు. తాజాగా ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్కు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి ద్వారా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని అసెంబ్లీ కమిటీ హాలులో ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పత్రికలో రాసిన పలు కథనాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా నేరుగా కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు తరచూ పోలీసులను పంపి ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేలా ఎడిటర్ ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం, విచారణ పేరుతో సాక్షి కార్యాలయాలకు వచ్చి బెదిరింపులకు పాల్పడడంపై జర్నలిస్టు, ప్రజా సంఘాల నుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నా.. చంద్రబాబు సర్కారు క్షక్షసాధింపు పంథాను వీడడం లేదు. దీనిలోభాగంగానే తాజాగా మళ్లీ ప్రివిలైజ్ నోటీసులు జారీ చేయించింది. -
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావటం సంతోషకరం. ప్రజల సంక్షేమమే ముఖ్యం అని వీరంతా అనుకోవటం మంచి పరిణామం. పోలీసులు ఈ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు...ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. ఇవ్వాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
మీరు తెలుగులో ప్రశ్నలు వేస్తే కుదరదన్న లోకేష్..!
ఢిల్లీ: తెలుగు మీడియాకు ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఏపీ భవన్లో మంత్రి లోకేష్ ఏర్పాటు చేశారు. అయితే మంత్రి లోకేష్ ఏపీ భనవ్కు రావడంతో అధికారులు ఎక్కడాలేని హడావుడి చేశారు. ఇదంతా బాగానే ఉన్నా తెలుగు మీడియాకు అక్కడ అనుమతి లభించలేదు. తెలుగు మీడియా అక్కడకు రావడంపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశానికి మీరెందుకు వచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ‘‘మీరు తెలుగు క్వశ్చన్ వేస్తే కుదరదు’’ అంటూ మీడియా ప్రతినిధులను లోకేష్ అవమానించారు. దాంతో పలువురు మీడియా ప్రతినిధులు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. తెలుగు మీడియాకు అనుమతి లేదని ఐ & పి ఆర్ అధికారులు సైతం వెల్లడించారు. ఏపీ భవన్లో సమావేశం పెట్టి ఏపీ మీడియాను అధికారులు అనుమతించకపోవడం ఏంటనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలు. -
చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్!
సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది. -
ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు! దీంతో రాష్ట్రంలో ఉపాధి లభించక నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది.⇒ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడి అన్ని వయసుల వారికి సంబంధించి నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ 8.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. అదే జాతీయ సగటు నిరుద్యోగత 5.2 శాతంగా మాత్రమే ఉంది. జాతీయ సగటును మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. అత్యధికంగా 8.9 శాతం నిరుద్యోగంతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో ఉంది.⇒ గ్రామీణ, పట్టణప్రాంతాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో నిరుద్యోగత 7.2 శాతం ఉండగా మహిళల్లో 10.1 శాతంగా ఉంది. అదే జాతీయ సగటు చూస్తే 5.2 శాతంగా నమోదైంది.⇒ రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా 8.5 శాతం నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.⇒ ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.3 శాతం ఉండగా, మహిళల్లో 10.5 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.0 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగత 9.3 శాతం ఉందని నివేదిక పేర్కొంది.యువత నిరుద్యోగత 21 శాతంప్రత్యేకంగా యువతీ యువకుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో 29 ఏళ్ల లోపు వయసున్న యువతి యువకుల నిరుద్యోగత 21.0 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిని మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. జాతీయ స్థాయిలో యువతీ యువకుల్లో నిరుద్యోగత 14.8 శాతం మాత్రమే ఉంది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 21.9 శాతం నిరుద్యోగత ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.7 శాతం, మహిళల్లో 28.8 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది. -
చిన్నారికి టీకా
మహారాణిపేట: పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ఎదిగితేనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుంది. పూర్వం పురిట్లోనే ప్రాణాలు వదలడం, మాతాశిశు మరణాలు ఉండేవి. చిన్నారి ఎదిగే క్రమంలో అంతుచిక్కని రోగాల బారిన పడి మృత్యువాత పడేవారు. వైద్య విజ్ఞానం అప్పట్లో అంతగా అభివృద్ధి చెందకపోవడంతో కుటుంబాల్లో జననాల సంఖ్య పెంచుకునే వారు. ప్రస్తుతం వైద్య రంగంలో పెను మార్పులు వచ్చాయి. శాస్త్ర, పరిశోధనలు అనేక రోగాల నివారణకు అద్భుత ఔషధాలను తెచ్చాయి. పుట్టిన క్షణం మొదలు పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు ఆరోగ్య శాఖ వేస్తున్న టీకాలతో ఆరోగ్యవంతంగా ఎదిగి వారంతా రేపటి పౌరులుగా మారుతున్నారు.అపోహలు వీడదాం.. ఆరోగ్యాన్ని కాపాడుదాం వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ వివిధ వయసులో టీకాలు కచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ టీకాలపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. టీకాలు వేయించడం ద్వారా జ్వరాలు రావడం, బలహీనపడతారని అపోహలతో వాటికి దూరంగా ఉంటున్నారు. టీకాలపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 10న అంతర్జాతీయ టీకాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ‘అందరికీ రోగ నిరోధకత మానవులకు సాధ్యమే’అనే థీమ్తో ముందుకెళ్తున్నారు. ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం టీకాలు మన ఆరోగ్య వ్యవస్థకు బలమైన కవచం లాంటివి. స్మాల్ ఫాక్స్, పోలియో వంటి వ్యాధులను నిర్మూలించిన టీకాలు.. కోట్లాది ప్రాణాలను రక్షించాయి. టీకాలు అందరికీ చేరినప్పుడే సమగ్ర రోగనిరోధకత సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ కింద ఏటా లక్షలాది శిశువులకు, గర్భిణులకు ఉచిత టీకాలను అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా ఆరోగ్య కార్యక్రమంగా నిలుస్తోంది. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, నర్సులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఏ టీకా.. ఎప్పుడు వేయాలి ?ప్రసవం నుంచి 24 గంటలు: టీబీ నుంచి రక్షణకు బీసీజీ, పోలియో నివారణకు ఓపీవీ జిరో డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్–బి 45 రోజులకు: పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ 75 రోజులకు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యూమోనియా నివారణకు పెంటావాలెంట్–1, 2, 3 105 రోజులకు: తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి సమస్యల నివారణకు ఆర్వీవీ–1, 2, 3 9–12 నెలలకు: తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఎ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫ్ఐవీవీ–3, పీసీవీ–బీ 16–24 నెలలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీడీ–1 బూస్టర్, పోలియో నివారణకు ఓపీవీ బూస్టర్, తట్టు రుబెల్లా నివారణకు ఎంఆర్–2, మెదడువాపు వ్యాధికి జేఈ–2, అంధత్వ నివారణకు విటమిన్–ఎ2 5–6 సంవత్సరాలు: కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 10 సంవత్సరాలు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–1 బూస్టర్ 16 ఏళ్ల వయసు: ధనుర్వాతం, కంఠ సర్పి నివారణకు టీడీ–2 బూస్టర్ ప్రతి బుధవారం, శనివారాల్లో వ్యాక్సిన్ పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వరకు పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు 12 రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. ప్రతి బుధవారం, శనివారాల్లో ఆస్పత్రులు, పంచాయతీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాల వద్ద సిబ్బంది అందుబాటులో ఉంటూ టీకాలు వేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు అశ్రద్ధ చేయకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకుని వ్యాధుల నుంచి రక్షణ పొందాలని డాక్టర్ బి.లూసీ సూచించారు. -
‘గోదావరి’ టు హైదరాబాద్
గోదావరి ఇసుకను అక్రమార్కులు సరిహద్దులు దాటించేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రకృతి వనరును స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి నిత్యం వందల లారీల ఇసుక హైదరాబాద్ తరలిపోతోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ కీలక నేత కనుసన్నల్లో రూ.కోట్లలో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తెలిసినా అధికారులు మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. -సాక్షి, రాజమహేంద్రవరం ఒకే బిల్లుపై అనేకసార్లు కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో 15 స్టాక్ పాయింట్లున్నాయి. వీటి వద్ద కనీస పర్యవేక్షణ లేదు. సీసీ కెమెరాలు, వేబ్రిడ్జి లేవు. నిత్యం ఒక అధికారి ఉండాలి. మామూళ్లు తీసుకుని వారు కనపడకుండా పోతున్నారు. ఎక్కడ ఉంటున్నారో తెలియడం లేదు. పై అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడే కనిపిస్తున్నారు. దీనికితోడు సరిహద్దుల్లో నిఘా లేకపోవడంతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. » స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక టన్ను రూ.160కు విక్రయించాల్సి ఉండగా కూటమి నేతల కనుసన్నల్లో రూ.300–రూ.350 వసూలు చేస్తున్నారు. » కొవ్వూరు, చిడిపి, తాళ్లపూడి, కుమారదేవం, అరికిరేవుల తదితర స్టాక్ పాయింట్లలో ఇసుకను లారీల్లో నింపి రాష్ట్రం దాటిస్తున్నారు. గోపాలపురం, ఏలూరు జిల్లా చింతలపూడి పరిసర ప్రాంతాల మీదుగా పరిమితికి మించి రవాణా చేస్తుండడంతో ఇసుక రోడ్డుపైకి జారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొంగ వే బిల్లులు, ఇతర పత్రాలు సృష్టించి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక లారీకి బిల్లు తీసుకుని అనేక ట్రిప్పులు వేస్తున్నారు. ఒకవేళ పట్టుకుంటే లారీ మరమ్మతుకు వెళ్లింది, రెండ్రోజులు ఆగిందని బుకాయిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరితెగించింది. గామన్ బ్రిడ్జి సమీపంలో కుమారదేవం, ఆరికిరేవుల, పంగిడి, తాళ్లపూడి, చిడిపి, కొవ్వూరు తదితర చోట్ల నుంచి రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తోంది. లారీకి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.కోటిన్నర నెలకు రూ.45 కోట్లు కూటమి నేతలు దండుకుంటున్నారు. నియోజకవర్గంలోని ద్విసభ్య కమిటీ సభ్యులు, ఓ కీలక నేతకు చెందిన ఉద్యోగులు, ఓ ప్రజాప్రతినిధి అనుచరులు వ్యవహారమంతా దగ్గరుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల మామూళ్లు దండుకుంటున్న మైనింగ్ అధికారులు కళ్లెదుటే లారీలు తరలుతున్నా కన్నెత్తి చూడడం లేదు. ఇటీవల హైదరాబాద్ వెళ్తున్న లారీలను పట్టుకున్నట్లు హడావుడి చేసిన రెవెన్యూ అధికారులు రెండ్రోజుల తర్వాత మిన్నకున్నారు. కలెక్టర్ దృష్టిసారిస్తేనే... స్టాక్ పాయింట్ల నుంచి నిత్యం వందల లారీల ఇసుక తెలంగాణకు తరలుతోంది. మైనింగ్, రెవెన్యూ, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నామమాత్రంగా జరిమానాలు, కేసులు పెట్టి వదిలేస్తున్నారు. మామూళ్లు ముట్టజెప్పి మరుసటి రోజే ఇసుక మాఫియా రంగంలోకి దిగుతోంది. తిరిగి అవే లారీలతో అక్రమ రవాణా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లా కలెక్టరైనా దృష్టిసారిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
పేరుకే ఈసీలు.. దిక్కుతోచని వీసీలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. స్వతంత్ర సంస్థలుగా విద్యాసేవలను అందించాల్సిన విశ్వవిద్యాలయాలను అనధికారిక నిబంధనల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజ్యాంగం, చట్టాలు కల్పించిన హక్కులను కాలరాస్తూ కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశాలు నిర్వహించకుండా వర్సిటీల పాలన కుంటుపడేలా చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడిచినా వర్సిటీల్లో ఇంతవరకు వార్షిక బడ్జెట్కు ఈసీ అప్రూవల్స్ లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రపోజల్స్ సైతం సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత బడ్జెట్కే అప్రూవల్స్ లేకపోవడం వర్సిటీల ఆర్థిక వ్యవహరాల నిర్వహణపై తీవ్రప్రభావం చూపనుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఖర్చు చేసేసిన తర్వాత వాటిని రాటిఫై చేసుకోవడం అనేది ఇంతవరకు జరగలేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. వర్సిటీల చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధిపతిగా వైస్ చాన్సలర్ (వీసీ) వ్యవహరిస్తారు. ప్రభుత్వం నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, కళాశాల విద్యా శాఖ కమిషనర్/డైరెక్టర్లతో పాటు వర్సిటీలోని ఆచార్యులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛందసంస్థల వారు, విద్యావేత్తలు సభ్యులుగా నామినేట్ అవుతారు. మూడునెలలకు ఒకసారి ఈసీ సమావేశం నిర్వహించాలనేది ప్రాథమిక నిబంధన. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టాలను కాలగర్భంలో కలిపేసింది.17 నెలలుగా వర్సిటీల్లో పూర్తిస్థాయి ఈసీ సమావేశాలు నిర్వహించకుండానే కాలం గడిపేస్తోంది. దీంతో వర్సిటీల్లో పాలన, ఆర్థిక వ్యవహరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాలను రాటిఫై పేరుతో తర్వాత ఈసీ సమావేశాల్లో ఆమోదిస్తారు. కానీ కూటమి పాలనలో సాధారణ నిర్ణయాలను కూడా ఈసీ సమావేశాల్లేక రాటిఫై చేసుకోవడానికి వీలుకలగడంలేదు. వర్సిటీల్లో కీలకంగా వ్యవహరించే రిజిస్ట్రార్ల నియామకం విషయంలోను ఈసీ ఆమోదం తప్పనిసరి. ఉత్తరాంధ్రలోని ప్రముఖ వర్సిటీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రార్గా నియమితులైన వ్యక్తికి ఈసీ ఆమోదం పొందడానికి ఏడాది పట్టింది. ఇంతలో ఆ వ్యక్తి మారిపోయారు. వీసీ మరొకరిని రిజిస్ట్రార్గా నియమించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ సమావేశమే జరగలేదు. అసలు ఈసీ ఆమోదం లేని వ్యక్తి వర్సిటీలో కీలక ఆర్థిక వ్యవహరాలు నడిపిస్తూ వాటిని రాటిఫై చేసుకునే ఆలోచన మొత్తం వర్సిటీ పారదర్శకతనే ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ అరడజనుకుపైగా వర్సిటీల్లో ఒక్కసారి కూడా ఈసీ సమావేశం నిర్వహించలేదంటే విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తెలుస్తోంది. అంతా తానే అంటున్న అధికారి వైస్ చాన్సలర్ ముందుస్తు సమాచారంతో ఈసీ సమావేశం ఏర్పాటుచేసి కోరం ఉంటే అజెండా ప్రకారం నిర్ణయాలు ఆమోదింపజేసుకోవచ్చు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖలోని ఓ కీలక అధికారి వర్సిటీలపై పట్టుకోసం వీసీలు, రిజిస్ట్రార్ల అధికారాలకు కత్తెర వేస్తూ ఈసీ సమావేశాలు జరగనివ్వకుండా చూడటం వర్సిటీ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసీలో మెంబర్ మాత్రమే అయిన ఆ అధికారి.. గవర్నర్ ఆమోదంతో నియమితులైన వీసీలను, ఉన్నత విద్యామండలి చైర్మన్ అధికారాలను బైపాస్ చేస్తూ ఈసీల నిర్వహణకు అడ్డుకట్టు వేస్తుండటం గమనార్హం. తనకు వీలైనప్పుడు, తనకు నచ్చిన అజెండా ప్రకారమే ఈసీ సమావేశం నిర్వహించాలని నిర్దేశిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నప్పుడే ఈసీ సమావేశం నిర్వహణకు ఓకే చెబుతున్నారు. ఆ అధికారికి సమయం లేకపోతే ఎంతకాలమైనా వీసీలు అనుమతి కోసం వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరో విచిత్రం.. ఆ అధికారి మాత్రం ఈసీ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతారు. మిగిలిన సభ్యులు నేరుగా హాజరుకావాలని హుకుం జారీచేస్తుంటారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు సైతం వీసీలను తీవ్రంగా అవమానిస్తున్నట్లు విమర్శలున్నాయి. తన పరిధిలోకి రాని ఉన్నతవిద్య అంశంలో రాయలసీమ జిల్లాల్లోని ఓ కలెక్టర్ జోక్యం చేసుకోవడమేగాక, గౌరవంగా కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన వీసీని బయట కూర్చోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించటం విమర్శలకు దారి తీసింది. షాడోల రాజ్యం ఉన్నత విద్యాశాఖలో షాడోల పాలన నడుస్తోంది. విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ షాడో మంత్రిగా వ్యవహరిస్తుంటే.. ఉన్నత విద్యాశాఖలోని కీలక అధికారికి ఎన్నడూ పాఠాలు చెప్పని ఓ సీనియర్ లెక్చరర్ అనుమతి లేని ఓఎస్డీ పోస్టు సృష్టించుకుని షాడో పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరు షాడోల దెబ్బకి ఉన్నత విద్యావ్యవస్థ, వర్సిటీలు కుప్పకూలిపోతున్నాయి. మంత్రి షాడోగా ఉన్న వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తుంటే.. ఉన్నతాధికారి షాడో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా సమాచారం పేరుతో ఫోన్లు చేయడమేగాక అజెండాలు కూడా నిర్దేశిస్తున్నారని పలువురు వీసీలు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి మంత్రికి, కీలక ఉన్నతాధికారికి విద్యాసంబంధిత అంశాలను పట్టించుకునే తీరకలేదని, తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటంలేదని వర్సిటీల అధికారులు పేర్కొంటున్నారు. బాబు పాలనలో విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. -
వరి పండిస్తే క్యాన్సర్ తప్పదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ అమరావతి: వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని, వరి పండించటం వల్లే పంజాబ్ రైతులకు క్యాన్సర్ సోకిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు చంద్రబాబు హాజరయ్యారు. ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కర్నూలు, అచ్యుతాపురం, గుంటూరు జిల్లా శాఖమూరులో దసపల్లా స్టార్ హోటల్ సహా రాష్ట్రవ్యాప్తంగా 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువమంది రైతులు క్యాన్సర్తో బాధపడుతున్నారన్నారు. ప్రతిరోజు పంజాబ్ నుంచి రెండు బస్సుల్లో ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రులకు వెళుతున్నారని చెప్పారు. పురుగు మందులు, రసాయన ఎరువులు వాడటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. కాకి లెక్కలతో గొప్పలుసీఎం చంద్రబాబు ప్రసంగం కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టేలా సాగింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన లెక్కలు చెబుతూ తడబడ్డారు. నిధులు అని చెప్పబోయి సంస్థలు అని చెప్పారు. 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తున్నామని చెప్పి.. 87 ప్రాంతాల నుంచి ఆన్లైన్లో ఉన్నారన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు చేశామని చెప్పుకొచ్చారు. ఏపీఐఐసీలో ఇప్పటివరకు 25 ఇంజినీరింగ్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఆ వెంటనే 1,595 ఎంఎస్ఎంఈలకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. మళ్లీ ఈ వారంలో 99 కంపెనీలకు శంకుస్థాపన చేశామన్నారు. చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలకు ఒక దానితో ఒకటి పొంతన లేకపోవడంతో జనాలకు అర్థంకాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, ఉపాధి అని అంకెల గారడీ చేశారు. రానున్న 10 సంవత్సరాల్లో గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన దానికంటే రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం చేస్తానని గొప్పలు పోయారు.సెల్ఫోన్ గురించి మాట్లాడితే.. నన్ను 420 అన్నారు30 ఏళ్ల క్రితం హైదరాబాద్కు టెక్నాలజీని తానే తెచ్చానని, దీనివల్లే హైదరాబాద్కు దేశంలోనే అత్యధికంగా తలసరి ఆదాయం వస్తోందని సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పట్లో సెల్ఫోన్ గురించి మాట్లాడితే తనను కొందరు 420 అన్నారని.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలను తానే తెచ్చానని, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని కూడా తానే తీసుకొస్తున్నానని, భవిష్యత్ మొత్తం టెక్నాలజీదేనని గొప్పలు వల్లెవేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అర్థం కావట్లేదుతనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం రాత్రి మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సుపరిపాలన తెస్తానని చెప్పినట్టుగానే ఏ పని కావాలన్నా సెల్ ఫోన్లో అయిపోయేలా చేశా. ఏఐ పెడుతున్నాం. మీ ఇంటి పక్కనే ఉండే ఎమ్మార్వో ఆఫీసులో పని కూడా ఇంట్లో ఉంటే అయిపోయేలా టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నా. అన్ని విషయాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా మిమ్మల్నే అడుగుతున్నా. ఇంటికి వచ్చే గ్యాస్ ఇచ్చి బాయ్ ప్రవర్తన బాగుందా? లేదా? బాయ్ డబ్బులు అడుగుతున్నాడా అని కూడా అడుగుతున్నా. ఏ చిన్న పని అయినా ప్రజలను అడిగి మీరు శభాష్ అన్నాకే అది చేస్తున్నా. లేదంటే పక్కన పెడుతున్నా’ అని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేసింది నేనే..‘బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అనేలా నేనే ప్రమోట్ చేశా. ప్రపంచానికి పరిచయం చేశా. దూరదృష్టితోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీ పక్కన విమానాశ్రయం కట్టాను. అవుటర్ రింగ్ రోడ్డుతో అక్కడి లక్షాధికారులు కోటీశ్వరులు అయ్యారు. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్ అభివృద్ధికి కష్టపడ్డా. అవుటర్ రింగ్రోడ్డు, ఫార్మా, హైటెక్ ఐటీ ఇలా హైదరాబాద్లో అన్నీ నేనే చేశా. హైదరాబాద్లో ఐటీతో ప్రారంభించా. ఏపీలో గూగుల్తో ప్రారంభించా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 18 నెలల పాలనలో పెట్టుబడుల వరద వస్తోంది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. విశాఖ సీఐఐ సదస్సులో మరో రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, అబ్దుల్ హక్ అవార్డులతోపాటు ఉర్దూ భాషాభివృది్ధకి పాటుపడుతున్న సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. -
నకిలీ మద్యం కేసులో బెయిల్ పిటిషన్లపై కౌంటర్కు ఆదేశం
విజయవాడలీగల్/ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఏ–1 అద్దేపల్లి జనార్ధనరావు, ఏ–2 అద్దేపల్లి జగన్మోహనరావు, ఏ–4 నకిరికంటి రవి, ఏ–7 బాదల్ దాస్, ఏ–8 ప్రదీప్ దాస్, ఏ–11 శ్రీనివాసరెడ్డి, ఏ–12 అంగలూరు కళ్యాణ్, ఏ–13 తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ఏ–17 చెక్కా సతీష్కుమార్ల బెయిల్ పిటిషన్లపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని 6వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి లెనిన్బాబు ఆదేశిస్తూ ఈనెల 13కి వాయిదా వేశారు. కస్టడీకి అనుమతినకిలీ మద్యం కేసులో ఏ–17గా ఉన్న చెక్కా సతీష్కుమార్ను విచారించేందుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి ఐదు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇదే కేసులో అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావులను మరోసారి కస్టడీ కోరుతూ ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో జనార్దనరావు, విజయవాడ జైలులో జగన్మోహన్రావు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. దీనిపై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను న్యాయమూర్తి ఈనెల 17కి వాయిదా వేశారు. ఈ కేసులో ఏ–18 జోగి రమేష్, ఏ–19 జోగి రాములను కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై డిఫెన్స్ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు. అలాగే నకిలీ మద్యం కేసులో రిమాండ్లో ఉన్న జోగి రమేష్ జైలులో ములాఖత్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై ఇరు పక్షాల వాదనలు మంగళవారం ముగియడంతో న్యాయమూర్తి తీర్పును ఈనెల 13కి న్యాయమూర్తి వాయిదా వేశారు.ముగిసిన పోలీసు కస్టడీనకిలీ మద్యం కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న బాదల్దాస్, ప్రదీప్దాస్, శ్రీనివాసరెడ్డి, అంగలూరు కళ్యాణ్, నకిరికంటి రవి, రమేష్బాబు, అల్లాభక్షుల ఐదు రోజుల పోలీసు కస్టడీ మంగళవారం ముగియడంతో ఎక్సైజ్ పోలీసులు న్యాయస్ధానంలొ హాజరుపరిచారు. అనంతరం వారిని జైళ్లకు తరలించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పీటీ వారెంట్కు కోర్టు అనుమతిరాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయిన నలుగురు నిందితులపై పీటీ వారెంట్కు మంగళవారం కోర్టు అనుమతించింది. ములకలచెరువు కేసులో ఏ2 కట్టారాజు, ఏ3 సయ్యద్ హాజీ, ఏ10 మిథున్దాస్, ఏ11 అంతాదాస్ మదనపల్లి సబ్జైలులో రిమాండ్లో ఉన్నారు. విజయవాడ ఇబ్రహింపట్నంలో నమోదైన నకిలీ మద్యం కేసులోనూ వీరు నిందితులుగా ఉండడంతో విజయవాడ భవానీపురం పోలీసులు వీరిని తీసుకెళ్లేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. వాదనల అనంతరం తంబళ్లపల్లె జడ్జి వారికి రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికి 21 మంది అరెస్టుములకలచెరువు నకిలీ మద్యం కేసులో 25 మందిని నిందితులుగా చేర్చి 21 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక టీడీపీ నేతలు దాసరపల్లి జయచంద్రారెడ్డి, మంత్రి గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్, అన్బురసులను అరెస్టు చేయాల్సి ఉంది.నిడుగుంట అరుణ కస్టడీ పిటిషన్ వాయిదాప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలుచేసి మోసం చేసిన కేసులో నెల్లూరు జైలులో రిమాండ్లో ఉన్న నిడిగుంట అరుణను(నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ పొందిన జీవితఖైదు శ్రీకాంత్ సన్నిహితురాలు) పోలీసు కస్టడీ విచారణకు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను న్యాయమూర్తి 12వ తేదీకి వాయిదా వేశారు. -
జీవ వైవిధ్యానికి 'కార్చిచ్చు'
సాక్షి, అమరావతి: అడవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పర్యావరణంపై పంజా విసురుతున్నాయి. ఇప్పటివరకు చెట్ల నరికివేత, కాంక్రీట్ జంగిల్గా మార్చడమే పచ్చదనం తగ్గడానికి కారణంగా భావించాం. అయితే, ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అనే సంస్థ ఆశ్చర్యకర విషయాలు వెల్లడించింది. పలు దేశాలలోని అడవుల్లో రేగుతున్న కార్చిచ్చు పర్యావరణానికి పెను సవాల్గా మారిందని పేర్కొంది. గ్లోబల్ ట్రీ కవర్ నష్టం 2023లో పోల్చితే ఏకంగా 370 శాతం పెరిగిందని వివరించింది. అడవుల్లో చెలరేగిన మంటల కారణంగా 3.1 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడినట్లు తెలిపింది. ఇది మానవ ప్రేరేపిత ఉద్గారాల్లో సుమారు 8 శాతమని, జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని వెల్లడించింది. రెండేళ్ల కిందటి పరిస్థితి ప్రస్తుతం కూడా కొనసాగుతోందని, మేల్కొనకపోతే పర్యావరణంతో పాటు మానవ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఎ ప్లానెట్ ఆన్ ది బ్రింక్ అధ్యయనం ప్రకారం...» అమెరికాలోని కాలిఫోర్నియాలో జనవరిలో చెలరేగిన మంటల కారణంగా 57 వేల ఎకరాలకుపైగా దహనమయ్యాయి. 250 మిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మార్చిలో జపాన్లో చెలరేగిన కార్చిచ్చుతో 370 హెక్టార్లలో, దక్షిణ కొరియాలో 48 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దెబ్బతిన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా చెలరేగిన మంటలు కెనడాలో 1.58 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని బూడిద చేశాయి. ఇలాంటి సమయంలో భారీగా విడుదలయ్యే కర్బన ఉద్గారాలు భూతాపాన్ని పెంచుతాయి.» కార్చిచ్చు ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. పొగ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడడంతో పాటు మరణాలు అధికమవుతున్నాయి.» పలు దేశాల్లో అడవుల్లో ఏదో ఒకరకంగా విధ్వంసం జరుగుతోంది. అమెజాన్కు నెలవైన బ్రెజిల్లో మొక్కల పెంపకం, పక్కాగా పరిరక్షణ చర్యలు చేపట్టడంతో అడవుల్లో అలజడి తగ్గింది. కానీ, తీవ్రమైన కరువు కారణంగా ఈ ప్రాంతంలో కార్చిచ్చు గణనీయంగా పెరిగింది.73 శాతం తగ్గిపోయిన వన్యప్రాణులుఐదు దశాబ్దాల్లో వన్యప్రాణుల సంఖ్య 73 శాతం పడిపోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులు జీవ వైవిధ్యాన్ని అతలాకుతలం చేశాయి. అడవులు తగ్గిపోవడం భౌగోళిక ప్రాంతంతో పాటు వాటి పరిధిలోని జాతులను ప్రభావితం చేస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా 3,500 కంటే ఎక్కువ వన్యప్రాణుల జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అనేక జాతులు ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.వాతావరణ మార్పులతో ముప్పుఅతిపెద్ద అడవి అమెజాన్ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పులు మానవ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవులను కాపాడుకోవడంతో పాటు అగ్నికి ఆహుతైన ప్రాంతాల్లో భారీగా పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలి. ఆర్థిక రంగంపైనా దెబ్బఅడవుల క్షీణత వల్ల తలెత్తుతున్న పరిణామాలను అర్థం చేసుకుని ప్రభుత్వాలు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. వాతావరణ వ్యత్యాసాలు పెరిగి వ్యవసాయం, ఆహార భద్రత, వినోదం, పర్యాటక రంగాలపై ప్రభావం పడుతుంది. వ్యాధుల ముప్పు కూడా పొంచి ఉంది. వాతావరణ మార్పుల కారణంగా జంతువులకు వ్యాధులు సంక్రమించి, వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.పగడపు దీవులపై దాడిపర్యావరణ మార్పులు ఆఖరికి సముద్రపు జీవుల మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పగడపు దీవులు నాశనమవుతున్నాయి. సముద్రం వేడెక్కడం, మత్స్య సంపదను అతిగా వేటాడడంతో పాటు కాలుష్యం పగడపు దీవులకు శాపంగా పరిణమించింది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై.. కోటి గళాల గర్జన
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు గత నెల రోజులుగా ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి రోగులు, విద్యార్థులకు కలిగే నష్టాలు, ప్రైవేటీకరణ ముసుగులో చంద్రబాబు సర్కారు అవినీతిని ప్రజలకు లోతుగా వివరించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి రాగానే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడం.. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోవడం.. ఆరోగ్యశ్రీ, ఆసరా కింద ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడం.. చరిత్రలో తొలిసారి ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతోపాటు మన విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు కాలదన్నుకోవడంపై మండిపడుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీలపై చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడుతున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా రూపాంతరం చెందుతుండటం చంద్రబాబు సర్కార్కు వణుకు పుట్టిస్తోంది. నేడు వైఎస్సార్సీపీ నిర్వహించే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరభేరి మోగించనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ పెద్దలు యధావిధిగా అధికార దుర్వినియోగానికి తెరతీశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొనకూడదని.. కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల నోటీసులు.. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని.. నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లితండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి కదంతొక్కి, గళం విప్పుతామని వైఎస్సార్సీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. 14 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టని చంద్రబాబు.. రాష్ట్రంలో 1923 నుంచి 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. పద్మావతి అటానమస్ మెడికల్ కాలేజీతో కలిపితే 12 ఉన్నాయి. 2019 నాటికి చంద్రబాబు మూడుసార్లు అంటే 1995–99, 1999–2004, 2014–19 మధ్య 14 ఏళ్లు సీఎంగా పాలించారు. ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు. కనీసం కొత్తగా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి కనీసం 50 ఎకరాల స్థలం ఉండేలా భూమిని కేటాయించారు. ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లకుపైగా కేటాయించి అన్ని రకాల సదుపాయాలు ఉండేలా క్యాంపస్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. కోవిడ్ రెండేళ్లపాటు రాష్ట్రాన్ని పీడించినా, ఎన్ని ఇబ్బందులున్నా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి తరగతులు కూడా మొదలుపెట్టారు. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల కాలేజీలు కూడా సిద్ధమయ్యాయి. ఎన్నికల తర్వాత పాడేరులో అడ్మిషన్లు ముగిసి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కక్షసాధింపు చర్యలకు పరాకాష్ట.. గత ఏడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలను తన అనుయాయులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గతేడాది అనుమతులు ఇచ్చింది. కానీ.. ఆ సీట్లు మాకు వద్దంటూ ఎన్ఎంసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమీకరించింది. ఆ నిధులను సది్వనియోగం చేసుకుని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం చంద్రబాబు సర్కారు చర్యలు చేపట్టి ఉంటే.. 2024–25 విద్యా సంవత్సరంలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఈ విద్యా సంవత్సరం అంటే 2025–26లో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండ కూడా ప్రారంభం అయ్యేవి.బుధవారం ర్యాలీ నిర్వహించకూడదంటూ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్కు నోటీసు ఇస్తున్న పోలీసు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు 2,360 మాత్రమే ఉండేవి. కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అదనంగా మరో 2,550 సీట్లు పెరిగి.. మొత్తమ్మీద 4,910 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. ఎక్కడ వైఎస్ జగన్కు క్రెడిట్ వస్తుందోనని ఏకంగా ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు దెబ్బతీస్తున్నారని మేధావులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. 17 నెలల్లో రూ.2.36 లక్షల కోట్ల అప్పు.. మెడికల్ కాలేజీలకు మాత్రం డబ్బుల్లేవట.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 17 నెలల్లోనే రూ.2.36 లక్షల కోట్లు అప్పులు చేసింది. మిగిలిన కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే చాలు! ఆ రూ.5 వేల కోట్లను సైతం నాబార్డు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, వివిధ రూపాల్లో సమీకరించేందుకు అప్పట్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ నిధులతో మిగిలిన ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. అయితే కొత్త మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలకు బినామీలు, అస్మదీయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు పీపీపీ కుట్ర పన్నింది. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వైఎస్ జగన్రూ.లక్ష కోట్ల విలువైన సంపద లాంటి కొత్త మెడికల్ కాలేజీలను బినామీలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సమరభేరి మోగించారు. ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఊరూరా రచ్చబండ నిర్వహించి.. కోటి మంది ప్రజలతో సంతకాలు సేకరించాలని, వాటిని గవర్నర్కు అందజేద్దామని పిలుపునిచ్చారు. గత నెల 10న రచ్చబండ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రారంభించింది. ఊరూవాడా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రజలకు వివరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వాటిని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున వస్తున్నారు. కోటి సంతకాల సేకరణ మహోద్యమంగా మారింది. వైఎస్ జగన్ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు నిర్వహిస్తోంది. కుప్పంలో ర్యాలీకి అనుమతి లేదుసాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీకి చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. ఇందుకు అనుమతులు కోరుతూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరులో కేవలం 20 మందితో ర్యాలీ నిర్వహించుకోవాలని పోలీసులు హుకుం జారీ చేశారు. -
చదువు వలనే సమాజంలో గౌరవం..
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ ఎస్ఎస్సీ-2025లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నంద్యాల విద్యార్థిని ఇష్రత్ కలిశారు. దీనిలో భాగంగా ఎస్ఎస్సీలో 600 మార్కులకు 599 మార్కులు సాధించిన ఇష్రత్ను వైఎస్ జగన్ అభినందించారు. ఇష్రత్ను అభినందించడంతో పాటు లక్ష రూపాయిలు ప్రోత్సాహం కూడా అందించారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ ప్రతి విద్యార్థిని చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుంది. ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి. చదువు వలనే సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతీ విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ప్రజాస్పందనను బలంగా వినిపిద్దాం..
తాడేపల్లి :ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు(బుధవారం, నవంబర్ 12వ తేదీ) వైఎస్సార్సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ర్యాలీలకు పార్టీలకతీతంగా అంతా కలిసి రావాలని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రేపు చేపట్టే ర్యాలీల ద్వారా ప్రజాస్పందనను గట్టిగా వినిపిద్దామన్నారు సజ్జల. ఈ మేరకు మంగళవారం(నవంబర్11వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రేపు గట్టిగా పోరాటం చేద్దాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలదలో కేంద్రాల్లో ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దాం. జగన్ తెచ్చిన వైద్య విప్లవాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం జగన్ది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలి. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం,. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం. అందరి భాగస్వామ్యం వలనే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది. ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి. విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీల గురించి జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది’ అని పేర్కొన్నారు. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.‘‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. "భారత రత్న" మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం.మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/rKD6LTwvNb— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలు, ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ బుధవారం తలపెట్టిన నిరసన ర్యాలీలలో కదం తొక్కేందుకు పార్టీలకు అతీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేథావులు సామాజిక కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే నిరసన ర్యాలీల్లో పాల్గొనేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కదలి వస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా 2019లో వైఎస్ జగన్ అధికారం చేపట్టాక ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 మెడికల్ కళాశాలలను 2023–24లో గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లను మాజీ సీఎం వైఎస్ జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూర్చారు. ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా బలోపేతం చేశారు. అనంతరం గతేడాది చంద్రబాబు గద్దెనెక్కడంతో వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజీ ఎట్టకేలకు ప్రారంభమైనా వంద సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ, తమకు వద్దంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో రాష్ట్రం ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది. రూ. లక్ష కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. ఏకంగా 10 కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఉద్యమ కార్యచరణ రూపొందించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంగా నానాటికి ఉధృతం అవుతోంది. నిజానికి కేవలం రూ.ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తై అందుబాటులోకి వస్తాయి. కేవలం 17 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ రూ.2.50 లక్షల కోట్ల అప్పులు చేసింది. అందులో కేవలం రూ. ఐదు వేల కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రాకపోవడంపై ప్రజల్లో ఆగ్రహాగ్ని పెల్లుబుకుతోంది. తెలంగాణలో భవనాల్లేకపోయినా.. 2025–26 విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొడంగల్ వైద్య కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసింది. ఈ వైద్య కళాశాల, బోధనాస్పత్రికి శాశ్వత భవనాలను అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ నిర్మించకపోయినా కొడంగల్కు 15 కి.మీ దూరంలో ఉండే తాండూర్ ప్రభుత్వాస్పత్రిని బోధనాస్పత్రిగా, నర్సింగ్ కళాశాల భవనాలను తాత్కాలిక తరగతి గదులుగా చూపించి ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టారు. అలాగే గతేడాది తెలంగాణలోని మహేశ్వరం వైద్య కళాశాలకు ఎన్ఎంసీ 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసింది. కళాశాల, బోధనాస్పత్రి శాశ్వత నిర్మాణాలు అందుబాటులోకి వచ్చే వరకూ తాత్కాలిక భవనాల్లోనే అకడమిక్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జగన్ చొరవతో సకల వసతులతో భవనాలు నిర్మించినా.. వైఎస్ జగన్ ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంది. పులివెందుల వైద్య కళాశాల, బోధనాస్పత్రిని నిర్మించి ప్రారంభించారు. మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కళాశాలలు ప్రారంభించకుండా అడ్డుపడింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఒక్క కళాశాలకు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేయలేదు. మెరుగైన మార్కులు సాధించినా నిరాశే.. తెలంగాణలో తాత్కాలిక వసతులతోనే వైద్య కళాశాలలను ప్రారంభిస్తూ రెండేళ్లలో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తేగా.. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలతో రెండేళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం కోసం విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ఆడింది. 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రభుత్వ కోటా మూడో రౌండ్ కౌన్సెలింగ్ ముగిశాక తెలంగాణలో నీట్ యూజీ–2025లో 403 స్కోర్తో రెండు లక్షలకు పైబడి ఆలిండియా ర్యాంక్ సాధించిన విద్యార్థికి ప్రభుత్వ కోటా సీటు దక్కింది. ఇదే కేటగిరీలో ఏపీలో ఎస్వీయూ రీజియన్లో 471, ఏయూలో 487 స్కోర్ వద్దే ప్రభుత్వ కోటా సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఈ లెక్కన ఓపెన్ కేటగిరీలో తెలంగాణాతో పోలిస్తే 84 మార్కులు అధికంగా సాధించినప్పటికీ ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ కోటా సీటు దక్కలేదు. బీసీ కోటాలో 120కిపైగా ఎక్కువ మార్కులున్నా.. కొత్త కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని వంద రోజుల్లో రద్దు చేసి మెరిట్ విద్యార్థులకు సీట్లన్నీ కేటాయిస్తామనే వాగ్దానాలతో గద్దెనెక్కిన టీడీపీ కూటమి సర్కారు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. ఏకంగా 10 వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కళాశాలలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించకుండా బీసీ, ఎస్సీ లాంటి రిజర్వేషన్ వర్గాలకూ తీరని ద్రోహం తలపెట్టింది. కొత్తగా సీట్లు రాష్ట్రంలో పెరగకపోవడంతో తెలంగాణ విద్యార్థుల కంటే 120 మార్కులకు పైగా ఎక్కువ స్కోర్ చేసినా మన విద్యార్థులకు ఏపీలో ప్రభుత్వ కోటా సీట్లు దక్కలేదు. తెలంగాణాలో బీసీ–ఏ విభాగంలో 338 స్కోర్ చేసిన వారికి ప్రభుత్వ కోటాలో మెడికల్ సీట్ రాగా, ఏపీలో ఏయూలో 461, ఎస్వీయూలో 443 స్కోర్ల వరకే సీట్లు వచ్చాయి. అంటే 105–123 మార్కులు అదనంగా కటాఫ్ ఉంది. మిగిలిన రిజర్వేషన్ విభాగాల్లోనూ తెలంగాణాలో కంటే ఏపీలో కటాఫ్లు 50 నుంచి వంద మార్కుల మేర అధికంగానే ఉన్నాయి. దీంతో పిల్లలను యాజమాన్య కోటా కింద రూ. లక్షలు ఖర్చు చేసి చదివించలేని నిరుపేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్కు పంపినా వచ్చే ఏడాదైనా రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయనే నమ్మకం లేదని నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. 2,450 మంది వైద్య విద్యకు దూరం వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో ఐదు కాలేజీలను 2023–24లోనే ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చారు. గత ప్రభుత్వ కృషితో పులివెందులకు 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా చంద్రబాబు అడ్డుకుని రద్దు చేయించారు. గత విద్యా సంవత్సరం 700 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరకుండా అడ్డుకున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో మరో 7 కొత్త వైద్య కళాశాలలు కూడా ప్రారంభమై మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రావాల్సి ఉండగా వాటిని రాబట్టకపోగా ప్రైవేట్పరం చేస్తున్నారు. రెండేళ్లలో 2,450 మంది విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసిన ప్రభుత్వం వారి కలలను ఛిద్రం చేసింది. చేరువలో వైద్య విద్య.. కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మంది వైద్య విద్య చదువుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు సైతం చేరువలో వైద్య విద్య అభ్యసించే అవకాశం కలుగుతుంది. – కె.లహిత, వైద్య విద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం ఉచితంగా మెరుగైన వైద్యం ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎక్కువగా ఏర్పాటైతే ఆ ప్రాంత ప్రజలకు చేరువలో మెరుగైన వైద్య సేవలందుతాయి. న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయి. వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. – బి.రతుల్రామ్, వైద్యవిద్యార్థి, ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరం -
కార్పొరేట్లకు రూ.వేల కోట్లిస్తారు.. మాకివ్వరా రాయితీలు?
సాక్షి, అమరావతి: మాకు ఇవ్వాల్సిన రూ.1,200 కోట్ల పారిశ్రామిక బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవుగానీ.. విదేశీ కార్పొరేట్ సంస్థలకు రూ.వేలకోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఎలా ఇస్తారంటూ దళిత పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇస్తామన్న 100 శాతం పారిశ్రామిక ప్రోత్సాహకాలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయితీ పూర్తిగా విడుదల చేయాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచి్చన దళిత పారిశ్రామికవేత్తలు సోమవారం సచివాలయం వద్ద ధర్నా చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే వీరు నల్ల కండువాలు కప్పుకొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాజకీయరంగు పులిమి రాయితీలను నిలిపేయడాన్ని వారు నిలదీశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నాయకుడు ఈడ్పుగంటి అన్నార్బాబు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా బకాయిల్లో 20%, 30% శాతం చొప్పున అందులోను కొందరికి మాత్రమే విడుదల చేయడం దారుణమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ 100 శాతం రాయితీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానంలో కాకుండా కేవలం వారికి కావాల్సిన వారికి మాత్రమే నిధులు విడుదల చేశారని చెప్పారు.ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో జరగనున్న సదస్సును కూడా అడ్డుకుంటామని చెప్పారు. అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఏడాదిన్నరగా పారిశ్రామిక రాయితీల కోసం ఎదురుచూసి అప్పులపాలయ్యామని, ప్రభుత్వం మొండివైఖరి వీడకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు నిజమే.. ఈ ఆందోళన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు కొందరిని అధికారులు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ వద్దకు తీసుకెళ్లి చర్చలపేరుతో గతంలో మాదిరిగానే కాలయాపన చేశారు. రాయితీల విడుదలకు సంబంధించి ఏపీఐఐసీ రూపొందించిన జాబితాలో తప్పులు దొర్లాయని యువరాజ్ పేర్కొన్నట్లు జేఏసీ నాయకుడు పినమాల నాగకుమార్ చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే ఏపీఐఐసీ వద్ద ధర్నా చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ ఆందోళనలో జేఏసీ నాయకులు ఈరా రాజశేఖర్, జంగా త్రిమూర్తులు, చినమౌలాలి, కనపర్తి విజయరాజు, కొడాలి రాంబాబు, అన్ని జిల్లాల నుంచి అధికసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
మైనార్టీలపై బాబు సర్కార్ ఉదాసీనత
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చలేదు... సంక్షేమ పథకాల అమలులో తీవ్ర వైఫల్యం... శాఖాపరమైన పోస్టింగుల్లో ఇష్టారాజ్యం... ముస్లిం మైనార్టీల పట్ల పూర్తి ఉదాసీనత...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తీరు. మొత్తం పరిస్థితి ఇలా ఉండగా మంగళవారం విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం జాతీయ మైనార్టీ దినోత్సవం నిర్వహించనుండడంపై ముస్లింలు మండిపడుతున్నారు. 12 హామీలు ఇచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయని బాబు... వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లిం మైనారిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. వక్ఫ్ ఆస్తులను లీజు పేరుతో అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలకు తెరలేపారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఏడాదిగా బకాయిపెట్టారు.49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ ప్రకటించి ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. మరోవైపు బాధ్యతాయుత పోస్టుల్లో సైతం తగిన హోదా లేని వ్యక్తుల నియామకం, క్యాడర్ పోస్టుల్లో నాన్ కేడర్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి మైనార్టీ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పైరవీలు చేసుకుని వస్తున్న నాన్ కేడర్ ఉద్యోగులు క్యాడర్ పోస్టుల్లో ‘అధికార’ దర్పం చెలాయిస్తున్నారు. క్యాడర్ స్థాయి అధికారులైతే తాము చెప్పినట్టు వినరని భావించి ఏరికోరి అనర్హులను అందలం ఎక్కిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడే కాదు, 2014 ఎన్నికల సమయంలోనూ ముస్లింలకు చంద్రబాబు 25 హామీలిచ్చి ఎగ్గొట్టారు. నాలుగేళ్ల పాటు మంత్రివర్గంలో ముస్లింలకు చోటే కల్పించలేదు. గుంటూరు, కర్నూలులో ముస్లిం యువతపై దేశద్రోహం అక్రమ కేసులు పెట్టి వేధించారు. వైఎస్ జగన్ పాలన స్వర్ణయుగం 4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్తో ముస్లిం యువత ఉన్నత విద్యను ప్రోత్సహించారు దివంగత మహా నేత వైఎస్సార్. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలను ఆరి్థక, రాజకీయ, సామాజికంగా ముందుకు నడిపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కింద మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల (నాన్ డీబీటీ)ద్వారా మరో రూ.11,064.88 కోట్ల లబ్ధి చేకూర్చారు. మౌజమ్లు, ఇమామ్లకు గత చంద్రబాబు ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.3 వేలు, రూ.5 వేలు మాత్రమే ఇవ్వగా, వైఎస్ జగన్ హామీ మేరకు రూ.5 వేలు, రూ.10 వేలకు పెంచారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.300.68 కోట్లను గౌరవ వేతనంగా అందించింది. వారికి భరోసా ఇచ్చేలా వన్టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఇచి్చంది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా సుమారు రూ.100 కోట్లు అందించింది. 2019 ఎన్నికల్లో ముస్లింలకు 5 సీట్లు, 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. పాదయాత్రలో ఇచి్చన మాటను నిలబెట్టుకుంటూ అక్రమ కేసులను ఎత్తివేశారు. నియామకాల్లో బాబు సర్కారు ఇష్టారాజ్యం⇒ ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ, పంచాయతీరాజ్శాఖ నుంచి నాన్ క్యాడర్ అధికారి యాకుబ్ బాషాను నియమించారు. ⇒ అత్యంత కీలకమైన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్గా సీహెచ్ శ్రీధర్ ఒక్కరే ఉన్నారు. ఏపీ హజ్ కమిటీ ఈవోగా ఉన్న గౌస్ పీర్కు ఉర్దూ అకాడమీ డైరెక్టర్, నూర్బాషా ఫెడరేషన్ ఎండీ పోస్టులు కట్టబెట్టారు. అంటే, ఒకే వ్యక్తికి ఏకంగా రెండు, మూడు బాధ్యతలు అన్నమాట. ⇒వక్ఫ్ బోర్డు సీఈవో మహ్మద్ అలీ సర్విస్ రికార్డుల్లో ఇంటర్ విద్యార్హత మాత్రమే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పదోన్నతిపై సామాజిక మాధ్యమాల్లో న్యాయవాదులు పోస్టులు పెట్టారు. ఈయన బంధువులు 13 మందికి పైగా వక్ఫ్బోర్డులో కీలక స్థానాల్లో ఉన్నారు. అలీ హైదరాబాద్లో వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. తర్వాత ఆ భూమికి లీజు ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. ⇒ రాజ్యాంగబద్ధమైన మైనార్టీ కమిషన్ కార్యదర్శి పోస్టుకు ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన వ్యక్తిని నియమించాల్సి ఉంది. కానీ, తగిన అర్హత లేని నిజాముద్దీన్కు బాధ్యతలు అప్పగించారు. కమిషన్కు చైర్మన్ను లేకపోవడంతో వైస్ చైర్మన్ జాషువా డానియేల్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం కమిషన్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఉర్దూ అకాడమీకి చైర్మన్, పాలక వర్గాన్ని కూడా నియమించకపోవడం గమనార్హం.జగన్ చేసి చూపించారు.. వైఎస్ జగన్ మాట ఇస్తే చేసి చూపిస్తారని ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారు. సామాజికంగా, ఆరి్థకంగా, రాజకీయంగా ముస్లింలను ప్రోత్సహించారు. శాశ్వత జీవనోపాధి చూపించేలా అనేక పథకాలతో మైనార్టీ లకు జగన్ మేలు చేశారు. –మీర్జా షంషీర్ అలీబేగ్, మాజీ చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్లింలను ఎంతకాలం మోసం చేస్తారు బాబూ..? రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు చంద్ర బాబూ..? 2024లో హజ్ యాత్రీకులకు జగన్ నిధులు మంజూరు చేయగా, తర్వాత వచి్చన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. రూ.లక్ష చొప్పున ఇస్తామని ఆ తర్వాత విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారికే అని మోసం చేశారు. హజ్ కమిటీలో ఇస్లామిక్ ధారి్మక పండితుల స్థానంలో టీడీపీ కార్యకర్తలు పఠాన్ ఖాదర్ఖాన్, షేక్ హసన్బాషాలను నియమించారు. –షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ మైనార్టీ దినోత్సవం జరిపే నైతిక హక్కులేదు.. మైనార్టీలకు ఏ మాత్రం మేలు చేయని అసమర్థ చంద్రబాబు ప్రభుత్వానికి మైనార్టీ జాతీయ దినోత్సవాన్ని జరిపే నైతిక హక్కులేదు. బాబు అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారు. –షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షులు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి వైఎస్ జగన్ మేలును ముస్లిం సమాజం మరువదు వైఎస్ జగన్ చేసిన మేలును ముస్లిం సమాజం ఎప్పటికీ మరువదు. నూర్ బాషా, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లిస్తానని 2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోలేదు. నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం చేశారు. –షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఏపీ ముస్లిం దూదేకుల జేఏసీ -
కట్టు తప్పింది మీరే!
సాక్షి, అమరావతి: కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం బాగోలేదని.. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులదేనని సీఎం చంద్రబాబు ఆదేశించడంపై అంతర్గతంగా వారంతా రగిలిపోతున్నారు. నిజానికి కట్టుతప్పి వ్యవహరిస్తోంది టీడీపీ పెద్దలేననే విమర్శలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పాలన గాలికి వదిలేసి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ డ్రామాకు తెర తీశారనే వాదన సొంత ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తోంది. చంద్రబాబు పనితీరే అధ్వానంగా ఉందని ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మద్యం, ఇసుక దందాను కేంద్రీకృతం చేసి అక్రమాలకు తెరతీశారని పేర్కొంటున్నారు.కమీషన్లు తీసుకుంటూ టూరిజం హోటళ్లను ప్రైవేటుకు కట్టబెడుతున్నారని, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఉర్సా, లులు, ఇండిచిప్ లాంటి సంస్థలకు కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారని ఉదహరిస్తున్నారు. ప్రాంతానికి ఒక ఐజీని పెట్టి మరీ మైనింగ్ అక్రమ సొమ్మును వసూలు చేస్తున్నారని, 108, 104 వాహనాల నిర్వహణ టెండర్లను అర్హత లేని వారికి కట్టబెట్టి అక్రమాలకు తెర తీశారని మండిపడుతున్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు ఇవన్నీ చేస్తూ తమను నిందించడం ఏమిటనే చర్చ ఎమ్మెల్యేల్లో జోరుగా సాగుతోంది. ఇన్చార్జి మంత్రులదే బాధ్యత.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం ప్రత్యేకంగా చర్చించారు. 48 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని అన్నట్లు తెలిసింది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ వారు పాల్గొనడంలేదన్నారు. అలాంటి వారిని పిలిచి స్వయంగా తాను మాట్లాడినా మార్పు రాలేదని చెప్పినట్లు తెలిసింది. ఇన్చార్జి మంత్రులు తమ పరిధిలోని ఎమ్మెల్యేల బాధ్యతను తీసుకోవాలని, వారిని నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు. ఒక్కో ఇన్చార్జి మంత్రికి ఐదుగురు ఎమ్మెల్యేల బాధ్యతను అప్పగిస్తే ఎలా ఉంటుందని చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుంటూ కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీని, నేతలను పరిగణనలోకి తీసుకోవడంలేదని పేర్కొన్నట్లు తెలిసింది. -
బాబు సర్కారు భూ పందేరం.. ఏడాదికి రూ.వెయ్యే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములను కారుచౌకగా లీజుకు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్ల పాటు వీటిని ధారాదత్తం చేయనుంది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ప్రభుత్వ భూముల లీజు కాలం 33ఏళ్లుగా ఉంది. ఈ వ్యవధిని 66 సంవత్సరాలకు, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు పెంచే అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమాచార మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించిన కేబినెట్ భేటీ వివరాల ప్రకారం...⇒ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రవాణా శాఖకు ఇచ్చిన 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని రద్దు చేసి టీడీపీ జిల్లా ఆఫీసుకు కేటాయింపు. తిరుపతి రూరల్ మండలం అవిలాలలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయానికి కేటాయింపు. వార్షిక రుసుము రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజు కింద మచిలీపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడికి భూమి బదిలీ.⇒ గుంటూరు జిల్లా ఉండవల్లి పరిధిలోని భవానీ ద్వీపంలో ‘అడ్వెంచర్ థ్రిల్ సిటీ’ అభివృద్ధికి విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం. ⇒ మచిలీపట్నం తల్లపాలెం వద్ద అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ల అభివృద్ధికి మైరా బే వ్యూ రిసార్ట్స్కు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు.⇒ క్లీన్ ఎనర్జీకి అవసరమైన అసైన్డ్ భూములను ప్రైవేట్ సంస్థలకు 99 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు 1977 నాటి ఏపీ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టంలో సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం)–2025 ముసాయిదా బిల్లుకు ఆమోదం. ఆర్డినెన్స్ జారీకి అంగీకారం. ⇒ అమరావతిలో ప్రాజెక్టుల కోసం కొత్తగా బడ్జెట్ బయట రూ.9వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సీఆర్డీఏకు అనుమతి. ⇒ అమరావతి రాజధాని సిటీలోని ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధికి రూ.7,500 కోట్లు రుణం పొందేందుకు ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అనుమతి. ⇒ రాజధానిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులు వేగవంతానికి ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) నుంచి రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం. ⇒ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ యుటిలిటీల నిర్వహణకు, బొగ్గు, విద్యుత్ కొనుగోలు నిమిత్తం సర్కారుకు అప్పు ఇవ్వడానికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి లోన్ పొందేందుకు ఏపీపీఎఫ్సీఎల్ రూ.1,000 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం. ⇒ విద్యుత్ సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ జారీచేసిన జీవోకు, ఎస్బీఐ, యూబీఐ నుంచి ఏపీ డిస్కమ్స్ తీసుకునే రూ.1,150 కోట్ల రుణంపై ప్రభుత్వ గ్యారెంటీకి, ఖరీఫ్లో ధాన్యం సేకరణ కోసం మార్క్ఫెడ్ ద్వారా పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీచేసిన జీవోకు ఆమోదం. ⇒ ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ తీసుకునే గరిష్ట రుణ పరిమితి రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంపు. ⇒ కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల భూ సేకరణకు హడ్కోరుణం చెల్లించేందుకు హామీతో ప్రభుత్వ ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్’ జారీకి, ఏపీ ఫైర్ సర్వీసెస్ చట్టం–1999లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ విడుదలకు ఆమోదం.⇒ ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.⇒ సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యల నిమిత్తం కమిషనర్ అనుమతికి అంగీకారం.⇒ ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్–2కు రూ.595.01 కోట్లకు పరిపాలన అనుమతి⇒ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ గ్రామాల లే అవుట్లో అనుసంధానం పనులను రూ.1,863 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు అనుమతి.⇒ ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టం–1939కు సవరణ చేసే ఆర్డినెన్స్ జారీకి ఆమోదం. ⇒ వివిధ కేటగిరీల కాంట్రాక్టర్ల ద్రవ్య పరిమితులు, వారి రిజిస్ట్రేషన్ ఫీజును, సాల్వెన్సీ సర్టిఫికెట్ మొత్తాన్ని, గత అనుభవం, పనుల విలువను పెంచడానికి ఆమోదం.⇒ ఏలూరు జిల్లా పోలవరంలోని 15.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.⇒ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ డేటా లేక్ ప్రాజెక్టు డిజైన్.. అభివృద్ధి, అమలు, ఆపరేషన్లు, నిర్వహణ కోసం సిస్టమ్ ఇంటిగ్రేటర్గా నియామకానికి మెస్సర్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మూడేళ్ల కాలానికి షెడ్యూల్ విలువ రూ.181 కోట్లతో కోట్ చేసిన సింగిల్ బిడ్కు ఆమోదం. ⇒ క్వాంటమ్ మిషన్ నిపుణుల కమిటీ ముందు బిడ్ల సాంకేతిక మదింపును ఉంచి, సమీక్ష, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, టెండర్ల విధానాల ప్రకారం ఆర్ఎఫ్పీ పద్ధతిలో ఏక్యూసీసీ ప్రాజెక్టుకు టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి సాంకేతిక చార్జీలు మినహాయించి రూ.99.62 కోట్లకు అంగీకారం. ⇒ ఇటీవల ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రాయితీలకు ఆమోదం⇒ పలు ఎనర్జీ, టిడ్కో ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు గ్రీన్సిగ్నల్. -
పేదలకు సెంటు భూమి ఇవ్వరు..
సాక్షి, అమరావతి: పేదలకు సెంటు స్థలం ఇవ్వదు కానీ, పార్టీ ఆఫీసులకు మాత్రం రూ.వందల కోట్ల విలువైన భూములు కేటాయించుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అధికారం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే వ్యూహంతో టీడీపీ కార్యాలయాల కోసం అత్యంత విలువైన స్థలాలను కారుచౌకగా ఇచ్చేస్తోంది. తాజాగా మచిలీపట్నంలో కట్టెబట్టిన 1.60 ఎకరాల విలువ రూ.50 కోట్లకు పైనే. తిరుపతి రూరల్ మండలం అవిలాలలో ఇచ్చిన రెండెకరాల భూమి విలువ రూ.100 కోట్లు కావడం గమనార్హం.జనవరిలో కడపలోని రూ.50 కోట్ల విలువైన 2 ఎకరాల ఆర్అండ్బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ధారాదత్తం చేశారు. ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద లీజుకు ఇచ్చేశారు. అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానన్న చంద్రబాబు ఒక్కరికీ సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా జగనన్న కాలనీల్లో గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ఉవ్విళ్లూరుతూ పేదలలో ఆందోళన రేకెత్తిస్తున్నారు. మంగళగిరిలో స్టార్ హోటల్ తరహాలో...చంద్రబాబు ప్రధాన నగరాల్లో అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం కేటాయించి అత్యాధునిక భవనాలను కట్టించేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం 3.65 ఎకరాలలో కోల్కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని అత్యంత విలువైన ప్రాంతంలో ఉంది. 2014లో అధికారంలోకి వచ్చాక కేటాయించుకున్నారు. ప్రస్తుత విలువ రూ.150 కోట్లకుపైనే. ఇందులో వాగు పోరంబోకు, కాలువ, రైతులకు అసైన్ చేసిన డి–పట్టా భూములున్నా నిబంధనలకు విరుద్ధంగా 2016లో 99 ఏళ్ల లీజుకు తీసుకున్నారు.దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులున్నా ఖాతరు చేయలేదు సరికదా... స్టార్ హోటల్ మాదిరిగా దాన్ని నిర్మించారు. గుంటూరు అరండల్పేట పిచుకులగుంటలో వెయ్యి గజాల కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం లీజుకుని తీసుకుని పక్కనే ఉన్న 1,500 గజాల స్థలాన్నీ ఆక్రమించి భారీ భవనం కట్టేశారు. మున్సిపల్ స్థలాలను ఎక్కడా లీజుకు ఇచ్చే అవకాశం లేకపోయినా 2015లో చంద్రబాబు అధికార బలంతో ఆ భూమిని తన పార్టీ ఖాతాలో వేసుకున్నారు.విజయవాడ నడిబొడ్డున రూ.50 కోట్ల భూమివిజయవాడ నడిబొడ్డున ఖరీదైన ప్రాంతం గురునానక్ కాలనీకి ఆనుకుని ఉన్న 95 సెంట్ల భూమిని 2018లో టీడీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. ప్రజావసరాలకు ఉపయోగపడే ఈ సాగునీటి శాఖ స్థలంలో చిన్న కార్యాలయాలుండగా కూల్చేశారు. ఈ స్థలం ప్రస్తుతం రూ.50 కోట్లపైనే ఉంటుంది. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని వారి నోరు మూయించి మరీ కన్వర్షన్ చేసుకున్నారు. ⇒ శ్రీకాకుళంలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ సేకరించి అభివృద్ధి చేసిన భూమిని టీడీపీ కార్యాలయం కోసం లీజు పేరుతో లాగేసుకున్నారు. అందులో పెద్ద భవనాన్ని నిర్మించారు. దీని విలువ ఇప్పుడు రూ.40 కోట్లకుపైనే ఉంటుందని అంచనా. ⇒ కాకినాడలో 2 వేల గజాల జిల్లా పరిషత్ స్థలాన్ని 2014లో టీడీపీ కార్యాలయం కోసం తీసుకున్నారు. దీని విలువ రూ.20 కోట్లకుపై మాటే. విశాఖలో దస్పల్లా కొండను ఆక్రమించి..విశాఖపట్నంలో దస్పల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. దస్పల్లా భూముల్లో 2 వేల గజాలను ఏడాదికి రూ.25 వేల చొప్పున 33 ఏళ్ల లీజుకు కేటాయించుకున్నారు. పక్కనే ఉన్న మరో వెయ్యి గజాలను ఆక్రమించి కార్యాలయం నిర్మించారు. టెక్కలి, చిలకలూరిపేటలో 30 సెంట్లు, 20 సెంట్ల విలువైన స్థలాలను ఇలానే పొందారు.హైదరాబాద్లోనూ అంతే...విలువైన స్థలాలను పార్టీ కార్యాలయాల పేరుతో ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబు ఘనాపాఠి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ను ఇలానే నిర్మించారు. ఇప్పుడూ రాష్ట్రంలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలువైన స్థలాలు పొంది విలాస భవనాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. సోమవారం మచిలీపట్నం, తిరుపతిలో కేటాయింపులు పూర్తవగా, మున్ముందు అన్నిచోట్ల ప్రభుత్వ భూములను పొందేందుకు సిద్ధమవుతున్నారు. -
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్, షెడ్యూల్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు. ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజయవాడ– చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్లు కల్పించారు. -
పదో తరగతి పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) ఫీజు చెల్లింపునకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. అన్ని పాఠశాలలు రెగ్యులర్, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజును ఈనెల 13 నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 3 వరకు, రూ.200 ఫైన్తో 10వ తేదీ, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ తేదీలలో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలు ఉంటే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిగణిస్తారు. విద్యార్థుల ఫీజును https://bse. ap.gov.in లలో అందుబాటులో ఉన్న స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. మాన్యువల్ నామినల్ రోల్స్ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు.పరీక్ష ఫీజు రుసుం ఇలా.. ⇒ రెగ్యులర్ విద్యార్థులు (అన్ని సబ్జెక్టులకు) రూ.125⇒ మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125⇒ మూడు సబ్జెక్టుల వరకు రూ.110⇒ వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60⇒ వయసు మినహాయింపు కోసం రూ.300మార్చిలో ‘పది’ పరీక్షలుపదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చిలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. మార్చి 16, 21 తేదీలతో టైంటేబుల్ను సిద్ధం చేసినట్టు తెలిసింది. -
‘పవర్’పై ప్రైవేటు పెత్తనం
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల్లో కొందరు, ఉన్నత పదవుల నియామకాల్లో మరికొందరు అందినంత దోపిడీ.. కాంట్రాక్టుల్లో ఇంకొందరు భారీగా కమీషన్లు వసూలు...! కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి విద్యుత్ సంస్థలను దోచుకుంటున్న తీరు ఇది...! ఈ దందాలో అనేకమంది అనేక విధాల ప్రయత్నాలు... వీరిలో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ఉన్నారు..! తాజాగా ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లలో ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి అన్నీ తానే అయి ఉన్నతాధికారులను శాసిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా అధికారిక సమీక్షల్లో నేరుగా పాల్గొంటూ, ప్రభుత్వంలోని కీలక నేత తాలూకా అని చెబుతూ హడలెత్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పని కాకుంటే బదిలీనే బహుమానం... ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో ఇటీవల జరిగిన ఓ అధికారిక సమీక్షలో ఉన్నతాధికారులతో పాటు ఓ వ్యక్తి దర్జాగా కూర్చున్నారు. ఆయనను చూసిన ఇతర అధికారులు, సిబ్బంది ఎవరో ఉన్నతాధికారి అని భ్రమపడ్డారు. కానీ, ఆయన ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధి. సీఎండీ కార్యాలయం నుంచి నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనే స్థాయిలో విద్యుత్ సంస్థల్లో పవర్ పెంచుకున్నారు ఆ వ్యక్తి. ఇందుకోసం రాష్ట్రంలోని ఓ మంత్రి పేరును వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మంత్రి చెప్పిందే అన్ని శాఖల్లో జరుగుతోంది.దీంతో ఆయన తాలూకా అని చెబుతున్న ప్రైవేటు వ్యక్తికి అధికారులు అంతే విలువ ఇస్తున్నారు. ఈ ఒక్క డిస్కంలోనే కాదు, మిగిలిన రెండు డిస్కంలలోనూ ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులే పెత్తనం చెలాయిస్తున్నారు. టెండర్లు తయారీ, ఒప్పంద పత్రాలను రూపొందించడం వంటివి ఈ సంస్థ చేతుల మీదుగానే జరుగుతోంది. దీనికి చెందిన ‘చౌదరి’ అనే వ్యక్తి వివిధ శాఖల్లో లాబీయింగ్ చేస్తూ పారిశ్రామికవేత్తలు, డిస్కంల ఉన్నతాధికారుల మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కొన్ని సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేలా ఉన్నతాధికారులను ఒత్తిడి చేస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా టెండర్లు విడుదల చేయించేందుకు యతి్నంచడం, అది జరగకపోతే బదిలీ చేయిస్తామని బెదిరించడం అతడికి పరిపాటిగా మారిందని డిస్కం వర్గాలు అంటున్నాయి. ఆయన ఓ బ్యాంకు ఐటీ మాజీ ఉద్యోగి గతంలో చౌదరి ఓ బ్యాంకు ఐటీ విభాగంలో పనిచేశాడని, అవినీతి ఆరోపణల వల్ల తొలగించారని సమాచారం. ప్రస్తుతం విద్యుత్తో పాటు అనేక శాఖల్లో పెత్తనం చెలాయిస్తున్నాడు. ప్రైవేటు సంస్థకు చెందిన చౌదరి తెలంగాణలో ఉంటూ, ఏపీ డిస్కంలపై అజమాయిషీ చేస్తున్నాడు. రూ.50 లక్షల కాంట్రాక్టు నుంచి రూ.100 కోట్లపైగా ప్రతిదీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.విజిలెన్స్ వెన్నువిరిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ సంస్థల్లో అక్రమాలను, అవినీతిని పసిగట్టి చర్యలు తీసుకునే ట్రాన్స్కో విజిలెన్స్ విభాగాన్ని నిర్వీర్యం చేసింది. మొక్కుబడి విభాగంగా మార్చేసింది. ఇప్పటికీ ఆ శాఖకు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారి లేరు. ఒకవేళ విజిలెన్స్ ఉండి ఉంటే... చౌదరి వ్యవహారంపై దృష్టిసారించి ఉండేవారనే వాదనలు వినిపిస్తున్నాయి.అక్కడే అన్ని వ్యవహారాలుకొందరు ప్రముఖులు, బడా బాబులతో హైదరాబాద్లో చౌదరి సమావేశమవుతాడని, అక్కడే వివిధ కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సదరన్ పవర్ డి్రస్టిబ్యూషన్ కంపెనీ ఇటీవల ఓ సంస్థతో చౌదరి నివాసంలోనే ఒప్పందం కుదుర్చుకుందని, ఆ టెండర్ పత్రాలనూ డిస్కం సిబ్బంది కాకుండా చౌదరి స్వయంగా రూపొందించాడనే ఆరోపణలున్నాయి. టెండర్ పత్రం పూర్తిగా ప్రైవేటు సంస్థకు అనుకూలంగా, ఇతర పోటీదారులు పాల్గొనే అవకాశం లేకుండా రూపొందించారని, దీనిలో కొందరు అధికారులు, చౌదరి బాగా నే లాభపడ్డారని సమాచారం. తాజాగా ఓ డిస్కంలో డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు టెండర్ విడుదలైంది. దానినీ చౌదరి వ్యక్తులే రూపొందించారని తెలిసింది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో పెట్టిన టెండర్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. -
ఢిల్లీలో పేలుడు.. ఏపీలో హైఅలర్ట్
సాక్షి, అమరావతి: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ అప్రమత్తం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, చిత్తూరు, బెంగళూరు సరిహద్దులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్లలోని లాడ్జిలలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఆయా ప్రాంతాల్లోకి వచ్చిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
‘చంద్రబాబు మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు’
సాక్షి,అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నీచరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలను , దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ఏడాదిన్నర కాలంలో అనేక నిదర్శనాలున్నాయి. వైఎస్సార్సీపీపై నిందలు వేయడానికి తన ఎల్లో మీడియాను వాడుకుంటారు. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష తీర్చుకునేందుకు ముందుగా కొన్ని కథనాలను రాయిస్తారు. ఏదో జరిగిపోతుందనే భావన ప్రజలకు కలిగేలా చేస్తారు. ఆ తర్వాత ఏదో పెద్ద నేరం చేసేశారని నమ్మించడానికి దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేస్తారు.చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే ఐపీఎస్ అధికారులతో సిట్ వేసి విచారణ చేయిస్తారు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతంగా వారితో వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.బెదిరించి వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పిస్తారు.లేదంటే భౌతికంగా దాడి చేసి చెప్పిస్తారు. బలవంతంగా పేర్లు చెప్పించడం .. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టడమే చంద్రబాబు ప్రభుత్వం పని. దేవుడిని సైతం తన స్వార్ధ రాజకీయాలకు వాడుకునే నీచమైన స్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. చంద్రబాబు రాజకీయ కక్షలకు తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు.టిటిడిని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై బురదజల్లుతున్నారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ అయ్యిందని చంద్రబాబు దుర్మార్గంగా ప్రచారం చేశారు. జగన్పై బురద చల్లడానికే చంద్రబాబు ఇలాంటి తప్పుడు ప్రచారం చేశారు.పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేశారు.సీబీఐ విచారణ జరిపించాలని మాజీ టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ద్వారా విచారణ చేయించాలని చెప్పింది.దేవుడిని సైతం రాజకీయాలకు వాడుకోవద్దని చంద్రబాబుకు చురకలు అంటించింది. కోర్టుకు వెళ్లినందుకు వైవీ సుబ్బారెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు వరుస కథనాలు రాయించారు. చిన్న అప్పన్న అనే వ్యక్తిని జూన్ 6వ తేదీన సిట్ విచారించింది. వైఎస్సార్సీపీ నేతల పేర్లు చెప్పాలని చిన్న అప్పన్నపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఏపీలో ఏదైనా పెద్ద ఇష్యూ జరగగానే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెస్తారు.నెయ్యిలో కల్తీ ఉందని ఇంత వరకూ నిరూపించలేకపోయారు.లడ్డూ ప్రసాదాన్ని ఇప్పటి వరకూ ఎక్కడికీ టెస్టుకు పంపించనే లేదు.కానీ లడ్డూ కల్తీ అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న అప్పన్న 2018 వరకూ వైవి.సుబ్బారెడ్డి వద్ద పీఏగా పనిచేశారు. అంతకంటే ముందు వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వద్ద కూడా పనిచేశారు. చంద్రబాబు టార్గెట్ వైవీ సుబ్బారెడ్డి కాబట్టి వేరే నేతల పేర్లు బయటికి రావు. ఇప్పటి మంత్రి పార్థసారథి గతంలో టీటీడీ పర్చేజింగ్ కమిటీలో ఉన్నారు.వైవీ సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీ నేత కాబట్టి ఆయన్ని టార్గెట్ చేశారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో నెయ్యి ఖరీదు 276 రూపాయలు మాత్రమే. ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డు పెట్టుకుని వైఎస్సార్సీపీ, జగన్పై బురదజల్లడమే చంద్రబాబు పని. మా పార్టీ నుంచి ప్రజలను దూరం చేయాలన్నదే చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ చేస్తున్నది చాలా నీచమైన రాజకీయం. దేవాలయాలను, దైవాన్ని అడ్డుపెట్టుకుని ఘోరమైన తప్పిదాలు చేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు. ఎవరిపై కక్ష తీర్చుకుందాం..ఎవరిని లోపల వేద్దామనేదే చంద్రబాబు ఆలోచన .చంద్రబాబు,లోకేష్ వైఎస్సార్సీపీపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి’అని హితువు పలికారు. -
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్ఛార్జ్ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుతో అన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. -
పరమ పవిత్రం.. శ్రీవారి లడ్డూ ప్రసాదం
సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.చిన్న అప్పన్న ఏపీ భవన్ ఉద్యోగితిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్లోని సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలుపోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్ప్రదేశ్లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమేకర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! టీడీపీ వీరవిధేయ సిట్తో కుతంత్రంనెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. సుప్రీం కొరడా.. సిట్ క్లోజ్ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.డైవర్షన్ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారంఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.2024 జులై 23వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్ లిస్ట్ పెట్టి షోకాజ్ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు. – టీటీడీ ఈవో శ్యామలరావు2024 సెప్టెంబర్ 18 నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబుటీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. సెప్టెంబర్ 22నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవోఅయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.సెప్టెంబరు 22 ఆ నెయ్యి వాడారు : చంద్రబాబుఅయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు. ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్ 19న ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డితిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ⇒ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి.⇒ అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్ 12న తీసిన శాంపిల్స్ అవి. 2024 జూన్ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ చెప్పనే లేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. -
ఏపీసెట్ ఎప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు, పీహెచ్డీ ప్రవేశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఏపీసెట్) నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. చివరిసారిగా గత ప్రభుత్వం 2024 ఏప్రిల్లో ఏపీసెట్ను నిర్వహించింది. మళ్లీ తిరిగి ఈ ఏడాది ఏప్రిల్లో ఏపీ సెట్ను నిర్వహించాల్సి ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్పై కూటమి సర్కార్ ఇప్పటివరకు నోరుమెదపట్లేదు. ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర జాప్యం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన కూటమి ప్రభుత్వం ఏపీసెట్ నిర్వహణ విషయంలోనూ ఇదేతీరును అవలంబిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్ను తాత్సారం చేయడంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. ఎవరు అర్హులు..ఏపీ సెట్కు పీజీ, తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, పీజీ చివరి ఏడాది చదువుతున్నవారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఈ పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ ఏపీ సెట్కు పోటీపడే అభ్యర్థులు కూడా ఉంటున్నారు. పరీక్ష కఠినం.. అర్హుల సంఖ్యా తక్కువే..ఏపీ సెట్ను ప్రభుత్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకుంటారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్ తరహాలో అత్యంత కఠినంగా పరీక్ష ఉంటుండటంతో ఏపీసెట్లో అర్హత పొందేవారి శాతం తక్కువగానే ఉంటోంది. గతేడాది ఏప్రిల్లో ఏపీ సెట్కు 30,448 మంది హాజరుకాగా కేవలం 8.03 శాతం అంటే 2,444 మంది మాత్రమే అర్హత సాధించారు. గత కొన్నేళ్లుగా ఏపీసెట్లో అర్హత సాధించేవారిని పరిశీలిస్తే అర్హత శాతం సగటున 6–7 శాతం మధ్య ఉంటోంది. అయితే ఏపీసెట్లో అర్హత సాధిస్తేనే యూనివర్సిటీల్లో, కళాశాలల్లో అధ్యాపక పోస్టుల నియామక పరీక్షలకు అర్హత లభిస్తుంది. అలాగే పీహెచ్డీ ప్రవేశాలకు సైతం ఏపీసెట్లో క్వాలిఫై కావాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏపీసెట్లో విజయం సాధించడానికి తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. డిసెంబర్లో యూజీసీ నెట్!కాగా, రాష్ట్రంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు తరహాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (యూజీసీ నెట్)ను నిర్వహిస్తుంది. యూజీసీ ఏడాదిలో రెండు సార్లు.. జూన్, డిసెంబర్లలో క్రమం తప్పకుండా పరీక్షలు చేపడుతుంది. ఈ ఏడాది డిసెంబర్కు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. యూజీసీ నెట్ను దేశవ్యాప్తంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, అర్హత పొందేవారి శాతం కేవలం 7 నుంచి 14 శాతం మధ్యలోనే ఉంటుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో యూజీసీ నెట్ను నిర్వహిస్తారు. దీని ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరుగుతాయి. పీహెచ్డీ ప్రవేశానికి కూడా యూజీసీ నెట్ ఫలితం దోహదపడుతుంది.యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ ఇలా..దరఖాస్తులో సవరణలు: నవంబర్ 10 నుంచి 12 వరకుపరీక్ష కేంద్రాలు, అడ్మిట్కార్డు, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు -
అక్రమ బదిలీలకు బ్రేక్!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో లెక్చరర్లు, ఇతర అధికారుల డిప్యుటేషన్ పేరుతో అక్రమ బదిలీలకు బ్రేకులు పడ్డాయి. గత నెలలో 30 మందికి, నవంబర్లో 90 మందికి డిప్యుటేషన్లు వేసి బదిలీ చేసేందుకు ఆర్డర్లు సిద్ధంచేశారు. కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జరుగుతున్న బదిలీల బాగోతంపై ఇటీవల ‘సాక్షి’ పత్రిక ‘బదిలీ మంత్రం.. వర్క్ అడ్జెస్ట్మెంట్ తంత్రం’ పేరుతో అక్కడ జరుగుతున్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో.. అప్పటికే పూర్తిచేసిన బదిలీలను అధికారులు నిలిపివేసి తాము తప్పుచేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అలాగే, అక్టోబరులో కొందరు లెక్చరర్లను బదిలీ చేసినా వారి ఆర్డర్లను సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో.. డబ్బులిచ్చిన అధికారులు, లెక్చరర్లు తమ సంగతి తేల్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డెప్యుటేషన్ బదిలీ కోసం ఒక్కో లెక్చరర్ నుంచి రూ.2 లక్షలు వసూలుచేసినట్లు సమాచారం. ఇప్పుడీ అక్రమ బదిలీలు నిలిచిపోవడంతో తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా చెప్పిన ప్రకారం ‘సర్వీస్’ బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ బాగోతం ఇప్పటికే మీడియాకెక్కడంతో కొన్నాళ్లు ఆగాలని అధికారులు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యం.. నిజానికి.. 2014–19 మధ్య పాలిటెక్నిక్ విద్యను నాటి టీడీపీ ప్రభుత్వం అస్తవ్యస్థంగా మార్చేయడంతో విద్యార్థుల చేరికలు తగ్గిపోవడంతో పాటు ఉన్నవారికి సైతం సరైన ప్లేస్మెంట్లు లేవు. అయితే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఈ విభాగానికి సమర్థులైన అధికారులను నియమించింది. పాలిటెక్నిక్ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు క్యాంపస్ రిక్రూట్మెంట్ విధానం అమలుచేసింది. ఈ కమ్రంలో దేశంలోనే ప్రముఖ సంస్థలను ఆయా కాలేజీలకు ఆహ్వానించింది. ఫలితంగా.. విద్యార్థులకు 98 శాతం ఉద్యోగావకాశాలు దక్కాయి. అయితే, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. సాంకేతిక విద్యాశాఖలో అయితే కొందరు అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. డెప్యుటేషన్లపై వచ్చి ఇక్కడే తిష్టవేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు జోన్ పరిధిలోనే చేయాల్సి ఉండగా, ఏకంగా రీజియన్ పరిధి మార్చి వారిని 600 కి.మీ.కు పైగా దూరంలో పోస్టింగ్లు ఇచ్చి పంపించారు. వారు ఉద్యోగాన్ని వదులుకుంటే తమకు కావాల్సిన వారికి ఇచ్చుకునేందుకు కుట్రచేసినట్లు విమర్శలు వచ్చాయి. కాసులిస్తే బదిలీలు, డిప్యుటేషన్లు.. ఇక జూన్లో సాధారణ బదిలీలు చేపట్టి ఖాళీలను చూపలేదు. అనంతరం ఆగస్టు, సెపె్టంబరు, అక్టోబరు నెలల్లో డబ్బులిచ్చిన వారికోసం డెప్యుటేషన్లు, బదిలీలు చేపట్టారు. దీనికి వర్క్ అడ్జెస్ట్మెంట్ అని పేరు పెట్టారు. అయితే, వాస్తవాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆక్టోబరులో చేపట్టిన డెప్యుటేషన్లు నిలిపివేశారు. దీంతో.. డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో బదిలీ ఆర్డర్ ఇవ్వలేక.. సమాధానం చెప్పలేక కీలక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. -
రూ.10,000 కోట్ల టూరిజం ఆస్తిపై గురి.. ప్రైవేట్కు ‘హరిత’ హారం
తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ముందుగానే ఆరు క్లస్టర్లకు సంబంధించి ప్రైవేట్ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లను పిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను ధారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్సిలీహిల్స్ హోటల్ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకే ప్రస్తుతం ఆర్ఎఫ్పీలో చేర్చలేదని సమాచారం. మరోవైపు బయటి వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేట్కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని ఐదు హోటళ్లను ప్రైవేట్కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కారు కాలరాస్తుండటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చిమ): నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు.. నేడు టూరిజం శాఖ హోటళ్లు..! కొత్తగా సంపద సృష్టించకపోగా.. భావి తరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది! ప్రభుత్వ ఆస్తులను భద్రంగా పరిరక్షించాల్సింది పోయి.. ప్రైవేట్కు ఏది కట్టబెట్టాలి? ఎలా కట్టబెట్టాలి? రాబట్టుకోవడం ఎలా? అనే ధ్యాసలోనే టీడీపీ పెద్దలు ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఒకపక్క ఇసుక నుంచి మద్యం సిండికేట్ల దాకా పచ్చ ముఠాల దోపిడీని ప్రోత్సహిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతూ నీకింత.. నాకింత...! అనే రీతిలో దోపిడీ వ్యవహారాలకు తెర తీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా.. ప్రతిదీ ప్రైవేట్పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారు! ఇప్పటికే 108, 104 సేవలను నీరుగార్చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటకశాఖ హోటళ్లపై కన్నేశారు! మంచి లాభాల్లో నడుస్తున్న హరిత హోటళ్లను తాము నిర్వహించలేమంటూ ప్రైవేట్ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కారుచౌకగా దోచి పెడుతోంది! ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన హరిత హోటళ్లు, అనుబంధ ఆస్తులు ఒక్కటి కూడా లేకుండా చేయడంలో భాగంగా ఈ కుట్రకు తెర తీసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతం అరకులోని హరిత హోటళ్లను సైతం ప్రైవేట్కే ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు (ఆర్ఎఫ్పీ) ఇప్పటికే ఆహా్వనించారు. బిడ్ల దాఖలు గడువు ఈ నెల (నవంబర్) 7తో ముగియగా, వాటిని ఓపెన్ చేసి టెక్నికల్ వ్యాల్యూయేషన్ చేయాల్సి ఉంది. టెండర్లలో అర్హత సాధిస్తే కేబినెట్లో పెట్టి ఆమోదించుకోవటమే మిగిలింది! రూ.10 వేల కోట్ల ఆస్తి ప్రైవేటు పరం! ఏపీటీడీసీ హోటళ్లను ఆరు క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటళ్లు ఉండగా మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లీజుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. వార్షిక స్థూల ఆదాయం/ఏపీటీడీసీ నిర్ణయించిన సగటు వార్షిక లీజు రేటు ఆధారంగా రెండింటిలో ఏది ఎక్కువైతే అది ప్రైవేటు ఏజెన్సీలు చెల్లించాలని ఆర్ఎఫ్పీలో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ సంస్థ తన ఆదాయాన్ని ఎంత వరకు కచ్చితత్వంతో వెల్లడిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రస్తుతం హోటళ్లు ఉన్న ప్రాంతంలో ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే మార్కెట్ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం రేటు ప్రకారం ఒక్క శాతాన్ని లీజుగా నిర్ణయించడం చూస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఉద్యోగుల కుటుంబాలు బలి.. ఏపీటీడీసీలో హోటళ్లు, వాటర్ ఫ్లీట్, ట్రాన్స్పోర్టు.. ఇలా వివిధ విభాగాల్లో సుమారు 1,300 మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఆప్కాస్, కన్సల్టెంట్లు, డైలీ వేజ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో రెగ్యులర్ ఉద్యోగులు డీవీఎంలు, మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయా హోటళ్లలో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ప్రైవేట్ ఏజెన్సీలే తీసుకోవాలంటూ జీతభత్యాలు, ఉద్యోగ భద్రతను ప్రభుత్వం గాలిలో దీపంలా మార్చింది. ప్రైవేట్ ఏజెన్సీలు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను కొనసాగించుకోవాలని, రెండు నెలలకు ఒకసారి వారి పనితీరును అంచనా వేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా లేకుంటే ఏపీటీడీసీ, ప్రైవేటు ఏజెన్సీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అంటే వారికి ఉద్యోగ భద్రత లేదని తేలిపోతోంది. ప్రైవేట్ ఏజెన్సీలు ఉద్యోగులను తీసుకుంటే డీవీఎంలుగా సేవలందిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు అక్కడే పనిచేస్తారా? వారికి జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ ఏజెన్సీల కింద పని చేయాల్సి వస్తే డీవీఎం కార్యాలయాలు, వాటికి అనుబంధంగా ఉండే సీఆర్వో కార్యాలయాలు మూతపడే అవకాశం లేకపోలేదు. తద్వారా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. హోటళ్లు ప్రైవేట్కు వెళ్లిపోవడం వల్ల ఇన్నాళ్లూ ప్రజలకు సేవలందిస్తున్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని డీవీఎం కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.భారీగా రాబడి కోల్పోతున్న టూరిజం..ఏపీటీడీసీ హోటళ్ల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో హోటళ్లను ఆధునికీకరించారు. దీనికోసం విజయవాడలోని బెరంపార్కు హోటల్తో పాటు ఇతర హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి జీజీహెచ్కు సమీపంలోని ఓ స్టేట్బ్యాంక్ నుంచి రూ.150 కోట్ల రుణానికి అనుమతులు పొందారు. ఇందులో రూ.100 కోట్లతో హోటళ్ల ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తున్న అభివృద్ధి చేసిన హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ దర్శన టికెట్ల కోటాను రద్దు చేయడంతో ఏపీటీడీసీ ఏడాదికి రూ.72 కోట్ల నుంచి రూ.84 కోట్ల రాబడిని కోల్పోయింది. ఇప్పుడు 22 హరిత హోటళ్లను ప్రైవేట్కు అప్పగించడం వల్ల ఏటా మరో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర రెవెన్యూకి గ్యారంటీ లేకుండా పోతుంది. ఇంత అభద్రత మధ్య ఉద్యోగులు, ఏపీటీడీసీ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కూటమి సర్కారు వ్యాపారం చేస్తోంది. -
మూడో విడత ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా మూడో విడత సీట్లను ఆదివారం హెల్త్ వర్సిటీ కేటాయించింది. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల్లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 4,255 ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ కోటాలో కేటాయించగా..మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్లను స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా వర్సిటీ భర్తీ చేయనుంది. గందరగోళంగా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపువిద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణసాక్షి, అమరావతి : 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడో దశ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపులో మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు. ఆదివారం మూడో విడత కన్వీనర్ కోటా సీట్లను హెల్త్ వర్సిటీ విద్యార్థులకు కేటాయించింది. అంతకుముందు ప్రకటించిన సీట్ మ్యాట్రిక్స్లో ఎస్వీయూ రీజియన్ బీసీ–డీ కేటగిరీలో మూడు సీట్లు జనరల్, ఒక సీటు ఉమెన్కు రిజర్వ్ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే కేటాయింపులో మాత్రం రెండు సీట్లు జనరల్, రెండు సీట్లు అమ్మాయిలకు కేటాయించింది. బీసీ–డీలో ఒక సీటే అమ్మాయిలకు రిజర్వ్ చేసినట్టు ప్రకటించి, ఇద్దరికి కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీసీ–డీ జనరల్లో చూపించిన సీట్ను ఉమెన్కు కేటాయించడంతో అదే బీసీ–డీ రిజర్వేషన్లోనే ముందున్న తాను సీట్ కోల్పోతున్నట్టు ఎ.శ్రీహర్ష అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులను వివరణ కోరగా.. సోమవారం సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. పరిశీలించాకే అలాట్మెంట్ లెటర్లు జారీ చేస్తామన్నారు. ఎంబీబీఎస్ మెడికల్ పీజీ తాత్కాలిక ఫీజుల ఖరారుసాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సులకు తాత్కాలిక ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం వైద్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులిచ్చారు.2020–23 బ్లాక్ పీరియడ్ ఫీజులపై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 10%, పీజీ కోర్సుల్లో 15% చొప్పున పెంపుతో తాత్కాలిక ఫీజులను నిర్ణయించారు. కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తీర్పులకు అనుగుణంగా తుది ఫీజులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో 2020–23 బ్లాక్ పిరియడ్ ఫీజుల మీద 15% వృద్ధితో పలు వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకు ఫీజులపైనా వేరుగా జీవో ఇచ్చారు. -
పీఎస్ హెచ్ఎంల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ పీఎస్హెచ్ఎంలు గళమెత్తారు. పీఎస్హెచ్ఎంలకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని, వారివారి సబ్జెక్టులో మాత్రమే విద్యా బోధనకు వీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఏపీపీఎస్హెచ్ఎం ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా రూపొందించిన ఈ పోస్టులకు ఎలాంటి జాబ్చార్ట్ లేదని, తమ పరిధి ఏంటో తమకే తెలియడం లేదని వాపోయారు. హైసూ్కళ్లలో నడుస్తున్న ప్రాథమిక తరగతులకు ప్రత్యేక డైస్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఎస్లలో ఉన్న ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని, తమను గ్రేడ్–3 హెచ్ఎంలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ టీచర్ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. అసెస్మెంట్ పుస్తకాలపై ప్రభుత్వం, విద్యాశాఖ పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులకు యాప్ల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీఎస్ హెచ్ఎంల సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా పీఎస్ హెచ్ఎంల ఫోరం 27 సమస్యలతో కూడిన డిమాండ్ల కరపత్రాన్ని విడుదల చేశారు. సమస్యలపై ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని ఫోరం నిర్ణయించినట్టు అధ్యక్షుడు తెలిపారు. పరిష్కారం కాకపోతే ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలని తీర్మానించినట్టు వివరించారు. కార్యక్రమంలో 13 ఉమ్మడి జిల్లాల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. -
అవును.. అంత నష్టంలేదు
సాక్షి, అమరావతి: ‘నిజమే.. మోంథా తుపానువల్ల అనుకున్నంత నష్టం జరగలేదు. తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చన్న ముందస్తు సమాచారంతో, తుపాను తీరాన్ని దాటబోయే ముందురోజు అప్పటి వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత వర్షపాతం ఉంటే పంట నష్టం అధికంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పంట నష్టం అంచనాలను కాస్త ఎక్కువగా చూపించాం. అయితే, తుపాను ప్రభావం ఓ మోస్తరుగానే ఉంది. ముంపునకు గురైన పొలాల్లోనిలిచిన నీరు త్వరగానే బయటకుపోవడంతో పంటలకు అనుకున్నంత నష్టం జరగలేదు. అందుకే.. తొలుత రూ.875 కోట్లకు పైగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశాం. కానీ, తుది అంచనాల ప్రకారం ఈ మొత్తాన్ని రూ.390.03 కోట్లకు కుదించాల్సి వచ్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ స్పష్టంచేసింది. ‘అంత నష్టంలేదట’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆదివారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. 15.60 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావమని చెప్పి..నిజానికి.. మోంథా తుపాను 24 జిల్లాల్లో 403 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 15,59,925 ఎకరాల్లో పంటలపై ప్రభావం ఉంటుందని అధికారులు తొలుత అంచనా వేశారు. రైతులు కూడా 24 జిల్లాల పరిధిలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. అయితే, తుపాను బాధిత రైతులను ప్రభుత్వం గాలికొదిలేయడంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లాల్లో ఈనెల 4న పర్యటించి బాధిత రైతులకు బాసటగా నిలిచారు. ఎన్యుమరేషన్ కోసం తమ పంట పొలాల వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదని రైతులు జగన్ ఎదుట ఎకరవు పెట్టారు. సుంకు విరిగిన వరికంకులను చూపించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అక్టోబరు 31లోగా ఎన్యుమరేషన్ పూర్తిచేయాలని ఒకరోజు గడువుతో ప్రొసీడింగ్స్ ఇవ్వడంపై జగన్ ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో.. అప్పటివరకు నిర్దేశించిన గడువులోగా 3.45 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత గడువును వారం రోజులపాటు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ తన ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి.. ఎన్యుమరేషన్ గడువు పెంచినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈనెల 8 వరకు ఎన్యుమరేషన్ కొనసాగించడంతో మరో 58 వేల ఎకరాల్లో పంట నష్టం అధికంగా జరిగినట్లు గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. చివరికి.. 3.23 లక్షల మంది రైతులకు చెందిన 4.03 లక్షల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు 33 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు నిర్ధారించామని పేర్కొంది. -
బిగ్బాస్ బరితెగింపు!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి సర్కారు పెద్దలు బరితెగించారు. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయం పెంచేసి ‘నీకింత–నాకింత’ అంటూ పంచుకుంటున్నారు. తుదకు పరిపాలనా అనుమతులు లేకుండానే పనులు కట్టబెట్టారంటే ఏ రీతిన అవినీతికి పాల్పడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోంది. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి. ఆ పనులకు రూ.363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి, 2017లో వాటిని అప్పగించిన ఎన్సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు.అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యతాస్యం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం బిగ్బాస్ జేబులోకి చేరుతుందంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజినీర్లు చెబుతున్నారు. రూ.608 కోట్ల అంచనా వ్యయంతో 432 ఫ్లాట్ల నిర్మాణానికి 2017లో సీఆర్డీఏ టెండరు పిలిచింది.4.59 శాతం అధిక ధరలకు కోట్ చేసి రూ.635.90 కోట్లకు ఆ పనులను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. ఈ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ 2017 నవంబర్ 13న సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి 12 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. అయితే 2019 నాటికి 72 శాతం పూర్తయినట్లు.. అందుకు రూ.363.68 కోట్లను వ్యయం చేసినట్లు 2023లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేలి్చంది. అంటే.. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్లు మాత్రమే. రద్దు చేసి.. అంచనా వ్యయం పెంపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి.. అదే ఎన్సీసీ సంస్థకు మళ్లీ అప్పగించారు. అంటే.. నాడూ, నేడూ వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే.. 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే సిండికేట్ కాంట్రాక్టర్లకు బిగ్బాస్ దిశా నిర్దేశం చేసి.. సీఆర్డీఏ అధికారులకు కనుసైగ చేయడం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను మళ్లీ ఎన్సీసీకే కట్టబెట్టారని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. పరిపాలన అనుమతి లేకుండానే ఒప్పందం అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ చేపట్టిన పనులను పరిపాలన అనుమతి లేకుండానే సీఆర్డీఏ అధికారులు ఏప్రిల్ 28న ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం (ఐదు శాతం మెషినరీ, ఐదు శాతం లేబర్) మొబిలైజేషన్ అడ్వాన్స్ను కాంట్రాక్టర్కు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మేరకు ఎన్సీసీ సంస్థకు మెషినరీ విభాగం కింద 5 శాతం... అంటే రూ.26.68 కోట్లు చెల్లించాలని సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) ద్వారా పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్)కు సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదన పంపారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ పనిని చేపట్టిన నేపథ్యంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించలేమంటూ పీఏవో దానిని సీఆర్డీఏ అధికారులకు తిప్పి పంపారు. దాంతో సీఆర్డీఏ అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్లో ఆమోదింపజేసి.. జూలై 13న ఆ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం. రూ.457.92 కోట్లకు పైగా దోపిడీ! రాజధానిలో ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నిర్మీస్తున్న తరహాలోనే హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంలో, ఇటాలియన్ మార్బుల్స్, అత్యాధునిక హంగులతో నిర్మీంచిన ఫ్లాట్ల ధర ఒక్కొక్కటి రూ.కోటికి మించదని ఇంజినీర్లు, రియల్టర్లు, బిల్డర్లు గుర్తుచేస్తున్నారు. అది కూడా భూమి విలువతో కలిపి. కానీ.. సీఆర్డీఏ పరిధిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే 432 ఫ్లాట్ల అంచనా వ్యయం రూ.888.38 కోట్లు. (2019 నాటికి చేసిన వ్యయం రూ.363.68 కోట్లు+తాజా వ్యయం రూ.524.70 కోట్లుకు చేరుకుంది.) అంటే.. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.2.06 కోట్లు. ఈ లెక్కన ఒక్కో ఫ్లాట్పై రూ.1.06 కోట్లు చొప్పున అధికంగా వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిని బట్టి ఈ ఫ్లాట్ల నిర్మాణంలో మొత్తంగా రూ.457.92 కోట్లకుపైగా దోపిడీ చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు. -
10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర బృందం
సాక్షి, అమరావతి: కేంద్ర అధికారుల బృందం ఈ నెల 10, 11 తేదీల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలో 8 మంది అధికారులు.. రెండు బృందాలుగా విడిపోయి ఆరు జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ బృందం 10వ తేదీ ఉదయం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమై వివరాలు సేకరించనుంది.అనంతరం బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఒక బృందం, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మరో బృందం పర్యటించి పంట, ఇతర నష్టాలను అంచనా వేయనుంది. ఈ బృందాన్ని సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిగా విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్, రాష్ట్ర స్థాయి లైజనింగ్ అధికారిగా ఈడీ వెంకట దీపక్ను నియమించింది. -
శీతల్దేవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన పారా ఆర్చర్ శీతల్దేవికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.ఓపెన్ ఆర్చరీ(ఏబుల్–బాడీడ్) అంతర్జాతీయ ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాదించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్లో పాల్గొననున్న శీతల్కి ఆల్ ది బెస్ట్’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
టిడ్కో ఇళ్ల.. సం‘గతేంటి’ బాబూ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని లబ్ధిదారులు అందరికీ 2026 జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు అందజేస్తామని ఇటీవల మున్సిపల్శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. అయితే ‘ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.7,280 కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. మరో ఏడు నెలల్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇచ్చింది లేదు.జగన్ పూర్తి చేసిన ఇళ్లే దిక్కు..పేదలకు ఇళ్ల విషయంలో పూర్తి వైఫల్యం నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బాబు సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 – 95 శాతం పనులు పూర్తయిన 6 వేల ఇళ్లకు హంగులు అద్ది ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలంటే తమకు నిధులు ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలు పట్టుబట్టడంతో చేసేది లేక రాజీవ్ స్వగృహ నిధుల నుంచి రూ.200 కోట్లు తీసుకుని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా బాబు ప్రభుత్వ పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరుశాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తం 2,62,212 ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించిన విషయాన్ని మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. జగన్ హయాంలోనే మరో 77,546 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. లబ్ధిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాలకు జగన్ సర్కారు చెక్...ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించి రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించింది. ⇒ చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించి రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. తద్వారా ఈ ప్రయోజనాన్ని పేదలకు అందించింది. ⇒ నిరుపేదలకు కేటాయించిన 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండాపోయింది. ⇒ 365 చదరపు అడుగుల ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. దాంతో రెండు, మూడు కేటగిరీల లబ్ధిదారులకు టీడీపీ లెక్కల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. ⇒ అలాగే గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని సైతం జగన్ ప్రభుత్వం తగ్గించింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే 1,43,600 ఇళ్లలో ఒక్కోఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించారు. ⇒ 365 చదరపు అడుగుల ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు భరించి లబ్ధిదారులకు వారి వాటాగా చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించి రూ.3.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. ⇒ అలాగే రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అడుగుల ఇంటికి జగన్ ప్రభుత్వం రూ.4.15 లక్షలు చెల్లించి లబ్ధిదారు వాటాగా రూ.4.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. బాబు పాలనలో రూ. 8,929.81 కోట్ల దోపిడీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. అన్ని మున్సిపాలిటీల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేయగా, చాలా మున్సిపాలిటీల పరిధిలో స్థలం లభించలేదు. అయితే, భూములు దొరికిన చోట నాడు చదరపు అడుగు నిర్మాణ ధర రూ.1,000 కంటే తక్కువే. అయితే బాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలు ఇచ్చిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59 వరకూ నిర్ణయించి కాంట్రాక్టులు కట్టబెట్టింది. సగటున చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,203.45గా చెల్లించారు.అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా ఇచ్చారు. పైగా ఎక్కడా నూరు శాతం ఇళ్లు ఇచ్చింది లేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరులో ఇళ్లు పూర్తవకపోయినా రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే నాటికి 77,350 ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందులో 20 వేల వరకు మాత్రమే 60 శాతం పూర్తి చేశారు. -
ఏపీ వైఎస్సార్టీఏ నూతన కార్యవర్గం ఎన్నిక
సాక్షి, అమరావతి: సమైక్యంగా ఉంటూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఏపీ వైఎస్సార్టీఏ నూతన కార్యవర్గానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయి కమిటీల నియామకం త్వరితగతిన పూర్తిచేసి సంఘాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘం ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తాడేపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రం అంతటి నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పొట్టగొడుతూ వారి సంపదను స్వాహా చేస్తున్న కూటమి ప్రభుత్వం వారిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. దీపావళికి ముందు ఇచ్చిన పెండింగ్ డీఏ కూడా మోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాలుగు పెండింగ్ డీఏల్లో ఒకే ఒక్కటి ఇచ్చి, ఆ ఎరియర్స్ను కూడా రిటైర్మెంట్ సమయంలో ఇస్తామంటూ దెబ్బకొట్టారు. పీఆర్సీ, ఐఆర్, రూ.34 వేల కోట్ల బకాయిల గురించి ప్రస్తావనే లేదు. దీంతోనే ఉద్యోగుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిసిపోయింది’’ అని ధ్వజమెత్తారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఆర్నెల్లకు ఒక డీఏ చొప్పున 10 డీఏలు ఇవ్వడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డీఏ కూడా ఇచ్చారని అన్నారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి నప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలున్నాయని చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారని పేర్కొన్నారు. వాటిని దఫదఫాలుగా చెల్లిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఉద్యోగుల ఓట్లు పొందిన చంద్రబాబు, గెలిచాక ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బకాయిలు చెల్లిస్తానని చెప్పి.. వాటిని మరో రూ.12 వేల కోట్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని... ఇది మోసం కాదా? అని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను 2027–28లో 12 వాయిదాల్లో ఇస్తానని చెప్పడం వేధించడమేనని అన్నారు. ఏపీ వైఎస్సార్టీఏ నూతన రాష్ట్ర కార్యవర్గం ఏపీ వైఎస్సార్టీఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన కేశవరపు జాలిరెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంషీద్ (శ్రీ సత్యసాయి జిల్లా), రాష్ట్ర కోశాధికారిగా ప్రేమ్సాగర్ (గుంటూరు)ను ఎన్నుకున్నారు. -
మంగళగిరిలో టిఫిన్.. తిరుపతిలో లంచ్.. హైదరాబాద్లో డిన్నర్
సాక్షి టాస్క్ ఫోర్స్: డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్మ్యాన్ షోలా సాగింది. ఎక్కే విమానం.. దిగే విమానం.. అన్నట్లు తన రెండు రోజుల పర్యటనను బిజీబిజీగా ప్లాన్ చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్.. రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు. వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం తిరుపతి మంగళంలోని గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని, ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ‘దొంగల నుంచి పట్టుబడ్డ 2.65 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగలు తిరుపతిలోని గోదాములో ఉన్నాయి. వాటి విలువ రూ.2వేల నుంచి రూ.5 వేల కోట్లు ఉంటుంది. పట్టుబడకుండా స్మగ్లింగ్లో తరలిపోయింది చాలా ఉంటుంది. కర్ణాటక రూ.140 కోట్లు సొమ్ము చేసుకుంది. ఎక్కడ ఎర్రచందనం దొరికినా అది ఏపీకే చెందేలా ఒప్పందం జరిగింది. స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు కీలక వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటాం. ఎర్రచందనం జోలికెళితే తాట తీస్తా’ అని పవన్ చెప్పుకొచ్చారు.ఎవరినీ కలవని పవన్.. కాగా, పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు, రైతులు, జనసేన శ్రేణులు.. పలు సమస్యలపై అర్జీలు తీసుకుని రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి కలెక్టరేట్కు తరలివచ్చారు. అయితే పవన్ ఏ ఒక్కరినీ కలువలేదు. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జ్ కోట వినుత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కుటుంబ సభ్యులు.. ప్లకార్డులు పట్టుకుని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ఎక్కి హైదరాబాద్కు వెళ్లిపోయారు. కాగా, పవన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణిగుంట రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరు వెళతారు. అక్కడ కుంకీ ఏనుగులను పరిశీలించి, తిరిగి హెలికాప్టర్లో రేణిగుంటకు వస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ లేక గన్నవరం వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. -
శాశ్వతంగా అధికారంలో ఉంటాం..
సాక్షి, అమరావతి: టీడీపీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని.. శాశ్వతంగా అధికారంలో ఉంటూ సుదీర్ఘకాలం కొనసాగుతామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి రోజంతా ఉంటానని చెప్పారు. పార్టీ కార్యాలయానికి వస్తేనే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. లోకేశ్ కూడా వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని గాడిలో పెట్టామన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికంటే ఇప్పుడే ఇంకా వేగంగా పనిచేస్తున్నా. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పరిపాలనలో వేగం పెరిగి పాలన సులభంగా మారింది. ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడంలేదో వినతులు ఇచ్చిన వారికి అర్ధమయ్యేలా తెలిపే విధానం తీసుకొస్తాం. వాటికున్న అడ్డంకుల గురించి బాధితులకు తెలియాలి. కిందిస్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. ముందు పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ప్రజాదర్బార్లు నిర్వహించాలి. పార్టీ కమిటీలను ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తాం. నిర్మాణాత్మకంగా పెట్టుబడుల సదస్సు.. ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తాం. ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో సదస్సు జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. షిప్మెంట్ మాత్రమే మిగిలి ఉంది. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చూస్తున్నాం. ఇక తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది.పింఛన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆగ్రహం.. ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించిన ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వారి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుందామని ఆయనన్నట్లు తెలిసింది.ఏడు ప్రాజెక్టులకు వర్చువల్గా సీఎం భూమి పూజ.. మరోవైపు.. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో కుప్పంలో ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజ డెయిరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డెయిరీ, ఇ–రాయస్ ఈవీ, అలీప్ కుప్పంలో పరిశ్రమలు పెట్టనున్నాయి. ఈ ఏడు సంస్థలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల శంకుస్థాపన సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్ ద్వారా సీఎం మాట్లాడారు. త్వరలో కుప్పం నియోజకవర్గానికి మరో ఎనిమిది సంస్థలు రాబోతున్నాయని చెప్పారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ–వన్ ఏఐ నిపుణుడు అనే పాలసీలు విస్తృత అవకాశాలు కల్పిస్తాయన్నారు. -
అడవిలో అలజడి!
కంచే చేను మేసినట్లు ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుంటే.. జనాందోళనలు తెలియనట్లే వ్యవహరిస్తుంటే.. ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి? పాలకుల తీరు పగబట్టినట్లు ఉంటే సామాన్య ప్రజల గోడు పట్టించుకునేదెవరు? చట్టాలను పట్టించుకోకుండా అటవీ భూమిని అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వమే కట్టబెడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి? ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల్ని కలవరపెడుతున్న ప్రశ్నలు ఇవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కోసం గిరిజన చట్టాలను ఉల్లంఘించి మరీ పెద్ద ఎత్తున భూసేకరణకు రంగంలోకి దిగడంతో అడవిలో అలజడి తీవ్రమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల్ని భూసేకరణ భూతం భయపెడుతోంది. రాజ్యాంగం 5వ షెడ్యూల్లో గిరిజనులకు ప్రసాదించిన హక్కులు, వారికోసం ఉద్దేశించిన చట్టాలను కాపాడాల్సిన కూటమి ప్రభుత్వం వాటి ఉల్లంఘనలకు నడుంకట్టింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వేల ఎకరాల భూసేకరణకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని ఐదు గ్రామాల్లో నిరి్మంచనున్న ఆయుధ కర్మాగార డిపో కోసం 1,166 ఎకరాలు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ హైడల్ తదితర ప్రాజెక్టుల కోసం వేల ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా చేసుకున్న హైడ్రోపవర్ ప్రాజెక్టుల ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరైన ప్రాజెక్టులను జనావాసాలకు, పంటలు పండే సారవంతమైన భూములకు ఇబ్బంది లేని విధంగా చేపట్టాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీల (ఎక్స్టెన్షన్) షెడ్యూల్డ్ ఏరియాలకు (పీసా) చట్టం–1996కు 2011లో చేర్చిన నిబంధనలు, అటవీహక్కుల చట్టం (ఎఫ్ఆర్ఏ)–2006, ఆంధ్రప్రదేశ్ భూమి బదిలీల నియంత్రణ (1/70 నియమం) చట్టాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని గిరిజనులు, రాజకీయ పార్టీల నేతలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలు సాగనివ్వం గిరిజన చట్టాలను కాదని గత టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పెద్ద ఎత్తున అనుమతి ఇవ్వడంతో గిరిజన ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచి్చంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గిరిజన చట్టాలు, వారి హక్కులను కాదని వేల ఎకరాల అటవీ భూమిని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే కుట్రలు చేస్తోంది. షెడ్యూల్డ్ ఏరియాలో అంగుళం భూమి తీసుకోవాలన్నా గ్రామసభ తీర్మానం చేసి దాన్ని గిరిజన సలహా మండలిలో ఆమోదం పొంది గవర్నర్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఆదివాసీ గ్రామసభ ఆమోదం లేకుండా వేల ఎకరాలను కట్టబెట్టే ప్రభుత్వ చర్యల వల్ల ఆదివాసీల హక్కులు, భూములు, సంస్కృతి, పర్యావరణం దారుణంగా దెబ్బతింటాయి. గిరిజనులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం. – పీడిక రాజన్నదొర, మాజీ ఉపముఖ్యమంత్రిగిరిజన హక్కులను కాలరాస్తున్న కూటమి ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాస్తూ వారికి చెందాల్సిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం ఎలా కేటాయిస్తుంది? ఇదే విషయంపై ఇటీవల శాసనమండలి సమావేశాల్లో వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీశాను. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో హైడ్రోపవర్ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ కూటమి ప్రభుత్వం జీవోలు జారీచేసింది. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమే. 20 గ్రామాలతోపాటు వేలాదిమంది గిరిజనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ ప్రాజెక్టులు ఆదివాసీల పూర్వీకుల భూములు, అడవులు, నదులు, సంస్కృతిని, జీవనాధారాలను పూర్తిగా ధ్వంసం చేస్తాయి. – కుంభ రవిబాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ -
అంత నష్టం లేదట!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్టుగానే చేశారు. ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపలేదు. నిబంధనలను పక్కన పెట్టి పుట్టెడు కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఉదారంగా ఆదుకోవల్సిన ప్రభుత్వం వారి నోట్లో మట్టికొట్టేందుకు ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు)ను మమ అనిపించింది. రైతులను ఆదుకునేందుకు పారదర్శకంగా ఎన్యుమరేషన్ చేయాలని యంత్రాంగం ఎంతగా శ్రమించినా, పచ్చ నేతల కనుసన్నల్లోనే తుది జాబితాలు తయారు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యçస్తంగా సాగింది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ ఒక్క రోజు ముందు అంటే 30వ తేదీన సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. తుది అంచనాల తయారీకి కేవలం 24 గంటలు మాత్రమే గడువు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. గడువు పెంచాలని రైతులు, రైతు సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ ప్రభుత్వం గడువు పెంచుతున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం అంచనాల పరిశీలన, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునః పరిశీలన, తుది జాబితాల తయారీ అంతా సమాంతరంగా జరిగిపోతుందంటూ బిల్డప్ ఇచ్చారు. దీంతో తుది అంచనాల తయారీపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలన్నీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే, స్థానిక టీడీపీ నేతల సిఫార్సుల మేరకు తయారవుతున్నాయన్న విమర్శలు విన్పించాయి. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. అంచనాలు కుదించి.. మోంథా తుపాను ప్రభావం 24 జిల్లాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగైన పంటలపై తీవ్రంగా ఉంటుందని తొలుత ప్రభుత్వమే అధికారికంగా అంచనా వేసింది. అయితే తుపాను ఆగిపోయిన మర్నాడు నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత ఆ సంఖ్య 3.45 లక్షల ఎకరాలే అంటూ చెప్పుకొచ్చింది. తీవ్ర విమర్శలు రావడంతో చివరకు తుది అంచనాలు కొలిక్కి వచ్చే సమయానికి 4.17 లక్షల ఎకరాలుగా నిర్ధారించింది. దాంట్లో 4.11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 16 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చారు. క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఆరు నుంచి 8 లక్షల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం వాటిల్లగా, తుది అంచనాల్లో మాత్రం కేవలం 3.25 లక్షల ఎకరాల్లోనే వరి పంట దెబ్బ తిన్నట్టుగా నిర్ధారించింది. దాదాపు 50 వేల ఎకరాల్లో అరటి పంట నేలమట్టమైనట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం 9,700 ఎకరాల్లోనే నష్టం వాటిల్లినట్టు తేల్చింది. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము, సజ్జ, కందితో సహా ఇతర పంటల నష్టాన్ని కేవలం 90 వేల ఎకరాలకు పరిమితం చేసింది. ప్రధానంగా ఐదారు లక్షల ఎకరాల్లో వరి పంట నేలకొరిగి పూర్తిగా దెబ్బతినగా, మరో రెండు లక్షల ఎకరాల వరకు పంట నిలబడినప్పటికీ సుంకు (పుప్పొడి) విరిగి ఫలదీకరణ చెందక తాలు గింజలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావంతో ఎకరాకు 20–25 బస్తాలకు మించి దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు ర్యాండమ్ చెక్ చేస్తూ మండలానికి ఒకటి రెండు గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి అధికారులు ఎన్యుమరేషన్ను మమ అనిపించారు. సుంకు విరిగిపోవడం వల్ల దెబ్బతిన్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమకు చెందిన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీగా రూ.875 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని లెక్క తేల్చారు. అక్టోబర్ 31 లోపు పంట నష్టం వివరాలను తెలపాలంటూ రైతులకు ప్రభుత్వం పంపిన మెసేజ్ చనిపోయింది 2,279 పశువులు,జీవాలేనట!మోంథా తుపాను వల్ల క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ఐదారు వేల జీవాలు మృత్యువాత పడినట్టుగా రైతులు చెబుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 94 ఆవులు, గేదెలు, 393 మేకలు, గొర్రెలు, 17 ఎద్దులు, దున్నలు, 82 దూడలు, 1,693 కోళ్లు మృత్యువాత పడినట్టుగా ప్రకటించారు. 155 పశువుల షెడ్లు నేల కూలినట్టుగా నిర్ధారించారు. తొలుత వీటికి రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేయగా, చివరికి రూ.1.05 కోట్లకు పరిమితం చేశారు. ఆక్వా రంగానికి తొలుత రూ.514 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా ప్రకటించిన ప్రభుత్వం, తుది అంచనాలకొచ్చేసరికి కేవలం 33.23 కోట్లకు పరిమితం చేయడం పట్ల ఆక్వా రైతులు మండిపడుతున్నారు. తొలుత 50 వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్నట్టుగా చెప్పుకొచ్చిన ప్రభుత్వం చివరికి 5 వేల ఎకరాలకు పరిమితం చేసింది. తొలుత 10 వేల మంది ఆక్వా రైతులకు నష్టం వాటిల్లినట్టు చెప్పగా, చివరికి 2,541 మంది రైతులకు చెందిన ఆక్వా చెరువుల్లో ఇసుక మేటలు వేయడం, పూర్తిగా దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. మత్స్యశాఖకు సంబంధించి 9 మోటరైజ్డ్ బోట్లు పూర్తిగా, మరో 304 బోట్లు పాక్షికంగా, 41 నాన్ మోటరైజ్డ్ బోట్లు, సంప్రదాయ బోట్లు మరో 18 పూర్తిగా దెబ్బ తిన్నాయని, అలాగే 121 వలలు పూర్తిగా, మరో 241 వలలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నిర్ధారించారు. తుపాను వల్ల దాదాపు 20 రోజులుగా వేట లేక పస్తులతో గడిపిన మత్స్యకారులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి, వారికి బోట్లు, వలలకు కేవలం రూ.1.06 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. ఇలా అన్ని విధాలుగా కోతలు వేస్తూ తుది అంచనాలను కుదించేశారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర బృందం ముందు ఈ నివేదికలు ఉంచేందుకు సన్నద్ధం చేస్తున్నారు. -
రైల్వేకోడూరు టీడీపీ టికెట్ కోసం రూ.7 కోట్లు ఇచ్చా
సాక్షి,అమరావతి: రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానని టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ తన వద్ద రూ.7 కోట్లు తీసుకున్నారని టీడీపీ కార్యకర్త సుధామాధవి రోదించారు. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్తో కలిసి శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘నేను ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేశా. చంద్రబాబు సార్ జైల్లో ఉన్నప్పుడు 53 రోజుల పాటు నిరాహార దీక్ష చేశా. సొంత వాహనాలు పెట్టుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు టీడీపీ గెలవాలని కార్యక్రమాలు చేపట్టా. నేను చేపట్టిన కార్యక్రమాలను దగ్గరగా గమనించిన టీడీపీ ఎన్ఆర్ఐ నేత వేమన సతీష్ నా దగ్గరకు వచ్చి తనకు చంద్రబాబు సార్, లోకేశ్, భువనేశ్వరమ్మ బాగా తెలుసని, రైల్వే కోడూరు ఎమ్మెల్యే (టీడీపీ) టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికారు. దీంతో పెద్దలు సంపాదించిన ఆస్తులు అమ్మి.. తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి సీటు కోసం సతీష్ అన్నతో పాటు అతను సూచించిన వారికి పలుదఫాలుగా రూ.7 కోట్లు ఇచ్చాం. తీరా ఎన్నికల సమయానికి టికెట్ ఇవ్వలేదు. ఈ విషయం తెలిసి మా గ్రామస్తులంతా టీడీపీ కార్యాలయం ముందు ధర్నాకు సిద్ధపడినా.. నేనే వారిని సముదాయించి బాబు సార్ సీఎం కావాలని చెప్పాను. టికెట్ కోసం నేను ఇచి్చన డబ్బు ఇవ్వాలని కోరితే సతీష్ అన్న బెదిరించారు. మాకు జరిగిన అన్యాయం గురించి చెబుదామని టీడీపీ కార్యాలయానికి వెళితే నంబర్లేని కారులో నా భర్తను, నన్న తీసుకెళ్లిపోయారు. మా పిల్లలు శ్రావణ్ సార్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పడంతో ఆయన కేసు పెట్టడం వల్ల మేము బయటకు వచ్చాం. డబ్బులు ఇవ్వాలని అడిగితే తనకు టీడీపీ పెద్దలందరూ తెలుసు అని ఫొటోలు చూపించడంతోపాటు తన మామ పోలీస్ ఆఫీసర్ అని డబ్బులు అడిగితే నన్ను, నా పిల్లలను చంపేస్తామని సతీష్, అతని అనుచరులు బెదిరిస్తున్నారు.’’ అని సుధా మాధవి కన్నీటి పర్యంతమయ్యారు. విచారణ చేసి న్యాయం చేయండి జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ మాట్లాడుతూ బాధితురాలు సుధామాధవి కుటుంబం ఎన్నికల ముందు నుంచి తనకు తెలుసని చెప్పారు. టికెట్, డబ్బు లావాదేవీలకు సంబంధించి సతీష్ పెట్టిన మెసేజ్ల స్క్రీన్షాట్లు ఉన్నాయని వివరించారు. రూ.50 లక్షలు సతీష్కు చెందిన ఖాతాల్లో వేశారని, మరో రూ.50 లక్షలు ఆయన చెప్పిన వారి ఖాతాకు వేశారని చెప్పారు. మరో 2.5 కోట్లు సతీష్ అనుచరులకు ఇచ్చేటప్పుడు వీడియోలు తీశారని వెల్లడించారు. సతీష్ పీఏకి దఫదఫాలుగా రూ.1.5 కోట్లు ఇచ్చేటప్పుడు కూడా వీడియోలు తీశారని తెలిపారు. ఇలా సతీష్ కు మొత్తం రూ. 7 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ చేయించి సుధామాధవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందికర పరిస్థితిలో వారు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యులు? అని శ్రావణ్ ప్రశ్నించారు. కుటుంబం రోడ్డున పడింది.. భర్త మంచాన పడ్డాడు ‘టికెట్ కోసం మొత్తం డబ్బు పోగొట్టుకున్నాం.. ఇల్లు లేదు.. రోడ్డున పడ్డాం. అనారోగ్యంతో నా భర్త మంచాన పడ్డాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. పార్టీ కోసం ఇంత కష్టపడిన మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. మాకు ప్రాణ రక్షణ కల్పించండి.. సతీష్ నుంచి మా డబ్బులు మాకు ఇప్పించండి చంద్రబాబు సార్.. మాకు జరిగిన అన్యాయం ఏ ఒక్క ఆడబిడ్డకు జరగకూడదు. సతీష్ అన్నకు ఖాతాల్లో రూ.50 లక్షలు వేశాం. దానికి ఆధారాలు ఉన్నాయి. మిగిలినవి నగదు రూపంలో ఇచ్చాం. మాకు ఏం జరిగినా సతీష్ అన్నకే సంబంధం. సతీష్ ను మందలించి మా డబ్బులు మాకు ఇప్పించండి చంద్రబాబు సార్’ అని సుధామాధవి వేడుకున్నారు. -
రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు: కైలే
సాక్షి, తాడేపల్లి: రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపు.. విపత్తులో నష్ట పోయిన రైతులను ఆదుకునే పరిస్థితి కూడా లేదంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తుపానును కూడా పబ్లిసిటీ కోసం వాడుకున్న వ్యక్తి చంద్రబాబు.. నష్టపోయిన రైతులను మాత్రం కనీసంగా కూడా పట్టించుకోలేదంటూ ఆయన నిలదీశారు.‘‘పంట నష్టం అంచనాలలో కూడా రైతులను దగా చేస్తున్నారు. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒకే ఒక్క రోజులో పంట నష్టం అంచనాలను ఎలా వేస్తారు?. నష్టపరిహారం తీసుకుంటే ధాన్యం కొనేదిలేదని రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు ధైర్యంగా ఉండేవారు. ఏ విపత్తు వచ్చినా అందుకునేందుకు జగన్ ఉన్నాడనే ధైర్యం ఉండేది. కానీ చంద్రబాబు మాత్రం ధాన్యం పండించడం అనవసరమని మాట్లాడారు. కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఈ ప్రభుత్వంలో అసలు యూరియా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది...పంట నష్టం జరిగితే ఆ వివరాలు తెలుసుకునే పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు. అసలు ఈ ప్రభుత్వానికి రైతు అంటే చిన్నచూపు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాల్సిందే. అంచనాల విషయంలో కూడా రాజకీయాలు చేస్తే సహించం. వెంటనే ఉచిత పంటల బీమా సౌకర్యం కల్పించాలి. రబీ సీజన్కు అవసరమైన విత్తనాలు, పెట్టుబడి సాయాన్ని అందించాలి. జగన్ని చూసేందుకు వెళ్లిన మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు...ఇదేమని ప్రశ్నిస్తే సీఐ నన్ను దుర్భాషలాడారు. పైగా కేసు నమోదు చేశారు. పోలీసులంటే గౌరవం ఉంది. కానీ అన్యాయంగా కేసులు పెట్టటం బాగోలేదు. దీనిపై మాట్లాడటానికి ఎస్పీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మా మీద కేసులు పెట్టటం కాదు, గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులు అరిట్టండి. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకోండి. పేకాట క్లబ్బులు, రేషన్ మాఫియాని అరికడితే సంతోషిస్తాం’’ అని కైలే అనిల్కుమార్ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు భక్త కనకదాసు అని కురుబ సంఘం నాయకులు కీర్తించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ కురుబ కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామకృష్ణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన కురుబ నాయకులు పాల్గొన్నారు.భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సామాజిక అంతరాలు తొలగించేలా పాలన అందించారని కొనియాడారు. వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహంతో పాటు ఆయన పేరుతో సామాజిక భవనం ఏర్పాటు చేయాలని కురుబ సోదరులు కోరగా ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వారికి హామీ ఇచ్చారు. గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించబోతున్నాం. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మిక వేత్త భక్త కనకదాసు కుల దురహంకారంపై సాహిత్యమనే ఆయుధంతో పోరాడి సామాజిక విప్లవం తీసుకొచ్చారు. భక్త కనకదాసు స్ఫూర్తితోనే మాజీ సీఎం వైయస్ జగన్ సైతం కులదురహంకారంపై పోరాడి తన పాలన ద్వారా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచారు. కులాల మధ్య అంతరాలు తొలగించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించారు. పార్టీ, ప్రభుత్వంలో ఉన్నత పదవులు కల్పించి ముందుకు నడిపించారు.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు శ్రీ భక్త కనకదాసు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచారు. పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ఆదేశాలతో శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడైన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించడం జరుగుతోంది. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటుతో పాటు భవన నిర్మాణం చేయాలని కురుబ సోదరులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ దృష్టికి తీసుకెళతానని హామీ ఇస్తున్నాను. భక్త కనకదాసు స్ఫూర్తితో మాజీ సీఎం వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల ఉన్నతికి ఎంతగానో కృషిచేశారు. రాజకీయంగా అవకాశాలు కల్పించి అండగా నిలిచారు. రానున్న రోజుల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. -
భక్త కనకదాసకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భక్త కనకదాస జయంతి నిర్వహించారు. కనకదాస చిత్ర పటానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కుము-కురబ నేత గడ్డం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త… pic.twitter.com/5y5o1f6IP7— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 -
హైకోర్టు కారుణ్యం
సాక్షి, అమరావతి: రాజధాని భూసేకరణ బాధితుల గోడును క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవీయ దృష్టితో చర్యలు చేపట్టేందుకు హైకోర్టు శ్రీకారం చుట్టిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు చెందిన ఐదు సెంట్ల భూమిని సీఆర్డీఏ అధికారులు తీసుకున్నారు. దీంతో శేషగిరమ్మ, అనారోగ్యంతో ఉన్న 70 ఏళ్ల ఆమె కూతురు వెంకాయమ్మ, మతిస్థిమితం లేని మనుమరాలు శ్యామల పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ క్రమంలో శేషగిరమ్మ కుమార్తె వెంకాయమ్మ మరణించింది. తమ నుంచి తీసుకున్న 5 సెంట్ల భూమిని తమకు ఇవ్వాలని శేషగిరమ్మ సీఆర్డీఏ అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. దీంతో శేషగిరమ్మ, ఆమె మనుమరాలు విధి లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు. తమ బాగోగులను చూసుకునేందుకు ఓ కేర్టేకర్ను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, లేని పక్షంలో తమకు కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ 90 ఏళ్ల ఆ వృద్ధురాలి సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. శేషగిరమ్మ, ఆమె మనుమరాలి బాగోగులే తమకు ప్రధానమని చెప్పిన న్యాయమూర్తి కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆ అవ్వ, మనుమరాలి సంరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, అసలు క్షేత్రస్థాయిలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా న్యాయమూర్తి శుక్రవారం తన సొంత కారులో డ్రైవర్నిచ్చి రూపేష్ అనే న్యాయవాదిని ఆ వృద్ధురాలు, ఆమె మనుమరాలు ఉంటున్న రాయపూడి గ్రామానికి పంపారు. వారి పరిస్థితిని పూర్తిగా తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఆ న్యాయవాదిని ఆదేశించారు. వారి పునరావాసం, బాగోగుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని, సీఆర్డీఏను ఆదేశించారు. చర్యలు సైతం సంతృప్తికరంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
పర్యాటకం.. పెద్దలకు ‘ఫలహారం’
సాక్షి, అమరావతి: టూరిజం అభివృద్ధి ముసుగులో విలువైన పర్యాటక భూములను పప్పుబెల్లాల మాదిరిగా టీడీపీ పెద్దల సన్నిహితులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది! అత్యంత ఖరీదైన పర్యాటక భూములతో పాటు ఇతర శాఖలకు చెందిన భూములను కూటమి సర్కారు టెండర్లు లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోంది. విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు రాష్ట్రం నలుమూలల జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న భూములను అప్పనంగా దోచిపెడుతోంది. కొండలు, కోనలు, సముద్ర తీరం, ఘాట్ ప్రాంతాల్లోని భూములను పెట్టుబడుల పేరుతో సంతర్పణ చేసేందుకు రోడ్ మ్యాప్ రూపొందించింది. హోటళ్లు, రిసార్టులు, వెల్నెస్ సెంటర్లు, వినోద పార్కుల ఏర్పాటుకు, టెండర్లు, బిడ్లతో పని లేకుండా డీపీఆర్ ఆధారంగా భూములు కట్టబెట్టి ప్రోత్సాహకాలు విడుదలకు ఏకంగా జీవో 41 విడుదల చేయడం చర్చనీయాంశమైంది. భూ కేటాయింపులపై తాజాగా యూనిఫాం ఫ్రేమ్వర్క్ విడుదలైంది. రూ.50 లక్షలకే ఖరీదైన చోట మూడు ఎకరాలా? టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) దివాళా అంచున నిలిచింది. ఏపీటీడీసీకి చెందిన ఒక్క ఆస్తిని (హోటళ్లు) కూడా మిగల్చకుండా లీజు పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోంది. ఈ క్రమంలోపర్యాటక సంస్థకు చెందిన 3,913.96 ఎకరాల భూమిని నోటిఫై చేసిన చంద్రబాబు సర్కారు.. డీపీఆర్లతో వస్తే చకచకా కేటాయింపులు చేస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు విలువను బట్టి భూములు కేటాయింపులపై మార్గదర్శకాలు విడుదల చేసి భూ పందేరానికి సిద్ధమైంది. విచిత్రం ఏమిటంటే.. 3 స్టార్ హోటల్ కడతామంటూ రూ.50 లక్షలతో ముందుకొస్తే ఏకంగా మూడు ఎకరాల వరకు భూములు కేటాయించే వెసులుబాటు కల్పించడం, అంటే ఎకరం రూ.16.60 లక్షలకే దొరుకుతోంది. నగరాల్లో ఖరీదైన చోట్ల భూములను కారుచౌకగా కట్టబెడుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అ్రల్టామెగా/మార్క్యూ ప్రాజెక్టులకు అయితే ప్రత్యేక వెసులుబాటు కల్పించి ఒక్కోదానికి ఒక్కో విధంగా భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. టెండర్లు లేకుండా..నీతి ఆయోగ్, కేంద్ర ప్రభుత్వ టెండర్ విధానాలను తోసిపుచ్చి పీపీపీ పేరుతో పర్యాటక భూములను కూటమి సర్కారు పందేరం చేస్తోంది. ఖరీదైన భూములను దక్కించుకున్న అనంతరం ప్రాజెక్టు ముందుకు సాగకున్నా సంబంధిత సంస్థపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లోకి అధికార యంత్రాంగాన్ని నెట్టేసింది. భూమిని తిరిగి స్వాదీనం చేసుకోవాలంటే మధ్యవర్తిత్వం, న్యాయ పోరాటమే శరణ్యం! అదే టెండర్ల వ్యవస్థ ఉంటే పారదర్శకతకు పెద్దపీట, తప్పులు చేస్తే జరిమానా విధించే అవకాశం ఉంటుంది. పైగా భూమి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. లాటరీ పద్ధతిలో విలువైన భూములు పంచిపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ భూములపై పెట్టుబడిదారులు రుణాలు తీసుకుంటే బ్యాంకులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం గమనార్హం. నచ్చినవారికి పందేరం.. టెండర్లు లేకుండా కేవలం డీపీఆర్ ఆధారంగా పర్యాటక ప్రాజెక్టులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్రాంతంలో హోటల్/రిసార్టుల నిర్మాణానికి ఎక్కువ మంది ముందుకొస్తే సంస్థ బ్రాండింగ్, పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా కేటాయిస్తామని చెబుతోంది. కాగితాలపై అధిక పెట్టుబడులు చూపిస్తూ మాయాజాలానికి తెర తీశారని, ఇదంతా టీడీపీ పెద్దల సన్నిహితులకు లబ్ధి చేకూర్చే ఎత్తుగడగా నిర్మాణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. దేశంలో సిమెంట్, ఇనుము, ఇటుక లాంటి వాటి రేట్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ నిర్మాణ ఖర్చులు ఎక్కువగా చూపించి భారీ ప్రాజెక్టు చేపట్టినట్లు మభ్యపుచ్చే యత్నమని పేర్కొంటున్నారు. ఆతిథ్య రంగంలో ఎలాంటి అనుభవం లేని సంస్థలకు కన్సార్షియం ముసుగులో చంద్రబాబు సర్కారు భూముల పందేరానికి తెర తీసిందని స్పష్టం చేస్తున్నారు. -
నిధులు మళ్లిస్తే పోల‘వరం’ ఎప్పుడు?
సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కాకుండా సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అడ్వాన్సుగా రూ.5052.71 కోట్లు విడుదల చేసింది. కానీ.. ఆ నిధులను ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తే గడువులోగా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?’ అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ అతుల్ జైన్ నిలదీశారు. నేటికీ ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయని రూ.1,077.47 కోట్లను తక్షణమే జమ చేయాలని ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనంటూ, ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్లోని పీపీఏ కార్యాలయంలో శుక్రవారం సీఈవో అతుల్ జైన్ అధ్యక్షతన పీపీఏ 17వ సమావేశం జరిగింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ (డీ వాల్) పనులు నిర్దేశించిన లక్ష్యం కంటే ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. డీ వాల్ పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోందన్నారు. దీనిపై సీఈవో అతుల్ జైన్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో డీ వాల్ పనులు మార్చి నాటికే పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. విదేశీ నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రధాన డ్యాం గ్యాప్–1 నిర్మాణ పనుల్లో ప్రాథమిక పనులు చేస్తున్నామని.. గ్యాప్–2లో డీ వాల్ పూర్తయిన చోట్ల ప్రధాన డ్యాం ప్రాథమిక పనులు చేస్తున్నామని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి వివరించారు. ఎడమ కాలువ పనులు.. కుడి, ఎడమ కాలువ అనుసంధానం పనులు కొలిక్కి వస్తున్నాయన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పీపీఏకు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 14,371 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామని.. ఇంకా 23,689 కుటుంబాలకు కల్పించాల్సి ఉందని ఆర్ఆర్ కమిషనర్ ప్రశాంతి వివరించారు. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదా? » 2024 నుంచి ఇప్పటి వరకు పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయక పోవడంపై పీపీఏ సీఈవో అతుల్ జైన్ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో ఇళ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల టెండర్లు రద్దు చేసి.. కొత్తగా ఇటీవల టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించామని, 2027 డిసెంబర్లోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేస్తామని ఆర్ఆర్ కమిషనర్ ప్రశాంతి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పీపీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరగాల్సిన ఒప్పందం(ఎంవోయూ)పై తక్షణమే ఆమోదించాలని కోరారు. » పీపీఏ కార్యాలయాన్ని ఒకే దశలో రాజమహేంద్రవరానికి తరలించాలని.. తద్వారా ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి గౌరవ్ ఆదేశించారు. » బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తెలంగాణలోని భూ భాగం ముంపునకు గురయ్యే విషయమై సంయుక్త సర్వే చేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కోరారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తున్న నేపథ్యంలో ముంపు సమస్య ఉత్పన్నం కాదని పీపీఏ సీఈవో అతుల్ జైన్ స్పష్టం చేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా, అది అంతర్రాష్ట్ర వివాదమని.. దానిపై మరో వేదికలో చర్చించాలని సూచించారు. » పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 2023–24, 2024–25 వ్యయంపై ఆడిట్ చేస్తున్నారని.. పూర్తవ్వగానే నివేదిక అందజేస్తామని ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నావిగేషన్ టన్నెల్ను క్లాస్–3 ప్రమాణాలతో పూర్తి చేయడానికి నిధులు కేంద్రం ఇస్తుందా? లేక ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ) ఇస్తుందా? చెప్పాలని కోరారు. ఈ అంశంపై ఐడబ్ల్యూఏఐతో సమావేశం నిర్వహించి స్పష్టత ఇస్తామని పీపీఏ సీఈవో అతుల్ జైన్ తెలిపారు. -
అప్పుల్లో బాబే నంబర్వన్
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ అప్పులు చేసింది. మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారే ఎక్కువ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల బడ్జెట్ కీలక సూచికలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం వెల్లడించింది. దీనిప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబరు మధ్య నెలకు రూ.10 వేల కోట్లకు పైగా ఆరు నెలల్లో రూ.63,052 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో రుణాలు తీసుకోకపోవడం గమనార్హం. అయినా సంపద సృష్టిలో మాత్రం బాబు పాలన తిరోగమనంలో సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ హయాంలో వచ్చినదాని కంటేఇప్పుడు రెవెన్యూ రాబడులు పడిపోయాయి. » కూటమి సారథిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ప్రతి నెల అమ్మకం పన్ను రాబడి తగ్గుతూనే ఉంది. వైఎస్ జగన్ పాలనలో వచ్చినదాని కన్నా పడిపోతోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇది ఆర్థిక వెనుకబాటే...అమ్మకం పన్ను తగ్గడం అంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోంది అని స్పష్టం. సాధారణంగా ఏటా, ప్రతి నెలా రాబడులు పెరుగుతాయి తప్ప తగ్గడం ఉండదు. అందుకు భిన్నంగా చంద్రబాబు పాలనలో రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి.» 2023–24లో తొలి ఆరు నెలల్లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన రెవెన్యూ రాబడుల కంటే 2025–26లో బాబు హయాంలో 8.4 శాతం పడిపోయాయి. రూ.7,903.96 కోట్లు తగ్గిపోయాయి. అమ్మకం పన్ను రాబడులు రూ.517.55 కోట్లు తగ్గిపోయాయి. అంటే 5.52 శాతం క్షీణించాయి. అంటే, రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని తేటతెల్లం అవుతోంది. అప్పుల వృద్ధి... సంపద శూన్యంఅమ్మకం పన్ను సహా అంతకు రెండేళ్ల ముందు వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా రాకుండా క్షీణించడం అంటే చంద్రబాబు అస్తవ్యస్త, అసమర్థ పాలనకు నిదర్శనం అని ఆర్థిక నిపుణులు తేల్చిచెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి.» వైఎస్ జగన్ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో వచ్చిన కేంద్ర గ్రాంట్లతో పోలిస్తే 2025–26లో 81.12 శాతం మేర తగ్గిపోయాయి. గ్రాంట్లు ఏకంగా రూ.17,255 కోట్లు తగ్గిపోయాయి. » మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బడ్జెట్ వ్యయం సైతం తిరోగమనంలో ఉంది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరు కన్నా 2025–26లో 3.4 శాతం తగ్గింది. » సాధారణంగా ఏటా బడ్జెట్ వ్యయం పెరగాలి తప్ప తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.» విజన్ డాక్యుమెంట్లు, జీఎస్డీపీ, సంపద సృష్టి అంటూ గొప్పలుపోతూ ఏడాదిన్నరగా బాబు చేస్తున్న పాలనకు... బడ్జెట్ రాబడులు, వ్యయాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. » రాష్ట్రం పురోగమించకపోగా తిరోగమనంలోకి వెళ్తోందని బడ్జెట్ కీలక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నప్పటికీ అవన్నీ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో లేదని కాగ్ గణాంకాలే తేల్చాయి.ఈ రంగాలకు చేసే ఖర్చు సామాజిక రంగం కిందకు వస్తుంది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరుతో పోల్చితే 2025–26లో సామాజిక రంగ వ్యయం 11.10 శాతం తగ్గింది. అంటే వైఎస్ జగన్ పాలనలో చేసిన వ్యయం కంటే సామాజిక రంగంపై బాబు సర్కారు చేసింది చాలా తక్కువని కాగ్ గణాంకాలు నిరూపించాయి. మూలధన వ్యయమూ అంతంతే..! ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే బడ్జెట్లో రూ.63,052 కోట్లు అప్పు చేయడం ద్వారా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కన్నా బాబు సర్కారు ఎక్కువ వృద్ధి నమోదు చేసింది. అయినా, మూలధన వ్యయం అంతంతమాత్రంగానే ఉంది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరు మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం కన్నా 2025–26లో బాబు సర్కారు చేసిన మూలధన వ్యయం 29.38 శాతం తక్కువ కావడం గమనార్హం. ఇన్ని అప్పులు చేసినా బాబు సర్కారు మూలధన వ్యయం కేవలం రూ.11,715.09 కోట్లే అని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.‘అప్పు’డంతా ప్రగల్భాలే.. ఇప్పుడంతా లోటే..!చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయాలంటూ ఎన్నికలకు ముందు బాబు పదేపదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. రెవెన్యూ లోటును రూ.33,185 కోట్లకు పరిమితం చేస్తామని బడ్జెట్లో పేర్కొంది చంద్రబాబు సర్కారు. కానీ, ఆర్థిక సంవత్సరం ఇంకో ఆరు నెలలు ఉండగానే అంతకుమించి రెవెన్యూ లోటులోకి తీసుకెళ్లింది. ఇప్పటికే రెవెన్యూ లోటు రూ.46,652.41 కోట్లకు చేరింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబరు మధ్య వచ్చిన రెవెన్యూ రాబడులు రాకుండా తగ్గిపోవడంతోపాటు బడ్జెట్ వ్యయమూ తగ్గిపోయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతోందని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
తాత్కాలిక శు‘భ్రమేనా’..!
సాక్షి, అమరావతి: విజయవాడ సామాజిక న్యాయ మహాశిల్పం అంబేడ్కర్ ప్రాంగణంలో సర్కారు పారిశుద్ధ్య పనులు చేపట్టింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మహాశయుని మహాశిల్పంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆది నుంచి వివక్ష, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ‘‘అంబేడ్కర్పైనా కూటమి కక్ష!’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించడంతో సర్కారు తీరుపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చిన సర్కారు శుక్రవారం ప్రాంగణంలో హడావుడిగా పారిశుద్ధ్య పనులు చేపట్టింది. వాటర్ ఫౌంటెయిన్లలో పేరుకుపోయిన పసరు నీటిని తొలగించింది. వాటిని మళ్లీ మంచినీటితో నింపాల్సి ఉంది. ప్రాంగణం మొత్తం పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రంచేయించింది. ఈ చర్యలపై దళిత, గిరిజన సంఘాలు గళమెత్తాయి. కేవలం తాత్కాలిక కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా స్ఫూర్తిదాయకమైన ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిని ప్రైవేట్పరం చేయకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాయి. సామాజిక న్యాయ మహాశిల్పం పరిరక్షణకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ‘చలో అంబేడ్కర్ విగ్రహం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి సర్కారు దృష్టిపెట్టాలి. ఈ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. – అండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజా సంఘాలపై టీడీపీ బురదజల్లడం సరికాదు సామాజిక న్యాయ మహాశిల్పం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్న ప్రజా సంఘాలు, అంబేడ్కరిస్టులపై టీడీపీలోని కొందరు ఎస్సీ నాయకులు బురదచల్లే తీరు సరికాదు. అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. – శ్వేతా బుడమూరి, సమతా సైనిక దళ్ మహిళా అధ్యక్షులు -
పోలీసులు చిత్రహింసలు పెట్టారు
విజయవాడ లీగల్/పెనమలూరు (కృష్ణా జిల్లా): ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. జీపులో తిప్పుతూ, స్టేషన్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు’’ అని ఎన్ఆర్ఐ మాలేపాటి విజయభాస్కరరెడ్డి శుక్రవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ సివిల్ జడ్జి రాధిక ఎదుట వాపోయారు. బల్ల మీద పడుకోబెట్టి ఛాతీపై గట్టిగా నొక్కిపట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారని... ఎస్పీనో, డీఎస్పీనో రావడంతో తన ముఖానికి ముసుగేసి, బూతులు తిడుతూ అరికాళ్లు, చేతులు, తలమీద గట్టిగా కొట్టారని తెలిపారు. బాధతో బిగ్గరగా కేకలు వేస్తున్నా జాలి చూపలేదని, స్టేషన్లోని అందరినీ బయటకు పంపి, ఏం చేశావో చెప్పమని అడిగారని, జరిగినది చెప్పినా, మేం చెప్పినట్లు నువ్వు వినాలని బెదిరించారని, ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబసభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్థుడు భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన పెనమలూరు పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈయన లండన్లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. శుక్రవారం కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. పోలీసులు తనను కొడుతున్న సమయంలో బాధతో అరిచిఅరిచి గొంతు పోయిందని తెలిపారు. విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని, కోర్టుకు రావడానికి ముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారని, పోలీసులు కొట్టారని డాక్టర్కు చెప్పినా పట్టించుకోలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. కాగా, కోర్టులో విజయభాస్కర్ రెడ్డి తరపున న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, కొప్పుల శివరామ్, ఆదాము వాదనలు వినిపించారు. ఆయనపై నమోదైన కేసులన్నీ ఏడేళ్ల లోపు శిక్ష పడేవి అని, కేసులో ఇరికించేందుకే బీఎన్ఎస్ 111 సెక్షన్ చేర్చారని వాదించారు. దీనిప్రకారం పదేళ్లలోపు రెండుసార్లు చార్జిïÙటు నమోదై ఉండాలన్నారు. ఆ సెక్షన్.. పిటిషనర్కు వర్తించదని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. పిటిషనర్ ఆరోగ్యం క్షీణించిందని, తక్షణం ఏదైనా ప్రైవేటు ఆసుపత్రిలోగానీ, ఎయిమ్స్లో గానీ వైద్యానికి అనుమతించాలని కోరారు. కాగా భాస్కరరెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. సీఐలు జె.వెంకటరమణ, శివప్రసాద్, ఎస్ఐ రమేష్ కు కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భాస్కరరెడ్డికి స్పెషలిస్ట్ వైద్యులతో పరీక్షలు చేయించాలని, ఆ సమయంలో ఫొటోలు తీయాలని, నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. -
ఆక్సిజన్ కాదు.. ఆల్కహాల్ కారణమట..!
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయినిగా పేరు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి కూడా వైద్య సేవల కోసం వచ్చే కీలకమైన ఆస్పత్రి. ఇంతటి కీలక ఆస్పత్రి దాదాపు సగం రోజు అంధకారంలో చిక్కుకుంది. ఇదే సమయంలో దేవి అనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆక్సిజన్ అందకపోవడం వల్లే మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. అయితే మహిళ మృతి చెందింది ఆక్సిజన్ అందక కాదనీ.. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ జరిగి.. గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ ఒత్తిళ్లతో ‘పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు’ కేజీహెచ్ అధికారులు ఆల్కహాల్ నాటకానికి తెరతీసారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరస్పర విరుద్ధ ప్రకటనలు మహిళ మృతిపై కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి పూర్తి భిన్నమైన ప్రకటనలు వెలువడ్డం గమనార్హం. ‘‘ మధ్యాహ్నం ఉక్కిరిబిక్కిరిగా ఉందని చెప్పింది. ముమ్మాటికీ ఆక్సిజన్ అందకే దేవి మృతిచెందింది’’అని దేవి సోదరి పేర్కొన్నారు. అయితే ‘‘దేవి అనే మహిళ.. 6వ తేదీ తెల్లవారు ఝామున 2.45 గంటలకు జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులతో అడ్మిట్ అయ్యారు. ఆక్సిజన్ లెవెల్స్ 93–97శాతం ఉన్నాయి. బీపీ కూడా బాగానే ఉంది. పల్స్ ఎక్కువగా కొట్టుకుంటోంది. ఆమెని సాధారణ వార్డులోనే చికిత్స అందించారు. ఆమె ఆల్కహాల్కు అడిక్ట్ అయినట్లు గుర్తించాం. గురువారం మధ్యాహ్నం లివర్ సామర్థ్యం దెబ్బతినడం, లివర్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ఉన్నట్లు అల్ట్రా సౌండ్ రిపోర్టులో గుర్తించాం. రాత్రి సడెన్గా గుండెపోటు వచ్చి మృతి చెందింది. ఆమె చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవటం అనేది కారణమే కాదు’’ అని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పేర్కొన్నారు. అరవద్దంటూ బెదిరింపులు దేవి ఉదయం చేరినప్పుడే.. ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నాయని వైద్యులు గుర్తించి.. ఆక్సిజన్ అందించినట్లు బంధువులు చెబుతున్నారు. కానీ.. ఆమె మృతి చెందిన తర్వాత.. కేజీహెచ్ సిబ్బంది మాత్రం.. ‘అబ్బే ఆమెకు అసలు ఆక్సిజన్ పెట్టనేలేదు’అంటూ బుకాయించేస్తున్నారు. ఈ విషయంపై రోగి బంధువులు నిలదీసినప్పుడు.. అరవొద్దంటూ వారిపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఒకే రోజు అన్ని పరీక్షలు చేసేశారా.? కేజీహెచ్కు ఎమర్జెన్సీ కేసు వచి్చనప్పుడు మాత్రమే కీలక పరీక్షలు నిర్వహించి రిపోర్టులను వేగవంతంగా వచ్చే ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ దేవి అడ్మిట్ అయ్యింది.. జ్వరం, వాంతులు, ఒళ్లునొప్పులతోనే. అందుకే.. వైద్యులు సాధారణ వార్డుకి రిఫర్ చేశారు. ఈ పరిస్థితుల్లో పేషెంట్కు అ్రల్టాసౌండ్, ఇతర రక్త పరీక్షలు చేసినా.. రిపోర్టులు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయానికి వస్తాయి. కానీ దేవికి మాత్రం వెంటవెంటనే ఎలా వచ్చేశాయి.? ఇవన్నీ మృతి చెందిన తర్వాత సృష్టించినవని బంధువులు విమర్శిస్తున్నారు. -
మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాలా!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులో ఇన్నాళ్లూ భేతాళ విక్రమార్క కథలు చూశాం! సాక్షుల వాంగ్మూలం పేరుతో సిట్ ద్వారా టీడీపీ పెద్దలు ఆడిస్తున్న నాటకాలు తాజాగా బట్టబయలయ్యాయి! హైకోర్టులో వేసిన పిటిషన్తో ఈ విషయం మరోసారి తేలిపోయింది. తాము చెప్పని విషయాలతో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద విచారణ సంస్థ తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ కేసులో సాక్షులు పెనకా శరత్ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెనకా రోహిత్రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. తాము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వారిద్దరూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తాము ఏ వాంగ్మూలాలైతే ఇచ్చామని సీఐడీ చెబుతోందో... వాటిని తాము స్వచ్ఛందంగా ఇవ్వనేలేదని వారు తమ పిటిషన్లో స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను వారు చెప్పిన విషయాలను చెప్పినట్లుగా నమోదు చేయాల్సి ఉంటుందని.. అలాగే వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నా, అలాంటిదేమీ చేయలేదని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించారు. నిష్పాక్షిక దర్యాప్తు అన్నది రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగమన్నారు. దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, దర్యాప్తు నిష్పాక్షికతను పరిరక్షించేందుకు కోర్టు తనకు స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చునని నివేదించారు. మేం చెప్పింది వేరు.. వాంగ్మూలాల్లో ఉన్నది వేరు...మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్ అధికారులు గత నెల 13న హైదరాబాద్ వచ్చి సీఆర్పీసీ సెక్షన్ 161 కింద తమ వాంగ్మూలాలను నమోదు చేశారని పిటిషన్లో తెలిపారు. ల్యాప్టాప్లో తమ వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు ఈ ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తామని, తెలిసిన విషయాలన్నీ చెబుతామని ఆ అధికారులకు చెప్పామన్నారు. ఆ తరువాత తమకు తెలిసిన విషయాలు వారికి చెప్పామన్నారు. రెండు గంటల పాటు వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, వాటిని ఓసారి చదువుకోవాలని ల్యాప్టాప్ తమకు ఇచ్చారని, అందులో ఉన్న వివరాలన్నీ సరైనవేన్నారు. ఇదిలా ఉంటే, గత నెల 16న సోషల్ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ ఓ రిపోర్ట్ విస్తృతంగా సర్కూలేట్ అయిందని తెలిపారు. ఆ తరువాత సిట్ అధికారులు నమోదు చేసిన వాంగ్మూలం కాపీని తీసుకుని పరిశీలించామని, విçస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన విషయాలో ఆ వాంగ్మూలాల్లో ఉన్నాయని శరత్ చంద్రారెడ్డి, రోహిత్రెడ్డి తమ పిటిషన్లో వెల్లడించారు. ఇవి తాము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావని స్పష్టం చేశారు. విచారణ అర్హత ఉంది.. సుప్రీం తీర్పులున్నాయి.. శరత్ చంద్రారెడ్డి, రోహిత్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. వ్యాజ్యం విచారణకు రాగానే పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మయాంక్ జైన్ ఈ కేసు గురించి వివరిస్తుండగా.. సీఐడీ, సిట్ తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని, దీనిపైనే మొదట వాదనలు వినిపిస్తామన్నారు. దీనిపై మయాంక్ జైన్ ప్రతిస్పందిస్తూ.. విచారణ అర్హత ఉందని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీ, సిట్ని ఆదేశించారు. నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ మద్యం విధానంపై అక్రమ కేసులో సాక్షులుగా మారాలని దర్యాప్తు సంస్థ ‘సిట్’ ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తెస్తూ.. అందుకు ఒప్పుకోకపోతే వారి కుటుంబ సభ్యులనూ టీడీపీ పెద్దలు వేధించారు. సిట్ ద్వారా ఓ కట్టుకథ అల్లేసి.. సోదాల పేరుతో ఏమార్చే కుట్రలకు దిగారు. వాస్తవాలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా.. కోర్టులపై గౌరవం లేకుండా లెక్కలేనితనంతో వ్యవహరించారు. కేసు విచారణ పేరుతో తమకు నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ టీడీపీ పెద్దల కుట్రలకు తలొగ్గారు! అసలు తాను చెప్పని అంశాలను వాంగ్మూలం పేరుతో రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారంటూ ఈ అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి గతంలోనే న్యాయస్థానానికే మొరపెట్టుకోగా.. ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సిట్ ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ పెద్దల కనుసన్నల్లో పచ్చ కుట్రలు, కట్టు కథలు ఎలా అల్లారో ఒకసారి పరిశీలిద్దాం..దర్యాప్తు పేరిట వేధింపులు, బెదిరింపులువాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, అనూషలపై ఒత్తిడిమద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తులో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్లను బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే సిట్ ఆధారంగా చేసుకుంది. అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరిస్తూ, సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డిప్యుటేషన్ ముగిసినా కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వకుండా, రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించింది. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ వెంటనే రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. సత్యప్రసాద్ ఎన్నో ఏళ్లుగా మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా వైద్య నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వ్యక్తితో ఇప్పించిన వాంగ్మూలం ఆధారంగా సిట్ అక్రమ కేసును దర్యాప్తు చేస్తుండటం విస్మయపరుస్తోంది. రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుతంత్రం..!అసలు ఈ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. అసలు విషయం ఏమిటంటే.. రాజ్ కేసిరెడ్డి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి కావడం గమనార్హం. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఆయన సన్నిహితుడు కూడా. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగానే.. అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి.. కేశినేని చిన్ని భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్టŠస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ కూడా అన్నది బహిరంగ రహస్యమే! అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీయడం తెలిసిందే. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. దీంతో ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. డిస్టిలరీల ప్రతినిధులకు వేధింపులు..అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని టీడీపీ పెద్దలు డిస్టిలరీల ప్రతినిధులను వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.11 కోట్ల జప్తు డ్రామారాజ్ కేసిరెడ్డి కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకున్నామని సిట్ మరో కట్టుకథ అల్లింది. అయితే ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్ కుట్రకథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్ నంబర్ల ఆధారంగా ఎప్పుడు? ఏ బ్యాంకుల నుంచి విత్డ్రా చేశారు? ఆర్బీఐ ద్వారా దీనిపై విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్ తోకముడిచింది. వెంకటేష్ నాయుడుకు ప్రలోభాలుఅబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని టీడీపీ పెద్దలు రియల్టర్ వెంకటేశ్ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే వెంకటేశ్నాయుడును అరెస్టు చేశారు. ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఓ వీడియోను సెల్ఫోన్ నుంచి రిట్రీవ్ చేశామంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. ఎన్నికల ఖర్చు కోసం ఆ డబ్బు వినియోగించారని దుష్ప్రచారానికి తెర తీశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వద్ద గతంలో గన్మెన్గా పని చేసిన గిరి, మదన్రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనకు ప్రమోషన్ కల్పించి మరీ జీతం పెంచారు. అందుకు సమ్మతించని మదన్రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మిథున్రెడ్డిపై నిరాధార అభియోగాలు..మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ పెద్దలు యత్నించారు. గత ప్రభుత్వంలో మిథున్రెడ్డి ఎంపీగా మాత్రమే ఉండగా.. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేకపోవడం గమనార్హం. ఎంపీ మిథున్రెడ్డిపై నమోదు చేసిన అభియోగాలు అవాస్తవమని స్పష్టమైంది. ఆయన కంపెనీలోకి అక్రమంగా నిధులు వచ్చాయన్న సిట్ అభియోగాలు న్యాయస్థానంలో తేలిపోయాయి. మిథున్రెడ్డి తమ బ్యాంకు స్టేట్మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని, ఒక్క దానికీ ఆధారం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మిథున్రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. తప్పుల తడకగా చార్జ్షీట్లు న్యాయస్థానం సాక్షిగా సిట్ అక్రమ అరెస్టుల కుట్రలు బెడిసికొట్టాయి. సిట్ దాఖలు చేసిన మొదటి చార్జ్షీట్, అనుబంధ చార్జ్షీట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం వ్యక్తం చేసిన 21 అభ్యంతరాలపై సిట్ కనీసం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు న్యాయస్థానం డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాలతో హడావుడి భేతాళ కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాల పేరుతో హడావుడి చేస్తూ ఏదో ఒక పేరును తెరపైకి తెచ్చి సిట్ ఏమారుస్తోంది. తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఓ డాక్యుమెంట్ను వదలడం.. అందుకు ఎల్లో మీడియా తాన తందానా అంటూ బ్రేకింగ్ న్యూస్గా ప్రచారం చేస్తోంది. అక్రమ కేసును నిజమని భ్రమింప చేసే ఎత్తుగడలకు తెర తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ అనిల్రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్ యత్నించింది. ఇక ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్ అనిల్రెడ్డి మాతృమూర్తి వైఎస్ భారతి ఆ కంపెనీల్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించారు. హైదరాబాద్కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీల పేరిట సిట్ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేరవేసేందుకు సిట్ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఉండటంతో అసలు కుట్ర బట్టబయలైంది. రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయని రాజ్ కేసిరెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా భ్రమింపజేసేందుకు సిట్ అక్రమ అరెస్టులకు తెగబడింది. అప్రూవర్గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ పెద్దలు రాజ్ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. అసలు రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయడం ఈ కుట్రకు పరాకాష్ట. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్ కసిరెడ్డి నిరాకరించారని సిట్ స్వయంగా తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. దీంతో అసలు బండారం బయటపడింది. అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తోందన్నది ఆ నివేదికే బట్టబయలు చేసింది. -
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు?
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు గారూ.. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్ డైలాగులు చెబుతున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతారా.. అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరెంట్ పోతే రాత్రి 12.30 గంటల వరకు పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 12 గంటలపాటు చిన్న పిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విదారకం. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి.ఇవన్నీ మీ రొటీన్ డైలాగ్లు, డ్రామాల మధ్య మీకు కనపడక పోవడం దారుణం. రెండు వేల పడకలున్న ఆస్పత్రిలో 1,700 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రి నిర్వహించే తీరు ఇదేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా? అది కూడా 12 గంటలపాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆస్పత్రులు అంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?» మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం, పీహెచ్సీలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిపేయడం, సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం, ఆరోగ్య ఆసరా మాయం.. 108, 104ల పరిస్థితి ఘోరం. చివరకు 104, 108 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి, ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆస్పత్రులను కూడా దెబ్బతీస్తున్నారు. మేం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునికీకరించడమే కాకుండా, రెండో క్యాజువాలిటీని 24 గంటలూ సేవలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. సీఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చాం. కొత్త అల్ట్రా సౌండ్ స్కాన్, కొత్త ఎమ్మారై, మొబైల్ ఎక్సరే, ఆన్లైన్లోనే రోగి పరీక్ష ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరించాం. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్ నిర్మాణం, ఆధునిక పరికరాలు, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్లు, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్.. అందులో అత్యాధునిక పరికరాలు, ఒక్క కేజీహెచ్కే కొత్తగా 8 అంబులెన్సులు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, దీంతోపాటు వెయిటింగ్ హాల్స్ను కనీసం 200–250 మంది ఉండేలా తీర్చిదిద్దాం. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేశాం. కానీ, మీరు వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేం గొప్పగా ఆధునికీకరించినవి కూడా మీరు మెయింటెయిన్ చేయలేకపోతున్నారు. కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఏడు నెలలకు పైగా గుండె ఆపరేషన్లు ఆగిపోవడం మీ పాలనా వైఫల్యం కాదా చంద్రబాబు గారూ? ఇప్పుడు కూడా అరకొరగానే నడిపిస్తున్నారు కదా? ఆస్పత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవీ అనే మహిళ చనిపోయిందని ఆ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారూ? చివరకు నిన్న పులివెందుల టీచింగ్ ఆస్పత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫొటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దుండాలి కదా? .@ncbn గారూ…, అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని… pic.twitter.com/u0761DrSW5— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025 -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాబు సర్కార్ దిగిరావాల్సిందే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఈ నెల 12న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను విజయవంతం చేయాలన్నారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని.. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్పై ప్రతి ఒక్కరూ సీరియస్గా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.‘‘పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగుతాయి. ఇందుకు రాష్ట్ర స్థాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనిపై రేపు అన్ని జిల్లాలలో జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్లు, ఆ తర్వాత మండల స్ధాయిలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమాలు నిర్వహించాలి. పోస్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్లు నిర్వహించి మీడియాకు మన ఉద్దేశాన్ని వివరించాలి. కోటి సంతకాలు-రచ్చబండ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది...వైఎస్ జగన్ అభిప్రాయంతో ప్రజలు ఏకీభవిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో తమ వంతుగా వివిధ వర్గాల ప్రజలను కలిసి ప్రజా స్పందనను సంతకాల రూపంలో విస్తృతంగా నమోదు చేస్తున్నారు. వచ్చే వారంలో కోటి సంతకాల సేకరణపై రివ్యూ చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మన పోరాటం ఆగదు. మనతో కలిసివచ్చే పార్టీలను ఆహ్వనిద్దాం. వివిధ కుల సంఘాలు, సివిల్ సొసైటీలను భాగస్వామ్యం చేద్దాం. మరింత ఫోకస్డ్గా పనిచేద్దాం...పార్టీ కమిటీల ఏర్పాటు, డేటా డిజిటలైజేషన్పై కూడా నాయకులు సీరియస్గా దృష్టిపెట్టాలి. వైఎస్ జగన్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇంటెన్సివ్ డ్రైవ్ లాగా చేయాలి. మనం ముందుగా అనుకున్న డెడ్ లైన్కల్లా అన్ని స్థాయిలలో కమిటీల నియామకాలు పూర్తవ్వాలి. సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం తక్షణమే ఫోకస్డ్గా పని చేయాలి. మండల, గ్రామ స్థాయి కమిటీలు నిర్ణీత టైంలైన్లోపు పూర్తి చేయాలి. డేటా ప్రొఫైలింగ్ అనేది పక్కాగా జరగాలి. అందుకు అవసరమైన సాఫ్ట్వేర్ ఇప్పటికే రూపొందించాం...పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం. నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లతో సమన్వయం చేసుకోవాలి. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే సమయంలో మనం జాగ్రత్తగా పరిశీలించాలి, అలెర్ట్గా ఉండాలి. అందుకు అవసరమైన బూత్ లెవల్ ఏజెంట్లను సిద్ధం చేసుకుందాం. స్థానిక సంస్ధల ఎన్నికలు జరిగే నాటికి మనం అంతా పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనం వారి తరుపున గొంతెత్తి నినదిస్తున్నాం. డిజిటల్ మీడియా వేదికగా మన వాణిని వినిపిద్దాం. ప్రతిఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి. కమిటీల నిర్మాణానికి అవసరమైన పరిశీలకులను అవసరమైతే తక్షణం నియమించాలి. కమిటీల ఏర్పాటు ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ కమిటీలు అంతే ఉత్సాహంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు’’ అని సజ్జల వివరించారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కర్నూలు పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కర్నూలు బస్సు ప్రమాదం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సైతం పోలీసులు వచ్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి మద్యం కారణమనే విషయం అందరికీ తెలిసినా.. దీనిపై పోస్టులు పెట్టిన వారిపై ఇప్పటివరకూ కేసులు పెట్టిన పోలీసులు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఏదో రకంగా వైఎస్సార్సీపీని వేధించాలనే లక్ష్యంతో కూటమి కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు.. ఇవాళ(శుక్రవారం, నవంబర్ ) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు ఇచ్చారు.కర్నూలు బస్సు దగ్ధం కేసులో నోటీసులు జారీ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. బస్సు దగ్దానికి మద్యమే కారణమని ప్రచారం చేశారంటూ నోటీసులు ఇచ్చారు. ప్రచారం వెనుక వైఎస్సార్సీపీ ఉందంటూ కేసు పెట్టారు. ఇప్పటికే 27 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా పూడి శ్రీహరిని కూడా ఈ కేసులో కర్నూలు ఖాకీలు చేర్చారు. బాబు సర్కార్.. నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది: టీజేఆర్పోలీసుల నోటీసులపై వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పందిస్తూ.. ‘‘కర్నూలు బస్సు దగ్దానికి మద్యమే కారణం.. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ అదే విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మా పార్టీ కేంద్ర కార్యాలయానికే పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు. ప్రజలు, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం నోటీసులతో భయపెట్టాలని చూస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు.ఇలాంటి నోటీసులు, కేసులకు మేము భయపడము. కర్నూలు బస్సు దగ్దానికి కారణమైన బైకర్లు మద్యం ఎక్కడ తాగారో ప్రభుత్వం ఎందుకు చెప్పటం లేదు?. మృతుని శరీరంలో ఎంత ఆల్కాహాల్ ఉందో రిపోర్టుని ఎందుకు బయట పెట్టలేదు?. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ దొరుకుతోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ వివరాలు హోంమంత్రి ఎందుకు బయట పెట్టటం లేదు?. ఎవరి ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ దొరికాయో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. -
వందేమాతరం గీతంపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : వందేమాతరం.. భారతీయ గీతం. ఇది బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన దేశభక్తి గీతం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరణగా నిలిచిన గీతం. అయితే ఈ గీతం 150 ఏళ్ల స్పూర్తిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ‘ 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం.బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం.#VandeMataram150— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025ఇదీ చదవండి: స్థానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్తో టైఅప్ చేయడం జరిగింది.కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతే కాకుండా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి డాక్టర్లు కావాలని కలలు కనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘వల’దన్న చోటా వేట
సాక్షి, అమరావతి: చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులకు నిజంగా ఇది శుభవార్త. ఇక నుంచి సముద్ర లోతు జలాల్లోకీ నిశ్చంతగా వెళ్లి వేటాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే 200 నాటికల్ మైళ్లు (తీరం నుంచి 370 కిలోమీటర్ల) వరకు వెళ్లి వేటాడుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు లోతు జలాల్లోకి వేటకు వెళ్తే.. సముద్ర జలాల్లో తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల(22 కి.మీ.) వరకు రాష్ట్రాల పరిధిలో ఉండగా, ఆ తర్వాత 200 నాటికల్ మైళ్ల (370 కి.మీ.) వరకు ఉండే లోతు జలాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. ఈ పరిధిని దేశానికి సంబంధించిన ప్రత్యేక ఆర్ధిక మండలి (ఈఈజెడ్)గా పరిగణిస్తారు. ఆ తర్వాత అంతా అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు మత్స్యకారులు తమ రాష్ట్రాల పరిధిలో 12 నాటికల్ మైళ్ల లోపు మాత్రమే చేపలు వేట చేసుకునేందుకు అవకాశం ఉండేది. కేంద్ర పరిధిలో ఉండే జలాల్లోకి అనుమతి ఉండేది కాదు. పొరపాటున లోతు జలాల్లోకి వెళ్తే ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు సమస్యలు, మరొక వైపు అక్రమంగా లోతు జలాల్లోకి వచ్చారంటూ కోస్టు గార్డు, నేవీ నమోదు చేసే కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలతో గంగపుత్రులు ఇబ్బందిపడేవారు. సముద్ర వనరులను సద్వినియోగమే లక్ష్యంగా.. ప్రస్తుతం కాలుష్య ప్రభావంతో తీర ప్రాంతంలో మత్స్యసంపద అడుగంటిపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆశించిన స్థాయిలో వేట లభించడం లేదు. దీంతో గంగపుత్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మత్స్యకారులు వెళ్లిపోతున్నారు. వేటపైనే ఆధారపడి జీవించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈఈజెడ్ పరిధిలోని సముద్ర వనరులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పంతో కేంద్రం లోతు జలాల్లో మత్స్యకారుల వేటకు అనుమతినిచి్చంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నియమ, నిబంధనలతో కూడిన గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయం వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్య కారులు, మత్స్యకార సహకార సంఘాలకు ఎంతో తోడ్పడనుంది.స్వీయరక్షణ చర్యలు తప్పనిసరిఅయితే వేటకు వెళ్లే మత్స్యకారులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు తప్పనిసరిగా లైసెన్సు, యాక్సెస్ పాస్ కలిగి ఉండాలి. ప్రాణ రక్షణ పరికరాలు కలిగి ఉండటంతో పాటు జీపీఎస్ ట్రాన్స్పాండర్స్ అమర్చి ఉండాలి. లైసెన్సులను కనీసం మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు.ఈఈజెడ్లో చేపల వేటకు సంబంధించిన రాష్ట్రాల మధ్య సరిహద్దు, నిర్వహణా వివాదాల పరిష్కారానికి లైసెన్సులు ఉపకరిస్తాయి. లోతు జలాల్లో వేటాడే మత్స్యకారులు, సహకార సంఘాలకు కేంద్రమే ఆరి్థక, సాంకేతిక మద్దతు అందిస్తుంది. లోతు జలాల్లో ఏదైనా సమస్యలకు గురైతే.. కోస్ట్ గార్డు, నేవీ నుంచి అవసరమైన తోడ్పాటు లభిస్తుంది. కాగా విధ్వంసకర మత్స్యవేట, చిన్న చేపల వేట, అక్రమ, నిషేధించిన, నియంత్రణలో లేని నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కేంద్రం తాజా ఆదేశాల్లోహెచ్చరించింది. మత్స్యకారులకు వరంలోతు జలాల్లో వేటాడే అవకాశం కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ మత్స్యకారులు, మత్స్యకార సహకార సంఘాలకు నిజంగా ఓ వరం. మత్స్యవనరుల సుస్థిరత, జీవ వైవిధ్య పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడనుంది. సాంకేతిక పద్ధతుల్లో మత్స్య వనరులను సేకరించడం వలన మత్స్య కారులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సముద్ర మత్స్య ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ప్రొసెసింగ్, ఎగుమతికి అవకాశాలు మెరుగుపడతాయి. –రామ్శంకర్నాయక్, కమిషనర్, రాష్ట్ర మత్స్యశాఖ కేసుల బాధ ఉండదుఇప్పటివరకు సముద్రంలో 22 కిలోమీటర్లకు పైబడి లోపలికి వెళ్తే కోస్ట్ గార్డ్స్ ఆంక్షలు పెట్టేవారు. కేసులు నమోదు చేసేవారు. తీర ప్రాంతాల్లో మత్స్యసంపద సరిగా పడక డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పుడు 370 కిలోమీటర్లు లోపలికి వెళ్లే అవకాశం రావడం నిజంగా వరం. ఎక్కువ మత్స్య సంపద వేటాడే అవకాశం లభించింది. జీపీఎస్ ట్రాన్స్పాండర్స్ బిగించడం వల్ల ఎంత లోతు జలాల్లోకి వెళ్లాం, ఎక్కడ మత్స్యసంపద ఎక్కువగా ఉందో తెలుస్తుంది. – తిరుమాని బలరామ్మూర్తి, మత్స్యకారుడు, కృష్ణా జిల్లా -
టీడీపీ డైరెక్షన్లో ఖాకీల ‘డ్రగుల్బాజీ’ చిత్రం
విశాఖ సిటీ: తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో విశాఖ ఖాకీలు చూపిన కక్షపూరిత డ్రగ్స్ కథా చిత్రంలో అసలు వ్యవహారం బయటపడింది. బెంగుళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలించారన్న నెపంతో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేసిన కేసు.. ఇప్పుడు పోలీసుల మెడకు చుట్టుకునేలా ఉంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి(23)ని డ్రగ్స్ కేసులో ఇరికించినట్లు అతడి తల్లిదండ్రులు సీసీ ఫుటేజ్ ఆధారాలను బయటపెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాలు.. సీసీ ఫుటేజీలు, ఇతర వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. పక్కా స్కెచ్ ప్రకారమే..? విశాఖలో డ్రగ్స్ కేసులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొండారెడ్డితోపాటు ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న మురాడ గీత్ చరణ్, తంగి హర్షవర్ధన్ నాయుడులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. కొండారెడ్డి ఆదేశాల మేరకు గీత్ చరణ్ బెంగుళూరు నుంచి 48 ఎల్ఎస్డీ బ్లాట్స్ను విశాఖకు తీసుకువచి్చనట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5.45కు రైల్వే న్యూకాలనీ సాయిబాబా మందిరంలో వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్కడ హర్షవర్ధన్నాయుడుతో కలిసి ఓలా స్కూటీపై వచ్చిన కొండారెడ్డికి గీత్ చరణ్ ఆ డ్రగ్స్ ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా టాస్్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే కొండారెడ్డి తల్లిదండ్రులు రిలీజ్ చేసిన సీసీ ఫుటేజ్ వీడియోలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఒక్కడినే పట్టుకున్నారు 2వ తేదీ ఉదయం 7.10కి మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న జయభేరి కొండారెడ్డి ఓలా స్కూటీపై సింగిల్గా వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ వెనుకే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి కొండారెడ్డిని ఆపారు. అందులో ఒక వ్యక్తి బైక్ దిగి కొండరెడ్డి చెంపపై కొట్టాడు. ఇంతలో మరో ఏడు బైక్లపై 14 మంది చేరుకున్నారు. కొండారెడ్డిని బైక్పై ఎక్కించుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. వీరు పోలీసులేనని కొండారెడ్డి తల్లిదండ్రులు చెబుతున్నారు. టీడీపీ మాధ్యమాల్లో ఉదయమే పోస్టులెలా సాధ్యం? పోలీసులు మాత్రం 2వ తేదీ సాయంత్రం 5.45కు అరెస్టు చేసినట్లు మీడియాకు వెల్లడించడంతో పాటు ఎఫ్ఐఆర్లో కూడా అలాగే నమోదు చేశారు. అతడిని సాయంత్రం అరెస్టు చేస్తే.. టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఆ రోజు ఉదయం 11.45 గంటలకే కొండారెడ్డిని అరెస్టు చేసినట్లు ఫొటోలు ప్రత్యక్షమవడం విశేషం. వైఎస్సార్ సీపీ నాయకులతో కొండారెడ్డి కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. మద్దిలపాలెం నుంచి తీసుకెళ్లి..! ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్దిలపాలెంలో సింగిల్గా వెళుతున్న కొండారెడ్డిని కొట్టి తీసుకువెళ్లినట్లు కెమెరాలో స్పష్టంగా ఉంది. పోలీసులు మాత్రం ఆ రోజు సాయంత్రం 5.45కు ఫోర్త్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే న్యూకాలనీ వద్ద స్నేహితులిద్దరితో కలిసి ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో చూపించారు. జీపీఎస్తో గుట్టు రట్టు..! కొండారెడ్డి ఓలా స్కూటీకి జీపీఎస్ ఉంది. మద్దిలపాలెంలో అతడిని పట్టుకున్న తర్వాత స్కూటీని టాస్్కఫోర్స్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి స్టేషన్కు 3.1 కిలోమీటర్లు ప్రయాణించినట్లు రికార్డు అయింది. కానీ సాయంత్రానికి 14.3 కిలోమీటర్లు ప్రయాణించినట్లు ఉంది. రైల్వే న్యూకాలనీలో అరెస్టు చేసినట్లు చూపించాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఆ స్కూటీని అక్కడికి తీసుకువెళ్లినట్లు అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న కారణంగానే రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వం, పోలీసులు తన కుమారుడు కొండారెడ్డిపై డ్రగ్స్ కేసు నమోదు చేసినట్లు అతడి తండ్రి సూర్యనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. -
పత్తి కొనుగోళ్లపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమల్లోకి తెచి్చన కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లుల యజమానులకు రుచించడం లేదు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు సీసీఐ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించే పద్ధతి గత సంవత్సరం వరకు సాగింది. రాష్ట్రంలో గత సంవత్సరం వానాకాలం సీజన్లో 25 లక్షల మంది రైతులు సుమారు 43 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తే, సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తి 21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని విక్రయించిన రైతులు 9 లక్షల మంది మాత్రమే.రైతుల ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్లను ముందుగానే తీసుకొని తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు.. అదే పత్తిని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులకు మద్దతు ధరకు విక్రయించే ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విభాగం దీనిని గుర్తించి, ఈ దందాలో భాగమైన సీసీఐ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతు స్వయంగా మిల్లుకు వెళ్లి మద్దతు ధరకు పత్తిని విక్రయించేలా సీసీఐ నిబంధనలు విధించింది. ప్రతి రైతు ‘కపాస్ కిసాన్’అనే యాప్లో తన వివరాలను నమోదుచేసుకొని, దాని ద్వారానే లావాదేవీలు సాగించాలని ఆదేశించింది. ఈ యాప్ను రైతులు వినియోగించలేరని దళారులు, మిల్లర్లు భావించినప్పటికీ, ఇప్పటికే 23 వేల మంది రైతులు యాప్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు అందుకే... దళారులు మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, రైతుల పాస్పుస్తకాలు, ఆధార్ కార్డుల ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని సీసీఐ నోటిఫైడ్ సెంటర్లలో విక్రయించేవారు. ఒక రైతుకు ఐదెకరాల భూమి ఉంటే అందులో రెండెకరాల్లో పత్తి సాగు చేసినా, ఐదెకరాల్లో పత్తి సాగైనట్లు చూపి మాయ చేసేవారు. దీన్ని నివారించేందుకు సీసీఐ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇచి్చన అంచనాల మేరకు రాష్ట్రంలో కూడా సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుందని తేల్చారు. ఈ మేరకు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వానికి సీసీఐ తెలిపింది. ఈ నిర్ణయం మిల్లర్లకు అశనిపాతంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మిల్లుల్లోనే విక్రయాలు రాష్ట్రంలో గతంలో పత్తి కొనుగోళ్లలో అనేక వింతలు చోటుచే సుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆదిలాబాద్కు చెందిన రైతు కొత్తగూడెం, వరంగల్లో పత్తిని విక్రయించినట్లు జిన్నింగ్ మిల్లర్లు ఆధార్, పట్టా పాస్పుస్తకాలతో మాయజాలం చేశారు. దీంతో ఈసారి ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని విక్రయించాలని సీసీఐ నిబంధన విధించింది. కొత్త జిల్లాల వారీగా ఈ విక్రయాలు జరగాలని తొలుత సీసీఐ నిర్ణయించగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజ్ఞప్తి మేరకు ఆ పరిధిని ఉమ్మడి జిల్లాకు పెంచారు. దీంతోపాటే అన్ని మిల్లుల్లో ఏకకాలంలో కొనుగోళ్లు జరపకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కింద ఒక్కో జిల్లాలో మిల్లులను 10 నుంచి 12 కేటగిరీలుగా విభజించారు.రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులు ఆయా జిల్లాల్లో సీసీఐ ఎల్–1గా ఎంపిక చేసిన మిల్లులకే తొలుత పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఎల్–1 మిల్లుల సామర్థ్యం పూర్తయిన తరువాతే ఎల్–2కి, ఆ తరువాత ఎల్–3కి అలా ఎల్–12 వరకు మిల్లులను విభజించారు. రాష్ట్రంలో ఉన్న 322 మిల్లుల్లో ఇప్పటివరకు తెరుచుకున్నవి 220 కాగా, ఇందులో ఎల్–1 కింద ఎంపికైన మిల్లులు 117 మాత్రమే. రాష్ట్రంలో ఏ మిల్లులోనైనా పత్తిని దూది, గింజలుగా వేరు చేసేందుకు సీసీఐ చెల్లిస్తున్న మొత్తం ఒక బేల్కు రూ.1,440 అని, 322 మిల్లులు ఇదే ధరతో మిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ విభజన ఎందుకని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, పారదర్శకత కోసమే ఈ విభజన అని సీసీఐ చెపుతోంది. మిల్లర్లను సముదాయించిన మంత్రి తుమ్మల సీసీఐ నిబంధనలతో మిల్లులను నడపలేమని యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. గురువారం నుంచే నిరవధికంగా అన్ని మిల్లులను మూసివేస్తామని సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి ప్రకటించగా, బుధవారం రాత్రి వరకు సంఘం నాయకులతో మంత్రి తుమ్మల, మార్కెటింగ్ అధికారులు చర్చలు జరిపి ఆంక్షలను ఎత్తివేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ వాయిదా పడింది. కాగా, సీసీఐ నిబంధనలతో ఆదాయంపై దెబ్బ పడిందని భావిస్తున్న మిల్లర్లు త్వరలోనే మరోసారి అలి్టమేటం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇండిచిప్.. ఇది మరో ఉర్సా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో ఉర్సా తరహా పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందా? సొంత కార్యాలయం కూడా లేని ఉర్సా లాంటి కంపెనీకి విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూమి కట్టబెట్టడానికి ప్రయత్నించిన కూటమి సర్కారు, ఇప్పుడు అదే తరహాలో ఇండిచిప్ సెమికండక్టర్స్ అనే అతి తక్కువ మూలధనం కలిగిన కంపెనీ భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలపడానికి సిద్ధమయ్యింది. 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేవలం కోటి రూపాయల మూలధనం కలిగిన ఇండిచిప్ సెమికండక్టర్స్ రాష్ట్రంలోని ఓర్వకల్లులో ఏకంగా రూ.22,976 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ల తయారీ యూనిట్ పెట్టడానికి ముందుకు వచి్చంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ అధ్యక్షతన సమావేశమైన పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఆమోదం తెలపడమే కాకుండా అనేక రాయితీలను ప్రకటించింది. ఎకరం భూమి కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కట్టబెట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ ప్రతిపాదనకు శుక్రవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమయ్యే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలపనుంది. తరువాత 10వ తేదీన జరగబోయే మంత్రివర్గ సమావేశం కూడా దీనికి ఆమోదముద్ర వేయనుంది. భాగస్వామ్య కంపెనీ మూలధనమూ అరకొరే..! జపాన్కు చెందిన ఇతో మైక్రో టెక్నాలజీతో కలిసి ఈ యూనిట్ను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఇండిచిప్ ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్స్ తయారీ రంగంలో ఉన్న ఇతి మైక్రో కంపెనీ పలు దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, ఆర్థికంగా భారీ కంపెనీ ఏమీ కాదు. షెన్ఝనోస్టాక్ మార్కెట్లో ఇతో మైక్రో టెక్నాలజీస్ నమోదైంది. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ మన భారతీయ కరెన్సీలో కేవలం రూ.249 కోట్లని జపాన్కు చెందిన ఈఎన్–ఏఎంబీఐ డాట్ కామ్లో ఫైలింగ్స్ను పరిశీలిస్తే అర్థమవుతోంది. కేవలం కోటి రూపాయలతో ఏర్పాటైన ఇండిచిప్ కేవలం రూ.249 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఇతో మైక్రో టెక్నాలజీస్తో కలిపి ఏకంగా రూ.22,976 కోట్ల విలువైన పెట్టుబడులను ఎలా సమకూర్చుకుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటువంటి కంపెనీకి వందల కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయిస్తారన్న అంశంపై చర్చ జరుగుతోంది. అందులోనూ కేంద్ర ప్రభుత్వ నిక్డిక్ట్ (ఎన్ఐసీడీఐటీ) నిధులతో అభివృద్ధి అవుతున్న ఓర్వకల్లు పారిశ్రామిక వాడ ప్రాంతంలో ఈ భూములను ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన ‘అడుగులు’! » ఇండిచిప్ ఒప్పందం పూర్తిగా పరిశీలిస్తే పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. » 2024 డిసెంబర్ నెలలో కొంతమంది వ్యక్తులు కూటమి సర్కారులో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితో సమావేశమయ్యారు. » తర్వాత జనవరి 2, 2025న నొయిడా కేంద్రంగా ఇండిచిప్ సెమికండక్టర్స్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. » కేవలం కోటి రూపాయల మూలధనంతో కాన్పూరు ఆర్వోసీలో ఈ కంపెనీ నమోదైనట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు వెల్లడిస్తున్నాయి. » ఇలా ఏర్పాటైన 10 రోజుల్లోనే అంటే ఈ ఏడాది జనవరి 12న మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్ సమక్షంలో రాష్ట్రంలో రూ.14,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెడుతున్నట్లుగా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. » ఇది జరిగిన 10 నెలలకే ఇప్పుడు ఈ ప్రతిపాదనను దాదాపు 9 వేల కోట్లు పెంచేసి ఏకంగా రూ.22,976 కోట్లకు చేర్చడం గమనార్హం. » నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్లో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్ డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. సందీప్ గార్గ్ 2024లో రెండు కంపెనీలు, 2025లో రెండు కంపెనీల్లో డైరెక్టర్లుగా చేరారు. హృషికేష్ దాస్ ఈ ఏడాది జూలై 31న అడిషనల్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. » వీరెవ్వరికి సెమికండక్టర్స్ తయారీ రంగంలో అనుభవం లేకపోవడం గమనించాల్సిన అంశం. గతంలో నెక్ట్స్ ఆర్బిట్.. ఇప్పుడు ఇండిచిప్ గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భారీ సెమీకండక్టర్ యూనిట్ వస్తోందని తెగ ప్రచారం చేశారు. నెక్ట్స్ ఆర్బిట్ అనే సంస్థ రూ.50,000 కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని, తద్వారా 1.10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని 2017లో చంద్రబాబు నాయుడు తెగ ఊదరగొట్టారు. అబుదాబీకి చెందిన నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ అప్పట్లోనే రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెడుతోందంటూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదిరాక ఆయన మూడేళ్లు అధికారంలో ఉన్నా.. కార్యాచరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా చంద్రబాబు అదే ధోరణిని కొనసాగిస్తున్నారు. ప్రజలకు గత పెట్టుబడుల ప్రకటనలు ఏవీ గుర్తుండవని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి.. అబుదాబి నెక్ట్స్ ఆర్బిట్ స్థానంలో ఇప్పుడు జపాన్ భాగస్వామ్యంతో ఇండిచిప్ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. -
మన ఖాతాలో వేసేద్దాం..
సాక్షి, అమరావతి: ఏమార్చి.. పేరు మార్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మ ఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకూ అదే తీరు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా పేరు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పులు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిదే. దేశ చరిత్రలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకే నోటిపికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. సచివాలయ వ్యవస్థపై దేశ వ్యాప్త ప్రశంసలుకరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు చేదోడువాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏకంగా వలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని.. వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగి పోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత మోంథా తుపానును గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ.. ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు.‘అమ్మ ఒడి’ విషయంలోనూ అంతే.. » తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించే సమయంలో అది మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిందంటూ గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికే పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులే ఎలుగెత్తిచాటారు. » వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేసిన పథకాల పేర్లు మార్చారు. మరి కొన్ని రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషి వల్ల విశాఖపట్నంలో గూగుల్తో కలిసి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ నడుం బిగించింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ తన వల్లే విశాఖకు వచ్చి ందంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించి, ఏడు కాలేజీలను అప్పట్లోనే పూర్తి చేశారు. తరగతులు కూడా ప్రాంభమయ్యాయి. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగిస్తూ అదే తన ఘనతగా చెప్పుకుంటుండటం కొసమెరుపు. -
ఎస్ఆర్ఎంలో 300 మంది విద్యార్థులకు అస్వస్థత
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో గురువారం పలు శాఖల అధికారులు తనిఖీలు చేశారు. యూనివర్శిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణ కమిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో తెనాలి సబ్ కలెక్టర్, ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆహార తనిఖీ అధికారి, పౌర సరఫరాల అధికారులను నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో అధికారులు తనిఖీలు చేశారు. క్యాంటీన్లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా తెలిపారు. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారం రోజుల నుంచి రోజుకు 50 మంది అస్వస్థతకు గురవుతున్నారని, పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇద్దరు విద్యార్థులు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆరుగురితో కమిటీ ఈ సందర్భంగా మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మీడియాతో మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై వాస్తవాలను నిర్ధారించి చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా కలెక్టర్ ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఘటనకు కారణమేమిటన్నది ఖచి్చతంగా తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి వలన సమస్య తలెత్తిందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆహారం వండేందుకు వినియోగిస్తున్న నీరు, తాగునీరు శాంపిల్స్ను ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా యూనివర్శిటీకి మెమో జారీ చేస్తామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, నివేదిక ఆధారంగా యూనివర్శిటీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్ఆర్ఎం వర్శిటీకి సెలవులు ఇదిలా ఉంటే ఎస్ఆర్ఎం యూనివర్శిటీకి ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు యూనివర్శిటీ రిజిస్ట్రార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యూనివర్శిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల పలువురు అనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని యూనివర్శిటీ అంతటా శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మెస్తోపాటు వంట గదులు, హాస్టల్ మొత్తం శుభ్రం చేస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండు వారాలపాటు సెలవులు ఇచి్చనట్టు వెల్లడించారు. -
గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారుస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇకపై ఇవి విజన్ యూనిట్లుగా పని చేస్తాయని అన్నారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రులు, శాఖల ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరైనా కొన్ని శాఖలు ప్రజలు సంతృప్తి చెందేలా పని చేయడం లేదని అన్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. ఆర్టీసీలో పారిశుద్ధ్యంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ సేవల్లో ప్రజల్లో సంతృప్తి పెరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. వచ్చే నెల రెండో వారం నాటికి ఏ శాఖ పని తీరు ఎలా ఉందో పరీక్షిస్తామన్నారు. డేటా ఆధారిత రియల్ టైమ్ పాలన ప్రతి ఒక్కరూ క్రియాశీలకంగా పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్ర పౌరులందరి డేటా క్రోడీకరించామని, ప్రతి కుటుంబం యూనిట్గా గృహాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. డేటా ఆధారిత రియల్ టైమ్ పాలన ఉంటుందని, ఫైళ్లు వేగంగా క్లియర్ చేయాలన్నారు. రూల్స్ ప్రకారం జీవోలు ఇవ్వక పోవడం వల్లే న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను వదిలేస్తున్నామని, కాశీబుగ్గ ఆలయానికి అంత మంది భక్తులు వస్తే తెలియక పోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆలయాలు, పరిశ్రమలు, రవాణా.. ఎక్కడా ఎస్వోపీలను పాటించడం లేదన్నారు. -
నిర్లక్ష్య డ్రైవింగ్కు ఏఐ బ్రేకులు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాలతో దేశంలో ఏటా 1.6లక్షల మంది దుర్మరణం చెందుతున్నారు. అందులో 80 శాతం ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలే ప్రధాన కారణం. అందుకే నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేసేవారిపై కొరడా ఝుళిపించేందుకు కేంద్ర రవాణా శాఖ సిద్ధమవుతోంది. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికతతో కట్టడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణ లోపాలకు బాధ్యులైన కాంట్రాక్టు సంస్థలపై కూడా కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ రహదారి భద్రత ప్రణాళిక–2030ను కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు యూకే, సింగపూర్ దేశాల్లో అమలు చేస్తున్న డ్రైవర్ల బిహేవియర్ డేటా ట్రాకింగ్ వ్యవస్థను మన దేశంలో ప్రవేశపెడతామని తెలిపింది. ఇందుకనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ రహదారి భద్రత ప్రణాళికలో కొన్ని ముఖ్యాంశాలు... » నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసేవారికి కేవలం జరిమానాలు విధించడంతో సరిపెట్టకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పదేపదే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అలవాటుగా మారిన వాళ్లకు ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ అనే కేటగిరీ కింద చేర్చాలని ఆదేశించింది. అందుకోసం పోలీసు, రవాణా, అటవీ, ఎన్హెచ్ఏఐ తదితర విభాగాలు రహదారులపై నెలకొల్పే సీసీ కెమెరాల ఫుటేజీలు, ఈ–చలానా డేటాను అధ్యయనం చేస్తారు.» ‘డేంజరస్ డ్రైవింగ్ బిహేవియర్’ కేటగిరీలో చేర్చినవారు మానసిక నిపుణులు, ఇతర నిపుణుల వద్ద కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. అయినా సరే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కొనసాగించినట్టు నిర్ధారణ అయితే వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తారు. ఈ డ్రైవర్ల ప్రొఫైళ్లను వ్యక్తిగత బీమా, వాహన బీమా సంస్థల డేటాతో అనుసంధానిస్తారు. » రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణ లోపాలే కారణమని నిర్ధారణ అయితే సంబంధిత కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రమాదాలపై దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు ఉంటాయి.» డ్రైవర్ల ప్రొఫైల్స్ను రూపొందించి వారి డాటా ట్రాకింగ్ విధానాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 2026లో మొదలు పెడతారు. 2030నాటికి దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర రవాణాశాఖ నిర్ణయించింది. -
ప్రజాధనంతో బాబు, లోకేశ్ షికార్లు
సాక్షి, అమరావతి: ‘మోంథా తుపానుతో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్లకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి షికార్లు చేశారు. దీనిపై విమర్శలు రావడంతో డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు కథనాలను వండి వార్చుతున్నారు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.మోంథా తుపానుతో 8 మంది చనిపోయారని, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవలేదన్నారు. తండ్రీ కొడుకుల టూర్లపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో గ్రీవెన్స్ డ్రామా మొదలు పెట్టారని.. లోకేశ్ 4 గంటల్లోనే 4 వేల అర్జీలను పరిశీలించారంటూ జాకీలెత్తి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ‘అసలు అన్ని అర్జీలు పరిశీలించడం సాధ్యమా? ఇద్దరూ అతిపెద్ద ఈవెంట్ మేనేజర్లుగా మారి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు. పాలనను గాలికొదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రజాధనంతో చంద్రబాబు 75 సార్లు, లోకేశ్ 80 సార్లు హైదారాబాద్కు స్పెషల్ ఫ్లైట్లలో తిరిగారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 120 సార్లకు పైగానే వెళ్లారని అన్నారు. -
యువతే లీడర్: వైఎస్ జగన్
ఇది సోషల్ మీడియా యుగం.. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే.. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది.. వారెలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది.. ఆ ప్రభుత్వం.. మీరు సిట్ అంటే సిట్! స్టాండ్ అంటే స్టాండ్! దటీజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయాయి. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘భావితరానికి మీరే దిక్సూచి.. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువతేనని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోవైఎస్ జగన్ ఏమన్నారంటే.. తులసి మొక్కల్లా ఎదగాలి.. ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. భావి తరానికి దిక్సూచీ కాబోతున్నారు. బహుశా ఒకటి, రెండు టరమ్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. మీరంతా సోషల్ మీడియాను అత్యధికంగా అనుసరించేవారు, దాన్ని నడిపించేవారు, 90 కి.మీ. వేగంతో ప్రయాణించే మనసు ఉన్నవారే! రాజకీయాలు ఎలా ఉండాలంటే.. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా, యువతరం మనవైపు చూసేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్, గుణాలు కనిపించినప్పుడే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం. సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు.. విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు ముందుకు వేస్తే.. దేశాలలో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే.. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అంత శక్తిసామర్థ్యాలు ఉన్నవారు యువకులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.. ఏం జరుగుతోంది..? అనేది మనమంతా చూడాల్సి ఉంది. రాష్ట్రం బాగుండాలని అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక యువకుడు గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ మనస్సాక్షినే అడగండి. ఏదైనా రాత్రికి రాత్రే జరగదు. ఒక నాయకుడు ప్రణాళికాబద్ధంగా ఒక అడుగు వేస్తే.. ఆ విత్తనం చెట్టుగా కావడానికి, విజన్ ట్రాన్స్లేట్ కావడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు. ఇదే మాదిరిగా ఉంటాం. మనం లీడర్లుగా కాబోతున్నప్పుడు.. అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మన మనసులో మెదలాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మరి విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? గత 18 నెలలుగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? అనే తేడాను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మన హయాంలోనే ఆ అడుగులు.. యువకులుగా మన పాత్ర కీలకమన్నది గుర్తు పెట్టుకోవాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసీచూడనట్లు వదిలేశామంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన హయాంలోనే అని గర్వంగా చెప్పగలను. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి? వారు భావితరంతో పోటీపడి నిలబడటమే కాకుండా విజయం సాధించాలనే ఆలోచన చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఆ ఆలోచన చేయగలిగిన వాడే.. లీడర్ విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడూ వారి గురించి ఆలోచన చేయడు. కానీ వారే రేప్పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిన వారు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అవుతారు. అలాంటి అడుగులు పడింది వైఎస్సార్సీపీ హయాంలోనే అని గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదట అడుగులు.. ఇంగ్లిష్ మీడియం వైపు పడ్డాయి. ఎవరైనా నారాయణ.. శ్రీచైతన్య.. వంటి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్లాలి? మన గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు అలా లేవు? అవి ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూళ్లే.. గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు పేదవాడి జీవితం బాగు పడుతుందని భావించి మొట్టమొదటి విత్తనం అక్కడ నుంచి పడింది. అందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. 3వ తరగతి నుంచే ఒక పీరియడ్గా టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పిల్లవాడి చేతికి పుస్తకాలతోపాటు తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాం. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ల కంటే గొప్పగా అడుగులు వేయించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈనే కాదు.. ఏకంగా ఐబీని కూడా తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పరిచయం చేశాం. జెనీవా నుంచి ఐబీ టీమ్ వచ్చి మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. 2025లో ఫస్ట్ క్లాస్.. 2026లో సెకండ్ క్లాస్.. 2027లో థర్డ్ క్లాస్.. ఇలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఐబీలో రాసే విధంగా జెనీవా నుంచి వచ్చిన ఐబీ బృందం మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. ఎందుకివన్నీ జరిగాయంటే.. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు ఇవ్వగలిగితే ఆంధ్రా కాదు.. ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు.. మన పిల్లల చదువులు అక్కడి నుంచి మొదలవుతున్నాయా? లేదా? అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే విద్యా వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాం. ఉన్నత విద్యలో విప్లవం.. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడుతో శ్రీకారం చుట్టి.. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించాం. 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాం. ఈ మార్పులను ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాం. తొలిసారిగా ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మన చదువుల్లో లేనిది ఏమిటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏమిటి? అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడున్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు? డిగ్రీ అనేది ఇక్కడ నామ్కేవాస్తే చదువుగా ఎందుకు ఉంది? అక్కడి డిగ్రీకి విలువ ఎందుకు ఉంది? అనే విషయంపై అసెస్ చేసి ఎడెక్స్ను తీసుకొచ్చాం. ప్రముఖ ‘ఐవీ లీగ్’ కాలేజీలు, స్టాన్ఫర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద యూనివర్సీటీల డిగ్రీలను మన కోర్సులో భాగం చేస్తూ.. సర్టిఫికెట్లు కూడా వారి దగ్గరి నుంచే వచ్చే విధంగా.. క్రెడిట్లు కూడా వారే ఇచ్చేలా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలను ఆన్లైన్ కరికులమ్లో భాగం చేశాం. డిగ్రీలో నాణ్యతను పెంపొందిస్తూ తొలిసారి తప్పనిసరి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.16,800 కోట్లు ఇచ్చాం.. కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మెరుగుపరుస్తూ ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రిజి్రస్టేషన్ చేయించాం. మనం అధికారంలోకి రాకముందు 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజి్రస్టేషన్ ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437కి తీసుకెళ్లాం. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదని, అప్పులపాలు కాకూడదని తాపత్రయపడుతూ మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పథకం కిందనే రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే దానికి సంబంధించిన ఫీజులు క్రమం తప్పకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు రెండు విడతల్లో ఇచ్చాం. ఏటా రూ.1,100 కోట్లు ఏప్రిల్లో ఇచ్చేలా అడుగులు పడ్డాయి. ఒక్క వసతి దీవెన కింద మొత్తం రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఇలా పిల్లలు గొప్ప చదువులు చదవాలని భావిస్తూ ఉన్నత విద్యా రంగంలో విద్యాదీవెన, వసతి దీవెన కింద రెండు పథకాల కోసం ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దీనివల్ల పేద, మధ్య విద్యార్థులు ఎవరూ ఫీజులు కట్టలేక చదువులు మానేయాల్సిన పరిస్థితులు రాకుండా అడుగులు పడ్డాయి. 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలిచంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. తటస్థులను కూడా కూడగట్టి నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు షాక్ తిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే స్థాయిలో నిర్వహించాలి. డిసెంబరులో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి. 18 నెలలుగా అంతా తిరోగమనం..ఈ రోజు ఏం జరుగుతోంది? గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఉన్నత విద్యా రంగం పరిస్థితి చూస్తే.. పిల్లలు బాగా చదివితే వాళ్లెక్కడ గొప్పవారు అవుతారనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సెపె్టంబరు చివరి వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే! గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దాన్ని ఆపించాడు. ఎన్నికల తరువాతైనా చంద్రబాబు ఇవ్వాలి కదా? అక్కడి నుంచి ఫీజులకు బ్రేక్ పడింది. ఇప్పటికి ఏడు త్రైమాసికాలు. డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. ఏకంగా దాదాపు రూ.4,900 కోట్లు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లలో రూ.2,200 కోట్లు బకాయి పెట్టారు. రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్సార్సీపీ నాయకత్వం తీసుకోకపోతే చదువులు మానేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అంటే . మీ అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో ఎంతమంది చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గుతున్నారు. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం. స్వయం ఉపాధికి ప్రోత్సాహం..నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లో (స్వయం ఉపాధి రంగం) వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశగానే ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టై అప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికిపైగా మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వ్యవసాయం దండగ కాదు.. పండగరాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి వ్యవసాయం దండగ అనే మాటలు వస్తే.. మేం పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్న ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించాం. రైతులకు ఏ విపత్తు, ఆపద వచ్చినా వెంటనే ఆదుకున్నాం. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు మాత్రమే ఉంటే, కోవిడ్ ఉన్నప్పటికీ మన హయాంలో మరో 4 కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం. అందులో మూడు ప్రభుత్వ రంగంలోనివే. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టు మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి. నాడే అదానీ డేటా సెంటర్..మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ హయాంలోనే లేఖ కూడా రాశాం. అవన్నీ జరిగాయి, మనం చేశాం కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్ వస్తోంది. విశాఖ అభివృద్ధికి అడుగులు వేశాం కాబట్టే గూగుల్ వస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందుకోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. విత్తనం వేయకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మేం ఎన్ని ఉద్యోగాలిచ్చామో మీ లెక్కలే చెబుతున్నాయి..వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన కళ్లెదుటే కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం. దేశంలో 61 శాతం స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత ఉంటే, మన హయాంలో ఏపీలో అది కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అలా 17 వేల మందిని నియమించాం. పాఠశాల విద్యలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వలంటీర్లు. ఆప్కాస్లో మరో లక్ష మంది, 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లో, రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు కల్పించాం. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగాం. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చి భరోసా కల్పించి నిలబెట్టాం. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలది చాలా కీలక పాత్ర. వీటిలో పెట్టుబడి తక్కువే అయినా ఉద్యోగాలు ఎక్కువ. అదే పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించగలిగాం. ఇవి మనం చెప్పే లెక్కలు కాదు. వాళ్లు తయారు చేసుకున్న సామాజిక సర్వే నివేదికలో చూపించిన లెక్కలే ఇవన్నీ! మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం..చంద్రబాబు చేస్తున్న మరో దారుణమైన పని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందో ఆలోచన చేశారా? ప్రభుత్వం వాటిని నిర్వహించకుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పేదలు దోపిడీకి గురవుతారు. దీనికి చెక్ పడాలంటే ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే స్థానికంగా సూపర్ స్పెషాలిటీ సేవలు టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా అందుబాటులోకి వస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మెడికోస్, నర్సింగ్ విద్యార్థులు వీరంతా అక్కడే పని చేస్తారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేరువలో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తాయో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగిపోతుంది. 50 కి.మీ. లోపే పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పేదలకు, మధ్య తరగతికి ఒకవైపు మంచి చేస్తూ మరోవైపు ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లుగా మారి మన ప్రాంతంలోనే సేవలు కూడా అందిస్తారు. మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో తరగతులు కూడా మొదలై మూడు బ్యాచ్లు జరిగాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని అడ్డుపడి చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు అవసరం. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1,000 కోట్లు మాత్రమే వెచ్చించాలి. కానీ ఆ మనిíÙకి మనసు రాదు.. అది కూడా ఖర్చు చేయకుండా ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. ఆయన పెట్టపోతే పోయే..! మేం వచ్చిన తరువాత చేసుకుంటాం. కానీ ఇలా స్కామ్లు చేస్తూ అమ్మడం ఏమిటి? ఈ స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిని నిలదీయడం యువత నుంచే మొదలు కావాలి!! ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
సాక్షి, విజయవాడ: గ్రామ సచివాలయాల పేరు మార్పుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. క్రెడిట్ చోరీ కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ ఆవిష్కరించిన వ్యవస్థ పేరు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజన్ యూనిట్గా మారుస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.వైఎస్ జగన్ విజన్ని తన విజన్గా పేరు మార్పు చేయడానికి చంద్రబాబు నిర్ణయించారు. గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకు పాలన తెచ్చిన వైఎస్ జగన్.. దేశంలో ఎక్కడాలేని అద్భుత వ్యవస్థను తీసుకువచ్చారు. పారదర్శకమైన పాలన అందించేందుకు సచివాలయ వ్యవస్థను తెచ్చారు.లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగులను వైఎస్ జగన్ నియమించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల్లో వైఎస్ జగన్ చెరగని ముద్ర వేశారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థకి చంద్రబాబు.. పేరు మార్పుకు నిర్ణయించారు. వైఎస్ జగన్ క్రెడిట్ని చోరీ కోసం సీఎం చంద్రబాబు తంటాలు పడుతున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్ -
SRM వర్సిటీలో ఫుడ్ పాయిజన్తో 300మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి,గుంటూరు: SRM యూనివర్సిటీలో సబ్ కలెక్టర్తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీ క్యాంటిన్లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు.ఈ సందర్భంగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ.. SRM యూనివర్సిటీలో దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల నుంచి సుమారు రోజుకి 50 మంది అస్వస్థకు గురి అవుతున్నారువాంతులు, విరోచనాలు, డయేరియాతో బాధపడుతున్నారు. ఎక్కువమంది కలుషిత ఆహారం తినడం వల్ల తమ అస్వస్థకు గురయ్యామని చెప్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలో క్యాంటీన్ పరిశీలించాం. ఫుడ్ శాంపిల్స్ ,వాటర్ శాంపిల్స్ సేకరించాం. ఇద్దరు విద్యార్థులు ఎన్నారై హాస్పటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. -
నాలుగు బోధనాస్పత్రుల్లో అత్యాధునిక పరికరాలు ఔట్!
సాక్షి, అమరావతి: కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను పచ్చ గద్దలకు దోచిపెట్టేందుకు పీపీపీని తెరపైకి తెచ్చిన టీడీపీ పెద్దలు ఏకంగా బోధనాస్పత్రుల నిర్వీర్యానికి ఒడిగట్టారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని బోధనాస్పత్రుల్లో వైద్య పరికరాలను తొలగించి పేదల ఉన్నత వైద్యానికి ఉరి బిగించేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా నాలుగు చోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 350 పడకల సామర్థ్యంతో బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దారు. అన్ని ఆస్పత్రుల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను నియమించి వైద్య సేవలను బలోపేతం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు చేరువలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్న సమయంలో చంద్రబాబు గద్దెనెక్కడంతో అంతా తలకిందులు అయింది. కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలని కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయం పేదల ఆరోగ్య భద్రతకు గొడ్డలిపెట్టులా మారింది. ఆధునిక పరికరాలన్నీ తొలగింపు2024–25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా వైఎస్సార్సీపీ హయాంలో సిద్ధమైన పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ గతేడాదే 50 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుని లేఖలు రాసి రద్దు చేయించింది. అంతేకాకుండా పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని బోధనాస్పత్రుల నిర్వీర్యానికి అడుగులు వేసింది. ఈ క్రమంలో తొలుత ఆయా ఆస్పత్రుల్లోని అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను ప్రభుత్వం పాత జీజీహెచ్లకు సర్దుబాటు చేసింది. దీంతో ఒక్కసారిగా వైద్య సేవలు పతనం అయ్యాయి. పది ప్రభుత్వ కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించిన కూటమి సర్కారు తొలి విడతలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలను బలి పెడుతోంది. ఇందులో భాగంగా ఆ నాలుగు చోట్ల బోధనాస్పత్రులకు గత ప్రభుత్వం సమకూర్చిన అత్యాధునిక పరికరాలను తొలగించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా నాలుగు ఆస్పత్రుల్లో 51 రకాల అత్యాధునిక వైద్య పరికరాలు పాత జీజీహెచ్లకు తరలింపు పనులను వైద్య శాఖ ముమ్మరం చేసింది. గైనిక్, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ లాంటి స్పెషాలిటీ విభాగాల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవల కోసం బోధనాస్పత్రులకు అత్యాధునిక పరికరాలను గత ప్రభుత్వం సమకూర్చింది. కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నా లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తూ వైద్య పరికరాలను సైతం తొలగిస్తూ పేదలకు వైద్యం సేవలను మమ అనిపించడం నివ్వెరపరుస్తోంది.మదనపల్లె మెడికల్ కళాశాలకు చెందిన కంటిపరీక్షల యంత్రం టెరిషరీ కేర్ బలోపేతానికి తూట్లుప్రభుత్వ వైద్య రంగంలో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ.. మూడు లేయర్లుగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ విస్తరించి ఉంటుంది. ప్రైమరీ కేర్లో విలేజ్ క్లినిక్లు, పీహెచ్సీలు ఉంటాయి. సెకండరీ కేర్లో సీహెచ్సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రులుంటాయి. టెరిషరీ కేర్లో బోధనాస్పత్రులు సూపర్స్పెషాలిటీ ఆస్పత్రులు ఉంటాయి. తీవ్రమైన జబ్బుల బారినపడిన వారికి మెరుగైన చికిత్సలు అందించడంలో టెరిషరీ కేర్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 2019 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, వీటికి అనుబంధంగా బోధనాస్పత్రులు మాత్రమే ఉండేవి. దీంతో మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు మెరుగైన చికిత్సల కోసం 100 నుంచి 150 కి.మీ దూరంలో ఉండే పాత జీజీహెచ్లకు వ్యయ ప్రయాసలకోర్చి చేరుకోవాల్సి వచ్చేది. అక్కడా రోగుల తాకిడి తగ్గట్టుగా పడకలు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో చికిత్సల కోసం నరకం చూడాల్సిన దుస్థితి ఉండేది. ఈ పరిస్థితులకు చెక్ పెడుతూ టెరిషరీ కేర్ బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు చేరువలో చికిత్సలు అందించడం కోసం ఏకంగా రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించారు. తద్వారా అప్పటి వరకూ జిల్లా, ఏరియా, సీహెచ్సీలున్న చోట ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో బోధనాస్పత్రి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక రచించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గుండె, మెదడు, కిడ్నీ, కాలేయ సంబంధిత జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు ఉచిత చికిత్సలు అందుబాటులోకి తెచ్చేలా వైద్యులు, ఇతర సిబ్బంది, అధునాతన పరికరాలు సమకూర్చేలా కార్యాచరణ రూపొందించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా అడుగులు వేశారు. ఆ కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టబెడుతూ టెరిషరీ కేర్కు చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. వైద్యం పేరిట కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ ఖజానా, ప్రజలను దోచుకునేందుకు పచ్చజెండా ఊపుతోంది.మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాల సామగ్రి తరలింపు మదనపల్లె రూరల్: అన్నమయ్యజిల్లా మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన సామగ్రిని బుధవారం ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని, సర్వజన బోధనాసుపత్రిగా మార్చినప్పుడు డీఎంఈ నుంచి వైద్యకళాశాలకు సామగ్రి వచ్చిందన్నారు. ప్రస్తుతం డీఎంఈ కార్యాలయ ఉత్తర్వుల మేరకు హైక్యాస్ట్ ఎక్విప్మెంట్ను ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి పంపాల్సిందిగా ఆదేశాలు రావడంతో సామగ్రిని తరలించామని తెలిపారు. -
విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్ భేటీ నేడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
నకిలీ మద్యం కేసు దర్యాప్తు... ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులిస్తూ... న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగి అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు వెసులుబాటునిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేశారు. దీనికిముందు జోగి రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. కేసును రాజకీయ కక్ష సాధింపులు, రాజకీయ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ‘‘నకిలీ మద్యం కేసులో ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదు. అందుకే సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నాం. మొదటి నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు అరెస్ట్ కాకముందు ఎన్నడూ జోగి రమేష్ గురించి మాట్లాడలేదు. పోలీస్ కస్టడీలోకి వెళ్లాక... నకిలీ మద్యం మొత్తానికి జోగి ప్రధాన సూత్రధారి అని చెబుతున్నట్లు ఓ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేశారు. ఇది బలవంతంగా తీసినట్లు కనిపిస్తోంది. దీనివెనుక జోగి రమేష్ను ఇరికించే పెద్ద కుట్ర ఉంది. జనార్దనరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత పిటిషనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు’’ అని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో స్థానిక పోలీసులు, సిట్ అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ పిటిషనర్ ఇప్పటికే అరెస్టయ్యారని, , ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. నిందితుడికి దర్యాప్తు సంస్థను ఎంచుకునే అవకాశం లేదని, ఇదే విషయాన్ని న్యాయస్థానాలు స్పష్టంగా చెప్పాయన్నారు.దర్యాప్తు పక్షపాతంతో ఉంటే సీబీఐ విచారణ కోరవచ్చు ఏజీ వాదనను పొన్నవోలు తోసిపుచ్చారు. ఏకపక్షంగా, పక్షపాతంతో, విశ్వసనీయత లేకుండా కేసును దర్యాప్తు చేస్తుంటే నిందితుడు సీబీఐకి అప్పగించాలని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని తెలిపారు. నిష్పాక్షిక దర్యాప్తు పౌరుడి ప్రాథమిక హక్కు అని, దీనికి భంగం కలుగుతుంటే తప్పనిసరిగా సీబీఐకి ఇవ్వాలని కోరవచ్చన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. -
అంబేడ్కర్ పైనా కూటమి కక్ష!
సాక్షి, అమరావతి: భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచేలా విజయవాడ నగరం నడిబొడ్డున వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం కక్ష కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 ఎకరాల్లో సుమారు రూ.297.71 కోట్లతో మహోన్నత ఆశయంతో నిర్మించిన అద్భుత ప్రాంగణం అసలు లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం రాగానే సామాజిక న్యాయ మహాశిల్పంపై వక్రదృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే స్వరాజ్ మైదానంలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం పేరు (స్టీల్ అక్షరాలు)ను తొలగించారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో దానిలో వైఎస్ జగన్ పేరు తొలగించి అంబేడ్కర్ పేరును మాత్రం మళ్లీ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఆ ప్రాంగణంలో గత ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆడిటోరియం, లైబ్రరీ తదితర నిర్మాణాలను సైతం నిలిపివేసింది. డ్వాక్రా బజార్ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేయించింది. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవడంతో నెల తర్వాత ఆ స్టాల్స్ను తొలగించింది. ప్రైవేటు పరానికి యత్నం భారత రాజ్యాంగ నిర్మాత చరిత్ర, ఆయన ఘనతను నిలువెత్తున నిలబెట్టిన సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది పోయి పీపీపీ పద్దతిలో ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిపై వైఎస్సార్సీపీ, వామపక్షాలు, దళిత, గిరిజన సంఘాలు ఈ ఏడాది జనవరిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చెత్తాచెదారాల మయం ప్రైవేటీకరణ ప్రయత్నం బెడిసికొట్టడంతో సర్కారు మరో కుయుక్తి పన్నింది. ఆ ప్రాంగణాన్ని ఎవరూ సందర్శించకుండా చేయడానికి పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. ఒకప్పుడు పచ్చటి పచ్చిక బయళ్లు, పిల్లల ఆటస్థలాలు, ఉవ్వెత్తున ఎగసే అందమైన ఫౌంటైన్లు, రంగురంగుల విద్యుద్దీపాలతో, నిత్యం వేలాది సందర్శకులతో కళకళలాడిన ఈ ప్రాంగంణం ఇప్పడు చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రాంగణంలోని వాటర్ ఫౌంటైన్లలో నీరు మార్చకపోవడంతో అవి నాచు, చెత్తతో నిండిపోయాయి. సిబ్బందికి 9 నెలలు వేతనాలు నిలిపివేత ఇక్కడ పనిచేస్తున్న 23 మంది సిబ్బందికి 9 నెలల క్రితం ప్రభుత్వం జీతాలు నిలిపివేసింది. అక్టోబరు 3 నుంచి వారు ధర్నాలు చేపట్టడంతో తొలుత ఒక నెల జీతం మాత్రమే ఇచ్చింది. మళ్లీ ఆందోళనకు దిగడంతో కొద్ది రోజుల క్రితం 6 నెలల జీతాలు చెల్లించింది. ఆందోళన చేశారనే అక్కసుతో ఇప్పుడు వారిలో కొందరిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇది మరో దారుణం అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం దేశంలోనే ఓ స్ఫూర్తిదాయక ప్రదేశం. ఇక్కడ కేవలం అంబేడ్కర్ నిలువెత్తు శిల్పమే కాదు.. అంబేడ్కర్ చరిత్రను ఆవిష్కరించారు. మహాశిల్పం పెడస్టల్ (పీఠం)లోని 3అంతస్తుల్లో అంబేడ్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ చిత్రాలు, లైబ్రరీతోపాటు ఆడిటోరియం కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిని నీరుగార్చేలా ఎవరినీ లైబ్రరీ, ఆడిటోరియం లోపలికి అనుమతించడంలేదు. సందర్శకులను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వం పథకం ప్రకారమే ఇలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలీసు అధికారులకు ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వడం లేదు
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉంచి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం విచారణ జరిపింది. గురుమూర్తి తరఫు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరిస్తారనే పేరున్న పోలీసు అధికారులను చాలాకాలంగా ప్రభుత్వం వీఆర్లో ఉంచింది. ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే ఇలా చేసింది. ఇది చట్ట విరుద్ధం. 199 మంది అధికారులకు జీతభత్యాలు అందడం లేదు. వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. పోలీసు సంస్కరణల విషయమై ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రతి రాష్ట్రం పాటించాల్సి ఉంది’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రకాశ్సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సంబంధిత పోలీసు అధికారులే కోర్టుకు వస్తారని, వారి తరఫున వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మేలని పిటిషనర్కు సూచించింది. -
రహదారి భద్రతకు ప్రమాదం
సాక్షి, అమరావతి: మన దేశంలోని రహదారులపై భద్రతకు ప్రమాదం వాటిల్లింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద రహదారి నెట్వర్క్ ఉన్న దేశం అయినా రోడ్డు భద్రతలో మాత్రం అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటిగా నిలిచింది. దేశంలో కేవలం రెండుశాతం రోడ్లు మాత్రమే జాతీయ రహదారులు కాగా.. వాటిపైనే 35 నుంచి 40 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను బట్టి చూస్తే ప్రపంచంలోని 199 దేశాల్లో మన దేశం రెండోస్థానంలో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఏటా మన దేశంలో 2.06 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో ఇది 18 శాతం. దీనివల్ల సామాజిక, ఆర్థికరంగాల్లో జరిగిన నష్టం రూ.1.47 లక్షల కోట్లని అంచనా. దేశ జీడీపీలో ఇది ఒక శాతానికి సమానం. రోడ్డు ప్రమాద మరణాలు చైనాలో అత్యధికంగా ఏడాదికి 2.48 లక్షలు ఉండగా ఆ తర్వాత స్థానంలో మన దేశం ఉంది. అమెరికాలో 48 లక్షల మంది, బ్రెజిల్లో 34 లక్షలు, బంగ్లాదేశ్లో 32 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న మరణాలకు గల కారణాల్లో రోడ్డు ప్రమాదాలు ఎనిమిదో కారణంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించింది. ఆంధ్రాలో భయానక ప్రమాదాలు మన రాష్ట్రంలోనూ రోడ్డు ప్రమాదాలు భయానకంగా ఉన్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో కొద్దిరోజుల కిందట ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృతిచెందారు. గత ఆరేళ్లలో మన రాష్ట్రంలో లక్షకుపైగా ప్రమాదాలు జరిగాయి. వాటిలో 45 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ 21, 22 స్థానాల్లో ఉన్నాయి. 2024–25లో ఈ ప్రమాదాలు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2024–25లో 24,511 ప్రమాదాలు జరగ్గా వాటిలో 10,522 మంది మరణించారు. జాతీయ రహదారులపై ఇష్టానుసారం పార్కింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెనుక నుంచి ఢీకొనడం వల్ల జరిగే ప్రమాదాలు మన రాష్ట్రంలో అత్యధికం. మానవలోపాలు, కండిషన్లో లేని వాహనాలు ఈ ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి. ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఓవర్స్పీడ్ : 70 శాతానిపైగా రోడ్డు ప్రమాదాలు ఈ కారణంతోనే జరుగుతున్నాయి » డ్రైవర్లు రూల్స్ పాటించకపోవడం, డ్రైవింగ్ నైపుణ్యాలు లేకపోవడం » మద్యం తాగి వాహనాలు నడపడం » రాంగ్ సైడ్ డ్రైవింగ్, హైవేలపై వాహనాలు నిలపడం » మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం » వాహనాల సమస్యలు: ఓవర్లోడింగ్, కండిషన్లో లేని వాహనాల వినియోగం » సేఫ్టీ డివైసెస్ లేకపోవడం: హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం » రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం, రోడ్ సేఫ్టీ ఆడిట్ చేయకపోవడం » మిక్స్డ్ ట్రాఫిక్: పెద్ద వాహనాలు, కార్లు, బైకులు, పాదచారులకు ఒకటే మార్గం కావడం » సరైన లేన్ మార్కింగ్ లేకపోవడం, మార్కింగ్ ఉన్నా లేన్ డిసిప్లిన్ పాటించకపోవడం » ట్రాఫిక్ నియమాల అమలులో తీవ్ర నిర్లక్ష్యం ఇండియా రోడ్ నెట్వర్క్ » మొత్తం రోడ్ల నిడివి 68 లక్షల కిలోమీటర్లు » జాతీయ రహదారులు: 1.45 లక్షల కిలోమీటర్లు » రాష్ట్ర రహదారులు: 1.8 లక్షల కిలోమీటర్లు » ఎక్స్ప్రెస్ వేస్: 3 వేల కిలోమీటర్లు » ట్రాఫిక్ లోడ్: ప్రపంచ రహదారుల మొత్తం పొడవులో 2 శాతం మాత్రమే మన దేశంలో ఉంది. కానీ రహదారి ట్రాఫిక్లో పదిశాతం కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటోంది. దేశంలో అత్యంత ప్రమాదకర జాతీయ రహదారులు 1 ఎన్హెచ్–44 (శ్రీనగర్–కన్యాకుమారి) 2 ఎన్హెచ్–48 (ఢిల్లీ–చెన్నై) 3 ఎన్హెచ్–16 (చెన్నై–కోల్కతా)4 ఎన్హెచ్–66 (ముంబై–కేరళ తీర రహదారి) 5 ఎన్హెచ్–19 (ఢిల్లీ–కోల్కతా, పాత గ్రాండ్ట్రంక్ రోడ్) 6 ఎన్హెచ్–65 (హైదరాబాద్–పుణె–ముంబై)రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర జాతీయ రహదారులు 1 ఎన్హెచ్–16 (చెన్నై–కోల్కతా తీర రహదారి): రాష్ట్రంలో ప్రమాదాల హాట్స్పాట్లలో నంబర్వన్. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో ప్రమాదాలు ఎక్కువ. అధిక వేగం, లారీ ట్రాఫిక్, రాత్రివేళ లైట్ సమస్యలు ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. 2 ఎన్హెచ్–44 (హైదరాబాద్–కర్నూలు–తిరుపతి): కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోంచి వెళ్లే ఈ పొడవైన రహదారిపై వేగం నియంత్రణ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 3 ఎన్హెచ్–71 (తిరుపతి–నెల్లూరు): తిరుపతి–రేణిగుంట–నెల్లూరు మార్గంలో హెవీ ట్రాఫిక్, పొడవైన స్ట్రెయిట్ రోడ్ కావడం వల్ల వేగంపై నియంత్రణ ఉండడం లేదు. 4 ఎన్హెచ్–65 (హైదరాబాద్–విజయవాడ): వాణిజ్య వాహనాల రద్దీ, చిన్న వాహనాల వేగం కలిపి ఈ మార్గాన్ని ప్రమాదకరంగా మార్చాయి. 5 ఎన్హెచ్–216 (మచిలీపట్నం–కాకినాడ–ఒంగోలు): వర్షాకాలంలో గుంతలతో నిండిపోతుంది. రాత్రివేళ లైట్ లేకపోవడం వల్ల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి అత్యంత ప్రమాదకర రాష్ట్ర రహదారులు 1 తిరుపతి–కడప: తిరుపతి, కడప మధ్య పర్వత మార్గాలు, వంకరల రోడ్డు. మలుపుల్లో నియంత్రణ కోల్పోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2 గుంటూరు–మాచర్ల–నాగార్జునసాగర్: కొండప్రాంతాలు, మలుపులు ఎక్కువ. ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు కలిసి నడవడం వల్ల ప్రమాదాలు అధికం. 3 విజయనగరం–సాలూరు–అరకు: కొండ ప్రాంతం, పచ్చని దట్టమైన అడవుల మధ్య రహదారి. 4 ఒంగోలు–కందుకూరు–కావలి: తీరప్రాంతం కావడం వల్ల వర్షాకాలంలో రోడ్లు దెబ్బతింటున్నాయి. లారీలు, బస్సులు వేగంగా నడవడం ప్రమాదాలకు కారణం. -
బాబు ‘ప్రైవేట్’ జపం.. వైద్య విద్యార్థులకు శాపం
గుంటూరులో ఉంటున్న కోటేశ్వరరావు ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన కుమారుడు అశ్వర్థ్ నీట్ యూజీృ2025లో 484 మార్కులు సాధించాడు. ఈ ఏడాది పేపర్ సరళిని బట్టి మంచి స్కోర్ సాధించాడని, కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు వస్తుందని అశ్వర్థ్ తల్లిదండ్రులు భావించారు. రెండో విడత కౌన్సెలింగ్లో ఓపెన్ కేటగిరీలో 491 స్కోర్ వరకు కన్వీనర్ సీటు వచ్చింది. ఏడు మార్కుల తేడాతో అశ్వర్థ్ కన్వీనర్ కోటా సీటు కోల్పోయాడు. గుంటూరుకే చెందిన అశ్వర్థ్ స్నేహితుడు ధీరజ్ నీట్లో 475 స్కోర్ చేయగా 16 మార్కుల తేడాతో కన్వీనర్ కోటా సీటు చేజారింది. ‘డాక్టర్ కావాలని మా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనేవాడు. అప్పులు చేసి రూ.5 లక్షలు ఖర్చు పెట్టి విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివించా. అక్కడే నీట్ కోచింగ్ తీసుకుని రేయింబవళ్లు కష్టపడి చదివాడు. మంచి మార్కులొచ్చినా మావాడికి కన్వీనర్ కోటా సీటు రాలేదు. ఈ ప్రభుత్వం కనీసం ఒక్క వైద్య కళాశాలను ప్రారంభించినా మావాడికి కచ్చితంగా కన్వీనర్ సీటులో వచ్చేది. ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రారంభించకపోవడంతో అన్యాయం జరిగింది..’ అని అశ్వర్థ్ తండ్రి కోటేశ్వరరావు ఆవేదన చెందుతున్నారు. దేశ చరిత్రలో ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మెడికల్ కాలేజీలను తమకొద్దని చెప్పి చంద్రబాబు చరిత్రకెక్కారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతివైద్య విద్య కలలు ఛిద్రం..ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం రాష్ట్రంలో అశ్వర్థ్, ధీరజ్ లాంటి వేల మంది విద్యార్థులకు టీడీపీ కూటమి సర్కారు ద్రోహం తలపెడుతోంది. మన విద్యార్థుల వైద్య విద్య కలలను ఛిద్రం చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నాలుగు, ఈ దఫా ఏడు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ ఒక్క విద్యాసంవత్సరమే ఏకంగా 1,750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. బాగా చదివి నీట్లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూటమి సర్కారు నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. అదే తెలంగాణలో.. గతేడాది ఎనిమిది, ఈదఫా ఒకటి చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్లు మరిన్ని పెరిగాయి. తద్వారా తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరుగుపడ్డాయి. రెండో విడత కౌన్సెలింగ్ ముగిసే సమయానికి తెలంగాణలో ఓపెన్ కేటగిరిలో నీట్లో 406 మార్కులు స్కోర్ చేసిన విద్యార్థికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభించింది. కానీ ఏపీలో మాత్రం పోటీకి తగ్గట్టుగా మెడికల్ సీట్లు పెరగకపోవడంతో ఏయూ రీజియన్లో 491, ఎస్వీయూ పరిధిలో 479 మార్కుల వరకు మాత్రమే కన్వీనర్ సీటు దక్కింది. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కంటే 73–85 మార్కులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు దక్కకపోవడం గమనార్హం.రిజర్వేషన్ విద్యార్థులకు తీవ్ర అన్యాయంరాష్ట్ర విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు మరింతగా పెంచడంతోపాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023–24లోనే ఐదు కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం గతేడాది నాలుగు మెడికల్ కాలేజీలు (పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని) ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు. పులివెందుల వైద్యకళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ.. తమకు వద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా.. 150 సీట్లు రావాల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యాసంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో మరో 7 వైద్య కళాశాలలు (పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పిడుగురాళ్ల, పెనుగొండ, పార్వతీపురం, బాపట్ల) ప్రారంభమై 1,050 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరాల్సి ఉండగా ఒక్క వైద్యకళాశాలను కూడా చంద్రబాబు సర్కారు ప్రారంభించలేదు. ఇలా టీడీపీ కూటమి సర్కారు కక్షపూరిత విధానాలతో రెండేళ్లలో 2,450 మంది ఏపీ విద్యార్థులు వైద్యవిద్యకు దూరమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో రిజర్వేషన్ విభాగాల్లో కటాఫ్ వ్యత్యాసం 100 మార్కులు, ఆపైన ఉండటమే దీనికి నిదర్శనం. రెండోదశ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్లో తెలంగాణలో బీసీ–ఏ విభాగంలో 341 మార్కులు సాధించిన విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు దక్కడం గమనార్హం. అదే ఏపీలోని ఎస్వీయూ పరిధిలో తెలంగాణలో కంటే వందకుపైగా అదనంగా మార్కులు స్కోర్ చేసినా ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటా సీటు దక్కని దుస్థితి నెలకొంది. కొత్తవి తేకపోగా.. ఉన్నవాటికి ఎసరు..కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉన్నత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెంపొందించాలని దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సైతం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలలకు అనుమతులు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమి పార్టీలు కీలక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇంత అనుకూలమైన పరిస్థితులున్నప్పటికీ సద్వినియోగం చేసుకోకుండా మన విద్యార్థుల వైద్య విద్య కలలను చిదిమేస్తూ చంద్రబాబు సర్కారు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం పట్టుబట్టి సాధించిన వైద్య కళాశాలలను ప్రైవేట్ చేతుల్లో పెడుతుండటం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. వైద్యులై ప్రజలకు సేవలు అందించాలనుకున్న పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలను చిదిమేశారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబు ప్రభుత్వం కొత్త కాలేజీలు తేకపోగా గత సర్కారు తెచ్చిన వాటిని సైతం ప్రైవేట్పరం చేయడమేమిటని నిలదీస్తున్నారు. అదే ఈ ప్రభుత్వం అడ్డుపడకుంటే ఏపీకి అదనంగా 2,450 మెడికల్ సీట్లు సమకూరి తమ పిల్లలకు కచ్చితంగా ఎంబీబీఎస్ సీట్లు వచ్చి ఉండేవని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క కాలేజీ ఏర్పాటైనా మా పాపకు సీటొచ్చేది..మా అమ్మాయికి నీట్లో 480 మార్కులు వచ్చాయి. తాను ఏయూ రీజియన్లో లోకల్. అక్కడ 491 మార్కులకే కన్వీనర్ కోటా సీటు ఆగిపోయింది. 11 మార్కుల తేడాతో మా అమ్మాయికి కన్వీనర్ కోటా సీటు దూరమైంది. మేనేజ్మెంట్ కోటాలో చేర్చి ఎంబీబీఎస్ చదివించే స్థోమత లేదు. ఈ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీని ప్రారంభించినా మా అమ్మాయికి కచ్చితంగా సీటు వచ్చి ఉండేది. కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించకపోవడంతో మాలాంటి వాళ్లకు అన్యాయం జరుగుతోంది. – రోషిరెడ్డి, వైద్యవిద్య ఆశావహ విద్యార్థిని తండ్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇప్పటికైనా విరమించుకోవాలిరాష్ట్రం విడిపోయే నాటికి తెలంగాణలో మనకంటే తక్కువ మెడికల్ సీట్లున్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో 10 వేలకు చేరువలో ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఏపీలో మాత్రం ఏడువేల సీట్లు కూడా లేవు. సీట్లు పెరగకపోవడంతో మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన కళాశాలలను ఈ ప్రభుత్వం పీపీపీలో ప్రైవేట్కు ఇస్తోంది. ప్రైవేట్కు వైద్యకళాశాలలు అప్పగిస్తే ప్రజలు, విద్యార్థులకు నష్టమే గానీ లాభం లేదు. అన్నివర్గాల నుంచి ప్రైవేటీకరణపై వ్యతిరేకత ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించి విద్యార్థులకు మేలు చేయాలి. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
చినబాబు గ్యాంగ్కు ‘స్పాట్’ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, బూడిద, బొగ్గు టెండర్లన్నీ అక్రమాలే. వీటికితోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత విద్యుత్ సంస్థల్లో ఈ దారుణాల పరంపరలో మరో అధ్యాయం ఇది..! అన్నిటినీ చెరబట్టిన అధికార పార్టీ వారు ఇప్పుడు ‘‘స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టు’’లపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)ల్లో పాత కాంట్రాక్టర్ల కాల పరిమితి ముగియడంతో కొత్త టెండర్లు పిలవడం కూటమి నేతలకు వరంగా మారింది. ముఖ్యంగా చినబాబు, మరో మంత్రి కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ మొత్తం నడుస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ‘చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కంగుతిన్న అక్రమార్కులు వెనకడుగు వేశారు. కానీ, ఆశను వదులుకోలేక కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘సాక్షి’ కథనంలో బట్టబయలు రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి 1.95 కోట్ల విద్యుత్ సర్వీసులున్నాయి. వీటిలో 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు. మిగతావాటికి ప్రతి నెల బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులను ఇస్తుంటాయి. గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కమీషన్ నిర్ణయిస్తారు. 2023–25 నాటి రేట్లతోనే తాజాగా టెండర్లు పిలిచారు. ఒక్కో సర్వీసుకు పట్టణాల్లో రూ.6.16, గ్రామాల్లో రూ.6.36 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల పాటు ఇవే ధరలతో కాంట్రాక్టు కొనసాగనుంది. ఈ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం చినబాబు గ్యాంగ్తో పాటు మరో మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. పాతవారు కాదు... మావాళ్లకే ఇవ్వాలి ఎన్నో ఏళ్లుగా స్పాట్ బిల్లింగ్ చేస్తున్నవారిని కాదని, తాము సిఫారసు చేసినవారికే టెండర్లు ఇవ్వాలంటూ విద్యుత్ శాఖ అధికారులపై ప్రభుత్వ ముఖ్యుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం క్లాస్–1 కాంట్రాక్టర్కు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. ఈ అర్హత లేనివారూ టెండర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కొన్ని టెండర్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నిటిని గడువు ముగిశాక కూడా తెరవకుండా పెండింగ్లోనే ఉంచారు. కొత్తగా పుట్టుకొచ్చిన క్లాస్ 1 కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేసినప్పటికీ... క్లాస్–1 కాంట్రాక్టర్ గుర్తింపు విషయంలో చినబాబు, మరో మంత్రి సూచించిన వారి కోసం అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. టెండర్లు రద్దయిన తరువాత కొందరికి క్లాస్–1 కాంట్రాక్టరు రిజి్రస్టేషన్ చేశారు. నిజానికి డిస్కం పరిధిలో పనులు చేసిన వారికే ఈ గుర్తింపు పత్రం ఇవ్వాలి. కానీ, ఇతర డిస్కంలలో చేసినవారికి కూడా ఇచ్చేస్తున్నారు. గతంలో ఎక్కడా ఏ పనీ చేయనివారికి చినబాబు, మంత్రి పేషీల నుంచి ఫోన్లు చేసి ‘వాళ్లు మనవాళ్లే, ఏ సరి్టఫికెట్ అవసరం లేదు. కాంట్రాక్టు ఇచ్చేయండి. లేకపోతే ట్రాన్స్ఫర్ ఖాయం’ అంటూ అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు ఈ ఒత్తిళ్లు భరించలేక పలు జిల్లాల్లో వారు చెప్పినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ‘సాక్షి’ని దూరం పెట్టండి విద్యుత్ శాఖలో అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తెస్తూ నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షాత్తు ఇంధన శాఖ మంత్రి అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ని పిలవద్దని పేషీ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే మంత్రి కార్యక్రమాలను తెలియజేసేందుకు మీడియా సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్ల్లోనూ ‘సాక్షి’ ప్రతినిధులు ఉండకూడదని మంత్రి హుకుం జారీ చేశారు. -
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025 -
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులు ఇవ్వాల్సిన రేషన్ రెండు రోజులే ఇస్తున్నారు. వృద్ధులకు ఇంటికెళ్లి ఇవ్వాలి కానీ ఆ పరిస్థితి లేదు. రేషన్ తరలిపోతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంత్రి దృష్టి పెట్టాలి’అని డిమాండ్ చేశారు. -
శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్నచూపు
సాక్షి, అమరావతి: క్రీడాకారులలో ఉన్న ప్రతిభను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించలేదు. భారతదేశ సత్తాను చాటిచెప్పిన మహిళా క్రీడాకరిణిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వివిధ రాష్ట్రాలు.. క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో గౌరవిస్తున్నాయి. ప్రపంచ కప్లో 9 మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసిన ఏపీకి చెందిన క్రీడాకారిణి శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం కరువైంది.క్రీడాకారిణి రేణుక సింగ్ ఠాకూర్కి కోటి రూపాయలు ప్రోత్సాహకం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్కి చెందిన క్రాంతిగౌడ్కి కోటి రూపాయలు ప్రోత్సాహకాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ తరపున శ్రీచరణి ప్రతిభను గుర్తించకపోవడం పట్ల క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత మహిళా కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, ఆల్ రౌండర్ అమన్జోత్ కౌర్లకు రూ.11 లక్షలు రూపాయలు చొప్పున పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రోత్సాహకం ప్రకటించింది.శ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదు?: సతీష్రెడ్డిశ్రీచరణిని ఎందుకు అభినందించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్రెడ్డి ప్రశ్నించారు. ‘‘ముంబైలో మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చూడ్డానికి నారా లోకేశ్ వెళ్లివచ్చాడు. వారితో గతంలో నారా లోకేశ్ మాట్లాడిన ఫొటోలు, వీడియోలు ముందుపెట్టి ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వరల్డ్ కప్ గెలిచారని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇదే నిజమైతే కడప బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి రెడ్డికి ఎందుకు ప్రోత్సాహకాలు ప్రకటించలేదు?’’ అని సతీష్రెడ్డి నిలదీశారు.‘‘గతంలో క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పీవీ సింధు, హారిక, పుల్లెల గోపీచంద్ వంటి వారికి ఇళ్ల స్థలాలు, నగదు ప్రోత్సాహాలతో సత్కరించిన చంద్రబాబు, ఇప్పుడు శ్రీచరణిని ఎందుకు అభినందించలేకపోతున్నారో చెప్పాలి. వారందరికీ ఒక న్యాయం, శ్రీచరణికి ఒక న్యాయమా? దేశంలోని ఇతర రాష్ట్రాలు తమ క్రీడాకారులను సత్కరిస్తుంటే శ్రీచరణిని కనీసం అభినందించడానికి చంద్రబాబుకి మాత్రం మనసు కలగడం లేదు’’ అని సతీష్రెడ్డి మండిపడ్డారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు.. అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వంలో నవంబర్ 5వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. దీంతో ప్రభుత్వం జీతం ఎప్పుడిస్తుందా? అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటినే జీతాలు చెల్లిస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. అయినా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. చంద్రబాబు ప్రభుత్వంలో జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే, జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ ఉద్యోగులు నిరసన తెలుపుతారేమోనన్న ఉద్దేశ్యంతో నిన్న రాత్రి పోలీస్, మెడికల్,టీచర్,సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జీతాలు చెల్లించింది.ఆ జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం అప్పు చేసింది. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఆదుకోవాల్సింది పోయి.. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?: సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి మండిపడ్డారు. లోకేష్ 4 గంటల్లో 4వేల దరఖాస్తులు తీసుకున్నారని ఎల్లోమీడియా రాసింది. పబ్లిసిటీ కోసం తప్ప ప్రజలు నమ్ముతారో లేదో తెలుసుకోరా? అని దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెన్షన్ల విషయంలోనూ దారుణంగా మోసం చేశారు. 5 లక్షల మంది పెన్షన్ దారులను తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు’’ అంటూ నిలదీశారు.‘‘రైతులపై తుపాను దెబ్బ కొడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి గాలికి వదిలేశారు. చంద్రబాబు లండన్, లోకేష్ క్రికెట్ చూడటానికి వెళ్లారు. వీళ్లా ప్రభుత్వాన్ని నడిపేదీ?. గూగుల్ సెంటర్ వల్ల లక్షా 80 ఉద్యోగాలు వస్తాయని పబ్లిసిటీ ఇస్తున్నారు. నిజానికి పదివేల ఉద్యోగాలైనా తెప్పించగలరా?. ఆరోగ్యశ్రీ లేక జనం అల్లాడిపోతుంటే పట్టించుకోరా?. ఏ ఆస్పత్రిలోనూ ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. రాష్ట్రంలో రైతులు బతకటమే కష్టం అన్నట్టుగా మారింది. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు టమోట, మామిడి, ఉల్లి పంటలను రోడ్డు మీద కాలువల్లో పడేసే దుస్థితి నెలకొంది...అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. సమస్యలతో జనం ఉంటే చంద్రబాబు లండన్లో విహరిస్తారా?. లులూ మాల్ పేరుతో వందల కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేస్తారా?. అందులో పెద్ద స్కాం ఉందన్న సంగతి సాధారణ ప్రజలకు కూడా తెలుసు. వైఎస్ జగన్ 18 సార్లు ప్రెస్మీట్ పెట్టి ప్రశ్నిస్తే ఒక్క దానికీ సమాధానం చెప్పలేదు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్క జడ్పీటీసీ అయినా గెలవగలరా?. జగన్ సీటు ఇస్తే గెలిచి తర్వాత పార్టీ మారిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?..పోలీసులను అడ్డం పెట్టుకుని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి వీరుడిలాగ మాట్లాడతావా?. పోలీసులు లేకుండా ఒక్క సీటైనా గెలవగలరా?. అధికారం ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మహిళా క్రికెటర్ శ్రీచరణికి ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు?. మిగతా అన్ని రాష్ట్రాల క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు కోటి చొప్పున పారితోషికం ఇచ్చాయి. ముంబాయి వెళ్లి క్రికెట్ చూసిన లోకేష్ ఎందుకు శ్రీచరణికి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు?. నకిలీ మద్యాన్ని బయట పెట్టారనే జోగి రమేష్ ని అరెస్టు చేశారు. బెల్టు షాపులోని మద్యనే బస్సు ప్రమాదానికి కారణమన్నందుకు మా పార్టీ నేత శ్యామలాకు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఏ గ్రామానికి వచ్చినా బెల్టుషాపును చూపిస్తా’’ అంటూ సతీష్రెడ్డి సవాల్ విసిరారు. -
లోకేష్ టైం ఇవ్వలేదు.. నిరాశగా వెనుదిరిగిన కొలికపూడి
సాక్షి,అమరావతి: టీడీపీలో కొలికపూడి వర్సెస్ చిన్ని రచ్చ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి,చిన్ని హాజరయ్యారు. నివేదికను క్రమశిక్షణ కమిటీకి కొలికపూడి అందించారు. పార్టీ పదవుల అమ్మకాలపై కొలికపూడి ఫిర్యాదు చేశారు.తిరువూరు సీటు కోసం చిన్నికి ఇచ్చిన రూ.5 కోట్ల వివరాలను అందించారు. చిన్ని పీఏ అక్రమాలపై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు కొలికపూడి ప్రయత్నించారు. అందుకు లోకేష్ టైం ఇవ్వకపోవడంతో కొలికపూడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.గత నెల అక్టోబర్లో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై ఆ పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా గురువారం పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు.2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. టీడీపీలో కోవర్టులున్నారు: టీడీపీలో కోవర్టులు ఉన్నారని..ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చి పోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు.‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు.ఇలా ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కామెంట్స్తో టీడీపీలో పాలిటిక్స్ రచ్చ పీక్ స్టేజీకి చేరింది. ఈ క్రమంలో కొలికపూడి,కేశినేని చిన్న ఇద్దరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో కొలికపూడి నారాలోకేష్ను కలిసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తదుపురి భవిష్యత్ కార్యచరణపై కొలికపూడి దృష్టిసారించినట్లు తిరువూరు పొలిటికల్ సర్కిళ్ల చర్చ కొనసాగుతోంది. -
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
పంచాయతీ కార్యదర్శుల పేరు, కేడర్లో మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇకపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టును గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (జీపీడీవో)గా ప్రభుత్వం మార్పు చేసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీసుకునే వేతనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా, ప్రస్తుతం ఉన్న ఐదు కేడర్లను నాలుగు కేడర్లకు కుదించింది. జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరిస్తూ గత నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన అంశాలతో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ మంగళవారం జీవో జారీ చేశారు. తద్వారా ఇప్పటిదాక అమలులో ఉన్న 7,244 క్లస్టర్ గ్రామ పంచాయతీల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు పని చేస్తాయి.359 అర్బన్ పంచాయతీలు, 3,082 గ్రేడ్–1 పంచాయతీలు, 3,163 గ్రేడ్–2 పంచాయతీలు, 6,747 గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరణ చేశారు. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలతో ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14,989 మంది పంచాయతీ కార్యదర్శుల్లో 1,487 మంది గ్రేడ్–1.. 993 మంది గ్రేడ్–2.. 2,235 మంది గ్రేడ్–3.. 4,108 మంది గ్రేడ్–4.. 6,166 మంది గ్రేడ్–5లో పని చేస్తున్నారు.తాజా వర్గీకరణలో వీరిలో 359 మంది అర్బన్ పంచాయతీ కార్యదర్శులుగా, 3,082 మందిని గ్రేడ్–1.. 3,163 మందిని గ్రేడ్–2.. 6,747 మందిని గ్రేడ్–3.. 1,638 మందిని అడిషనల్ గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా కేడర్లో మార్పులు చేశారు. 359 అర్బన్ పంచాయతీల్లో ఉండే జీపీడీవో డిప్యూటీ ఎంపీడీవో స్థాయిలో కొనసాగడానికి సంబంధించి వేరుగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,097 మంది జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్లుగా పని చేస్తుండగా.. అందులో 359 జూనియర్ అసిస్టెంట్ కమ్ బిల్ కలెక్టర్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. ⇒ గ్రామ సచివాలయాల్లో పని చేసే మిగులు డిజిటల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో పంచాయతీ రికార్డులు, పరిపాలనా ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, వర్క్ ఫ్లో ఆటోమేషన్, రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం శాఖలో డెడికేటెడ్ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.⇒ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్స్ ద్వారా ఖర్చు భరించే స్థాయి ఉండే పంచాయతీల్లో ప్రత్యేక శానిటేషన్ విభాగం, నీటి సరఫరా విభాగం, కంట్రీ ప్లానింగ్ విభాగం, స్ట్రీట్ లైటింగ్–ఇంజనీరింగ్ విభాగంలో రెవెన్యూ విభాగం తరహా సిబ్బందిని అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ సిబ్బందిని నియమించుకోవడానికి అవకాశం కల్పించారు. ⇒ ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులుగా పనిచేసే వారు కొత్తగా డీపీవో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ తదితర క్యాడర్లో పని చేసేందుకు వీలుగా నిబంధనలు మార్పులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆయా మార్పులు చేర్పులకు సంబంధించి వేర్వేరుగా అదనపు వివరాలతో ప్రభుత్వం మరికొన్ని జీవోలు జారీ చేయనుంది. -
సభాహక్కుల పేరుతో ఎలాపడితే అలా చేయడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: శాసనసభ హక్కులు రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాలకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. సామాన్యులకు ఏ చట్టాలైతే వర్తిస్తాయో, అవే చట్టాలకు అనుగుణంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాలు, సభ నిర్ణయాలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. సభా హక్కుల పేరుతో ఎలాపడితే అలా వ్యవహరించడానికి వీల్లేదని పేర్కొంది. పార్లమెంట్ లేదా శాసనసభలు, వాటికి సంబంధించిన కమిటీలు కూడా సాధారణ చట్టాలకు లోబడే ఉంటాయంది. అవేమీ చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేసింది. చట్టం చేసేవారు కూడా అదే చట్టానికి లోబడి ఉండాలని, అంతే తప్ప ప్రజల కోసం రూపొందించే చట్టాల అమలు నుంచి వారు మినహాయింపు పొందలేరని తెలిపింది.‘‘ఎంతటి భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రతి శాసనసభకు చట్టాలు సమానంగా వర్తిస్తాయి. కాబట్టి సభా హక్కుల తీర్మానంపై తీసుకునే తుది నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. కోర్టు న్యాయ సమీక్ష చేసే సమయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని నిరూపించాల్సిన బాధ్యత హక్కులకు భంగం కలిగిందన్న సభ, వ్యక్తిదే. ఈ విషయాన్ని సీతాసోరెన్ కేసులో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ, సభా హక్కుల కమిటీ రాజ్యాంగ సూత్రాలను, చట్టపరమైన పరిమితులను గుర్తెరిగి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది’’ అని పేర్కొంది.సభా హక్కుల కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ బి.ఫణికుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, అనంతరం చాలా దశలు ఉంటాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు అపరిపక్వమైనవి వ్యాఖ్యానించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు... షోకాజ్ నోటీసు జారీ ఎమ్మెల్యేలకు రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని శాసనసభ వర్గాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయించాయి. ఎమ్మెల్యేలు, అతిథులకు హోటళ్లు, భోజనాలు, బహుమతులు తదితరాల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే, లోక్సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆ ఖర్చంతా వృథా అయింది. దీనిపై ‘సాక్షి’ ఫిబ్రవరి 22న ‘రూ.కోట్లు ఖర్చు... శిక్షణ తుస్సు’ శీర్షికన కథనం ప్రచురించింది. కంగుతిన్న అధికార పార్టీ నేతలు ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు చేపట్టారు. పత్రిక కథనం సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని, దానిని తాను సభలో ప్రస్తావించేందుకు అనుమతించాలని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఫిబ్రవరి 25న అసెంబ్లీ స్పీకర్ను కోరుతూ నోటీసు ఇచ్చారు. స్పీకర్ ఈ వ్యవహారాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. దాని ఆదేశాల మేరకు ‘సాక్షి’కి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాలనాపరమైన అంశాలపైనే కథనం ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుతో పాటు, సెక్రటరీ జనరల్ ఇచ్చిన షోకాజ్ నోటీసును సవాల్ చేస్తూ ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, చీఫ్ రిపోర్టర్ ఫణికుమార్ జూన్లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, వి.మహేశ్వర్రెడ్డి, అనూప్ కౌషిక్ వాదిస్తూ... సభలో జరిగిన విషయాలపై ‘సాక్షి’ కథనం రాయలేదని, పాలనాపరమైన అంశంపైనే ప్రచురించిందని, దాని కారణంగా ఎవరి హక్కులకూ భంగం వాటిల్లలేదని, ఆ కథనం సభా హక్కుల ఉల్లంఘన కిందకు రాదని వివరించారు.శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనన్నారు. వారి వివరణ తీసుకున్న తరువాత పలు దశలు ఉంటాయని, వివరణతో సభా హక్కుల కమిటీ సంతృప్తి చెందితే తదుపరి చర్యల ఉపసంహరణకు సిఫారసు చేయవచ్చన్నారు. ‘సాక్షి’ కథనం «ధిక్కారం కిందకే వస్తుందని కమిటీ భావించినా అంతిమంగా నిర్ణయం శాసన సభనే తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. షోకాజ్ నోటీసుల దశలో కోర్టుల జోక్యం తగదని, ఈ వ్యాజ్యాలను తోసిపుచ్చాలని కోరారు. పౌరులను కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం ‘‘పౌరుల హక్కులను ప్రభావితం చేసేలా రాజ్యాంగ వ్యవస్థలు ఏకపక్ష, అన్యాయ నిర్ణయాలు తీసుకుంటే, వాటి నుంచి కాపాడే రక్షణ కవచమే రాజ్యాంగం. అధికరణ 194 కింద... రాష్ట్ర అసెంబ్లీలు తీసుకునే నిర్ణయాలు పౌరుల హక్కులను ప్రభావితం చేస్తుంటే, అవి కచ్చితంగా న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి జారీచేసే షోకాజ్ నోటీసులు పలు దశల్లో చట్టపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయి.సభా హక్కుల కమిటీ మొదట పిటిషనర్ల వివరణను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలను ఉపసంహరించాలని శాసనసభకు సిఫారసు చేయవచ్చు. అలాకాకుండా పిటిషనర్ల వంటి పౌరులకు వ్యతిరేకంగా కమిటీ సిఫారసు చేసినప్పటికీ, శాసనసభ పిటిషనర్లు సమర్పించిన వివరణను, ఆధారాలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్పోస్టులు పెట్టి... వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్యాక్షన్ చేశారు. కనీసం బైక్లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
మంగళవారం.. మరో రూ.3000 కోట్ల రుణం
సాక్షి, అమరావతి: ప్రతి మంగళవారం... అప్పు వారం అన్నట్లుగా సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. తాజాగా రూ.3 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ రుణాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. తద్వారా 17 నెలల్లో ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల అప్పు చేసినట్లయింది. బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపింది. ఎడాపెడా అప్పులు, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. సంపద సృష్టి అంటూ చెప్పిన మాటలు గాలికి కొట్టుకుపోగా... అప్పులు చేయడంలో మాత్రం భారీ వృద్ధి కనబరుస్తున్నారు. ⇒ కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ లోపల రూ.1,40,602 కోట్లు, బడ్జెట్ బయట రూ.86,383 కోట్లు అప్పు చేశారు. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్దఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయకపోవడం గమనార్హం. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.55,383 కోట్లు అప్పు చేసింది. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, హడ్కో నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు రుణం తీసుకుంటోంది. సూపర్ సిక్సులు లేవు.. అప్పులే.. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలు అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. దీనికితోడు వైఎస్ జగన్ సీఎంగా ఉండగా... ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలతో ఆస్తులు కల్పించారు. వాటిని చంద్రబాబు సర్కారు పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తోంది. ⇒ తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ, ఇప్పుడు చేసిన అప్పులను ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు. అటు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైనవి కూడా ఇవ్వడం లేదు. సంపద సృష్టిస్తానంటూ పెద్దపెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని పెంచలేకపోయారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వచి్చన ఆదాయం కూడా రానివిధంగా పాలన సాగిస్తున్నారు. కళ్లు లేని ఎల్లోమీడియా చంద్రబాబు సర్కారు కేవలం 17 నెలల్లోనే రూ.2.27 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులను కూడా ఉన్నట్లు అదే పనిగా తప్పుడు కథనాలతో ఊదరగొట్టింది. ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం సాగించింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ సర్కారు ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గగ్గోలుపెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. -
కృష్ణా తీరం.. జన తరంగం
గుండెలపై కకావికలమైన పంటను చూసి పుట్టెడు శోకంతో ఉన్న పుడమితల్లి పరవశించింది. కన్నీళ్లతో కుంగికృశించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్నహస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి. సర్కారు ఆంక్షలు సంకెళ్లు తెంచి.. సదా తమ క్షేమాన్నే కాంక్షించే అభిమాన నేతను హత్తుకునేందుకు ఉవ్విళ్లూరాయి. కష్టాల్లో కానరాని ఏలికలపై ధ్వజమెత్తిన ప్రజాపతికి జయజయధ్వానాలు పలికాయి. నీ వెంటే మేమంటూ మండుటెండనూ లెక్కచేయక గళమెత్తి నినదించాయి. కృష్ణా తీరం జనతరంగమై ఉప్పొంగింది. జన హృదయ విజేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలికింది.సాక్షి, అమరావతి: మోంథా తుపాను ధాటికి విలవిల్లాడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకిరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా, రోడ్లు, కూడళ్లు, సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి.. తాళ్లతో దారులు మూసేసినా ప్రజలు వెనుకడుగు వేయలేదు. మండుటెండను సైతం లెక్కచేయక మొక్కవోని పట్టుదలతో ముందుకురికారు. అభిమాన నేతకు గోడు వెళ్లబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్కు చూపించి ఆదుకోవాల్సిన సర్కారు పెద్దలు ఇప్పటివరకూ పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు. పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఆసాంతం సావధానంగా విన్న జననేత అధైర్యం వద్దని తానున్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని సాంత్వన పొందారు. తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్కు విజయవాడలోనే ప్రజలు దారికి ఇరువైపులా బారులుతీరి జయజయధ్వానాలు పలికారు. పటమటలో మహిళలు గుమ్మడి కాయలతో జననేతకు దిష్టి తీశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈడుపుగల్లు, గోశాల వద్ద జగన్ను కలిసిన మహిళా రైతులు, తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటలను చూపించారు. ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గండిగుంటలో వైఎస్ జగన్పై మహిళలు పూలుజల్లి ఘనస్వాగతం పలికారు. గోపువానిపాలెంలో మహిళలు, వృదులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గజమాలలతో జగన్కు స్వాగతం పలికారు. నిడమోలు, తరకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఆయనకు పామర్రులోనూ రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పెడన నియోజకవర్గం, గూడూరు వద్ద మహిళలు జయహో జగనన్న అంటూ నినదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్కు పంట పొలాలను చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమర్రు లాకు వద్ద స్వయంగా వరి చేలో దిగిన జగనన్నతో రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న జగన్కు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బీవీ తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. 70 కి.మీ. ప్రయాణానికి 7 గంటలకు పైగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలకడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది. 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టిందంటే జగన్పై ప్రజాభిమానం ఏస్థాయిలో ఉప్పొంగిందో ఊహించుకోవచ్చు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పామర్రు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో ఆయన కాన్వాయ్తో పాటు వస్తున్న పార్టీ నేతల కార్లను పోలీసులు అడ్డుకున్నారు. తాము అధినేత వెంట వెళ్తే తప్పేంటని ప్రశి్నంచిన నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి స్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్తో పాటుగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు తన అనుచరులతో కలిసి మూడు కారుల్లో కాన్వాయ్తో పాటు వస్తున్నారు. వారిని నిడుమోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్బాబు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ అశోక్బాబు, ఆయన అనుచరులపై మొవ్వ ఎస్సై కె.ఎన్.విశ్వనాథ్ కేసులు పెట్టారు. డ్రోన్తో నిఘా పెనమలూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించటమే కాకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. పెనమలూరు మండల పరిధిలోని పలు గ్రామాల కూడళ్ల మీదుగా జగన్ పర్యటన జరిగిన సమయంలో పోలీసులు డ్రోన్లు పెట్టి చిత్రీకరించారు. ప్రతి సెంటర్లో డ్రోన్లు ఏర్పాటు చేశారు. -
ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు
టెర్మినల్ బెనిఫిట్స్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన వారు 70, 80, 90 ఏళ్ల సీనియర్ సిటిజన్లు. ఈ వయస్సులో అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరి నుంచి జీవితాంతం సేవలు తీసుకున్నారు. పదవీ విరమణ తర్వాత 16 ఏళ్లకు కూడా వారికి పదవీ విరమణ ప్రయోజనాలను ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాంతర ప్రయోజనాలైన (టెర్మినల్ బెనిఫిట్స్) గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్ మెంట్ తదితరాలను చెల్లించడంలో ప్రభుత్వం, దాని పర్యవేక్షణలోని సంస్థలు చేస్తున్న అసాధారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏళ్ల తరబడి సేవలు చేయించుకుని వారికి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించకపోవడం చట్ట విరుద్ధమే కాక రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వాల దాతృత్వం కాదని, అవి ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేసింది. ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగులకు రాజ్యాంగం కలి్పస్తున్న సామాజిక భద్రత హక్కును ప్రభుత్వం, దాని సంస్థలు కాలరాయలేవని పేర్కొంది. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలను పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చి చెప్పింది.నాటి నుంచి టెర్మినల్ బెనిఫిట్స్ పొందని పిటిషనర్లు..చిట్టిబోయిన భారతరావు, పి. చంద్రమౌళీశ్వరరావు, బండ శివరామకృష్ణ ప్రసాద్, ఏ.సాయిబాబు పెయిడ్ సెక్రటరీలుగా కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో పనిచేశారు. తరువాత వారి పోస్టులు డీ–కేడరైజ్డ్ చేసి సెక్రటరీలుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలోకి (పీఏసీఎస్) బదిలీ చేశారు. నాబార్డ్ మార్గదర్శకాల ప్రకారం వారిని 2009 మార్చి 2న తిరిగి పెయిడ్ సెక్రటరీలుగా డీసీసీబీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి పదవీ విరమణ వరకు వారు ఎలాంటి మచ్చ లేకుండా పని చేశారు.రిటైర్ అయినప్పటికీ, వారికి గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి టెర్మినల్ బెనిఫిట్స్ను చెల్లించలేదు. వీటి కోసం ప్రభుత్వం, డీసీసీబీలతో పోరాడి అలసిపోయిన ఆ వృద్ధులు 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై డీసీసీబీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు కొంత కాలం పీఏసీఎస్లలో పనిచేసినందున, అవి వారి వాటా బెనిఫిట్స్ను చెల్లించాలని, ఆ మొత్తం రాగానే దానితో కలిపి టెర్మినల్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ఇటీవల కీలక తీర్పు వెలువరించారు.16 ఏళ్ల తరువాత కూడా ప్రయోజనాలు చెల్లించరా...? ‘రిటైర్ అయిన 16 ఏళ్లకు కూడా వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అమానవీయం. రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్లు పిటిషనర్ల నుంచి వారి జీవిత కాల సేవలు పొందాయి. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు లేకపోయినా బెనిఫిట్స్ను చెల్లించలేదు. అది పిటిషనర్ల చట్టబద్ధమైన, రాజ్యాంగ హక్కులను హరించినట్లే. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ 7 ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 30 రోజుల్లోపు చెల్లించాలి. లేదంటే ఆ రోజు నుంచి వడ్డీ కూడా చెల్లించాలి. దీని ప్రకారం ఈ కేసులో పిటిషనర్లు చట్ట ప్రకారం వడ్డీ పొందేందుకు అర్హులు.ఇది యజమాని విచక్షణపై ఆధారపడి ఉండదు. గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్ మెంట్, ఇతర ప్రయోజనాలను పిటిషనర్లు లేదా వారి కుటుంబ సభ్యులకు 10 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి. ఫ్యామిలీ మెంబర్ సరి్టఫికెట్లు పరిశీలించి, ఆ తరువాత 8 వారాల్లో చెల్లించాలి. కోర్టు ఖర్చుల కింద పిటిషనర్లు ఒక్కొక్కరికి రూ.10 వేలు ప్రభుత్వం, డీసీసీబీ, పీఏసీఎస్ చెల్లించాలి. టెర్మినల్ బెనిఫిట్స్లో పీఏసీఎస్ నుంచి రావాల్సిన వాటాను వసూలు చేసుకునే హక్కు డీసీసీబీకి ఉంది. పీఏసీఎస్ వాటా చెల్లించలేదు కాబట్టి పిటిషనర్లకు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించలేకపోయామన్న డీసీసీబీ వాదన చట్టబద్ధం కాదు’ అని జస్టిస్ మహేశ్వరరావు తన తీర్పులో పేర్కొన్నారు. -
ష్.. బయటకు మాట్లాడొద్దు
సాక్షి, అమరావతి: పార్టీకి సంబంధించి ఏ విషయం బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియా, సోషల్ మీడియాలోనూ వాటి ప్రస్తావన తేవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినట్టు తెలిసింది. ఏవైనా అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే తమకు చెప్పాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఇటీవల తీవ్రస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. తన వద్ద ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్టు తీసుకున్నట్టు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వెల్లడించడంతో టీడీపీ అధిష్ఠానం ఉలిక్కిపడింది. పార్టీకి సంబంధించిన మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయనే ఆందోళనతో చంద్రబాబు కొలికపూడితో మాట్లాడారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య సర్దుబాటు చేయాలని క్రమశిక్షణ సంఘానికి సూచించారు. దీంతో సంఘం సభ్యులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల నారాయణ మంగళవారం ఉదయం కొలికపూడిని పిలిచి మాట్లాడారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాల గురించి కొలికపూడి వారి వద్ద ఏకరువు పెట్టినట్టు తెలిసింది. ఎమ్మెల్యేనైనా తనకు నియోజకవర్గంలో ఎటువంటి అధికారాలు లేకుండా చేశారని, నియామకాలు, కార్యక్రమాలు, పనులన్నింటిలో ఎంపీ జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఎంపీ చిన్ని తిరువూరు నియోజకవర్గంలో చేసిన అవినీతి వ్యవహారాలు, తనకు తెలియకుండా చేపట్టిన పనులు, నియామకాలు వంటి అన్నింటి గురించి లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు ఇకపై ఏ విషయం బయట మాట్లాడకూడదని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఎంపీ తన నియోజకవర్గంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించగా.. దానికి సమాధానం దాటవేసిన సభ్యులు.. పార్టీ చెప్పినట్టు వినాలని చెప్పారు. దీంతో కొలికపూడి ఆగ్రహంతో బయటకు వచ్చారు. తన అనుచరులతో కూడా మాట్లాడకుండా ఒంటరిగానే కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత కేశినేని చిన్ని కమిటీ సభ్యులను కలిసి తన వాదన వినిపించారు. తన పరిధిలోని ఎమ్మెల్యేలు కొందరు పార్టీకి నష్టం చేస్తున్నారని చెప్పారని, కొలికపూడికి స్థానిక పార్టీతో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెప్పినట్టు తెలిసింది. ఇకపై ఇద్దరూ బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పిన సంఘం నేతలు నివేదికను చంద్రబాబుకు ఇస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. లోకేశ్ ఎంట్రీ మరోవైపు తన నివాసంలో ప్రజాదర్బార్ పేరుతో ప్రజల నుంచి వినతులు తీసుకునే సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్ మంగళవారం మాత్రం పార్టీ కార్యాలయానికి వచ్చి వినతులు తీసుకున్నారు. తన అనుయాయుడైన విజయవాడ ఎంపీ చిన్ని క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చే సమయంలో ఎన్నడూ లేనివిధంగా లోకేశ్ పార్టీ కార్యాలయానికి రావడం చర్చనీయాంశమైంది. చిన్నికి మద్దతుగానే ఆయన మంగళవారం తన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. -
వైఎస్ జగన్ పర్యటన సూపర్ సక్సెస్
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్పెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావితమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తన్న ఏపీ పోలీస్ యంత్రాంగం.. జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పటిలానే ప్రయత్నాలు చేసింది. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతన్నలు, యువత, మహిళలు ఎవరూ లెక్కచేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరూ-వాడా ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హెరెత్తించారు. రైతన్నలకు భరోసా.. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.జనసంద్రం.. ఐదు గంటల ఆలస్యంవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్కు వివరించారు. ఇదీ చదవండి:‘మా హయాంలో జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేది’ -
పంట ‘కోత’లు!
అర ఎకరా పొలంలో వరి సాగు చేశా. ఈసారి పంట బాగా పండడంతో సంతోషపడ్డాం. ఇంతలో తుపాను వచ్చి పంట మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పొలాన్ని చూస్తే ఏడుపొస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోతే రూ.18 వేల వరకు పరిహారం అందింది. చంద్రబాబు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదంట. పరిహారం వస్తుందో, లేదో తెలియట్లేదు. వైఎస్ జగన్ సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటే.. ఈ ప్రభుత్వం రైతుల్ని అసలు పట్టించుకోవడం లేదు. – డి.గురుమూర్తి, గిరిజన రైతు, కొత్తవలస, అల్లూరి సీతారామరాజు జిల్లాపరిహారం ఇస్తారో.. లేదో!పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారోననే భయంతోనే..! ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్ను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వంఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు బసిరెడ్డి జగన్మోహన్రెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంభాలపాడు స్వగ్రామం. దాదాపు రూ.10 లక్షలు అప్పు తెచ్చి సొంత పొలం 30 ఎకరాలు, కౌలుకు మరో 30 ఎకరాలు సాగు చేశాడు. పొగాకు 15 ఎకరాలు, కంది 30 ఎకరాలు, బొబ్బర్లు 12 ఎకరాలు, వరి 3 ఎకరాల్లో సాగు చేశాడు. వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొలంలో నీరు నిలిచి ఆశలు నీటి పాలయ్యాయి. పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పంట నష్ట పరిహారం కింద ఆ కుటుంబానికి దాదాపు రూ.7 లక్షలు అందాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులే ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో సమయానికి డబ్బులు లేక పంటల బీమా చేయలేదు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతు పూర్తిగా నష్టపోయారు. సాక్షి, అమరావతి: ఈ–క్రాప్ నమోదులో టీడీపీ కూటమి సర్కారు నిర్లక్ష్యం అన్నదాతల పాలిట పెను శాపంగా మారింది. ఈ–క్రాప్ పక్కాగా, పారదర్శకంగా నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్టపరిహారం, పంటల బీమా సాయం ఇవ్వాలని రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ఏకంగా ఈ ప్రక్రియనే నిర్వీర్యం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అత్యంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను చంద్రబాబు సర్కారు మొక్కుబడి తంతుగా, తూతూ మంత్రంగా మార్చింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ–క్రాప్ను నీరుగార్చడమే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ పంట నమోదు పారదర్శకంగా చేపట్టకపోవడం వల్ల పంట నష్టపరిహారం, బీమా సాయం అందే పరిస్థితి లేకుండా పోయిందని, పంట ఉత్పత్తులను అమ్ముకునే దారి కానరావడం లేదని మోంథా తుపానుతో పంటలు దెబ్బతిన్న రైతులు ఆక్రోశిస్తున్నారు. మరోవైపు పంట నష్టం అంచనాల కోసం చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ కూడా అస్తవ్యస్తంగా తయారైంది. టీడీపీ నేతల సిఫార్సులతో.. వారి ఇళ్ల వద్దే జాబితాలు తయారు చేస్తూ నష్టపోయిన రైతుల నోట్లో సర్కారు మట్టి కొడుతోంది! ఈ–క్రాప్ నిర్వీర్యం.. వైఎస్సార్సీపీ హయాంలో ఏపీలో పారదర్శకంగా అమలు చేసిన ఈ–క్రాప్ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాలు ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తుండగా ఏపీలో మాత్రం మొక్కుబడి తంతుగా తయారైంది. సరిగ్గా ఖరీఫ్–25 సీజన్ ప్రారంభమయ్యే సమయంలోనే సచివాలయాల పునర్ వ్యవïÜ్థకరణతోపాటు రేషనలైజేషన్ పేరిట రైతు సేవా కేంద్రాల సిబ్బందిని అడ్డగోలుగా బదిలీలు చేయడం ఈ–క్రాప్ నమోదుపై తీవ్రంగా ప్రభావం చూపింది. బదిలీలపై వచ్చిన సిబ్బంది ఆయా ప్రాంతాలకు కొత్తవారు కావడంతో సర్వే నంబర్లను గుర్తించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు సైతం అవగాహన లేక కింది స్థాయి సిబ్బందికి లక్ష్యాలను నిర్దేశించి ఇబ్బందులకు గురి చేయడం మినహా రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఈ–పంట నమోదు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. డిజిటల్ క్రాప్ సర్వే నిబంధనల ప్రకారం ప్రతి ల్యాండ్ పార్సిల్లో వివరాలను విధిగా నమోదు చేయాలి. సీజన్ ముగిసి నెల రోజులైంది. కానీ ఇప్పటి వరకు 60శాతానికి మించి ల్యాండ్ పార్సిల్స్లో వివరాలు నమోదు చేయలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2.94 కోట్ల ల్యాండ్ పార్శిల్స్ ఉండగా.. 2 కోట్ల ల్యాండ్ పార్సిల్స్ను నమోదు చేసినట్టు అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. మరోవైపు రైతుల వేలిముద్రలతోపాటు ఈ–పంట నమోదును ధ్రువీకరిస్తూ ఆర్ఎస్కే, రెవెన్యూ అధికారులు వేలిముద్రలు వేసే ప్రక్రియను పూర్తిగా అటకెక్కించేశారు. ర్యాండమ్గా ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలనను మొక్కుబడి తంతుగా మార్చేశారు. ఇక కౌలు రైతులు సాగు చేస్తున్న పంట వివరాలు ఈ–క్రాప్లో నమోదు కావడం లేదు. సీసీఆర్సీ కార్డుల జారీ మొక్కుబడిగా సాగుతోంది. రెవెన్యూ అధికారులు ధ్రువీకరిస్తే చాలు రైతులు పండించిన పంట వివరాలు నమోదు చేస్తామని నమ్మబలికారు. కానీ ఎక్కడా ఆ దాఖలాలు కానరావడం లేదు. దీనికి ఏకైక కారణం.. ఈ–క్రాప్ పక్కాగా నమోదు చేస్తే విపత్తు వేళ రైతులకు పంట నష్ట పరిహారం, బీమా సాయం ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోననే భయమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం..! ఈ–క్రాప్ నమోదులో నిబంధనలకు పాతరేశారు. ఈ–క్రాప్ నమోదు సక్రమంగా జరగని కారణంగానే గతేడాది ధాన్యంతో పాటు వివిధ పంటలను రైతులు కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోలేకపోయారు. ఈ–క్రాప్ నమోదు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయిన మామిడి, పొగాకు, మిర్చి రైతులతోపాటు టమాటా, ఉల్లి రైతులను గుర్తించడంలో అధికారులు నానా పాట్లు పడ్డారు. గడిచిన ఏడాదిన్నరలో అకాల వర్షాలు, తుపానులు, కరువు ప్రభావానికి గురైన 5.50 లక్షల మంది రైతులకు రూ.595 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఇలా పరిహారం ఎగ్గొట్టేందుకే ఉద్దేశపూర్వకంగానే ఈ–క్రాప్ను నిర్వీర్యం చేస్తోందని రైతులు, రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ధాన్యం కొనబోమంటూ.. గ్రామాల్లో టాంటాంచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్యుమరేషన్ జాబితాలో పేర్లు ఉన్న వారి నుంచి ధాన్యం సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని గ్రామాల్లో టాంటాం వేస్తుండడం బాధిత రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. పచ్చనేతల కనుసన్నల్లోనే గ్రామ స్థాయిలో జాబితాలు సిద్ధమవుతున్నాయి. అర్హులైన వారికి పరిహారం దక్కకుండా చేయడం, నష్ట తీవ్రత తగ్గించి ఆర్థిక భారం తగ్గించుకోవడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కుట్రలకు తెర తీసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు వైఎస్సార్ కడప జిల్లా సి.కె.దిన్నె మండలం కోలుములపల్లి తదితర గ్రామాల్లో తుపాను, దానికంటే ముందు కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఏ అధికారీ పరిశీలించలేదు. ఇదే జిల్లాలో పోరుమామిళ్ల, బద్వేలు రూరల్, కాజీపేట, మైదుకూరు, బి.మఠం మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించిన పాపాన పోలేదు. కనీసం ప్రాథమిక అంచనాలు గానీ, తుది జాబితాలను గానీ ఆర్ఎస్కేల్లో ప్రదర్శించడం, అభ్యంతరాలు స్వీకరిస్తున్న దాఖలాలు లేవు. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పంట నష్టం నమోదు, సామాజిక తనిఖీలు, విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కారం, ఉన్నతాధికారుల సూపర్ చెకింగ్, పునఃపరిశీలన అంతా సమాంతరంగా జరిగిపోతోందంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. దేశానికే ఆదర్శంగా ‘ఈ–క్రాప్’.. ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్).. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక మార్పు అది. ఏ గ్రామంలో.. ఏ సర్వే నంబర్ పరిధిలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏ పంటను ఎవరు సాగు చేస్తున్నారో ఒక్క క్లిక్తో తెలుసు కోవడమే కాదు.. ఈ–క్రాప్ ప్రామాణికంగా అర్హులైన వాస్తవ సాగుదారులకు పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ (పంట నష్టపరిహారం), సున్నా వడ్డీ రాయితీ లాంటి సంక్షేమ ఫలాలు అందించేవారు. రబీ 2019 సీజన్లో శ్రీకారం చుట్టిన ఈ–క్రాప్ నమోదు సాంకేతికత అనతి కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలందుకుంది. 2023లో ప్రతిష్టాత్మక స్కోచ్ సిల్వర్ అవార్డు కూడా వరించింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్ ద్వారా వెబ్ల్యాండ్, సీసీఆర్సీ (పంట సాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేసేవారు. సీజన్ వారీగా ఏ సర్వే నంబర్లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో ఆర్బీకేల ద్వారా వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు చేసేవారు. 15–30 రోజుల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలనలో జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్తో సహా పంటల ఫొటోలు అప్లోడ్ చేసి, రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని మొబైల్ నంబర్కు డిజిటల్ రసీదు పంపేవారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారుల పరిశీలన తర్వాత రైతులకు భౌతిక రసీదు కూడా అందించేవారు. ఈ భౌతిక రసీదులోనే ఉచిత పంటల బీమా పధకం వర్తించే నోటిఫై చేసిన పంటలకు (స్టార్) గుర్తుతో ప్రత్యేకంగా తెలియచేయడమే కాదు.. మీ పంటకు బీమా కవరేజ్ ఉందని, మీ తరఫున ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలియజేశారు. ఇలా ఏటా 1.65 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. ఈ–క్రాప్ ప్రామాణికంగా 2019–24 మధ్య 75.82 లక్షల మందికి రూ.1,373కోట్ల సబ్సిడీతో 45.16 లక్షల టన్నుల విత్తనాలు అందించారు. 15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగుల మందులు సరఫరా చేశారు. 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేయగా, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలను అందించారు. మరోవైపు వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం అందించి సాగుకు భరోసా కల్పించారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల రాయితీని గత ప్రభుత్వం అందచేసింది.సేద తీరుతున్న ప్రభుత్వ పెద్దలుపుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు షికార్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్తే.. మంత్రి లోకేశ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ చిల్ అవుతున్నారు. మరోవైపు ఫొటోలకు ఫోజులిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పుడు పరిహారం ఎవరిస్తారు గత ప్రభుత్వంలో అధికారులే దగ్గరుండి బీమా చేయించేవారు. ఈ ప్రభుత్వం సొంతంగా బీమా చేయించుకోవాలని చెప్పడంతో రెండుసార్లు రైతు సేవా కేంద్రాలకు వెళ్లా. సర్వర్ పని చేయడం లేదని చెప్పారు. తరువాత సమయం అయిపోయిందన్నారు. ఐదు ఎకరాల్లో స్వర్ణరకం సాగు చేశా. పంట మొత్తం పోయింది. పరిహారం ఎవరిస్తారు? కౌలుదారులకు ఆత్మహత్యలే శరణ్యం! – గున్నం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం రూరల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కౌలు రైతుకు పరిహారం ఇవ్వాలి కౌలుకు ఏడు ఎకరాలు తీసుకున్నా. తొలుత నీరందక దెబ్బతిన్నా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే తుపాను పంటను దెబ్బతీసింది. ఎకరానికి రూ.25 వేలకు పైగా వెచ్చించా. నాలాంటి కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతులను కూడా గుర్తించి నష్టపరిహారం అందించాలి. – నాగరాజు, కౌలు రైతు, పెడన, కృష్ణా జిల్లాదిక్కుతోచడం లేదు రూ.ఐదు లక్షల వరకూ వెచ్చించి 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. పంట తొలగించే రోజు మొదలైన వాన తుపానుగా మారి పదిరోజుల పాటు కొనసాగింది. టార్పాలిన్ కప్పి భద్రపరిచినప్పటికీ మొక్కజొన్నలు మొత్తం మొలకలు వచ్చాయి. కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోవడంతో దిక్కుతోచడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. – మధు, కదిరిపల్లి, గుంతకల్లు మండలం, అనంతపురం జిల్లాప్రభుత్వ నిర్ణయం చాలా అన్యాయం ఇన్పుట్ సబ్సిడీకి నమోదు చేసుకున్న రైతుల నుంచి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకూడదన్న నిర్ణయం చాలా అన్యాయం. పంటలు నష్టపోయారు కాబట్టే ఇన్పుట్ సబ్సిడీ పొందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రైతుల నుంచి ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి.. – పోతిరెడ్డి భాస్కర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కడప జిల్లా జగన్ హయాంలో రైతులకు మేలు మొక్క జొన్న కోత కోసి ఆరబోశాం. క్వింటా రూ.2,200 పలకాల్సింది రూ.1,600కు అడుగుతున్నారు. ఇన్పుట్ సబ్సిడీ గురించి అవగాహన కల్పించేవారు ఎవరూ లేరు. గత ప్రభుత్వం స్వయంగా ఇన్సూరెన్స్ చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు మేలు చేకూరేది. – గుత్తి ఏసన్న, రైతు, కల్వటాల, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లాఈ ప్రభుత్వంలో బీమా గురించి చేప్పేవారే లేరు నాకు ఎకరా పొలం ఉంది. వరి, మిరప పండిస్తా. గత ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు చేసి ప్రీమియం కూడా చెల్లించడంతో రూ.26 వేలు బీమా నగదు వచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారే కరువయ్యారు. ప్రభుత్వం ఎటువంటి భరోసా కల్పించకపోవడంతో ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. – వేణు, రైతు, బంగారుపాళెం, చిత్తూరు జిల్లాఅస్తవ్యస్తంగా ఎన్యుమరేషన్...మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను, రైతులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. గత నెల 31వ తేదీ సాయంత్రంలోగా తుది జాబితాలు తయారు చేయాలని ఆదేశిస్తూ 30వ తేదీన సర్క్యులర్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. అంటే 24 గంటలు కూడా గడువు ఇవ్వకుండా తుది జాబితాలు రూపొందించాలని ఆదేశించటాన్ని బట్టి ఎన్యుమరేషన్లో పారదర్శకత ఏ మేరకు ఉందో వెల్లడవుతోంది. వాస్తవంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తినగా.. ప్రభుత్వం నష్ట తీవ్రతను తగ్గించేందుకు తొలుత 4.40 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని 3.45 లక్షల ఎకరాలేనని బుకాయించింది. చివరకు తుది అంచనాల రూపకల్పనలో 3.70 లక్షల ఎకరాలుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపకుండా, టీడీపీ నేతలు సిఫార్సు చేసిన పేర్లతోనే జాబితాలను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న మౌఖిక ఆదేశాలతో జాబితాలను కుదించేందుకు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఎన్యుమరేషన్ పెంచొద్దంటూ క్షేత్రస్థాయి సిబ్బందిపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. కర్నూలు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఉల్లి పంటకు అపార నష్టం వాటిల్లింది. కానీ దెబ్బతిన్న ఉల్లి పంట వివరాలు నమోదు చేయడానికి వీల్లేదని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం నివ్వెరపరుస్తోంది. అలా నమోదు చేసిన ఆర్ఎస్కే సిబ్బందిపై చర్యలకు సైతం సిద్ధపడుతుండడం సర్కారు తీరుకు అద్దం పడుతోంది. -
వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు
సాక్షి అమరావతి: ప్రజలకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ 2023–24 ఆరి్థక సంవత్సరంలో గణనీయమైన మెరుగుదల నమోదు చేసిందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సేవల రంగంలో ఉపాధి ధోరణులను విశ్లేషాతూ నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. ఏపీలో వ్యవసాయ రంగం తరువాత 2023–24లో సేవల రంగంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించినట్లు నివేదిక పేర్కొంది. ఆ ఏడాది సేవల రంగంలో జాతీయ సగటును మించి ఏపీలో ఉపాధి కల్పన ఉందని నివేదిక తెలిపింది.2023–24లో సేవల రంగంలో జాతీయ సగటు ఉపాధి కల్పన 29.7 శాతం ఉండగా.. ఏపీలో 31.8 శాతం మంది ఆ రంగంలో ఉపాధి పొందినట్టు నివేదిక పేర్కొంది. 2011–12లో సేవల రంగంలో 27.7 శాతం ఉపాధి కల్పిస్తే.. 2023–24లో ఏపీలోని సేవల రంగంలో 78 లక్షల మంది ఉపాధి పొందడంతో ఆ వాటా 31.8 శాతానికి పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసింది. 2011–12లో మహారాష్ట్ర సేవల రంగంలో ఉపాధి కల్పనలో టాప్లో ఉండగా 2023–24లో మూడో స్థానానికి పడిపోయిందని, కర్ణాటక రెండో స్థానం నుంచి నాల్గో స్థానానికి దిగజారగా.. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకి గణనీయమైన మెరుగుదల నమోదు చేసినట్టు నివేదిక తెలిపింది. -
నాడు ఉచిత బీమా రక్ష.. నేడు అనుచిత శిక్ష
ఈయన పేరు శీలం శ్రీను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం. ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఖరీఫ్లో వరి పంట సాగు చేశారు. ఇప్పటికే రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. మోంథా తుపాను బారిన పడి పంట పూర్తిగా ముంపునకు గురై కుళ్లిపోతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.27 వేలు బీమా పరిహారంగా వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో ప్రీమియం భారం భరించలేక చెల్లించలేదు. గత 17 నెలల్లో దాదాపు మూడుసార్లు వరి పంట నీట మునిగి పూర్తిగా పాడైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. ఈసారైనా నష్టపరిహారం అందించి ఆదుకోవాలని శీలం శ్రీను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సాక్షి, అమరావతి: ‘పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే.. బీమా పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై తుపాను ప్రభావిత ప్రాంతాల రైతులు మండిపడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పైసా భారం పడకుండా రైతులకు అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించడం వల్లే తమకీగతి పట్టిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రీమియం చెల్లించిన వారికి బీమా పరిహారం ఇప్పిస్తానంటున్నావ్.. మరి ప్రీమియం భారం కావడంతో బీమా చేయించుకోలేని తమబోటి నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటి చంద్రబాబూ.. అంటూ నిలదీస్తున్నారు.కూటమి సర్కారు నిర్వాకంతో బీమాకు దూరమైన లక్షలాది మంది తుపాను బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కులు చూస్తున్నారు. తుపాను బారినపడి దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, ఇందులో అత్యధికంగా వరి పంట 6 లక్షల నుంచి 8 లక్షల ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టు చెబుతున్నారు. పంటలు కోల్పోయిన రైతుల్లో నూటికి 90 శాతం మంది రైతులు ప్రీమియం భారం కావడంతో పంటల బీమా చేయించుకోలేకపోయారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రీమియం చెల్లించని రైతులకూ చంద్రబాబు ప్రభుత్వమే సొంతంగా బీమా పరిహారానికి సమానంగా ఆరి్థక లబ్ధి చేకూర్చి అండగా నిలవాలని కర్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఖరీఫ్లో వరి సాగైంది 38.97 లక్షల ఎకరాలు.. బీమా చేయించుకుంది4.94 లక్షల ఎకరాలకే.. ఉచిత పంటల బీమా పుణ్యమా అని గడిచిన ఖరీఫ్–2024 సీజన్లో 71.17 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్ లభించగా, 85.83 లక్షల మంది రైతులకు బీమా రక్షణ లభించింది. ఉచిత పంటల బీమా ఎత్తివేతతో రబీ–2024 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 19.55 లక్షల మంది రైతులు 19.69 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. గత ఖరీఫ్తో పోలిస్తే 51.48 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 66.28 లక్షల మంది రైతులకు బీమా రక్షణ దక్కలేదు.నోటిఫై చేసిన పంటల సాగు విస్తీర్ణంలో 27 శాతం పంటలకు మించి బీమా కవరేజ్, 85 శాతం మంది రైతులకు బీమా రక్షణ లభించలేదు. దీంతో వారి పరిస్థితి ప్రçస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా మోంథా తుపాను ప్రభావం వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, అరటి రైతులు ఎక్కువగా నష్టపోయారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 38.97 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, రైతులు బీమా చేయించుకున్నది కేవలం 4.94 లక్షలు ఎకరాలకు మాత్రమే. అంటే దాదాపు 34 లక్షల ఎకరాల్లో సాగైన వరి పంటకు బీమా రక్షణ కరువైంది.మొక్కజొన్న పంట 4.67 లక్షల ఎకరాల్లో సాగవగా. కేవలం 15,638 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఇక పత్తి విషయానికి వస్తే 11.4 లక్షల ఎకరాల్లో సాగవగా, కేవలం 1.03 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ లభించింది. అరటి 2.74 లక్షల ఎకరాల్లో సాగవగా, 16 వేల ఎకరాలకే బీమా కవరేజ్ పరిమితమైంది. దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో టమాటా సాగవగా, కేవలం 2284 ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. ఈ గణాంకాలు చాలు రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో స్వచ్ఛంద బీమా నమోదు అమలు తీరు ఏ విధంగా ఉందో చెప్పడానికి.ఐదేళ్లూ పైసా భారం పడకుండా రైతుకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం.. 2019–24 మధ్య ఐదేళ్లూ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాదు.. ఏ సీజన్కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా జమచేసి అండగా నిలిచింది. దేశంలో మరెక్కడాలేని విధంగా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫై చేసిన పంటలకు యూనివర్శల్ కవరేజ్ కల్పించింది. ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించగా, ఏటా సగటున 40.50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో 2.10కోట్ల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు.ప్రభుత్వ వాటాతోపాటు రైతుల తరఫున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు చెల్లించింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం అందిస్తే 2019–24 మధ్యలో వైఎస్ జగన్ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేయగా, వైపరీత్యాల వేళ పంటలు నష్టపోయిన 24.80 లక్షల మంది రైతులకు రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని అందజేసి అండగా నిలిచారు.17 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలేదు ఖరీఫ్లో ఎకరన్నరలో వరి వేశా. రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి అందే వేళ మోంథా తుపాను ముంచేసింది. తీవ్రంగా నష్టపోయాను. పట్టుమని పది బస్తాలు కూడా చేతికొస్తుందో లేదో తెలియడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా పంటలు దెబ్బతిన్నప్పుడు పైసా చెల్లించకుండానే పంట బీమా పరిహారం ఇచ్చేవారు. నాకు కూడా పరిహారం వచి్చంది. కానీ ఇప్పుడు బీమా భారమైపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అకాల వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతిన్నా ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడైనా పారదర్శకంగా నష్టపోయిన పంటలను పరిశీలించి పరిహారం ఇప్పించాలి. –బచ్చల తమ్మారావు, గుమ్మరేగుల, కాకినాడ జిల్లాజగన్ హయాంలో ఎకరాకు రూ.36 వేల పరిహారం అందుకున్నాం.. వైఎస్ జగన్ హయాంలో ఇదే రీతిలో తుపాను వల్ల పంట నష్ట పోయిన సందర్భంలో ఎకరానికి రూ.36 వేలు పరిహారం అందుకున్నాను. ఉచిత పంటల బీమా పథకం ద్వారా పైసా భారం పడకుండా క్రమం తప్పకుండా పరిహారం జమ చేసేవారు. నాడు ప్రభుత్వం రైతులకు ఎంతో తోడ్పాటు అందించింది. ఇప్పుడు కూటమి సర్కారులో అటువంటిది కనిపించడం లేదు. ఇప్పుడు పంట కోల్పోయి బీమా ప్రీమియం చెల్లించని మా లాంటి రైతులం అన్యాయం అయిపోయేలా ఉన్నాము. కూటమి సర్కారు ఆదుకుంటుందో లేదోనని ఆందోళనగా ఉంది. – పిల్లా శ్రీనివాస్, కొత్తపల్లి అగ్రహారం, తూర్పు గోదావరి జిల్లా -
బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా
బాపట్ల/తిరుపతి అర్బన్/ మచిలీపట్నం అర్బన్: సమస్యలు పరిష్కారం కాకపోవడం, కూటమి నేతల వేధింపులు తాళలేక సోమవారం రాష్ట్రంలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద పలువురు ఆత్మహత్యాయత్నం చేశారు. భూ వివాదానికి సంబంధించిన సమస్యపై ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి, ఇంటి స్థలానికి సంబంధించి కూటమి నేతల వేధింపులు భరించలేక తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, అధికారుల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా వితంతు పింఛను రావడంలేదని కృష్ణా జిల్లాకు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు.టీడీపీ నేతల వేధింపులతో..కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల వేధింపులు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ఇంటి స్థలాల విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ టీడీపీ నాయకులు తరచూ తమ ఇంటికి పోలీసులను పంపి వేధిస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం ఇద్దరు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకటసుబ్బమ్మ, లక్ష్మీదేవి మీడియాకు తమ సమస్యను తెలిపారు. తిరుపతి నగరం సంజయగాంధీ కాలనీలో తమ ఇద్దరికి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్పారు. రేకులను ఏర్పాటు చేసుకుని 20ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్నామన్నారు.తహసీల్దార్ తమకు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. 20ఏళ్లకు పైగా మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో 18 రోడ్లను విస్తరించారని, అందులో తమ ఇళ్ల సమీపంలోనూ కొత్త రోడ్లు ఏర్పాటు చేశారన్నారు. దీంతో అక్కడ ఇంటి స్థలాల ధరలు అత్యధికంగా పెరిగినట్లు వెల్లడించారు. అనంతరం తాము రేకుల ఇళ్లను తొలగించి చిన్నపాటి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఈ క్రమంలో టీడీపీకి చెందిన రజనీకాంత్ అనే నాయకుడు తమ అనుచరులను పంపించి ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారు.కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేపదే తమ ఇంటికి పోలీసులను పంపుతున్నారని వాపోయారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ నేతకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం కలెక్టరేట్ వద్ద కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని, విచారణ చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు.వితంతు పింఛను రావట్లేదంటూ..కృష్ణాజిల్లా కలెక్టరేట్లో సోమవారం ‘మీకోసం’లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యనమలకుదురు డొంక రోడ్డు ప్రాంతానికి చెందిన తోట కృష్ణవేణి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సమయానికి పోలీసులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణవేణి తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి సమావేశానికి హాజరై సీఐ శీను వద్ద తమ సమస్యను వివరిసూ్తనే ఒక్కసారిగా పెట్రోల్ సీసా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆమెను తన వద్దకు పిలిపించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుమార్తె లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ.. తన తల్లికి వితంతు పింఛను రాకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, విద్యుత్ బిల్లు పేరు మార్పు సాధ్యం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది.పురుగు మందు తాగి..భూ వివాదానికి సంబంధించి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగుమందు తాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నగంజాం మండలం మున్నంవారిపాలేనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం మేరకు..‘1981లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 22 కుటుంబాలు, సర్వే నంబర్ 1158 లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకుంటున్నాయి.ఏడేళ్ల క్రితం మా భూమిని మన్నె సునీల్ చౌదరికి లీజుకు ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా ఆ భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించుకొని సర్వే నంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గతనెల 13న గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చిన్న గంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది.ఈ సమస్య నా పరిధిలోనిది కాదని ఏఈ సమాధానమిచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెబుతున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకొని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మా పొలాలకు లీజులు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాను’ అని స్పష్టం చేశాడు. -
హడ్కో నుంచి మరో రూ.5,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. తాజాగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీపీఎఫ్సీఎల్) సంస్థలకు అవసరమైన బొగ్గు, విద్యుత్ కొనుగోలు కోసమంటూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో) నుంచి ప్రభుత్వం రూ.5,000 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులిచ్చారు.హడ్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి రూ.5,000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకుముందు ఏపీపీఎఫ్సీఎల్ తీసుకున్న రూ.710 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చింది. దీంతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.5,710 కోట్లకు చేరింది. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెట్ బయటచేసిన అప్పులు రూ.55,383 కోట్లకు చేరాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగీ చేసి.. దు్రష్పచారం చేశాయి. ఇప్పుడు ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారెంటీతో భారీగా అప్పులు చేస్తున్నారు. -
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పెనమలూరు సెంటర్, ఉయ్యూరు బైపాస్, పామర్రు బైపాస్ మీదుగా పెడన నియోజకవర్గం గూడూరుకు చేరుకుంటారు.మోంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ జగన్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
రహదారులు రక్తసిక్తం
కర్లపాలెం/యలమంచిలి రూరల్/నాదెండ్ల/నగరి/పెళ్లకూరు: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. మరో 23మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ కుమారుడి వివాహం సందర్భంగా పాండురంగాపురంలోని ఓ రిసార్ట్లో ఆదివారం రాత్రి సంగీత్ వేడుకలు ఏర్పాటు చేశారు.కర్లపాలెం గ్రామానికి చెందిన బేతాళం బలరామరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. వారందరూ ఆనందంగా గడిపి రాత్రి 12 గంటల సమయంలో తిరిగి కారులో కర్లపాలెం బయలుదేరారు. కర్లపాలెం పంచాయతీ సత్యవతిపేట వద్ద కారు, నరసాపురం నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కారులో ఉన్న బేతాళం బలరామరాజు(65), ఆయన భార్య బేతాళం లక్ష్మి(60), వారి వియ్యపురాలు గాదిరాజు పుష్పావతి(60), కారు నడుపుతున్న బలరామరాజుకు బావమరిది వరసైన ముదునూరి శ్రీనివాసరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే నలుగురు మృతిచెందినట్లు తెలిపారు. అదే కారులో ఉన్న గాదిరాజు పుష్పావతి మనవరాలు గాదిరాజు వైష్ణవి, మనవడు జయంత్వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. వైష్ణవిని చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, జయంత్వర్మను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన వ్యాన్.. ఇద్దరి మృతి అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి కూడలి ప్రేమ సమాజం వద్ద సోమవారం ప్రయాణికులు దిగడానికి రోడ్డు వెంబడి ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 10 మంది, మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నర్సీపట్నానికి చెందిన బాదంపూడి లక్ష్మి(65), కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన గొంది పెంటయ్య(56) మృతిచెందారు. మొత్తం 16 మంది గాయపడ్డారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం బోల్తా పడి..అక్రమంగా సేకరించిన రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనం బోల్తాపడి ఒడిశాకు చెందిన ఓ కూలీ మృతిచెందాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రేషన్ మాఫియా అక్రమంగా కొనుగోలు చేసిన 35 బస్తాల బియ్యాన్ని ఆదివారం అర్ధరాత్రి మినీ వ్యాన్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మీదుగా చిలకలూరిపేటకు తరలిస్తున్నారు. నాదెండ్ల–తిమ్మాపురం రోడ్డులో జాలాది సుబ్బయ్యకుంట వద్ద వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బోల్తాపడింది. వ్యాన్లో బియ్యం బస్తాలపై కూర్చున్న ఒడిశాకు చెందిన బఫూన్మాలిక్ (25) అనే కూలీ అక్కడికక్కడే మృతిచెందాడు. వ్యాన్లో ఉన్న ప్రభాస్ మాలిక్, భీమాసేన్ దాస్, డైతిరిమాలిక్ తీవ్రంగా, సర్వేశ్వర్ మాలిక్, బాజ్పాయ్ మాలిక్ స్వల్పంగా గాయపడ్డారు.ట్యాంకర్ ఢీకొని తండ్రీకొడుకుల కన్నుమూత తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాలెం వద్ద సోమవారం ట్యాంకర్ ఢీకొని బైక్పై వెళుతున్న తండ్రీకొడుకులు మరణించారు. శ్రీకాళహస్తి వీఎం పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం(31) తన కుమారుడు రూపేష్(9)తో కలిసి బైక్పై నాయుడుపేట నుంచి శ్రీకాళహస్తికి రహదారిపై వ్యతిరేక మార్గంలో వెళుతున్నాడు. వారిని చెంబడిపాలెం వద్ద ఎదురుగా వస్తున్న ట్యాంకర్ లారీ ఢీకొంది. సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతిచెందగా, అపస్మారక స్థితిలో ఉన్న రూపేష్ను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు.స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృత్యువాత చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తం కండ్రిగ వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజా మొహిద్దీన్ (26) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన ఖాజా మొహిద్దీన్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అతను మిత్రులతో కలిసి బైక్పై ఆదివారం చెన్నైలో స్నేహితుడి వివాహ వేడుకలకు హాజరయ్యాడు. తిరిగి వస్తూ సోమవారం తెల్లవారుజామున నెత్తంకండ్రిగ వద్ద బైక్ అదుపు తప్పి బారికేడ్ను ఢీకొని కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిద్దీన్ను స్నేహితులు నగరి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఏలూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఏలూరు: లింగపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీనగర్ దగ్గర భారతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో పదిమంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 20మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు నుంచి చింతలపూడి మీదిగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జెసిబి సహాయంతో బోల్తా పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బయటికి తీసిన అధికారులు. బస్సు బోల్తా పడిన సమయంలో బస్సుకింద పడి చనిపోయిన ప్రవీణ్ బాబు అనే యువకుడు. లింగాపాలెం మండలం అయ్యపురాజుగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ప్రవీణ్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నట్టు సమాచారం. -
‘రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు నారా లోకేష్’
సాక్షి,తాడేపల్లి: రాజ్యాంగ ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ.. రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని.. వైయస్సార్సీపీ స్టేటే కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృతరూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే రాజకీయ వ్యవస్థ శూన్యమైందని.. కూటమి ప్రభుత్వం నేర స్వభావాన్నే రూల్ ఆఫ్ లా గా నడుపుతుందని మండిపడ్డారు. రెండేళ్లలోనే ఇంతటి దారుణమైన పాలన ఉంటే... రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే ప్రమాదముందని.. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు, మీడియా వీటిని అధ్యయనం చేసి.. జరుగుతున్న దారుణాలను ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...రాష్ట్రంలో ప్రభుత్వం శూన్యం..2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం అన్నమాటకు నిర్వచనమే మారిపోయింది. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోరికలు, ఆకాంక్షలన్నింటికీ ఫలానా పార్టీ పరిష్కరిస్తుందని ఎన్నుకుంటారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక భాగం అయితే రెండోది.. పరిపాలన. పాలనా పరమైన విధులన్నీ అధికారులు చేస్తున్నప్పుడు .. ప్రభుత్వం అవసరం ఎందుకంటే అది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. మేనిఫెస్టోను అమలు చేస్తుంది. అదే ప్రజాస్వామ్యం. అది ఏ మేరకు నెరవేరుతుందన్నది వేరే విషయం. అలా అడ్మినిస్ట్రేషన్ విభాగం ఒక పద్దతి ప్రకారం నడవడానికి అవసరమైన మార్గదర్శకం ఇచ్చి నడిపే ఒక రాజకీయ వ్యవస్థ ఉంటుంది అనుకుంటే.. అది 2024 జూన్ తర్వాత ఈ రాష్ట్రంలో శూన్యం అయింది. పాలన గాలికొదిలేయడమో, లేక చేతకాని తనంతో చేయలేకపోవడమన్నది ఒక రకం. కానీ ప్రభుత్వమే నేరస్వభావంతో దాన్నే రూల్ ఆఫ్ లా గా కార్యనిర్వహణలోకి తీసుకొస్తే... అది 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లా ఉంటుంది. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నేరస్వభావాన్నే ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తూ.. బ్యూరోక్రాట్స్ లో అలాంటి వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. కానివాళ్లను మెడలు వంచడమే, దూరం పెట్టడమే చేస్తుండడంతో వాళ్లు కూడా గత్యంతం లేక అదే దారిలో పయనిస్తున్నారు. ఇలా ఈ ఏడాది కాలంలో వ్యవస్థలను తమ నేర స్వభావాలకు అనుకూలంగా... తాము చేసే తప్పులకు ప్రొటెక్ట్ చేసేదిలా మార్చివేస్తున్నారు.టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ...మాజీ మంత్రి, వెనుకబడిన వర్గాలకు చెందిన బలమైన నాయకుడిగా ఎదిగిన జోగి రమేష్ ను ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కేసు చూస్తే... నేరం జరుగుతున్న మొలకల చెరువు, ఇబ్రహీం పట్నం, అనకాపల్లి, ఏలూరులో నకిలీ మద్యం తయారీ చేస్తున్న చోట పోలీసులు పట్టుకున్నారు. నిన్నా, మొన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో మా పాత్ర లేదు అని చెప్పడానికి అవకాశం ఉండేది. కానీ సాక్షాత్తూ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ 2024 అభ్యర్ధి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ ఫ్యాక్టరీ బయటపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రెండేళ్లు అవుతుంది. ఒకవైపు వైయస్సార్సీపీ నాయకుల తప్పు లేకపోయినా... వారిని అరెస్టులు చేస్తుంటే... రెండేళ్లుగా నకిలీ లిక్కర్ తయారీ మొత్తాన్ని వైయస్సార్సీపీ నేత జోగి రమేష్ ఉన్నాడంటూ అరెస్టు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెట్టడంతో మొదలై... వైయస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పెద్ద సంఖ్యలో అరెస్టు చేస్తూ.. తప్పుడు స్టేట్ మెంట్లతో వేరేవాళ్లను అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచారు.ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు..పల్నాడు వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా తప్పుడు కేసులు నమోదు చేసారు. స్ధానిక టీడీపీ నాయకులు వాళ్ల మధ్య అంతర్గత కలహాలతో గొడవపడి జంట హత్యలు జరిగితే... దాని మీద ఎస్పీ కూడా ఇది టీడీపీ అంతర్గత విభేదాల వల్లే అని ప్రకటన ఇచ్చినా, ఘటనా స్ధలంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వాహనంతో సహా పలు ఆధారాలున్నా.. వైయస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను జైల్లో పెట్టారు.ఇటీవల సోషల్ మీడియా యాక్టవిస్టు సవీంద్ర రెడ్డిను ఏదో పోస్టు పెట్టారని అరెస్టు చేసి.. కన్ఫషన్ కింద వేరకొటి నమోదు చేసి.. అదీ సరిపోదనుకుని ఏకంగా గంజాయి ప్యాకెట్ పెట్టి కేసు నమోదు చేశారు. అయితే అదృష్టవశాత్తూ అరెస్టు చేసిన టైమింగ్ ఆధారాలు, పోలీసులు చెప్పిన విషయాలు సరిపోలకపోవడంతో హైకోర్టు సీబీఐకి రిఫర్ చేయడంతో ఆయన బైటపడ్డాడు. అదే కేసులు మరికొంత యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.టీడీపీ నేతల తప్పులనూ వైఎస్సార్సీపీకి అంటగట్టే దుర్మార్గం..ఇక తునిలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యంలో ఈ ఘాటుకానికి పాల్పడింది కూడా టీడీపీ నేతే. టీడీపీ నేతను పట్టుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘాతుకంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఆందోళన రావడంతో ఉలిక్కపడ్డ ప్రభుత్వం, పోలీసులు కస్టడీలో ఉన్న వ్యక్తి చెరువులో దూకి చనిపోయాడని పోలీసులు చెప్పారు. మరుసటి రోజు లైంగిక అకృత్యానికి పాల్పడ్డ వ్యక్తి కుమారుడు తన తండ్రి మరణంపై అనుమానం ఉందని కేసు పెట్టాడు. మరోవైపు మైనర్ బాలికపై లైంగిక అఘాయిత్యానికి పాల్డడ్డ వ్యక్తిని వీడియో తీసి... బాలిక చదువుతున్న స్కూల్ కి పంపిస్తే... దానికి అతనిపై చనిపోయిన వ్యక్తి కుమారుడు చేత ఫిర్యాదు తీసుకుని ఫోక్సో కేసు నమోదు చేశారు. అందులో అదర్స్ అని రాయడం ద్వారా వైయస్సార్సీపీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేరం చేసిన వాళ్లకు సంబంధించి అనుమానాస్పదంగా చనిపోయాడని చెబుతూ... నిందితుల తరపున ఎందుకు వకాల్తా తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉన్నాయి. జోగి రమేష్ అరెస్టులో కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారు.. ఆధారాలు సైతం అక్కడే ఉంటే... ఇక్కడ విజయవాడలో జోగి రమేష్ ను అరెస్టు చేస్తున్నారు. తప్పుడు కేసు పెట్టడానికి కూడా జనం నమ్ముతారా ? కోర్టులో నిలబడుతుందా? అన్నది ఆలోచించడం లేదు. ఇవాల్టికి అరెస్టు చేసి.. రెండు మూడు నెలలు జైల్లో వేస్తే.. మిగిలిన విషయాలు తర్వాత చూసుకోవచ్చు అని భావిస్తున్నారు. నకిలీ లిక్కర్ కేసులో అసలు సూత్రధారి జయచంద్రా రెడ్డి, అతనే ఫ్యాక్టరీ పెట్టాడు, అతనికి సంబంధించిన బార్లలో నకిలీ లిక్కర్ అమ్మకాలు చేస్తున్నాడని పోలీసులే చెప్పారు. అతను సాక్షాత్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి, కానీ వారి అరెస్టులు మాత్రం ఉండవు.నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జయచంద్రా రెడ్డికి చంద్రబాబు బీఫామ్ ఇస్తున్న దృశ్యం చూస్తే.. జనరల్ గా బీపామ్ తీసుకున్నప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ జయచంద్రారెడ్డి పక్కనే ఆయన ఆత్మలా జనార్ధనరావు పక్కనే ఉన్నాడు. ఇది పక్కన పెట్టి.. ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం జోగి రమేష్ తో ఏదో పెళ్లిలో జనావర్ధన రావు ఫోటో దిగితే దాన్ని ఆధారంగా చూపిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబుతో బీపామ్ తీసుకుంటున్న జయచంద్రా రెడ్డి, పక్కనే జనార్ధన రావు ఉంటే దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు. వీళ్లద్దరూ ఆఫ్రికాలో వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వాస్తవానికి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడ్డంతోనే రాష్ట్రంలో ఒక దుమారం చెలరేగింది. మద్యం సేవించే వారిలోనూ ఒక భయం మొదలైంది. దీన్ని డైవర్షన్ చేయడానికి.. సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవడం అలవాటైన చంద్రబాబు... తక్షణమే నకిలీ మద్యం వ్యవహారాన్ని జోగి రమేష్ వైపు తిప్పాడు. జోగి రమేష్ , వైయస్సార్సీపీకి దెబ్బ కొట్టడంతో పాటు, తన పార్టీ నేతలైన జయచంద్రారెడ్డి ఇతరులను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆఫ్రికాలో ఉన్న జనార్ధన రావుతో ముందే మాట్లాడుకుని అతడ్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఎయిర్ పోర్టులో జనార్ధరావు చొక్కా, పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన పేరు మీద విడుదల చేసిన వీడియోలో చొక్కా రెండూ ఒకటే. ఇదెలా సాధ్యం. మరో కీలకమైన విషయం జనార్ధన రావు ఫోన్ దొరికితే అందులో జయచంద్రా రెడ్డితో పాటు టీడీపీ నేతల వివరాలు, వారి లావాదేవీలు బయటపడతాయి కాబట్టి ముంబాయిలో పోన్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత జనార్ధన రావు ఒక వీడియో విడుదల చేశాడు. ఇది ఎలా అతుకుతుంది.ఆగని నకిలీ లిక్కర్ తయారీ...లిక్కర్ బాటిల్లు చూసి కొనండి.. క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించింది. అంటే నకిలీ లిక్కర్ తయారిని ప్రభుత్వం అంగీకరించింది. వైన్ షాపులలో క్యూ ఆర్ కోడ్ పెడతారు సరే.. బెల్టు షాపులలో ఏం క్యూఆర్ కోడ్ ఉంటుంది. అక్కడెలా నకిలీ లిక్కర్ ని నియంత్రిస్తారు. రాష్ట్రంలో లక్షకు పైగా బెల్టు షాపులున్నాయి. వీటి ద్వారా ఈ నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఇవి కాక వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూములకు అనుమతి ఇచ్చారు. అక్కడ లూజ్ సేల్ ఉంటుంది. అంటే అక్కడ కూడా నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. సోడా మిషన్లు మాదిరిగా కూటమి పాలనలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. దానికి సాక్ష్యం బెల్టు షాపుల్లో జరుగుతున్న అమ్మకాలే. ప్రభుత్వానికి అంతంత మాత్రం ఆదాయం పెరిగింది. లిక్కర్ అమ్మకాలు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఇదే నిదర్శనం. జోగి రమేష్ అరెస్టు అత్యంత దుర్మార్గం, అన్యాయం. నియంతల పాలనలో కూడా లేనంతగా వ్యవస్దలను కూటమి ప్రభుత్వం కంట్రోల్ చేసి... హిట్లర్ కంటే దారుణంగా పాలన సాగిస్తున్నాడు. రెడ్ బుక్ పేరుతో లోకేష్ ఈ దారుణాలన్నీ కొనసాగిస్తున్నాడు.తప్పులు నిలదీస్తే కేసులు - నారా వారి రూల్ ఆఫ్ లా...కేవలం తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా, పూర్తి స్పృహతోనే, క్రూరమైన, అణిచివేత ధోరణితో కూడిన పాలన సాగిస్తున్నారు. ప్రత్యర్థుల వాయిస్, ప్రజల ఆకాంక్షలు బయటకు వినిపించకుండా గొంతు నొక్కడంతో పాటు వీరి చేస్తున్న దుర్మార్గాలను ఎదుట వాళ్ల మీద నెట్టడంలో వీళ్లు సిద్ధహిద్దులు. లోకేష్ వీటన్నింటికీ ఆద్యుడు. ముందు అరెస్టు చేసి.. సెల్ఫ్ కన్ఫెషన్ పేరుతో వారే స్టేట్ మెంట్లు తయారు చేస్తున్నారు. కోర్టుల్లో నిలబడినా, లేకున్నా ముందుగా జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ కేసు తీసుకున్నా మూడు అంశాల మీదే నడుస్తుంది. తామనుకున్న వారిని అరెస్టు చేయడం, వారి పేరు మీద స్టేట్మెంట్ రాసుకోవడం, ఎవరి మీద వాళ్లకు కోపం ఉంటే.. వాళ్ల స్ధాయిలను బట్టి వారి పేర్లు కూడా కేసులో చేర్చడం పనిగా మారింది. ఇలా నెలల తరబడి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నారా వారి కొత్త రూల్ ఆఫ్ లా. కన్ఫెషన్ పేరుతో అరెస్టు చేయడం, తమకు నచ్చిన సెక్షన్లతో కేసు నమోదు చేయడం అలవాటుగా మారింది. అరెస్టు చేసిన తర్వాత వాళ్ల ఇంట్లో సోదాలు చేసి... అక్కడ పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు చూపిస్తున్నారు. అవి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తమకు కావాల్సిన అధారాలను వీళ్లే అక్కడ పెట్టి.. వాటినే కోర్టులో ఎవిడెన్స్ గా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి.నిష్పాక్షపాతంగా దర్యాపు చేయడానికి ఇన్వెస్టిగేషన్ అధికారికి చట్టానికి లోబడి ఇచ్చిన వెసులుబాటును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆమాత్రం వెసులు బాటు ఇవ్వకపోతే దర్యాప్తు ఎలా ముగుస్తుందని అనుకుంటున్న పరిస్థితి. దానివల్ల నేరం చేయకుండా కూడా అధికారంలోకి ఉన్నవాడికి నచ్చకపోతే శిక్షకు గురవుతావన్నది రుజువు అవుతుంది. శిక్ష కరారు కాకముందే.. నిందితుడు 50 రోజులో, 60 రోజులో... ఏ నేరం చేయకున్నా, ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు. ఈ కేసులో నిజానికి ఇంకా రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ లిక్కర్ తయారీ జరుగుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరిస్తుంది కాబట్టే... లిక్కర్ షాపులలో మద్యం బ్యాటిళ్లకు క్యూ ఆర్ కోడ్ పెట్టింది. దీన్ని అందరూ గమనించాలి.ప్రజా రక్షణ పట్టని ప్రభుత్వమిదికాశీబుగ్గ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ప్రమాదం అంటేనే అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరూ ప్రమాదాలు జరుగుతాయని ముందే ఊహించరు. కానీ ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పోలీసులదే. కాశీబుగ్గ ఘటన జరిగిన వెంటనే అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మాకు సంబంధం లేదు.. అది ప్రైవేటు దేవాలయం అని ప్రకటించారు. ఘోరం జరిగిన వెంటనే అది మాది కాదు అన్నారంటే.... తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. సిగ్గున్న ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఏ మాత్రం బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ప్రభుత్వాన్ని ఎందుకు తప్పుపడుతున్నారంటే.. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో ప్రమాదం జరిగింది ఆ తర్వాత కూడా ఈ ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. కారణం మీ ప్రాధాన్యాతలు వేరు. బాథ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించడం లేదు. వ్యవస్ధలో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా... దాన్నుంచి తప్పించుకోవడంతో పాటు పక్కవారిమీదకు నెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఆలయ ధర్మకర్త తాను ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పారు. ఒకవేళ చెప్పకపోయినా.. రెండేళ్ల నుంచి నిర్వహణలో ఉన్న ఆలయంలో పవిత్ర దినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న విషయం తెలియదా? పలాస లాంటి పట్టణంలో ఒకే దగ్గర అంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటే నాకు తెలియదని ఎలా తప్పించుకుంటారు ? చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న ప్రచార సాధనాల బలం తలకెక్కడంతో దేన్నీ పట్టించుకోవడం లేదు. ఏం జరిగినా ఎదుట వాళ్లదే తప్పు అని చెప్పడం పరిపాటిగా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయడమో.. సంబంధిత అధికారులను బాధ్యులను చేయకుండా... విచారణ చేయకుండానే, అసలేం జరగలేదని ముందే చెబితే ఇది ఏ రకమైన పాలన? ఎక్కడైనా సమస్య వచ్చినా పోలీసులో, అధికారులో చూసుకుంటారు, వారికి ఆ మేరకు అవగాహన ఉంటుందని ప్రజలు భావిస్తారు. ధైర్యంగా ఉంటారు. అలా ఉండే వారిని కూడా ప్రభుత్వం నీరుగార్చుతుంటే... ఇలాంటి పాలనే ఉంటుంది.రెండేళ్లలోనే రాష్ట్రంలో ఇంతటి దారుణంగా ఉంటే రానున్న మూడేళ్లలో మరింత వికృతంగా, విచ్చలవిడిగా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న దారుణాలను మీడియా, సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు స్టడీ చేసి ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే తప్పు చేసి ఎదుట వారి మీద కేసులు పెట్టి.. ఆ తప్పును కొనసాగించడం మరింత దారుణమని మండిపడ్డారు -
అకస్మాత్తుగా జోగి రమేష్ జైలు మార్పు..
జోగి రమేష్ అరెస్ట్.. అప్డేట్స్విజయవాడ:కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా నిన్న( ఆదివారం, నవంబర్ 2 వతేదీ) నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారుజోగి రమేష్ అరెస్టును ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ నేతలుమాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గరికిపాటి శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి గుంజ శ్రీనివాస్, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలుఎటువంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ పై అక్రమ కేసులు పెట్టారుఇది ప్రభుత్వ పైశాచిక ఆనందంజోగి రమేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్నారు.మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూడా కేసులు పెడుతున్నారు.. ఇది దుర్మార్గ పాలన కాదా?ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి వేల మంది వైఎస్సార్సీపీ సైనికుల గొంతుకలు సిద్ధంగా ఉన్నాయి.నెల్లూరు జైలుకు జోగి రమేష్జైలు మార్పుతో జోగి రమేష్ కుటుంబ సభ్యుల్లో ఆందోళనవిజయవాడ నుంచి ఆకస్మాత్తుగా నెల్లూరు తరలింపునెల్లూరు జైలుకు జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాముజోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు.జోగి రమేష్ భార్య, కుమారులపై కేసు నమోదు చేసింది. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినపుడు జీజీహెచ్లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టినట్టు ఫిర్యాదు మాచవరం పోలీసులకు డ్యూటీ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఫిర్యాదుగుణదల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా శ్రీనివాసరావు విధులు శ్రీనివాసరావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు ఏ1 గా జోగి రమేష్ భార్య శకుంతల దేవి , ఏ2 గా జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ , ఏ3గా జోగి రమేష్ చిన్న కుమారుడు రోహిత్లపై కేసు నమోదు నకిలీ మద్యం కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం(నవంబర్ 2వ తేదీ) ఉదయం అక్రమంగా అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ , ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు సిట్, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు చేరుకున్నారు.జోగి రమేష్ ఇంట్లో ఉండటంతో తలుపులు తోసుకొని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. మూడున్నర గంటలపాటు హడావుడి చేశారు. ఉదయం 8గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. -
బాబు సర్కార్ ప్లాన్ అదేనా?
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసులో సిట్ రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అధికారులు. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కంటే.. అక్రమ అరెస్టులపైనే సిట్ శ్రద్ధ పెట్టినట్లు జోగి రమేష్ వ్యవహారంతో స్పష్టమవుతోంది. నాటకీయ పరిణామాల నడుమ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. ఆ సమయంలోనూ ఈ కేసు ప్రధాన నిందితుడు(ఏ1) అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన కట్టుకథనే సిట్ వల్లేవేయడం గమనార్హం. అలాగే రిమాండ్ రిపోర్టులో జనార్దన్తో నమోదు చేయించిన వాంగ్మూలాన్నే వినిపించిన అధికారులు.. రమేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. జనార్దన్రావు-జోగి రమేష్కు మధ్య జరిగిన లావాదేవీలను సైతం నిరూపించలేక చతికిపలడ్డారు. జనార్దన్ పోయిందని చెబుతున్న ఫోన్ తాలుకా స్క్రీన్ షాట్లనే మళ్లీ ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో.. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అలాగే నకిలీ మద్యం అమ్మకాలు జరిపిన శ్రీనివాస వైన్స్ ఓనర్ మహంకాళి పూర్ణ చంద్ర రావుపై ఇప్పటిదాకా కేసు నమోదు చేయలేదు కూడా. అంతేకాదు ఫేక్ లిక్కర్ డైరీలో పలువురు బడా నేతలు పేర్లున్నాయని దర్యాప్తు తొలినాళ్లలో ప్రకటించిన సిట్.. ఇప్పుడు గమ్మున ఉండిపోవడమూ పలు అనుమానాలను తావిస్తోంది. దీంతో.. సీఎం చంద్రబాబు డైరెక్షన్తోనే టీడీపీ నాయకులని తప్పించేందుకు అధికారులు నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్సీపీ అంటోంది. పదిరోజుల రిమాండ్నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును ఏ-18 గా, ఆయన సోదరుడు జోగి రామును ఏ-19 గా ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ఆరవ ఏజెఎంఎఫ్సీ న్యాయస్థానం ఈ ఇద్దరికీ 10రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది . దీంతో ఇరువురిని విజయవాడ సబ్జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ మంగళవారం(రేపు, నవంబర్ 12) విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: దుర్గమ్మ చెంత సత్యప్రమాణం.. బాబు, లోకేష్కు ఆ దమ్ముందా? -
ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: సీఎంఎస్3 ఉపగ్రహంతో కూడిన ఎల్వీఎం3–ఎం5 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శాస్త్రవేత్తలకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ అంతరిక్ష విజయాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు.ఈ ప్రయోగం భారతదేశ అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే రాబోయే దశాబ్దాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తుందని వైఎస్ జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
పచ్చ మాఫియా దందా.. అందుకే ‘సిట్’ అండ!
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలే సూత్రధారులు, పాత్రధారులుగా సాగుతున్న నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు కొల్లగొట్టే పన్నాగానికి పాల్పడిన ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు కుతంత్రం పన్నింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ను బేఖాతరు చేస్తూ టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను రంగంలోకి దించింది. డైవర్షన్ డ్రామాలో భాగంగానే వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాములను ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా అరెస్టు చేసింది. ప్రజల్ని, న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించి కుట్రకు పాల్పడింది.రాష్ట్రంలో బట్టబయలైన నకిలీ మద్యం మాఫియా వెనుక అసలు సూత్రధారులు టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలే అన్నది ఆధారాలతో సహా బట్టబయలైంది. కుటీర పరిశ్రమ తరహాలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారీ యూనిట్లు నెలకొల్పడం, దర్జాగా సరఫరా, విక్రయాల వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి. ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల దోపిడీకి 2024 ఎన్నికలకు ముందే పక్కా పన్నాగం పన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్లను కాదని 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ను జయచంద్రారెడ్డికి ఇచ్చారు. నకిలీ మద్యం మాఫియాలో ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. ఇక జంట హత్యల కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష ప్రసాదించింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బహిరంగ రహస్యం. ఆ ముగ్గురూ టీడీపీ ముఖ్యులకు సన్నిహితులునకిలీ మద్యం కేసులో ఏ1గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీ.ఫారం ఇచ్చినప్పుడు ఆయన కూడా ఉన్నారు. బీ.ఫారం స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కాగా జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫాం ఇస్తున్నప్పుడు జనార్దనరావు పక్కనే ఉండటం చూస్తుంటే ఆయన వారికి ఎంతటి సన్నిహితుడన్నది స్పష్టమవుతోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన రావులు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫొటో, వీడియో ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయట పడిన నకిలీ మద్యం మాఫియా వేర్లు రాష్ట్రం అంతటా విస్తరించాయి. టీడీపీ సీనియర్ నేతలు ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ మద్యం సిండికేట్ ద్వారానే నకిలీ మద్యాన్ని దర్జాగా మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు, బెల్ట్ దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్నారని వెల్లడవ్వడంతో ప్రభుత్వ పెద్దల బండారం బట్టబయలైంది. దాంతో బెంబేలెత్తిన ముఖ్య నేత తనకు అలవాటైన రీతిలో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. ఏ1 జనార్దన్రావుతో డైవర్షన్ వీడియో ముఖ్యనేత పొలిటికల్ ఫాంటసీ కథతో డైవర్షన్ డ్రామాకు తెరతీశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావుతో కుట్ర కథ నడిపించారు. ముఖ్యనేత అభయం ఇవ్వడంతోనే విదేశాల్లో ఉన్న ఆయన దర్జాగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్æ చెబితేనే తాను నకిలీ మద్యం దందాకు పాల్పడినట్టు అవాస్తవాలు, అభూత కల్పనలు మేళవించి కట్టు కథ వినిపించారు. ఆ వీడియో ఎల్లో మీడియాలో మొదట ప్రసారం కావడం గమనార్హం. జోగి రమేష్æ పేరు చెప్పాలని కెమెరా వెనుక నుంచి ఓ అధికారి ఆయనకు ఆదేశిస్తున్న మాటలు కూడా ఆ వీడియో రికార్డింగ్లో వినిపించడంతో ప్రభుత్వ కుట్ర బయట పడింది.అసలు అప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించిన నిందితుడు మీడియాతో ఎలా మాట్లాడారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ వీడియోలో జనార్దనరావు నకిలీ మద్యం దందాలో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి గురించి గానీ, అప్పటికే అరెస్టు అయిన సురేంద్రనాయుడు గురించి గానీ చెప్పనే లేదు. తద్వారా ప్రభుత్వ పెద్దల కుట్రకు పోలీసులు సహకరించినట్టు స్పష్టమవుతోంది. సీబీఐ వద్దు.. పచ్చ సిట్టే ముద్దునకిలీ మద్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ నేతలు, నిపుణుల డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని జోగి రమేష్æ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోపాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ను నియమించడం గమనార్హం. సీబీఐ దర్యాప్తు చేస్తే నకిలీ మద్యం దందా సూత్రధారులుగా ఉన్న తమ బండారం బయటపడుతుందన్నదే ప్రభుత్వ పెద్దల ఆందోళన అన్నది సుస్పష్టం. టీడీపీ పెద్దల దందాకు సిట్ రక్షా కవచం⇒ కీలక పాత్రధారి జయచంద్రారెడ్డి ఎక్కడ?⇒డిస్టిలరీల ప్రతినిధులను ఎందుకు ప్రశ్నించరు?ముఖ్య నేత ఆదేశాలతోనే సిట్ ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తోంది. నకిలీ మద్యం మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న టీడీపీ నేతలను కనీసం ప్రశ్నించేందుకు కూడా సిట్ అధికారులు యత్నించక పోవడమే అందుకు నిదర్శనం. ములకలచెరువులో బయట పడిన నకిలీ మద్యం దందా వెనుక ప్రధాన పాత్రధారి టీడీపీ నేత జయచంద్రారెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన్ను దేశానికి రప్పించేందుకు సిట్ ప్రయత్నించడమే లేదు. ఆయనకు వ్యతిరేకంగా రెడ్కార్నర్ నోటీసు జారీ చేయలేదు. ఇక నకిలీ మద్యం దందాకు నిధులు ఎవరు సమకూర్చారన్నది ఆరా తీయడమే లేదు. ప్రధానంగా నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్ను అక్రమంగా ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టనే లేదు.ఎందుకంటే టీడీపీ కీలక నేతల కుటుంబాలు నిర్వహిస్తున్న మద్యం డిస్టిలరీల ముసుగులోనే స్పిరిట్ను కొనుగోలు చేస్తున్నందునేనని స్పష్టమవుతోంది. అందుకే ఆ మద్యం డిస్టిలరీల ప్రతినిధులను విచారించేందుకు సిట్ ససేమిరా అంటోంది. మద్యం డిస్టిలరీలలో సోదాలు నిర్వహించనే లేదు. ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ కీలక నేతల కుటుంబ సభ్యులను కూడా సిట్ ప్రశ్నించనే లేదు. అంటే నకిలీ మద్యం మాఫియా నిర్వహిస్తున్న టీడీపీ పెద్దలకు ‘సిట్’ రక్షా కవచంగా నిలుస్తోందన్నది సుస్పష్టం. ఇందులో భాగంగానే నకిలీ మద్యం కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ను అక్రమంగా అరెస్టు చేసింది.నకిలీ మద్యం తయారీకి అక్రమంగా స్పిరిట్ సరఫరా చేస్తున్న టీడీపీ నేతల డిస్టిలరీలలో సోదాలు చేయని సిట్ అధికారులు.. జోగి రమేష్æ నివాసంలో మాత్రం సోదాలు చేయడం గమనార్హం. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ నేతల కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చని సిట్ అధికారులు.. జోగి రమేష్æ సోదరుడు జోగి రామును కూడా అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రకు తార్కాణం. -
ఒక్క ఆధారం ఉంటే ఒట్టు!
సాక్షి, అమరావతి: జోగి రమేష్కు వ్యతిరేకంగా సిట్ అధికారులు ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా రిమాండ్ నివేదికలో చూపించలేక పోయారు. వారు బెదిరించి జనార్దనరావుతో నమోదు చేయించిన అబద్దపు వాంగ్మూలం ఆధారంగానే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. జోగి రమేష్, జనార్దనరావు మధ్య.. జోగి రమేష్, జయచంద్రారెడ్డిలమధ్య వ్యాపార లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపలేదు. అదే సమయంలో జయచంద్రారెడ్డి, జనార్దనరావు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానానికి మధ్య రాజకీయ బంధం, అనుబంధం ఉందని సిట్ అధికారులు పేర్కొన్నారు. మరి నకిలీ మద్యం మాఫియాలో పాత్రధారి అయిన జయచంద్రారెడ్డి వెనక సూత్రదారులుగా ఉన్న టీడీపీ పెద్దలపై విచారణ ఎందుకు చేపట్టలేదో సిట్ అధికారులకే తెలియాలి. ఈ రిమాండ్ నివేదికలో జోగి రమేష్ వాంగ్మూలం ఇచ్చినట్టు, ఆయన సంతకం చేసినట్టు సిట్ ప్రస్తావించక పోవడం గమనార్హం. అంటే సిట్ అధికారుల నిరాధార ప్రశ్నలతో కూడిన కుట్రను విచారణ సందర్భంగా ఆయన తిప్పికొట్టినట్టు స్పష్టమవుతుంది. అంతా కట్టుకథ అని తెలుస్తోంది.కాగా, జోగి రమేష్æ ఏ–18, జోగి రాము ఏ–19గా చూపించారు. ఈ కేసులో మరో నలుగురిని ఏ–20గా మనోజ్ కొఠారి, ఏ–21గా సుదర్శన్, ఏ–22గా సింథిల్, ఏ–23గా ప్రసాద్ను తాజాగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 23 మందిపై కేసు నమోదైంది. టీడీపీ పెద్దలే కర్త, కర్మ, క్రియగా సాగిన నకిలీ మద్యం మాఫియా కేసును పక్కదారి పట్టిస్తూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టును రూపొందించడం విస్మయ పరుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో జోగి రమేష్ను హాజరు పరిచిన నేపథ్యంలో సమర్పించిన రిమాండ్ నివేదిక ప్రభుత్వ కుట్రను స్పష్టం చేసింది. కేసులో వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.⇒ జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది టీడీపీయే. ఆయనకు మద్యం దుకాణాలు మంజూరైంది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం తయారుచేసి విక్రయించిందీ ఆ మద్యం దుకాణాల ద్వారానే. అంటే ఆయన రాజకీయ జీవితం, వ్యాపార వ్యవహారాలన్నీ టీడీపీతోనే ముడిపడ్డాయి. ఈ విషయాలన్నింటినీ సిట్ రిమాండ్ నివేదిలో పేర్కొంది. కానీ టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావు ఈ నకిలీ మద్యం దందా అంతా వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే చేశారట! వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా న్యాయస్థానాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రభుత్వం ఇలా బరితెగించి సిట్తో కుతంత్రాలు చేయించింది. ⇒ ఈ కేసులో ఏ1గా అద్దేపల్లి జనార్దనరావును కేంద్రబిందువుగా చేసుకుని సిట్.. జోగి రమేష్కు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని స్పష్టమవుతోంది. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, జనార్దనరావు వ్యాపార భాగస్వాములు, సన్నిహితులని సిట్ చెబుతోంది. కానీ జనార్దనరావు.. జోగి రమేష్కు సన్నిహితుడని నమ్మించేందుకు సిట్ కట్టుకథలు అల్లింది. ⇒ జోగి రమేష్ చెబితేనే జనార్దనరావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని సిట్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ చెబితే ఆయన ఎందుకు చేస్తారనే కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. వారిద్దరూ (జనార్దనరావు, జయచంద్రారెడ్డి) ఎన్నో ఏళ్లుగా ఆఫ్రికాలో ఇదే తరహా నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించారని అదే నివేదికలో సిట్ పేర్కొంది. అటువంటి చరిత్ర ఉన్న జయచంద్రారెడ్డికి టీడీపీ ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్న విషయాన్ని సిట్ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే పట్టించుకోలేదు. ఎందుకంటే రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకు పాల్పడాలనే కుట్రతోనే ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చింది. అందుకే ఆ అంశాన్ని సిట్ రిమాండ్ రిపోర్ట్లో పొందుపర్చలేదు.నేను ఏ తప్పూ చేయలేదున్యాయమూర్తి ఎదుట జోగి రమేష్తాను ఏ తప్పు చేయలేదని, నకిలీ మద్యం వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని జోగి రమేష్ న్యాయమూర్తి ఎదుట స్పష్టం చేశారు. పాత విషయాలను దృష్టిలో పెట్టుకుని తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వాపోయారు. సీఎం చంద్రబాబు తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు చనిపోవడం, తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను అరెస్టు చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, పైన దేవుడు కూడా చూస్తున్నాడన్నారు. -
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి.. దాని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ తమ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. బాబు డైవర్షన్ పాలిటిక్స్ హ్యాష్ ట్యాగ్తో ఆదివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ⇒ ‘చంద్రబాబు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ⇒ గత 18 నెలలుగా ప్రభుత్వం మీది.. పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు.. మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. ⇒ మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అమ్మేది మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్ షాపుల్లో.. మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టు షాపులు, పరి్మట్ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీ వారు, అమ్మేదీ మీ వారే.. కానీ బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. ⇒ నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది చంద్రబాబు గారూ.. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం!?.


