ఆధార్‌ సేవల టెస్టు పాస్‌ కాకుంటే ఇంక్రిమెంట్‌ కట్‌ | Aadhaar services test for Digital Assistants working in secretariats | Sakshi
Sakshi News home page

ఆధార్‌ సేవల టెస్టు పాస్‌ కాకుంటే ఇంక్రిమెంట్‌ కట్‌

Jan 13 2026 4:54 AM | Updated on Jan 13 2026 4:54 AM

Aadhaar services test for Digital Assistants working in secretariats

సాక్షి, అమరావతి: నిర్ణీత అర్హత కలిగిన వ్యక్తులే ఆధార్‌ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఆ­ధార్‌ జారీ సంస్థ యూఐడీఏఐ నిర్ధారించిన ఎన్‌ఎస్‌­ఈఐటీ పరీక్ష గ్రామ, వార్డు సచివా­ల­యా­ల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్‌ ఈ ఏడా­ది మా­ర్చి­లోగా ఉత్తీర్ణత కాకుంటే ఆయా డిజి­టల్‌ అసి­స్టెంట్లకు తదుపరి వార్షిక ఇంక్రిమెంట్‌ నిలుపు­దలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి అందించిన ఆదేశాల మే­ర­కు ఆయా జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు తమ పరిధిలోని ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆయా పరీక్ష ఉత్తీర్ణత కాని వారితో పాటు అసలు పరీక్షకు హాజరు కాని వారికీ, పరీక్షకు దరఖాస్తే చేయని వారికి, పరీక్ష ఉత్తీర్ణత అయినా ఆధార్‌ సేవలు అందించేందుకు అయిష్టత తెలిపిన వారికీ తదుపరి వార్షిక ఇంక్రిమెంట్‌ నిలుపు­దల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసా­గించేందుకు గ్రేడ్‌–5 పంచాయతీ కార్యదర్శు­లతో పాటు డిజిటల్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డు అడ్మిన్‌ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ­లు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీలు ఎన్‌ఎస్‌ఈఐటీ పరీక్ష వచ్చే మార్చిలోపు తప్పనిసరిగా పాస్‌ కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డిసెంబరు 31వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాల్లో ఎంపీడీఓలకు జారీ చేసిన ఆదేశాల్లో కేవలం డిజిటల్‌ అసిస్టెంట్ల విషయంలోనే వార్షిక ఇంక్రిమెంట్‌ నిలుపుదల అంశం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement