ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..
అసెంబ్లీ మీడియా పాయింట్..
ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ కామెంట్స్..
- తిరుమల లడ్డుపై చర్చ జరగకుండా స్టేట్మెంట్లు ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది
- ప్రతిపక్షాలు ఏం చెబుతున్నాయో వినే ఓపిక లేదా మీకు?
- మా అభిప్రాయం చెప్పనివ్వకుండా మా గొంతు నొక్కొద్దు
- బుధవారం నాడు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి.
ఎమ్మెల్సీ కుంభారవి కామెంట్స్..
- చంద్రబాబు లడ్డు అపవిత్రంగా మారిపోయిందని ఆరోపణలు చేశారు
- ఇలా మాట్లాడటం చాలా దురదృష్టం..
- రాష్ట్ర ప్రజలకు నిజ నిజాలు తెలపాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉంది
- చంద్రబాబు శ్రీవారి లడ్డులో పంది కొవ్వు కలిసిందని విష ప్రచారం చేశారు
- చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ నివేదికతో డిఫెన్స్లో పడింది.
- సభా సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రి పయ్యావుల కేశవ్ వ్యవహరిస్తున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు
- ఇందాపూర్, వైష్ణవి సంస్థలకు హెరిటేజ్కు ఉన్న సంబంధాలు ఏంటి
- 350 రూపాయలు ఉన్న నెయ్యిని.. 650కి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు
- మండలిలో మేము ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేక తోక ముడిచింది
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కామెంట్స్..
- శాసన మండలిలో లడ్డు గురించి స్వల్పకాలిక చర్చపై కూటమి ప్రభుత్వం భయపడింది
- స్వామి వారి కీర్తిని.. ప్రతిష్టను రాజకీయం చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు
- తిరుమల వెంకన్నను అవమానించిన నాయకుడు చంద్రబాబు
- హిందువులను రెచ్చగొట్టి వైఎస్ జగన్కు దూరం చేయాలని చంద్రబాబు చూశారు
- నోటితో కూడా మాటలు రాని విధంగా విష ప్రచారం చేశారు
- సిట్ రిపోర్టు వచ్చాక.. కొత్త కెమికల్ అని హడావిడి చేశారు
- దేవదేవుడిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది చంద్రబాబు.
- రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకోవడం మానేయండి..
- ఇప్పటికైనా స్వామి వారికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
- హెరిటేజ్పై సీబీఐ విచారణ జరిపించాలి..
- శాసనమండలిలో లడ్డుపై చర్చ జరిగే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కామెంట్స్
- ఈరోజు శాసనమండలిలో కూటమి నేతల తీరు ప్రజాస్వామ్యం తలదించుకునేలా ఉంది
- తిరుమల తిరుపతి లడ్డు అంశంలో ఇందాపూర్, హెరిటేజ్ బంధాలు బయటపడ్డాయి
- చంద్రబాబు మాట్లాడిన మాటలు హిందువులు కూడా మాట్లాడటానికి ఇష్టపడరు
- చంద్రబాబు తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడారు
- నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి.. దౌర్భాగ్యంగా మాట్లాడారు
- రాజకీయ స్వలాభం కోసం వైఎస్సార్సీపీపై బురద వేయాలని ఆలోచనతో చంద్రబాబు మాట్లాడారు..
- చంద్రబాబు రాజకీయ కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రయోజనాల ఉద్దేశించి మాట్లాడారు.
- ఇందాపూర్ను ముందుంచి హెరిటేజ్కు కోట్లాది రూపాయలు దోచి పెట్టేందుకు చేసిన కుట్ర ఇది.
- కూటమి తప్పుడు ప్రచారంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
- కూటమి సర్కార్కు ధైర్యం ఉంటే ఎందుకు చర్చించడం లేదు.
- మండలిలో మూడు గంటలుగా మేము నిరసనలు తెలిపాం.
- కూటమి సర్కార్కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
- అసెంబ్లీ..
- అసెంబ్లీ ఆవరణలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
- లడ్డుపై చర్చ జరుపనందుకు ఎమ్మెల్సీల నిరసన
- రోడ్డు మీద బైఠాయించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన..
- లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..
- చర్చకు అంగీకరించని ప్రభుత్వం.. అట్టుడుకుతున్న శాసన మండలి.
- చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైఎస్సార్సీపీ.
- చర్చ జరగాల్సిందేనని వైఎస్సార్సీపీ సభ్యుల పట్టు.
లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..చర్చకు అంగీకరించని ప్రభుత్వం, అట్టుడుకుతున్న శాసనసమండలి, చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైయస్ఆర్ సీపీ. చర్చ జరగాల్సిందేనని వైయస్ఆర్ సీపీ పట్టు. నిన్న చర్చ ప్రారంభమైన తర్వాత ఉద్దేశ పూర్వకంగానే అధికారపక్షం అడ్డుకుంది, ఇవాళ ఆ చర్చను కొనసాగించాలి,… pic.twitter.com/HcJNFtPbxJ
— YSR Congress Party (@YSRCParty) February 27, 2026
బీఏసీ మీటింగ్ బాయ్కాట్..
- శాసనమండలి..
- బీఏసీ సమావేశాన్ని బాయ్కాట్ చేసిన వైఎస్సార్సీపీ సభ్యులు.
- లడ్డు ప్రసాదంపై చర్చ జరపాలని ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.
మీడియా పాయింట్..
ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కామెంట్స్..
- మంత్రి సభను ఆపించారు..
- చైర్మన్కి తెలియకుండా మంత్రి స్టేట్మెంట్ చదువుతామని అన్నారు..
- ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నాం..
- చర్చకి వస్తామని చెప్పారు..
- చర్చకి మాత్రం రాలేదు..
- చర్చకు కూటమి నేతలు భయపడుతున్నారు.
- చర్చకి వచ్చే వరకు పట్టుబడతాం.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..
- ప్రభుత్వం చర్చకి భయపడుతుంది..
- చర్చకి వస్తామని చెప్పి వాయిదా వేయించారు..
- టీడీపీలో అక్రమాలు బయట పడతాయని పారిపోతున్నారు..
- హెరిటెజ్, ఇందాపూర్, వైష్ణవి మధ్య సంబంధాలు బయట పడతాయని భయపడుతున్నారు
- తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డుపై కామెంట్స్ చేసారు..
- చర్చ సాగే మా పోరాటం కొనసాగుతుంది..
- బడ్జెట్పై కూడా చర్చ జరగాలి..
ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కామెంట్స్..
- నిజాలు బయటకి వస్తాయని వాయిదా వేశారు..
- ఇందాపూర్, హెరిటెజ్పై సంబంధం బయట పడుతుంది అని భయపడ్డారు..
- రాయలసీమ ఎత్తిపోతలని కూటమి ఆపేసింది..
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి
సభలో గందరగోళం మధ్య మండలి వాయిదా..
- వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్.
- అధికార పక్షం సభలో చర్చను అడ్డుకోవడం సరికాదన్న చైర్మన్.
- మండలిలో లడ్డూపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం.
- అవసరమైతే 4, 5 తేదీల్లో చర్చిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు.
- లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ
- సభ వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు
మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం..
- లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పునః ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్ళీ మొదలు పెట్టాలనటం సరికాదు.
- మంత్రి పయ్యావుల కేశవ్ నాపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం..
- నేను సంతకం చేశానని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు.. అంటూ ఆగ్రహం
- అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలి..
- మీరు రాజకీయాలు చేసుకోండి.. కానీ, కుర్చీని అవమానించవద్దు.
👉శాసన మండలి సమావేశాలు ప్రారంభం..
అసెంబ్లీ
- అసెంబ్లీ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ధర్నా
- అసెంబ్లీ బయట రోడ్డుపై ధర్నా చేసున్న ఎమ్మెల్సీ లు
- తిరుమల లడ్డుపై చర్చ చేపట్టాలని ధర్నా
- మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
- తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం
- వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం
చర్చ కొనసాగించాలి: బొత్స
- శాసన మండలి
- తిరుమల లడ్డు పై చర్చ కొనసాగించాలన్న ప్రతిపక్ష నాయకుడు బొత్స
- సభలో చర్చ ప్రారంభించిన తరువాత వాయిదా పడిన కారణంగా..
- ఈరోజు కూడా చర్చ కొనసాగించాలని నిన్న మండలి చైర్మన్కు, సెక్రటరీ జనరల్కు బొత్స విజ్ఞప్తి



