తిరుమల లడ్డూపై చర్చ.. మండలిలో గందరగోళం | AP Assembly Session On 27th Feb Live Updates | Sakshi
Sakshi News home page

తిరుమల లడ్డూపై చర్చ.. మండలిలో గందరగోళం

Feb 27 2026 10:08 AM | Updated on Feb 27 2026 11:25 AM

AP Assembly Session On 27th Feb Live Updates

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్‌డేట్స్‌..

బీఏసీ మీటింగ్‌ బాయ్‌కాట్‌..

  • శాసనమండలి..
  • బీఏసీ సమావేశాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్‌సీపీ సభ్యులు.
  • లడ్డు ప్రసాదంపై చర్చ జరపాలని ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.

మీడియా పాయింట్..

ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి కామెంట్స్‌..

  • మంత్రి సభను ఆపించారు..
  • చైర్మన్‌కి తెలియకుండా మంత్రి స్టేట్‌మెంట్ చదువుతామని అన్నారు..
  • ఐదు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తున్నాం..
  • చర్చకి వస్తామని చెప్పారు..
  • చర్చకి మాత్రం రాలేదు..
  • చర్చకు కూటమి నేతలు భయపడుతున్నారు.
  • చర్చకి వచ్చే వరకు పట్టుబడతాం.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • ప్రభుత్వం చర్చకి భయపడుతుంది..
  • చర్చకి వస్తామని చెప్పి వాయిదా వేయించారు..
  • టీడీపీలో అక్రమాలు బయట పడతాయని పారిపోతున్నారు..
  • హెరిటెజ్, ఇందాపూర్, వైష్ణవి మధ్య సంబంధాలు బయట పడతాయని భయపడుతున్నారు
  • తన స్వార్థ ప్రయోజనాల కోసం తిరుపతి లడ్డుపై కామెంట్స్ చేసారు..
  • చర్చ సాగే మా పోరాటం కొనసాగుతుంది..
  • బడ్జెట్‌పై కూడా చర్చ జరగాలి..


ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి కామెంట్స్‌..

  • నిజాలు బయటకి వస్తాయని వాయిదా వేశారు..
  • ఇందాపూర్, హెరిటెజ్‌పై సంబంధం బయట పడుతుంది అని భయపడ్డారు..
  • రాయలసీమ ఎత్తిపోతలని కూటమి ఆపేసింది..
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పాలి
     

సభలో గందరగోళం మధ్య మండలి వాయిదా.. 

  • వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్‌.
  • అధికార పక్షం సభలో​ చర్చను అడ్డుకోవడం సరికాదన్న చైర్మన్‌.
  • మండలిలో లడ్డూపై చర్చను దారి మళ్లించే ప్రయత్నం.
  • అవసరమైతే 4, 5 తేదీల్లో చర్చిద్దామన్న మంత్రి అచ్చెన్నాయుడు. 
  • లడ్డూపై చర్చించేందుకు భయమెందుకు? అని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ 
  • సభ వాయిదా పడినా సభలోనే ఆందోళన కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
     

మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం..

  • లడ్డూ ప్రసాదం షార్ట్ డిస్కర్షన్ సందర్భంగా సభ పునః ప్రారంభం అయినప్పుడు ప్రశ్నోత్తరాలు మళ్ళీ మొదలు పెట్టాలనటం సరికాదు.
  • మంత్రి పయ్యావుల కేశవ్ నాపై మాట్లాడిన వ్యాఖ్యలు అవాస్తవం..
  • నేను సంతకం చేశానని ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు.. అంటూ ఆగ్రహం 
  • అధికార, ప్రతిపక్షాలు సభ సజావుగా జరగటానికి సహకరించాలి..
  • మీరు రాజకీయాలు చేసుకోండి.. కానీ, కుర్చీని అవమానించవద్దు. 

 

👉శాసన మండలి సమావేశాలు ప్రారంభం.. 
అసెంబ్లీ

  • అసెంబ్లీ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ధర్నా
  • అసెంబ్లీ బయట రోడ్డుపై ధర్నా చేసున్న ఎమ్మెల్సీ లు
  • తిరుమల లడ్డుపై చర్చ చేపట్టాలని ధర్నా
  • మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
  • తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం
  • వాయిదా తీర్మానం ఇచ్చిన ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం


చర్చ కొనసాగించాలి: బొత్స

  • శాసన మండలి
  • తిరుమల లడ్డు పై చర్చ కొనసాగించాలన్న ప్రతిపక్ష నాయకుడు బొత్స
  • సభలో చర్చ ప్రారంభించిన తరువాత వాయిదా పడిన కారణంగా..
  • ఈరోజు కూడా చర్చ కొనసాగించాలని నిన్న మండలి చైర్మన్‌కు, సెక్రటరీ జనరల్‌కు బొత్స విజ్ఞప్తి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement