కావలి వద్ద పట్టాలు తప్పిన రైలు.. పలు సర్వీసులు ఆలస్యం | Delhi Goods Train Incident At Nellore Kavali | Sakshi
Sakshi News home page

కావలి వద్ద పట్టాలు తప్పిన రైలు.. పలు సర్వీసులు ఆలస్యం

Jan 15 2026 7:12 AM | Updated on Jan 15 2026 7:13 AM

Delhi Goods Train Incident At Nellore Kavali

‍ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా రైల్వే ట్రాక్‌ స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం.

వివరాల మేరకు.. నెల్లూరులోని ​కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్‌ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా ట్రాక్‌ కొంత భాగం దెబ్బతిన్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే ​ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ​ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement