‘నేతన్న భరోసా’ ఏమైంది బాబూ! | Handloom weavers associations round table meeting demand: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘నేతన్న భరోసా’ ఏమైంది బాబూ!

Jan 5 2026 3:49 AM | Updated on Jan 5 2026 3:49 AM

Handloom weavers associations round table meeting demand: Andhra Pradesh

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు

చేనేతకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాల్సిందే

చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి

చేనేత సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌

డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న చలో మంగళగిరి

సాక్షి, అమరావతి: చేనేత రంగానికి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయా­లని చేనేత సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. ఏడాదికి రూ.25 వేల చొప్పున నేతన్న భరోసా పథకం కింద చంద్రబాబు ప్రభు­త్వం అందించాలని, చేనేత కార్మికులకు 200 యూ­నిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరింది. చేనేత రంగానికి సంబంధించి 18 ప్రధాన డిమాండ్ల సాధన కోసం 15 చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయ­వా­డ­లో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావే­శాన్ని నిర్వ­హించారు.

చేనేత రంగాన్ని ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు జరపా­లని సమావేశానికి హాజరైన నాయకులు డి­మాండ్‌ చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభు­త్వం చె­ల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలు విడు­దల చే­యాలని, రైతుల నుంచి ధాన్యాన్ని కొను­గోలు చేసి­నట్టుగానే నిల్వ ఉన్న చేనేత వస్త్రా­లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జీఎస్‌­టీని రద్దు చేయాలని, చిలప నూలు, పట్టు, రంగులు, రసా­య­నాలు సబ్సిడీ ధరలకు అందించాల­ని, చేనేత రంగానికి పావలా వడ్డీకే రుణా­లు ఇవ్వా­లని, నేత­న్నలకు 3 సెంట్ల చొప్పున భూమి ఇచ్చి ఇ­ళ్లు నిర్మించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

ఫిబ్రవరి 23న చలో మంగళగిరి
రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 23న చలో మంగళగిరి నిర్వహించాలని రౌండ్‌టేబుల్‌ సమా­వేశం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఏర్పాటు చేసింది. జేఏసీ కో–కన్వీ­నర్లుగా బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి నాగే­శ్వ­రరావు, బుధవారపు బాలాజీ, కట్టా దుర్గారావు ఎంపికయ్యారు. సమావేశంలో చేనేత సంఘాల జాతీ­య, రాష్ట్ర నేతలు నమాల శివరామప్రసాద్, పిల్లల­మర్రి బాలకృష్ణ, దామెర్ల శ్రీకృష్ణ, ముప్పన వీర్రాజు, వీరభద్రేశ్వ­రరావు, సుబ్రహ్మణ్యే­శ్వరరావు, చింతా శ్రీనివాసులు, సాయి ఓంకారయ్య, సమతం రమణ మహేష్‌ మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement