విజయవాడ: రూ. 13 వేల కోట్లు కొత్త ఆదాయం సాధించాలనే టార్గెట్ పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. వివిధ మార్గాల్లో ప్రజల నుండి ఈ ఆదాయాన్ని వసూలు చేసేందుక కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు రూ. 13 ఏల కోట్లు కొత్త ఆదాయం టార్గెట్ను పెట్టకున్నట్లు హెచ్ఓడీ సదస్సులో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు.
SGSTపై 1% సెస్ ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం సాధించాలనే ప్రతిపాదించారు. 55వ GST కౌన్సిల్ సమావేశంలో సెస్ పరిశీలనలో ఉంది. ఇక ఏపీ లాటరీ ద్వారా రూ. 3 వేల కోట్లు సాధించే ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు.
ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా రూ. 1,400 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల వినోద పన్ను రూపంలో ₹2,300 కోట్లు, రెండో, మూడో స్థాయి అమ్మకాలపై VAT ద్వారా ₹1,300 కోట్లు, ప్రొఫెషన్ టాక్స్ పెంపు ద్వారా ₹400 కోట్లు, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ పరిధిలో ప్రొఫెషన్ టాక్స్ వసూళ్ల బదిలీ ద్వారా ₹110 కోట్లు ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పీయూష్ కుమార్ వెల్లడించారు.


