సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబు లండన్ వెళ్లినట్లా? లేక ఇండోనేషియా పర్యాటక ప్రాంతం బాలి? వెళ్లారా అని’ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ప్రశ్నించారు. గత నాలుగైదు రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు కనిపించకపోవడంపై ఆయన మీడియా మాట్లాడారు.
‘సీఎం చంద్రబాబు మిస్ అయ్యారు. మంత్రి లోకేష్ కూడా కనపడటం లేదు. వీరిద్దరూ ఎక్కడకు వెళ్లారో ఆచూకీ తెలియదు.వైకుంఠ ఏకాదశి రోజున శంషాబాద్ నుండి బాలి వెళ్లినట్టు తెలిసింది. టీడీపీ నేతల మాత్రం చంద్రబాబు లండన్ వెళ్లారని అంటున్నారు.
నారా లోకేష్ గత నెల 28న కేథ్వే ఫసపిక్ ఎయిర్లైన్స్లో వెళ్లారని సమాచారం. ప్రతి మూడు నెలలకు ఒకసారి చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారు.ఆయన ఎందుకు పదేపదే విదేశాలకు వెళ్తున్నారో చెప్పాలి. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ 9 సార్లు విదేశాలకు వెళ్లారు. రూ.2.90 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారు.
వేల కోట్ల విలువైన భూములను బినామీలకు ఇచ్చి కమీషన్లు కొట్టేశారు. ఆ కమీషన్ల సొమ్ముతో విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నట్టు సమాచారం. కూటమి నేతల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది’ అని ధ్వజమెత్తారు.


