సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో పలు కీలక నియామకాలు చేపట్టారు. పార్టీలో కొత్త సమన్వయకర్తలు, సభ్యులను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంది.
నియామకాల వివరాలు
- తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా వడ్డీ రఘురామ్ నియమితులయ్యారు.
- పార్టీ పీఏసీ (PAC) సభ్యుడిగా కొట్టు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
- ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాది శ్యాం ప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు.
- సీఈసీ (CEC) సభ్యుడిగా పిరియా సాయిరాజ్ ఎంపికయ్యారు.
- శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్గా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.


