breaking news
Karnataka
-
యువతిపై సామూహిక అత్యాచారం
కర్ణాటక: డ్రాప్ చేస్తామని యువతిని బైక్ ఎక్కించుకున్న యువకులు ఆమెను నిర్జనప్రదేశానికి తీసికెళ్లి అత్యాచారం జరిపిన దారుణ సంఘటన చిక్కబళ్లాపురం పట్టణంలో జరిగింది. స్థానికంగా మెకానిక్ పని చేస్తున్న సికిందర్ బాబా (30), గుజరీ వ్యాపారి జనార్ధనాచారి(31)లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. సమీప గ్రామానికి చెందిన యువతి పని మీద ఆదివారం చిక్కబళ్లాపురానికి వచ్చింది. సాయంత్రం తిరిగి ఊరికి నడుచుకుంటూ వెళ్తుండగా దారి మధ్యలో బైక్పై వచ్చిన సికిందర్ డ్రాప్ చేస్తానని ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు. దారిలో నిర్జన ప్రదేశంలో ఆమైపె అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మళ్లీ స్నేహితుడు జనార్ధనాచారిని తీసుకుని వచ్చి యువతిపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను బైక్పై కూర్చోబెట్టుకుని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వదిలి వెళ్లిపోయారు. రోడ్డు మీదే యువతి ఏడుస్తూ కూర్చుని ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న మహిళా ఠాణా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు యువతిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.మహిళా వైద్యురాలితో అసభ్య ప్రవర్తనఇటీవల బస్సుల్లో కామాంధులు ఎక్కువయ్యారు. తాజాగా దొడ్డబళ్లాపురం నుంచి బెంగళూరుకు బస్సులో వస్తున్న మహిళా వైద్యురాలిని ఓ దుండగుడు వేధించాడు. ఆమె పక్కన కూర్చుని అసభ్యంగా తాకసాగాడు. దీంతో ఆమె కండక్టర్, డ్రైవర్కు విషయం చెప్పగా, పోలీసులకు ఫోన్ చేసి నిందితుడు ఫిరోజ్ఖాన్ని పట్టించారు. సంజయ్ నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.బస్సులో మరో దురాగతంబెంగళూరులో ఆర్టీసీ బస్సులో మరో దుస్సంఘటన జరిగింది. తుమకూరు నుంచి బెంగళూరుకు వస్తున్న బస్సులో ఓ వ్యక్తి ఎక్కి మహిళ పక్కనే కూర్చున్నాడు. ప్యాంట్ జిప్ తీసి యువతి దుస్తులపై వీర్యం చిమ్మాడు. ఈ చర్యతో భయంతో యువతి గట్టిగా కేకలు వేసింది. తోటి ప్రయాణికులు ఆ కామాంధున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మార్గమధ్యలో క్యాత్సంద్ర వద్ద బస్సు ఆపి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
ఫ్యామిలీ కోసం కార్పొరేట్ జీతాన్ని వదులుకుని రిస్క్ చేస్తే..!
సాధారణంగా కనీస ఆదాయం కోసం, లేదా ఉన్న ఉద్యోగానికి తోడుగా, కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు డెలివరీ బాయ్గానో, క్యాబ్ డ్రైవర్లగానో పార్ట్ టైం పనిచేసే వాళ్లను చూసి ఉంటాం. కానీ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఉబెర్ డ్రైవర్గా పని చేస్తూ సక్సెస్ సాధించిన వైనం నెట్టింట స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అసలు కార్పొరేట్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశాడు, అతని ఆదాయం ప్రస్తుతం ఎంత? పదండి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీని ప్రకారం దీపేష్ కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కార్పొరేట్ జీవితం, జీతం కంటే తన ఫ్యామిలీ లైఫే ముఖ్యమని భావించిన ఈ నిర్ణయం తీసుకున్నాడు. గతంలో రిలయన్స్ రిటైల్ లో పని చేసిన దీపేష్ అతను తన పని-జీవిత సమతుల్యతను మెరుగు పరుచు కోవడానికి ఉబెర్ డ్రైవర్ అయ్యాడు. రిలయన్స్ రిటైల్లో తన కెరీర్ను ప్రారంభించి ఎనిమిదేళ్లు పనిచేశాడు. నెలకు రూ. 40వేల జీతం. కానీ స్థిరమైన ఉద్యోగం , మంచి జీతం, కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, వర్క్ లైఫ్ బాలెన్స్ లేకపోవడం ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా తన భార్యా పిల్లలతో సమయం గడపలేకపోతున్నానని గ్రహించాడు. అంతేకాదు ఉద్యోగాన్ని వదిలి వేసి ఫుల్ టైం డ్రైవర్గా మారాలన్ని సాహసం చేశాడు.కట్ చేస్తే అతని నెల ఆదాయం ఇపుడు రూ. 50 వేలు. పైగా నెలకు 21 రోజులు మాత్రమే పని. మొత్తానికి ధైర్యం చేసి తాను కోరుకున్న జీవితాన్ని సాధించాడు అంటూ వరుణ్ అగర్వాల్ ఈ స్టోరీని షేర్ చేశారు..అంతేకాకుండా, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా, దీపేష్ మరో కారు కొన్నాడు. మరో డ్రైవర్ను నియమించుకున్నాడు. అంటే తన కాళ్ల మీద తానే నిలబడటమే కాదు మరొకరికి ఉపాధిని కల్పించడం విశేషం. జీవితంలో ముందుగా సాగాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోక తప్పదు అంటూ దీపేష్ సక్సెస్ సాధించిన తీరును ప్రశంసించారు వరుణ్. చదవండి: Diwali 2025: పూజ ఇలా చేస్తే, అమ్మవారి కటాక్షం పూర్తిగా మీకే!నెటిజన్ల రియాక్షన్స్దీపేష్ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ప్రాధాన్యతలను గుర్తించడం,, రిస్క్ తీసుకోవడం చాలా అవసరం. ఒక్క మెట్టు దిగినా పరవాలేదు.. దిల్ ఉంటే..కష్టపడితే అదే పెద్ద ప్రమోషన్ అని వ్యాఖ్యానించారు. మరిన్ని విజయాలు సాధించాలి అంటూ దీపేష్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: Down's syndrome పుట్టకముందే నిర్ధారణఎలా...? -
ఎయిర్పోర్టులో మత్తు గుట్టలు
బనశంకరి: శ్రీలంకలోని కొలంబో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చిన రూ.50 కోట్ల విలువచేసే డ్రగ్స్ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక పౌరునితో పాటు ముగ్గురిని అరెస్ట్చేశారు. వివరాలు.. ఈ నెల 9వ తేదీన కొలంబో నుంచి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 31 కేజీల హైడ్రో గంజా, 4 కేజీల అరుదైన సిలోసిబిన్ పుట్టగొడుగులను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో శ్రీలంక పౌరున్ని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 14 కిలోలు హైడ్రో గంజాయి, 2 కేజీల సిలోసిబిన్ పుట్టగొడుగులను పట్టుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ను, ఇతర నిషేధిత వస్తువులను ఆహార పదార్థాల టిన్నుల్లో నింపి తనిఖీల నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. వీటన్నింటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని తెలిపారు. రూ. 100 కోట్ల హైడ్రో గంజాయి.. నగరానికి హైడ్రో గంజాయి రవాణా అధికమైందని బెంగళూరు ఎన్సీబీ అధికారులు తెలిపారు. 2025లో ఇలాంటి 18 కేసుల్లో రూ.100 కోట్ల కు పైగా విలువచేసే 220 కిలోల హైడ్రో గంజాయి పట్టుబడిందని, కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర కు చెందిన 45 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు తెలిపారు. మార్కెట్లో కేజీ రూ.80 లక్షలు మామూలు గంజాయి కంటే హైడ్రో గంజాయి ఎక్కువ ప్రభావవంతమైనదని పెడ్లర్లు ప్రచారం చేస్తుంటారు. చిల్లర మార్కెట్లో ఒక కేజీ సుమారు రూ.80 లక్షల ధర పలుకుతోందని, ఐటీ బీటీ ఉద్యోగులు, బడా బాబులు పార్టీల్లో మత్తుకోసం అధికంగా వినియోగిస్తారని సమాచారం. అనేకమంది యువకులు థాయ్లాండ్ నుంచి హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. టెట్రాప్యాక్లు, చాక్లెట్లు, ఆహార పొట్లాలు, దుస్తులు మొదలైన వస్తువుల్లో దాచిపెట్టి స్మగుల్ చేస్తుంటారు. దుబాయ్, కొలంబో, నేపాల్ల మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారని ఎన్సీబీ అధికారులు తెలిపారు. రూ.50 కోట్ల హైడ్రో గంజాయి, పుట్టగొడుగుల సీజ్ శ్రీలంకవాసితో పాటు ముగ్గురు అరెస్ట్ -
హాసనాంబ దర్శనానికి భక్త దండు
బనశంకరి: హాసన్ నగరంలో కొలువైన హాసనాంబ దేవి ఆలయంలో అమ్మవారి దర్శనానికి నాలుగోరోజు భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సంతపేటే సర్కిల్ రోడ్డు పొడవునా భక్తులు బారులు తీరారు. సోమవారం ఉదయం 8 గంటలకు భక్తులు రద్దీ తగ్గింది. రూ.1000 టికెట్ , రూ.300 టికెట్లు కొని ఎక్కువమంది దర్శనం చేసుకొన్నారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి పాస్, లడ్డూల విక్రయంతో రికార్డు స్థాయిలో రూ.2.24 కోట్లు వసూలైందని అధికారులు తెలిపారు. రెవెన్యూశాఖ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 3.50 లక్షల మంది భక్తులు హాసనాంబ ను దర్శించుకున్నారు. సంవత్సరంలో కొన్నిరోజులు మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. మరోవైపు భక్తిగాన కచేరీ అలరించింది. వేలాది మందితో క్యూలు -
సోషల్ మీడియాలో కంపు
బనశంకరి: సోషల్ మీడియాలో మహిళలను దూషించడం, అశ్లీల చిత్రాలు, ద్వేషపూరిత మెసేజ్లు, బెదిరింపు ఘటనలు హెచ్చుమీరాయి. ఈ ఏడాది గత 9 నెలల్లో 953 కేసులు నమోదు కావడం చూస్తే సోషల్ మీడియా క్రైమ్ ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇటీవల అసభ్య పదజాలంతో మహిళలను దూషించడం, ద్వేషంతో కూడిన మెసేజ్ పంపడం, బెదిరింపులకు పాల్పడటం, మత సామరస్యానికి భంగం కలిగించే కేసులు అధికమయ్యాయి. 51 శాతం పెరుగుదల గత కొద్దిసంవత్సరాలతో పోలిస్తే ఇటువంటి నేరాల రేటు 51 శాతం పెరగడం గమనార్హం. బెంగళూరు నగర పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యంగా ఉన్న 300 కి పైగా పోస్టులను తొలగించి 50 కి పైగా పోకిరీల అకౌంట్లను బ్లాక్ చేశారు. మహిళలు, యువతులు ఫోటోల పోస్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆకతాయిలు, సైబర్ నేరగాళ్లు వారి ఫోటోలను సేకరించి దుర్వినియోగం చేసే ప్రమాదముందని హెచ్చరించారు. యువకుల పెడపోకడ సోషల్ మీడియాలో బెదిరింపులు, ప్రాణహానిని తలపెట్టే మెసేజ్లు. అసభ్య పదజాలంతో దూషించిన ఉదంతాల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కువ లైక్లు, అధిక ఫాలోయర్స్ను పొందడానికి తప్పుడు మార్గాల్లో ప్రయత్నిస్తారు. యువత్ సోషిల్ మీడియాలో జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. అనేకమంది యువతులు, మహిళలు తమ ఫోటోలను ఎడాపెడా పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుండగులు డబ్బు కోసం మహిళలను బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నట్లు తెలిపారు. మహిళల పట్ల కించపరిచే పోస్టులు బెంగళూరులో ఏటేటా నేరాల వృద్ధిసోషల్ మీడియా అనేది నేరస్తుల చేతిలో ఆయుధమైంది. యువతులు, మహిళల పట్ల సులభంగా నేరాలకు పాల్పడుతున్నారు. మహిళల ఫోటోలను సేకరించి మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇతరత్రా అవాంఛనీయాలకు ఒడిగట్టడం సిలికాన్సిటీలో అధికమైంది. పోలీసులు నిఘా పెట్టినప్పటికీ నేరాలకు బ్రేకులు పడడం లేదు, సరికదా పెరుగుతున్నాయి. మార్ఫింగ్ బెడద వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ఆన్లైన్ మీడియాను యువత, జనం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఉపయోగిస్తుంటారు. చెడును ప్రేరేపించేలా పోస్టులు పెట్టడం, కించపరిచేలా కామెంట్లు, ఫార్వర్డ్– షేరింగ్ నేరాలు అధికంగా జరుగుతున్నాయి. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వ్యాప్తి చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీని వల్ల సమాజంలో వారి పరువు పోవడంతో పాటు కుటుంబాల్లో చిచ్చు రేగి నేరాలూ సంభవిస్తుంటాయి. -
పెళ్లయి 5 నెలలు.. భర్త చేతిలో హత్య
యశవంతపుర: కత్తితో పొడిచి నవ వివాహితను భర్త హత్య చేసిన ఘటన చిక్కమగళూరు జిల్లా ఆల్దూరు సమీపంలోని హొసహళ్లి గ్రామంలో జరిగింది. ఆమె పుట్టింటిలోనే ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ఐదు నెలల క్రితం నేత్ర (32) అనే మహిళతో నవీన్ వివాహం చేశారు. కొన్నిరోజుల నుంచే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మూడు నెలల కిందట ఆమె హొసహళ్లిలోని పుట్టింటికి చేరుకుంది. ఆదివారం వచ్చిన భర్త.. తనతో వచ్చేయాలని కోరగా ఆమె తిరస్కరించింది. దీంతో పోట్లాటకు దిగాడు. కోపంలో నవీన్ భార్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన నేత్రాను కుటుంబీకులు చిక్కమగళూరు ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలను తాళలేక నేత్ర సోమవారం మరణించింది. నేత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అరెస్టు చేశారు. ఈవీ స్కూటర్ విస్ఫోటం యశవంతపుర: చార్జింగ్ చేస్తున్న ఎలక్ట్రికల్ స్కూటర్ బ్యాటరీ పేలి కాలిపోయిన ఘటన బెంగళూరులో జరిగింది. బసవేశ్వరనగర శివనహళ్లి ఫస్ట్ క్రాస్ వద్ద భవనం బేస్మెంట్లో ముకేష్ అనే వ్యక్తి ఈవీ స్కూటర్కు చార్జింగ్ పెట్టాడు. ఈ సమయంలో బ్యాటరీ పేలిపోయి వాహనం మండిపోయింది. దట్టమైన పొగ కమ్ముకుపోయింది. స్థానికులు అందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎక్కువ సేపు చార్జింగ్, అధిక వేడి వల్ల ఇలా జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్వారీలో అనుమానాస్పద మృతి దొడ్డబళ్లాపురం: స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లిన యువకుడు నీట మునిగి అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. బెంగళూరు మాదనాయకనహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. కామాక్షిపాళ్యం నివాసి పృథ్విక్ (17), రాజాజీనగరలోని ప్రైవేటు కాలేజీలో ఫస్ట్ పీయూసీ చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మాదనాయకనహళ్లి పరిధిలోని బోళారె క్వారీకి వెళ్లాడు, అక్కడ క్వారీ నీటిగుంతలో ఈత కొట్టాలని దిగాడు. కానీ ఆ నీటికుంటలో శవమై తేలాడు. స్నేహితులు అక్కడి నుండి పరారయ్యారు. అయితే స్నేహితులే అతడ్ని హత్య చేశారని బాలుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బీఎంటీసీలో ఖాకీలకు ఉచితంబనశంకరి: బెంగళూరు సిటీ పోలీసులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. యూనిఫాంలో ఉన్నా, లేకున్నా.. ఐడీ కార్డును చూపించి బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం పోలీసుశాఖ, బీఎంటీసీ ఎండీకి లేఖ రాసింది. దీంతో బీఎంటీసీ అధికారులు కండక్టర్లు, డ్రైవర్లను ఈ మేరకు సమాచారం తెలిపారు. ఇప్పటివరకు యూనిఫాంలో లేని పోలీసులకు ఉచిత ప్రయాణం ఉండేది కాదు. లంచగొండి పీడీఓ మండ్య: ఫౌతి ఖాతాను చేయడానికి లంచం డిమాండు చేసి తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్త అధికారులకు పట్టుబట్టాడు. జిల్లాలోని మద్దూరు తాలూకాలోని తగ్గహళ్లి గ్రామపంచాయతీలో పీడీఓ సచిన్, బాధితుడు శివలింగయ్యకు ఖాతా చేయడానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. సోమవారం ఆఫీసులో అతని నుంచి రూ. 5 వేలు తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు సచిన్ను అరెస్టు చేశారు. -
పంట నష్టపరిహారం కోసం రాస్తారోకో
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పంటలకు నష్టం వాటిల్లడంతో పరిహారంతో పాటు మద్దతు ధరలు ప్రకటించాలని ఒత్తిడి చేస్తూ కలబుర్గి జిల్లా బంద్ చేపట్టారు. సోమవారం అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. అతివృష్టితో కలబుర్గి, బీదర్, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో భారీ నష్టం సంభవించిందన్నారు. బస్సుల రాకపోకలు కూడా స్తంభించాయన్నారు. కేంద్ర బస్టాండ్ వద్ద బస్సులను నిలిపి ఆందోళన చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ను పాటించారు. రామ మందిర్, ఖర్గే సర్కిల్, ఆళంద చెక్పోస్టుల వద్ద రైతులు గుమిగూడి బంద్ నిర్వహించారు. పత్తికి క్వింటాల్కు రూ.10 వేలు మద్దతు ధర కేటాయించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాయచూరు జిల్లాధికారి కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు బసవలింగప్ప ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో కలబుర్గి బంద్ శాంతిభద్రతల రక్షణకు గట్టి పోలీస్ బందోబస్తు -
మరుగుదొడ్ల నిర్మాణం తగదు
రాయచూరు రూరల్: నగరంలోని బాపనయ్యదొడ్డిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం తగదని అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ పేర్కొంది. సోమవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ కులకర్ణి మాట్లాడారు. నగరసభ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి నిర్మాణం చేపట్టిన పనులను విరమించుకోవాలన్నారు. బాపనయ్యదొడ్డి చుట్టు పక్కల చాలా ఆలయాలున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాటి నిర్మాణ పనులను నిలిపి వేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఓట్ల చోరీపై విచారణ చేపట్టాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓట్ల చౌర్యంపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేిసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఏఐసీసీ కార్యదర్శి గోపీనాథ్ పళనియార్ మాట్లాడారు. బెంగళూరు లోక్సభ పరిధిలో 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అందులో 11 వేలు నకిలీ ఓట్లు, 40 వేల ఓట్లు అనుమానంతో కూడిన చిరునామాలు ఉన్నట్లు తేలడంతో 4 వేల ఓట్లు సస్పెండ్లో ఉంచారని, దానిపై జుడీషియల్ విచారణ చేపట్టాలని కోరుతూ ఆందోళన జరిపారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, ఆర్టీఏ అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సీ శరణప్ప, పామయ్య, అమరేగౌడ, శ్రీనివాస్, శశికళ, వందన, జ్యోతి, శాంతప్ప, అస్లాం పాషా, రజాక్ ఉస్తాద్లున్నారు. యథేచ్ఛగా సర్కారు భూముల కబ్జా రాయచూరు రూరల్: రాయచూరు అటవీ శాఖలో విధులు నిర్వహించే అధికారులే అటవీ శాఖ ఆధీనంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి కుటుంబ సభ్యులకు కేటాయించారని సార్వజనిక హితరక్షణ పోరాట సమితి ఆరోపించింది. సోమవారం అటవీ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. సర్వే నంబర్–1257లో విచారణ జరిపి నిందితులపై చర్యలు చేపట్టాలన్నారు. అక్రమంగా నివాసం ఉన్న అధికారులను ఖాళీ చేయించాలని కోరుతూ అటవీ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. రోడ్డు నిర్మాణ నిధుల స్వాహా రాయచూరు రూరల్: దేవదుర్గ తాలూకా మలదకల్లో రోడ్డు నిర్మాణానికి కేటాయించిన రూ.కోటి నిధులను అధికారులు, ఇంజినీర్లు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలను నాసిరకమైన సిమెంట్తో చేశారన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిధులు దిగమింగారని, వారిపై చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయడానికి వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని, జెడ్పీ సీఈఓ ఈ విషయంలో విచారణ జరిపి నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక బాధ్యత అవసరం హుబ్లీ: విద్యార్థులు సామాజిక బాధ్యత పెంపొందించుకోవాలని రామదుర్గలోని కాయక సంజీవని ఫౌండేషన్ నాగమ్మ కులగోడ ప్యారా మెడికల్ కళాశాల, కాయక సంజీవిని నర్సింగ్ కళాశాల, బసవ ఫార్మసీ కళాశాల తొలి ఏడాది విద్యార్థులకు స్వాగత కార్యక్రమం, ఫైనలియర్ విద్యార్థులకు వీడ్కోలు వేడుక అప్యాయతల మధ్య నెరవేర్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖ మేనేజర్ హనుమంతరాయ బిరాదార్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అభ్యాసంతో పాటు సామాజిక బాధ్యత రాయబారులుగా పర్యావరణ సంరక్షణ, స్వచ్ఛత, సేవ గురించిన ఆశక్తిని పెంపొందించుకుంటే సమాజం, దేశం ఆస్తులవుతారన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గల పౌరులుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ వై.కులగోడ, పాలక మండలి డైరెక్టర్లు బీఎల్ దొడ్డమని, పీఎం కణవి, ప్రొఫెసర్ సిద్దణ్ణ పాల్గొన్నారు. -
సంఘ్ మీద సర్కారు కయ్యం
సాక్షి, బెంగళూరు/ శివాజీనగర: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో స్వయంసేవక్ సంఘం (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖ మీద బీజేపీ భగ్గుమంటోంది. ఈ లేఖను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సిద్ధరామయ్య ఆదేశించడంతో వివాదం మరింత రాజుకుంది. నిషేధానికి అవకాశం ఉందా దేశ వ్యతిరేక, ఇతర ప్రమాదకర కార్యకలాపాలకు ఏ సంఘం అయినా పాల్పడితే దానిని నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం కోసం ఆధారాలతో కేంద్రానికి సిఫార్సు చేయవచ్చు. బీజేపీ కోర్ కమిటీ భేటీ మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ, పరిణామాల గురించి బీజేపీ కోర్ కమిటీ నాయకులు భేటీ అయ్యారు. ముగ్గురు సభ్యులతో ఓ పరిశీలన కమిటీని నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకునే చర్యలను ఈ కమిటీ గమనిస్తూ ఉంటుందని నేతలు తెలిపారు. బ్యాన్ చేయాలనలేదు: ఖర్గే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని నేను చెప్పలేదు. బహిరంగ స్థలాల్లో ఆయుధాలు పట్టుకుని కార్యకలాపాలు చేయరాదని మాత్రమే సూచించానని మంత్రి ప్రియాంక ఖర్గే సోమవారం బెంగళూరులో చెప్పారు. తన లేఖ మీద వివాదం రేగడంపై స్పందించారు. బీజేపీ నాయకులు ఎందుకు వారి పిల్లలు, మనవళ్లకు గణేశ వేషం వేయించి చేతిలో కట్టె పట్టించడం లేదు? పేదల పిల్లలనే ఆర్ఎస్ఎస్ ప్రదర్శనల్లో వేషాలు వేయిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పాఠశాలలో కవాతు కలబుర్గి జిల్లాలో అఫజలపుర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.వై.పాటిల్కు చెందిన ఎయిడెడ్ పాఠశాలలో ఆదివారం ఆర్ఎస్ఎస్ పథ సంచలనం జరిగింది. వందలాదిమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత జిల్లాలో ఇలా జరగడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. మంత్రి ఖర్గే లేఖపై సీఎం పరిశీలన! -
ఉద్యోగ ఖాళీల భర్తీకి డిమాండ్
● రాయచూరులో కదం తొక్కిన విద్యార్థులు, ఉద్యోగార్థులు రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒత్తిడి చేస్తూ ఉద్యోగార్థులల పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో రాష్ట్ర కార్యదర్శి చెన్న బసవ మాట్లాడారు. నిరుద్యోగులకు వయస్సు మీరుతున్న తరుణంలో రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసే వరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పక్కన బెట్టడం తగదన్నారు. ఏడాదికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై ఉద్యోగులను నియమించుకొని ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని తప్పుబట్టారు. కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు రాయచూరు రూరల్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా జరుగుతున్న కుల గణన సర్వేలో కురుబలు ఎస్టీలుగా నమోదు చేసుకోవడం తగదని కల్యాణ కర్ణాటక అఖిలాండ శ్రీమహర్షి వాల్మీకి నాయక్ సమితి అధ్యక్షుడు వెంకటేష్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల నాయక్ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే సంక్షేమ పథకాలు లభించవన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇతర కులాల వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం తగదన్నారు. కొంత మంది కురుబలను కాడు కురుబ, గొండ అంటూ ఎస్టీలుగా నమోదు చేసుకున్న వారి పేర్లను తొలగించాలన్నారు. నిరసన ర్యాలీ బళ్లారి అర్బన్: సుప్రీం చీఫ్ జస్టిస్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది బూటు విసిరి అవమానించాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ కోరారు. స్థానిక డీసీ కార్యాలయం ఎదుట ప్రగతిపర దళితపర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ర్యాలీలో నిర్వహించారు. గోవర్ధన్, బీకే.బసప్ప, కల్లుకంబ పంపాపతి, జగన్, కొళగల్ ఎర్రిస్వామి, సన్న నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. టమాటాల పారబోత హొసపేటె: తాము పండించిన టమాటాలకు సరైన ధర లభించక పోవడంతో కలత చెందిన రైతులు కూడ్లిగి తాలూకాలోని డ్రెయిన్లో టమాటాలను పారబోశారు. ఆదివారం కూడ్లిగి తాలూకాలో సహా వివిధ ప్రాంతాల్లో టమాటాల ధరలు పడిపోవడం చూసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ట్రాక్టర్లలో రోడ్డు పైకి తీసుకువచ్చి, డ్రెయిన్లో వేస్తున్నారు. తాలూకాలోని హుడెం సహా వివిధ గ్రామాల్లో పండించిన టమాటాలు సరైన ధర లభించకపోవడంతో ఎవరూ రూ.100 నుంచి రూ.200కి టమాటా బాక్స్ అడగడం లేదు. విజయనగర జిల్లాలో మొత్తం 2,248 హెక్టార్ల విస్తీర్ణంలో టమాటా పండిస్తున్నారు. కనీసం ఇప్పటికై నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రైతులకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇద్దరు యువకుల దారుణ హత్య
సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్ : విజయపుర జిల్లాలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం విజయపుర జిల్లా కన్నూరు గ్రామంలో సాగర్ బెళుండగి(25), ఇషాక్ ఖురేషి(24) అనే ఇద్దరు యువకులను బండరాళ్లతో తలపై బాది దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ప్రస్తుతం హత్యకు గురైన ఇద్దరు యువకులు రెండేళ్ల క్రితం ఈరనగౌడ అనే వ్యక్తిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఈరనగౌడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో పాతకక్షలతో సాగర్, ఖురేషి అనే యువకులు హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే విజయపుర గ్రామీణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘటన పాత కక్షలతోనే హత్యలుగా పోలీసుల అనుమానం -
ధైర్యశాలి వీర మదకరి నాయక
సాక్షి,బళ్లారి: చిత్రదుర్గకు చెందిన వీర మదకరి నాయక మహా ధైర్యశాలి అని, పోరాటం, యుద్ధంతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని వాల్మీకి రాష్ట్ర ఐక్య కూటమి అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప పేర్కొన్నారు. సోమవారం వీరమదకరి నాయక జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదకరి నాయక చిత్రపటానికి పూజలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాల్మీకి సోదరులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి రాజవీర మదకరి నాయక ఒక వ్యక్తి కాదు, ఆయన మహా శక్తి అని, పులితో సైతం తలపడి పోరాడ గలిగిన ధైర్యవంతుడని కొనియాడారు. చిత్రదుర్గ కోట వాల్మీకి నాయకుల స్వాధీనంలోకి వచ్చిన తర్వాత వీరమదకరి నాయక ఎంతో ధైర్యంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడన్నారు. కోటలో తన సైనికులకు పరివారానికి 12 సంవత్సరాల వరకు ఆహారం అందించేందుకు అప్పట్లోనే ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేశారు. యుద్ధంలో వీరమదకరి నాయకను ఓడించలేమని తెలుసుకున్న శత్రువులు విషం పెట్టి చంపినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయన్నారు. వాల్మీకులకు గర్వకారణం అలాంటి వాల్మీకి కులంలో పుట్టినందుకు వాల్మీకులు గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన అడుగు జాడల్లో మనమందరం నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్న నేపఽథ్యంలో పార్టీలకు అతీతంగా వాల్మీకులు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వాల్మీకి సంఘం నాయకులు మెడికల్ షాపు మల్లికార్జున, జయరాం, రూపనగుడి గోవిందు, హొన్నూరప్ప, తుకారాం, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. అఖండ కర్ణాటక వాల్మీకి ఐక్యకూటమి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మప్ప -
వ్యసనముక్త సమాజాన్ని నిర్మిద్దాం
చెళ్లకెరె రూరల్ : వ్యసనముక్త సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని డీఎస్పీ సత్యనారాయణరావ్ తెలిపారు. నగరంలోని డి.సుధాకర్ క్రీడా మైదానంలో నిర్వహించిన సధృడ కర్ణాటక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. నేడు పిల్లలు చిన్న వయస్సులోనే దురలవాట్లకు బానిస అవుతుండడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఇలాంటి దురలవాట్లకు పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యువకులు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లను అలవాటు చేసుకోరాదన్నారు. యువకులు ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, క్రీడలు, యోగా వంటి ఉత్తమ అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. చిన్న వయస్సులోనే ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కె.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగరాభివృద్ధికి ఐక్యంగా శ్రమిద్దాం
బళ్లారిటౌన్: నగర సర్వతోముఖ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రమించాలని ఎంపీ తుకారాం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా పంచాయతీ సభాంగణంలో ఏర్పాటు చేసిన దిశ సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు అందుబాటులో ఉన్నందున అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలన్నారు. అధికారులు రాజ్యాంగ ఆశయాలతో పాటు మానవతా దృష్టితో పని చేయాలన్నారు. దొంగ ఏజెన్సీలకు త్వరలో బ్రేక్ వరి పంటను అనధికారికంగా ఖరీదు చేసి మోసాలు చేస్తున్న దొంగ ఏజెన్సీలకు త్వరలో చెక్ పెట్టే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులను నమ్మించి మొబైల్ యాప్ ద్వారా వరిని ఖరీదు చేస్తున్నట్లు నటించి మోసాలు చేస్తున్నట్లు వెలుగు చూస్తున్నందున అధికారులు కూడా అప్రమత్తం కావాలన్నారు. సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ మాట్లాడుతూ సండూరు భాగంలో ఓ రైతు ఏ పంట వేశారంటే అందరూ కూడా అదే పంటను వేస్తున్నారన్నారు. దీని వల్ల అసమతుల్యత చెంది పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా యూరియా ఎక్కువగా వాడటం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. సేంద్రీయ ఎరువులు, మందులు వాడేలా సూచించాలన్నారు. అఖండ జిల్లాకు 24 పోస్టల్ కార్యాలయాలు అఖండ జిల్లాలో తన అవధిలో బళ్లారి, విజయనగర జిల్లాల్లో 24 నూతన తపాల కార్యాలయాలు మంజూరు చేసినట్లు ఎంపీ పేర్కొన్నారు. దీని వల్ల పోస్టల్ సదుపాయాలు మరింత వేగవంతం అవుతాయన్నారు. అదే విధంగా బీఎస్ఎన్ఎల్ సేవలు మరింత చురుగ్గా చేపట్టేలా నూతన కేబుల్ లైన్ల పనులు చేపడుతున్నట్లు వివరించారు. అంతకు ముందు నగరంలోని రైల్వే స్టేషన్లో ఎన్ఆర్ఎల్ఎం సంజీవిని స్వసహాయ సంఘాల ఉత్పత్తి మార్కెట్ను ప్రారంభించారు. అనంతరం జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజల నుంచి విన్నపాలను స్వీకరించారు. ఎమ్మెల్సీ వైఎం సతీష్, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు చిదానందప్ప, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి మహమ్మద్ హ్యారీష్ సుమేర, ఎస్పీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. బళ్లారి లోక్సభ సభ్యుడు తుకారాం అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపు -
వంతెనల పనులకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత చందంగా ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రూ.38 కోట్లతో చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. రాయచూరు తాలూకా ఆత్కూరు–కురువపుర మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మాణాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. నది మధ్యలో 24 సిమెంట్ స్తంభాలతో దిమ్మెలను నిర్మించారు. కురువపుర నారద గడ్డ దత్తాత్రేయ స్వామి దర్శనార్థం వెళ్లడానికి సుగమమైన మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో 675 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి రూ.14.25 కోట్లతో శ్రీకారం చుట్టింది. 2022 నాటికి దాని వ్యయం రూ.22 కోట్లకు చేరుకుంది. కురువపుర నారదగడ్డ దత్తాత్రేయుడి దర్శనార్థం నేడు ట్రాక్టర్ల ద్వారా వెళుతున్నారు. వర్షాకాలంలో నాటు పడవల్లో ప్రయాణం చేయాల్సి ఉంది. నదిలో నీరు లేకపోతే నడుచుకుంటూ కూడా వెళుతుంటారు. ఎమ్మెల్యే సోదరులకే కాంట్రాక్ట్.! అర్ధంతరంగా ఆగిన వంతెన నిర్మాణ పనుల కాంట్రాక్ట్ను శాసన సభ్యుడి సోదరులు పొందారు. శాసన సభ్యుడికి భయపడి అధికారులు ఆగిన వంతెన నిర్మాణ పనులపై మూడేళ్ల నుంచి నోరు మెదపక పోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. రాయచూరు తాలూకా దొంగరాంపుర వద్ద కృష్ణానదికి అడ్డంగా 2008లో రూ.7 కోట్లతో దొంగ రాంపుర– కుర్వకుర్ద మధ్య 285 మీటర్ల పొడవు వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టినా ఫలితం లేకపోయింది. టెండర్ ప్రకటనలో నిర్లక్ష్యంతో దాని వ్యయం నేడు రూ.14 కోట్ల మేర పెరిగింది. మొత్తం రూ. రూ.21 కోట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రెండు వంతెనల పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. రూ.38 కోట్ల వ్యయంతో చేపట్టిన వైనం 14 సంవత్సరాలుగా పూర్తి కాని నిర్మాణం -
సమస్యలు గాలికొదిలి ఓట్ల చోరీ డ్రామా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రజలు పలు సమస్యలతో నలిగి పోతోంటే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దొంగ ఓట్ల చోరీ డ్రామా నడిపారని ఆందోళ సిద్దలింగ స్వామి ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అధికార పార్టీ నాయకులపై మండిపడ్డారు. గత నెలలో కురిసిన వానలకు పంటలు, రహదారులు, వంతెనలు భారీ నష్టం సంభవించిందన్నారు. వారికి పరిహారం అందించకుండా ముఖ్యమంత్రి ఆకాశ పర్యటన చేసి రూ.25 వేల కోట్లు పరిహారం ప్రకటించినా కనీసం రూ.25 వేలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో నాయకులకు వ్యతిరేకంగా ప్రియాంక్ ఖర్గే హైడ్రామా నాయకుడన్నారు. ఆర్ఎస్ఎస్ నిషేధం కోసం సీఎంకు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదుల గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. దమ్ముంటే ఇండియన్ ముజాహిద్దీన్, లష్కర్ ఏ తోయిబాలను నిషేధించాలని ఖర్గేకు సవాల్ విసిరారు. 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ కూడా పోటీ చేస్తుందన్నారు. మంజునాథ్ బోవి, రాజా రామచంద్రగౌడ, చెన్నప్పగౌడ, రామనగౌడ, వినయ్ సింగ్, హన్మంతు, వినోద్ కుమార్లున్నారు. -
మొబైల్ యాప్లలో ట్రాఫిక్
బనశంకరి: సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సిగ్నల్ గురించి వాహనదారులకు కచ్చితమైన సమయం లైవ్ అందించడానికి పలు యాప్లు సమాచారం అందిస్తున్నాయి. రాబోయే జంక్షన్లో ఎంత వాహన రద్దీ ఉందనేది యాప్లో చూసి తెలుసుకోవచ్చు. రియల్ టైమ్లో నగర ట్రాఫిక్ సమాచారం లభ్యమవుతుందని వినియోగదారులు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... బెంగళూరు నగర ట్రాఫిక్ పోలీస్, ఇతరత్రా విభాగాల ద్వారా అనుసంధానమైన ప్రధాన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ రద్దీని అనుక్షణం ఈ యాప్లు సేకరిస్తూ ఉండేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు. వాహనదారులు తమ ముందు ఉన్న సిగ్నల్ మారడానికి ఎంత సమయం ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. బెంగళూరులో 169 జంక్షన్లలో రద్దీని అనుక్షణం గమనించే సాంకేతికతను అమర్చారు. తద్వారా వాహనదారులు మొబైల్ఫోన్లో వీక్షించవచ్చునని ట్రాఫిక్ విభాగం సీనియర్ అధికారి తెలిపారు. బెంగళూరులో అందుబాటులోకి -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
గౌరిబిదనూరు: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు. మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
మైసూరు: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశ్చితార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. తీర్చలేదని.. పెళ్లి రద్దు పోలీసులకు వధువు కుటుంబం ఫిర్యాదు -
ఆర్ఎస్ఎస్ను నిషేధించరూ..!
కలబురిగి నగరంలో సంఘ్ సేవకుల పథసంచలనం ఆదివారం రాష్ట్రమంతటా ఆర్ఎస్ఎస్ సంబరాలు, బెంగళూరులో బాలల వేషధారణ శివాజీనగర: ప్రభుత్వ స్థలాల్లో ఆర్ఎస్ఎస్ సభలు, సమావేశాలను నిషేధించాలంటూ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, ఐటీ బీటీ శాఖల మంత్రి ప్రియాంక్ ఖర్గే, తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. తన డిమాండును తక్షణమే పరిశీలించాలని సీఎం సిద్దరామయ్యను కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ మైదానాలలో కార్యక్రమాలు చేస్తూ పిల్లలు, యువత మనస్సులో విద్వేషాన్ని నింపుతోందని ఆరోపించారు. ఆయుధాల ప్రదర్శన జరుపుతోంది, కాబట్టి ప్రభుత్వ స్థలాల్లో ఆ శాఖ కార్యక్రమాలను నిషేధం విధించాలి అని కోరారు. సంఘ్ వందేళ్ల ఉత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న సమయంలో ఈ లేఖ రాయడం విశేషం. కాంగ్రెస్ చేత కాదు: విజయేంద్ర బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనడం మూర్ఖత్వమని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర మండిపడ్డారు. ఆదివారం నగరంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం జగన్నాథ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ అంటే తెలియనివారు, సొంత ప్రచారం కోరేవారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ని నిషేధించింది. మళ్లీ నిషేధాన్ని ఉపసంహరించుకొందని ఆయన చెప్పారు. మరోసారి ఆర్ఎస్ఎస్ ను నిషేధించే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసినట్లు కనిపిస్తోంది. సోనియాగాంధీ కుటుంబాన్ని మెప్పించే దిశలో ఈ లేఖ రాసినట్లు ఉందని హేళన చేశారు. ఖర్గే సొంత జిల్లా కల్బుర్గి అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, హత్యలు, ఇసుక మాఫియా అధికమైంది, ఆ సంగతి చూడాలన్నారు. ఆర్ఎస్ఎస్ శ తమానోత్సవం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతమానోత్సవాల సందర్భంగా బెంగళూరులోని వివిధ చోట్ల ఆదివారం కార్యకర్తలు పథసంచలనం జరిపారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. సదా వత్సలే గీతాన్ని ఆలపిస్తూ బ్యాండు వాయిద్యాలతో కవాతు సాగింది. ప్రజలు రోడ్లకు ఇరువైపులా నిలబడి వీక్షించారు. రాష్ట్ర సర్కారుకు మంత్రి ఖర్గే లేఖ మూర్ఖత్వమన్న బీజేపీ నేతలు -
నన్ను పిలవరా.. అతన్ని పంపించేయండి
బనశంకరి: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు నడిగే పేరుతో ఉద్యానవనాల్లో ప్రజలతో సమావేశాలను నిర్వహిస్తుండడం తెలిసిందే. ఆదివారం మత్తికెరె జేపీ పార్కులో భేటీలో రభస జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మునిరత్న తనను పిలవలేదని బైఠాయించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త దుస్తుల్లో ఎమ్మెల్యే నిరసనకు దిగారు. ఆయనను చూసి డీకే.శివకుమార్ , ఏ నల్ల టోపీ ఎమ్మెల్యే రండి అంటూ హాస్యధోరణిలో వేదికపైకి ఆహ్వానించారు. మునిరత్న వేదికపైకి వెళ్లి బలవంతంగా మైక్ తీసుకుని ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆక్రోశించారు. ఇంతలో కాంగ్రెస్ కార్యకర్తలు మునిరత్నను చుట్టుముట్టి ఇక్కడ గూండాగిరి చేయడానికి వచ్చారా, వేదిక దిగి వెళ్లిపోండి అని గద్దించారు. రేపిస్ట్, రేపిస్ట్ అని నినాదాలు చేశారు. గొడవ ముదరకుండా పోలీసులు మునిరత్న చుట్టూ నిలిచారు. కొంతసేపు గందరగోళం నెలకొంది. అతడిని ఇక్కడి నుంచి పంపించండి అని డీకే శివకుమార్ ఆదేశించారు. దీంతో పోలీసులు మునిరత్నను వేదిక పై నుంచి కొద్దిదూరం తీసుకెళ్లారు. తనపై వెనుక నుంచి ఎవరో దాడి చేశారని, టోపీని లాగేశారని మునిరత్న ఆరోపించారు. తనను కొట్టడానికి చెన్నపట్టణ, రామనగర, కనకపుర నుంచి అల్లరిమూకలను పిలిపించారని ఆరోపించారు. ఎమ్మెల్యేను పంపించాక చర్చాగోష్టి కొనసాగింది. పార్కు భేటీలో డీసీఎం వర్సెస్ ఎమ్మెల్యే -
ఛాయాచిత్ర సంబరం
బనశంకరి: సిలికాన్ సిటీలో చిత్రకళా పరిషత్లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శనకు కళాప్రియులను ఆకట్టుకుంటోంది. నగరవాసులు పెద్దఎత్తున విచ్చేసి అపురూపమైన ఛాయాచిత్రాలను వీక్షించారు. ఆదివారం కావడంతో నగరవాసులు పెద్దసంఖ్యలో వచ్చారు. మురిపించే చిత్రాలను మొబైల్, కెమెరాలో బంధిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సందర్భంగా ఉత్తమ ఛాయాచిత్రాలు తీసిన ఫోటోగ్రాఫర్లకు సలాన్ నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్శాస్త్రి, గిరీశ్ అనంతమూర్తి, ప్రేమకాకడే, అనితా మైసూరు పాల్గొన్నారు. మురిపిస్తున్న సలాన్ -
ఇళ్ల మీద పడిన క్రేన్.. 5మందికి గాయాలు
కృష్ణరాజపురం: బెంగళూరులోని ఆవులహళ్లి ఠాణా పరిధిలోని మేడహళ్ళిలో పెద్ద క్రేన్ విరిగిపడిన ప్రమాదంలో ఐదుమంది గాయపడ్డారు. వివరాలు.. ఓ ప్రైవేటు స్కూలు పక్కన ఉన్న టవర్ను మరమ్మతు చేయాలని పెద్ద క్రేన్తో పనులు చేస్తున్నారు. ఆదివారం ఉదయం పని చేస్తుండగా క్రేన్ విరిగి పక్కనే ఉన్న అద్దె ఇళ్ల మీద పడింది. వాటిలో ఉంటున్న లాలు (30), ఖురతాబాను (19), ఇలియాజ్ (38), షమీమ్ (28) శమ్దేవ్ (52) అనేవారు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులు భట్టరహళ్ళి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిని ఏసీపీ రీనా సువర్ణ పరిశీలించి కేసు నమోదు చేశారు. మైసూరులో రాత్రివేళ పోలీసుల సోదాలు మైసూరు: సాంస్కృతిక నగరం మైసూరులో హత్యలు, బాలిక పై అత్యాచారం, హత్య తదితర ఘోరాలతో ప్రజల్లో కలవరం నెలకొంది. పోలీసుల అలసత్వంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో ఈ రీతిలో నేరాలు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం రాత్రి నగరంలో తనిఖీలు నిర్వహించారు. రౌడీషీటర్లు, కేసుల్లో నిందితులకు హెచ్చరించారు. ప్రజల మీద దాడులకు దిగితే కఠినమైన చట్టాల కింద కేసులు తప్పవన్నారు. 405 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపి 204 మంది కోప్టా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దొడ్డకెరె మైదానం, దసరా వస్తు ప్రదర్శన మైదానం, పార్కింగ్ స్థలాలు, జ్వాలాముఖి పార్కింగ్ స్థలం, బాలల ఉద్యానవనం, ఆర్ఎంసీ బస్టాండు తదితర ప్రాంతాల్లో నాకాబందీని జరిపారు. రాత్రివేళ బైకుల్లో త్రిబుల్ రైడింగ్ చేస్తున్న వారిని పట్టుకుని 54 కేసులు పెట్టారు. 33 మందిపై నో హెల్మెట్ కేసు నమోదు చేశారు. 59 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అడవిదున్న ముప్పుతిప్పలుయశవంతపుర: మలెనాడు ప్రాంతానికే పరిమితమైన అడవి దున్నల దాడులు హాసన్ జిల్లాకు కూడా వ్యాపించాయి. శనివారం చన్నరాయపట్టణంలో ఓ మహిళపై దాడి చేసిన అడవి దున్నను ఆదివారం అటవీ అధికారులు పట్టుకున్నారు. ఇది మడికెరి నుంచి ఇటువైపు వచ్చినట్లు అనుమానాలున్నాయి. మార్గమధ్యలో చన్నరాయపట్టణ చుట్టుక్కల పంట పొలాలను నాశనం చేసింది. పలు కాలనీలలో తిరుగుతూ జనతాహౌస్లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. అటవీ అధికారులు మత్తుమందు తూటాతో కొట్టాలని ప్రయత్నించారు. మూడుసార్లు తప్పించుకొంది. చివరకు ఎలాగో మత్తు మందును ఇచ్చి దానిని బంధించి వాహనంలో తరలించారు. ఆఫ్ఘనిస్థాన్తో స్నేహమెందుకో? కోలారు: తాలిబాన్ ఉగ్రవాదులు పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్నేహం చేస్తోందో తెలియదని శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ఆదివారం కోలారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటివి ఉగ్రవాద దేశాలని, ఇలాంటి దేశాలతో సాన్నిహిత్యం భారతదేశానికి మంచిది కాదన్నారు. పహల్గాం దుర్ఘటనను హిందువులు, భారతీయులు ఎన్నటికీ మరువరాదన్నారు. -
కిడ్నాప్ చేసి చిత్రహింసలు
కర్ణాటక: డబ్బుతిరిగి ఇవ్వాలన్నందుకు చిత్రహింసలకు గురిచేశారు, ఈ ఘటన బెంగళూరు కోరమంగల ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. తండ్రికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వైద్యంచేయించాలని సగాయ్రాజ్ నుంచి అనందకుమార్, అతని కూతురు ఐశ్వర్య రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇంటిని విక్రయించి డబ్బు ఇస్తానని ఆనంద్కుమార్ చెప్పగా, తనకే అమ్మాలని సగాయ్రాజ్ కోరాడు. అగ్రిమెంట్ కు ముందు కోటి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బు తరువాత ఇస్తానని మాట్లాడుకున్నారు. డబ్బు తీసుకున్న ఆనందకుమార్ ఇంటిని రాసివ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సగాయ్రాజ్ ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో సగాయ్రాజ్ని తండ్రీ కూతురు, మరో వ్యక్తి ఆశీష్లు కలిసి కిడ్నాప్ చేశారు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు కాళ్లుకట్టి వేసి మర్మాంగానికి సిగరేట్తో కాల్చి, ఇంజెక్షన్ వేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేగాక వీడియో తీసి బెదిరించారు. కారులో రాత్రంతా నగరంలో తిప్పి వేధించారు. ఉదయం సమయంలో సగాయ్రాజ్ కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. ఈ మేరకు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కాబోయే వరుని గొంతెమ్మ కోర్కెలు
కర్ణాటక: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది. మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు.. అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశి్చతార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది. మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు. -
నాన్నా.. నువ్వు లేని లోకం వద్దు
కర్ణాటక: తండ్రి లేని లోకంలో ఉండలేనంటూ ఓ కూతురు తనువు చాలించింది. వివరాలు.. నగరానికి సమీపంలో ఉన్న నాగయ్యరెడ్డి కాలనీలో నివాసముంటున్న స్వర్ణ (22) బెంగళూరులోని మహారాణి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. పలు సమస్యల వల్ల ఆమె తండ్రి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. స్వర్ణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. తండ్రి చనిపోయినప్పటి నుంచి ఆయనను తలచుకుంటూ బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం బెంగళూరులోని హాస్టల్లో పురుగుల మందును తాగి, ఇంటికి వచ్చింది. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురికాగా తల్లి ఈమెను చిక్కబళ్ళాపురం ఆస్పత్రిలో చేరి్పంచగా అక్కడ మరణించింది. కొన్నినెలల్లోనే భర్త, కుమార్తె దూరం కావడంతో తల్లి హృదయ విదారకంగా విలపించింది. బెంగుళూరు హై గ్రౌండ్స్ పోలీసులు చేరుకుని కేసు దాఖలు చేసుకొని దర్యాప్తు చేబట్టారు.మరో యువతి... మైసూరు: జీవితంపైన విరక్తి కలిగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చామరాజనగర జిల్లాలోని కొళ్ళెగాల పట్టణం మంజునాథ్ నగరలో జరిగింది. యువతి రక్షిత (19) మృతురాలు. ఆమె తండ్రి బెంగళూరులో పని చేస్తుంటారు. ఒంటరిగా ఉంటున్న యువతి అవ్వ తాత వద్ద ఉంటోంది. బీఏ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేది. ఈ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.కులగణనలో టీచర్కు గుండెపోటు బనశంకరి: బెంగళూరులో కులగణనలో ఉపాధ్యాయురాలు గుండెపోటుకు గురైంది. ఆనేకల్ తాలూకా బొమ్మసంద్రలో ఆదివారం యశోద అనే టీచర్ కులగణన సర్వేలో ఉండగా గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురైంది. వెంటనే కొందరు సమీప హెల్త్సిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి స్టంట్ను అమర్చారు. యశోద బొమ్మసంద్ర ప్రభుత్వ పాఠశాలలో డ్రిల్ మాస్టర్గా పనిచేస్తోంది. -
రాత్రంతా.. వణికించిన వాన
● రాజధానిలో కుండపోత శివాజీనగర: సిలికాన్ సిటీలో అర్ధరాత్రి వరకూ కురిసిన ఉరుములు, మెరుపుల వర్షంతో పలు ప్రాంతాలు జలావృతమై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆరంభమైన కుండపోత వల్ల అనేకచోట్ల నీరు నిలిచింది. మాన్యతా టెక్ పార్కు, ఎలక్ట్రానిక్ సిటీ, మహాదేవపుర వద్ద రోడ్లలో నీరు నిలిచి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో నీలాద్రి లేఔట్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహించింది. ప్రజలు పాలికెకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ మార్కెట్లో నీరు నిలబడి పూల వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్షంలో తడిసి సరుకు పాడైంది. మరో మూడు రోజులు రాష్ట్రంలో 15 వరకు వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడులో వానలు పడుతున్నాయి. బెంగళూరుతో సహా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ప్రకటించారు. -
నవంబరు.. జాతకం తారుమారు?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంటుంది. అప్పట్లో అనూహ్యంగా గెలిచి నాటకీయ పరిణామాల మధ్య సిద్దరామయ్య సీఎం అయ్యారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు అయిపోతున్నాయి. ఈ క్రమంలో కుర్చీ మార్పు ఉంటుందా, ఉండదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2.5 ఫార్ములా ఫలించేనా? రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని, ఆ తర్వాత రెండున్నరేళ్లు డీకే శివకుమార్ కుర్చీ ఎక్కుతారని అప్పట్లో జోరుగా ఊహాగానాలు సాగాయి. నవంబర్ 19 నాటికి 2.5 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో సీఎం మార్పు ఉండబోతుందని మళ్లీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో పలువురు మంత్రులను సాగనంపి, కొత్తవారికి చాన్సిస్తారనే ప్రచారం మొదలైంది. మంత్రిమండలిలో మార్పులు ఉంటాయని సిద్దరామయ్య కూడా చెప్పారు. దీంతో నవంబర్ లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించనుందని చర్చ సాగుతోంది. సీఎం పదవి కోసం డిప్యూటీ సీఎం శివకుమార్, ఆయన మద్దతుదారులు ఆశాభావంతో ఉన్నారు. హైకమాండ్ నోరువిప్పడం లేదు. మంత్రివర్గ మార్పుల సందడి వచ్చే నెల మంత్రివర్గ మార్పు జరిగితే కొందరు కొత్త వారికి అవకాశం దక్కుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రిపదవి ఆశిస్తున్న వారు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. కొందరు మంత్రులు పదవిని కాపాడుకోవడం కోసం కార్యాచరణకు దిగారు. నవంబర్ 20 లేదా 21న మంత్రివర్గ మార్పులకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఇలా ఒకవైపు మంత్రివర్గ పునర్వస్థీకరణ, సీఎం మార్పు వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్గా మారాయి. ముఖ్యమంత్రి మార్పు కోసం డీకే శివకుమార్ వర్గం గట్టిగా వాదిస్తుంటే, వారి వ్యూహాలను అడ్డుకునేందుకు సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అస్త్రాన్ని తీశారని సమాచారం. బిహార్ ఎన్నికలతో బిజీగా ఉన్న హస్తం హైకమాండ్ ఆ తర్వాత కన్నడనాడుపై దృష్టి సారించే అవకాశం ఉంది. పూర్తి కానున్న 2.5 ఏళ్ల పదవీకాలం పెను మార్పులపై డిప్యూటీ సీఎం వర్గం ఆశలు ధీమాగానే సీఎం సిద్దరామయ్య శిబిరం గుంభనంగా హైకమాండ్ -
ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీ డ్రైవర్ పనే
బెంగళూరు (బనశంకరి): ఎంతో నమ్మకంగా ఉన్న కారు డ్రైవరే దోపిడీదారుగా మారాడు, తన స్నేహితులతో కలిసి ఓ ప్రైవేటు కాలేజీ ప్రొఫెసర్ ఇంట్లో రూ.1.50 కోట్ల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోచేసిన 7 మందిని యలహంక పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.1.27 కోట్ల నగదు, రెండు కార్లు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. తనిఖీల పేరుతో బెదిరించి నిందితులు ఆర్ఎంవీ రెండోస్టేజ్ రాజేంద్ర మునోట్ అలియాస్ రాజేంద్ర జైన్, విజయనగర చోళరపాళ్య శ్రీనివాస్, శ్రీనగర కిరణ్కుమార్ జైన్, శ్రీరాంపుర హేమంత్కుమార్ జైన్, దుమ్మలూరు బీడీఏ లేఔట్వాసి శంకరప్ప, రామమూర్తినగరవాసి శంకరప్ప, హైదరాబాద్ రామనగర్వాసి మోహన్గౌడ అలియాస్ జనార్దన్. నిందితులు గత నెల 19న యలహంక వినాయకనగర సింధీ కాలేజీ ప్రొఫెసర్ గిరిరాజ్కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. తాము ప్రభుత్వ అధికారులమని, మీ ఇంటిని తనిఖీ చేయాలని అతని భార్య, తల్లిని బెదిరించారు. పైన పేర్కొన్న మేరకు నగదు, బంగారాన్ని తీసుకుని కారులో ఉడాయించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి గత నెల 23 తేదీన సంజయ్నగరలో ఓ వ్యక్తిని అరెస్ట్చేశారు. రెండో వ్యక్తిని ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వద్ద రేణుమాకలపల్లి గ్రామంలో, బెంగళూరు విజయనగర చోళరపాళ్యలో మిగతా ఐదుమందిని పట్టుకున్నారు. శంకరప్పే సూత్రధారి కారు డ్రైవరే దుమ్మలూరు శంకరప్ప సూత్రధారిగా గుర్తించారు. ఇతడు ప్రొఫెసర్ కు డ్రైవర్గా పనిచేసేవాడు. ఇంట్లో భారీగా డబ్బు, బంగారం ఉన్నట్లు గమనించి, మిగతావారితో కలిసి దోపిడీ చేశాడు. ఇతని మిత్రుడు జనార్దన్ రూ.55 లక్షలు హైదరాబాద్లో, రేణుమాకలపల్లి లోని ఓ ఇంట్లో 25.80 లక్షలను దాచి ఉంచాడు. నిందితుల ఇళ్లలో గాలించి రూ.1.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగ డీసీపీ వీజే.సజీత్, యలహంక సీఐ ఎంఎల్.కృష్ణమూర్తి సిబ్బంది ఈ కేసును ఛేదించారు. 7 మంది ముఠా అరెస్టు రూ.1.27 కోట్లు, కొంత బంగారం స్వాధీనం -
ఏకపక్ష నిర్ణయాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో ఏకపక్ష నిర్ణయాలతో సభ్యులకు గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నగరసభ సభ్యులు ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కౌన్సిలర్లు శశిరాజ్, నాగరాజ్ తదితరులు మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్గా ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు సామాన్య సమావేశాలు నిర్వహించకుండా కాలయాపన చేశారని దుయ్యబట్టారు. కార్పొరేషన్గా ఏర్పాటైనప్పడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. 35 వార్డులకు రూ.కోటి చొప్పున కేటాయించి అభివృద్ధి పనులు చేపడతారని కన్న కలలు సాకారం కాకుండా పోయాయన్నారు. అధికారులు, అధ్యక్షుల ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారంగా నిధులు వాడుకున్న అంశంపై విచారణ చేయాలన్నారు. రాజకీయ నాయకుల మాటలకు వత్తాసు పలుకుతూ నగరసభ సభ్యులను అవమానించడం తగదన్నారు. ఇ–ఖాతాలు, జనన మరణ పత్రాలు ఇవ్వడంలో పూర్తిగా ఆలస్యం చేస్తున్నట్లు తెలిపారు. -
ఎలుగుబంట్ల ఖిల్లా.. బళ్లారి జిల్లా
సాక్షి,బళ్లారి: చారిత్రాత్మకంగా పేరుగాంచిన ఉమ్మడి బళ్లారి జిల్లా ఆసియాలోనే అత్యధికంగా ఎలుగుబంట్ల నిలయంగా ఉండటంతో పర్యాటకులతో పాటు జంతు ప్రేమికులను ఈ ప్రాంతాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎలుగుబంట్ల దాడుల్లో గత కొన్నేళ్లుగా పలువురు మృతి చెందడంతో పాటు, పలువురు గాయపడిన వారూ ఉన్నారు. రైతుల పంటలను విపరీతంగా ఎలుగుబంట్లు నాశనం కూడా చేసిన సందర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఎలుగుబంట్లపై ఎలాంటి దాడులు చేయకపోవడంతో పాటు వాటిని ప్రాణాలతో సురక్షితంగా పట్టుకుని సుదూరంలోని అటవీ ప్రాంతాలకు తరలిస్తూ, అటవీ ప్రాంతాల్లో ఉన్న ఎలుగుబంట్లు ఊరు చేరినప్పుడు అధికారులకు అప్పగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కరిడిధామ, గుడేకోటె ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లకు నిలయంగా మారింది. వందలాది ఎలుగుబంట్లు(కరడిలు) ఉండటంతో అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకున్నారు. ఆసియాలోనే కరడిధామ, గుడేకోటెల్లో ఎక్కువ వేలాది ఎకరాల్లో విస్తరించిన అటవీ ప్రాంత కొండల్లో ప్రధానంగా ఎలుగుబంట్లు నివసిస్తుండటంతో ఈ ప్రాంతాలకు కరడిధామ అని కూడా పేరుపెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోనే కాకుండా యావత్ భారతదేశమే కాదు, ఆసియాలోనే ఉమ్మడి బళ్లారి జిల్లాలో అత్యధికంగా ఎలుగుబంట్లు నివసిస్తున్నాయని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతాల నుంచి ఎన్నోసార్లు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడంతో పాటు పంటలు కూడా నాశనం చేస్తున్న సందర్భాలు అధికంగా ఉండటంతో ఎలుగుబంట్లు నివసించే అటవీ ప్రాంతాల్లోనే కాకుండా ఎన్నోసార్లు బళ్లారి నగరంలోకి కూడా ఎలుగుబంట్లు వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. కరడిధామ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లో ఎంతో నష్టం చేస్తున్నప్పటికీ వాటి బారి నుంచి ఎలా బయటపడాలన్న అవగాహనతో ఇటీవల జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ పొందుతున్నారు. అటవీ ప్రాంతాల నుంచి బయటకు వచ్చినప్పుడు వాటిపై జనం దాడి చేయకపోవడంతో పాటు సురక్షితంగా ప్రాణాలతో పట్టుకుని అటవీ ప్రాంతాలకు అప్పగిస్తుండటంతో ఈ ప్రాంత ప్రజల్లో ఎలుగుబంట్ల రక్షణపై ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. ఎలుగుబంట్లు కనబడితే సురక్షితంగా పట్టివేత కరడిధామ, గుడేకోటె చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడప్పుడు ఎలుగుబంట్లు గ్రామాల్లోను, పొలాల్లోనూ కనిపించడం పరిపాటిగా మారింది. దీంతో గ్రామస్తులంతా కలిసికట్టుగా వెళ్లి ఎలుగుబంట్లను పట్టుకోవడంలో నైపుణ్యత సంపాదించుకున్నారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి సురక్షితంగా పట్టుకోవడం విశేషం. రైతులకు పంట నష్టం చేసినా, రైతులను గాయపరిచిన సందర్భాలు అనేకం ఉన్నప్పటికీ వాటిపై దాడులు చేయకపోగా వాటి ప్రాణాలను కాపాడటంలో శ్రద్ధ వహిస్తున్నారు. అటవీ ప్రాంతాల నుంచి ఎలుగుబంట్లు బయటకు రాకుండా అటవీశాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అటవీ ప్రాంతాల్లో దొరికిన పండ్లు, ఫలాలు, ఆకులు, అలుములు తదితర ఆహారం నచ్చక ఎలుగుబంట్లు రైతుల పొలాల్లో పంటలను తినడానికి, మేకలు, గొర్రెలు తదితర వాటిని తినేందుకు బయటకు వస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఆహారం అందించే చర్యలు చేపట్టాలి అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సరైన ఆహారం దొరకని సందర్భాల్లో అధికారులు వాటికి ఆహారం అందించే చర్యలు తీసుకుంటే జనావాసాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎలుగుబంట్ల భయంతో పొలాల్లో మంటలు వేసుకుంటామని, టపాసులు పేల్చుతామని అన్నారు. ఒకరిద్దరు వెళ్లబోమని, గుంపుగా వెళ్లడంతో ఎలుగుబంట్లు భయపడతాయని, నిత్యం పొలాల్లోకి వెళ్లాలంటే రక్షణ కవచాలను ధరించి వెళతామని, అయితే ఎలుగుబంట్లు కనబడిన వెంటనే వాటిని ఎలాగైనా చాకచక్యంగా పట్టుకుని అధికారులకు అప్పగిస్తామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. అయితే అటవీ ప్రాంతాల నుంచి అవి బయటకు రాకుండా సంబంధిత అటవీశాఖ అధికారులు మరింత గట్టిచర్యలు తీసుకోవాలని, తమ పంట పొలాలకు నష్టం చేయడంతో పాటు ఎలుగుబంట్ల దాడుల్లో గురై ఎన్నోసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నామని, అటవీప్రాంతాల చుట్టు పటిష్టమైన కంచె తదితర రక్షణ కల్పించి వాటిని బయటకు రాకుండా చూడాలని కోరుతున్నారు. రైతులకు అపార పరిమాణంలో తప్పని పంట నష్టాలు ఎలుగుబంట్ల దాడుల్లో ఎంతో మంది మరణించిన వైనం ఇటీవల అవగాహనతో ఎలుగుబంట్లపై తగ్గిన దాడులు దరోజీ కరడిధామతో పర్యాటకులు, సందర్శకులకు కనువిందు -
అయోధ్య రాముడికి 15 కేజీల వెండి ఇటుకల సమర్పణ
హుబ్లీ: రామ మందిరం కోసం దావణగెరెలో జరిగిన ఘర్షణలో బలి అయిన వారి పేరున వెండి ఇటుకలను అయోధ్య రాముడికి సమర్పించారు. 1930లో దావణగెరెలో శ్రీరామ జ్యోతి రథయాత్ర జరిగినప్పుడు మత కలహాలు చెలరేగిన ఫలితంగా పోలీసులు జరిపిన గోలీబార్లో 8 మంది రామ భక్తులు మృతి చెందారు. సుమారు 70 మందికి పైగా తూటాలతో పాటు మారణాయుధాలు, యాసిడ్ దాడులతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ మేరకు బలిదానం అయిన చంద్ర షిండే, శ్రీనివాసరావు, శివాజీరావు, రామకృష్ణ, దుర్గప్ప, చిన్నప్ప, అమరేష్, నాగరాజ్ల బలిదాన జ్ఞాపకంగా 15 కేజీల వెండి ఇటుకలను శ్రీరామ మందిరానికి అర్పించారు. ఆ సదరు ఇటుకల్లో శ్రీరాముడి, అయోధ్య రామ మందిరం చిత్రలేఖనం లిఖించారు. వాటిని రాముడి పాదాల ముందు పెట్టి పూజించాలని అయోధ్య రామ మందిర కమిటీకి విజ్ఞప్తి చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య కోశాధికారి ప్రముఖ సాధకులు ఆచార్య పరమపూజ్య గోవింద దేవగిరి మహారాజ్కు ఈ ఇటుకలను అందజేశారు. వీహెచ్పీ కర్ణాటక ప్రముఖులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్టీ అయిన గోపాల్ ఈ అప్పగింత బాధ్యతలను పూర్తి చేశారు. విరక్తమఠం బసవప్రభుస్వామి సాన్నిధ్యంలో ఈ కార్యాన్ని నెరవేర్చారు. ప్రముఖులు యశ్వంత్రాజ్ జాధవ్, శివకుమార్, లోహిత్, భద్రావతి ఎన్టీసీ నాగేశన్న, కిరోసిన్ హాలేష్ తదితరులు పాల్గొన్నారు. -
కెమెరా ప్రతిభకు దర్పణం
బనశంకరి: కెమెరా ప్రతిభకు దర్పణం పట్టేలా బెంగళూరు చిత్రకళాపరిషత్లో వైపీఎస్ ఇంటర్నేషనల్ సలాన్– 2025 ఛాయాచిత్ర ప్రదర్శన సందడి మొదలైంది. దేవరాజ అరస్ గ్యాలరీలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశ విదేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన విభిన్న రకాల ఛాయాచిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఆర్కిటెక్చర్, కలర్, మోనోక్రోమ్, నేచర్ తదితర విభాగాల చాయాచిత్రాలు నేత్రానందం కలిగిస్తాయి. ప్రతి విభాగంలోనూ ఎంతో నైపుణ్యంతో తీసిన ఫోటోలు చూపరులను అబ్బురపరచకుండా ఉండలేవు. ప్రపంచం నలుమూలల నుంచి ఫోటోగ్రాఫర్లు పంపిన చిత్రాల్లో ఎంపికై న 92 ఛాయాచిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. వీకెండ్ రెండోశనివారం సెలవురోజు కావడంతో పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఈ కార్యక్రమంలో వైపీఎస్ ముఖ్యులు మంజువికాస్శాస్త్రి, గిరీశ్ అనంత మూర్తి, ప్రేమకాకడే, హార్దిక్ షా పాల్గొన్నారు. చిత్రకళా పరిషత్లో సలాన్ ఛాయాచిత్ర ప్రదర్శన అబ్బురపరిచే కళాత్మక దృశ్యాలు -
వాహన సంచారం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో పార్కింగ్ సమస్యలు అధికమవుతున్నా నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో, ఎస్పీలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో ఆక్రమణలకు గురైన ఫుట్పాత్లు పాదచారులకు అనానుకూలంగా మారినా నగరసభ అధికారులు మౌనంగా ఉన్నారు. పోలీసులు, నగరసభ అధికారులు తూతూమంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా పాలన యంత్రాంగం పుట్ పాత్లను తొలగించినా వాటిని మళ్లీ దుకాణాలు, హోటళ్ల వంటివి ఆక్రమించాయి. నగరంలోని రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఏక్ మినార్, తీన్ కందిల్, షరాఫ్ బజార్ ప్రాంతాల్లో సంచరించడానికి వీలు లేకుండా ట్రాఫిక్ సమస్య జటిలమైంది. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ద్విచక్రవాహనాలను నిలుపుతున్నారు. రైల్వే స్టేషన్, రంగ మందిరం, అంబేడ్కర్ సర్కిల్, బస్టాండ్, తహసీల్దార్, తాలూకా పంచాయతీ, హెడ్ పోస్టాఫీసుల వద్ద ఆటో డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు ఆటోలను నడుపుతూ రహదారికి అడ్డంగా నిలబెడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో లోపలకు బస్సులు వెళ్లాలంటే ఆటోలను అడ్డు తొలగించుకొని పోవడానికి ఆటంకంగా మారి వెనుక వైపు వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఏక్ మీనార్, తీన్ కందిల్, షరాఫ్ బజారుల్లో రహదారి కిరువైపుల అంగళ్లు, హోటళ్లు, పండ్ల తోపుడు బండ్లు అడ్డంగా నిలబడుతాయి. పుట్పాత్ల మీద దుఖాణాలు పోలీస్లకు బంగారు బాతు గుడ్డులా మాకాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ప్రతి నిత్యం ద్విచక్ర వాహనదారులకు, పాదచారులకు ఆటోరిక్షాల వల్ల తిప్పలు తప్పడం లేదు. నగరంలో అధికమవుతున్న పార్కింగ్ సమస్య పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు -
అనాథగా హంపీ ఉగ్ర నరసింహ విగ్రహం
హొసపేటె: హంపీ ఉగ్ర నరసింహ విగ్రహ స్మారక చిహ్నం ముఖంపై ఉన్న పొలుసులు రాలి పోతున్నాయి. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. ఈ స్మారక చిహ్నం గతంలో లక్ష్మీ నరసింహ స్మారక చిహ్నంగా ఉండేది. బహుమని సామ్రాజ్య సైనికుల దాడి తర్వాత ఈ స్మారక చిహ్నం దెబ్బతిన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మిగిలి ఉన్న ఉగ్రనరసింహ స్మారక చిహ్నం కూడా శిథిలావస్థకు చేరుకుంటున్నా పురావస్తు శాఖ మాత్రం మౌనంగా ఉంది. ఈ స్మారక చిహ్నాన్ని సంరక్షించడానికి పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, చరిత్రకారులు డిమాండ్ చేశారు. టెలిస్కోప్ శిక్షణలో జిల్లా విద్యార్థులకు ర్యాంక్లుబళ్లారి అర్బన్: రాష్ట్ర విజ్ఞాన పరిశోధన పరిషత్ ద్వారా దొడ్డబళ్లాపురలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రథమ టెలిస్కోప్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న 150 మంది విద్యార్థుల్లో బళ్లారి జిల్లాకు చెందిన 7 మంది విద్యార్థులు పాల్గొనడమే కాకుండా ఈ సారి ప్రథమ శ్రేణి సాధించారు. వీవీ సంఘం దేశనూరు సదాశివరెడ్డి సీనియర్ ప్రాథమిక, హైస్కూల్, దేశనూరు దేవరాజ్, సిరుగుప్ప వివేకానంద హైస్కూల్ విద్యార్థి శివకుమార్ రాష్ట్రంలోనే ప్రథముడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ుడ్స, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాడే ఏసియా బుక్ రికార్డ్స్ ప్రశస్తిని దక్కించుకున్నారని ఆ పరిషత్ జిల్లాధ్యక్షుడు ఆర్హెచ్ఎం చెన్నబసవస్వామి తెలిపారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ శివకుమార్, దేవరాజ్, విద్యాసాగర్, సంజీవ్ శెట్టి, జాహ్నవి, మహమ్మద్ సోహిల్, గవిసిద్ద అనే విద్యార్థులకు సదరు పరిషత్ జిల్లా శాఖ అభినందనలు తెలిపింది. విద్యార్థులు చేసిన కృషికి వైజ్ఞానిక స్పూర్తి ప్రశంసనీయం అని వారు అభినందించారు. రైతులను సర్కారు ఆదుకోవాలి సాక్షి బళ్లారి: రాష్ట్రంలో అప్పుల బాధలను తాళలేక, పంటలు చేతికి అందకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని కొళగల్లు గ్రామానికి చెందిన రైతు గాదిలింగ ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా బాధించిందన్నారు. పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పాటు అప్పులు పెరిగిపోవడంతో క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకొన్నాడన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణబైరేగౌడకు వినతిపత్రం అందజేశామన్నారు. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో చాలా మంది రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా పరిహారం ఇవ్వకుండా పంట ఎంత నష్టపోతే అంత మేరకు పరిహారం అందించాలని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జాతా రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక రాష్ట్ర సమితి అధ్యక్షుడు రఘుపతి భట్ పేర్కొన్నారు. శనివారం బస్టాండ్ వద్ద ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. విద్య, వైద్య, ఆర్థిక, సాంఘీక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం పంచ గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. రూ.కోట్లాది నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పడం తప్ప మరేమీ లేదన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వెళుతున్నారన్నారు. రాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని ఖండిస్తూ ర్యాలీ చేశామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన సర్కార్ను ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. ఇకనైనా కుటుంబ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని ఆయన అన్నారు. -
బంధాలను తెంచేసిన ప్రేమపెళ్లి
బెళగావి (దొడ్డబళ్లాపురం): కన్నకూతురు తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధతో తల్లిదండ్రులు ఆమెకు బ్రతికుండగానే శ్రాద్ధకర్మలు నిర్వహించిన బాధాకర సంఘటన బెళగావి జిల్లా రాయభాగ తాలూకా నాగరాళ గ్రామంలో చోటుచేసుకుంది. తమ కూతురు ఇక చచ్చిపోయిందని కన్నవారు ప్రకటించారు. ఊరొదిలిన ప్రేమపక్షులు.. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన యువతి (19), స్థానిక యువకుడు విఠల్ బెస్తవాడి ప్రేమించుకున్నారు. ఇది తగదని తల్లిదండ్రులు ఆమెను మందలించినా పట్టించుకోలేదు. ఇటీవల ప్రేమ జంట ఊరు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. రెండుమూడు రోజులు వేచి చూసిన తండ్రి.. స్థానిక ఠాణాలో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చాడు. తన కుమార్తె 9వ తేదీన చనిపోయిందని శనివారం ఇంటిలో భారీఎత్తున తిథిని నిర్వహించాడు. ఆమె ఫోటో, వివరాలతో ఫ్లెక్సీలను గ్రామంలో కట్టించాడు. పెద్దఎత్తున వంటకాలను వండి తిథి భోజనాలను జరిపించాడు. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూతురు కాకుండా పోతుందా? అని కొందరు నిట్టూర్చారు. వీధిన పడేసింది: తండ్రి యువతి తండ్రి మాట్లాడుతూ తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, ఈమె చివరి కుమార్తె అని చెప్పాడు. ఎంతో గౌరవంగా బతుకుతున్న తమ జీవితాలను ఆమె వీధినపడేసిందని, సంప్రదాయాన్ని మంటగలిపిందని వాపోయాడు. హిందూ చట్టం ప్రకారం ఆమెకు తమతో ఎటువంటి సంబంధం లేదని దస్తావేజు కూడా రాసుకున్నట్లు చెప్పాడు. బతికి ఉండగానే కూతురికి శ్రాద్ధకర్మలు బెళగావి జిల్లాలో ఓ తండ్రి ఆక్రోశం -
ప్రసన్న వేంకటేశ్వర స్వామికి పూజలు
కేజీఎఫ్ : ఐతిహాసిక ప్రసిద్ధ యాత్రాస్థలమైన చిక్కతిరుపతి ప్రసన్న వేంకటేశ్వర స్వామికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ భరద్వాజ్, ఎన్.శ్రీధర్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరణచేసి పూజలు నిర్వహించారు. తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో శ్రావణ మాసం ముగిసిన అనంతరం తమిళనాడులో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. దీంతో ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. -
ఒత్తిళ్లతో ప్రశాంతత దూరం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలో కుటుంబాల్లో అనుబంధాలు, సంబంధాలు క్షీణించడం వల్లే ఒత్తిళ్లు అధికమై మానసిక ప్రశాంతతను కోల్పోతున్నట్లు నవోదయ వైద్య కళాశాల మానసిక వైద్య నిపుణుడు కె.పవన్ విచారం వ్యక్తం చేశారు. శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. దైనందిన కార్యక్రమాలు, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో సతమతమైన మానవుడు మానసికంగా కుంగిపోతాడన్నారు. రూపకళ, విజయలక్ష్మి, డాక్టర్ సుగుణ, హర్ష, సయ్యదా, రశీదా, స్వరూప రాణిలున్నారు. -
బాలికను బలిగొన్న సిటీ బస్
యశవంతపుర: బీఎంటీసీ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల తరచూ ఘోరాలు జరుగుతున్నాయి. బస్సు ఢీకొన్న ప్రమాదంలో 9 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ 1వ స్టేజ్ సిగ్నల్ వద్ద జరిగింది. వివరాలు.. భావన (9) పాంచజన్య పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిని. శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు పాఠశాల వదలగా ఇంటికి నడిచి వెళ్తోంది. సదరు సిగ్నల్ వద్ద బాలికను బీఎంటీసీ బస్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స పొందుతూ చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఘటన జరగ్గానే డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. మల్లేశ్వరం పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. బీఎంటీసీ డ్రైవర్కు మూర్ఛ ● తొమ్మిది వాహనాలను ఢీకొన్న బస్సు బనశంకరి: సిటీ బస్సు వెళ్తుండగా డ్రైవర్కు మూర్ఛ వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొంది. ఈఘటన శనివారం చిన్నస్వామిస్టేడియం 9వ గేట్ వద్ద చోటుచేసుకుంది. మధ్యాహ్నం సమయంలో చిన్నస్వామిస్టేడియం సమీపంలో సిగ్నల్ వద్ద వాహనాలు నిలబడి ఉన్నాయి. ఆ సమయంలో అక్కడకు బీఎంటీసీ బస్సు చేరుకోగానే డ్రైవర్ మూర్ఛపోయాడు. దీంతో బస్సు ముందున్న కార్లు, నాలుగు ఆటోలు, బైక్ను ఢీకొని నిలిచిపోయింది. ఘటనలో తొమ్మిది వాహనాలు దెబ్బతినగా ఆటో డ్రైవరుకు తీవ్రగాయాలయ్యాయి. ఆటో, బస్సు డ్రైవర్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కబ్బన్పార్కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విజయపురలో భూప్రకంపనలు సాక్షి బళ్లారి: విజయపుర జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు వచ్చాయి. శుక్రవారం రాత్రి 11 గంటల పైనా జనం నిద్రలో ఉన్న సమయంలో జిల్లాలోని తికోట, విజయపుర గ్రామీణ ప్రాంతాల్లో 12 కిలోమీటర్ల భూమి స్వల్పంగా కంపించింది కవళిగి, మధుబావి, ద్యాబేరి, కగ్గోడ తదితర గ్రామాల్లో రిక్టర్ స్కేల్పై 2.8 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు వస్తుండడం సాధారణమైంది. చిరుత దాడిలో రైతు మృతి దొడ్డబళ్లాపురం: చిరుతపులి దాడిలో రైతు మృతిచెందిన సంఘటన హావేరి జిల్లా రట్టీహళ్లి తాలూకా కణవిసిద్ధగేరిలో జరిగింది. బీరేశ్ (28) అనే రైతు, తమ్ముడు బీరేశ్తో కలిసి పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత హఠాత్తుగా ఇద్దరిమీద కెగిరి దాడి చేసింది. గొంతు, తల మీద కొరకడంతో బీరేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ స్థానికులు జిల్లాస్పత్రికి తరలించారు, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బీరేశ్ చనిపోగా, తమ్ముడు కోలుకుంటున్నాడు. ఇద్దరు అధికారుల సస్పెండ్ యశవంతపుర: హాసన్లో జరుగుతున్న హాసనాంబ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేవారికి వీఐపీ పాస్ల విధానాన్ని రద్దు చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. అయితే ఇద్దరు అధికారులు గుర్తింపు కార్డులు చూపించి దర్శనానికి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేసి దర్శనానికి వెళ్లడం సరికాదని, నిబంధనలు ఉల్లంఘించినందుకే ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడిందని రెవెన్యూశాఖ మంత్రి కృష్ణబైరేగౌడ మీడియాకు తెలిపారు. -
అంబేడ్కర్ హాస్టల్లో తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలోని మంత్రాలయం రోడ్డులోని అంబేడ్కర్ హాస్టల్ను అసిస్టెంట్ కమిషనర్ గజానన బాళె పరిశీలించారు. శుక్రవారం ఉన్నఫళంగా హాస్టల్ను తనిఖీ చేసి వంట గదిని, ఇతర మౌలిక సౌకర్యాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం రుచి చూశారు. గ్రంథాలయం ఏర్పాటుతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కసాప జిల్లాధ్యక్షుడు రాజీనామా చేయాలి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాహిత్య పరిషత్ సేవలు చేయడానికి చేతకానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుల అనుమతి లేకుండా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్పు చేసి నూతన అధ్యక్షులను నియమించారన్నారు. గతంలో ఉన్న అధ్యక్షులను కొనసాగించాలన్నారు. వారం రోజుల్లోపు పాటిల్ రాజీనామా చేయకపోతే అధ్యక్షుడి నివాసం ముందు ఆందోళన చేస్తామన్నారు. నేరాల కట్టడికి సహకరించాలి రాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు విద్యార్థులు పోలీసులతో సహకరించాలని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసమ్మ పేర్కొన్నారు. శనివారం నగరంలోని అల్ కరీం కళాశాల ప్రాంతంలో ఇంటింటికి పోలీస్ అనే కార్యక్రమంలో ప్రజలకు జనజాగృతి చేపట్టి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలని కోరారు. టీబీ డ్యాం గేట్ల తయారీ పనులపై ఆరాహొసపేటె: టీబీ డ్యాం ఎస్టేట్ ఆవరణలో చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనులను శనివారం తుంగభద్ర మండలి చైర్మన్ ఎస్ఎన్ పాండే పరిశీలించారు. ఇప్పటికే గేట్ల నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టరుకు సూచించారు. అదే విధంగా గదగ్లో కూడా చేపడుతున్న డ్యాం గేట్ల నిర్మాణ పనుల ప్రగతిని మండలి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల డ్యాంకు సంబంధించిన 32 గేట్ల నిర్మాణ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకొన్నాయని మండలి అధికారులు తెలిపారు. మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ నాయక్, డ్యాం సెక్షన్ అధికారి జ్ఞానేశ్వర్, ఇంజినీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికహొసపేటె: హొసపేటెలోని నేషనల్ పీయూసీ కళాశాలలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సంజన కొట్టూరు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికై ంది. సంజన గత నెలలో బెంగళూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో తన చురుకుదనం, ధైర్యం, ఓర్పుతో న్యాయనిర్ణేతలు, ప్రేక్షకుల ప్రశంసలను గెలుచుకుంది. ఆమె అదే ఉత్సాహం, నైపుణ్యంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా గౌరవాన్ని పెంచాలని నేషనల్ పీయూసీ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్, అధ్యాపకులు, సిబ్బంది, తల్లిదండ్రులు, స్నేహితులు అభినందిస్తూ భవిష్యత్తుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
రబీ పంటలకు నీరందించండి
సాక్షి బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని ఎల్ఎల్సీ, ఎల్బీఎంసీ కాలువల పరిధిలోని రైతుల ఆయకట్టు భూములకు రబీ సీజన్లో కూడా నీరు అందించాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తంగౌడ ఆధ్వర్యంలో పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో జిల్లాలోని సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజును కలిసి వినతిపత్రాన్ని సమర్పిస్తూ రబీలో నీటి విడుదలకు సంబంధించి వివరాలు తెలియజేశారు. జూన్ 27న బెంగళూరులో జరిగిన తుంగభద్ర నీటిపారుదల సలహా సమితి సమావేశంలో ఉపముఖ్యమంత్రి, పలువురు నిపుణులు ఈ విషయంపై చర్చించారని గుర్తు చేశారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటలకు జనవరి వరకు నీటిని వదలాలని మనవి చేశారు. 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని గేట్లు మార్చాలని సూచించారు. తుంగభద్ర డ్యాం గేట్లు 33 అధ్వానంగా ఉన్నాయని, దీంతో గేట్లను మార్చే పనులు ఫిబ్రవరి నుంచి జూలై వరకు చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. -
‘నేనెప్పుడూ అలా అనలేదు..’ మీడియాపై డీకే శివకుమార్ సీరియస్
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది చివరినాటికి ఆ మార్పు తథ్యమంటూ అక్కడి మీడియా చానెల్స్ వరుసబెట్టి కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరిట కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో కన్నడ మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.నేను ముఖ్యమంత్రిని అయ్యే సమయం దగ్గరపడుతోంది అని నేను ఎక్కడా అనలేదు. కొంత మంది నేను సీఎం కావాలి అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. కానీ, నా తలరాత ఏంటో నాకు తెలుసు. నాకేం తొందరలేదు అని వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో.. కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయని, అలా అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తానేం సీఎం పదవికి ఆశపడడం లేదని మరోసారి స్పష్టం చేసిన డీకే.. తాను రాజకీయాల కోసం కాదని, ప్రజల సేవ కోసం పని చేస్తున్నానని అన్నారు. ఈ నేపథ్యంలో.. ఈ అంశంపై మరోసారి తనను సంప్రదిస్తే మీడియాకు సహకరించబోనని స్పష్టం చేశారు. బెంగళూరులో లాల్బాగ్ వద్ద శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: తెలుగు ఐపీఎస్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ -
లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: కేసులో నమోదు చేసిన పేర్లను తొలగించేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు.. రాయచూరు తాలుకా ఇడపనూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ భూమి తగాదా విషయంలో కేసు నమోదు చేశారు. విరున గౌడ, అనసూయమ్మ పాటిల్ మధ్య ఉన్న కేసు పరిష్కారం కోసం అనసూయమ్మ నుంచి రూ.3 లక్షల డబ్బు డిమాండ్ చేశారు. ఎవరికీ తెలియకుండా నగదును పోలీస్ కానిస్టేబుల్కు ఇచ్చి పంపాలని మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. అలాగే అనసూయమ్మ భర్త మహేష్ అక్రమంగా ఇసుక రవాణా చేయాలని సదరు ఎస్ఐ ఆదేశించారు. ఈ ఆడియోపై అదనపు ఎస్పీ కుమార స్వామి విచారణ చేపట్టారు. గురువారం రాత్రి ఇడపనూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సౌమ్య హిరేమట్ను సస్పెండ్ చేస్తూ బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ చేసిన బళ్లారి ఐజీపీ వర్తిక కటియార్ -
బడికి స్థలం ఇవ్వరూ..
హుబ్లీ: హావేరి జిల్లా హిరెకేరూరు తాలూకా స్కోడా గ్రామ పంచాయతీ పీడీఓ బాలికల పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని బహుగ్రామ తాగునీటి పథకానికి ఇచ్చారు. దీంతో స్థానికులు ఆ స్థలాన్ని వదిలి వేరే చోట ఎక్కడైనా స్థలాన్ని తాగునీటి పథకం కోసం వాడుకోవచ్చని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ ఓ దాత మా ఊరు బాలికల పాఠశాల కోసం 10 గుంట్ల స్థలాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయల పైనే. బాలికలు చదువుకునేందుకు పాఠశాల కట్టాల్సి ఉంది. పీడీఓ ఆ స్థలాన్ని సదరు నీటి పథకానికి ఇచ్చారని, దీన్ని తాము అంగీకరించబోమని గ్రామస్తులు తెగేసి చెప్పారు. స్కోడా గ్రామం లోపల ఉండే బాలికల పాఠశాలకు సరైన స్థలం లేదు. ఇరుకై న స్థలంలో పాఠశాల నడుపుతున్నారు. పాఠశాలకు మైదానం లేదు. అవసరమైన భవనం లేదు. 130 మందికి పైగా విద్యాభ్యాసం అయినా ఈ పాఠశాలలో 130 మందికి పైగా బాలికలు చదువుతున్నారు. ఇక్కడ కాంపౌండ్ కూడా లేదు. సరైన గదుల వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తుడు నాగేశ్వర్ బిజాపుర అనే వ్యక్తి తనకు చెందిన 10 గుంట్ల స్థలాన్ని ఆ గ్రామ బాలికల పాఠశాల నిర్మించడానికి 2012లోనే ఆ మేరకు దాన పత్రాన్ని కూడా ఆ పంచాయతీ అధికారులకు అందజేశారు. ఈ నిర్ణయంపై గ్రామ పంచాయతీలో అనుమతి తీసుకొని గవర్నర్ తరపున హిరేకెరూరు బీఈఓ పేరున నమోదు అయింది. అయితే ఇటీవల ఆ గ్రామ పీడీఓ కేఎం బన్నికోడ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు ఆ స్థలాన్ని స్కోడా వద్ద సర్వజ్ఞ బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం కోసం వినియోగించుకోవాలని పంచాయతీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ స్థలంలో రూ.కోట్ల వ్యయంతో బహుగ్రామ తాగునీటి పథకం భవన నిర్మాణం జరిగింది. పనుల నిలిపివేతకు ఆదేశం ఘటనపై హిరేకెరూరు బీఈఓకు పాఠశాల ఎస్డీఎంసీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ కట్టడ నిర్మాణ స్థలానికి వెళ్లి పరిశీంచిన బీఈఓ ఆ పనులను నిలిపి వేయాలని పాఠశాల కట్టడం కోసం దానం ఇచ్చిన ఈ స్థలంలో తాగునీటి భవనం నిర్మించారని గ్రామస్తులు ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోను ఈ స్కూల్ నిర్మాణ అవకాశాన్ని తాము వదలబోమని కనీసం ఇప్పటికై న పాఠశాల నిర్మాణానికి మరో స్థలాన్ని తక్షణమే కేటాయించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హిరెకేరూరు ఎమ్మెల్యే ఏబీ బణకార్ మాట్లాడుతూ.. పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వ లేదా బంజరు స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేం రెడీగా ఉన్నాం. ప్రత్యామ్నాయంగా ఓ స్థలాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.స్కూల్కు స్థలాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న స్థానికులుఅర్ధంతరంగా ఆగిపోయిన తాగునీటి పథకం భవన నిర్మాణ పనులు దాత పాఠశాలకు ఇచ్చిన స్థలాన్ని తాగునీటి పథకానికి కేటాయించిన పీడీఓ పాఠశాలకు మైదానం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వేరే స్థలం ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్ -
‘అక్రమ లేఔట్లకు విద్యుత్ సౌకర్యం ఇవ్వొద్దు’
రాయచూరు రూరల్: అక్రమంగా ఏర్పాటు చేసుకున్న లేఔట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం తగదని సీపీఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం యరగేర జెస్కాం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మహ్మద్ హనీఫ్ మాట్లాడారు. రాయచూరు తాలుకా యరగేర సర్వే నంబర్ 149లో అక్రమంగా లేఔట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ లేఔట్లలో నిర్మించుకున్న ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించొద్దని కోరారు. స్థానిక అధికారి ద్వారా జెస్కాం ఎండీకి వినతిపత్రం పంపించారు. క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఐదు జిల్లాలో క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్యకీయ శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు కిద్వాయ్ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో రాయచూరు, బళ్లారి, శివమెగ్గ, బీదర్, బెళగావిలో క్యాన్సర్ చికిత్సల కోసం క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. భవిష్యత్తులో తుమకూరు, మండ్య, మైసూరు, కారవారల్లో బాహ్య క్యాన్సర్ (పీసీసీ) కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. కలబుర్గిలో 80 పడకల క్యాన్సర్ ఆస్పత్రిని 210 పడకల ఆస్పత్రిగా మార్చడం జరుగుతుందన్నారు. కిద్వాయ్ ఆస్పత్రిలో 720 పడకలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం బళ్లారి రూరల్: వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్యులు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధర గౌడ తెలిపారు. శుక్రవారం సైకాట్రీ విభాగంలో వరల్డ్ మెంటల్ హెల్త్డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా సానుకూలంగా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. సైకాట్రీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కొట్రేశ్ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా మహాభాగ్యమే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మంజునాథ్, చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ గడ్డిదివాకర్, సైకాట్రిస్ట్ డాక్టర్ ఖాజామొయినుద్దీన్, తదితర వైద్యులు పాల్గొన్నారు. యోగా, ధ్యానంతో ఒత్తిడి దూరంబళ్లారి టౌన్: మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం అలవాటు చేసుకోవాలని జిల్లా న్యాయసేవా ప్రాధికారం సభ్యుడు, న్యాయమూర్తి రాజేష్ హొసమని సూచించారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, న్యాయ సేవ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి అనేది దౌర్భల్యం కాదన్నారు. ఊహ, ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల అవే మానసిక రుగ్మతలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లా వైద్యుడు బసారెడ్డి మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురైన వారు దైహిక, మానసిక, ఆర్థిక, సామాజిక, ఆత్మహత్య ఆలోచనల నుంచి మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. అనవసర విషయాలపై చర్చించుకోకపోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కిశోర్, వీరేంద్ర కుమార్, స్థానిక ప్రిన్సిపాల్ సతీష్ పాల్గొన్నారు. కాంట్రాక్టర్ కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్ హుబ్లీ: నగరానికి చెందిన కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ కిడ్నాప్ కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హుబ్లీ, గోకుల రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలో కాంట్రాక్టర్ మోహన్ చౌహాన్ను బసప్ప దళవాయితో పాటు 15 మంది కలిసి మారణాయుదాలతో దాడి చేసి హత్య చేశారని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి పూర్వాపరాలు సేకరించడం జరిగిందన్నారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. పంట నష్టంపై జాబితా సిద్ధం హుబ్లీ: ఈ ఏడాది ఆగస్టులో జిల్లాలో అతివృష్టితో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు సర్వే చేపట్టారు. రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం సెప్టెంబర్ 7వ తేదీన పంట నష్టంపై తుది జాబితా రూపొందించారు. తాలూకాల వారీగా రైతులకు ఎంతెంత పరిహారం అందుతుందన్న దానిపై కూడా వివరాలు అందజేసినట్లు అధికారులు తెలిపారు. -
ముందుచూపుతో రింగ్రోడ్డు నిర్మించండి
కోలారు: రాబోయే 25 సంవత్సరాల్లో రవాణా సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని నగరంలో రింగ్ రోడ్డు నిర్మించేలా డీపీఆర్ తయారు చేయాలని ఎమ్మెల్యే కొత్తూరుమంజునాథ్ అధికారులకు సూచించారు. శుక్రవారం పీడబ్ల్యూడీ శాఖ కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. రింగ్రోడ్డు వ్యాప్తి, భూస్వాధీనం, ఇందుకు కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రింగ్ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ కోసం రూ. 2.8 కోట్లతో టెండర్ పిలవడానికి సిద్దం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య లేకుండా చతుష్పథ రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. తొలుత శాటిలైట్ మ్యాప్ చూసి అనంతరం స్థల పరిశీలన చేద్దామని తెలిపారు. ఎంపీ మల్లేష్బాబు, ఎమ్మెల్సీ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సేవాభావం
రాయచూరు రూరల్: సరిహద్దు ప్రాంతంలోని సర్కారీ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందనే కారణంతో బడుల మూసివేతకు సర్కార్ నిర్ణయం తీసుకుంటోంది. బెళగావి జిల్లా చిక్కోడి డివిజన్ హుక్కెరి తాలుకా గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆంగ్లంలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టారు. తాలుకా విద్యాశాఖ అధికారి అనుమతితో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించారు. ఇందుకోసం తమ వేతనాల్లో కోత పెట్టించుకుని నిధులు సమకూర్చుకున్నారు. అలాగే ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 40 మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చేరదీశారు. విద్యార్థులను ఆకర్షించేందుకు హాజరు శాతాన్ని పెంచడానికి ఉపాధ్యాయులు తీసుకుంటున్న చొరవను స్థానికులు అభినందించారు. ప్రభుత్వం నుంచి నిధులు ఆశించకుండా సొంత డబ్బు వెచ్చించి పాఠశాల నిర్వహణ చేస్తున్నారు. సొంత ఖర్చులతో ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభం గోటూర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆంగ్లంలో విద్యాబోధన -
నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదు
మాలూరు: హైకోర్టు మాలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రీకౌంటింగ్ చేయాలని ఆదేశించినంత మాత్రాన ఎమ్మెల్యే నంజేగౌడ శాసన సభ్యత్వం రద్దు కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని కుప్పశెట్టి బావి సమీపంలో ప్రతిష్టించిన గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరుగుతున్న 47వ గణేష ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. వినాయకుడు అన్ని రకాల విఘ్నాలను తొలగించాలన్నారు. ఎమ్మెల్యే నంజేగౌడ నియోజకవర్గ అభివృద్ధి గురించి తన దృష్టికి తెచ్చారన్నారు. అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాలను ప్రజలకు సక్రమంగా అందిస్తోందన్నారు. 10 కిలోలు ఇస్తున్న బియ్యాన్ని కొంతమంది బయట విక్రయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తుండడంతో బియ్యం బదులుగా కంది పప్పు, నూనె, చక్కెర, ఉప్పు అందించడానికి పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే కేవై నంజేగౌడ, మాజీ ఎమ్మెల్యే ఏ.నాగరాజ్. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సీ.లక్ష్మీనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాపుర కిట్టణ్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలు నియంత్రించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో అధికారులు ఇచ్చిన నివేదికలు వేరు. సభలో వినిపిస్తున్న నివేదికలకు పొంతన లేదని కర్ణాటక విధాన సభ మహిళ, శిశు అభివృద్ధి కళ్యాణ సమితి అధ్యక్షుడు కోన రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన ప్రగతి పరిశీలన సభలో ఆయన మాట్లాడారు. పిల్లల సంరక్షణ విషయంలో 84 కేసులకు గాను కేవలం 64 కేసులను పరిష్కరించి చేతులు దులుపుకోవడం తగదన్నారు. 85 శాతం అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుపుతున్న అంశాలను శాసన సభ్యులు వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్ల నియామకాల్లో అలసత్వంపై సభ్యులు శరణే గౌడ, కరెమ్మ నాయక్ అధికారులపై మండిపడ్డారు. బాల కార్మికులను నియంత్రించడంలో పోలీస్ యంత్రాంగం మౌనం వహించడం తగదన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని సూచించారు. పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు ఇక్బాల్, శాంతారాం, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అదనపు కార్యదర్శి మంజుళ, ఐజీపీలు సతీష్ కుమార్, వర్తిక్ కటియార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్ట మాదయ్య, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ తదితరులు పాల్గొన్నారు. -
చెరువులను స్వాధీనం చేసుకుంటాం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఆక్రమణకు గురైన 41,849 చెరువులను డిసెంబర్ నాటికి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు వెల్లడించారు. గురువారం సాయంత్రం బెంగళూరు వికాస సౌదలో నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలో ఏచ్.ఏన్,వ్యాలి, కేసీ వ్యాలీ చెరువులను నీటితో నింపడంతో భూగర్బ జలమట్టం పెరిగినట్లు తెలిపారు. చెరువులకు సంఘాల ద్వార పునరుజ్జీవం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీలకు తోడు నీరు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టడం జరిగిందని పర్యటక శాఖ మంత్రి హెచ్.కే.పాటిల్ వివరించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, మంత్రులు ఈశ్వర్ ఖండ్రే, మహదేవప్ప, బీఆర్ పాటిల్, నసీర్ అహ్మద్, అజయ్ సింగ్, రిజ్వాన్ హర్షద్, ఎంవై పాటిల్, క్రిష్ణమూర్తి, హంపయ్య నాయక్, బాగీరథి, బసనగౌడ తదితరులు పాల్గొన్నారు. నీరిద్దరే నాళె కార్యక్రమానికి శ్రీకారం -
సీజేఐపై బూటు విసరడం హేయం
న్యాయవాదిని శిక్షించాలని వినతిపత్రం అందజేస్తున్న దృశ్యంపాత డీసీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజాపరివర్తన వేదిక కార్యకర్తలుసాక్షి, బళ్లారి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయిపై న్యాయవాది బూటు (షూ) విసరడం అత్యంత హేయమైన చర్య. సీజేఐకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని పలు ప్రజా సంఘాలు, న్యాయవాదులు తీవ్ర స్థాయిలో ఖండించారు. శుక్రవారం జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధికారి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సీజేఐపై దాడి చేసిన న్యాయవాది రాకేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రధాన న్యాయమూర్తితో ఇంత అనుచితంగా వ్యవహరించడం దేశంలో ఇదే మొదటిసారి అన్నారు. ఆయనకే రక్షణ లేకుంటే ఇక ఎవరికి భద్రత కల్పిస్తారని మండిపడ్డారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యదర్శి అన్సర్ భాషా, ప్రముఖ న్యాయవాదులు కోటేశ్వరరావు, మల్లికార్జున, గురు బసవరాజు, దుర్గప్ప, జయకుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. దళిత పర సంఘటనల ఐక్య కూటమి ఆధ్వర్యంలో వెంకటేశ్, బండిహట్టి కిశోర్, వినోద్ కుమార్ తదితరులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై బూటు విసిరిన న్యాయవాదిని దేశం నుంచి బహిష్కరించాలని ప్రజాపరివర్తన వేదిక (పీపీవీ) నేతలు డిమాండ్ చేశారు. ఆ సంఘం నేతలు ఆనంద్ కుమార్, శివ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో జి.దివాకర్ బాబు, హనుమంతు, సిద్దబసప్ప తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదిని శిక్షించాలి బళ్లారి రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరిన న్యాయవాదిని శిక్షించాలని జిల్లా ప్రజాపరివర్తన వేదిక (పి.పి.వి) జిల్లాధ్యక్షుడు సి.ఆనంద కుమార్ కోరారు. శుక్రవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. పాత డీసీ కార్యాలయం ముందు విలేకరులతో మాట్లాడారు. దళితుడైన న్యాయమూర్తి బి.ఆర్.గవాయిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రముఖుడు లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసరడం దుర్మార్గమన్నారు. అనంతరం జిల్లా యంత్రాంగానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వై.శివకుమార్, కోశాధికారి జి.దివాకర బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోండి
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా గిల్లె సూగురు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త అంబాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్–75లో ఉన్న ప్రభుత్వ భూమిలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. ఇళ్ల ద్వారా రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు బాడుగ వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న పంచాయతీ అధ్యక్షురాలు మహదేవమ్మ, ఆమె భర్త మల్లేష్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తి రాయచూరు రూరల్: రాయచూరు నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కేశవమూర్తిని నియమిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు ఖాళీగా ఉన్న నగర ఉపాధ్యక్షుడి పదవిని గురువారం భర్తీ చేశారు. 25 ఏళ్ల పాటు కార్యకర్తగా విధులు నిర్వర్తించిన కేశవమూర్తి సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు పదవిని కట్టబెట్టింది. అదనపు న్యాయమూర్తి ఇంట్లో చోరీ ● ముగ్గురు నిందితుల అరెస్ట్ రాయచూరు రూరల్: అదనపు న్యాయమూర్తి నివాసంలో దొంగలు చొరబడి బంగారం, నగదు దొంగిలించిన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. ముద్దే బిహళ తాలుకా దండాదికారి అద్దె నివాసంలో అదనపు న్యాయమూర్తి ఉంటున్నారు. ఇంటి తాళం పగుల గొట్టిన దొంగలు.. రూ.30,15,500 విలువ చేసే బంగారం, నగలు ఎత్తుకెళ్లారు. విజయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. బెళగావి జిల్లా రామదుర్గ తాలుకా రాంపుర తాండా సునీల్ రజపూత్, నాగనూరు తాండా చేతన్ లమాణి, సవదత్తి తాలుకా కార్ల్కట్టి రాహుల్ లమాణిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కళ్యాణ కర్ణాటక సమగ్రాభివృద్ధికి జాతా రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగం సమగ్ర అభివృద్ధి కోసం జాతాకు శ్రీకారం చుట్టినట్లు వేల్ఫేర్ పార్టీ ఆప్ ఇండియా అధ్యక్షుడు తాహిర్ హుసేన్ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అరున బళ్లారి నుంచి ప్రారంభమైన జాతా అక్టోబర్ 13న కలబుర్గికి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతం విద్య, వైద్య, ఆర్థిక, సాంఘిక రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. క.క.భాగంలో పరిశ్రమలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు బెంగళూరు, ముంబాయి, హైద్రాబాద్, గోవా వంటి ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర సర్కార్ మొండి వైఖరని ఖండిస్తూ క.క భాగం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై పూర్తి నివేదికలను మండలి అధ్యక్షుడికి వినతిపత్రం ద్వారా సమర్పిస్తామన్నారు. వర్షాలకు నేలకూలిన ఇళ్లు హుబ్లీ: దార్వాడ, దావణగెరె జిల్లాలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలతో 70 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దార్వాడ–దావణగెరె రెండు జిల్లాల్లో అపార నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కొనసాగుతుండటంతో రైతులు, వ్యాపారులు, జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే కోనారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు సాంత్వన పలికారు. పిడుగుపాటుకు మేకలు మృతి చెందడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మేకలు మంద ను పొలంలో ఉండగా పిడుగు పడటంతో 10 మేకలు మృతి చెందాయి. త్రుటిలో గొర్రెల కాపరి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. -
ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’
సాక్షి బెంగళూరు: దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరం ఏంటి అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘బెంగళూరు’.. ఐటీ సిటీ బెంగళూరులో చాలా వరకు రోడ్లు వాహనాలు, ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. పీక్ అవర్స్లో బెంగళూరులో ప్రయాణం అంటే అందరూ బెంబేలెత్తిపోవాల్సిందే. ఇదే సమయంలో అక్టోబర్ నెలలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంకు గుడ్బై చెప్పేసి తమ ఉద్యోగులకు కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిందే అని తేల్చి చెప్పాయి. ఈనేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాఫిక్ రద్దీ సమస్య ఒకవైపు అయితే ఇంకో వైపు ట్రాఫిక్ ఉల్లంఘనులు రోజురోజుకి బెంగళూరులో పెరిగిపోతున్నారు. ఎంతలా అంటే పదే పదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కుతున్న ఉల్లంఘనుల విషయంలో కూడా బెంగళూరు నగరం దేశంలోనే టాప్లో ఉండడం విశేషం. దేశ సురక్షత, భద్రత రంగ కంపెనీల్లో ఒకటైన ఏసీకేవో ఇటీవల నిర్వహించిన సమీక్షలో దేశంలోనే అత్యధిక ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులు ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరులో వాహనదారులు పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నట్లు సదరు కంపెనీ సర్వే నివేదికలో వెల్లడించింది. 2024 డిసెంబర్ నుంచి 2025 జూన్ వరకు దేశంలోని పలు మహానగరాల్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై సదరు సంస్థ సమీక్ష చేపట్టింది. బెంగళూరులోని వాహనదారుల్లో 10.8 శాతం కంటే ఎక్కువ మంది 10 సార్లకు పైగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానాలు చెల్లించిన వారుగా ఉన్నట్లు సమీక్షలో తేలింది. ఇది దేశంలోనే మహానగరాలన్నింటి కంటే అత్యధికం కావడం గమనార్హం. సమీక్షలో 14.50 లక్షలకు పైగా ట్రాఫిక్ పరీక్షలను నిర్వహించినట్లు, సుమారు 61 శాతం మంది అంటే ప్రతి పది మందిలో ఆరు మంది కనిష్టంగా ఒక్కటన్నా ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించినట్లు గుర్తించారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. బెంగళూరులో పదేపదే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల ప్రమాణం 11 శాతంగా ఉంది. బెంగళూరు తర్వాతి స్థానాల్లో చైన్నె (8 శాతం), ఢిల్లీ (6 శాతం), ముంబై (5 శాతం), పుణే (3 శాతం) ఉన్నాయి. సంచార నిబంధనల ఉల్లంఘనలో దేశంలోనే బెంగళూరు టాప్ వాహన రద్దీకే కాకుండా జరిమానాల్లోనూ ఐటీ వాసుల అగ్రస్థానం 11 శాతం వాహనదారులు పది సార్లకు పైగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ ఏసీకేవో కంపెనీ తాజా సర్వే నివేదికలో తేలిన కఠోర వాస్తవం ‘భారతదేశ టెక్ నగరంగా గుర్తింపు పొందిన బెంగళూరులో అనేక మంది ఇంకా ఇష్టానుసారం వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్క జరిమానా కేవలం ఫైన్గా చూడకుండా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేసేందుకు ఒక అవకాశంగా చూడాలి. ఈ సమీక్ష ద్వారా పదేపదే ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కేవారు తమ ప్రవర్తన మార్చుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేసి బెంగళూరును ట్రాఫిక్ నియమాల్లో ఒక ఆదర్శవంతమైన నగరంగా నిలబెట్టాలని ఆశిస్తున్నాము.’ –మయాంక్ గుప్తా, ఏసీకేవో ఉపాధ్యక్షుడు -
సమీక్షలోని పలు అంశాలు..
● బెంగళూరులో మొత్తం 1.56 లక్షల మంది వాహనదారులు సుమారు 10కి పైగా సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించారు. ● నెలకు సగటున 4.12 సార్లు తమ చలాన్లను బెంగళూరు నగరవాసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో చైన్నె అగ్రస్థానంలో ఉంది. అక్కడి వాహనదారులు సగటున ఐదు సార్లు తమ చలాన్లను చెక్ చేసుకుంటున్నారు. ● బెంగళూరులో 23 శాతం జరిమానాలు కేవలం కెమెరాలు, మొబైల్స్ ద్వారా విధించినవే ● దేశంలో 10.5 మిలియన్ కంటే అధికమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు కేవలం హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినవే. -
దేవీరమ్మ కొండ మార్గంలో అస్థిపంజరం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన దేవీరమ్మకొండ మార్గంలో మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. కొండ మార్గంలో స్వచ్ఛతా పనులు చేస్తుండగా అస్థిపంజరం బయట పడింది. చిక్కమగళూరు పోలీసులు వెళ్లి పరిశీలించి అస్థిపంజరం మహిళదిగా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఏటా ఒక్కసారి మాత్రమే దేవీరమ్మ కొండపైకి భక్తులను అనుమతిస్తుంటారు. దీపావళి సందర్భంగా కొండపై దేవీరమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తారు. మైసూరులో ప్రజలకు రక్షణ లేదు మైసూరు : విశ్వవిఖ్యాత సాంస్కృతిక నగరి మైసూరులో ప్రజలకు, పర్యాటకులకు భద్రత కొరవడిందని, అభద్రతాభావంతో జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మైసూరు– కొడుగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మైసూరులో విలేకరులతో మాట్లాడారు. మైసూరుకు ప్రగతిపర, సాంస్కృతిక, చరిత్ర నగరంగా ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు. కొంతకాలంగా నగరంలో దాడులు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం ఉదాసీనతతో ఉందన్నారు. ఉదయగిరి పోలీస్స్టేషన్పై ఇటీవల దుండగులు రాళ్ల దాడి చేశారన్నారు. మహారాష్ట్ర పోలీసులు మైసూరులో జరుగుతున్న డ్రగ్స్ దందాను ఛేదించి రూ. 340 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారన్నారు. వస్తు ప్రదర్శన శాల సమీపంలో పట్టపగలే వ్యక్తిని దుండగులు హత్య చేశారన్నారు. గురువారం ఓ చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎన్నికల సమయంలోమాత్రమే మైసూరు నా ఊరు అంటారని, ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్నారు. స్వాధీనంలో ఉన్నవారికి అటవీ భూ హక్కు ● సీఎం సిద్దరామయ్య శివాజీనగర: 2005వ సంవత్సరానికి ముందు అటవీ భూమిని సాగు చేస్తున్న వారికి భూమిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. ఉత్తర కన్నడ జిల్లా అటవీ భూమి సాగుదారుల పోరాట కమిటీ అధ్యక్షుడు కే.చంద్రకాంత్, జీ.ఎం.శెట్టి, పీ.టీ.నాయక్, గణేశ్ నాయక్ నేతృత్వంలో పోరాట సమితి బృందం గురువారం జిల్లా ఇన్చార్జి మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రిని కలిసి అటవీ హక్కు వినతిపత్రాలను తిరస్కరించిన కారణంగా ప్రస్తుతం ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో సీఎం సిద్దరామయ్య అటవీ హక్కు చట్టాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులు భూ హక్కు నుంచి వంచితులు కాకుండా జిల్లా యంత్రాంగానికి సూచిస్తామని భరోసానిచ్చారు. అటవీ భూమిలోని బగర్ హుకుం సాగుబడికి సంబంఽధించి అటవీ భూ సంరక్షణా చట్టం–1980 కింద పునర్ సమీక్ష జరపటంతో పాటు అటవీ హక్కు చట్టం తప్పనిసరిగా అమలు పరచటం ద్వారా జిల్లాలో ప్రజలకు భూ హక్కు ఇప్పించాలని బృందం ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం తప్పకుండా అమలు పరిచేందుకు ప్రభుత్వం వద్ద వివిధ రకాల సలహాలను తమ పోరాట కమిటీ ప్రభుత్వం ముందు ఉంచిందని చంద్రకాంత్ తెలిపారు. బృందంతో మాట్లాడిన సిద్దరామయ్య అటవీ భూమి సాగుదారుల హితరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వసతి జీవనోపాధికి అటవీ భూమిని అవలంభించిన పేద ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి మంకాళ వైద్య పాల్గొని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
కుటుంబ కలహాలకు ముగ్గురు బలి
యశవంతపుర: కుటుంబ కలహాలు ముగ్గురిని బలితీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బాగలకుంటె సమీపంలోని భువనేశ్వరినగరలో విజయలక్ష్మి, రమేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె బృందా(4), ఏడాదిన్నర వయసున్న భువన్ అనే కుమారుడు ఉన్నాడు. రమేశ్ నగరంలోని ఒక మాల్లో పనిచేస్తున్నాడు. కాగా రమేష్ ఒక మహిళను ప్రేమించి రెండోపెళ్లి చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈక్రమంలో విడాకులు ఇవ్వాలని రమేష్ తరచూ భార్య విజయలక్ష్మితో గొడవ పడుతున్నాడని, దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోందని స్థానికులు అంటున్నారు. పలు పర్యాయాలు విజయలక్ష్మి తన గోడును తల్లిదండ్రుల వద్ద చెప్పి విలపించేది. అయితే తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపేవారు. మరో వైపు రమేష్ వేధింపులు అధికం కావడంతో గురువారం తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమి హత్య చేసి తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు సాయంత్రం విజయలక్ష్మి చెల్లలు తన అక్క ఇంటికి వెళ్లగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాగులకుంటె పోలీసులు వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకొని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి భర్త విడాకులు కోరడంతోనే అఘాయిత్యం -
లాడ్జిలో మంటలు–ఇద్దరి మృతి
దొడ్డబళ్లాపురం: లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకొని పురుషుడు, మహిళ మృతిచెందారు. ఈ సంఘటన యలహంక న్యూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కిచన్–6 ఫ్యామిలీ రెస్టారెంట్ భవనం మూడవ అంతస్తులో ఒక లాడ్జి నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక గదిలో హఠాత్తుగా మంటలు చెలరేగి మిగతా గదులకు వ్యాపించాయి. లాడ్జి మొత్తం భారీగా పొగ కమ్ముకుంది. దీంతో ఓ గదిలో ఉన్న గదగ్ నివాసి రమేశ్ మంటలకు ఆహుతి కాగా హునగుంద నివాసి కావేరి ఊపిరి ఆడక మృతిచెందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. పోలీసులు వచ్చి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. మట్టణ్ణవర్పై మళ్లీ దర్యాప్తు? ● కొత్తగా ఫిర్యాదు చేసిన ప్రశాంత్ సంబరగి శివాజీనగర: ఎమ్మెల్యేల భవన్లో బాంబు పెట్టిన కేసుకు సంబంధించి గిరీశ్ మట్టణ్ణవర్పై మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీస్ కమిషనర్కు, హోం శాఖ కార్యదర్శికి సామాజిక కార్యకర్త ప్రశాంత్ సంబరగి ఫిర్యాదు చేశారు. మట్టణ్ణవర్ పలు వీడియోల్లో తానే బాంబు తయారు చేసి పెట్టినట్లు అంగీకరించినట్లుగా వ్యాఖ్యలు చేశారు. కేసును రీ ఓపెన్ చేసి ఎన్ఐఏ తనిఖీకి అప్పగించాలి. కేసు ఇప్పటికే న్యాయస్థానంలో మూసివేతకు గురైంది. అయితే కొత్త సాక్ష్యాధారాలను పరిగణించి మళ్లీ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని సంబరగి డిమాండ్ చేశారు. 2003లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మట్టణ్ణవర్ ఎమ్మెల్యేల భవన్లో బాంబులను పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత సిటీ సివిల్, సెషన్స్ కోర్టు ప్రధాన నిందితుడు మట్టణ్ణవర్తో పాటు ముగ్గురు నిందితులను తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటించింది. కల్బుర్గిలో సబ్ ఇన్స్పెక్టర్ అయిన 26 ఏళ్ల వయస్సు కలిగిన మట్టణ్ణవర్పై రైఫిల్ షూటింగ్ శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేల భవన్ ఐదో అంతస్తు మరుగుదొడ్డిలో నాలుగు బాంబులను ఉంచినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. గాజుల అలంకరణలో బనశంకరీదేవిబనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దైవం బనశంకరీదేవి గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం వేకువజామున ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్కు అభిషేకం నిర్వహించారు. అనంతరం గాజులతో అలంకరణచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఎస్డీపీఐ నాయకుడి అరెస్ట్ యశవంతపుర: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) నాయకుడు రియాజ్ కడంబుకు ఉడుపి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు హిరియడ్య సబ్ జైలుకు తరలించారు. సంఘ్ పరివార్పై ద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. గత జూలైలో ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా కుంజాలు వద్ద గోవు తలను గుర్తించారు. ఇది ఒక కుట్ర అంటూ సంఘ్ పరివార్పై ద్వేషపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా, జూలై 15న ఉడుపి నగర పోలీసులు కేసు నమోదు చేశారు. గత కేసులో బెయిల్ మంజూరు చేసినా కోర్టు నియమాలను ఉల్లంఘించారంటూ మళ్లీ కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఉడుపి జిల్లా ఎస్పీ హరిరామ్ శంకర్ తెలిపారు. -
బీమా సొమ్ము కోసం అల్లుడి హత్య
దొడ్డబళ్లాపురం: బీమా సొమ్ము కోసం ఓ వ్యక్తి వరుసకు అల్లుడు అయ్యే వ్యక్తిని హత్య చేయించిన సంఘటన హావేరిలో చోటు చేసుకుంది. హావేరి జిల్లా రట్టిహళ్లి పట్టణ నివాసి బసవరాజు(38) హత్యకు గురైన వ్యక్తి. ఇతడి మేనమామ సిద్ధనగౌడ హత్యకు కుట్ర పన్నాడు. హత్యకు పాల్పడ్డ రాఘవేంద్ర, ప్రవీణ్, లోకేశ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. హతుడు బసవరాజుకు తల్లి, తండ్రి, తోడబుట్టినవారు అందరూ మరణించారు. ఒంటరిగా జీవిస్తున్న బసవరాజు మద్యానికి బానిసయ్యాడు. అతడి పేరున కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఆస్తులపై సిద్ధనగౌడ కన్ను పడింది. ఆస్తులను విక్రయించకుండా బంధువులు కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. దీంతో సిద్దనగౌడ తానే డబ్బు చెల్లించి బసవరాజు పేరున యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు. కొంతకాలం తర్వాత సెప్టెంబర్ 27న బసవరాజుకు పీకలదాకా మద్యం తాగించి బైక్ ఇచ్చి ఇంటికి వెళ్లమని చెప్పాడు. తరువాత వెనుకనే కారులో వెళ్లిన సిద్ధనగౌడ, ముగ్గురు నిందితులు బైక్ను ఢీకొట్టారు. ప్రమాదంలో బసవరాజు మృతి చెందాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కాజేయాలని సిద్ధనగౌడ ప్రణాళిక రచించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో కుట్ర కోణం వెలుగు చూడడంతో నిందితులను అరెస్టు చేశారు. -
రేపిస్టుపై పోలీసు కాల్పులు
మైసురు : బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మైసూరు తాలూకా సిద్దలింగాపురగ్రామానికి చెందిన నిందితుడు కార్తీక్పై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈఘటన చామరాజనగర జిల్లాలో శుక్రవారం జరిగింది. కల్బుర్గి జిల్లా సుళ్తానపుర గ్రామానికి చెందిన ఆలెమారి సదామయానికి చెందిన దంపతులు తమ పిల్లలతో కలిసి మైసూరు దసరా వేడుకల్లో బెలూన్లు, ఆటల వస్తువులు విక్రయించేందుకు వచ్చారు. వస్తు ప్రదర్శన ప్రాధికార వద్ద ఇటుకులతో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని రాత్రి అక్కడే నిద్రించేవారు. గురువారం ఉదయం దంపతులు నిద్రలేచిచూసేసరికి వారి పదేళ్ల కుమార్తె కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించారు. అక్కడకు సమీపంలో బాలిక అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. శరీరంపై ఉన్న గాయాలను చూసి లైంగిక దాడికి గురైనట్లు గుర్తించారు. సీసీకెమెరాను పరిశీలించి నిందితుడు సిద్దలింగాపురగ్రామానికి చెందిన కార్తీక్ అని గుర్తించారు. నిందితుడు చామరాజనగర జిల్లా కొళ్లెగాలలో కారు పార్కింగ్ వద్ద నిద్రిస్తుండగా అదుపులోకి తీసుకొని మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మూత్రవిసర్జనకు అని చెప్పి ఉడాయించేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు సర్వీస్ పిస్టల్తో కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ కార్తీక్ కాలిలోకి దూసుకెళ్లగా కుప్పకూలాడు. అనంతరం అతన్ని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కాగా హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తరలించారు. అరెస్ట్ అయిన నిందితుడు కోలుకున్న అనంతరం కోర్టులో హాజరు పరుస్తామని మైసూరు నగర పోలీస్ కమిషనర్ సీమాలట్కర్ తెలిపారు. -
సుపరిపాలన, అభివృద్ధి కోసమే జీబీఏ
బనశంకరి: వేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగర సమస్త ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి కోసమే గ్రేటర్ బెంగళూరు ప్రాధికార(జీబీఏ)ను అమల్లోకి తెచ్చి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార మొదటి సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఏర్పాటు వెనుక ఉద్దేశాలను ప్రస్తావించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ కార్పొరేషన్లు ఉంటే అభివృద్ధి సాధ్యమన్న కారణంతో దీనిపై నివేదిక అందించాలని మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం వచ్చిన ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించలేదన్నారు. దీంతో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన అనంతరం కమిటీని పునః నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన గ్రేటర్బెంగళూరు ప్రాధికారను అమల్లోకి తీసుకువచ్చి 5 నగరపాలికేలు ఏర్పాటు చేశామన్నారు. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలి. రోడ్లు, డ్రైనేజీలు, పుట్పాత్, పార్కులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి ఆదర్శపాలికేలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రేటర్బెంగళూరు ప్రాధికార పనిచేయాలని అదికారులకు సిద్దరామయ్య సూచించారు. జేబీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు రామలింగారెడ్డి, కేజే.జార్జ్, జమీర్ అహ్మద్ఖాన్, బెంగళూరు నగర ఎమ్మెల్యేలు, డీజీపీ ఎంఏ.సలీం, కమిషనర్ సీమంత్కుమార్ సింగ్, కలెక్టర్ జగదీశ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య -
హాసనాంబ దర్శనం.. పులకించిన భక్తజనం
బనశంకరి: హాసన్లో కొలువైన హాసనాంబదేవి అమ్మవారు శుక్రవారం భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయ గర్భగుడి తలుపులు తెరిచి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించారు. అంతకుముందు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున కృష్ణబైరేగౌడ ఆలయానికి విచ్చేసి భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. షామియానాలు తాగునీరు, మరుగుదొడ్లు, వాహనాలు పార్కింగ్ వ్యవస్థను పరిశీలించారు. ఎంపీ శ్రేయస్పటేల్, కలెక్టర్ లతాకుమారి, ఎస్పీ మహమ్మద్సుచేతలు ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో వేదికలు నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నామని మంతి తెలిపారు. బెంగళూరు, చైన్నె తదితర ప్రాంతాల్లో తొక్కిసలాట చోటుచేసుకుందని, ఇక్కడ అలాంటి ఘటనలు సంభవించకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 10వేలమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 12వేల మంది క్యూలైన్లలో ఉండగా రాత్రి 7 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. రోజూ మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు, రాత్రి 2 నుంచి 5 గంటల వరకు అమ్మవారి అలంకరణ, నైవేద్యం కారణంగా దర్శనం నిలిపివేసి మిగిలిన సమయంలో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. -
అందుకే బిగ్బాస్ ఇంటికి తాళం.. రెండురోజుల్లో మళ్లీ షురూ
కన్నడ బిగ్బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్బాస్కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరుఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్బాస్కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.బెస్కాం నోటీసులుబిగ్బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్బాస్కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్ -
బీజేపీ పక్షనేత అశోక్ డ్రైవర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీజేపీ శాసనసభా పక్ష నేత ఆర్.అశోక్ కారు డ్రైవర్, పోలీసు ఉద్యోగి అయిన శరణగౌడ రామగోళ్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. శరణగౌడ బెంగళూరు బ్యాటరాయనపుర బాపూజీ నగరలో కుటుంబంతో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య శైలశ్రీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నగర సమీపంలో మాగడి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తోంది. శరణగౌడ వీఐపీ సెక్యూరిటీ వింగ్లో హెడ్ కానిస్టేబుల్, అలాగే డ్రైవర్గా ఉన్నాడు. ఏం జరిగిందో కానీ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానిక పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ ఆస్పత్రికి వెళ్లి శరణగౌడ మృతదేహాన్ని చూసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. శరణగౌడ చాలా మెతక మనిషి, మంచివాడని, బాధగా ఉందని చెప్పారు. తాను రెండు రోజులుగా బెంగళూరులో లేనని, ఇంతలో విషయం తెలిసి వచ్చానని అశోక్ మీడియాతో చెప్పారు. -
విద్యాభివృద్ధికి పంచవర్ష ప్రణాళిక
రాయచూరు రూరల్: విద్య, వైద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో ప్రాంతీయ అసమానతలతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం హైదరాబాద్ కర్ణాటక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు. కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాల అభివృద్ధిని రాష్ట్రంలో అధికారం చేపట్టిన సర్కార్లు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రతి ఏడాది రూ.1000 కోట్ల నిధులు కేటాయించారు. ఈ నిధులతో శాసన సభ్యులు రహదారులు, పాఠశాలలు, తాగునీటి పథకాలకు నిధులను వినియోగించుకోవాల్సి ఉంది. మండలికి అధ్యక్షుడిగా శాసన సభ్యుడు అజయ్ సింగ్ నియమితులయ్యారు. కళ్యాణ కర్ణాటకలో విద్యా రంగాభివృద్ధికి కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ ప్రణాళికను రూపొందించారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 50 పాఠశాలలు, 10 కళాశాల అభివృద్ధికి అక్షర ఆవిష్కార పథకం అమలుకు శ్రీకారం చుట్టి, దాని అమలుకు రూ.652 కోట్లు కేటాయించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తారు. ఈ విషయంలో విద్యా శాఖ కలబుర్గి కమిషనర్ డిగ్రీ కళాశాల విద్యా శాఖ కమిషనర్కు నివేదిక పంపారు. ప్రయోగశాల, భవనాల నిర్మాణాలు, మరుగుదొడ్లు, అభ్యాస సామర్థ్యం కల్పించడానికి చర్యలు చేపట్టారు. ప్రతి అసెంబ్లీలో 50 స్కూళ్లు, 10 కళాశాలల అభివృద్ధి పదవ తరగతి ఫలితాల మెరుగునకు ప్రత్యేక కమిటీ అక్షర ఆవిష్కార పథకం శ్రీకారానికి రూ.652 కోట్లు -
పత్తికి మద్దతు ధర ప్రకటించరూ
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పత్తి పంటకు నష్ట పరిహారం అందించడంతో పాటు మద్దతు ధర ప్రకటించాలని అఖిల భారత రైతు వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లనగౌడ మాట్లాడారు. క్వింటాల్కు రూ.10 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలన్నారు. వర్షాలకు నష్టపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఏఈ ఆత్మహత్యాయత్నం హుబ్లీ: ఉన్నతాధికారుల వేధింపులతో విసిగి వేసారి జీవితంపై విరక్తి పెంచుకున్న అసిస్టెంట్ ఇంజినీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కొప్పళ జిల్లాలోని కిర్లోస్కర్ కర్మాగారంలో జరిగింది. కొప్పళ తాలూకా గిణిగెరా వద్ద ఉన్న కిర్లోస్కర్ ఫ్యాక్టరీలో బసవరాజ్ అడిగ అనే సహాయక ఇంజనీర్ ఈ ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. పేదలకు ఇందిరా ఆహార కిట్లు హుబ్లీ: రాష్ట్రంలో ఇకపై అన్న భాగ్య పథకంలో భాగంగా అదనంగా 5 కేజీల బియ్యానికి బదులుగా ఇందిరా ఆహార కిట్లను పంపిణీ చేయాలని సిద్దరామయ్య మంత్రివర్గం నిర్ణయించడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సిద్దరామయ్య మంత్రివర్గం తీసుకున్న సదరు నిర్ణయంపై పేద ప్రజలు స్వాగతిస్తున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సంబంధిత మంత్రి హెచ్కే పాటిల్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు వారి కుటుంబ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మూడు కేటగిరీలుగా విభజిస్తామన్నారు. ఒకరిద్దరు సభ్యులు ఉన్న కుటుంబంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు అర్ధకేజీ పద్ధతిన, ముగ్గురు, నలుగురు సభ్యులు ఉన్న రేషన్ కార్డు దారులకు ఒక కేజీ చొప్పున, 5 మంది కన్నా ఎక్కువ సభ్యులు ఉన్న రేషన్ కార్డుదారులకు 1.50 కేజీల చొప్పున ఆహార కిట్లు అందిస్తారన్నారు. పాఠశాల బస్సు ఢీకొని విద్యార్థి మృతి హోసూరు: ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ప్లస్వన్ విద్యార్థి మృతి చెందిన ఘటన నల్లూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హోసూరు సమీపంలోని నల్లూరు గ్రామానికి చెందిన సురేష్ కుమారుడు ఇంద్రేష్ (18). అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్వన్ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం నల్లూరు–హోసూరు రోడ్డుపై ఇంద్రేష్ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. ఆ మార్గంలో వెళ్తున్న ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇంద్రేష్ను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● ఇంజినీర్ మృతి క్రిష్ణగిరి: మత్తూరు సమీపంలో ద్విచక్ర వాహనంపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఇంజినీర్ మృతి చెందాడు. మిత్రుడికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలోని జోగిపట్టి గ్రామానికి చెందిన మోహన్ (31). కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రైవేట్ పరిశ్రమలో ఇంజినీర్గా పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడి మిత్రుడు ఎళిల్తో కలిసి ద్విచక్ర వాహనంలో మత్తూరు నుంచి జోగిపట్టి గ్రామం వైపు బయలుదేరారు. ఎదురుగా వచ్చిన కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మోహన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి స్నేహితుడు ఎళిల్కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు ఎళిల్ను చికిత్స కోసం మత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వేశ్యావాటికపై దాడి హోసూరు: హోసూరు ప్రాంతంలో మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ధర్మపురి జిల్లా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని బాగలూరు రోడ్డు ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు ఇందిరానగర్ ప్రాంతంలో గస్తీ చేపట్టారు. ఆ సమయంలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు కనుక్కున్న పోలీసులు.. ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు. ధర్మపురి జిల్లా పాలకోడు ప్రాంతానికి చెందిన ధనలక్ష్మిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేలుకోటెలో వానరాల బెడద
మండ్య: జిల్లాలోని ప్రసిద్ధ మేలుకోటె పుణ్యక్షేత్రంలో ఇటీవల కోతుల బెడద అధికమైంది. ఆలయానికి వచ్చే భక్తుల మీద దాడులకు పాల్పడుతున్నాయి. కోతులను పట్టుకుని అడవిలో వదిలేందుకు సహకరించాలని అటవీ శాఖ అధికారులకు పీడీఓ రాజేశ్వర్, జీపీ ఇన్చార్జి అధ్యక్షుడు జీకే కుమార్ లేఖ రాశారు. కోతుల దాడుల్లో పలువురు భక్తులకు రక్త గాయాలయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు మేలుకోటె బంద్ చేపడతామని హెచ్చరించడంతో అధికారులు కోతుల కట్టడికి సరేనన్నారు. జీపీ అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ కోతుల బెడదతో గ్రామస్తుల ఆస్తిపాస్తులకు నష్టం వాటిల్లుతోందన్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు కూడా భద్రత కరువైందన్నారు. ఈ నేపథ్యంలో కోతుల పట్టివేతకు నడుం బిగించినట్లు తెలిపారు. -
కోర్టు 5వ అంతస్తు నుంచి దూకి నిందితుడు ఆత్మహత్య
బనశంకరి: బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆవరణలో బాలికపై లైంగిక వేధింపుల (పోక్సో) కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. గౌతమ్ (35) అనే వ్యక్తిపైన ఏప్రిల్లో ఆడుగోడి పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. చా ర్జిషీటు కూడా దాఖలు చేశారు. గురువారం కేసు విచారణ కోసం జైలు నుంచి గౌతమ్ ను సిటీ సివిల్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు రాగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇంతలో నిందితుడు హఠాత్తుగా 5వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయాడు. ఈ సంఘటన కోర్టు ఆవరణలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. కేసు వల్ల విరక్తి చెంది ఇలా చేసి ఉంటాడని అనుమానాలున్నాయి. ఈ కేసులో అతనికి భద్రతగా ఉన్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కురుబలకు ఎస్టీ హోదాకు సీఎం సిఫార్సు: బొమ్మై శివాజీనగర: కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీలోకి చేర్చేందుకు సీఎం సిద్దరామయ్య కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని బీజేపీ ఎంపీ బసవరాజ బొమ్మై చెప్పారు. తమ హయాంలోనే కుల గణన అధ్యయన నివేదిక వచ్చింది. దానిని మా ప్రభుత్వం ఆమోదించింది, కానీ అంతలోనే ఎన్నికలు వచ్చాయి, ఆ నివేదికను బట్టి సీఎం సిద్దరామయ్య కురుబలను గిరిజనుల్లోకి చేర్చాలని 2023 జులై 20న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు. వాల్మీకులు, కురుబల మధ్య ఎలాంటి సమస్య రాదని, కానీ రిజర్వేషన్ను పెంచడం అంత సులభతరమైనది కాదన్నారు. బిగ్బాస్ స్టూడియోను బంద్ చేసే అధికారం కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఉందా? అని బొమ్మై ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నీ దారి తప్పిపోతున్నాయని ఆరోపించారు. లోకాయుక్త వలలో ఆర్టీసీ అధికారి మైసూరు: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ఫైల్ను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ.10 వేల లంచం తీసుకుంటుండగా కేఎస్ఆర్టీసీ సహాయక పాలనాధికారిని లోకాయుక్త పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. మండ్యకు చెందిన సంతోష్కుమార్ తండ్రి కేఎస్ఆర్టీసీలో పని చేసేవారు. ఆయన అకాల మృతితో ఆ ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని కోరుతూ సంతోష్కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. అతని ఫైల్ను ఉన్నతాధికారులకు పంపేందుకు మైసూరు నగరంలోని బన్నిమంటప వద్ద ఉన్న కేఎస్ఆర్టీసీ కార్యాలయ గ్రామీణ విభాగపు ఏఏఓ మంజునాథ్ రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. మంజునాథ్ ఆఫీసులోనే సంతోష్ కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన ఆర్ఐ బెళగావిలో! శివాజీనగర: ఉన్నతాధికారుల వేధింపులకు విసుగెత్తి అదృశ్యమైన ఉత్తర కన్నడ జిల్లా కుమటా పురసభ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటేష్ బెళగావిలో ఉన్నట్లు తెలిసింది. భ ట్కళలోని ఇంటి నుంచి మంగళవారం రాత్రి లేఖ రాసి పెట్టి అదృశ్యం కావడం తెలిసిందే. పురసభ ప్రధానాధికారి ఎం.ఆర్.స్వామి వేధిస్తున్నాడని లేఖలో ఆరోపించారు. ఆర్ఐ తల్లి భట్కళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఇంటికి ఫోన్ చేసి తాను బెళగావిలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భట్కళ పోలీసులు బెళగావి నగరంలోని మార్కెట్ ఠాణా పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంకటేష్ను స్టేషన్లో ఉంచారు. మహిళ ఇంటిలో చోరీ మైసూరు: మరణించిన భర్తను చూసేందుకు వేరే ఊరికి వెళ్లిన ఓ మహిళ ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారు. మైసూరు నగరంలోని శ్రీరాంపురలో జరిగింది. వివరాలు.. శ్వేతారాణి అనే మహిళ భర్త కేరళలో పనిచేస్తూ అక్కడే చనిపోయాడు. దీంతో ఆమె కర్మకాండల నిర్వహణకు అక్కడకు వెళ్లారు. ఈ నెల 6న తిరిగి ఇంటికి తిరిగి రాగా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలు, అల్మరాలలో విలువైన వస్తువులు కనిపించలేదు. దొంగలు పడి బంగారు ఆభరణాలు, ప్లాటినం ఉంగరం, రూ.15 వేల విలువ చేసే విదేశీ కరెన్సీని ఎత్తుకెళ్లారు. ఆమె కువెంపునగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నగరాభివృద్ధిపై మంత్రుల నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని వివిధ సర్కిళ్లలో ఉన్న అంబేడ్కర్, బసవణ్ణ, బాబూ జగ్జీవన్ రామ్ ఉద్యానవనాల అభివృద్ధికి రాయచూరు డెవలప్మెంట్ అథారిటీ(ఆర్డీఏ) నుంచి ఫిబ్రవరిలో రూ.40 కోట్ల ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం నిధులను మే నెలలో విడుదల చేసిందన్నారు. గత 5 నెలల నుంచి పనులు చేపట్టడానికి టెండర్లు పిలవాల్సిన ఇంజినీర్, మంత్రుల మాటలకు వత్తాసు పలుకుతూ మౌనం వహించారని ఆరోపించారు. జిల్లాధికారి నితీష్, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోలు కలిసి రాయచూరును సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీలిచ్చి మాట తప్పారన్నారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజుల మధ్య అధికారులు ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నగర శాసన సభ్యుడు తనకేమీ పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన ఖండించారు. టెండర్ ప్రక్రియపై అధికారుల మౌనం మాట తప్పిన జిల్లా స్థాయి అధికారులు రూ.40 కోట్ల నిధులు రికార్డులకే పరిమితం అయ్యాయి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపణ -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి
బళ్లారిటౌన్: నగరంలో గత రెండు మూడేళ్లుగా వివిధ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని బళ్లారి నాగరిక పోరాట సమితి డిమాండ్ చేసింది. బుధవారం కార్పొరేషన్ ముందు నిరసన వ్యక్తం చేసి అనంతరం కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సమితి కన్వీనర్ సోమశేఖర్గౌడ తదితరులు మాట్లాడుతూ బళ్లారి నగరంలో ఎటు చూసినా రోడ్లు గోతులమయంగా మారాయన్నారు. ఇక చాలా రోడ్ల అభివృద్ధి పనులు రెండు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నందున వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ఇతర రోడ్లలో ట్రాఫిక్ రద్దీ పెరిగిందన్నారు. నగరంలో వీధి కుక్కలు, పశువుల బెడద వల్ల తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తాగునీటి కొళాయిల్లో డ్రైనేజీ నీరు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఏ వార్డులో చూసినా చెత్తకుప్పలు వెలుస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు నాగరత్న, మంజునాథ్, శ్యాంసుందర్, గురురాజ్, వీరేష్, ఆంథోని, గురళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరసన ర్యాలీ
సిరుగుప్ప: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయిపై బూటు విసిరిన న్యాయవాది రాకేశ్ కుమార్ను తక్షణమే దేశద్రోహ చట్టం కింద బంధించాలని దళిత సంఘర్ష సమితి నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాలు గురువారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తరువాత అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాలుష్యాన్ని నివారించాలి హొసపేటె: దేశచరిత్రలో ఇందిరాగాంధీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన మహిళ అని హామీ పథకం సభ్యురాలు జ్యోతి ఎం.గొండబాళ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి స్వర్ణోత్సవంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కర్మాగారాలు చాలా కాలుష్యానికి కారణమవుతున్నాయని, ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు వాహనాలను తక్కువగా ఉపయోగించాలని, చెత్త విషయంలో మున్సిపాల్టీతో సహకరించాలని కోరారు. మంజునాథ్ జి.గొండబాళ, సలీం అళవండి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బసయ్యస్వామి హిరేమట్, అక్బర్ పాషా పల్టాన్ తదితరులు పాల్గొన్నారు. 12న ఆరోగ్య పరీక్ష శిబిరం రాయచూరు రూరల్: నగరంలో ఈ నెల 12న ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యురాలు బీ.అనిత వెల్లడించారు. గురువారం పాత్రికేయులతో ఆమె మాట్లాడారు. నగరంలోని మంత్రాలయం రోడ్డులో ఉన్న ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన వ్యాధులపై పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అవసరమైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రసవ పూర్వానికి గర్భ చికిత్సలు, బాలికలకు పీరియడ్స్ వంటి అంశాలపై సలహా సూచనలిస్తారన్నారు. అక్రమ సిలిండర్ల స్వాధీనం రాయచూరు రూరల్: నగరంలోని ఇళ్లలో అక్రమంగా నిల్వ ఉంచుకున్న సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మక్తల్ పేటలో నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బసవరాజ్ దాడి జరిపి వంటకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఆటోలకు ఇంధనం(గ్యాస్)గా వినియోగిస్తున్నట్లు సమాచారం సేకరించి దాడులు చేసి 4 సిలిండర్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ఎన్నికలు త్వరగా నిర్వహించాలి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం త్వరగా జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికలను నిర్వహించాలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రవిగౌడ ఒత్తిడి చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ్యులు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.2.962 కోట్ల నిధులు తిరిగి వాపస్ వెళుతున్నట్లు తెలిపారు. వచ్చే డిసెంబర్ నెలలో ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం ముగిసి పోతుందన్నారు. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీల్లో గత నాలుగేళ్ల నుంచి అధికారుల పాలన కొనసాగుతుండడంతో నిధులు ఏ రంగానికి వ్యయం చేయాలో విదితం కావడం లేదన్నారు. విషద్రావకం సేవించి కార్మికుడు ఆత్మహత్యకెలమంగలం: కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నొప్పులను భరించలేక జీవితంపై విరక్తి చెంది విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. రాయకోట సమీపంలోని ఏరిచిన్నగానంపట్టి గ్రామానికి చెందిన మల్లప్ప (57) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో నొప్పులు తట్టుకోలేక విషద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రాయకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
ఉద్యాననగరి.. కాలుష్య విహారి
యశవంతపుర: బెంగళూరులో స్వచ్ఛమైన గాలి దొరుకుతుందని ప్రజలు ఆశపడడం దురాశగానే ఉంటోంది. ఉద్యాననగరిగా పేరున్నప్పటికీ కనీసం ఓ మోస్తరుగానైనా మంచి గాలి లభించడం లేదు. విపరీతంగా కట్టడ నిర్మాణాల పనులు, పరిశ్రమలు, వాహనాల పొగ తదితరాల వల్ల కాలుష్యం చెలరేగుతోంది. సెప్టెంబర్లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2025ను విడుదల చేసింది. ఇందులో సిలికాన్ సిటీ స్థానం మరింత అథోగతికి చేరింది. బెంగళూరు నగరం 28 స్థానం నుంచి 36వ స్థానానికి పడిపోయింది. రోజురోజుకూ ప్రమాద ఘంటికలు ● ఆ శాఖలకు చెందిన ఎన్క్యాప్ విభాగం నిపుణులు దేశంలోని వివిధ నగరాలలో గాలి నాణ్యత మీద సమీక్ష చేశారు. బెంగళూరు గాలిలోని నాణ్యత రోజురోజుకు పడిపోతున్నట్లు ఆందోళన వెలిబుచ్చారు. ● 10 లక్షల కంటే అధికంగా జనసంఖ్య ఉన్న నగరాలు పలు చర్యల ద్వారా గాలి నాణ్యతలను పెంచుకున్నాయి. అయితే బెంగళూరులో ఈ చర్యలు ఫలించడం లేదు. ఇక్కడ ఒక ఘనపు మీటరు గాలిలో సాధారణం కంటే ఎక్కువగా దుమ్ము ధూళి కణాలు ఉంటున్నాయి. దాని వల్ల బెంగళూరు ర్యాంకు క్షీణించింది. ● గత నివేదికలతో పోలిస్తే 2026 నాటికి వాయు స్వచ్ఛత, ర్యాంకింగ్ మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనాలదే పాపం సిలికాన్ సిటీలో రోజుకు సుమారు 1.5 కోట్లకు పైగా వాహనాలు తిరుగుతూ పొగ వదులుతూ, దుమ్ము రేపుతూ ఉంటాయి. దీనివల్ల గాలిలోకి ప్రమాదకరమైన కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డయాకై ్సడ్, నైట్రస్ ఆకై ్సడ్ వంటి వాయువులతో పాటు దుమ్ము, మసిని వెదజల్లుతూ ఉంటాయని నివేదికలో పేర్కొన్నారు. వాయు కాలుష్యానికి ప్రాథమికంగా వాహనాలు, రోడ్డుపై నుంచి వచ్చే దుమ్ము ధూళి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అందుకే బెంగళూరులో శ్వాసకోశ జబ్బులు, కాలుష్య సంబంధ అనారోగ్యాలు అధికమయ్యాయి. స్వచ్ఛ గాలి ర్యాంకింగుల్లో మరింత క్షీణత గతేడాది 28వ స్థానం, ఈసారి 36 జనాభా, వాహనాల ఒత్తిడే కారణం సౌకర్యాలను పెంచాల్సిందే 2025 ప్రారంభంలో సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నిర్వహించిన ప్రగతి నివేదికలోని వాహనాల నుంచి వచ్చే పొగ, రోడ్ల దుమ్ముధూళి 40 శాతం కాలుష్యానికి కారణమవుతోందని తెలిపారు. ట్రాఫిక్ను నియంత్రించటంతో పాటుగా, ఉత్తమమైన రోడ్లు, సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2024లో బెంగళూరు 170 పాయింట్లు సాధించి 28వ స్థానంలో ఉండగా, ఈసారి ర్యాంకు పడిపోవడం గమనార్హం. ఈదఫా 145 పాయింట్లే వచ్చాయి. పాలికె అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి మధ్య సహకారం లేకపోవడంతో పాటు కేంద్రం ఇచ్చే నిధులను సక్రమంగా ఉపయోగించటం లేదని నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ముప్పే విపరీతమైన జనాభా ఒత్తిడి, అలాగే వాహనాలు కాలుష్యంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు సర్వేలో తెలిపారు. ఈ సమస్యల మధ్య బెంగళూరు పాలన యంత్రాంగానికి నగరాన్ని మాలిన్య రహితంగా ఎలా తీర్చిదిద్దాలో దిక్కుతోచడం లేదనే చెప్పాలి. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టికే బెంగళూరు పరిమితమైంది. స్వచ్ఛ గాలి దొరకడం లేదు, భవిష్యత్తులో బెంగళూరు ప్రజలకు ముప్పు తప్పదని పరిసరవాది విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జొన్నదంటుతో బెల్లం తయారీ
సాక్షి,బళ్లారి: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్నది ఒక సినిమా పాట కాదు, నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న రంగంలో వినూత్న తరహాలో ఆలోచనలతో పాటు అందుకు తగ్గట్టు కృషి చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించడంతో పాటు ఇతరులకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారని చెప్పవచ్చని మహాలింగప్ప అనే రైతు నిరూపించారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఉత్తర కర్ణాటక పరిధిలో 25 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోవడంతో వేలాది మంది రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం అందించే పరిహారం కోసం ఎదురు చూస్తున్న దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అదే ఉత్తర కర్ణాటక పరిధిలోని బాగల్కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకా సంగనహట్టి గ్రామానికి చెందిన మహాలింగప్ప అనే రైతు తనకు ఉన్న వ్యవసాయ పొలంలో 10 ఎకరాల్లో మెగా జొన్నలు విత్తారు. వినూత్నంగా ఆలోచించడం వల్లే.. మూడు నెలల క్రితం విత్తిన జొన్న పంటకు అదృష్టవశాత్తు భారీ వర్షాల దెబ్బ కూడా ఈ ప్రాంతానికి అంతగా పడలేదు. అంతేకాకుండా రైతు కూడా వినూత్న తరహాలో ఆలోచించారు. జొన్నదంటు చెరుకు దంటు కంటే బలంగా ఉండటంతో పాటు ప్రారంభం నుంచి జొన్న దంటు తియ్యగా ఉండటంతో సదరు రైతు జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అనుకున్నదే తడవుగా జొన్నదంటును సంబంధిత వ్యవసాయ శాఖ అఽధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రయోగశాలకు కూడా పంపారు. జొన్నదంటులో అన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలు ఉన్నాయని, చెరుకు దంటులో ఏవిధమైన బెల్లం తయారీకి పాకం వస్తుందో అదే తరహాలో జొన్నదంటులో కూడా ఉందని, బెల్లం తయారు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని, చెరుకు దంటు కన్నా జొన్న దంటుతో తయారు చేసిన బెల్లం తియ్యగా, రుచిగా ఉందని ల్యాబ్లో తేలడంలో సదరు రైతు తన పొలంలోని జొన్న దంటుతో బెల్లం తయారు చేశారు. దేశంలోనే సరికొత్త ప్రయోగం చేపట్టిన బాగలకోటె జిల్లా రైతన్న బెల్లం కంటే తియ్యగా ఉంటున్న జొన్నదంటుఒక ఎకరంలో దాదాపు 700 కేజీల బెల్లం తయారు చేశారు. దీంతో జొన్న విత్తనాలతో జొన్నలు పండించడంతో పాటు బెల్లం కూడా తయారు చేయడం ద్వారా సరికొత్త ప్రయోగాన్ని చేసి విజయవంతం అయ్యారు. ఈ సందర్భంగా రైతు మహాలింగప్ప సాక్షితో మాట్లాడుతూ తన పొలంలో మెగా జొన్నలు విత్తామన్నారు. పంట ఏపుగా పెరగడంతో పాటు దంటు కూడా బలంగా రావడంతో జొన్న దంటుతో బెల్లం తయారు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ తర్వాత అన్ని విధాలుగా ల్యాబ్ పరీక్షలు కూడా చేసిన తర్వాత జొన్నలు పండించడంతో పాటు బెల్లం తయారు చేశామన్నారు. ఒక ఎకరా జొన్నదంటుతో 700 కేజీల బెల్లం తయారు చేయగలిగామన్నారు. దేశంలో ఇలాంటి తరహా ప్రయోగం తాను చేయడం గర్వకారణంగా ఉందన్నారు. రైతులు జొన్న పంటతో చెరుకు తరహాలో బెల్లం తయారు చేస్తే, రెండు విధాలుగా లాభాలు ఉంటాయని, ఇటు జొన్నలు పండటంతో పాటు అటు బెల్లం తయారు చేయవచ్చన్నారు. -
పచ్చని నగరంగా మార్చడమే లక్ష్యం
రాయచూరు రూరల్: రాయచూరు నగరాన్ని పచ్చని నగరంగా తీర్చిదిద్దాలనే సదాశయమే ప్రధాన లక్ష్యమని నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పేర్కొన్నారు. గురువారం మహాత్మ గాంధీ క్రీడామైదానంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, యువజన సేవా క్రీడా శాఖ, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో జరిగిన మారథాన్ను ప్రారంభించి మాట్లాడారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మారథాన్ ద్వారా యువకులు ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. రహదారికిరువైపుల మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణకు ముందుండాలన్నారు. యువత దురలవాట్లుకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారి సురేంద్రబాబు, వీరేష్ నాయక్, ప్రవీణ్ కుమార్, శాకీర్లున్నారు. మారథాన్లో గెలుపొందిన లింగణ్ణ, భూమిక, తిమ్మప్పలకు బహుమతులిచ్చి సన్మానించారు. -
అవినీతి పీడీఓలపై చర్యలు తీసుకోండి
బళ్లారిఅర్బన్: అవినీతి పీడీఓలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంత జీ.యలసంగి డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని సండూరు, కంప్లి, సిరుగుప్ప, కురుగోడు, బళ్లారి తాలూకాలోని సంబంధిత గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) ప్రభుత్వ నిధులను సర్కారు పేరున చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనుల సాకుతో రూ.కోట్ల చొప్పున దోపిడీ చేస్తున్నారన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు ఆ పీడీఓల అవినీతిపై తగిన చర్యలు తీసుకొని 5 గ్యారెంటీ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో తేల్చాలని అన్నారు. అంతేగాక వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి రూపాయి సంబంధిత పేద లబ్ధిదారులకు చేరాలని అన్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓ తదితర అధికారులు పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. పీడీఓల నుంచి ప్రభుత్వ నిధులను తక్షణమే రికవరీ చేసుకోవాలని ఆయన ఒత్తిడి చేశారు. ప్రముఖులు, జిల్లా అధ్యక్షుడు కట్టెస్వామి, ఎంఏ సింధికర్, డాక్టర్ జావీద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మైసూరులో మరో ఘోరం
మైసూరు: మైసూరులో అందరూ చూస్తుండగానే కారులో నుంచి లాగి ఓ వ్యక్తిని నరికివేసిన దుర్ఘటన మరువకముందే మరో ఘోరం బయటపడింది. ఆ హత్య జరిగిన వస్తుప్రదర్శన మైదానం సమీపంలో ఓ బాలిక శవం గురువారం ఉదయం లభించింది. బెలూన్లను విక్రయిస్తున్న సుమారు 13 ఏళ్ల వయస్సుగల వలస కుటుంబం బాలిక శవం దుస్తులు లేని స్థితిలో కనిపించింది. ఏం జరిగిందంటే.. వివరాలు.. ఇటీవల దసరా ఉత్సవాల సమయంలో కలబురిగి వైపు నుంచి బెలూన్లు, ఆట బొమ్మల్ని విక్రయించే ఎన్నో కుటుంబాలు మైసూరుకు వచ్చాయి. వస్తు ప్రదర్శన మైదానం సమీపంలో టెంట్లు వేసుకుని పగలంతా వ్యాపారం చేసి రాత్రికి బస చేసేవారు. అదే ప్రకారం బుధవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి బాలిక నిద్రించింది. గురువారం ఉదయం నిద్ర లేచి చూడగా ఆమె కనిపించలేదు. టెంట్కు వెనుక భాగంలో బాలిక మృతదేహం పడి ఉంది. ఎవరైనా దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, జాగిలం, ఫోరెన్సిక్ సిబ్బంది చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. బాలిక తల్లిదండ్రులను పోలీసులు పిలుచుకెళ్లి విచారణ చేస్తున్నారు. డీసీపీ బిందురాణి మాట్లాడుతూ దర్యాప్తు చేపట్టామని అన్నారు. బొమ్మలు అమ్మే బాలికపై అత్యాచారం, హత్య? -
హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి
హొసపేటె: ధర్మస్థలలో సౌజన్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో 13 ఏళ్లు గడిచినా ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైందని ధర్మస్థల దౌర్జన్య వ్యతిరేక వేదిక నేత యల్లాలింగ ఆరోపించారు. గురువారం నగరంలో సౌజన్య హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సౌజన్య హత్య కేసును పూర్తిగా తిరిగి దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు వైద్య, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా ధర్మస్థల, చుట్టు పక్కల జరిగిన అసహజ మరణాలు, అత్యాచార, అదృశ్య, భూ కుంభకోణ, ఆర్థిక నేరాల కేసులను నిష్పాక్షికంగా దర్యాప్తు చేయడానికి సిట్కు అధికారం ఇవ్వాలని తెలిపారు. దళితులు, మహిళలు, దోపిడీకి గురైన వర్గాల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. వేదిక నేతలు భాస్కర్రెడ్డి, కరుణానిధి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. హత్యాచారంపై విచారణకు డిమాండ్ రాయచూరు రూరల్: 13 ఏళ్ల క్రితం ధర్మస్థలలో సౌజన్యపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసును సమగ్రంగా విచారించాలని ధర్మస్థల దౌర్జన్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. సౌజన్యపై అత్యాచారం, హత్య కేసుపై ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్రంగా విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. -
దేశాభివృద్ధికి పెద్దల సలహాలు అవసరం
బళ్లారిటౌన్: దేశాభివృద్ధికి సీనియర్ సిటిజన్ల(పెద్దల) మార్గదర్శకాలు అత్యవసరమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార కార్యదర్శి, సివిల్ న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల ఆధ్వర్యంలో గురువారం విశ్వ సీనియర్ సిటిజన్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల రోజుల్లో సీనియర్ సిటిజన్లను పక్కన పెడుతుండటం విచారకరం అన్నారు. పెద్దలను గౌరవించాలన్నారు. మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నారు. సీనియర్ సిటిజన్లకు చట్టపరమైన సమస్యలు ఉంటే జాతీయ న్యాయ సేవా ప్రాధికారకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా గ్యారెంటీ పథకాల అమలు ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ మన ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి సీనియర్ సిటిజన్ల కోసం వివిధ పథకాలను చేపట్టారని గుర్తు చేశారు. ఏఎఫ్సీ నవీన్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ, అధికారులు గోవిందప్ప, సవిత, ఎంటీ మల్లేష్, బీ.వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన సీనియర్ సిటిజన్లను సన్మానించారు. -
మహిళా ఉద్యోగులకు శుభవార్త
శివాజీనగర: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే యువతులు, మహిళలకు ప్రతి నెలా ఒకరోజు జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుతుస్రావ సమయంలో ఈ సెలవును ఉపయోగించుకోవచ్చు. గురువారం ఈ మేరకు సీఎం సిద్దరామయ్య, మంత్రుల సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇతరత్రా ముఖ్య నిర్ణయాలను మంత్రి హెచ్.కే.పాటిల్ తెలిపారు. కనకపురలో మెడికల్ కాలేజీ ● వైద్యవిద్యా శాఖ ద్వారా కనకపురలో కొత్త మెడికల్ కాలేజీ స్థాపన. రూ.550 కోట్లతో 300 పడకల బోధనా ఆసుపత్రి, హాస్టళ్ల నిర్మాణం. ● రాష్ట్రంలో కట్టడ కార్మికుల పిల్లలకు 11 హాస్టళ్లు ● రాష్ట్ర సివిల్ సేవల ఉద్యోగాల నియామకాలకు వయో పరిమితి 3 సంవత్సరాలు పెంపు. దీంతో నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది ● బెంగళూరు ఉత్తర తాలూకా మాచోహళ్ళిలో 78 ఎకరాల అటవీ భూమిని వివిధ సంస్థలకు కేటాయించడాన్ని రద్దు చేశారు ● పోలీసుశాఖకు రూ.89.22 కోట్లతో పరికరాల కొనుగోలు, శిక్షణ వసతులు ● రూ.200 కోట్లతో వంతెనలకు మరమ్మతులు. అలాగే రూ.1000 కోట్లతో 39 వంతెనల నిర్మాణానికి అనుమతి. నెలలో ఓరోజు వేతన సెలవు కేబినెట్ భేటీలో ఆమోదం -
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, 12 సెలవులు
కర్ణాటక ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతి నెలా ఒక రోజు, అంటే సంవత్సరానికి 12 రోజుల వేతనంతో కూడిన పీరియడ్స్ లీవ్ (ఋతుస్రావ సెలవు) Policy-2025ను ఆమోదించింది. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని మహిళా ఉద్యోగులకు వర్తిస్తుందని రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు తెలిపింది. మహిళల శ్రేయస్సును మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వస్త్ర పరిశ్రమలు, బహుళజాతి కంపెనీలు, ఐటీ సంస్థలు మరియు ఇతర ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేసే శ్రామిక మహిళా ఉద్యోగులకు నెలకు ఒక వేతనంతో కూడిన రుతు సెలవును పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇది శ్రామిక మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర న్యాయ మంత్రి హెచ్కె పాటిల్ తెలిపారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన నేపథ్యంలో తాము కూడా దీనిని స్వీకరించాలని నిర్ణయించుకున్నామని ఆయన క్యాబినెట్ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. దీనిపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం అనధికారిక రంగంలో సవాలే అయినప్పటికీ, విస్తృత ఆరోగ్య సాధికారతకు కీలకమైన పునాది వేస్తుందనీ, మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుంది, రాష్ట్ర సమగ్ర వృద్ధిని ప్రోత్సహిందంటూ సంతోషం వ్యక్తం చేశారు మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగే.మహిళల నిజమైన ఆరోగ్య అవసరాలను గుర్తించడంలో ప్రశంసనీయమైన అడుగు అని కొనియాడారు.Our Government stands committed to dignity and wellbeing at work.Through the Menstrual Leave Policy 2025, women employees across Karnataka will now receive one paid leave day every month - a step towards a more humane, understanding, and inclusive workplace.#MenstrualLeave… pic.twitter.com/HmxCHutJv0— Siddaramaiah (@siddaramaiah) October 9, 2025 తాజా నిర్ణయంతో పీరియడ్ అమలు అమలు చేసిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక చేరింది. వేతనంతో కూడిన రుతు సెలవులను అమలు చేసిన ఇతర రాష్ట్రాలలో బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం ఉన్నాయి. విధానం ఉన్నా లేకపోయినా, ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థ దీనిని అమలు చేయవచ్చు. జీతంతో కూడిన రుతు సెలవులను ప్రకటించిన వాటిలో జొమాటో, స్విగ్గీ, లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి), బైజూస్ మరియు గోజూప్ ఉన్నాయి.ఇదీ చదవండి: హ్యాపీగా ఏసీ కోచ్లో తిష్ట, చూశారా ఈవిడ డబల్ యాక్షన్! -
సీజేఐపై దాడి ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సీజేఐపైకి షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్(71)ను బహిష్కరిస్తూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆయన భవిష్యత్తులో కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.అక్టోబర్ 6వ తేదీన సుప్రీం కోర్టులో జరిగిన షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కోర్టు నెంబర్ 1 హాల్లో.. కేసుల మెన్షనింగ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన కాలి బూటు తీసి సీజేఐ వైపు విసిరాడు(Attack on BR Gavai). అయితే అది బెంచ్ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. తోటి లాయర్లు ఆ వ్యక్తిని నిలువరించి.. కోర్టు సిబ్బందికి అప్పగించారు. అయితే.. ఇలాంటి చర్యలు తనని ప్రభావితం చేయలేవన్న జస్టిస్ గవాయ్.. కోర్టు కలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.దాడి సమయంలో సదరు లాయర్ ‘‘సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం’’ అంటూ నినాదాలు చేశాడు. సీజేఐ సూచనతో అతనిపై పోలీసులకు సుప్రీం కోరటు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని మూడు గంటలపాటు విచారించి షూతో పాటు అతని పేపర్లు ఇచ్చి వదిలేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్ కిషోర్గా నిర్ధారించారు. అయితే.. దాడికి ప్రయత్నించినందుకుగానూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాకేష్ కిషోర్(Rakesh kishore)పై చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కోర్టు, ట్రిబ్యునల్, అధికార సంస్థల్లో ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. జరిగిన ఘటనపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే.. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా..దాడిని సమర్థించుకున్న రాకేష్ కిషోర్.. అదంతా దైవ నిర్ణయమని అంటున్నారు. అంతేకాదు.. తన నుంచి కనీస వివరణ తీసుకోకుండానే సస్పెండ్ చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పు బడుతూ పలు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు. మరోవైపు..సస్పెండెడ్ లాయర్ రాకేష్ కిషోర్పై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. సీజేఐపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ.. ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల ఫిర్యాదు చేశారు. దీంతో విధానసౌధ పీఎస్లో బుధవారం కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. ఢిల్లీకి కేసు బదిలీ కానుంది. నోట్: ఆ బూటు విసిరింది నేను కాదు కథనంలో లాయర్ పేరును రాజేష్ కిషోర్గా పేర్కొన్నాం. ఎన్డీటీవీ కథనం తప్పుగా పేర్కొనడంతో అలా ఇవ్వాల్సి వచ్చింది. ఆ లాయర్ అసలు పేరు రాకేష్ కిషోర్ అని గమనించగలరు.ఇదీ చదవండి: షూ దాడి: ఇంతకీ చీఫ్ జస్టిస్ గవాయ్ ఏం వ్యాఖ్యలు చేశారంటే.. -
కాలువలోకి పెళ్లి బస్సు పల్టీ
ప్రమాదానికి గురైన బస్సు కాలువలో పడిన బస్సును వెలికి తీస్తున్న దృశ్యంకోలారు: వివాహ రిసెప్షన్కు వచ్చి తిరిగి వెళ్తుండగా బస్సు నీటి కాలువలోకి బోల్తా పడి 30 మందికి పైగా గాయపడిన ఘటన కోలారు – చింతామణి రోడ్డులోని సుగటూరు వద్ద మంగళవారం రాత్రి 10 గంటలకు జరిగింది. వివరాలు.. చిక్కబళ్లాపురం జిల్లా శిడ్లఘట్ట తాలూకా దిబ్బూర హళ్లి కి చెందిన వధువు పెళ్లి బృందం వారు 3 బస్సులలో కోలారు నగర సమీపంలోని రత్న కన్వెన్షన్ హాల్లో రిసెప్షన్కు వచ్చారు. రాత్రి భోజనాలు చేసుకుని తిరుగుముఖం పట్టారు. సుగటూరు గ్రామం వద్దకు చేరుకోగానే ఓ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కేసీ వ్యాలీ ఉప కాలువలోకి జారింది. బాధితులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో 15 మంది మహిళలతో పాటు 30 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో 5 మంది కి తీవ్ర గాయాలు కాగా వారిని కోలారులోని ఆర్ ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలు తగిలాయి. కోలారు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం క్రేన్ సహాయంతో బస్సును కాలువ నుంచి బయటకు లాగారు. 30 మందికి గాయాలు కోలారు వద్ద దుర్ఘటన -
రాజధానిలో మళ్లీ జడివాన
యశవంతపుర: కొన్నిరోజుల విరామం తరువాత ఉద్యాన నగరంలో బుధవారం మధ్యాహ్నం జోరుగా వర్షం కురిసింది. యలహంకతో పాటు మల్లేశ్వరం, శేషాద్రిపురం, మెజిస్టిక్ తదితర ప్రాంతాలలో జడివాన రావడంతో జనం తడవకుండా పరుగులు తీశారు. గుంతల రోడ్లపై నీళ్లు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడ్డారు. యలహంకలో జలావృతం అయ్యాయి. కాఫీ డే వద్ద ఎక్కువగా వాన నీరు నిలవడంతో వాహనాలను మరో మార్గంలోకి మళ్లించారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు చిక్కుకున్నాయి. యలహంక రైల్వేఅండర్ పాస్ వద్ద మూడు అడుగుల ఎత్తు నీరు నిలిచిపోవడంతో బెంగళూరు సిటీలోకి వాహనాలు రాలేకపోయాయి. వీరసంద్ర జంక్షన్ వద్ద నీళ్లు నిలవడంతో హోసూరుకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. రెండు మూడు రోజుల పాటు బెంగళూరులో వానలు పడవచ్చని వాతావారణశాఖ అధికారులు తెలిపారు. -
బెంగళూరు పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిళ్లు
పోస్టాఫీసులపై గట్టి నిఘా: కమిషనర్ బనశంకరి: సిలికాన్ సిటీ మత్తు పదార్థాలకు అడ్డా గా మారిందనే ఆందోళనకు ఊతమిచ్చేలా తరచూ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. పోస్టులు, పార్శిల్స్ను ప్రజలకు అందించే విదేశీ పోస్టాఫీసులను పెడ్లర్లు వాడుకుంటున్నారు. ఇటీవల సుమారు రూ.20 కోట్ల డ్రగ్స్ను పట్టుకుని పలువురిని అరెస్టు చేసిన నగర పోలీసులు బుధవారం మరో 6 మందిని నిర్బంధించి రూ. రూ.23.84 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫ్రికన్లు ఉన్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. సీసీబీ, ఉత్తర, తూర్పు, దక్షిణ విభాగం పోలీసులు గాలింపు జరిపి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. 7.17 కేజీల హైడ్రోగంజాయి, 1.39 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్, 2.3 కిలోల హఫీమ్ ఇందులో ఉన్నాయి. మరికొన్ని మత్తు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దొడ్డబళ్లాపురవాసి నాగదేనహళ్లి సురేశ్, మనోజ్, అత్తిబెలె అఖిల్ సంతోష్, కనకపుర సోమశేఖర్, కళ్యాణనగర దిలీప్కుమార్ సాహు, సూడాన్వాసి లాడూరామ్ తదితర ఆరుమంది పట్టుబడ్డారు. విదేశీ మహిళ వద్ద.. పరప్పన అగ్రహారలో రాజస్థాన్ కు చెందిన డ్రగ్స్పెడ్లర్ ను అరెస్ట్ చేసి విచారించగా, జల్సాల కోసం డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపాడు. ఇతని నుంచి రూ.4 కోట్ల విలువచేసే 1కిలోకు పైగా ఎండీఎంఏ క్రిస్టల్, 2 కిలోలకు పైగా హఫీంను సీజ్ చేశారు. కొత్తనూరు పోలీసులు ఎన్జీ.గొల్లహళ్లిలో ఓ అపార్టుమెంట్లో విదేశీ మహిళను అరెస్టు చేసి రూ.12.03 కోట్ల విలువైన 4 కిలోల 815 గ్రాముల ఎండీఎంఏ క్రిస్టల్ ను వశపరచుకున్నారు. పోస్టాఫీసులో జాగిలాలతో తనిఖీ.. విదేశాల నుంచి డ్రగ్స్ తో కూడిన అనుమానాస్పద పార్శిల్స్ కేజీ.నగర పోలీస్స్టేషన్ పరిధిలో విదేశీ తపాలా కార్యాలయానికి వస్తున్నట్లు గుర్తించారు. జాగిలాలతో పార్శిల్స్ను తనిఖీలు చేయగా రూ.3.81 కోట్ల విలువచేసే 3 కిలోల హైడ్రో గంజాయి, ఇతర డ్రగ్స్ పార్శిల్స్ను గుర్తించాయి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు థాయ్లాండ్, జర్మనీ దేశాల నుంచి నకిలీ పేర్లతో క్రిప్టోకరెన్సీ ద్వారా హైడ్రోగంజాయిని పార్శిల్ తెప్పించారని తేలింది. పెడ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న వివిధ మాదకద్రవ్యాలు నిందితుల నుంచి పట్టుకున్న మత్తు పదార్థాలు వాటిపై నిరంతరం కన్నేస్తాం పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ మరో 6 మంది డ్రగ్పెడ్లర్ల అరెస్టు రూ.23 కోట్లకు పైగా డ్రగ్స్ స్వాధీనంబెంగళూరులో ఫారిన్ పోస్టాఫీసులకు డ్రగ్స్ పార్శిల్స్ రావడాన్ని తీవ్రంగా పరిగణించామని పోలీసు కమిషనర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ తపాలా ఆఫీసు అధికారులు సిబ్బంది డ్రగ్స్ ముఠాలతో కుమ్మక్కయ్యారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కెంపేగౌడ నగర పోలీస్స్టేషన్ పరిధిలో విదేశీ తపాలా ఆఫీసుకు కూడా తరచూ విదేశాల డ్రగ్స్ పార్శిల్ వస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని విలేకరులు ఆయనను ప్రశ్నించారు. ఇప్పటికే పోస్టల్ అధికారులతో డీసీపీ ఒకసారి చర్చించారని తెలిపారు. తపాలాఫీసులకు వచ్చే పార్శిల్స్ పై నిఘాపెడతామన్నారు. డ్రగ్స్ కట్టడిలో తమకు కేంద్ర సంస్థలు, బయటి రాష్ట్రాల పోలీసులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. బెంగళూరులో డ్రగ్స్ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ప్రైవేటు ఉద్యోగికి రూ.67 లక్షల బురిడీ
బనశంకరి: బెంగళూరులో మరో భారీ సైబర్ మోసం బయటపడింది. పార్ట్టైమ్ ఉద్యోగం పేరుతో ప్రైవేటు ఉద్యోగికి సైబర్ కేటుగాళ్లు రూ.67 లక్షలు టోకరా వేశారు. బెంగళూరుకి చెందిన సతీశ్ బాధితుడు, ఇతడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 11న అతని మొబైల్ఫోన్లోని టెలిగ్రామ్ యాప్కు ఓ మెసేజ్ వచ్చింది, దానిపై క్లిక్ చేయగా అమెజాన్ ఇండియా పార్ట్టైమ్ బెనిఫిట్ జాబ్ అనే గ్రూప్లో చేరిపోయాడు. అమెజాన్ ఉత్పత్తులకు రేటింగ్, లైక్స్ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని అందులో విపరీతంగా మెసేజ్లు రావడం మొదలైంది. ఇంటి దగ్గరే పార్ట్టైంగా డబ్బులు సంపాదింవచ్చని కొందరు ఆ గ్రూప్లో ప్రచారం చేయసాగారు. దీంతో సతీశ్ మొదట రూ.1000 పెట్టుబడి పెట్టగా రూ.1,650 తిరిగి వచ్చింది. దీంతో బోల్తా పడిన సతీశ్ అనేకసార్లు పెట్టుబడిపెట్టాడు. కాలక్రమేణా పెద్ద మొత్తంలో నగదు పెట్టుబడిపెడితే భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. ఇలా 7 నెలల వ్యవధిలో రూ.67,63,950 ని తన బ్యాంకు ఖాతాల నుంచి మోసగాళ్ల ఖాతాలకు పంపించాడు. ఆపై ఎలాంటి ఆదాయం రాకపోవడంతో పాటు దుండగులు అతని నంబరుని బ్లాక్ చేశారు. మోసపోయిన సతీశ్.. స్థానిక సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.బీరువాలో రూ.10 లక్షలు మాయం మైసూరు: వంట కాంట్రాక్టరు గిడ్డంగిలో రూ.10 లక్షల నగదు మాయమైంది. వివరాలు... శ్రీరంగపట్టణకు చెందిన వంట కాంట్రాక్టర్ రమేష్కు మైసూరులోని కువెంపునగర ఎం బ్లాక్లోని గోదాము ఉంది. అందులోని బీరువాలో తన ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల నగదును భద్రపరిచి తాళాలను టేబుల్ డ్రాలో ఉంచుకున్నాడు. మంగళవారం బీరువాను చూడగా ఖాళీగా ఉంది. తాళాలు తీసుకుని నగదును చోరీ చేశారంటూ సిబ్బంది గణేష్, సోమణ్ణ, గిరీష్, స్వామి, లక్ష్మమ్మ, మహేష్, ప్రజ్వల్లపై కువెంపునగర పోలీసు స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. తల్లయిన చిన్నారి బాలిక ● నిందితుడు అరెస్టు తుమకూరు: చదువుకునే బాలిక శిశువుకు జన్మనిచ్చిన ఘటన జిల్లాలోని కుణిగల్ తాలూకాలో జరిగింది. బాలిక ఆరోగ్యం సరిగ్గా లేదని తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె 8 నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికను నిలదీయడంతో జరిగిన మొత్తం విషయం చెప్పింది. తక్షణమే బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. మరోవైపు ఆమె గర్భానికి కారణమైన నిందితుడు వినయ్ (21)ని పోలీసులు అరెస్టు చేశారు. సదరు బాలిక, యువకుడు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటారు. ప్రేమపేరుతో లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడని బాలిక తల్లి కుణిగల్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.గంగమ్మకు అపచారం చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని శ్రీనివాససాగర జలాశయం వద్ద గంగమ్మ తల్లి విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. మూడు రోజుల కిందట జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జలాశయం గోడ మీద నుంచి జలాలు జాలువారుతూ ఉంటాయి. అక్కడ కింద గంగమ్మ విగ్రహం ఉంది. కొందరు మహిళలు, బాలికలు అక్కడ నీటిలో ఆడుకుంటూ అమ్మవారి విగ్రహం మీద కాళ్లు పెట్టి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ ఫోటోల ద్వారా విషయం బయటపడింది. హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దుర్గా మాతకు హోమం
కోలారు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన పురాతన శ్రీ దుర్గాదేవి దేవాలయం, సప్త మాతృకల ఆలయంలో బుధవారం అపార భక్త సమూహం మధ్యన దీపోత్సవం వేడుకను నిర్వహించారు. ఏటా మాదిరిగా కోడిహళ్లి గ్రామస్తులు, అర్చకులు వేణుగోపాల్ రావ్ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అభిషేకం గావించి, పూలతో సుందరంగా అలంకరణ చేశారు. దేవాలయం ముందు హోమం, హవనం, వేదమంత్ర పారాయణం తదితర పూజలు జరిగాయి. మహిళలు దేవికి హారతి తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి సమర్పించారు. వేధింపులతో ఆర్ఐ అదృశ్యంశివాజీనగర: ఉత్తర కన్నడ జిల్లా కుమటా పురసభ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్ లేఖ రాసి మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. కుమటా పురసభ ప్రధానాధికారి ఎం.ఆర్.స్వామి, ఎమ్మెల్యే దినకర్ శెట్టి వేధింపులే కారణమని లేఖలో ఆరోపించారు. భట్కళకు చెందిన వెంకటేశ్ ఆర్. ఇంట్లోనే లెటర్ రాసి, ఆ లేఖను అర్ధరాత్రి పురసభ సిబ్బంది వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. బీ ఖాతా స్థలాన్ని అక్రమంగా ఏ ఖాతాకు మార్చాలని ఒత్తిడి చేస్తున్నారని, రూ.4 లక్షలు ఇవ్వాలని వెంకటేశ్ను ప్రధానాధికారి పీడిస్తుండేవారని, అసభ్యకరంగా దూషించేవాడని లేఖలో రాశారు. అక్రమంగా ఖాతా మార్పు చేయలేనని బాధితుడు స్పష్టంచేశాడు. ఎమ్మెల్యే దినకర శెట్టి ఒత్తిడి చేస్తున్నారని ప్రధానాధికారి అతనిని సతాయించసాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భట్కళ పోలీసులు వెంకటేశ్ కోసం గాలింపు చేపట్టారు. ప్రధానాధికారిని సస్పెండ్ చేయాలని పురసభ సిబ్బంది డిమాండ్ చేశారు. గ్యాస్ లీక్.. మంటల్లో వలస కూలీలు దొడ్డబళ్లాపురం: భవన నిర్మాణ కూలీలు నివసిస్తున్న తాత్కాలిక షెడ్లో వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి 7 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రామనగర తాలూకా బీమేనహళ్లిలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అసన్ మల్లిక్, జాయిద్ అలీ, కబ్జుల్ షేక్, శఫీజుల్, జియాబుర్, నూర్ జమాల్, సన్రూల్ గాయపడిన కూలీలు. వీరంతా కూలి పని కోసం బిడదికి వచ్చారు. బీమేనహళ్లి వద్ద విల్లాల నిర్మాణ పనులు చేస్తూ తాత్కాలిక షెడ్లో నివసించేవారు. మంగళవారం రాత్రి షెడ్లో వంట చేసుకున్న కూలీలు భోజనం చేసి నిద్రపోయారు. అయితే సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడం గమనించలేకపోయారు. తెల్లవారుజామున ఒక కూలీ బీడీ తాగడానికి అగ్గిపుల్ల గీయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పడుకున్న 7 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసి క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బిడది పోలీసులు ఘటనాస్థలంలో తనిఖీలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డులో సంచార మార్పులుబనశంకరి: సిలికాన్ సిటీలో ఔటర్ రింగ్రోడ్డు 9 వ మెయిన్ జంక్షన్ నుంచి 5వ మెయిన్ వరకు సర్వీస్ రోడ్డులో మెట్రో స్టేషన్ పనులు జరుగుతాయి, దీంతో రానున్న 45 రోజుల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ మార్గంలో సంచరించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో సంచరించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెచ్ఎస్ఆర్ లేఔట్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సరిహద్దులోని ఔటర్ రింగ్రోడ్డు 9 వ మెయిన్జంక్షన్ నుంచి 5 వ మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు స ర్వీస్ రోడ్డులో మెట్రోపనులు చేపడుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు ఇబ్బలూరు వైపు నుంచి వచ్చి సిల్క్బోర్డు జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు 14 వ మెయిన్ రోడ్డు ఫ్లై ఓవర్ ద్వారా మెయిన్ రోడ్డులో 5వ మెయిన్ జంక్షన్ ద్వారా, లేదా హెచ్ఎస్ఆర్ లేఔట్ లోపలి రోడ్ల మీదుగా సిల్క్బోర్డు , హోసూరు మెయిన్ రోడ్డులో సంచరించాలని తెలిపారు. -
మైసూరు హత్య కేసులో అరెస్టులు
మైసూరు: నగరంలోని దొడ్డకెరె మైదానం వద్ద మంగళవారం పట్టపగలే వెంకటేష్ అనే వ్యక్తిని కొడవళ్లతో నరికి చంపిన ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అలియాస్ బిగ్ షో, మల్లికార్జున అలియాస్ హాలప్ప, మరో ముగ్గురిని నిర్బంధించారు. ఇటీవల జరిగిన కార్తీక్ అనే వ్యక్తి హత్య తర్వాత జరిగిన పరిణామాలు వెంకటేష్ హత్యకు కారణాలుగా తెలుస్తోంది. వెంకటేష్ని అంతమొందిస్తున్న ఫోటోలు, వీడియోలను తీసి కొందరు వైరల్ చేశారు. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను సులభంగా గుర్తించారు. ఉత్సవ వాతావరణంతో ఉన్న మైసూరులో ఈ హత్య భయాందోళన కలిగించింది.నరుకుతున్న దుండగులు -
బిగ్బాస్కు షాక్.. స్టూడియో బంద్
యశవంతపుర: కన్నడ బిగ్బాస్ ప్రదర్శనకు సిద్దరామయ్య సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ స్టూడియోకి బెంగళూరు దక్షిణ జిల్లా అధికారులు బీగం వేసి మూసేశారు. పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి ఇంకా పలు విభాగాల అనుమతులు లేవని తెలిపారు. పోటీదారులను నిర్వాహకులు దగ్గరిలోని ఈగల్టన్ రిసార్టుకు తరలించారు. అయితే పోటీదారులు మొబైల్ఫోన్లను వాడరాదని, టీవీలు చూడరాదని అధికారులు నిర్బంధం విధించడం గమనార్హం. కన్నడంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్ ప్రారంభమైన రెండు వారాలకే అనూహ్యంగా బంద్ చేయడంతో ప్రేక్షకులు ఏమైందోనని ఆదుర్దాకు గురయ్యారు. ఏం జరిగింది? బిడది వద్ద పెద్ద విస్తీర్ణంలో ప్రత్యేక సెట్టింగ్ను వేసి బిగ్బాస్ 12వ సిరీస్ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ పర్యవేక్షకునిగా ఉన్నారు. అధికారులు వెళ్లినప్పుడు నిర్వాహకులతో గొడవ జరిగిందని తెలిసింది. బిడది తహశీల్దార్, పోలీసులు హౌస్ని ఖాళీ చేయించి తాళం వేశారని సమాచారం. కాగా, బిగ్బాస్ కోసం 400 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి ఉపాధిని దూరం చేయవద్దని నిర్వాహకులు జిల్లా కలెక్టరును కోరారు. పొరపాట్లను సరిచేసుకోవడానికి కొన్నిరోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జేడీఎస్ విమర్శలు కిచ్చ సుదీప్ నిర్వహిస్తున్న బిగ్బాస్ స్టూడియో మూసివేత వెనుక నట్లు, బోల్టుల మినిస్టర్ ఉన్నాడంటూ డీసీఎం డీకే శివకుమార్పై జేడీఎస్ నాయకులు మండిపడ్డారు. కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి కూడా ఇదేమాదిరి విమర్శలు చేశారు. హైకోర్టులో కేసు షోను బంద్చేయడంపై నిర్వాహకులు బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో కేసు వేసి త్వరగా విచారించాలని విన్నవించారు. విచారణను నిర్వహించి జడ్జి గురువారానికి వాయిదా వేశారు. నిబంధనలను ఉల్లంఘించారని అధికారుల చర్యలు సర్కారుపై ప్రతిపక్షాల విమర్శలు -
సరికొత్తగా ఇబ్బలూరు జంక్షన్
కృష్ణరాజపురం: నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో ఎప్పుడు బిజీగా ఉండే సిలికాన్ సిటీలోని ఇబ్బలూరు జంక్షన్ రూపురేఖలే మారిపోయాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీటితో విసుగు తెప్పించే ఈ ప్రదేశం కొత్తగా సింగారించుకుంది. ఎంతో శుభ్రంగా, రంగులమయంగా మారడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మహదేవపుర టాస్క్ఫోర్స్, పాలికె, ఇంకా వివిధ సంస్థల సభ్యులు కలిసి ఈ పనికి నడుంబిగించారు. బుధవారం ఈ జంక్షన్లో ఉన్న చెత్తను తొలగించి, పిల్లర్లకు రంగులు వేశారు. యువతులు, మహిళలు ముగ్గులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్థానిక మాజీ మంత్రి అరవింద లింబావళి మాట్లాడుతూ మన మహదేవపురను స్వచ్ఛంగా, సుందరంగా, హరితవనంగా మార్చేందుకు అందరూ కలిసి నడవాలనని విజ్ఞప్తి చేశారు. చెత్తను తొలగించి సుందరీకరణ -
భార్య శవాన్ని పరుపు కింద దాచి, ఆపై..
ఆ జంటకు పెళ్లై.. నాలుగు నెలలే అయ్యింది. బంధువులకు, చుట్టుపక్కల వాళ్లకు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వచ్చింది. అయితే హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆమె మృతదేహంగా మంచం కింద కనిపించింది. భర్త జాడ లేకుండా పోయాడు. అతని తల్లే ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది.కర్ణాటక బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ యువతి కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు(Belagavi Husband Kills Wife). ఈ జంటకు ఈ ఏడాది మే నెలలోనే వివాహం జరిగింది.పని మీద సొంత గ్రామానికి వెళ్లిన ఆకాశ్ తల్లికి బుధవారం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో దుర్వాసన రావడంతో అంతా వెతికి చూడగా.. పరుపు కింద కోడలు విగత జీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు అయ్యింది. మరోవైపు ఆకాశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో.. సాక్షిని చంపి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆకాశ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టారు.ఇదిలా ఉంటే.. పెళ్లైన కొన్నాళ్లకే తమ బిడ్డను ఆకాశ్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని సాక్షి కుటుంబం ఆరోపిస్తోంది(Dowry Harassment). అయితే ఆకాశ్ తల్లి ఆ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ఈ మధ్యే ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లాలో ఓ గర్భవతిని ఆమె భర్త, అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం చితక్కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) ప్రకారం.. వరకట్న వేధింపుల ఘటనలు, ఆ వేధింపుల కారణంగా మరణిస్తున్న కేసులూ దేశంలో అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ జాబితాలో యూపీ, బీహార్ తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. ఇదీ చదవండి: సీనియర్లు వేధించారనే ఐపీఎస్ సూసైడ్! -
సుప్రీంకోర్టు జడ్జిపై దాడి తగదు
రాయచూరు రూరల్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణపై దాడి చేయడం తగదని జిల్లా న్యాయవాదుల సంఘం పేర్కొంది. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రాకేష్ను కఠినంగా శిక్షించాలన్నారు. న్యాయవాదులు కోర్టు కలాపాలను బ హి ష్కరించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమాన పరిచిన రాకేష్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మప్ప, నజీర్, శ్రీకాంత్, శివశంకర్, జగదీష్, అంబాపతి, నాగరాజ్, పాండురంగ నాయక్, రామనగౌడ, వీరభద్రప్ప, ప్రభాకర్, మున్నాలున్నారు. దాడి అమానుషం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం అమానుషమని దళిత పర సంఘాలు బలంగా ఖండించాయి. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు రవీంద్రనాథ్ పట్టి మాట్లాడారు. సుప్రీం కోర్టు దేశానికి సర్వోన్నత న్యాయస్థానంగా పేరొందిందన్నారు. అలాంటి కోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రాకేష్ను కఠి నంగా శిక్షించాలన్నారు. నిందితుడు రాకేష్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమారు అర గంట సేపు అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో విరుపాక్షి, విజయరాణి, నరసింహులు, శ్రీనివాస్లున్నారు. జడ్జిపై దాడిని ఖండిస్తూ నిరసన బళ్లారి రూరల్ : సుప్రీంకోర్టులో విధులు నిర్వహిస్తున్న ముఖ్య న్యాయమూర్తి బీ.ఆర్.గవాయిపై ఈ నెల 6న న్యాయవాది రాకేశ్ కిశోర్ బూటు విసరటానికి ప్రయత్నించిన ఘటనను ఖండిస్తూ నిరసనగా బుధవారం నగరంలో దళిత సంఘాలు ర్యాలీని నిర్వహించి జిల్లా యంత్రాంగం ద్వారా భారత ప్రధాని, రాష్ట్రపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. పెద్ద సంఖ్యలో దళితులు ప్రధాన నగర వీధుల్లో ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో జిల్లా బీ.ఆర్.అంబేడ్కర్ సంఘం, డీఎస్ఎస్(దళిత సంఘర్షణ సమితి) ప్రముఖులు ఏ.మానయ్య, కే.దేవదాస్, హెచ్.బీ.గంగప్ప, బీ.కే.అనంతకుమార్, బీ.ఏ.మల్లేశ్వరి, హులిగప్ప, కే.గాదిలింగ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్చెల్సీలో దూకి వ్యక్తి ఆత్మహత్య
బొమ్మనహాళ్: బళ్లారి సమీపంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని హొసపేటె పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో హెచ్చెల్సీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలువలోకి దూకిన ఆ వ్యక్తి బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ సమీపంలోని హెచ్చెల్సీ డిస్ట్రిబ్యూటరీలో శవమై కనిపించాడు. బొమ్మనహాళ్, హొసపేటె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు కర్ణాటకలోని హొసపేటె టౌన్కు చెందిన జమీర్ ఉల్లా షరీఫ్(43)గా గుర్తించారు. ఇతను ఆర్ధిక ఇబ్బందులతో మానసిక వేదనకు గురై తాను కాలువలోకి దూకి చనిపోతున్నాను, హొసపేటె పోలీసులకు సమాచారం ఇవ్వండి అని మంగళవారం బళ్లారి సమీపంలోని అల్లీపుర వద్ద సెల్ఫీ వీడియో తీసి కాలువలోకి దూకే ముందు ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. బుధవారం అతని శవం డిస్ట్రిబ్యూటరీ కాలువలో కనిపించడంతో స్ధానికులు బొమ్మనహాళ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు పరిశీలించి హొసపేటె పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం బళ్లారి విమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హొసపేటె పోలీసులు తెలిపారు. -
సంచార వాహిని
హుబ్లీ: శ్రమించే కార్మికులు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ ట్రాఫిక్ హెల్త్ యూనిట్ అంటే మొబైల్ మెడికల్ యూనిట్ పథకాన్ని ఇప్పటికే అమలు చేసింది. సదరు కార్మికులు పని చేసే చోట్లకు వాహనం అక్కడికే వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేసి అవసరమైన ఔషధాలు అందించి వారి ఆరోగ్యం బాగు కోసం సదరు వాహనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. కాగా వీటిని దావణగెరె జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తూ మూడు మొబైల్ మెడికల్ యూనిట్లను తాజాగా ఏర్పాటు చేశారు. కార్మికులు ఆరోగ్య సమస్య తలెత్తగానే వారు ఉన్న చోటుకే వైద్యులతో కూడా ఈ యూనిట్ వెళ్లి ఉచిత చికిత్స, ఉచిత ఔషధాలు ఇస్తున్న కార్మికుల కార్డులు పొందిన ప్రతి కార్మికుడికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ సంచార ఆస్పత్రిని తగిన వసతులతో చక్కగా ఆరోగ్య పరీక్షలు చేయడానికి అనువుగా తీర్చిదిద్దారు. మున్ముందు అన్ని తాలూకాలకు సేవల విస్తరణ ఈ మేరకు ఇలాంటి మూడు అత్యాధునిక మొబైల్ ఆరోగ్య యూనిట్లను దావణగెరె తాలూకా హరిహర, చెన్నగిరి తాలూకాలకు కేటాయించామని మున్ముందు అన్ని తాలూకాలకు ఈ పథకాన్ని విస్తరిస్తామని తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపని సంబంధిత కార్మికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 100 మొబైల్ ఆస్పత్రుల వాహనాలకు శ్రీకారం చుట్టి పేద కార్మికులకు ఆరోగ్య భాగ్యాన్ని కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రతి కార్మికుడు పొందేలా వారికి అవగాహన కల్పిస్తామని కార్మిక శాఖ అధికారులు తెలిపారు. గత ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ పథకంలో ఇప్పటి వరకు దావణగెరె జిల్లాలో 5 వేల మంది కార్మికులు లబ్ధి పొందారు. ప్రతి నెల 1200 మంది కార్మికులకు చికిత్స అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంచార ఆస్పత్రి వల్ల ఆస్పత్రుల కొరత తీరడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి పని చేసే చోట వివిధ కారణాలతో సహజంగా లేక ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడిన కార్మికుల పాలిట ఈ మొబైల్ ఆస్పత్రి అవసరం ఎంతో ఉందని కార్మికులు అభిప్రాయ పడ్డారు. -
బైపాస్లో అండర్ పాస్ కోసం ఆందోళన
బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు వద్ద గల దొడ్డబసవేశ్వర లేఅవుట్ వెనుక భాగంలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో స్థానికంగా ఉన్న 40 అడుగుల వెడల్పు రోడ్డులో అండర్ పాస్ నిర్మించాలని స్థానిక శివసాయి టౌన్ షిప్ నివాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం స్థానికంగా పనులు జరుగుతున్నందున వాహనాన్ని అడ్డుకొని మహిళలు, పురుషులు నిరసన వ్యక్తం చేశారు. బైపాస్కు అండర్ పాస్ ఇవ్వక పోతే తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని, దాదాపు ఈ ప్రాంతంలో వందలాది ఇళ్ల నిర్మాణాలు జరిగాయని, పిల్లలు, ఉద్యోగులు బయటకు వెళ్లాలంటే ఇటు సంగనకల్లు రోడ్డు కాని, అటు కప్పగల్ రోడ్డు కాని చుట్టు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఇక విద్యార్థులకు స్కూలు బస్సులు తమ కాలనీ వరకు వచ్చేవని, ఈ రోడ్డు నిర్మాణం వల్ల అటు వైపునే స్కూల్ బస్సులు నిలిపితే తమ పిల్లలు వెళ్లేది ఎలా? అని ప్రశ్నించారు. దీనిపై తాము ఇప్పటికే ఎంహెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్కు, వివిధ స్థాయిల అధికారులకు కూడా వినతిపత్రాలను సమర్పించామని తెలిపారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్థానికులు మల్లప్ప, మోహన్రెడ్డి, బసవరాజు, లక్ష్మిరెడ్డి తదితరులు తెలిపారు. -
ఏడీ కార్యాలయం.. సేవలు దూరం
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా భూ దాఖలాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) కార్యాలయంలో కుర్చీలు ఎల్లవేళలా ఖాళీగా ఉంటాయి. అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు డుమ్మా కొడుతూ సాయంత్రం వేళ హాజరు కావడంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులు తాలూకా భూ దాఖలాల కార్యాలయాలకు వచ్చి చేరేలోగా అధికారులు, ఉద్యోగులు కుర్చీలు ఖాళీ చేసి బయటకు వెళ్లిపోతారు. వందలాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. భూములను కొలిచేందుకు, రికార్డులను సరి చూడడానికి, సర్వే చేయడానికి అధికారులు, ఉద్యోగులు రైతులను వేధించడాన్ని తప్పుబడుతున్నారు. ఉదయం నుంచి విధులకు రాకుండా సాయంత్రం 6 గంటలకు కార్యాలయాలకు హాజరు అవుతున్నారు. రైతులు సాయంత్రం 5 గంటల తర్వాత గ్రామాల వైపు పయనించడంతో కార్యాలయంలో అధికారులు, ఉద్యోగులు తమ ఇతర పనులు వైపు దృష్టి సారిస్తున్నారు. ఒక్కొక్క రైతు రూ.30 వేలు–రూ.40 వేలు ఖర్చు పెట్టుకున్నా కాగితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంటాయి. దేవదుర్గ తాలూకాలో దాదాపు 75 వేలకు పైగా భూములు సర్వే చేయడానికి రైతులు దరఖాస్తు చేసుకున్నా నేటికీ సర్వేకు అధికారులు, సర్వేయర్లకు ఆదేశాలు జారీ చేయక పోవడం విడ్డూరంగా ఉంది. భూముల విక్రయాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికార్డులను సవరించడంలో అధికారులు విఫలమయ్యారని తళవారదొడ్డి రైతు నింగప్ప ఆరోపించారు. అనాథగా దేవదుర్గ భూ దాఖలాల శాఖ అన్నదాతలకు సర్వే పనులు కాని వైనం -
రెండో శ్రీశైలం.. మల్లికార్జున ఆలయం
రాయచూరు రూరల్: భారతీయ సంస్కృతికి ఆనవాలుగా ఉన్న క్షేత్రాల్లో దక్షిణ భారత ప్రాంతంలో శ్రీశైలం మహా పుణ్య క్షేత్రంగా వెలసింది. అదే కోవకు చెందిన పురాతన ఆలయం రాయచూరు జిల్లాలో వెలసింది. జిల్లా కేంద్రమైన రాయచూరుకు ఐదు కి.మీ.దూరంలో ఉన్న బోళమానుదొడ్డి గ్రామంలో మల్లికార్జున భ్రమరాంబిక దేవి ఆలయం ఉంది. విజయ నగర రాజుల పాలన కాలంలో దేవాలయం నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. శ్రీశైలంలో మాదిరిగా మల్లికార్జున విగ్రహం, గణపతి దేవుడు, భ్రమరాంబిక విగ్రహం, అక్క మహాదేవి విగ్రహాలు చూడముచ్చటగా ఉన్నాయి. నగర ప్రజలకు ఇలాంటి ఆలయం ఒకటి ఉన్నట్లు కూడా తెలియదు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు మౌన వ్రతం పాటించేందుకు పాతబడిన ఆలయంలో వెళ్లి పరిశీలించగా వాస్తవాలు బయట పడ్డాయి. నాటి నుంచి భక్తుల సంఖ్య అధికమైంది. ఈ విషయంలో గ్రీన్ రాయచూరు సంచాలకుడు రాజేంద్ర కుమార్ శివాళే శ్రద్ధ కనబరిచి దేవాలయం అభివృద్ధికి చొరవ చూపారు. శ్రీశైలం వెళ్లలేని వారికి బోళమానుదొడ్డి మల్లికార్జున భ్రమరాంబిక దేవాలయాన్ని దర్శించుకోడానికి అవకాశం కల్పించారు. బోళమానుదొడ్డి గ్రామంలో వెలసిన వైనం విజయనగర రాజులు నిర్మించినట్లు ప్రతీతి -
పెద్దలను గౌరవించాలి
రాయచూరు రూరల్: కుటుంబంలోని పెద్దలను గౌరవించడం మన సంప్రదాయమని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అన్నారు. బుధవారం కన్నడ భవనంలో జరిగిన ప్రపంచ పెద్దల దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేడు ఒత్తిళ్ల మధ్య ఉరుకులు పరుగుల జీవితంలో సమాజంలో పెద్దలకు గౌరవం లభించడం లేదన్నారు. తల్లిదండ్రులను గౌరవించలేని పరిస్థితులు దాపురించాయన్నారు. అవిభక్త కుటుంబంలో ఉన్న తేడాలను గురించి వివరించారు. గతంలో వారు పడిన కష్టాలు నేటి పిల్లలు పడరన్నారు. ఏసీ గజానన, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, అధికారులు శరణమ్మ, శ్రీదేవి, పవన్ కుమార్ పాటిల్, మహదేవప్ప, రామణ్ణలున్నారు. పొలాల్లో రాళ్లు వేయడం సరికాదు రాయచూరు రూరల్: పొలంలో రైతుల అనుమతి లేకుండా అధికారులు బండరాళ్లు వేయడం సరికాదని కరవే డిమాండ్ చేసింది. బుధవారం సిరవార తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాఘవేంద్ర ఖాజనగౌడ మాట్లాడారు. జాతీయ రహదారి– 748ఏ భాగంగా రహదారి నిర్మాణానికి అధికారులు భూస్వాధీన ప్రక్రియలో భాగంగా పొలాలకు బండరాళ్లను వేశారని, వాటిని తొలగించి రైతులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ తహసీల్దార్ ద్వారా రాష్ట్ర గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సిద్దలింగేశ్వర, మహ్మద్, హుచ్చప్ప, శశిరాజ్, మల్లయ్య, శివప్ప, ఇస్మాయిల్, నరసప్ప, పంపణ్ణలున్నారు. అవినీతి అధికారులపై వేటు వేయండి రాయచూరు రూరల్: దేవదుర్గ తాలూకాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి మంజూరు చేసిన నిధులను స్వాహా చేసిన నలుగురు అధికారులను సస్పెండ్ చేయాలని ఆర్టీఐ కార్యకర్త అళ్లప్ప డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవదుర్గ తాలూకాలోని జాలహళ్లిలో పదేళ్ల క్రితం ప్రభుత్వ అతిథి భవనాల మరమ్మతుకు ప్రభుత్వం రూ.4.40 లక్షల నిధులను విడుదల చేసిందన్నారు. పనులు చేయకుండా నిధులు నొక్కేశారన్నారు. ఈ విషయంలో సమాచారం అందించాలని పంచాయతీరాజ్, ప్రజాపనుల శాఖ, ఐబీ, రహదారుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ పేరుతో కాలయాపన చేశారని తెలిపారు. దశాబ్దం తర్వాత కమిషన్ విచారణ చేయడానికి పిలిచిందన్నారు. అధికారులు ఉన్నారో లేదో కమిషన్కు ఫిర్యాదు చేసిన వ్యక్తి మరణించాడో తెలుసుకోకుండా విచారణకు పిలవడం గమనార్హమన్నారు. గంజాయి స్వాధీనం హోసూరు: హోసూరు సమీపంలో మంగళవారం రాత్రి మద్య నిషేధక శాఖ పోలీసులు నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల మేరకు హోసూరు మద్య నిషేధ శాఖ ఇన్స్పెక్టర్ షర్మిల భాను నేతృత్వంలో పోలీసులు హోసూరు–బెంగళూరు జాతీయ రహదారి జూజువాడి చెక్ పోస్ట్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఆ మార్గంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి తనిఖీ చేయగా.. నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు గంజాయి స్వాధీన చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు. దిండుకల్ జిల్లా గొల్లంబట్టి గ్రామానికి చెందిన విజయ్ అని తెలిసింది. ఇతడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడి దారుణహత్య
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనంలో వెళుతున్న గంగావతి తాలూకా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిని సినీ ఫక్కీలో వెంబడించి, స్కూటీని కారుతో ఢీకొట్టి అనంతరం మారణాయుధాలతో దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. బుధవారం ఉదయం కొప్పళ జిల్లా గంగావతిలో తాలూకా యువమోర్చా అధ్యక్షుడు వెంకటేశ్(31) తన స్నేహితులను కలిసి దేవీనగర్ క్యాంపు నుంచి తిరిగి స్కూటీలో వస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి, బైక్ను ఢీకొట్టారు. స్కూటీ పైనుంచి కింద పడిపోయిన వెంకటేశ్పై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేసి పారిపోయారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇండికా కారులో ఆరు మంది యువకులు వచ్చి మచ్చుకత్తులు, కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపడంతో రోడ్డు రక్తపు మడుగుగా మారింది. పోలీసుల అధికారుల పరిశీలన ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే గంగావతి డీఎస్పీ సిద్దనగౌడ పాటిల్, అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా హత్య చేసిన నిందితులు వచ్చిన ఇండికా కారు గంగావతిలోని హెచ్ఎస్ఆర్ కాలనీలో దొరకడంతో పోలీసులు ఆ కోణంలో ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకోవడంతో నిందితులు ఉపయోగించిన ఆయుధాలు తదితర వివరాలను సీసీ కెమెరా ఫుటేజీల్లో పరిశీలిస్తున్నారు. ఉలిక్కిపడిన గంగావతి ఈ హత్య ఘటన గంగావతిలో కలకలం రేపింది. గంగావతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్య విషయం దావానలంలా వ్యాపించడంతో బీజేపీ పార్టీలోనే కాకుండా నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రశాంతంగా ఉన్న గంగావతిలో రాజకీయ యువ నాయకుడిని దారుణంగా హత్య చేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదని, అయితే పాతకక్షలతో పాటు ఇతర కారణాలను కూడా అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సినీ ఫక్కీలో హత్య చేసిన దుండగులు పాతకక్షలే కారణమని అనుమానాలు? -
కులగణనలో కమ్మ అని రాయించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన సమీక్షను ఈనెల 18వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో సర్వే సమయంలో కమ్మ అని రాయించాలని ప్రవాసాంధ్రుడు, కన్నడ సాహితీ ప్రియుడు, స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ తెలిపారు. ఆయన ఈమేరకు బుధవారం పాత్రికేయులకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొప్పళ జిల్లా గంగావతి తాలూకా శ్రీరామనగర్కు చెందిన రామకృష్ణ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కులగణన సర్వేలో అధికారులకు సహకరించి కమ్మ అని రాయించాలని తెలిపారు. బాలింతల మరణాలను అరికట్టండి రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో బాలింతల మరణాల నియంత్రణకు వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది నడుం బిగించాలని గ్రామీణ కూలి కార్మికుల సంఘం, మహిళా వేదిక సంఘాలు డిమాండ్ చేశాయి. టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో గర్భిణి మహిళ మృతదేహంతో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు విద్యా పాటిల్ మాట్లాడారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో సరైన చికిత్సలు అందించడం లేదన్నారు. తల్లీబిడ్డల ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కల్యాణ కర్ణాటకలో 30 లక్షల మందికి పైగా మహిళలు రక్తహీనత, అపౌష్టికత బారిన పడ్డారన్నారు. బాలింతలకు సరైన చికిత్స అందించాలని, ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులకు అవకాశం కల్పించాలన్నారు. బాలింతల మరణాల అడ్డుకట్టకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి క్రిష్ణగిరి: చేపల వేటకెళ్లిన కూలీ నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కురుబరపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. క్రిష్ణగిరి సమీపంలోని కీళ్కరడిగురి ప్రాంతానికి చెందిన మురుగన్(35) అనే వ్యక్తి మంగళవారం అదే ప్రాంతంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో లోతైన ప్రదేశానికెళ్లిన మురుగన్ ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై కురుబరపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
మెడికల్ సీటు సాధనే గొప్పగా భావించొద్దు
బళ్లారి రూరల్ : మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధిస్తేనే తాము అందరికంటే గొప్ప అన్న భావన ఉండకూడదని బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ తెలిపారు. బీఎంసీఆర్సీ ఆడిటోరియంలో బుధవారం మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎస్ఎస్ఎల్సీ, పీయూసీలో 98 శాతం మార్కులు సాధించొచ్చు కానీ ఎంబీబీఎస్లో 60 శాతం మార్కులు రావడమే మహా గొప్ప. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రతిభ అవసరం, కాని వైద్య విద్యార్థులకు చదివింది గుర్తుపెట్టుకొనే సామర్థ్యం అవసరం అన్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టాల్సి వస్తుందన్నారు. ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ వైద్యవిద్యార్థులు కేవలం చదువుపైనే మనస్సు నిలపాలి. చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకోరాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చెడు మార్గాలను అనుసరించకుండా గమనించాలన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, వైద్య కళాశాల అధ్యాపకులు డాక్టర్ మల్లికార్జున, డాక్టర్ భరత్, డాక్టర్ పాటిల్ తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వ్యసనాలకు బానిస కావద్దు, చెడుమార్గాన్ని అనుసరించొద్దు బీఎంసీఆర్సీ డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ పిలుపు -
కర్ణాటక: విహారయాత్రలో విషాదం.. చిన్నారులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విషాద యాత్ర సందర్భంగా విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లిన వ్యక్తులు.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఏడుగురు గల్లంతు అవగా.. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలో మార్కోనహళ్లి ప్రాజెక్ట్ వద్దకు 15 మంది కలిసి విహార యాత్రకు వెళ్లారు. అనంతరం, వారిలో ఒక మహిళ, ఆరుగురు పిల్లలు కలిసి.. నీళ్లు ఉన్న ప్రాంతం వద్ద ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, నీటిలో గల్లంతయ్యారు. వారిని కాపాడేందుకు నవాజ్ అనే వ్యక్తి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.పిల్లలను కాపాడే క్రమంలో నవాజ్ కూడా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, రెస్య్కూ బృందాల అక్కడి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కేవలం నవాజ్ను మాత్రమే ప్రాణాలతో కాపాడారు. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మహిళ, పిల్లల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, వీరంతా కర్ణాటకలోని తుమకూరుకు చెందిన వారిగా గుర్తించారు. విహార యాత్రకు వెళ్లి తమ పిల్లలు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
పండుగ ముగిసింది.. ఆస్పత్రి కిక్కిరిసింది
బళ్లారి రూరల్ : గత కొద్దిరోజులుగా బళ్లారి నగరంలో తరుచుగా వానలు కురిశాయి. దీంతో వాతావరణ మార్పు, గాలి, నీరు కలుషితం కావడంతో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడ్డారు. అయితే దసరా పండుగ అయ్యాక వైద్యం కోసం పోవచ్చు అనుకున్నారో ఏమోగాని పండుగ రోజుల్లో ఆసుపత్రులు ఖాళీగా ఉండేవి. సోమవారం ఒక్కసారిగా వెల్లువగా బీఎంసీఆర్సీ అంతా రోగులతో కిక్కిరిసింది. మంగళవారం కూడా కొంత మేర రద్దీ కొనసాగింది. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో అనూహ్యంగా రోగులు పెరిగిపోయారు. సర్జరీ, క్యాజువాలిటీ, ఈఎన్టీ తదితర విభాగాల్లోను రోగులు అధికంగానే ఉన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో అత్యధికులు జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చిన వారు ఉన్నారు. రోగులతో కిటకిటలాడిన బీఎంసీఆర్సీ అన్ని విభాగాల్లోను రోగులు బారులు -
రైతులను నిండా ముంచిన వర్షాలు
రాయచూరు రూరల్: ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. మాన్వి, దేవదుర్గ గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు జలమయమయ్యాయి. పత్తి, మిరప, వరి, కందులు, ఉల్లిగడ్డలు, పొద్దు తిరుగుడు పంటలు నీటిలో తడిశాయి. పత్తి, ఉల్లి గడ్డల పంటలు రైతులకు వరంగా మారాల్సింది పోయి నేడు చిరు జల్లులకు పంట చిత్తడిగా మారింది. పత్తి, ఉల్లి గడ్డల పంటలకు నీరు సోకడంతో పూర్తి ముద్దగా మారి పురుగుల బెడద అధికమైంది. దీంతో రైతులకు పత్తి, ఉల్లి గడ్డల పంటలు శాపంగా పరిణమించాయి. అతివృష్టితో నేడు చేతికొచ్చిన పంటలు పనికి రాకుండా పోతున్నాయి. జిల్లాలో మమదాపుర, కల్లూరు, మటమారి, నెలెహాళ, బాగల్కోటె జిల్లాలో 31 వేల హెక్టార్లలో ఉల్లిగడ్డలు, ఇతర ప్రాంతాల్లో పత్తి చెట్లకున్న కాయలకు మరో సారి విత్తనాలు మొలకెత్తడం, కొన్నింటికి పురుగులు పడటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లాలో 1,79,236 హెక్టార్లలో పత్తి పంటలు వేశారు. రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యయం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో పత్తి ధరలు క్వింటాల్కు రూ.7,500 ధర పలుకుతోంది. చిరు జల్లులకు పాడైన ఉల్లిగడ్డలు, పత్తి కొనుగోలుకు వ్యాపారులు తక్కువ ధరకు కొంటారని రైతులు వాపోతున్నారు. పాడైన పత్తి, ఉల్లి గడ్డల పంట నుంచి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు. ఉత్తర కర్ణాటక, కల్యాణ కర్ణాటకలో కురిసిన వానలు ఉల్లి, పత్తి, మిరప, కంది తదితర పంటలకు నష్టం -
రైతన్నకు తప్పని ఎదురు చూపులు
సాక్షి,బళ్లారి: ఆరుగాలం కష్టపడి పని చేసి పంటలు పండించిన రైతన్నలకు పంట చేతికందేలోపు, ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూ తీవ్రంగా నష్టపోవాల్సిన దయనీయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు బాగా కురవడంతో అదునులోనే దుక్కులు దున్ని, సకాలంలో మొక్కజొన్న, రాగి, సజ్జ. వేరుశనగ తదితర విత్తనాలు వేయడంతో పాటు చెరుకు, వరి తదితర పంటలను కూడా విస్తృతంగా సాగు చేశారు. వీటితో పాటు పండ్ల తోటలు కూడా బాగా కళకళలాడాయి. అయితే పంట చేతికందే సమయంలో సెప్టెంబర్ మూడో వారం చివర, నాలుగో వారంలో కురిసిన భారీ వర్షాలు ఉత్తర కర్ణాటక జిల్లాలను అతలాకుతలం చేశాయి. దీంతో ఉత్తర కర్ణాటక పరిధిలోని విజయపుర, బాగల్కోటె, కొప్పళ, రాయచూరు, గదగ్, బళ్లారి, ధారవాడ, బెళగావి ముఖ్యంగా కలబుర్గి తదితర జిల్లాల్లో దాదాపు 25 లక్షల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, చెరుకు, వరి, పత్తి, వేరుశనగ తదితర పంటలతో పాటు దానిమ్మ, జామ, ద్రాక్ష తదితర పండ్ల తోటలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగి రైతులను నిండా ముంచేశాయి. చెరుకు తదితర పంటలకు ఒక ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టి పంట చేతికందుతుందనే సమయంలో ఒక్కసారిగా వరుణుడి ప్రతాపంతో పంటలు పూర్తిగా నష్టపోవాల్సిన దుస్థితులు కనిపిస్తున్నాయి. వైమానిక సర్వేతో సరిపెడుతున్న సీఎం సిద్ధరామయ్య లక్షలాది ఎకరాల్లో ఎటు చూసినా పంటలు నీటమునిగిన దృశ్యాలతో పాటు ఎక్కడ చూసినా పంటలు కుళ్లిపోయిన దృశ్యాలే కనిపించాయి. ఉల్లిగడ్డలు తదితర పంటలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్న దృశ్యాలు కోకొల్లలు. ఇలా రైతాంగం పూర్తిగా నష్టపోయి తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సీఎం సిద్ధరామయ్య కంటి తుడుపు చర్యగా అతివృష్టి ప్రాంతాల్లో వైమానిక సమీక్ష జరిపి చేతులు దులుపుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తూతూమంత్రంగానే పని చేస్తున్నారు. దీంతో తమకు సరైన న్యాయం జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో పాటు పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టం కావడం, రోడ్లు అస్తవ్యస్తం అయిన దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటి గురించి కూడా సక్రమమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఒక ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులకు ఒక రూపాయి కూడా చేతికందని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాధారిత భూములకు ఒక హెక్టారుకు రూ.17 వేలు, నీటిపారుదల సదుపాయం కలిగిన భూములకు ఒక హెక్టారుకు రూ.34 వేల చొప్పున పరిహారం కలిపి ఉత్తర కర్ణాటక పరిధిలోని అన్ని జిల్లాలకు అతివృష్టి వల్ల పంట నష్టపోయిన రైతులకు దాదాపు రూ.2500 కోట్లు ప్రకటించారు. పంట నష్టపరిహారం కోసం అన్నదాతల పాట్లు రైతుల ఖాతాల్లోకి సొమ్ము జమ అయ్యేదెన్నడో?లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైనా కంటితుడుపు చర్యలే.! అతివృష్టి వల్ల 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కంటి తుడుపు చర్యలకు ప్రభుత్వాలు సిద్ధం కావడంపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రకటించిన నగదు కూడా రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతుందోనని, ఎవరెవరికి పడుతుందోనని కూడా ఆందోళన చెందుతున్నారు. పంట నష్టంతో పాటు భారీ వర్షాల వల్ల 50 మందికిపైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దాదాపు 500 పశువులు కూడా మరణించాయి. ఇలా వివిధ రకాలుగా ఈ ప్రాంతంలో రైతాంగం పూర్తిగా నష్టపోయి ప్రభుత్వం అందించే పరిహారం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పరిహారం రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని, మళ్లీ రైతులు ఎలా జీవించాలని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి కనీసం రూ.50 వేలకు పైగా పంట నష్ట పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకటించిన పరిహారం కూడా వీలైనంత త్వరలో రైతులకు అందేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
సాక్షి,బళ్లారి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మంగళవారం కొప్పళ జిల్లా హులిగెమ్మ దేవి దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తులపైకి స్లీపర్ కోచ్ బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గదగ్ జిల్లా రోణ తాలూకా తల్లిహాళ గ్రామానికి చెందిన అన్నపూర్ణ(40), ప్రకాష్(25), శరణప్ప(19) అనే ముగ్గురు మృతి చెందారు. మరో మూడు గంటల్లో హులిగమ్మ దర్శనం చేసుకొనే సమయంలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం జరగడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ ఢీకొనడంతో వీరేష్(28) అనే యువకుడు కూడా మృతి చెందాడు. కుకనూరు గ్రామం నుంచి హులిగమ్మ దేవి దర్శనానికి బయలుదేరిన సమయంలో బైక్ ఢీకొని కింద పడటంతో వీరేష్ మృతి చెందాడు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతంలో హులిగమ్మ దేవి దర్శనానికి తరలి వస్తున్న భక్తులపై స్లీపర్ కోచ్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలపై ఆయా స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వివిధ రంగాల్లో విరివిగా సేవలు
రాయచూరు రూరల్: విశ్వకర్మ సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందించామని రాష్ట్ర విశ్వకర్మ మండలి అధ్యక్షుడు సుజ్ఞానమూర్తి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో బంగారు ఆభరణాల తయారీ పనులు చేసే 10 మందికి రూ.లక్ష చొప్పున రుణాలు మంజూరు చేశామన్నారు. మండలి నుంచి గంగా కళ్యాణ పథకం ద్వారా బోరు బావుల తవ్వకం, వాహన రుణాల మంజూరు చేపట్టామన్నారు. విశ్వకర్మ సమాజం సభ్యులతో కలిసి ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాల గురించి ప్రచారం చేస్తామన్నారు. సమావేశంలో మారుతి, రాము, మనోహర్ పత్తార్, బ్రహ్మ గణేష్, వెంకటేష్లున్నారు. విద్యార్థుల అభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్ : విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సంస్కృతి, సంస్కారాలతో పాటు జీవిత విలువలను వారిలో అలవర్చుకొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో శరణప్ప, దండెప్ప, అస్లాం పాషా, బాబూ రావ్ శేగుణిషి, అబ్దుల్ రజాక్లున్నారు. -
శరన్నవ రాత్రి ఉత్సవాలకు తెర
రాయచూరు రూరల్ : జిల్లాలో మంగళవారం శరన్నవరాత్రి ఉత్సవాలకు తెరదించారు. సుల్తాన్పూర్ బృహన్మఠంలో శ్రీదేవి, కోటలోని కాళికా దేవి ఆలయంలో ప్రతిమకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. సుల్తాన్పూర్ బృహన్మఠంలో శ్రీదేవి పురాణ మంగళం సందర్భంగా చిన్నారులతో నృత్య ప్రదర్శనలు జరిగాయి. కాళికా దేవి ఆలయంలో పున్నమి సందర్భంగా విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రశేఖర్ కపిలవాయి, శివ కుమార్, సభ్యులు సత్యనారాయణ, రవి, బ్రహ్మ, ఈశ్వర్, కేశవమూర్తిలున్నారు. -
మానవ హక్కుల రక్షణ సమితికి ఎంపిక
బళ్లారి రూరల్ : కర్ణాటక మానవ హక్కుల రక్షణ సమితి జిల్లాధ్యక్షుడుగా పి.అంజినిని ఎన్నుకొన్నట్లు రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద ఓ ప్రకటనలో తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పి.అంజిని విద్యా శాఖలో ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయుడుగా, మోకా క్లస్టర్ సీఆర్పీగా అందించిన ఉత్తమ సేవలను గుర్తించి జిల్లాధ్యక్షుడుగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రాధ్యక్షుడు యూ.ఉరుకుంద, కోశాధికారి ఉప్పార వీరేశ్, ప్రముఖులు మల్లప్ప, హనుమంతప్పలు అంజినిని అభినందించారు. కులగణనలో ఉపాధ్యాయుడికి గుండెపోటు హుబ్లీ: దావణగెరె తాలూకాలోని హళెకడ్లెబాళు స్కూల్ టీచర్ సోమవారం గుండెపోటుకు గురై దావణగెరె ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. టీచర్ ప్రకాష్ నాయక్(44) గుండెపోటుకు గురైన వ్యక్తి. సర్వే వేళ గుండెపోటు సంభవించడంతో స్థానికులు సమయస్ఫూర్తితో ఆయన్ను తక్షణమే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో వైద్యులు అప్పటికప్పుడే ఆపరేషన్ చేసి స్టంట్ అమర్చారు. మొత్తానికి ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. కాగా కోలుకుంటున్న ప్రకాష్ నాయక్ను ఆ జిల్లాధికారి గంగాధరస్వామి పరామర్శించి ధైర్యం చెప్పారు. పదవికి రాజీనామా హొసపేటె: హొసపేటె సిటీ మున్సిపాల్టీ(నగరసభ) ఉపాధ్యక్షుడు రమేష్ గుప్తా రాజీనామా లేఖను జిల్లాధికారి కవితా ఎస్.మన్నికేరికి అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి చేసిన రాజీనామా పత్రాన్ని రమేష్ గుప్తా మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి వెళ్లి విజయనగర జిల్లా మేజిస్ట్రేట్, జిల్లాధికారిణికి సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ హొసపేటె సిటీ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో ఉండటం గమనార్హం రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా? రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రధాన రహదారిలో మురుగు నీరు నిలిచింది. దేవదుర్గ తాలూకా గబ్బూరు గ్రామంలో ప్రధాన రహదారిలో గత కొన్ని నెలల నుంచి గ్రామ ప్రజలు ఉపయోగించిన మురుగు నీరు, నారాయణ పుర కుడి కాలువ నీరు రెండు కలిసి రహదారిని ముంచెత్తుతున్నాయి. రాయచూరు, కలబుర్గి, విజయపుర, శహాపుర, యాదగిరి, పూనా, షోలాపుర వంటి నగరాలను అనుసంధానించే రహదారి అధ్వానంగా మారింది. ఈ ప్రాంతం మీదుగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సంచారం చేస్తారు. గత నెల 28న గబ్బూరులో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నేరాల అదుపునకు ప్రజలు సహకరించాలిరాయచూరు రూరల్: నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని గురుమఠకల్ పోలీస్ స్టేషన్ సీఐ వీరన్న దొడ్డమని పేర్కొన్నారు. మంగళవారం గురుమఠకల్ తాలూకా నజరాపుర గ్రామంలో ఇంటింటికీ పోలీస్ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, పోక్సో చట్టం, ట్రాఫిక్ నియమాలు, ఈఆర్ఎస్ 112, 1930 సహాయవాణి ద్వారా ప్రజలు సహకరించాలన్నారు. -
మహర్షి మార్గం ఆదర్శప్రాయం
బళ్లారి అర్బన్: నగరంలోని వాల్మీకి సర్కిల్లో రూ.1.10 కోట్ల వ్యయంతో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సర్కిల్ను అభివృద్ధి పరుస్తామని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి హామీ ఇచ్చారు. నగరంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నల్లచెరువులోని వాల్మీకి భవనంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో సీతారాముల శిల్పాలు చెక్కిన మైసూరుకు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చేతుల మీదుగా విగ్రహాన్ని చెక్కించామన్నారు. బళ్లారిలో వాల్మీకి శాఖ మఠం స్థాపిస్తామన్నారు. ప్రముఖులు ముండ్రగి నాగరాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకు ముందు వాల్మీకి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పూజలు నెరవేర్చారు. జయంతి శుభవేళ నగర వీధుల్లో వాల్మీకి చిత్రపటాన్ని ఊరేగించారు. ఊరేగింపులో మేయర్ ముల్లంగి నందీష్, ఎస్పీ శోభారాణి తదితర అధికారులు, కార్పొరేటర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు. బీఎంసీఆర్సీలో.. బళ్లారి రూరల్ : మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం బళ్లారి వైద్య కళాశాల పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్సీ) లోని బీసీ రాయ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బీఎంసీఆర్సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులు మహర్షి వాల్మీకి జీవిత విశేషాలు, రామాయణం రచన గురించి తెలిపారు. ప్రిన్స్పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, దంతవైద్య కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ భారతి, సీఏఓ మహేష్ హళేగౌడ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హొసపేటెలో.. హొసపేటె: మహర్షి వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా మంగళవారం విజయనగర జిల్లాధికారి కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గవియప్ప, జిల్లాధికారి కవితా ఎస్. మన్నికేరి, ఎస్పీ జాహ్నవి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే గవియప్ప మాట్లాడుతూ మహర్షి వాల్మీకి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించారన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ నోంగ్జాయ్ మహమ్మద్ అక్రమ్ పాషా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతిని సంబరంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి సర్కిల్ వద్ద మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. మహర్షి వాల్మీకి ప్రతిమకు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, రాయచూరు శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, లోక్సభ సభ్యుడు కుమార నాయక్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పూలమాల వేశారు. అనంతరం వాల్మీకి భవనంలో అదనపు జిల్లాధికారి శివప్ప, కన్నడ సంస్కృతి శాఖ అధికారి రాజేంద్ర జాలదార్, వెంకటేష్లున్నారు. ఊరేగింపులో కళాకారుల నృత్యం ఇతర కార్యక్రమాలు జరిగాయి. మహర్షి వాల్మీకి కన్న కల ప్రజారాజ్యం హుబ్లీ: జిల్లా వ్యాప్తంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ప్రభుత్వం, సంబంధిత వర్గాలు పలు సంఘ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ధార్వాడలో జిల్లాధికారిణి దివ్యప్రభు తదితర అధికారుల ఆధ్వర్యంలో వివిధ చోట్ల వాల్మీకి విగ్రహాలను ప్రత్యేక పూజలు నెరవేర్చారు. అక్కడి ఆలూరు వెంకటరావ్ భవనంలో వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వాల్మీకి రామాయణం గురించి వక్తలచే ప్రత్యేక ప్రసంగాలు చేయించారు. ప్రముఖ పరిశోధకులు డాక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి జయంతి వేడుకల్లో వక్తలు సంబరాల మధ్య చిత్రపటం ఊరేగింపు -
23 నుంచి వైభవంగా కిత్తూరు ఉత్సవాలు
హుబ్లీ: ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఈనెల 23, 24, 25 తేదీల్లో మూడు రోజుల పాటు కిత్తూరు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. ఈ సారి రాష్ట్రానికే ప్రసిద్ధి చెందిన వ్యక్తి చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామని బెళగావి జిల్లా ఇన్చార్జి మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. చెన్నమ్మన కిత్తూరులో కిత్తూరు ఉత్సవాల ముందస్తు సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించాం. దీని తర్వాత మరో సమావేశం నిర్వహిస్తాం. మొత్తానికి మూడు సమావేశాలు నిర్వహించి ఉత్సవాలకు తుది రూపం ఇస్తామన్నారు. నిర్వహణ కోసం 17 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. వర్ధమాన కళాకారులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నారు. వివిధ సమస్యలను పరిష్కరించే దిశలో సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. ఎమ్మెల్యే బాబా సాహెబ్ పాటిల్ సారథ్యంలో ఈ సారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు నిధుల విడుదలలో పక్షపాత ధోరణిపై అడిగిన ప్రశ్నకు సంగొళ్లి అభివృద్ధి ప్రాధికార ద్వారా సంగొళ్లి, నందగడలో అనేక నిర్మాణ పనులను చేపట్టినందు వల్ల దానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రాధికార అధ్యక్షుడు ఆయా రెవెన్యూ మంత్రిని కలిసి కిత్తూరు అభివృద్ధి ప్రాధికారకు ఎక్కువ నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. -
జయహో కవికోకిల వాల్మీకి
చిక్కబళ్లాపురం: కవి కోకిల, రామాయణ మహాకావ్య రచయితగా పేరుపొందిన పూజ్యులు వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రమంతటా ఘనంగా జరిపారు. ప్రభుత్వం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. చిక్కబళ్లాపురంలో మంత్రి ఎంసి సుధాకర్, జిల్లాధికారులు, నాయకులు పాల్గొన్నారు. వా ల్మీకి చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఆ వర్గానికి చెందిన ప్రముఖులను ఘనంగా సన్మానించారు. వాల్మీకి చిత్రపటాన్ని పూల పల్లకీలో ఊరేగించారు. అలాగే మైసూరు నగరంలో బృహత్ ర్యాలీ జరిగింది. కళాకారుల ప్రదర్శనలు రంజిపంజేశాయి. కలబుర్గిలో ఊరేగింపులో జిల్లా కలెక్టర్ ఫౌజియా తరున్నుం డ్రమ్స్ వాయించారు. కోలారులో నేత్రపర్వంగా పల్లకీ ఊరేగింపు జరిగింది. రాష్ట్రమంతటా జయంతి సంబరాలు -
కిక్కు లేని చుక్క విక్రయాలు
బనశంకరి: ఎకై ్సజ్శాఖ అర్ధవార్షిక కార్యకలాపాల డేటా ప్రకారం రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెద్దగా పెరగడం లేదు. 2023, 2024 తో పోలిస్తే మద్యం విక్రయాల్లో భారీ తగ్గుముఖం కనబడింది. బ్రాందీ, విస్కీ తదితరాలపై ఎకై ్సజ్ సుంకాలను తరచూ పెంచడమే దీనికి కారణంగా అనుమానాలున్నాయి. రేట్లు పెరగడం వల్ల మందుబాబులు వెనుకంజ వేస్తున్నారు. వినియోగం తగ్గినప్పటికీ ఎకై ్సజ్ రాయల్టీకి ఢోకా లేదని మద్యం వ్యాపారులు చెప్పారు. రేట్లు, సుంకాల పెంపు వల్ల సర్కారుకు అమ్మకాల లోటు కనిపించడం లేదు. గత మూడేళ్లలో ఇలా 2023 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్యకాలంలో 352.83 లక్షల బాక్సులు (ఒక బాక్సుకు 8.64 లీటర్లు) ఐఎంఎల్ మద్యం విక్రయమైంది, 2024 ఇదే అవధిలో 345.76 లక్షల బాక్సులు అమ్ముడయ్యాయి. 2025లో 342.93 లక్షల బాక్సులను తాగేశారు. ఇది గిరాకీ తగ్గుదలకు అద్దం పడుతోంది. పాతాళానికి బీర్లు 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో మొత్తం 242.73 లక్షల బాక్సులు (ఒక బాక్సులో 7.80 లీటర్లు) బీర్లను మందుబాబులు తాగేశారు. కానీ 2025 ఇదే అవధిలో 195.27 లక్షల బాక్సులే కొన్నారు. ఏకాఎకి 47.46 లక్షల బాక్సుల సరుకు అమ్ముడుపోలేదు. ఈ క్షీణత 19.55 శాతంగా నమోదైంది. బీర్ల ధరలను సర్కారు విచ్చలవిడిగా పెంచడమే కారణం. అంత డబ్బు పెట్టలేక పేద, మధ్యతరగతి మందుబాబులు, యువత బీరుకు టాటా చెబుతున్నారు. రాష్ట్రంలో గత 6 నెలల్లో భారీ క్షీణత అధిక ధరలే కారణం సర్కారుకు మాత్రం వేల కోట్ల ఆదాయంరాష్ట్ర ప్రభుత్వం పంచ గ్యారంటీల పథకానికి నిధుల కోసం మద్యం ధరలను రెండేళ్లుగా పెంచుతూ వస్తోంది. ఫలితంగా మందుప్రియులకు చేటుకాలం తలెత్తింది. అంత ఖర్చు పెట్టి మద్యం కొనలేకపోతున్నారు. బెంగళూరుతో సహా రాష్ట్రంలో మద్యం విక్రయాలు పడిపోవడమే దానికి నిదర్శనం. ఖజానాకు రూ.17 వేల కోట్లపైనే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఎకై ్సజ్ శాఖ రాయల్టీ సేకరణలో తగ్గలేదు. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు మద్యం విక్రయాలతో రూ.17,702 కోట్ల రాయల్టీ దక్కింది. ప్రస్తుతం ఇదే అవధిలో రూ.19,571 కోట్ల రాబడిని ఆర్జించింది. రూ.1,869 కోట్లు అదనంగా సమకూరడం గమనార్హం. -
కళామేళా కనువిందు
బనశంకరి: సిలికాన్ సిటీలో జేపీ నగరలో నిర్వహిస్తున్న రాజస్థానీ హస్తకళా, చేనేత మేళా మహిళలను ఆకట్టుకుంటోంది. 7వ ఫేజ్ ఆర్బీఐ లేఔట్ సోమేశ్వర సభాభవన్లో మేళా జరుగుతోంది. దేశంలో పేరుమోసిన ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు, చీరలు, నూలు, పట్టుచీరలు ఇక్కడి స్టాళ్లలో విక్రయిస్తున్నారు. అలాగే గృహాలంకరణకు సారంగపుర కళా సామగ్రి, తివాచీలు, మార్బుల్ క్రాఫ్ట్స్, కంచు, దంత కళాసామగ్రి, పెయింటింగ్స్, హ్యాండ్బ్యాగులు, జ్యువెలరీ, పింగాణీ వస్తువులు లభిస్తున్నాయి. 22వ తేదీ వరకు నిర్వహిస్తారు. లాల్బాగ్ను చంపేయొద్దు: అశోక్ దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నగరం గుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన సొరంగ మార్గం పథకాన్ని తక్షణం రద్దు చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండు చేశారు. ప్రమాదంలో లాల్బాగ్ అనే పేరుతో ఎక్స్లో పోస్ట్ చేశారు. సొరంగ మార్గం ప్రాజెక్టు కోసం బెంగళూరు శ్వాసకోశంగా ఉన్న లాల్బాగ్ పార్క్ను బలి ఇస్తున్నారన్నారు. లాల్బాగ్లోని 6 ఎకరాలు పోతుందని, వేలాది చెట్లను నరికివేస్తారన్నారు. పరిసరవాదులు,మేధావులు ఇప్పటికే ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారన్నారు. ఒక వ్యక్తి ప్రచారం కోసం ఇంత విధ్వంసం అవసరమా అని డీసీఎం డీకే శివకుమార్పై మండిపడ్డారు. పార్కు రక్షణకు ప్రజలతో కలిసి పోరాడుతామన్నారు. కుర్చీ వివాదాన్ని తీర్చాలి: హోంమంత్రి శివాజీనగర: సీఎం పీఠం పంపిణీ వివాదాన్ని పార్టీ హై కమాండ్ పరిష్కరించాలని హోం మంత్రి జీ.పరమేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో సదాశివనగర ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, పవర్ షేరింగ్ వివాదాన్ని పరిష్కరించాలని మంత్రి సతీశ్ జార్కిహొళి చెప్పడాన్ని సమర్థించారు. దీనిపై గందరగోళం ఉంది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రకటనలు చేస్తున్నారు. దీనిని హైకమాండ్ గమనిస్తోంది. బిహార్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో మార్పులు అంటూ ఏమీ చెప్పలేం. హైకమాండ్ మార్చాలంటే మారుస్తుంది, బెంగళూరులో, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటన్నిటిని సరిజేయడం తమ బాధ్యత అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో దళితుడు, సీజే జస్టిస్ గవాయ్పై దాడి జరిగింది, అది రాజ్యాంగానికి చేసిన అవమానం. అక్కడి భద్రతా వ్యవస్థ విఫలమైంది. దాడికి పాల్పడిన న్యాయవాదిని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. గజిబిజిగా కులగణన● విజయేంద్ర దొడ్డబళ్లాపురం: బీసీలకు న్యాయం చేసేది బీజేపీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. మంగళవారంనాడు బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే ఆ సర్వేలు శాసీ్త్రయంగా, న్యాయంగా జరగాలన్నారు. సర్వేలో జరుగుతున్న తప్పులను, గందరగోళాలను దిద్దుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే, సర్వేలకు వ్యతిరేకమని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అనేక చోట్ల సర్వే సిబ్బందిపై దౌర్జన్యాలు, కుక్కల దాడులు జరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అలాంటి జరగకుండా చూడాలని సర్కారుని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబాన్ని 60 ప్రశ్నలు అడగడం ఎంతవరకూ సమంజసమన్నారు. సీఎం, డీసీఎం కూడా ఈ విషయంలో విస్మయం వ్యక్తం చేశారన్నారు. టెన్త్ విద్యార్థుల ఫీజుల పెంపు దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) విద్యార్థులపై భారం మోపనుంది. వార్షిక పరీక్షల ఫీజును 5 శాతం పెంచింది. ఈ మేరకు కర్ణాటక పాఠశాలలు, వాల్యూయేషన్ బోర్డు ఉత్తర్వులను జారీచేసింది. ఇప్పుడు మొదటిసారి పరీక్షలు రాసే విద్యార్థి రూ.676 కు బదులుగా రూ.710 చెల్లించాలి. కొత్తగా నమోదు చేసుకునే ప్రైవేటు విద్యార్థులకు నమోదు మరియు అప్లికేషన్ రుసుము రూ.236 నుంచి 248కి పెంచారు. సబ్జెక్ట్ రాసే విద్యార్థులు రూ.427 కు బదులు రూ.448 చెల్లించాలి. రెండు అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్లు రాసే విద్యార్థులు రూ.532 కు బదులు రూ.559 చెల్లించాలి. సమాధానపత్రాల మదింపు, ఇతర పాలనాపరమైన ఖర్చులు పెరిగినందున ఫీజులను పెంచినట్లు బోర్డు సమర్థించుకుంది. -
మార్కొనహళ్లి డ్యాంలో మృత్యు కేక
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మార్కొనహళ్ళిలో సెఫోన్ వద్దనున్న జలాశయాన్ని చూడడానికి వెళ్లిన రెండు కుటుంబాలకు చెందిన 6 మంది నీటిలో పడి మునిగిపోయారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈత కొడుతూ ఉండగా.. ● ఈ విషాదకర సంఘటన కుణిగల్ తాలూకాలోని మార్కొనహళ్ళి డ్యాంలో మంగళవారం జరిగింది. ● తుమకూరులోని బీటిపాళ్య నుంచి మాగడిపాళ్యలోని బంధువుల ఇంటికి ఓ కుటుంబం వెళ్లింది. ● దగ్గరిలోని శింషా నదిపైనున్న జలాశయం వర్షాలకు కళకళాడుతూ ఉండడంతో చూడాలని అతిథులు, స్థానిక కుటుంబీకులు వెళ్లారు. ● ఏడుమంది జలాశయం తీరంలో ఈతకొడుతూ ఉండగా, లోతైన చోట 7 మంది మునిగిపోయారు. వారిలో ఒకరు మాత్రం ఎలాగో బయటకు వచ్చారు. ● స్థానికులకు తెలిసి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి గాలించి సాజియా (32), అర్బిన్ (30) అనే ఇద్దరు మహిళల శవాలను బయటకు తీసుకొచ్చారు. ● తబసుమ్ (45), షబాన (44), మీప్రా (4), మహిబా (1) జలాశయంలో గల్లంతయ్యారు. ● ప్రాణాలతో బయటపడిన నవాబ్ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. ● బంధువుల రోదనలతో డ్యాం వద్ద విషాదం అలముకొంది, రాత్రివరకూ గాలించినా మిగతా నలుగురి జాడ లేదు. రెండు కుటుంబాలకు చెందిన 6 మంది గల్లంతు ఇద్దరు మహిళల మృతదేహాల వెలికితీత తుమకూరు జిల్లాలో ఘోర విషాదం -
శాండల్వుడ్లో మళ్లీ మీ టూ బాంబు
యశవంతపుర: శాండల్వుడ్లో మరోసారి మీ టూ ప్రకంపనలు తలెత్తాయి. తమను సహ నటులు వేధించారని ఐదారేళ్ల కిందట అనేకమంది నటీమణులు ఆరోపణలు చేయడం, అది తీవ్ర సంచలనం కావడం తెలిసిందే. ఇప్పుడు మరో ఉదంతం బయటపడింది. ఓ కన్నడ నటికి లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై బెంగళూరు రాజాజీనగర పోలీసులు నటుడు, నిర్మాత హేమంత్కుమార్ (34) ను అరెస్ట్ చేశారు. రిచ్చి సినిమా షూటింగ్లో తనను వేధించాడని ఓ వర్ధమాన నటి (29) ఇటీవల ఫిర్యాదు చేసింది. సినిమా చాన్సు ఇస్తానని.. 2022లో రిచ్చి పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ సమయంలో తనను పరిచయం చేసుకొని, మరో సినిమాలో చాన్సు ఇస్తానని నమ్మించి లైంగికంగా వేధించినట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. అడ్వాన్స్గా తనకు రూ.60 వేలు ఇచ్చాడని, షూటింగ్ సమయంలో లైంగికంగా సతాయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్లో అరకొర దుస్తులను ధరించి నటించాలని ఒత్తిడి చేశాడంది. ఆయన డిమాండ్లను నెరవేర్చని కారణంగా చిత్రంలో సెన్సార్ కానీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని తెలిపింది. రాజాజినగర పోలీసులు నిందితుడు హేమంత్పై లైంగిక వేధింపులు, బెదిరింపులు, ఐటీ చట్టం తదితరాల కింద కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం కన్నడ సినీ లోకంలో సంచలనం కలిగిస్తోంది. మళ్లీ కొత్తగా మీ టూ ఉదంతాలు పుట్టుకొస్తాయేమోనని సినీ ప్రముఖుల్లో గుబులు నెలకొంది. నిర్మాత వేధించాడని నటి ఫిర్యాదు నిందితుడు అరెస్టు బెంగళూరులో సంఘటన సినిమా వేడుకలో మద్యం తాగించి.. 2023 ఆగస్టులో ముంబైలో జరిగిన ఓ సినిమా వేడుకలో తనను మద్యం తాగమని బలవంతం చేశాడని, కూల్డ్రింకులో మద్యం కలిపి ఇచ్చాడని సదరు నటి తెలిపింది. తాను తెలియకుండా తాగడంతో మత్తులోకి జారుకోగా తనను ఫోటోలు, వీడియోలను తీసుకుని అసభ్యంగా మారుస్తానని బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డాడని వాపోయింది. ఆ వీడియోలను తన తల్లికి పంపండంతో ఆమె భయాందోళనకు గురైందని తెలిపింది. ప్రశ్నించినందుకు గూండాలతో దాడికి యత్నించాడంది. తన వీడియోలు ఎక్కడా ప్రసారం కాకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు పొందానని ఆమె తెలిపింది. పోలీసులు హేమంత్ను ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
దెయ్యాలు బాబోయ్
మండ్య : సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు. -
చెట్టు.. తీసింది కీర్తన ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. మ్యాచ్ చూసి వస్తుండగా.. ఎలా జరిగిందంటే.. ఆదివారం కీర్తన, ఆమె స్నేహితురాలు రాధతో ఆచార్య మైదానంలో జరిగే శాండల్వుడ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి స్కూటర్లో వెళ్లారు. మ్యాచ్ ముగిశాక సాయంత్రం 7 గంటల సమయంలో తమ స్కూటర్లో ఇళ్లకు బయల్దేరింది. కీర్తన స్కూటర్ వెనుక కూర్చుంది. సోలదేనహళ్లి పోలీస్స్టేషన్ సమీపంలో పెద్ద చెట్టు విరిగి పడింది. ఆ సమయంలో ఎలాంటి గాలి వాన లేవు.చెట్టు కింద నలిగిన కీర్తన క్షణాల్లోనే చనిపోయింది. రాధ, మరో బైక్పై వస్తున్న భాస్కర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు కీర్తన చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
వలస పక్షుల అడ్డా అంకసముద్ర
సాక్షి,బళ్లారి: ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి తుంగభద్ర డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరడంతో పాటు స్థానికంగా వర్షాలు బాగా కురవడంతో ఉమ్మడి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని అంకసముద్ర చెరువు కూడా కళకళలాడుతోంది. అంకసముద్ర చెరువు అంటే ప్రత్యేకంగా నీరు నిల్వ ఉండే చెరువుగా ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీంతో ఇక్కడికి దేశ, విదేశీ వలస పక్షులు తరలి వచ్చి సందడి చేయడంతో పక్షిప్రేమికులకు అంకసముద్ర స్వర్గధామంగా మారింది. సాధారణంగా ప్రతి ఏటా దేశ, విదేశీ పక్షులు నవంబర్ నుంచి అంకసముద్ర చెరువుకు రావడం ఆనవాయితీ కాగా ఈ ఏడాది ముందస్తు వర్షాలతో చెరువు కళకళలాడుతుండటంతో పాటు దేశ, విదేశీ పక్షులు కూడా సెప్టెంబర్ నెల నుంచి రావడం ప్రారంభం కావడంతో అంకసముద్ర చెరువులో పక్షుల కిలకిలరావాలతో పర్యాటకుల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీ కరడిధామ, తుంగభద్ర డ్యాం, ప్రముఖ పుణ్యక్షేత్రాలతో ఉమ్మడి బళ్లారి జిల్లా పేరు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల కాశీగా అంకసముద్ర కూడా చేరిపోవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పక్షి ప్రేమికులను మరిపిస్తున్న వైనం రాష్ట్రంలోనే అరుదైన పక్షిధామంగా పేరొందిన అంకసముద్ర చెరువులో పెయింటెడ్ స్టార్ట్, పెలికాన్, స్పూన్ బిల్లు, ఓపెన్ బిల్లు స్టార్ట్, గ్రోటర్ కార్మోరేట్, విదేశాలకు చెందిన బ్రాహ్మణీ బాతు, బ్లాక్ టెయిల్డ్ గాడ్ వీట్, మార్స్ స్యాండ్ పైపర్, యూరేషియన్ కర్లివ్, సైబోరియన్ స్టోన్ చాట్, కర్లివ్ స్యాండ్ పైపర్ తదితర 87 జాతులకు చెందిన పక్షులు విచ్చేయడంతో అంకసముద్ర చెరువు పక్షి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి. దేశ, విదేశాల నుంచి 100 రకాలకు పైగా జాతి పక్షులు వస్తుండటంతో పక్షి ప్రేమికులను ఉదయం, సాయంత్రం వేళల్లో కనువిందు చేస్తున్నాయి. ఉదయం వేళల్లో బయటకు ఆహారం వెళ్లే పక్షులు ఉదయం బయటకు వెళ్లేటప్పుడు, సాయంత్రం తిరిగి మళ్లీ పక్షిగూటికి వచ్చేటప్పుడు పక్షి ప్రేమికులు అక్కడికి చేరుకుని పక్షులను వీక్షించి ఆహ్లాదం పొందుతున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న అరుదైన నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఈ నీటి కుక్కలు(నీరునాయి) పర్యాటకులకు మరింత కనువిందు చేస్తున్నాయి. అంకసముద్ర గ్రామ సమీపంలో విజయనగర రాజుల కాలంలో కట్టించిన ఈ చెరువు దాదాపు 250 ఎకరాల్లో విస్తరించి పక్షులకు నిలయంగా మారింది. తుంగభద్ర నది నుంచి ఏడాది పొడవునా నీరు సరఫరా చేస్తుండటంతో ఎప్పటికప్పుడు ఈ చెరువు ఖాళీ కాకపోవడం విశేషం. దీంతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అరుదైన పక్షులు ఇక్కడ ఏడాది పొడవునా వచ్చి వెళుతుంటాయి. చెరువులో 100కు పైగా రకాల పక్షుల సందడి దేశ, విదేశీ పక్షుల రాకతో సందర్శకులకు కనువిందు పక్షిప్రేమికులకు నిలయంగా చెరువు దాదాపు 100కు పైగా అందమైన పక్షుల రాకతో ప్రముఖ పక్షుల విడిది కేంద్రంగా, పక్షిధామంగా, పక్షిప్రేమికులకు నిలయంగా ఈ చెరువు విరాజిల్లుతోంది. నీటి కుక్కలు అంకసముద్ర చెరువులో చేస్తున్న నృత్యాలు పర్యాటకులను మరింత ఆనందోత్సవాల్లో ముంచెత్తుతున్నాయి. కలుషిత నీరు రాకుండా కొత్త నీటిలోనే ఈ నీటి కుక్కలు నివాసం ఉంటాయని పక్షి ప్రేమికుడు విజయ్ పేర్కొంటున్నారు. పేరుకు నీటికుక్కలు పిలుస్తారే కాని కుక్కల జాతికి చేరిన పక్షులు కావని, ఇవి అరుదైన ఒక రకమైన పక్షిజాతికి చేరినవి అన్నారు. వీటితో వివిధ రకాల అందమైన పక్షులు రావడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చి వీక్షించి చూసి ఆనందిస్తుంటారన్నారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో మాత్రమే ఈ నీటి కుక్కలు కనిపిస్తాయని, చెరువుల్లో నీటిశుభ్రత చేసే అరుదైనవని గుర్తించారు. జనం కనిపిస్తే ఒకింత సిగ్గుపడుతూ వయ్యారాలు ఒలకబోస్తే అటు, ఇటు తిరగడం వల్ల పక్షిప్రేమికుల మనస్సులను కట్టిపడేస్తున్నాయన్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, ప్రపంచ పర్యాటక కేంద్రాలు ఉన్న ఉమ్మడి బళ్లారి జిల్లాలోని అంకసముద్ర చెరువు పక్షులకు స్థావరంగా ఏర్పాటు చేసుకోవడంతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఉమ్మడి బళ్లారి జిల్లాలో పక్షుల స్వర్గధామంగా కూడా గుర్తింపు పొందడం విశేషం. -
కేంద్రానికి బిహార్ తప్ప కర్ణాటక గుర్తు రాదా?
రాయచూరు రూరల్ : రాష్ట్రంలో అతివృష్టి, వరదలతో 17 జిల్లాల్లోని రైతులు పంట పొలాల్లో వేసుకున్న పంటలు సరిగా పండక, పశుగ్రాసం లేక తల్లడిల్లిపోతున్నామని, పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ వ్యవసాయ కూలి కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. బాధితులు జీవితం ఎలా గడపాలా? అనే ఆలోచనలో ఉన్న సందర్భంలో తక్కువ పరిహారం అందించాలని అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు తమకేమి పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే తహసీల్దారే మాయం కావడంతో బాధితుల్లో విచారం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కార్యదర్శులు, అధికారులు రైతులను చూసిన వెంటనే పరుగెడుతున్నారు. పంట నష్టపరిహారం కోసం 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోయారు. రాష్ట్రంలో బాధితులు, రైతులు, పేదలు అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో సందేశాలు పంపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం రాష్ట్రంలో 17 జిల్లాల్లో 80 తాలూకాలో భారీ వరదలు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. రాష్ట్రం నుంచి 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నా వారి మౌనం ఎందుకో అర్థం కావడం లేదు. 2009లో వరదలు వచ్చిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పరిహారం ప్రకటించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 40 మంది మృతి చెందగా, రూ.50 వేల కోట్ల మేర నష్టం సంభవించినా కేంద్రంలోని నేతలు నరేంద్ర మోదీ, అమిత్షా, నిర్మలా సీతారామన్లు కర్ణాటకను మరిచి బిహార్లో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ఆపస్న హస్తం అందించడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న నెలకొంది. బిహార్కు రూ.10,219 కోట్లు, కర్ణాటకకు రూ.3,705 కోట్లు, తెలంగాణకు రూ.2,136 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.4,112 కోట్లు, మహారాష్ట్రకు రూ.6,418 కోట్లు, తమిళనాడుకు రూ.4,144 కోట్ల నిధులు కేటాయించారు. పరిహారం కోసం రైతుల వెంపర్లాట కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్లో సందేశాలు 17 జిల్లాల్లోని 80 తాలూకాల్లో భారీ వరదలు రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ సభ్యులు మౌనం 2009లో వరదలకు కాంగ్రెస్ సర్కార్ పరిహారం ప్రకటన 40 మంది మృతి, రూ.50 వేల కోట్ల మేర వాటిల్లిన నష్టం -
ప్రతిభావంతులను ప్రోత్సహించాలి
మాలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించాలని స్వాభిమాని జనతా పార్టీ సంస్థాపక అధ్యక్షుడు హూడి విజయ కుమార్ తెలిపారు. సోమవారం తాలూకాలోని బాళిగానహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలోని నాగొండహళ్లి గ్రామంలో యోగామృత ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో రంగవర్తన పిల్లల నృత్య, నాటక, సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలలో అపర ప్రజ్ఞా పాటవాలు ఉంటాయని తెలిపారు. వాటిని వెలికి తీయడానికి సరైన వేదిక కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు సాంస్కృతికంగా ప్రగతిని సాధించాలని సూచించారు. యోగామృత ఫౌండేషన్ నుంచి పిల్లలకు నాటక, సంగీత, నృత్య తదితర కళా ప్రకారాల్లో శిక్షణ ఇవ్వడం సంతోషకరమని తెలిపారు. ఫౌండేషన్ నుంచి చిట్పట్ చిన్నర సంస్కృతి హబ్బ, సేవా అవార్డుల ప్రదానం, రాష్ట్ర స్థాయి బంగారు పతకం సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గర్వించదగిన విషయమన్నారు. కార్యక్రమంలో కరవే తాలూకా అధ్యక్షుడు ఎం.ఎస్ శ్రీనివాస్, యోగా సంస్థ శంకర్, కరవే ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షయపై నిరంతర పోరాటం
● మరోసారి బీసీసీ టీకా వేయించుకోవాలి ● ఆరోగ్య శాఖ తరఫున ముమ్మర ప్రచారం హుబ్లీ: విశ్వవ్యాప్తంగా భారత్లో ఒకప్పుడు క్షయ, పోలియో, కుష్టురోగం, నారి పుండు రోగం, తట్లమ్మ తదితర రోగాలతో గ్రామీణులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణపాయం కొని తెచ్చుకొనే వారు. పెరిగిన వైద్య రంగంలో విజ్ఞానం ఫలితంగా పుట్టినప్పటి నుంచే 16 ఏళ్ల వరకు వివిధ రకాల టీకాలు గత 70, 80 ఏళ్ల నుంచి అందరూ వేసుకున్న వారమే. తాజాగా ప్రస్తుతం క్షయ(టీబీ)కు వ్యతిరేకంగా పోరాటంలో విశ్వాసార్హమైన బీసీసీ టీకా వేసుకోవాలని జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బీసీసీ టీకా గత కొన్నాళ్లుగా తీసుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఇవే 18 ఏళ్లు పైబడిన వారు ఈ కింద లక్షణాలు కలిగి ఉంటే తీసుకోవచ్చు. గతంలో కానీ ప్రస్తుతం కానీ క్షయ వ్యాధి బారిన పడిన వారు, క్షయ రోగులతో రక్త సంబంధం కానీ ఇరుగుపొరుగున ఉండేవారు, 60 ఏళ్లు నిండిన వయోవృద్ధులు, పౌష్టిక ఆహారం లోపం గల వ్యక్తులు ప్రస్తుతం కానీ, గతంలో కానీ తెగ ధూమపానం చేసేవారు కానీ, మధుమేహం చేసే వారు ఉచితంగా తమ సన్నిహిత, సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సముదాయ ఆరోగ్య కేంద్రం, ఫిర్కా ఆరోగ్య కేంద్రం, తాలూకా ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలోని క్షయ విభాగం, అలాగే కేఎంసీ ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగం జంట నగరాల్లో సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీసీసీ టీకాను వేయించుకోవచ్చు. బీసీసీ టీకా వేయించుకోవాలి అయితే ఆసక్తి ఉందని ఆయా ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తే బీసీజీ వాయిల్ 10 మందికి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 10 మంది కూడే వరకు ఈ టీకాను వేయడానికి కుదరదు. కాబట్టి ఫోన్ నెంబర్లను ఆశా వర్కర్లకు, ఆరోగ్య సిబ్బందికి ఇచ్చి వెళితే వారు ఫోన్ చేసిన సమయంలో సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి బీసీసీ టీకాను వేయించుకొని శాశ్వతంగా క్షయ, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సంబంధిత జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కేఎంసీ ఆస్పత్రిలోని టీబీ విభాగం అయిన రూ.55తో ఆధార్ కార్డుతో వచ్చిన వారు ఎవరైనా ఆ లక్షణాలతో ఉండి ఉంటే ఈ టీకాను తీసుకోవచ్చని, ఈ ప్రక్రియ మొత్తం ఉచితమేనని అధికారులు తెలిపారు. వివరాలకు 1800116666 సహాయవాణి నెంబర్లో సంప్రదించాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు. -
రైలు ప్రయాణికుల పాట్లు
రాయచూరు రూరల్: దసరా పండుగకు రాజధాని నుంచి స్వస్థలాలకు చేరుకున్న కల్యాణ కర్ణాటక రైలు ప్రయాణికులు ఆదివారం రాత్రి తిరిగి రాజధానికి బయలుదేరి రైలులో నానా పాట్లు పడ్డారు. రాయచూరు రైల్వే స్టేషన్లో రైలు బోగీలను పరిశీలించగా ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయాయి. కిక్కిరిసిన బోగీల్లో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణించారు. బోగీల్లో ఎక్కడా అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. లాతూర్ నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఈ రైలులో బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు, ఇతర ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. పండుగ సమయంలో అదనపు రైళ్లు నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, అదనపు బోగీలను అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనే ఆరోపణలున్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాల్లో శుభ్రతకు శ్రీకారం రాయచూరు రూరల్: రాయచూరు రైల్వే స్టేషన్లో రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు శుభ్రతకు శ్రీకారం చుట్టారు. సోమవారం రైల్వేస్టేషన్లో సభ్యుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధాని ఆదేశాల మేరకు ప్రతి రైల్వేస్టేషన్ శుభ్రతకు ప్రాధాన్యత కల్పించాలనే సదుద్దేశ్యంతో రైల్వే కాంపౌండ్లో పెరిగిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించారు. నగరసభ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో స్వచ్ఛత అభియాన్కు నడుం బిగించారు. రైల్వే బోర్డు సలహా సమితి సభ్యులు మారెప్ప, సీతా నాయక్, నవీన్ కుమార్, రమేష్, సిద్దలింగయ్య, మహేష్, అధికారులు అమరేష్, మల్లికార్జున, హేమరాజ్లున్నారు. మొసలి పట్టివేత రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యక్లాస్పూర్లో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. యక్లాస్పూర్ గ్రామం చెరువు పక్కనే ఉండగా చెరువులో నీరు నిండా ఉన్నాయి. కాగా పైభాగంలో నుంచి మొసలి వచ్చిందంటూ చేపలు పట్టే మత్స్యకారులు అప్రమత్తమై మొసలిని పట్టుకొని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. రైతు సమస్యలపై స్పందిస్తాంరాయచూరు రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు యాదగిరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వరదల బారిన పడి నీరు చేరిన పంట పొలాల్లో నష్టం సంభవించిన రైతులకు పరిహారం అందించే దిశలో సమీక్షలపై సర్కార్, మంత్రులు స్పందిస్తారని రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్, యాదగిరి శాసన సభ్యుడు చెన్నారెడ్డి పాటిల్ పేర్కొన్నారు. సోమవారం యాదగిరి తాలూకా వడగేర, బాడియాళ, కట సంగావి ప్రాంతాల్లో పత్తి పంటలను పరిశీలించారు. రైతుల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని అన్నారు. రైతులకు వాటిల్లిన పంట నష్టాలపై సక్రమంగా సర్వే చేసి పరిహారం అందించాలన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతిహుబ్లీ: కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి చెందిన ఘటన తాలూకాలోని వరూరు గ్రామంలో జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఓ యాచకుడు(45) రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్థానిక గోకుల్ రోడ్డులో బన్ని(జమ్మి) చెట్టు దగ్గర ఉన్న మొబైల్ టవర్లో ఏర్పాటు చేసిన సుమారు రూ.1.06 లక్షలు విలువైన పరికరాలను దుండగులు చోరీ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
కల్మఠంలో కుంభమేళా ప్రారంభం
రాయచూరు రూరల్ : జిల్లాలోని మాన్వి కల్మఠంలో దసరా దర్బార్లో భాగంగా కుంభమేళాకు ప్రజా ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. సోమవారం మాన్వి కల్మఠంలో రాయచూరు లోక్సభ సభ్యుడు కుమార నాయక్, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పాల్గొని మాట్లాడారు. హిందూ సంప్రదాయాలను భక్తితో చేపట్టే విషయంలో కల్మఠం ముందుంటుందన్నారు. శ్రీదేవి మహా పురాణం, సువర్ణ దసరా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీశైల, రంభాపురి, కాశీ జగద్గురువులు పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి విరుపాక్ష పండితారాధ్య వారిని సన్మానించారు. రంభాపురి జగద్గురువులను అడ్డ పల్లకీ సేవలో ఊరేగించారు. -
సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి
కోలారు: సరిహద్దుల్లో సైనికుల పహారా, పొలంలో రైతులు వ్యవసాయం చేయడం వల్లనే నేడు దేశం సుభిక్షంగా ఉంది. ప్రభుత్వాలు ఈ రెండు రంగాలకు అధిక ప్రాదాన్యత ఇచ్చినప్పుడే దేశం మరింత బలిష్టంగా మారుతుందని బీకేఎస్ దక్షిణ ప్రాంత ఉపాధ్యక్షుడు ఏ.అప్పాజీ గౌడ తెలిపారు. తాలూకాలోని దుగ్గసంద్రరర్కా దిన్నహళ్లి గ్రామంలో భారతీయ కిసాన్ సంఘ గ్రామ సమితిని ప్రారంభించి మాట్లాడారు. గ్రామ ఐక్యతను కాపాడుకోవాలని సూచించారు. రైతు సమస్యలు, గ్రామ అభివృద్ధిపై ప్రతి వారం సభ నిర్వహించి చర్చించుకోవాలన్నారు. గ్రామ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. వారు స్పందించకపోతే ప్రతిఘటనలకు దిగాలని తెలిపారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆధునిక వ్యవసాయ యుగంలో సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దరు ధరలు అందించాలన్నారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా కోశాధ్యక్షుడు న్యాయవాది వి.జయప్ప, భారతీయ కిసాన్ సంఘానికి చెందిన ఎన్.తమ్మణ్ణ, దిన్నహళ్లి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీరామప్ప, కార్యదర్శి వి.భార్గవరాం, సభ్యుడు కె.విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ ఫైలింగ్.. రేషన్ కటింగ్
శివాజీనగర: లేదు.. లేదంటూనే రాష్ట్రంలో బీపీఎల్ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులనే పేరుతో అన్నభాగ్య కార్డుల తొలగింపు చేపట్టింది. రేషన్ స్టోర్లలో తొలగించిన కార్డుల జాబితాను ప్రదర్శిస్తోంది. మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలకు పైబడింది. అందుచేత మీ రేషన్ను రద్దు చేయబోతున్నాం, ఈ నెల చివరిసారిగా రేషన్ ఇస్తాం, వచ్చే నెల నుంచి బంద్ అని అందులో పేర్కొన్నారు. ఆ ఒక్క కారణంతో రైతులు సేద్యం కోసం రూ. లక్ష, అంతకు మించి అప్పులు తీసుకోవాలంటే ఐటీ ఫైలింగ్ ను చేయాలి, అదే ఎంతోమంది కార్డుల రద్దుకు కారణమైంది, మీరు ఐటీ పన్ను చెల్లింపుదారులు కాబట్టి కార్డును తీసేస్తున్నాం అని అధికారులు చెప్పేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలవారు పిల్లల చదువులకు, బైక్లు కొనడానికి, ఇతరత్రా అవసరాలకు రుణం పొందినా అది కార్డుకు సమస్య అవుతోంది. ఐటీ ఫైలింగ్కు బ్యాంకుల ఒత్తిళ్లు రుణం ఇవ్వాలంటే బ్యాంకుల సిబ్బంది ఐటీ ఫైలింగ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు బాధితులు వాపోయారు. ఐటీ ఫైలింగ్ చేస్తున్న కార్డుదారుల ఆధార్, పాన్ కార్డు వివరాలను పౌరసరఫరా శాఖ సేకరించి వేటు వేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రంలో పలువురి రేషన్ కార్డుల రద్దయినట్లు అధికార వర్గాల సమాచారం. కార్డు కలిగిన కుటుంబంలో ఎవరైనా ఒక్కరు ఐటీ ఫైలింగ్ చేసినా, ఆదాయపు పన్ను కట్టినా కార్డు కట్ అవుతోంది. ఆ కుటుంబాన్ని స్థితిమంతులుగా సర్కారు పరిగణిస్తోంది. ఆ కారణంతో రేషన్ కార్డులను తొలగిస్తోన్న సర్కారు స్టోర్ల ముందు జాబితాలు -
వెట్టి చాకిరీ
మంగళవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్ శ్రీ 2025చిట్టి చేతులు.. సాక్షి, బెంగళూరు: గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వెళ్తుంటే చిన్నారి బాలలు కష్టించి పనిచేస్తూ కనిపిస్తారు. అంగళ్లు, మెకానిక్ షెడ్లు, హోటళ్లు, కర్మాగారాలు, కట్టడ పనుల్లో నలిగిపోతుంటారు. కన్నడనాట బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా, కోట్లు ఖర్చు పెడుతున్నా మార్పు రావడం లేదు. కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత, బాలల అక్రమ రవాణా తదితర ఎన్నో కారణాల వల్ల పిల్లలు కార్మికులుగా మగ్గిపోతున్నారు. వారికి విద్య, ఆహారం, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు దక్కడం లేదు. ఎవరూ కూడా 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోరాదు, అతిక్రమించిన వారు శిక్షార్హులవుతారు. కానీ ఎవరూ పాటించడం లేదు. తక్కువ కూలీకే వస్తారని పిల్లలతో పనిచేయిస్తున్నారు. అప్పుడప్పుడూ దాడులు బాల, కిశోర వర్గ కార్మికుల నిషేధ, నియంత్రణ చట్టం–1986 సెక్షన్ 16,17 కింద ప్రభుత్వం 11 శాఖల అధికారులను పర్యవేక్షణాధికారులుగా నియమించింది. వీరి ద్వారా తరచూ తనిఖీలు చేపడుతూ బాల కార్మికులను గుర్తించి వారిని రక్షిస్తూ వస్తోంది. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో 1,599 కేసులు నమోదు అయ్యాయి. 2,834 మంది బాల కార్మికులను రక్షించారు. అయితే సరైన పునరావాస చర్యలు లేక ఆ బాలలు మళ్లీ పనులకు వెళ్తున్నట్లు సేవాసంస్థల కార్యకర్తలు చెబుతున్నారు. ఏటా రూ.6 కోట్ల వ్యయం బాల కార్మిక పద్ధతి నిర్మూలన కోసం కార్మిక శాఖ అవగాహన జాతాలను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రతి ఏటా సుమారు రూ. 2 కోట్ల నుంచి రూ 6 కోట్ల వరకు ఖర్చు కూడా చేస్తున్నారు. 2020 నుంచి ఈ ఏడాది వరకు రూ 23.46 కోట్లు ఇందుకు వెచ్చించారు. కానీ ఫలితాలు కనిపించడం లేదు. పైగా ప్రతి ఏటా వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కోవిడ్ కొరడా కోవిడ్ విపత్తు అనేక కుటుంబాలను పేదరికంలోకి నెట్టేసింది. ఆ తరువాత బాల కార్మికుల సంఖ్య మరింతగా అధికమైంది. 2023 నుంచి 2025, జూన్ వరకు అధికారులు దాడులు జరిపి 651 బాల కార్మిక కేసులను నమోదు చేశారు. బాలలను పనిలో పెట్టుకున్నందుకు 50 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. సుమారు రూ. 31.91 లక్షల మేర జరిమానాలు వసూలు చేశారు. 2023 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 123 కేసులు ఒక్క బెంగళూరులోనే వచ్చాయి. ఈ మూడేళ్లలో 88 పిల్లలను అధికారులు రక్షించారు. మొత్తం 57 కేసులు కోర్టులో విచారణకు రాగా, ఇందులో 8 కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడ్డాయి. అనేక కేసుల్లో బాధితులు తెరవెనుక రాజీ పడుతుంటారు. చదువు లేదు. ఆటపాటలు లేవు. సరైన పోషకాహారం అందదు. లేత చేతులు రాళ్లు కొడుతూ, గిన్నెలు, కప్పులు కడుగుతున్నాయి, బరువులు మోస్తున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లో సమిధలవుతున్నారు. పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. పేదరికం, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇందుకు కారణమని చెప్పక తప్పదు. సమాజాన్ని పీడిస్తున్న బాల కార్మిక దురాచారం చదువు సంధ్యలకు బాల్యం దూరం ఫలించని జాగృతి కార్యక్రమాలు ఐదేళ్లలో 1,599 కేసుల నమోదు -
చెట్టు.. తీసింది ఊపిరి
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరానికి చెట్లు ఎంత అందాన్ని ఇస్తాయో అంతే ముప్పుగా కూడా మారాయి. ఎప్పుడు ఏది విరిగిపడి ప్రాణం తీస్తుందో తెలియడం లేదు. చెట్టు పడి యువతి దుర్మరణం చెందగా, మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన సిటీలో సోలదేనహళ్లిలో జరిగింది. హెబ్బాళకు చెందిన కీర్తన (24) మృతురాలు కాగా, మరో బైకిస్టు భాస్కర్, రాధ క్షతగాత్రులు. గతంలో ఫిర్యాదు ఈ ఘటనతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోలదేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను కొట్టివేయాలని ఎన్నిసార్లు పాలికె సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. పడిపోయిన చెట్టు ఏడాది నుంచి ప్రమాదకరంగా ఉందని చెప్పారు. కూలిపడి యువతి మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు బెంగళూరులో విషాద ఘటన -
దెయ్యాలు బాబోయ్
మండ్య: సోషల్ మీడియాలో వైరల్ కావాలని చిత్ర విచిత్రమైన వీడియోలను తయారు చేస్తూ ఉంటారు కొందరు. అదే కోవలో దెయ్యాలు తిరుగుతున్నాయని, కనిపించినవారిపై దాడులు చేస్తున్నాయని వీడియోలు తీసిన ఓ ఘనుని ఉదంతమిది. మండ్య జిల్లాలోని నాగమంగలలో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణవాసి గోపి యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాడు. దేవలాపుర హ్యాండ్పోస్ట్ వద్ద దెయ్యాలు తిరుగుతున్నాయని, అవి ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నాయని ఓ వీడియోను సృష్టించి పోస్ట్ చేశాడు. అందులో ఓ మహిళ దయ్యం మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ వీడియో చూసిన ప్రజలు నిమేననుకుని హడలిపోయారు. ఈ విషయం పోలీసులకు తెలిసి గోపిని పిలిపించారు. ఎలాంటి దయ్యాలు లేవని, వ్యూస్ కోసం నకిలీ వీడియోను రూపొందించానని గోపి చెప్పాడు. ఆ వీడియోను తొలగించాడు. ఎలాంటి దయ్యాలు లేవు, ప్రజలు భయపడకండి అని పోలీసులు ఫ్యాక్ట్ చెక్ అని ఓ పోస్టింగ్ను ఉంచారు. ఓ యూట్యూబర్ నకిలీ వీడియోలు దండించిన మండ్య పోలీసులు -
భర్త వేధింపులకు భార్య బలి
దొడ్డబళ్లాపురం: ఆడపిల్ల పుట్టిందని భర్త వేధిస్తుండడంతో కలత చెందిన భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు లగ్గెరె లోని మునేశ్వర బ్లాక్లో జరిగింది. రక్షిత (26) మృతురాలు. ఈమెకు 4 ఏళ్ల క్రితం కుణిగల్కు చెందిన రవీశ్తో పెళ్లయింది. లగ్గెరెలో నివసిస్తున్నారు. వీరికి ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల పుట్టింది, మగపిల్లాడు లేడంటూ రవీశ్ నిత్యం భార్యను నరక యాతనకు గురిచేసేవాడు. దీంతో ఆవేదన చెందిన రక్షిత ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తెను రవీశ్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రక్షిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని చిదిమిన కారు శివాజీనగర: రివర్స్ తీసుకునేటపుడు కారు మీద నుంచి వెళ్లడంతో 11 నెలల బాలుడు బలైన ఘటన బెంగళూరు కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధి కెంపేగౌడ నగరలో సోమవారం ఉదయం జరిగింది. వివరాలు.. స్వామి అనే వ్యక్తికి అక్కడ నాలుగు ఇళ్లు ఉండగా బాడుగకు ఇచ్చాడు. వీటిలో ఒక ఇంట్లో ఉండే బంధువులను చూడాలని కుణిగల్ నుంచి వారం క్రితం ఓ కుటుంబం వచ్చింది. వారి పిల్లాడు అజాన్ (11 నెలలు) ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాడు. చిన్నారిని చూడకుండా యజమాని స్వామి కారును రివర్స్ తీసుకొన్నారు. కారు బాలుని మీద నుంచి వెళ్లిపోయింది. చిన్నారి ఆర్తనాదాలు విని తల్లిదండ్రులు పరుగున వచ్చి దగ్గరిలోని ఆసుపత్రికి తీసుకొళ్లారు, తీవ్ర గాయాలైనందున బాలుడు కొంతసేపటికే మరణించాడు. స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. కులగణన ఉద్యోగిపై దాడి మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణంలో కులగణన సమీక్ష కోసం ఇంటింటికీ తిరుగుతున్న ఉద్యోగి మీద ఓ వ్యక్తి దాడి చేసి దాఖలాలను చించిపడేశాడు. గంజాం ప్రాంతంలో అబ్దుల్ గఫార్ అనే వ్యక్తి కులగణన కోసం వచ్చిన ఉద్యోగి జనార్ధన్ పైన దాడి చేశాడు. రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వాలని గఫార్ను ఆయన అడిగాడు, దానికి అతడు నిరాకరించడంతో పాటు వాదనకు దిగి ఇష్టానుసారం దూషించి కొట్టాడు. దాఖలాలను లాక్కుని చించి పడేశాడు. దీంతో జనార్ధన్ కన్నీరుమున్నీరయ్యాడు. వృద్ధుడు డిజిటల్ అరెస్టు, రూ. 21 లక్షలు దోపిడీ మైసూరు: ఈడీ అధికారులమంటూ వృద్ధున్ని బెదిరించి రూ.21.5 లక్షలను ఆన్లైన్లో దోచుకున్నారు. మైసూరులో ఈ ఘరానా మోసం జరిగింది. వివరాలు.. మేటెగళ్ళికి చెందిన వృద్ధుడు (77)కి దుండగులు వాట్సాప్లో వీడియో కాల్ చేశారు. తాము ఈడీ అధికారులమని, నీ వద్ద అక్రమ నగదు ఉందని సమాచారం వచ్చిందని బెదిరించారు. నిన్ను బంధించి తనిఖీ చేయాలని కేసు నమోదైందని, ఇందుకు సహకరించాలన్నారు. నీ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వెంటనే తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, నీవు ఏ తప్పు చేయకుంటే నగదు వెంటనే వెనక్కి పంపిస్తామని అన్నారు. భయభ్రాంతులకు గురైన వృద్ధుడు తన ఖాతాల్లో ఉన్న రూ.21.5 లక్షలను వారికి బదిలీ చేశాడు. తరువాత దుండగుల ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయానని తెలిసి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. చిరుత పట్టివేత మైసూరు: చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేటె తాలూకాలోని కరకలమాదళ్ళి గ్రామంలో కొన్నిరోజులుగా ఓ చిరుత చొరబడుతోంది. మేకలు, గొర్రెలను చంపి ఎత్తుకెళ్తోంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేయగా, ఆదివారం రాత్రి చిరుత బోనులోకి చిక్కింది. -
చాముండి గిరులపై రథ సంభ్రమం
మైసూరు: మైసూరు విజయదశమి పండుగ ముగిసిన తరువాత చాముండి కొండపై సంప్రదాయంగా జరిగే అమ్మవారి రథోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. రాజ ప్రముఖులు, వేలాదిమంది భక్తుల మధ్య తేరు ఉత్సవం కమనీయంగా సాగింది. జిల్లా నుంచే కాకుండా బెంగళూరు, కేరళ, తమిళనాడు నుంచి భక్తజనం రావడంతో చాముండిగిరులు కిటకిటలాడాయి. రాజవంశీకుల హాజరు వివిధ రకాల ఆభరణాలతో పాటు వైవిధ్య పుష్పాలతో చాముండేశ్వరి దేవిని, ఉత్సవ విగ్రహాన్ని అర్చకులు ముస్తాబు చేశారు. ఉదయం 9:32 నుంచి 9:52 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఉత్సవమూర్తిని తేరులో ప్రతిష్టించి జై చాముండేశ్వరి అని నినదిస్తూ తేరును లాగారు. మైసూరు ఎంపీ, రాజవంశీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయార్, త్రిషిక కుమారి దంపతులు, రాజమాత ప్రమోదాదేవి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సంప్రదాయ ప్రకారం 21 సార్లు గాలిలోకి తుపాకులను పేల్చి అమ్మవారికి గౌరవ వందనం చేశారు. భక్తులు రథంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. చాముండి బెట్ట మీద తేరు ఉత్సవం వైభవోపేతంగా అమ్మవారి వేడుక -
సెంట్రల్ జైల్లో రౌడీ బర్త్డే.. వీడియో వైరల్
సెంట్రల్ జైలు అంటే ఎంత సెక్యురిటీ ఉంటుందో అందరికీ తెలిసింది. కారాగారంలో ఉన్నవారిని కలవాలంటే చాలా తతంగం ఉంటుంది. ఏదైనా తీసుకెళ్లాలన్న కూడా చాలా రూల్స్ ఉంటాయి. అలాంటిది సెంట్రల్ జైలులో ఏకంగా ఓ రౌడీ తన అనుచరులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జైలు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదంతా ఎలా జరిగిందో విచారణ చేపడతామని చెబుతున్నారు.బెంగళూరు పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఈ ఘటన వెలుగు చూసింది. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న రౌడీ షీటర్ శ్రీనివాస అలియాస్ గుబ్బచ్చి సీనా (Gubbachhi Seena) కేక్ను కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నాడు. అతడు కేక్ కట్ చేస్తుండగా చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ కనిపించారు. ఆపిల్ పండ్లతో తయారు చేసిన దండను అతడి మెడలో వేశారు. ఈ వీడియోను ఒక ఖైదీ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 50 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.వీడియో ఎలా తీశారు?జైలులో రౌడీషీటర్ బర్త్ డే చేసుకోవడమే కాకుండా, దాన్ని సెల్ఫోన్లో వీడియో కూడా తీయడంపై విమర్శలు వస్తున్నాయి. జైలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు కారాగారం లోపలవున్న తమ వారి భద్రతపై ఖైదీల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ఖైదీ వీడియోను ఎలా రికార్డ్ చేయగలడనే దానిపై కూడా వారు కూపీ లాగుతున్నారు.ఎవరీ సీనా?రౌడీ షీటర్ శ్రీనివాస తన ప్రత్యర్థి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరులోని దొడ్డ బొమ్మసంద్రలో తన ప్రత్యర్థి వెంకటేష్ను హత్య చేసినట్లు సీనాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో దొరక్కుండా తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కాలికి గాయమైంది.Criminals in Comfort Video Shows Rowdy-Sheeter Enjoying Royal Treatment in Karnataka’s Parappana Agrahara JailParappana Agrahara Central Jail is once again under the spotlight, this time for a shocking display of privilege to a rowdy sheeter. Notorious Srinivas, alias Gubbachi… pic.twitter.com/bpdzxGLH19— Karnataka Portfolio (@karnatakaportf) October 5, 2025భాస్కరరావు ఫైర్ఈ వ్యహహారంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, బీజేపీ నేత భాస్కరరావు ఎక్స్లో స్పందించారు. 'కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పరప్పణ అగ్రహార జైలు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. జైలులోకి ఒక భారీ కేక్ ప్రవేశించింది. జైలులో ఉన్న మినీ రౌడీలతో కలిసి ఒక రౌడీ తన పుట్టినరోజును జరుపుకున్నాడు. అంతేకాదు దీన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. కర్ణాటకలో పాలన కుప్పకూలిపోయింది. సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు అవినీతి గురించి బహిరంగంగా ఏడుస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ యువత వీధుల్లోకి వచ్చారు. బెంగళూరు పరిపాలన గుంతలు, చెత్తతో చెత్తగా ఉంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారు. శాంతిభద్రతలు క్షీణించాయ'ని ఎక్స్లో పోస్ట్ చేశారు. Parrapana Agrahara Jail is in news again !!!!! A massive cake enters the jail and a rowdy with all his incarcerated mini Rowdies celebrate his birthday with total impunity and the same is recorded and uploaded on Social Media…..!!!!!!🤣🤣🤣🤣@DrParameshwara has now abdicated &… pic.twitter.com/DsQxPi4kVj— Bhaskar Rao (@Nimmabhaskar22) October 5, 2025గతంలోనూ.. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో గతంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. 2020, డిసెంబర్లో రిజ్వాన్ అలియాస్ రౌడీ కుల్లా తన మద్దతుదారులతో కలిసి తన పుట్టినరోజును జరుపుకోవడమే కాక, దాన్నంతా సెల్ఫోన్లో చిత్రీకరించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అటాచ్ చేసి మరీ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం అప్పట్లో విస్తృత చర్చ జరిగింది. పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. దర్యాప్తు చేస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు పునరావృతంఅవుతున్నాయని కర్ణాటక ప్రజలు అనుకుంటున్నారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులు -
అస్తవ్యస్తంగా బళ్లారి నగరాభివృద్ధి
సాక్షి బళ్లారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో. బళ్లారి మహానగర పాలికె అని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ నగరాభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది. మున్సిపాల్టీ స్థాయి నుంచి మహానగర పాలికెగా అప్గ్రేడ్ అయి 15 సంవత్సరాలు గడిచింది. పాలికెకు ఉండాల్సిన ఉన్నతాధికారులు కానీ ఆయా శాఖల ఇంజినీర్లు కానీ, చివరకు నగరంలో స్వచ్ఛత చేయాల్సిన పారిశుధ్య కార్మికులను తగినంత మందిని ప్రభుత్వం నియమించ లేదు. నగరాభివృద్ధి నత్తనడకన సాగుతోంది. ఓ వైపు నగరంలో రోజురోజుకు జనాభా కూడా పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఇతర వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. పారిశ్రామిక, స్టీల్ జిల్లా కేంద్రంగా పేరొందిన బళ్లారి నగరంలో 39 వార్డులకు గాను నగరాభివృద్ధి చేయడానికి మూడు డివిజన్లను ఏర్పాటు చేశారు. రాయల్ సర్కిల్, గాంధీనగర్, సుధా క్రాస్, కౌల్బజార్ మొదటి గేటు వద్ద మూడు డివిజన్లకు సంబంధించిన కార్యాలయాలతో పాటు మహానగర పాలికె ప్రధాన కార్యాలయం కూడా ఉంది. ఖాళీగా 26 ఇంజినీర్ల ఉద్యోగాలు నగరాభివృద్ధిలో రోడ్లు, డ్రైనేజీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ముఖ్యంగా ఇంజినీర్ల అవసరం ఉంటుంది. నగరంలో జనాభా, విస్తీర్ణంతో పోల్చితే పాలికె కనీసం 55 మంది ఇంజినీర్లను నియమించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 19 మంది ఇంజినీర్లు మాత్రమే ఆయా డివిజన్లలో పని చేస్తున్నారు. మిలిగిన 26 మందికి పైగా ఇంజినీర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఓ వైపు మహానగర పాలికె నుంచి ఎమ్మెల్యే నిధులు, పీడబ్ల్యూడీ శాఖల నుంచి రూ.200 కోట్లకు పైగా అభివృద్ధి పనుల పేరుతో ప్రధాన రహదారులతో పాటు ఆయా వార్డుల్లో రోడ్ల విస్తీర్ణం, డ్రైనేజీ పనులు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండటంతో ఆయా రహదారుల్లో వెళ్లేందుకు జనం నరకయాతన అనుభవిస్తున్నారు. ఒక్కొక్క రోడ్డు పని నెలలు తరబడి పూర్తి చేయకపోవడంతో జనం గమ్యస్థానాలను చేరేందుకు కిలోమీటర్ల కొద్ది తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మౌలిక సౌకర్యాల కల్పనలో విఫలం నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో పాలికె ఆదాయం పెరుగుతోంది. అయితే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలువినిపిస్తున్నాయి. మూడు డివిజన్లలో సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు. ఏళ్ల తరబడి సిబ్బంది కొరత ఉందంటున్నారే కానీ ..ఆ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంలో పాలకులు శ్రద్ధ వహించడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ సిటీ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన తర్వాత తగినంత సిబ్బందిని ఆయా శాఖలకు సంబంధించి అధికారులను నియమించకపోవడంతో నగరాభివృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని అభిప్రాయం వెల్లడిస్తున్నారు. నగరంలో దాదాపు 170 మందికి పైగా విద్యుత్, రెవెన్యూ, ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు, వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉండటంతో ఉన్న సిబ్బందికి పని భారమవుతోందని పలువురు అధికారులు వాపోతున్నారు. ఓ వైపు సిబ్బంది కొరత మరో వైపు ఇంజినీర్ల లేమి ఉన్న సిబ్బందికి పనిభారం పాలికెగా అప్గ్రేడైనా భర్తీ కాని పోస్టులు పట్టించుకోని ప్రజాప్రతినిధులు చెత్త సేకరణకూ ఇబ్బందులే అభివృద్ధి మాట అటు ఉంచితే నగర స్వచ్ఛతను కాపాడే పారిశుధ్య కార్మికులు, ఇంటింటా చెత్తను సేకరించే సిబ్బంది తగినంత మంది లేరు. దీందో నగరంలో చెత్త సేకరణ, పారిశుద్ధ్య సమస్య కూడా రోజు రోజుకు జటిలమవుతోంది. పారిశుధ్య కార్మికులు తగినంత మంది లేకపోవడంతో ఉన్న సిబ్బంది నగర స్వచ్ఛత చేయడానికి అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ఆయా వార్డుల్లో డ్రైనేజీ పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. రోడ్లలో చెత్త చెదారం ఎక్కడపడితే అక్కడ వేస్తున్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఇది స్టీల్ సిటీనా, మహానగర పాలికేనా లేక మున్సిపాల్టీనా, పురసభ అనే అనుమానం కలుగుతోందని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నగరంలో మహానగర పాలికె పరిధిలోని సిబ్బంది కొరతను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ప్రమాదంలో అక్కాతమ్ముడు దుర్మరణం
రాయచూరు రూరల్: రహదారి ప్రమాదంలో అక్కా తమ్ముడు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం మాన్వి తాలుకా పోత్నాళ్ వద్ద కారు–ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. రోడ్డు ప్రమాదంలో కరేగుడ్డకు చెందిన మరియమ్మ (28), శేఖరప్ప (25) మృతి చెందినట్లు మాన్వి పోలీసులు గుర్తించారు. వల్కం దిన్ని నుంచి కరేగుడ్డకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. దేశాయి క్యాంప్కు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మరియమ్మ, శేఖరప్ప అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిందనూరు డీఎస్పీ తెలిపారు. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ హొసపేటె: విజయనగర జిల్లా కొట్టురు పట్టణంలోని ఒకే రాత్రి నాలుగు ఇళ్ల తాళాలు పగులగొట్టిన దొంగలు.. రూ.97 వేల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ముదుకనకట్టె ప్రాంతంలోని నాలుగు ఇళ్లకు తాళం వేసి ఉండటంతో దొంగలు వాటిని పగులగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీటిలో మూడు ఇళ్లు ఖాళీగా ఉండటంతో ఏమీ కనిపించలేదు. అయితే వారు జి.విరుపాక్షప్ప ఇంట్లో బంగారం నెక్లెస్, చెవిపోగులు, ఉంగరం, 2 వెండి ప్లేట్లు, 2 వెండి గ్లాసులను దొంగలించారు. సమాచారం అందుకున్న డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి, దురుగప్ప, పీఎస్ఐ గీతాంజలి షిండే సంఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు వచ్చారు. రద్దీగా ఉండే సందులో దొంగతనం జరగడం ఆశ్చర్యకరం. ఈ కేసులో దొంగలను గుర్తించడానికి పట్టణంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, ప్రజలు పోలీస్ స్టేషన్, 112 లేదా పోలీస్ హెల్ప్లైన్ 18005700కు కాల్ చేసి సమాచారం అందించాలని డీవైఎస్పీ మల్లేష్ దొడ్డమణి కోరారు. ఆకట్టుకున్న పథ సంచలనంహుబ్లీ: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అలాగే విజయదశమి సందర్భంగా నగరంలో కరసేవకులు కదం తొక్కారు. నెహ్రూ మైదానంలో నిర్వహించిన పథ సంచలనం అందరినీ ఆకట్టుకుంది. తొలుత ఒకటవ పథ సంచలనం కృష్ణభవన, సర్ సిద్దప్ప కంబలి మార్గం, సంగొళ్లి రాయన్న సర్కిల్, తొలిజా భవన్ సర్కిల్, శంకరమఠం, హిరేపేట, బెళగవి గల్లి, అలాగే 2వ మార్గం నెహ్రు మైదానం నుంచి ప్రారంభమైంది. జేసీ నగర్, శక్తి రోడ్డు, స్టేషన్ రోడ్డు, గణేష్ పేట సర్కిల్, సీబీటీ, మకాన్దారి గల్లి, మంగళవార పేట, రాధకృష్ణగల్లి మీదుగా కొనసాగింది. అనంతరం ఈ రెండు పథ సంచలన దుర్గదబైలు సర్కిల్లో కలిశాయి. బ్రాడ్వే, శివాజీ సర్కిల్, కొప్పికర్ రోడ్డు, కృష్ణ భవన మార్గం మీదుగా తిరిగి నెహ్రూ మైదానం చేరుకున్నాయి. అనంతరం జరిగిన వేదిక కార్యక్రమంలో దేశ భక్తి పరిడవిల్లెలా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు తన ప్రసంగంలో మాట్లాడారు. పథ సంచలనం జరిగిన చోట్ల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు హుబ్లీ: రెండు ఏళ్లలో నవళగుంద అసెంబ్లీ నియోజక వర్గానికి కురుబ సమాజం కనక భవనం అలాగే ఇతర అభివృద్ధి నిర్మాణ పనులకు సుమారు రూ.4 కోట్ల నిధులు విడుదల చేశానని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్హెచ్ కోనరెడ్డి తెలిపారు. ఆదివారం అణ్ణిగేరిలోని ఉడేదబైల వీధిలోని బీమలింగేశ్వర, నందీశ్వర భజన సంఘం ఆధ్వరంలోని లక్ష్మీదేవి విగ్రహం, నందీశ్వర అలాగే పొట్టేళ్ల మూర్తుల ప్రతిష్టాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అణ్ణిగేరి దాసోహమఠం డాక్టర్.శివకుమార్ స్వామి, ప్రమఖులు శివానంద, యల్లప్ప, షణ్ముఖ, విరుపాక్షప్పతో పాటు గ్యారెంటీ తాలూకా సమితి అధ్యక్షుడు మంజునాథ తదితరులు పాల్గొన్నారు. చెరుకు పంట దగ్ధం హొసపేటె: కంప్లి తాలూకా సమీపంలోని బుక్కసాగర్ శివారులో విద్యుత్ షాక్తో చెరుకు పంట పూర్తిగా కాలిపోయింది. కిన్నూరేశ్వర ఆలయం సమీపంలోని సర్వే నంబర్ 118, 119లో సుమారు 4 ఎకరాల 110 సెంట్ల భూమిలో చెరుకు సాగు చేశారు. పంట కోతకు రాబోతున్న తరుణంలో పొలంలో ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ ఘటనలో చెరుకు తోట పూర్తిగా కాలిపోయింది. ఎకరా చెరుకు సాగుకు రైతులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. నష్టానికి పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ఆర్ఐ మహమ్మద్ షరీఫ్, వీఏ మౌనేషా, జేఈసీఓఎం జేఈ కృష్ణమూర్తి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. చెరకు పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సమాజ అసమానతలు పోవాలి కోలారు: అంతర్జాతి (కులాంతర) వివాహాలతోనే సమాజంలో అంటరానితనం నివారణ అవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ రవి తెలిపారు. సమాజంలో అసమానతలు కూడా తొలగిపోతాయన్నారు. ఆదివారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో సహభోజనం నిర్వహించగా ఆయన పాల్గొన్నారు. సమ సమాజ నిర్మాణం కోసం గాంధీజీని స్మరించుకుంటే సరిపోదు, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు.ప్రయత్నంతో మాత్ర మే మార్పులు సాధ్యమవుతాయన్నారు. అన్ని సంఘ సంస్థలు ఈ ప్రయత్నానికి చేతులు కలపాలన్నారు. జిల్లా ఎస్పీ బి.నిఖిల్ మాట్లాడుతూ సమాజ ఉద్ధారణ కార్యక్రమాలను సమాజంలోని ప్రతి గ్రామాలకు మూలలకు తీసుకుని వెళ్లాలన్నారు. అన్నదాన దాత చంద్రశేఖర్ను సన్మానించారు. కులాలను పాటించం అంటూ అందరూ ప్రతిజ్ఞ చేశారు. కసాప అధ్యక్షుడు గోపాలగౌడ, టి విజయకుమార్, పండిత్ మునివెంకటప్ప, ఏడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
కురుబలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు
హొసపేటె: జిల్లా పరిపాలన, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ సహకారంతో ఈనెల 7న జరగనున్న వాల్మీకి జయంతిని బహిష్కరించాలని వాల్మీకి నాయక సమాజం నిర్ణయించిందని సంఘం అధ్యక్షుడు గోసాల భరమప్ప, ప్రధాన కార్యదర్శి దేవరమనే శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్క్లబ్లో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం కురుబ సమాజకులను ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీలో చేర్చరాదని డిమాండ్ చేశారు. ఇందుకోసం నాయక సమాజం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోందని తెలిపారు. అయితే ఈ అంశంపై ఏ పార్టీ నాయకుడూ తన స్వరం వినిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో సమాజ స్వామిజీ సహా వాల్మీకి జయంతిలో మాత్రమే కాకుండా ఏదైన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పాల్గొకూడదని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు స్పందించక పోవడం సరికాదన్నారు. కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చితే సహించేది లేదని పేర్కొన్నారు. తమ నిరసనను కొనసాగిస్తామని,.. జయంతి తర్వాత పోరాటపై చర్చిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కిన్నాళ్ హనుమంత, బేల గోడ అంబన్న, గుడుగుడి సోమనాథ్, గుజ్జల చంద్రశేఖర్, దేవేంద్రప్ప, కరి హనుమంత, శ్రీకంఠ, వసంత్, బేలగోడ అంబన్న మల్లికార్జున పాల్గొన్నారు. -
విజయపురలో కదం తొక్కిన నిరుద్యోగులు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఆదివారం విజయపురలో ఏఐడీవైఓ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐడీవైఓ రాష్ట్ర కార్యదర్శి భవాని శంకర్ గౌడ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుని కాలం గడపడాన్ని తప్పు బట్టారు. బాధిత కుటుంబానికి చెక్కు అందజేతరాయచూరు రూరల్: దద్దల్ తుంగభద్రలో ఇటీవల పిడుగుపాటుకు మృతి చెందిన దేవప్ప కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ తెలిపారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం దేవప్ప కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. క్రేన్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిహుబ్లీ: గుర్తు తెలియని వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం ఇక్కడి పాత బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. కిత్తూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి వస్తున్న క్రేన్ వాహనం సదరు వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చు. ఈ మేరకు ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని బలిగొన్న ఈత సరదా రాయచూరు రూరల్: సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు నీటి మునిగి మృతి చెందారు. ఈ ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. లింగసూగురు తాలుకా ముదుగల్కు చెందిన యలాలింగ (28), వెంకటేష్ (28) మస్కిలో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా చూసిన అనంతరం వీరు మస్కి వద్ద ప్రవహిస్తున్న తుంగభద్ర ఎడమ కాలువలో ఈతకొట్టేందుకు దిగారు. అయితే వీరికి సరిగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ పేర్కొన్నారు. కసాప అధ్యక్షుడిగా విజయ రాజేంద్ర రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా కన్నడ సాహిత్య పరిషత్ అద్యక్షుడిగా డా.బి.విజయ రాజేంద్రను నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం ఓ పక్రటన విడుదల చేశారు. కసాప గౌరవ కార్యదర్శిగా రావుత రావ్, కార్యదర్శిగా ప్రతిభ, కోశాధ్యక్షుడిగా సయ్యద్ హఫీజుల్లా ఖాద్రి, సంఘటన కార్యదర్శిగా శరణప్ప, రేఖా పాటిల్, సభ్యులుగా దేవేంద్రమ్మ, వైశాలి పాటిల్, అమరేష్, ఖాన్ సాబ్, అశోక్ కుమార జైన్, మంజునాథ్ పాటిల్, విజయ కుమారి, వెంకటేష్ను నియమించారు. రూ.1.50 కోట్లతో తాయమ్మ చెరువు అభివృద్ధిరాయచూరు రూరల్: నగరంలో తాయమ్మ చెరువు అభివృద్ధికి రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ వెల్లడించారు. ఆదివారం గద్వాల రహదారిలోని తాయమ్మ చెరువు పునరుద్ధరణకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూగర్భ జలాల పెంపుదలలో భాగంగా జిల్లాలో చెరువుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతోందన్నారు. తాగు, సాగు సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు కూరగాయలు పండించుకుని జీవనోపాధి పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, రుద్రప్ప, శాంతప్ప, అమరే గౌడ, జయన్న, రాజు, సుభాష్, నరసింహలు, శాలం, అధికారులు పాల్గొన్నారు. -
కులగణనలో కుక్కల దాడి
● టీచరమ్మకు తీవ్ర గాయాలు యశవంతపుర: జనగణన చేస్తున్న ఉపాధ్యాయులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో జరిగింది. జైభీమ్ నగరలో ఉపాధ్యాయురాలు చిక్కమ్మ కుల సమీక్షకు వెళ్లారు. వీధి కుక్కలు ఆమెను వెంబడించి కరిచాయి. ఆమెను రక్షించడానికి వెళ్లిన ఏడు మందిపైనా స్వైర విహారం చేశాయి. భయపడిన వారు అక్కడ నుంచి పరుగులు తీశారు. తీవ్ర గాయాల పాలైన చిక్కమ్మ పట్టణంలో జిహెచ్పిఎస్ పాఠశాలలో పని చేస్తున్నారు. ఈ ఘటనలో శివకుమార్, ధర్మ, పృ థ్వి, సచిన్తో పాటు 7 మంది కూడా కుక్కల వల్ల గాయపడ్డారు. అక్కడ ఆటలాడుతున్న కిషన్ అనే బాలున్ని కరిచాయి. జనగణన చేయడానికి చిక్కమ్మకు ఆదివారం చివరి రోజు. మూడు ఇళ్లు మిగిలి ఉండగా భర్తతో కలిసి వెళ్తుండగా వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. ఆమెకు ముఖం, తల మీద తీవ్రగాయాలు తగిలాయి. బాధితులందరూ బేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే సురేశ్ పరామర్శించారు. రాష్ట్రంలో పలువురు ఉద్యోగులు కులగణనకు వెళ్తూ ప్రమాదాల బారిన పడ్డారు. మంత్రి స్పెషల్ ఆఫీసరు లంచాల మోజుదొడ్డబళ్లాపురం: ఇంధన మంత్రి పనులు చూసుకునే స్పెషల్ ఆఫీసర్ ఒకరు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు... విద్యుత్శాఖ మంత్రి కేజే జార్జ్కు స్పెషల్ ఆఫీసర్గా కేపీటీసీఎల్ ఈఓ జ్యోతిప్రకాశ్ పనిచేస్తున్నారు. బ్యాడరహళ్లి నివాసి అనంతరాజు తాను నిర్మిస్తున్న లేఔట్కి విద్యుత్ కనెక్షన్ కోసం ఎన్ఓసీ కావాలని దరఖాస్తు చేశాడు. అయితే జ్యోతిప్రకాశ్ రూ.1లక్ష లంచం డిమాండు చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు. రూ.50 వేలు తీసుకుంటుండగా జ్యోతిప్రకాశ్, అతని కారు డ్రైవర్ నవీన్ను లోకాయుక్త పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. రియాల్టీ సంస్థకు ఈడీ షాక్● రూ. 423 కోట్ల ఆస్తుల సీజ్ బనశంకరి: రాజధానిలో రియాల్టీ సంస్థకు చెందిన రూ.423 కోట్ల విలువచేసే స్థిరాస్తులను ఈడీ జప్తుచేసింది. అక్రమ నగదు బదిలీ ఆరోపణలు రావడమే కారణమని ఈడీ తెలిపింది. ఫ్లాట్లు, ఇళ్లు ఇస్తామని జనం నుంచి రూ.927 కోట్లు వసూలు చేశారు. కానీ గడువులోగా కేటాయించలేదు. పైగా జనం నుంచి సేకరించిన డబ్బుతో కుటుంబసభ్యుల పేర్ల మీద ఆస్తులను కొనుగోలు చేశారు. ఫిర్యాదులు రావడంతో కస్టమర్ల హితాసక్తిని కాపాడేందుకు సదరు సంస్థ యజమాని వాసుదేవన్, భార్య, కుటుంబీకుల పేర్లతో ఉన్న ఇళ్లు, స్థలాలు, 4.5 ఎకరాల వాణిజ్య భూమి, మూడిగెరె కన్నెహళ్లి గ్రామంలో 179 ఎకరాల భూమి తదితరాలతో కలిపి రూ.423 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. -
రాచనగరిలో అదే సందడి
మైసూరు: రాచనగరిలో దసరా మహోత్సవాలు ముగిసినా కూడా పర్యాటకుల సంఖ్య పర్యాటకులు మాత్రం తగ్గడం లేదు. జంబూసవారీని వీక్షించాలని వచ్చిన టూరిస్టులు, ఇతర జిల్లాలవారు నగరంలోనే మకాం వేశారు. మైసూరుతో పాటు పరిసర ప్రాంతాలలోని చారిత్రక కట్టడాలను తిలకిస్తూ గడుపుతున్నారు. ఆహారమేళాతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ హోటళ్లలో భోజనాలు ఆరగిస్తూ నగర పర్యటనలో నిమగ్నమయ్యారు. సాయంత్రం కాగానే నగర కూడళ్లలో విరాజిల్లుతున్న విద్యుత్ కాంతులను చూస్తూ ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. దాంతో సాయంత్రం 6 గంటల నుంచి సిటీలో ఎక్కడ చూసినా జనం, కార్ల సందడి నెలకొంటోంది. ఈ నెల, 12వ తేదీ వరకు దీపాలంకరణ కొనసాగుతుంది. విదేశీ టూరిస్టులతో కొందరు సెల్ఫీలు తీసుకున్నారు. ఎటుచూసినా పర్యాటకులే -
మృత్యుశకటమైన ప్రైవేటు బస్సు
తుమకూరు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొన్న దుర్ఘటనలో కారులోని ముగ్గురు చనిపోగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తుమకూరు తాలూకాలోని బెళదర గేట్ వద్ద శనివారం రాత్రి జరిగింది. కొరటిగెరె తాలుకాలోని కత్తినాగేనహళ్ళివాసులు శివకుమార్ (28), గోవిందప్ప (60), శివశంకర్ (28) మృతులు. పాల్ (28), రెడ్డిహళ్ళి శంకర్ (28)కు గాయాలు తగిలాయి. వీరందరూ ధర్మస్థలానికి కారులో వెళుతుండగా తుమకూరు నుంచి పావగడకు వెళుతున్న ప్రైవేటు బస్సు ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వచ్చి వీరి కారు మీదకు దూసుకెళ్లింది. కారు తుక్కుతుక్కయింది. ఐదుమంది కారులో చిక్కుకుపోయారు. బస్సు డ్రైవర్ బస్సును వదిలి పరారయ్యాడు. స్థానికులు, తుమకూరు గ్రామీణ పోలీసులు కారును విడదీసి మృతులను, గాయపడినవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కారును ఢీ, ముగ్గురు మృతి తుమకూరు జిల్లాలో ఘటన -
ప్రమాద వేళలో ప్యానిక్ బటన్ ఏదీ?
సాక్షి, బెంగళూరు: క్యాబ్లు, ట్యాక్సీల్లో వెళ్లే డ్రైవర్లు, ప్రయాణికులకు ఏమైనా సమస్య వస్తే తక్షణ సాయం కోసం జీపీఎస్, ప్యానిక్ బటన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి క్యాబ్లో ఉండేలా రవాణా శాఖ తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటన తరువాత అన్ని రాష్ట్రాల్లో ఎల్లో బోర్డు వాహనాలకు జీపీఎస్, ప్యానిక్ బటన్ను తప్పనిసరి చేసింది. దీనిమీద క్యాబ్ల డ్రైవర్లు, యజమానులు అసంతృప్తి వ్యక్త చేస్తున్నారు. 6 లక్షల వాహనాల్లో 1.5 లక్షలకే సిటీతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 6 లక్షలకు పైగా ఎల్లో బోర్డు వాహనాలు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 1.5 లక్షల వాహనాలకు మాత్రమే జీపీఎస్, ప్యానిక్ బటన్లు ఉన్నాయి. క్యాబ్లలో కానరాని జీపీఎస్, ప్యానిక్ మీట మహిళల భద్రతకు లేని భరోసా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు బేఖాతరు పాత వాహనాలకే సమస్య కొత్తగా కొనే వాహనాలకు షోరూంలవారే జీపీఎస్, ప్యానిక్ బటన్ను అమర్చి ఇస్తున్నారు. సమస్య అంతా పాత వాహనాలకే. వాటిని అమర్చాలంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ను చూపించాలి. ఈ నిర్ణయం మీద డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఎల్లో బోర్డు వాహనాలకు ఎఫ్సీ చేసేందుకు రూ.800 చెల్లించాల్సి వస్తుంది. అలాగే ప్యానిక్ బటన్, జీపీఎస్ అమర్చేందుకు మరో రూ. 13 వేల నుంచి రూ. 16 వేల వరకు ఖర్చు అవుతోంది. ప్రతి ఏటా రెన్యూవల్ కోసం రూ. 2,200 చెల్లించాలి. ఇంత భారాన్ని భరించలేమంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం డ్రైవర్లు పొరుగునే ఉన్న అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ చవగ్గా పనైపోతుందని చెబుతున్నారు. ఎలా పని చేస్తుందంటే ముఖ్యంగా మహిళలు, యువతులు ప్రయాణిస్తున్నప్పుడు భద్రతా సమస్య వస్తే ప్యానిక్ బటన్ను నొక్కితే సరి. ఆ సమాచారం ఆర్టీవో కంట్రోల్ రూమ్కు వెళుతోంది. కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది వాహన యజమాని లేదా డ్రైవర్కు కాల్ చేస్తారు. సమస్య ఏమిటో కనుక్కుని అవసరమైతే పోలీసులకు, ఫైర్, ఆస్పత్రులకు కాల్ చేస్తారు. 800కు పైగా మొబైల్ కాల్స్ ప్రతినిత్యం కంట్రోల్రూమ్కు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సమస్య కంటే కూడా, ఆ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న కుతూహలమే ఉంటోందని తెలిసింది. ఇప్పటివరకు తీవ్ర సమస్య మీద కేవలం 22 కాల్స్ రాగా, వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కంట్రోల్ రూమ్ అధికారి ఒకరు తెలిపారు. ఏమైనా గానీ ఆర్థిక భారం పేరుతో డ్రైవర్లు ప్యానిక్ బటన్కు మొగ్గు చూపడం లేదు. ఓ రాత్రి వేళ బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి ఓ మహిళ నగరంలోని ఇంటికి బయల్దేరారు. మధ్యలో డ్రైవరు వెకిలి చేష్టలు చేయడంతో ఆమె ట్యాక్సీలోని ప్యానిక్ బటన్ను నొక్కింది. కాసేపటికి పోలీసులు ఆ డ్రైవర్కు కాల్ చేశారు. ఇలా వాహనాలలో ప్యానిక్ బటన్ ఉంటే.. భయంతోనైనా డ్రైవర్లు, లేదా పోకిరీలు వేధింపులకు దూరంగా ఉంటారు. ఆ బటన్ లేకపోతే ఎవరైనా గానీ ఆకతాయిలు అల్లరి చేష్టలకు వెనుకాడడం లేదు. అబలల భద్రతకు ఎంతో ప్రధానమైన ప్యానిక్ బటన్ వ్యవస్థను బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
ప్లాస్టిక్ గోదాము మసి
దొడ్డబళ్లాపురం: గ్యాస్ సిలిండర్ పేలి ప్లాస్టిక్ గోడౌన్ కాలిబూడిదైన సంఘటన బెంగళూరులోని బేగూరులో జరిగింది. బేగూరు అక్షయ్నగర్లో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్లో ఆదివారం ఉదయం హఠాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో క్షణాల్లో మంటలు గోడౌన్ మొత్తం వ్యాపించి లక్షల విలువ చేసే వస్తువులు మంటల్లో కాలిపోగా, ఆ సమయంలో జనం లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. ఫైర్ సిబ్బంది చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలు అదుపు చేశారు. పొగ, మంటలను చూసి చుట్టుపక్కల ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. దగ్గు సిరప్లపై నిఘా సాక్షి, బెంగళూరు: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ నాసిరకం దగ్గుమందు వల్ల 11 మంది బాలలు మరణించిన ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సదరు కోల్డ్రిఫ్ అనే సిరప్ను నిషేధించింది. ఈ మందు రాష్ట్రంలో సరఫరాలో లేకున్నప్పటికీ ఎక్కడా అమ్మరాదని ఆదేశించింది. తల్లిదండ్రులు కోల్డ్రిఫ్ను కొనుగోలు చేయకూడదని ఆరోగ్య శాఖ సూచించింది. వైద్యులు సూచించిన సిరప్లనే ఉపయోగించాలని తెలిపింది. కోల్డ్రిఫ్ను ఎక్కడైనా అమ్ముతున్నట్లయితే వెంటనే బంద్ చేయాలన్నారు. సరఫరా జరుగుతుందా అనే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇతర కంపెనీలకు చెందిన దగ్గు మందులను ల్యాబోరేటరీలకు పరీక్షల నిమిత్తం తరలించారు. కన్నడనాట కల్లోలమే● బిహార్ ఎన్నికలు అయిపోనీ: విజయేంద్ర మైసూరు: బిహార్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తరువాత కర్ణాటక రాజకీయాల్లో అనేక మార్పులు రావడంతో పాటు కొన్ని పార్టీలలో అల్లకల్లోలం ఏర్పడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పారు. ఆదివారం మైసూరు నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్లో పెను మార్పు వస్తుందంటున్నారు, కుర్చీని కాపాడుకునేందుకు సీఎం సిద్దరామయ్య అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. అందుకే సిద్దరామయ్య ఇటీవల మైసూరులో బల ప్రదర్శన చేశారని ఆయన హేళన చేశారు. ప్రజల మధ్య ర్యాంప్ వాక్ కూడా చేస్తున్నారని, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ కంటే సిద్దరామయ్య హడావుడి ఎక్కువగా ఉందని అన్నారు. ఇదేమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న నవంబరు క్రాంతికి అర్థం ఏమిటో సీఎం చెప్పాలన్నారు. అతి త్వరలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పకపోయినా, మార్పు సంకేతాలను ఇస్తున్నారని చెప్పారు. -
సంతోషం పంచి.. బాధగా వీడ్కోలు
● మైసూరు గజరాజులకు బైబై ● శాస్త్రోక్తంగా నిష్క్రమణం మైసూరు: ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా సంబరాలలో పాల్గొనడానికి అడవుల్లోని శిబిరాల నుంచి వచ్చిన గజరాజులు భారమైన హృదయాలతో మైసూరువాసులకు, పర్యాటకులకు వీడ్కోలు పలికాయి. ఇక వెళ్లొస్తాం.. అంటూ అడవులకు నిష్క్రమించాయి. దసరా ఉత్సవాలలో గజరాజుల సేవలను తలచుకుంటూ అందరూ ఆవేదన చెందారు, కొందరైతే కన్నీరు కార్చారు. పూజలు చేసి, పండ్లు తినిపించి జంబూసవారీ వేడుకల్లో ఏనుగులు విజయవంతంగా పాల్గొని ఉత్సవాలను సంపూర్ణం చేయడం తెలిసిందే. జంబూసవారీ కోసం గజరాజులకు చేసిన రంగురంగుల బొమ్మల అలంకారం ఇంకా తడి ఆరకముందే నగరాన్ని వీడాయి. ఆదివారం ఉదయమే కెప్టెన్ అభిమన్యు సహా 14 ఏనుగులకు స్నానాలు చేయించి అర్చకులు వివిధ రకాల పూజలు చేశారు. వాటికి పండ్లు, చెరుకులను తినిపించారు. ఏనుగులు తొండాలు ఎత్తి దండాలు పెట్టాయి. వీడ్కోలు వేడుకను చూడడానికి వేలాది మంది తరలివచ్చారు. అటవీ సిబ్బంది ఒక్కో ఏనుగును ఒక్కో లారీలోకి ఎక్కించారు. లారీలు కదిలిపోతుంటే, అధికారులు, ప్రజలు అందరూ బాధగా చూస్తుండిపోయారు. ఆగస్టు 4న వచ్చాయి జిల్లాలోని నాగరహోళె అడవుల్లోని శిబిరాల నుంచి ఏనుగులను ఆగస్టు 4న అట్టహాసంగా గజపయన ద్వారా మైసూరుకు తీసుకువచ్చారు. అప్పటినుంచి అంబావిలాస్ ప్యాలెస్ ఆవరణలో మకాం వేసి రాచ మర్యాదలను అందుకున్నాయి. నిత్యం వేలాది మంది గజరాజులను చూసేవారు. సరిగ్గా రెండు నెలల పాటు మైసూరులో గడిపాయి. మధ్యాహ్నం నుంచి బోసిపోయిన ప్యాలెస్ను చూసి అందరూ బాధగా నిట్టూర్చారు. -
ఆవు కళేబరంలో విషం పెట్టి..
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని మలెమహాదేశ్వర అభయారణ్యంలోని పచ్చెదొడ్డిలో పెద్ద పులిని చంపిన కేసులో నలుగురిని అటవీ సిబ్బంది అరెస్టు చేశారు. పచ్చెదొడ్డివాసులు పచ్చమళ్ళ, గణేష్, గోవిందగౌడ, సంపు నిందితులు. వారిని కొళ్లేగాల ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యపరీక్షలు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమ ఆవులు, గొర్రెలపై పులి దాడి చేస్తోందనే కోపంతో ఆవు కళేబరంలో విషం కలిపి పెట్టారు, దానిని తిన్న పులి మృత్యువాత పడింది. ఆ పులి శరీరాన్ని ముక్కలుగా నరికి పడేశారు. ఆవు కళేబరం కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నారు. కంబన్న, మంజునాథ్ అనే గొర్రెల కాపరులను విచారిస్తున్నారు. ఇలా బయటపడింది అటవీ సిబ్బంది అడవిలో గస్తీ తిరుగుతుండగా భూమిలో సగం పాతిపెట్టిన పులి కళేబరం కనిపించింది. దీంతో విచారణ జరపగా గుట్టు రట్టయింది. పులి గోర్లు, కోరలు, 4 కాళ్లు లభించాయి. మగ పులి అని, 12 ఏళ్ల వయసని నిర్ధారించారు. కొన్నినెలల కిందట కూడా పశువులను చంపివేస్తోందని ఇదే మాదిరిగా తల్లి పులి, నాలుగు పిల్లలను కొందరు హతమార్చడం తెలిసిందే. అంతలోనే మరో ఘటన జరగడంతో ఈ ప్రాంతంలో పులుల భద్రత ప్రశ్నార్థకమైంది. అరుదైన వన్యప్రాణులపైన పులులను కాపాడడం గురించి అటవీశాఖ ప్రజల్లో జాగృతి కల్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి. పులిని చంపిన నలుగురు అరెస్టు వన్యప్రాణులకు రక్షణ కరువు -
కులగణన సర్వేకు సహకరించాలి
హొసపేటె: కర్ణాటకలో వెనుకబడిన తరగతుల కమిషన్ నేతృత్వంలో చేపట్టిన కులగణన సర్వేకు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని విజయనగర జిల్లా ఆహింద సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ బన్నద మనే తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్యా సర్వే జరుగుతోందన్నారు. ఇది నిజంగా దోపిడీకి గురైన వారికి న్యాయం చేసే ప్రయత్నమని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీలు శతాబ్దాలుగా రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నా చట్టబద్ధమైన రిజర్వేషన్లు పొందడంలో విఫలయ్యారనేది బహిరంగ సత్యం అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనాలని కోరారు. కొంతమంది అగ్రకులాల వారు సర్వేను అడ్డుకోవడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప ఇప్పటికే కులగణన సర్వేలో అందరూ పాల్గొనాలని కోరుతూ కొన్ని సమావేశాలు నిర్వహించడం శుభపరిణామం అన్నారు. అక్టోబర్ 7వ తేదీ సర్వేకు చివరి తేదీగా ఇచ్చారన్నారు. అయితే సర్వే పూర్తి చేయడానికి మరో వారం సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరుతామని పేర్కొన్నారు. శతాబ్దాలుగా రిజర్వేషన్ల వల్ల మోసపోయిన వర్గాలకు సర్వే ఒక వరం అని వెల్లడించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనార్టీలు ఈ కుల సర్వేలో తమ కులం పేరు, వంశ వృత్తిని కచ్చితంగా ప్రస్తావించాలన్నారు. హిందుయేతర సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేకు దూరంగా ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బుడ్డి బసవరాజ్, శివకుమార్, రవికుమార్, సద్దాం, సన్న ఈరప్ప, ప్రశాంత్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
అమ్మా.. నాన్నా కావాలి
ఉరవకొండ: తల్లిదండ్రులు మృత్యువాత పడ్డారని తెలియని ఈ బాలుడు తన ఒక కాళ్లు పూర్తి దెబ్బతిన్నా అంతటి నొప్పిలోను మమ్మి,. డాడీ కావాలి...అంటూ డాక్టర్లు, నర్సులను చూస్తూ రోదించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. తల్లిదండ్రులను దూరం చేసి తన బాధను ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని దుస్థితిలో చిన్నారిని చూసి అందరూ అయ్యో అని అంగలార్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విడపనకల్లు శివారులోని బళ్లారి– అనంతపురం జాతీయ రహదారిలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో తల్లిదండ్రులు చనిపోగా బాలుడు అద్విక్ (5) తీవ్రంగా గాయపడ్డాడు. విశాఖపట్టణానికి చెందిన రామ్సుధీర్ (38), లావణ్య (34) దంపతులు, రామ్సుధీర్కు పెనుకొండలోని కియా కంపెనీలో ఇంజనీర్గా ఉద్యోగం రావడంతో వచ్చాడు. అనంతపురంలో కుటుంబంతో ఉంటూ రోజూ కంపెనీ బస్సులో పెనుకొండకు వెళ్లివచ్చేవాడు. హంపీకి వెళుతుండగా.. దసరా సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి హంపీ టూర్కు 4న కారులో బయలుదేరారు. ఘటనాస్థలిలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొంది, రెండు కార్లు దెబ్బతినగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. లావణ్య అక్కడే చనిపోగా, రామ్సుధీర్ తీవ్రంగా గాయపడ్డాడు. కుమారుడు అద్విక్కు ఒక కాళ్లు విరిగి తీవ్రంగా అవస్థలు పడ్డాడు. మరో కారులో నలుగురు సంజీవ్రెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్యనాయుడు, నాగిరెడ్డి గాయపడ్డారు. బాధితులను ఉరవకొండకు, ఆపై అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. రామ్సుధీర్ అనంతపురం జీజీహెచ్లో చనిపోయాడు. అక్కడే బాలుడు అద్విక్ చికిత్స పొందుతూ అమ్మానాన్నల కోసం ఆరాటపడుతున్నాడు. విడపనకల్లు వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటన.. తల్లిదండ్రులు కొన్నిగంటల్లోనే మృతి అనాథగా మారిన వైజాగ్ బాలుడు -
ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో విస్తృత సేవలు
రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవి శంకర్ పేర్కొన్నారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరులత సమావేశంలో మాట్లాడారు. కులమత భేదాలు లేకుండా 1,600 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశామని తెలిపారు. 102 పాఠశాలల్లో 6,300 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారని పేర్కొన్నారు. వాసవి చేతన్ పేరుతో 387 మంది వృద్ధులకు నెలకు రూ.1000, సంద్యా శ్రీ (వితంతువులకు) 536 మందికి రూ.1,500, వాసవీ అకాడమీలో 35 మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ కోసం శిక్షణ పొందుతున్నారని వెల్లడించారు. 2 వేల మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ కోసం రూ.1.3 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోందన్నారు. సమావేశంలో ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్, కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమా శంకర్ పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించాలి రాయచూరు రూరల్: ఆర్యవైశ్య సమాజం సభ్యులు కుటుంబంగా ఏర్పడి అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఆర్యవైశ్య సమాజం మహసభ అధ్యక్షుడు రవిశంకర్, ఆర్యవైశ్య మండళి అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సమాజం దానాలకు ప్రతి రూపమైన వ్యాపారాలతో పాటు సమాజంలో సాంఘికంగా, విద్య, రాజకీయంగా ఎదగాలని కోరారు. వ్యాపారాలతో కాలయాపన చేయకుండా భవిష్యత్తు తరాల వారికి ముందు చూపుతో నడవాలన్నారు. వ్యాపారాలు చేసుకుని జీవనం గడుపుతారనే భావన పోయి సమాజం కోసం యువకులు ముందుకు రావాలన్నారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కుంట్నాళ వెంకటేష్, జగదీష్, హన్మంతయ్య, వీరేష్, వాసుదేవ్, బీమాశంకర్, సునీత, కిరణ్, రాఘవేంద్ర, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి రైతు కన్నీరు
రాయచూరు రూరల్: జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉల్లికి గిటుబాటు ధర లేకపోవడంతో నష్టాలపాలవుతున్నారు. ఈ ఏడాది రాయచూరు జిల్లాలో 753 హెక్టార్లు, యాదగిరిలో 658 హెక్టార్లు, కొప్పళలో 569 హెక్టార్లు, బళ్లారిలో 489 హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు. రాయచూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల నుంచి రాయచూరు ఏపీఎంసీకి ఉల్లిగడ్డలను తీసుకొస్తారు. అయితే ధరలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం క్వింటాల్ రూ.705 నుంచి రూ.1,196 వరకూ ధరలు పలుకుతున్నాయి. ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. రాయచూరు ఏపీఎంసీకి రోజు 200 క్వింటాళ్లకు పైగా ఉల్లిగడ్డలు వస్తాయి. శనివారం సాయంత్రం ఓ రైతు 62 క్వింటాళ్ల ఉల్లి గడ్డలను మార్కెట్కు తీసుకొచ్చాడు. ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో మార్కెట్లోనే వదిలేసిపోయాడు. రాయచూరు ఏసీఎంసీ మైదానంలో పశువులు ఉల్లిగడ్డలను తింటూ కనిపించాయి. తగ్గుముఖం పట్టిన ధరలు లబోదిబోమంటున్న రైతులు -
ప్రియురాలిని లాడ్జికి పిలుచుకెళ్లిన ప్రియుడు
కర్ణాటక రాష్ట్ర: వివాహమై ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ తన ప్రియుడు మోసగించాడని మనో వేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. వివరాలు.. యశోద ఆత్మహత్య చేసుకొన్న మహిళ. మృతురాలు యశోదకు వివాహమై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా కూడా ఆమె పక్క వీధిలో ఉన్న ఆడిటర్ విశ్వనాథ్ అనే వ్యక్తితో గత తొమ్మిదేళ్లుగా అక్రమ సంబంధం కలిగి ఉంది. అయితే కొంతకాలం క్రితం యశోద తన స్నేహితురాలిని ప్రియుడు విశ్వనాథ్కి పరిచయం చేసింది. దీంతో ప్రియుడు యశోద స్నేహతురాలితో చనువు పెంచుకొని ఆమెను ప్రేమ వలలో పడేశాడు. అంతేకాకుండా ఆమెను ఓ గదికి తీసుకెళ్లాడు. ఈ విషయం యశోద చెవిలో పడింది. ప్రియుడితో కలిసి స్నేహితురాలు ఉన్న లాడ్జికి వెళ్లి గొడవ పడింది. ప్రియుడు సరిగా స్పందించకపోవటంతో మనోవేదనతో అక్కడే పక్క గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై మాగడి రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
నార్త్ ఈస్ట్ టీచర్స్ ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్
హొసపేటె: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్ణాటక ఈశాన్య టీచర్స్ నియోజకవర్గ ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తున్నాం. అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్ణాటక ఈశాన్య టీచర్స్ నియోజకవర్గ అసిస్టెంట్ ఓటర్ రిజిస్ట్రార్, డిప్యూటీ కమిషనర్ కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించి ఈ కొత్త జాబితాను తయారు చేసే పని ప్రారంభమైంది. మునుపటి జాబితాలో పేర్లు ఉన్న ఓటర్లు ఫారమ్–19లో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. నమోదుకు మార్గదర్శకాలు భారత పౌరులు, నియోజకవర్గంలో సాధారణంగా నివసిస్తూ ఉండాలి. నవంబర్ 1, 2025 తేదీకి 6 సంవత్సరాల్లో కనీసం 3 సంవత్సరాలుగా గుర్తింపు పొందిన విద్యా సంస్థలో ఉన్నత పాఠశాల కంటే తక్కువ కాకుండా బోధన వృత్తిలో నిమగ్నమై ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు పరిగణించబడవు. బదులుగా, దరఖాస్తుదారు ఫారమ్–19 పూరించి, అనుబంధం–2 ప్రకారం వారి సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్తో పాటు సమర్పించాలి. బల్క్ దరఖాస్తులు అంగీకరించబడవు. ఎవరైనా పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, నియమించబడిన అధికారి విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేస్తారు. విచారణకు హాజరు కాకపోతే లేదా అవసరమైన పత్రాలను సమర్పించకపోతే, దరఖాస్తులు తిరస్కరించబడతాయి. అర్హులైన ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ఈశాన్య ఉపాధ్యాయుల ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏవైన అభ్యంతరాలు ఉంటే సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం (మహానగర పాలికె, తహసీల్దార్ కార్యాలయంలో) ఓటర్ల రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కార్యాలయం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నిర్ణీత కాలపరిమితిలోపు సమర్పించవచ్చు.నవంబర్ 6: దరఖాస్తు ఫారమ్–19 స్వీకరించడానికి చివరి రోజు నవంబర్ 25: డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురణ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకూ: క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 30: తుది ఓటర్ల జాబితా ప్రచురణ ముఖ్యమైన తేదీలు ఇవే.. -
భక్తిశ్రద్ధలతో రథోత్సవం
రాయచూరు రూరల్: సమాజంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు ప్రతీక దేవీ నవరాత్రులు అని కరేగుడ్డ మహంతేశ్వర మఠం పీఠాధిపతి మహంతలింగ శివాచార్య స్వామీజీ అన్నారు. శనివారం మహంతేఽశ్వర మఠంలో దసరా ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆధునిక భారతదేశంలో మహిళలపై జరుగుతున్న దురాచారాలను నియంత్రించాలన్నారు. దసరా ధర్మ సమ్మేళనం జాగృతి కార్యక్రమాలు చేపట్టమన్నారు. అనంతరం మహిళలతో కలసి రథాన్ని లాగారు. కార్యక్రమంలో సంగన బసవ, మాజీ శాసన సభ్యుడు బసన గౌడ, బసలింగప్ప, శేఖరయ్య, అణ్ణప్ప గౌడ, చంద్రయ్య, చెన్నయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి అరెస్ట్హుబ్లీ: నగరంలోని ఓ కాలనీలో బాలికలు ఆరవేసిన లోదుస్తులను ఎత్తుకెళ్తున్న వ్యక్తిని బెండిగేరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుస్తులను ఇతడు రహస్యంగా చోరీ వేసేవాడని విచారణలో ఒప్పుకున్నాడు. సీసీ కెమెరాల చోరీ కేసులు కూడా నిందితుడిపై ఉన్నాయని పోలీసులు వివరించారు. గ్రామాల అభివృద్ధికి సహకారం అవసరం రాయచూరు రూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసవన గౌడ పేర్కొన్నారు. శనివారం లింగన్ ఖాన్ దొడ్డి, హిరాపూర, ఏలెబిచ్చాలి, అరోలి, అడవిఖాన పూర్, ఉడుమగల్లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దేందుకు పాటుపడతామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేహదానానికి అంగీకారంరాయచూరు రూరల్: కొప్పళ జిల్లా గంగావతి తాలుకా శ్రీరామ నగర్కు చెందిన గారపాటి రామకృష్ణ తన దేహదానానికి అంగీకరించారు. దేహాన్ని కొప్పళ ప్రభుత్వ వైద్యకీయ కళాశాల పరిశోధన సంస్థకు, కళ్లను హుబ్లీ ఎంఎం జోషి నేత్రాలయానికి ఇవ్వడానికి వీలునామా రాసి ఇచ్చారు. ప్రవాసాంధ్రుడు, కన్నడ సాహితి ప్రియుడు, స్వామి వివేకానంద సేవా సంఘం అధ్యక్షుడు అయిన గారపాటి రామకృష్ణ తెలుగు, కన్నడ భాషల్లో రచనలు చేశారు. ఔషధాల పేరుతో రూ.1.44 లక్షల టోకరాహుబ్లీ: కాళ్ల నొప్పులకు ఔషధాలు ఇచ్చి బాగు చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.1.44 లక్షలు తీసుకుని మోసగించారు. గురుగొల్ల, శీను, చంద్రగోకాక, కుమార, వినోద తళవార అనే వ్యక్తులు మాంగిలాల్కు ఔషధాన్ని ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. అయితే ఆ ఔషధం వల్ల కాలి నొప్పి తగ్గలేదు. నిందితులు అంగడి వాకిలి వేసి పరారీ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నించినట్లు బాధితుడు కేశ్వపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆభరణాల చోరీ.. ఇంటి తాళాలు పగలగొట్టి ఆభరణాలు, రూ.4 లక్షల నగదు చోరీ చేసిన ఘటన గోకుల్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సదరు స్టేషన్ పరిధిలో మారుతీ నగర నజీమ్ మునిస్సా ఇంట్లోని బీరువాలో ఉంచిన రూ.50 వేల విలువ చేసే 10 గ్రాముల బంగారు ఆభరణాలు, అలాగే రూ.4 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. గోకుల్ రోడ్డు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేత్రపర్వం.. దీపోత్సవం కోలారు: కోలారు తాలూకా వక్కలేరి గ్రామంలో అంబేడ్కర్ నగర్ ఆధ్వర్యంలో సామ్రాట్ అశోక విజయదశమి కార్యక్రమాలను ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గణపతి పూజ, గ్రామ దేవతల దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పూలతో అలంకరించిన దీపాలను తలపై మోసుకుని ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. భక్తులు గ్రామదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. -
‘వైద్య వృత్తి పవిత్రమైనది’
హుబ్లీ: వైద్య వృత్తిని ధన ధారదత్తం చేయరాదని సీ్త్ర రోగ నిపుణురాలు డాక్టర్ దత్తప్రసాద్ గిజరే సూచించారు. బెళగావిలోని సమీపంలో బసవన కుడచి దేవరాజ అరసు కాలనీలోని చెన్నమ్మ హిరేమఠ వృద్ధాశ్రమంలో వైద్య విద్యార్థులకు యూనిఫారం, వైద్య పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఓ పవిత్రమైనదని తెలిపారు. 5 ఏళ్ల పాటు చక్కగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. కారంజి మఠం గురుసిద్ధ స్వామి మాట్లాడుతూ.. జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని తెలిపారు. మీరు ఎంపిక చేసుకున్న మార్గం అత్యంత పవిత్రమైందని కితాబిచ్చారు. క్రమశిక్షణతో వైద్య కోర్సు పూర్తి చేసి సమాజ స్పృహతో సేవలు అందించాలని సూచించారు. ధనమే సర్వస్వం కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య వృత్తిని డబ్బుతో ముడిపెట్టరాదన్నారు. డాక్టర్ మహంతేష రామన్నవర మాట్లాడుతూ.. విద్యార్థులు గురుతర బాధ్యతలను ఎరిగి విద్యార్జాన చేయాలన్నారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ సమన్వయ అధికారి ఎంఎస్ చౌగల, డాక్టర్ రోహిణి రేగినాళ, సుభాష్ రేగినాళ, కిరణ్, సుజిత, అజయ్ పూజారి, సంకేత కులకర్ణి, ఓం శ్రీ తదితరులు పాల్గొన్నారు.