breaking news
Karnataka
-
ప్రేమోన్మాది వేధింపులకు రాలిన పసిమొగ్గ
రాయచూరు రూరల్/ దొడ్డబళ్లాపురం: ప్రేమోన్మాది వేధింపుల వల్ల పసిమొగ్గ జీవితం ఛిద్రమైంది. పాఠశాల భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన బీదర్ జిల్లాలో జరిగింది. వివరాలు.. చెటగుప్ప తాలూకా భేమల్ ఖేడ్లో మదియా (16) 10వ తరగతి విద్యార్థిని. త్వరలో పరీక్షలు కావడంతో శ్రద్ధగా చదువుకుంటోంది. కానీ ఓ సహ విద్యార్థి ప్రేమ పేరుతో ఆమెను సతాయిస్తున్నాడు. ఇంట్లో చెబితే గొడవ జరిగి చదువు మాన్పిస్తారని కుమిలిపోయింది. రోజు రోజుకూ వేధింపులు అధికం కావడంతో గురువారం తమ ప్రభుత్వ పాఠశాల భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో ప్రాణాలు పోయాయి. ఆత్మహత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. బాలిక మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దివాలాకోరు.. అప్పుల బడ్జెట్
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచింది. బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరాయ్య దివాలాతనాన్ని ప్రదర్శించారు అని గురువారం విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే బీ.వై.విజయేంద్ర ఆరోపించారు. బడ్జెట్ చర్చలో పాల్గొని మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కేంద్రం మీద ఆరోపణలు చేస్తోందన్నారు. ఆదాయ సేకరణలో ప్రభుత్వం విఫలమైంది, విచ్చలవిడిగా అప్పులు చేసిన ఘనతను తెచ్చుకుంది, కేంద్రం వల్ల రాష్ట్రానికి అన్యాయమవుతోందని పదే పదే చెబుతూ, ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి 100 రూపాయలు పన్నులు వెళ్తే తిరిగి 15 రూపాయలే ఇస్తోందనడం సరికాదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా అదే మాదిని కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. విధానసభలో బీజేపీ ఎమ్మెల్యే విజయేంద్ర ధ్వజం -
ఓ తల్లి మౌన వేదన
సాక్షి, బళ్లారి: పెంచి పెద్ద చేసిన చేతులతోనే ఇద్దరు కూతుళ్లను చెరువులోకి తోసి, ఆపై తానూ దూకి ఆత్మహత్య చేసుకుందో తల్లి. గురువారం కొప్పళ జిల్లా యలబుర్గి తాలూకా మరనాళ గ్రామంలో ఈ విషాదం సంభవించింది. బాళవ్వ (35), కుమార్తెలు హులిగమ్మ (9), విజయ (2)ను తీసుకుని ఊరిబయట ఉన్న చెరువులోకి దూకింది. గ్రామస్తులకు తెలిసి గాలించి మృతదేహాలను బయటకు తీశారు. ఆమె భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదని తెలిసింది. దీంతో మనసు రాయి చేసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. బాళవ్వ పెద్ద కూతురు వసతి పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమె ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణాలతో మిగిలింది. యలబుర్గి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిప్పంటించుకుని గర్భిణి.. దొడ్డబళ్లాపురం: కుటుంబ కలహాలను తట్టుకోలేక 5 నెలల గర్భిణి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామనగర తాలూకా వడ్డరదొడ్డి గ్రామంలో జరిగింది. వివరాలు.. నయన (19)కు సునీల్తో 9 నెలల క్రితమే వివాహం జరిగింది. గర్భవతి అయిన ఆమె గురువారం డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపులే కారణమని నయన కన్నవారు రామనగర రూరల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్య -
గ్యాస్ ట్రబుల్ తీవ్రం
బనశంకరి: రాష్ట్రంలో జిల్లాలతో పాటు రాజధాని బెంగళూరులో కమర్షియల్ గ్యాస్, ఇళ్లకు సిలిండర్ల సరఫరా రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రజలు పనులు మానుకుని సిలిండర్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇక హోటళ్లు, కేటరింగ్, విద్యాలయాల హాస్టళ్లు, బేకరీలు, వివాహాది శుభకార్యాలతో పాటు నిత్యం ఆహారం అవసరమైన అన్నిచోట్లా తీవ్ర కటకట ఏర్పడింది. బుక్ చేసినా లేవు కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. ఆర్డర్ బుక్ చేసినా లేవని చెబుతున్నారని హోటళ్ల యజమానులు ఆరోపించారు. ఫలితంగా నగరంలో పెద్దసంఖ్యలో హోటళ్లను మూసేశారు. చిన్నా చితకా క్యాంటీన్లు, వీధి హోటళ్లదీ అదే పరిస్థితి కావడంతో బ్రహ్మచారులు ఆహారం కోసం రోడ్ల వెంబడి అన్వేషించాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల నెల కావడంతో ముందుగా కళ్యాణ మండపం బుక్ చేసినప్పటికీ సిలిండర్లు లభించని కారణంగా వంట చేయడం ఎలా అనే సమస్య ఏర్పడింది. కేటరింగ్ చేసేవారు అవస్థలు పడుతున్నారు. పండుగల నెలలో కష్టాలు బెంగళూరులో కొన్ని చోట్ల హోటల్స్, బేకరీలలో కట్టెల పొయ్యితో వండుతున్నారు. చిన్నపాటి హోటళ్లు, కళ్యాణ మండపాలలో కట్టెల పొయ్యిలు వెలిశాయి. రంజాన్ ఉపవాసాల నెల కావడంతో తెల్లవారుజామునే హోటళ్లలో పొయ్యి మీదే వంటకాలు వండారు. నగర ప్రదేశాల్లో కట్టెలు పొయ్యిలు చాలా తక్కువ. కానీ గత్యంతరం లేక వాటినే ఆశ్రయించారు. పెద్ద హోటల్స్లో కట్టెలు పొయ్యి వాడితే పొగ ఆవరిస్తుందని వెనుకంజ వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్యాస్ కొరత లేదు, అంతా బాగానే ఉంది అని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అలా లేదని తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీనే దానికి నిదర్శనం. గురువారం నగరంలో అనేకచోట్ల విపరీతమైన రద్దీ ఏర్పడింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కానీ, సిలిండర్ల సమస్య లేకుండా చూడాలని, వంట చేయలేక పోతున్నామని పలువురు మహిళలు వాపోయారు. సిలిండర్ల కోసం హోటళ్లు, జనం హాహాకారాలు ఏజెన్సీల ముందు మహిళల క్యూ బెంగళూరులో భారీగా హోటళ్ల మూసివేత గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంటకాలు ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులతో యుద్ధం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు లేకపోగా, ఉద్యాననగరిలో ఆ ఎఫెక్టు బాగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం కష్టాలు పడుతున్నారు. గ్యాస్ వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. హోటళ్లలో టిఫిన్లు, భోజనాలు దొరకడం కనాకష్టంగా మారింది. ఇంట్లో పొయ్యి వెలగక, హోటళ్లో తిండి దొరకక చాలామంది అన్నమో రామచంద్రా అనాల్సి వస్తోంది. కేంద్రం పట్టించుకోవాలి: డీసీఎం శివాజీనగర: వేరే విషయాల గురించి మాట్లాడే రాష్ట్ర ఎంపీలు వంటగ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంటులో చర్చించాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ సూచించారు. ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. కానీ బీజేపీకి చెందిన ఏ ఎంపీ నోరు మెదపలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానంపై స్పష్టంగా మాట్లాడటం లేదు, ఈ ధోరణి ఖండనీయం. ప్రజలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం వ్యవహరించాలి, గ్యాస్ సమస్య అధికమవుతోంది, మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, ఇప్పటికే గ్యాస్ ఆటోలు బంద్ అయ్యాయి’ అని అన్నారు. గ్యాస్ గోదాములు తనిఖీ చేయండి పోలీసులకు డీజీపీ ఆదేశం బనశంకరి: గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా జరగకుండా చూడాలని డీజీపీ ఎంఏ.సలీం పోలీసులను ఆదేశించారు. బెంగళూరు సిటీలోని ప్రతి గ్యాస్ గోదామును పోలీసులు తనిఖీ చేయాలని, ఉన్న సిలిండర్లు, వచ్చిన ఆర్డర్లు, వితరణ చేసినవి ఎన్ని అనేది తనిఖీ చేయాలని తెలిపారు. నల్లబజారులో అమ్మినా, ఎక్కువ ధర వసూలు వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే, కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు లేవని చెప్పినా, ఎక్కువ ధరలు కోరినా ఆయా ఏజెన్సీల మీద ప్రజలు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సీఎస్ సమీక్ష గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటల్ యజమానులు సంఘం నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ విధానసౌధలో సమావేశం నిర్వహించారు. అధికారులు, గ్యాస్ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, పీజీలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని శాలినీ సూచించారు. హోటల్స్లో అదనంగా సిలిండర్లను ఉంచుకోరాదని తెలిపారు. ఇంకా 2 నుంచి 5 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల ఫిర్యాదులకు ఓ హెల్ప్లైన్ ప్రారంభించాలని చెప్పారు. -
టిప్పర్ దూసుకెళ్లి.. మెడికో దుర్మరణం
యశవంతపుర: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మెడిసిన్ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు కెంగేరి పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని ఆర్ఆర్ మెడికల్ కాలేజీ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మెడిసిన్ ఫైనలియర్ చదివే కృతిక (21), మరో మెడికో హంస సాయంత్రం 4.15 గంటల సమయంలో కాలేజీ ముగించుకొని స్కూటర్లో బయటకు వచ్చారు, మైసూరు రోడ్డు వైపు వెళుతుండగా వారిని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన కృతికా అక్కడే చనిపోగా, హంస ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో సహచర మెడికోలు పరుగున అక్కడికి వచ్చి ఆవేదనకు లోనయ్యారు. కెంగేరి పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి టిప్పర్ డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కరెంటు షాక్తో లైన్మెన్ మృతి మైసూరు: ట్రాన్స్ఫార్మర్ను మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ లైన్మెన్ మరణించిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా చిక్కనేరళె గ్రామ పంచాయతీ పరిధిలోని వడేర హొసహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకృష్ణ (38) మృతుడు. ఇతను విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ కొట్టి కిందపడిపోయాడు. ఇతర సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే పనిలో ఉండగానే మరణించాడు. మృతుని తండ్రి సణ్ణస్వామిగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టదపుర స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేఆర్నగర సెస్క్ ఉప విభాగం ఈఈ ప్రదీప్, అధికారులు మృతునికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. మే ఆఖరులోగా టీబీ డ్యాం 6 గేట్ల మార్పు శివాజీనగర: తుంగభద్ర డ్యాం 6 గేట్లను మే ఆఖరిలోగా మార్చుతామని డీసీఎం డీకే శివకుమార్ విధాన పరిషత్లో తెలిపారు. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాం నిర్వహణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందినదని అన్నారు. గేట్ల పనులు అహ్మదాబాద్ కంపెనీకి ఇచ్చామని, సామాగ్రి వచ్చిందని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గేట్లను త్వరగా అమర్చి రైతులకు నీటిని విడుదల చేయాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు. 30 మంది జీవిత ఖైదీలకు విముక్తి బనశంకరి: రాష్ట్రంలో వివిధ జైళ్లలో సత్ప్రవర్తనతో ఉన్న 30 మంది జీవిత ఖైదీలను ముందే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం 54 మంది ఖైదీల ప్రవర్తనను పరిశీలించిన సదరు కమిటీ 31 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని సిఫార్సు చేసింది. వీరిలో ఒక మహిళా ఖైదీ పెరోల్ సెలవులో ఉండగా చనిపోయింది. బెంగళూరు సెంట్రల్ జైలులో 14 మంది, విజయపుర కేంద్ర జైలులో 5 మంది, బళ్లారి జైలులో ముగ్గురు, మిగతా జైళ్లలో ఒకరిద్దరు ఖైదీలు విడుదలవుతారు. వృద్ధాప్యం, మంచి ప్రవర్తన, ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలం తదితరాలను పరిగణించి విడుదలకు ఆదేశించారు. పిరియా పట్టణమ్మ రథోత్సవం మైసూరు: మైసూరు జిల్లాలోని పిరియాపట్టణలో గురువారం వేలాది మంది భక్తుల మధ్య శక్తిదేవత శ్రీ పిరియాపట్టణ (మస ణికమ్మ) దేవి బ్రహ్మ రథోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి ఉద్భవ విగ్రహానికి వివిధ అభిషేకాలు, పూజలు జరిగాయి. తరువాత విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ఆపై తేరులో ప్రతిష్టించి 12:10 గంటల తరువాత మంగళహారతి ఇచ్చి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. తేరు కదలగానే భక్తజనం అమ్మవారిని స్మరిస్తూ పండ్లు, ధాన్యాలను తేరుమీదకు విసిరారు. భక్తుల ఆకలిని తీర్చడానికి అనేక సంఘాలవారు పండ్లు, మజ్జిగ, సాంబార్ అన్నం, కేసరిబాత్, శీతల పానీయాలను పంపిణీ చేశారు. అమ్మఫ్రెండ్స్ యూనియన్ మధుగౌడ, హరీష్గౌడ ఉచితంగా ఐస్క్రీంలను అందజేశారు. -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర( కర్ణాటక): ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్లు బంద్ అయ్యాయి. బంక్లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాల కూడా ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
దొరికినవి.. దేవతల నగలు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఈ ఏడాది జనవరి 10వ తేదీన కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్కుండిలో లభించిన నిధి గురించి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఆ చారిత్రక గ్రామంలో ఓ మహిళ ఇంటి పునాది తవ్వతుండగా పురాతనమైన రాగి చెంబు, అందులో అపురూపమైన బంగారు నగలు లభించడం తెలిసిందే. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. పురావస్తుశాఖ అధికారులు ఆ బంగారు ఆభరణాలు సుమారు 600 సంవత్సరాల క్రితం నాటివని, కళ్యాణ చాళుక్య రాజులు, విజయనగర అరస రాజుల కాలం నాటివని నిర్ధారించారు. ఇవి మనుషులు ధరించేవి కావని, ఆలయాలలో దేవతలకు లేదా ఉత్సవ మూర్తులకు అలంకరించే ఆభరణాలని తెలిపారు. వీటి విలువ రూ.8 కోట్లని ప్రకటించారు. చదవండి: అరుదైన ఈ రైల్వేస్టేషన్ గురించి తెలుసా? -
ఉరికి వేలాడిన తల్లీ బిడ్డ
తుమకూరు: తల్లి, చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన గుబ్బి తాలూకాలో హాగలవాడిలో జరిగింది. యతీశ్, భార్య గంగామణి (29), పిల్లలతో నివసిస్తున్నారు. గంగామణిది తిపటూరు తాలూకా జక్కనహళ్లి. 9 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 8 ఏళ్ల కుమారుడు వినయ్, 5 ఏళ్ల కుమార్తె రక్షితా, రెండేళ్ల ప్రేక్ష అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. కడుపునొప్పి, రుతుస్రావ అనారోగ్యంతో ఆమె బాధపడుతోందని అత్తింటివారు చెబుతున్నారు. వైద్యులతో చికిత్స తీసుకున్నా నయం కాలేదని చెప్పారు. దీంతో విరక్తి చెంది ఒకే చీరతో కూతురు ప్రేక్షకి ఉరిబిగించి ఆమె ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఆమె తల్లి దాక్షాయణమ్మ చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎమ్మెల్యేకు బెయిలు బనశంకరి: కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకున్నారనే కేసులో లోకాయుక్త పోలీసులు అరెస్ట్ చేసిన గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణికి బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కొన్ని రోజులుగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న ఎమ్మెల్యే చంద్రుకు ఊరట దక్కింది. -
ప్రియుని మోజు.. పెళ్లయిన 2 నెలలకే హత్య
తుమకూరు: తిపటూరు తాలూకా రంగాపుర సమీపంలోని చిక్కకొట్టేగెహళ్లి వద్ద తిపటూరు గాంధీనగర నివాసి, గుజరీ వ్యాపారి మన్సూర్ పాషా (31) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అజ్జంపూరు తాలూకాకు చెందిన ధనరాజ్ హెచ్టీ (24), వెంకటేశ్ (24), దర్శన్ (24), మృతుని భార్య ఫర్జానా అరెస్టయిన నిందితులు. బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కేసు వివరాలను వెల్లడించారు. 2 నెలల కిందటే మన్సూర్ పాషా, ఫర్జానా పెళ్లయింది. కానీ ఫర్జానాతో ధనరాజ్కు గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. పెళ్లి తర్వాత కూడా తరచూ కలిసేవారు. తమకు అడ్డుగా ఉన్న మన్సూర్ పాషాను వ్యాపారం గురించి మాట్లాడాలని పిలుచుకెళ్లి హత్య చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, బొలేరో వాహనం, పల్సర్ బైక్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కుడితినిలో రైతుల ఆందోళన
సాక్షి, బళ్లారి: బళ్లారి జిల్లా సండూరు తాలూకా కుడితినిలో రైతులు భారీ ఆందోళన చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని, లక్ష్మీ మిట్టల్ కంపెనీ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని జిందాల్ సంస్థకు బదిలీ చేయరాదని పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కుడితిని పారిశ్రామిక ప్రాంతంలో భూముల విషయంలో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. సీఐటీయూ, భూ సంరక్షణ పోరాట సమితి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం, వివిధ కన్నడ పర సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మట్టి పరీక్షలతో రగడ సదరు భూముల్లో జిందాల్ సంస్థ ప్రతినిధులు మట్టి పరీక్షలు కోసం పోలీసు బందోబస్తుతో రావడం నిరసనకు కారణమైంది. వందలాది మంది రైతులు చేరి జిందాల్ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మీ మిట్టల్ కోసం స్వాధీనం చేసుకున్న తమ భూములను జిందాల్ సంస్థకు ఎందుకు అప్పగిస్తున్నారని, ఇందులో ఎవరి స్వార్థం ఉందని రైతులు ప్రశ్నించారు. ఒక కంపెనీ పేరు చెప్పి మరో కంపెనీకి బదిలీ చేయడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో జిందాల్ సంస్థకు భూమిని ఇచ్చేది లేదన్నారు. రైతు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. ఓ కంపెనీ పేరుతో భూముల్ని తీసుకుని, మరో సంస్థకు అప్పగించారని ఆగ్రహం -
సిటీలో ఆటో గ్యాస్ బంద్
శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల యుద్ధం, గల్ఫ్ దేశాలపై దాడులు వల్ల బెంగళూరులో వంట గ్యాస్, వాహనాలకు సీఎన్జీ, ఎల్పీజీ కొరత ఏర్పడింది. స్టాక్ లేక బుధవారం నగరంలోని పలు ఆటో గ్యాస్ బంక్లు బంద్ అయ్యాయి. బంక్లకు మంగళవారం నుంచి సక్రమంగా గ్యాస్ సరఫరా కాలేదంటూ యజమానులు మూసివేశారు. శేషాద్రిపురం–గుట్టహళ్లి వద్ద ఉన్న ఆటో గ్యాస్ బంక్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. పలుచోట్ల బంకుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం కేజీ గ్యాస్ రూ.65 ఉండగా ఇప్పుడు రూ. 80 అయ్యింది. ఓ బంక్ మేనేజర్ బాబు మాట్లాడుతూ, ఆటో గ్యాస్ సక్రమంగా సరఫరా కావడం లేదు. ఎక్కువ ధర పెట్టి కొని విక్రయించే స్తోమత లేదు. కొత్త స్టాక్ వచ్చిన తరువాత బంక్ను తెరుస్తామని తెలిపారు. ఉపాధికి గండిపడుతోందని డ్రైవర్లు ఆవేదన చెందారు. బెంగళూరులో ప్రముఖ ఆలయాలకు ఇబ్బంది వచ్చింది. ప్రసాదాలు, నైవేద్యాలు వండడానికి రోజుకు కనీసం 1 నుంచి 4 సిలిండర్లు కావాలి. మంగళవారం, శుక్ర, శనివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువ. గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. -
వాల్మీకుల నిరసన
తుమకూరు: రాష్ట్రంలో ఎస్టీ వర్గాలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ప్రభుత్వం 56,437 ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎస్టీ, ఎస్టీ సముదాయాల వివిధ డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ వాల్మీకి నాయక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రిజర్వేషన్ తమ హక్కు, భిక్ష కాదు, రిజర్వేషన్ కావాలి అని నినాదాలు చేశారు. యువతీ యువకులతో పాటు ఆ వర్గానికి చెందిన రిటైర్డు అధికారులు పాల్గొన్నారు. వీసా పేరిట మహిళకు రూ.5 లక్షల వంచనమైసూరు: సింగపూర్కు వెళ్లేందుకు వీసా చేయించి ఇస్తామని మహిళను వంచకులు నమ్మించి రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన మైసూరులో జరిగింది. గోకులం నివాసి, ఇంజనీర్ అయిన మహిళకు మెరిలియన్ వీసా సొల్యూషన్ అనే సంస్థ వాట్సాప్ ద్వారా వీసా చేయించి ఇస్తామని సందేశం వచ్చింది. దీనిని నమ్మిన ఆమె ఆ సంస్థను మొబైల్ నంబరు ద్వారా సంప్రదించింది. వారు చెప్పినట్లు ఖాతాకు దశల వారీగా రూ.5,34,272లను బదిలీ చేసింది. ఎన్నిరోజులైనా వీసా పని జరగలేదు. చాలాసార్లు ఫోన్ చేసినా స్పందన కరువవడంతో మోసపోయిన మహిళ సైబర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎయిర్పోర్టులో రూ.1.57 కోట్ల గంజాయి సీజ్ దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.1.57 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీ చెక్ చేస్తుండగా బ్యాగులో రహస్యంగా దాచి ఉంచిన 4.5 కేజీల హైడ్రో గంజాయి పట్టుబడింది. సరుకు విలువ రూ.1.57 కోట్లుగా అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని అరెస్టు చేశారు. డ్రైవరు దుర్బుద్ధి.. యజమాని ఇంట్లో చోరీ దొడ్డబళ్లాపురం: ఒక కారు డ్రైవర్ తన యజమాని ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన బెంగళూరు అమృతహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జక్కూరు నివాసి అభిలాష్ గౌడ (30) డ్రైవరు కాగా, రియల్టర్ ప్రతీక్ వద్ద గత 10 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ప్రతీక్ కుటుంబం అతన్ని సొంత కుటుంబీకునిగా చూసుకునేది. ఇంట్లో వారి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బు గురించి అభిలాష్ తెలుసుకున్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.14.65 లక్షల విలువైన బంగారు నగలను కొట్టేశాడు. అతని స్నేహితుడు మదన్ కూడా పాల్గొన్నాడు. కొన్ని రోజులకు ప్రతీక్ కుటుంబీకులు బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు చేసి అభిలాష్గౌడ ఎత్తుకెళ్లాడని, ఇప్పటికే అమ్మేశాడని గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి, బంగారాన్ని రికవరీ చేశారు. జయహో కోలారమ్మకోలారు: నగర దేవత కోలారమ్మ బ్రహ్మ రథోత్సవం బుధవారం నగరంలో ఘనంగా జరిగాయి. తహసీల్దార్ నయన, నగరసభ కమిషనర్ నవీన్చంద్ర, అర్చకులు పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటిపండ్లు విసిరారు. -
30 వేల లీటర్ల బీరు నేలపాలు
మైసూరు: కేఎస్బీసీఎల్ మైసూరు డిపో–1, కేఎస్బీసీఎల్ మైసూరు డిపో–2లో అమ్ముడు పోకుండా గడువు మీరిపోయిన వివిధ రకాల మొత్తం 30,366 లీటర్ల బీరు పానీయాన్ని కూర్గళ్లి డిపోలో ధ్వంసం చేశారు. మైసూరు ఉప విభాగ ఎకై ్సజ్ డీఎస్పీ హెచ్కే రమేష్ నేతృత్వంలో అధికారులు, ఉద్యోగులు బీరు బాటిళ్లలోని బీరును డ్రైనేజీలో పారబోశారు. దీనిపై మందుబాబులు సోషల్ మీడియాలో సరదాగా ఆవేదనను వ్యక్తంచేశారు. ఆ బీర్లను తమకు ఇచ్చి ఉంటే ఖాళీ చేసేవారమని, అధికారులకు శ్రమ తప్పేదని తెలిపారు. ఎక్కువ ధరల వల్లే ఇంత వృథా కాగా, ధరలు ఎక్కువగా ఉండడం వల్ల బీర్ల విక్రయాల తగ్గినట్లు అధికారులు తెలిపారు. మద్యం కంపెనీల నుంచి సరుకును డిపోలకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి వైన్స్ వ్యాపారులకు విక్రయిస్తారు. అయితే షాపుల్లో బీర్లకు గిరాకీ తగ్గిపోవడంతో డిపోలలో స్టాకు నిలిచిపోయి ఎక్స్పైరీ అవుతోందని వివరించారు. ప్రభుత్వం ధరలను తగ్గిస్తే గిరాకీ పెరిగి ఇలా వృథా కావడం తగ్గుతుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో. అధిక ధరల ఎఫెక్టు -
విద్యార్థి ఆత్మహత్యతో ఉద్రిక్తత
సాక్షి,బళ్లారి: మూడు రోజుల క్రితం తాళూరు రోడ్డులో నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో ఓ విద్యార్థి ఉన్మాదిగా మారి తన సహచర విద్యార్థులపై చాకు, రాడ్తో దాడి చేసి గాయపరిచి ఒకరిని చంపడంతో పాటు 8 మందిని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని సంజయ్గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న గుగ్గరహట్టికి చెందిన అరవింద్(17) అనే విద్యార్థి కళాశాలలో జరిగిన రగడపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల కళాశాలలో కొంత మంది విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి యాజమాన్యం మందలించింది. ఈ రగడలో అరవింద్ కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి, మందలించడంతో పాటు ఇలాంటి వారిని తాము తమ కళాశాలలో చదివించలేమని, ఇంటికి పంపిస్తామని ఘాటుగా హెచ్చరించడంతో మనస్తాపంతో అరవింద్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న స్థానిక బ్రూస్పేట పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక బిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తమ స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకుని కళాశాల వద్ద స్నేహితులు, బంధువులు ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి కళాశాలలోకి చొరబడి అద్దాలు పగులగొట్టి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి సోదరుడు గణేష్ మాట్లాడుతూ కళాశాలలో గొడవ జరిగిన తర్వాత తమ తల్లిదండ్రులను పిలిపించి తాము వచ్చే ఏడాది అడ్మిషన్ ఇవ్వమని, ఇంటికి పంపిస్తామని హెచ్చరించారన్నారు. ప్రిన్సిపాల్ కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదని, ప్రిన్సిపాల్ మానవతా విలువలు మరిచి నడుచుకున్నారని, దీంతో ఆవేదన చెందిన తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై బ్రూస్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి బలవన్మరణం కళాశాలలో జరిగిన ఘర్షణపై మందలింపు మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకున్న అరవింద్ బళ్లారిలో కలకలం రేపిన మరో విషాదం -
ఆస్పత్రిలో వృద్ధురాలు మృతి
రాయచూరు రూరల్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన జిల్లాలోని సింధనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం చికిత్స కోసం గంగమ్మ(80) అనే వృద్ధురాలు ఆస్పత్రిలో చేరారు. అయితే సాయంత్రానికి ఆమె మరణించింది. దీంతో ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు వృద్ధురాలికి సక్రమంగా చికిత్స అందించనందునే మరణించిందని ఆరోపిస్తూ, వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అర గంట సేపు రాయచూరు– సింధనూరు ప్రధాన రహదారిలో మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆకస్మికంగా ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే ఆస్పత్రి వద్దకు చేరుకున్న మాజీ జెడ్పీ అధ్యక్షుడు పంపనగౌడ బాదర్లి, పోలీసులు జోక్యం చేసుకుని రాజీ సంధానంతో సమస్యను పరిష్కరించారు. ఈ విషయంలో తాలూకా ఆరోగ్య అధికారి సురేష్గౌడ మాట్లాడుతూ వయో సహజ వృద్ధాప్య కారణంగా గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించినట్లుగా అనుమానం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళన -
రిజర్వేషన్ ఇచ్చేవరకు ఉద్యోగాల భర్తీ వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణలు, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియామకాలు జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. సర్కార్ ఈ విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం అందించారు. ఆందోళనలో రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, కిరిలింగప్ప, నరసప్ప, మౌనేష్లున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరం రాయచూరు రూరల్: నేటి సమాజంలో విద్యార్థుల్లో క్రమశిక్షణకు ఆద్యులు ఉపాధ్యాయులు అని రిమ్స్ రిటైర్డ్ నేత్ర చికిత్స అధికారి ప్రభనగౌడ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం దేవదుర్గలో జ్ఞానగంగ పాఠశాల వార్షికోత్సవంలో జ్యోతి వెలిగించి మాట్లాడారు. విద్యార్థుల్లో సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించాలన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో కళలను పోషించాలన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల సంస్థాపకులు శరణబసవ, భీమనగౌడ, చంద్రశేఖర్, శంకరలింగయ్య, సుభాష్చంద్రలున్నారు. మాదిగలకు రిజర్వేషన్ 50 శాతం మాత్రమే రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు కల్పించే రిజర్వేషన్ 50 శాతం మాత్రమే అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహేంద్ర కుమార్ మిత్ర, చలువాది మహాసభ సంచాలకుడు భాస్కర్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరుగుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 56 శాతం రిజర్వేషన్లు దాటితే ఉద్యోగాల్లో నియామకం చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతంతోనే ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొన్నారు. మాదిగ విద్యార్థులకు కుల ధ్రువీకరణ ప్రమాణ పత్రాలను అందించాలని ఒత్తిడి చేశారు. వలకు చిక్కిన భారీ చేపహొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని గండబొమ్మనహళ్లి చెరువులో ఒక మత్స్యకారుడు ఎప్పటిలానే వల వేశాడు. చిన్న చేపలు పడతాయని ఎప్పుడూ అనుకుంటూనే అతను నీటిలో నుంచి వలను పైకెత్తుతున్నాడు. ఆ సమయంలో వలలో చిక్కుకున్న ఒక పెద్ద చేపను చూసి అతను ఎంతో సంబర పడ్డాడు. చెరువులో నుంచి చేపలను ఒడ్డుకు తేవడం మత్స్యకారుడికి పెద్దగా ఇబ్బంది కలిగించింది. వావ్, ఎంత పెద్ద చేపో ! అని అతను ఆశ్చర్యపోయాడు. ఈ చేప ప్రస్తుతం 22 కిలోల బరువు ఉంది. కట్ల చేపగా గుర్తింపు పొందింది. మంచి వర్షాల కారణంగానే.. ఈ సారి మంచి వర్షాల కారణంగా చెరువులో భారీగా నీరు చేరింది. అందువల్ల చెరువులో ఒకే పరిమాణంలో చేపలు ఉండటం మత్స్యకారులకు శుభవార్తగా ఉంది. 22 కిలో బరువున్న జెయింట్ క్యాట్ఫిష్ ఇప్పటి వరకు మత్స్యకారులు పట్టిన అతిపెద్ద చేపగా మారింది. గతంలో వలలో పడిన రౌ, అరటి, జిలేబీ చేపలు ఒక్కొక్కటి కనీసం 5 నుంచి 7 కిలోల బరువు ఉండేవి. కానీ ఈసారి పట్టుకున్న 22 కిలోల క్యాట్ ఫిష్ చేపల ప్రియులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వలలో పడిన ఈ పెద్ద చేప ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చేపను ఔత్సాహికులు రూ.3,300 ధరకు కొనుగోలు చేశారు. -
మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగదు
రాయచూరు రూరల్: రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మహదేవప్పను మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అవమానించడం తగదని కేపీసీసీ మాజీ కార్యదర్శి అమరేష్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దావణగెరెలో ఎస్సీ, ఎస్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారన్నారు. అలాంటి నాయకులను పట్టుకొని చెంప పగల గొట్టాలని వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. మంత్రిని కొట్టే ధైర్యముంటే శివనగౌడ సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. రేషన్ బియ్యం పట్టివేతహొసపేటె: నగరంలోని కూడ్లిగి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి బుధవారం స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా కూడ్లిగి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది బృందం ఈ దాడి నిర్వహించారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా రవాణా చేస్తున్న మినీ లారీని పట్టుకుని తనిఖీ చేయగా, రేషన్ బియ్యం అని తేలింది. మొత్తం 360 బస్తాల్లో నింపిన 18,240 కిలోల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారు రూ.4,10,400 ఉంటుందని అంచనా వేశారు. ఘటనపై కూడ్లిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ సరికాదురాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. బుధవారం జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. నూతన విద్యుత్ చట్టం–2025ను ఉప సంహరించుకోవాలన్నారు. ఉద్యోగుల, కార్మికులకు రక్షణ కల్పించాలన్నారు. విద్యుత్ వినియోగదారుల, రైతుల, చిన్న వ్యాపారుల సమస్యలను సరిదిద్దాలని కోరుతూ జెస్కాం ఇంజనీర్ దేశాయికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో జ్యోతి బసవ, హులిగప్ప, శివ కుమార్, రామణ్ణ, అణ్ణప్ప, వీరేష్ బాబు, వీరభద్రయ్య, మహేంద్ర సింగ్లున్నారు. సామాజిక బాధ్యత అందరి బాధ్యతహొసపేటె: సామాజిక బాధ్యత అనేది పరిశోధన బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ఏ రంగంలో నైనా, ఏ వృత్తిలోనైనా పాల్గొన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ విమర్శకుడు, హంపీ కవివి కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు డాక్టర్ బంజగెరె జయప్రకాష్ అన్నారు. బుధవారం హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలోని భువన విజయ ఆడిటోరియంలో విద్యా సంస్థ తరపున పరిశోధన, సామాజిక బాధ్యత అనే అంశంపై ఆయన మాట్లాడారు. పరిశోధన చేపట్టకూడదు. ఒక పరిశోధకుడికి తన రంగంలో నైపుణ్యం ఉండాలి. ఈ రోజుల్లో పరిశోధన ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏమిటంటే, ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏ దృక్కోణం నుంచి, ఏ ఆసక్తితో అర్థం చేసుకోవాలి, ఏ అంశాన్ని అధ్యయనం చేసినా దానిని సరైన దృక్కోణం నుంచి ప్రదర్శించాలని ఆయన అన్నారు. సెక్యూరిటీగార్డు ఇంటిలో చోరీశివమొగ్గ: సెక్యూరిటీ గార్డు ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన శివమొగ్గ తుంగా నగర పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీరాంపురలో జరిగింది. శ్రీరామపురలో నివాసం ఉంటున్న సెక్యూరిటీ గార్డు విధి నిర్వహణకు వెళ్లిన సమయంలో దొంగలు ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి లోపలకి చొరబడి రూ.4 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు, బీరువాలోని రూ. 20 వేల నగదు దోచుకుని పారిపోయారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుంగా నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
దక్కని పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్
హుబ్లీ: కర్ణాటక పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వని కారణంగా బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ అధ్యక్షుడు లింగరాజ పాటిల్ రాజీనామా సమర్పించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 37 ఏళ్ల నుంచి పార్టీకి చిత్తశుద్ధితో కార్యకర్తగా పని చేశాను. పార్టీ అప్పగించిన ఎన్నో పనులను సమర్థవంతంగా నిర్వర్తించాను. అయినా తనకు టికెట్ ఇవ్వక పోవడంతో చాలా బాధ కలిగిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాగా ఎస్వీ సంకనూరుకు ఆ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన్ను మార్చి ఆ టికెట్ తనకు ఇవ్వడానికి ఇంకా సమయం ఉందన్నారు. 8 రోజుల్లో పార్టీ పెద్దలు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని లేఉకంటే తన తదుపరి నిర్ణయాలను వెల్లడిస్తానన్నారు. పార్టీలో నిష్టావంతులైన కార్యకర్తలకు విలువ లేదన్నారు. అందుకే రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందడం లేదన్నారు. హుబ్లీ– ధార్వాడల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగరాదన్న ఉద్దేశంతోనే తనకు రావాల్సిన టికెట్ను చాడీలు చెప్పి తప్పించారని ఆరోపించారు. గత ఎన్నికల వేళ సంకనూరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించినా కూడా ఈ సారి పార్టీ ఆయనకే టికెట్ కేటాయించడంతో కార్యకర్తలకు ఎంతో ఆవేదనను కలిగించిందన్నారు. పార్టీ తనకు చేసిన ద్రోహం సమస్త కార్యకర్తలకు చేసిన అన్యాయం అన్నారు. పార్టీ నాకు తల్లిలాంటిది, పార్టీని వీడను అయితే తన వైఖరి మాత్రం మారుతుందని తెగేసి చెప్పారు. బీజేపీకి లింగరాజ పాటిల్ రాజీనామా -
రిజర్వేషన్ కోసం రాయచూరు బంద్ ప్రశాంతం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కోరుతూ కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ ఆధ్వర్యంలో రాయచూరు బంద్ పూర్తిగా విజయవంతమైంది. ఉదయం నుంచే ఐక్య వేదిక మహాసభ కార్యకర్తలు నగరంలో కలియ తిరుగుతూ బంద్ చేయించారు. అంబేడ్కర్ సర్కిల్ వద్ద ముగ్గురు కార్యకర్తలు శరీరంపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు రంగంలో దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బాబూ జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ సర్కిల్, బసవేశ్వర సర్కిల్, గంజ్ సర్కిళ్ల వద్ద ఆందోళన చేపట్టి వాహనాల రాకపోకలను స్తంభింప చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వెలవెల ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేకపోవడంతో బోసిపోయింది. ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అంగళ్లు, హోటళ్లు బంద్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు యథావిథిగా పని చేశాయి. రాయచూరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు రవాణా సౌకర్యాలు స్తంభించి పోయాయి. తెలంగాణలోని గడినాడు టైర్ రహదారి వద్ద ఆరు కి.మీ.ల దూరం వాహనాలు నిలిచి పోయాయి. తీన్ కందిల్, సూపర్ మార్కెట్, షరాఫ్ బజార్, పటేల్ రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, గంజ్ రహదారులు వాహన సంచారం లేక ప్రజల సందడి లేక బోసిపోయాయి. రాయచూరు నుంచి మంత్రాలయం, బళ్లారి, కర్నూలు, శ్రీశైలం, దావణగెరె, హైదరాబాద్, కలబుర్గి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు. బంద్తో మూతపడిన అంగళ్లు, హోటళ్లు ముగ్గురు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం తెలంగాణ, ఏపీలకు నిలిచిన రాకపోకలు -
కుట్టుతో మహిళలకు జీవనోపాధి
బళ్లారిఅర్బన్: మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగల శక్తికలిగిన వారని, ఇలాంటి మహిళలకు కుట్టు(టైలరింగ్) వృత్తి జీవనోపాధి కల్పిస్తుందని బీజేపీ మహిళా మోర్ఛా జిల్లా అధ్యక్షురాలు హంపీ రమణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింధిగి కాంపౌండ్లో ప్రతిభా మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లను అందజేసి మాట్లాడారు. కుట్టు శిక్షణ ద్వారా నైపుణ్యం పెంపొందించుకున్న మహిళలు తమ ప్రతిభతో కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవగలరన్నారు. ఉన్నత విద్య లేక పోయినా కృషి నైపుణ్యంతో మహిళలు తమ జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకొని స్వతంత్రులుగా ఎదగగలరన్నారు. ప్రతిభా మహిళ మండలి అధ్యక్షురాలు సుజాత రవిచంద్ర మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారత కోసం సంస్థ తరచు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు తమ ప్రతిభతో స్వయం ఉపాధి పొందుతూ ఇతర మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. బీజేపీ మహిళా మోర్ఛా రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి, శిక్షణ పొందిన అనేక మంది మహిళలు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన ఈత సరదా
హుబ్లీ: ఇద్దరు చిన్నారులు ఈత సరదాతో జలసమాధి అయిన ఘటన హుబ్లీలోని నవనగర్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఇద్దరు కళాశాల విద్యార్థులు తీవ్రమైన ఎండల నేపథ్యంలో స్నానానికి ఇంటి దగ్గరలోని నీటి గుంత దగ్గరకు వెళ్లారు. అయితే వారిద్దరికీ సరిగ్గా ఈత రాని కారణంగా ఇద్దరు స్నేహితులు జలసమాధి అయ్యారు. పిల్లలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆవేదనతో రగిలి పోయారు. నగరంలోని బైరిదేవరకొప్ప రేణుకా నగర్ నివాసులైన సమర్థ్(17), హరీష్(17) అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు శవాలుగా లభ్యమయ్యారు. వీరిద్దరూ స్థానిక గోపనకొప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ విభాగంలో ప్రథమ పీయూసీ చదివేవారు. ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంట్లోనే ఉండేవారు. బయట ఎండలు మండిపోతుండడంతో ఇంటి దగ్గరలోని నిర్మాణ దశలోని ఆర్ఎన్ఎస్ గాల్ఫ్ మైదానంలోని గుంత దగ్గరకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా ఆచూకీ లేదు మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన వారు సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆ మైదానంలోని కార్మికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈత రాకపోయినా ఈ ఇద్దరు వారి కుటుంబాల్లో ఏకై క సంతానాలైన తమ బిడ్డల శవాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల శోకం కట్టలు తెంచుకుంది. ఘటనపై ఏపీఎంసీ నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తమ పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని, వేసవిలో తమ పిల్లలపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు పోలీసు అధికారులు సూచించారు. నీటి కొలనులో ఇద్దరు బాలుర జల సమాధి -
మిరప ధర ఘనం.. దిగుబడి పతనం
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్న సామెత చందంగా మార్కెట్లో మిరప ధరలు పెరిగినా పొలాల్లో దిగుబడి మాత్రం క్షీణించింది. దీనికి తోడు ఇరాన్– ఇజ్రాయెల్–అమెరియా దేశాల మధ్య యుద్ధంతో రైతన్న పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ముఖాల్లో కళ లేదు. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలోని కొప్పళ, రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్ జిల్లాల్లో తుంగభద్ర, కృష్ణా నదులున్నా నీరు అందక రైతుల పొలాల్లో వేసుకున్న మిరప పంట ఆశించిన మేర దిగుబడి రాలేదు. బోరుబావుల కింద పంటలు పండించాలంటే విద్యుత్ కోతలు అధికమయ్యాయి. రాయచూరు జిల్లాలో తుంగభద్ర, కృష్ణా నదులున్నా వ్యవసాయ పనులు లభించక కూలికార్మికులకు ఉపాధి కోసం దేశాటన తప్పడం లేదు. రైతులు రాయచూరు జిల్లాలో 50 వేల ఎకరాల్లో మిరప, 86 వేల ఎకరాల్లో కందులు సాగు చేశారు. కాలువకు నీరందక భూములు బీళ్లుగా మారాయి. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక మిరప పంట చేతికి అందదనే ఆందోళనతో అక్కడక్కడా నీటిని కడవలు, బిందెలతో మోసిపోశారు. బ్యాడగి రకం మిరపకాయలు క్వింటాల్ ధర రూ.14 వేలు, గుంటూరు రకం మిరప కాయలు క్వింటాల్ ధర రూ.12,675, ఇతర రకాలకు క్వింటాల్ ధర రూ.8 వేల చొప్పున మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. యుద్ధం కారణంగా ఇతర దేశాలకు మిరప కాయల ఎగుమతులు నిలిచిపోయి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లో ఆశాజనకంగా మిర్చి ధరలు రైతులకు శాపంగా పశ్చిమాసియా యుద్ధం దిక్కుతోచని స్థితిలో కళ్యాణ కర్ణాటక రైతులు -
తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా
హొసపేటె: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో దేశీయంగా వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై దుష్ప్రభావం పడింది. దీంతో నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. యుద్ధంతో సిలిండర్ల కొరత ఏర్పడటంతో గృహ వినియోగదారులు, హోటల్ పరిశ్రమలో ఆందోళనకు కారణమైంది. సాధారణంగా ప్రతి రోజూ రెండు నుంచి మూడు లోడ్ల గ్యాస్ సిలిండర్లు నగరానికి వస్తాయి. కానీ బుధవారం ఒక లోడ్ మాత్రమే రావడం గమనార్హం. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపి వేయడం హోటల్, వ్యాపార రంగానికి ఇబ్బందులను కలిగించింది. దీనిపై నగరంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ విజయ్కుమార్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సరఫరా సమస్య నెలకొందన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్లు మాత్రమే సరఫరా అవుతున్నాయన్నారు. బుధవారం 360 సిలిండర్లు మాత్రమే రాగా నగరంలో 720కి పైగా సిలిండర్లను వినియోగదారులు ముందే బుక్ చేసుకున్నారన్నారు. ఈ కారణంగా సరఫరాపై ఒత్తిడి పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. -
టిప్పర్ డ్రైవర్తో వివాహేతర సంబంధం..!
కర్ణాటక: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్కు సిఫార్సు చేసింది. మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సోషల్ మీడియాలో పరిచయం… లాడ్జికి పిలిచి..!
కర్ణాటక : శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
రాజస్థానీ గజదొంగ పట్టివేత
బనశంకరి: తాళం వేసిన ఇళ్లలో బంగారం, డబ్బును ఎత్తుకెళ్లే రాజస్థానీ దొంగను బెంగళూరు యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.3 కోట్ల విలువచేసే వజ్రాలు, నగలను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. రాజస్థాన్కు చెందిన వల్లరాం మీనా అలియాస్ సునీల్ (19) ఈ దొంగ. గత నెల15వ తేదీన ఆర్టీ నగరలో ఓ టెక్కీ ఇల్లు తాళం వేసి ఉండగా, టెర్రస్ మీద తలుపు బద్దలుకొట్టి ఇంట్లోకి చొరబడి వజ్రాలు, బంగారు ఆభరణాలు దోచుకున్నాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాజస్థాన్లోని గింగలా ఠాణా పరిధిలోని మణగిరిపాల గ్రామంలో సునీల్ను అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన 1.8 కేజీల బంగారు నగలు, వజ్రాల ఆభరణాలను అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.3 కోట్ల బంగారం సీజ్ -
బస్సులో మహిళపై చిల్లర పడేసి, గొలుసు చోరీ
మైసూరు: మైసూరులో రెండుచోట్ల మహిళల బంగారు గొలుసులను దుండగులు తెంచుకెళ్లారు. వివరాలు.. వృద్ధురాలి మెడలోని 40 గ్రాముల గొలుసు చోరీ చేసిన ఘటన ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నీలమ్మ (60) అనే మహిళ బెళ్లూరు క్రాస్ నుంచి మైసూరుకు వచ్చే బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు అపరిచిత మహిళలు శిశువుతో సహా శ్రీరంగపట్టణలో బస్సు ఎక్కారు. శిశువు వాంతులు చేసుకుంటోంది, కిటికీ పక్కన స్థలం ఇవ్వాలని నీలమ్మను అడిగితే తిరస్కరించింది. కొలంబియా ఆస్పత్రి వద్దకు బస్సు చేరుకోగానే మహిళలు బస్సు దిగబోతూ తమ లగేజీని తీస్తూ నీలమ్మపైకి చిల్లరను పడేశారు. చిల్లరను తీసిచ్చేందుకు నీలమ్మ వంగినప్పుడు ఆమె మెడలోని బంగారు గొలుసును కట్ చేసుకున్నారు. ఎల్ఐసీ స్టాప్ రాగానే మహిళలు బస్సు దిగి వెళ్లిపోయారు. నీలమ్మ ఇంటికి వెళ్లిన తరువాత చూసుకుంటే గొలుసు లేదు. చిల్లర డబ్బులు వంటిపై పడినప్పుడు ఏదో మైకం కమ్మినట్లయిందని నీలమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. టీవీ చూస్తుండగా చొరబడి... మైసూరు చామరాజ మొహల్లా నివాసి ఇంద్రాణి సోమవారం రాత్రి 9.45 గంటల సమయంలో గాలి రావడం లేదని ఇంటి తలుపును తెరిచి ఉంచి టీవీ చూస్తోంది. ఆ సమయంలో దుండగుడు చొరబడి ఇంద్రాణి ముఖం, కళ్లపై స్ప్రే చేసి ఆమె మెడలోని 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. ఆమె లక్ష్మీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఇది ఖాళీ ట్రంకు.. మీది ఖాళీ డ్రమ్ము
అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తున్న విద్యార్థులుమాట్లాడుతున్న డీసీఎం శివ, చిత్రంలో సీఎం శివాజీనగర: డీసీఎం డీకే శివకుమార్ సీఎం సిద్దరామయ్యకు మద్దతు ఇస్తున్నారంటే ఏదో శుభ సమాచారం ఉంటుందని అర్థమని విధానసభలో బీజేపీ పక్ష ఉప నేత అరవింద బెల్లద్ అన్నారు. మంగళవారం బడ్జెట్పై చర్చల్లో బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ మాట్లాడుతూ, ఇది క్రెడిట్ కార్డు బడ్జెట్ మాదిరిగా ఉంది, ఆర్థిక క్రమశిక్షణ లేదు, అప్పులు అనే ఆక్సిజన్తో బతుకుతోంది అని ఎద్దేవా చేశారు. ఇది ఖాళీ ట్రంక్, ఖాళీ చెంబు అన్నారు. ఇంతలో డీసీఎం డీ.కే.శివకుమార్ నిలబడి, అలాగైతే మీ కేంద్ర బడ్జెట్ ఖాళీ డ్రమ్ము అని అనవచ్చా? మీరు బడ్జెట్కు ముందే ఖాళీ చెంబులతో వచ్చారంటే మీ భావం ఏమై ఉంటుంది? అని అన్నారు. బెల్లద్ స్పందిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజున కనిపించని డీకే హఠాత్తుగా బడ్జెట్ చర్చలో తలదూర్చరాదని బీజేపీ ఎమ్మెల్యేలు కేకలు వేశారు. ఆర్థిక శాఖను వద్దన్నా: సీఎం అశోక్ మాట్లాడుతూ గొర్రెలను లెక్కించడం రాని సిద్దరామయ్యను హెచ్.డీ.దేవేగౌడ ఆర్థికమంత్రిని చేశారన్నారు. అప్పుడు సీఎం సిద్దరామయ్య జోక్యం చేసుకుంటూ.. తాను రెవిన్యూ శాఖను కోరితే, దేవేగౌడ ఆర్థిక శాఖ ఇచ్చారని, వద్దన్నా వినలేదని చెప్పారు. స్పీకర్ ఖాదర్ ఇక చాలని చెబుతుండగా, తమరు రంజాన్ నెల ఉపవాసంలో ఉన్నారు. కోపం అధికంగా ఉంటుంది. శాంతియుతంగా నా మాటలు వినాలని అశోక్ కోరారు. స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్టే యశవంతపుర: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్తో జరపాలని కర్ణాటక గ్రామ స్వరాజ్ – పంచాయతి రాజ్ సవరణల బిల్లుపై అసెంబ్లీలో చర్చించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ సభ్యులు అనుమానాలున్నాయన్నారు. పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని బిల్లులో తీర్మానించారు. పంచాయతిరాజ్శాఖ తరఫున శాసనసభ వ్యవహారాల మంత్రి హెచ్కె పాటిల్ కర్ణాటక స్వరాజ్, పంచాయతి రాజ్ సవరణలు–2026 బిల్లును విధానసభలో ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లపై జరిగే దాడులు, బెదిరింపులు వంటివి అడ్డుకోవడానికి బిల్లులో చర్యలు ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై విధానసభలో కాంగ్రెస్, బీజేపీ నేతల విమర్శలు -
శిబిరంలో ఏనుగు కన్నుమూత
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా నాగరహొళె పరిధిలోని మత్తిగోడు ఏనుగుల పోషణ శిబిరంలో ఉన్న జూనియర్ అభి (23) అనే ఏనుగు అనారోగ్యంతో మరణించింది. ఈ ఏనుగును అడవి ఏనుగుల పట్టివేతకు ఉపయోగించేవారు. ఎనిమిదేళ్ల క్రితం ఇది మేత మేస్తూ గుంతలోకి పడడంతో ముందు ఎడమ కాలు విరిగి తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి పశువైద్యుడు డాక్టర్ రమేష్ చికిత్స అందిస్తున్నారు. కొంతమేరకు కోలుకుని కుంటుతూనే శిబిరంలో తిరుగాడేది. అయితే కొన్ని రోజులుగా నడవలేక ఒకేచోట కూర్చుండిపోయింది. చివరకు మంగళవారం కన్నుమూసింది. డీసీఎఫ్ సీమా, ఏసీఎఫ్ లక్ష్మీకాంత్, ఆర్ఎఫ్ఓ దేవరాజ్ పరిశీలించి అంత్యక్రియలు చేయించారు. మరిన్ని విమానాల రద్దు దొడ్డబళ్లాపురం: ఇరాన్– ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతుండగా, బెంగళూరు కెంపేగౌడ విమనాశ్రయం నుంచి అరబ్ దేశాలకు వెళ్లే విమానాలు క్యాన్సిల్ అవుతున్నాయి. మంగళవారంనాడు కూడా ఇక్కడకు రావాల్సిన 8 విమానాలు, వెళ్లాల్సిన 9 విమానాలు రద్దయ్యాయి. సరుకు రవాణా విమానాలు కూడా రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి ఇక్కడ విమానాలచే సరుకు రవాణా 30 శాతం తగ్గింది. క్షుద్రపూజల పార్శిల్ విమానాశ్రయంలో ఉన్న పోస్టాఫీసుకు వచ్చిన ఒక పార్శిల్ కలకలం రేపింది. పార్శిల్లో ఒక మహిళ, ఒక పురుషుని నగ్న ఫోటోలు, ఫోటోల చుట్టూ కుళ్లిన టమాటాలు, పూలహారాలు, మేకులు, టూత్పేస్ట్ తదితర వస్తువులు ఉంచారు. పార్శిల్ విప్పిచూసిన సిబ్బంది భయపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 22న ఓ అపరిచితుడు ఎయిర్పోర్టులో సంచరించాడు, ఆపై పాలక మండలి కార్యాలయానికి పోస్టు ద్వారా పార్శిల్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేటి నుంచి ప్రభుత్వ వైద్యుల సమ్మె? శివాజీనగర: నేడు బుధవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సమ్మె చేయనుండగా, ఓపీ సేవలు స్తంభించే అవకాశం ఉంది. బెంగళూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన ఉంది. సాధారణ జబ్బులతో చికిత్స కోసం వెళ్లే రోగులకు సేవలు అందవని వైద్యులు చెబుతున్నారు. 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రనాథ్ మేటి చెప్పారు. ఆరోగ్య మంత్రి దినేశ్ గుండురావు విధానసభలో మాట్లాడుతూ వైద్యుల సమ్మె నిజమేనని తెలిపారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే వైద్యుల సంఘం నేతలతో చర్చలు జరుపుతామని తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా సమ్మెను వెంటనే పరిష్కరించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రా.. రమ్మంటూ తీయని వల ● బెళగావిలో ఘరానా కిలేడీ అరెస్టు యశవంతపుర: శ్రీమంతులను గురి పెట్టి పరిచయం చేసుకొని తీయని మాటలతో వల వేసి దోచేస్తున్న కిలాడీ బాగోతమిది. బాగలకోట జిల్లా మహాలింగపురకు చెందిన దీప అవటగి (35)ని బెళగావి పోలీసులు అరెస్ట్ చేయగా, ఆమె స్నేహితుడు శివానంద మఠపతి పరారీలో ఉన్నాడు. శివానంద బెళగావి జిల్లా హుక్కేరివాసి, దీపకు శ్రీమంతుల వివరాలను అందించేవాడు. ఆమె ఫేస్బుక్, ఇన్స్టాలో అలాంటివారిని పరిచయం చేసుకొని బుట్టలో వేసుకొనేది. అశ్లీల చాటింగ్ చేసి, బెళగావిలో లాడ్జికి పిలిచేది. ఇలా ఓ బాధితుడు లాడ్జికి రాగానే స్నానాల గదిలోకి పంపించి, తాళం వేసుకొని బట్టలు, నగదు, మొబైల్, కారు తాళం తీసుకుని పరారైంది. పైగా డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో బయట పడింది. కాల్ రికార్డింగులు, సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితురాలిని బెళగావిలోని తిళకవాడి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఆర్భాటంగా డీకేశి విందు
శివాజీనగర: కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ మంగళవారం రాత్రి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బెంగళూరులోని ఓ విలాసవంత హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. సీఎం పదవి కోసం డీకే తీవ్రంగా పోరాడుతున్న తరుణంలో ఈ విందు భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం సిద్దరామయ్యతో సహా మంత్రులందరినీ డీకే ఆహ్వానించారు. డీకే మీడియాతో మాట్లాడుతూ.. తన కేపీసీసీ పదవీ కాలం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో వివరంగా మాట్లాడతానని తెలిపారు. వృద్ధున్ని చంపి.. వృద్ధురాలిపై అత్యాచారం● సైకో కిల్లర్ దాష్టీకం క్రిష్ణగిరి: క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలో పొలంలో నివసిస్తున్న వృద్ధ జంటపై గుర్తుతెలియని దుండగుడు కిరాతకంగా దాడి చేశాడు. వృద్ధున్ని హత్య చేసి వృద్ధురాలిపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఊత్తంగేరి సమీపంలోని ఓ గ్రామశివార్లలో 70 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల వృద్ధురాలు పొలం వద్ద ఉన్న ఇంట్లో కాపురం ఉంటున్నారు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ దుండుగుడు వెళ్లి ఇంటి బయట నిద్రిస్తున్న వృద్ధుని తలపై బండరాయితో బాదాడు. అతడు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న అతని భార్య బయటకు వచ్చింది, ఆమెను లోపలికి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దంపతుల ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొనేలోపు కిరాతకుడు పరారయ్యాడు. కొంతసేపటికే వృద్ధుడు చనిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న వృద్దురాలిని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సేలం డివిజన్ డిఐజి సంతోష్ హదిమణి, జిల్లా ఎస్పీ తంగదురై, పోలీసులు చేరుకుని హంతకుని వేలిముద్రలను సేకరించారు. గాలింపు చేపట్టారు. దుండగుడు సైకో కిల్లర్ అయి ఉంటాడని ప్రచారం సాగడంతో స్థానిక గ్రామాల్లో తీవ్ర అలజడి నెలకొంది. ముని మనవని హత్య కేసులో అవ్వ అరెస్టు బాగేపల్లి: తన మనవరాలు మతాంతర ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె చిన్నారి కుమారున్ని హత్య చేసిన కేసులో కిరాతక అవ్వ మహబూబ్ బీని చేళూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. డిసెంబర్ 24న చేళూరు పట్టణంలో తన మనవరాలు 40 రోజుల కొడుకును మహబూబ్బీకి ఇచ్చి హోటల్లో పనికి వెళ్లింది. తన మనవరాలు వేరే మతం యువకున్ని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఉన్న వృద్ధురాలు.. ఆ పసిగుడ్డును గొంతు పిసికి చంపి, సమీపంలో పూడ్చి పెట్టేసింది. అనారోగ్యం కారణంగా ఊపిరి ఆడకుండా చనిపోయాడని కథలు చెప్పింది. అనుమానంతో శిశువు తల్లి చేళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆ శిశువు ఊపిరి ఆడకుండా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అవ్వను గట్టిగా ప్రశ్నించడంతో నిజం అంగీకరించింది. అవ్వని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రియుని కోసం కట్టుకున్నోడిని కాటికి పంపి.. ●భార్యతో పాటు నలుగురు అరెస్ట్ మండ్య: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిందో భార్య. ఆమెతో పాటు నలుగురు నిందితులను శ్రీరంగపట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తాలూకాలోని మారళగాల గ్రామ అర్చకుడు సిద్ధలింగప్ప తన అక్క కుమార్తె షాలినిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాలినికి అదే ఊరికి చెందిన టిప్పర్ డ్రైవర్ హరీశ్తో వివాహేతర సంబంధం ఉంది. ఒకరోజు షాలిని, హరీశ్ ఏకాంతంగా ఉన్నప్పుడు భర్తకు దొరికిపోయారు. ఇలాంటి పనులు చేయరాదని భార్యను మందలించడంతో ఆమె కక్ష పెంచుకుంది. తన భర్తను చంపేయమని హరీశ్కు సిఫార్సు చేసింది. మార్చి 6న రాత్రి అర్చకుడు సిద్ధలింగప్ప.. కె.శెట్టిహళ్లి గణపతి దేవస్థానంలో పూజ ముగించుకుని ఇంటికి పయనమయ్యాడు. హరీశ్, మరో టిప్పర్ డ్రైవర్ సంతోష్ కుమార్తో కలసి గ్రామం వద్ద ఉన్న కాలువ ఏరియా నిర్మానుష్య ప్రాంతంలో అర్చకుడిని అడ్డగించారు. కట్టెలతో బాది చంపేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అక్కడక్కడ అతని వస్తువులు వేసి, బైక్ను కాలువలోకి పడేశారు. 7న సీడీఎస్ కాలువలో సిద్ధలింగప్ప మృతదేహం లభించింది. ముఖానికి, తలకు గాయాలున్నాయి. ఎవరో వ్యక్తులు దాడి చేసి చంపి ఉంటారని భావించి అతడి అన్న బాలసుందర్ శ్రీరంగపట్టణ గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ శోభారాణి ప్రత్యేక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి మార్చి 9న హరీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. సిద్ధలింగప్ప భార్య షాలిని, సంతోష్ కుమార్, గణేశ్తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్లు అంగీకరించాడు. షాలిని , హరీశ్, సంతోష్ కుమార్, గణేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఇద్దరు రౌడీల అరెస్టు, పిస్టళ్ల స్వాధీనం
కృష్ణరాజపురం: అక్రమంగా పిస్టళ్లు కలిగిన బెంగళూరు, మైసూరు రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. నాగేంద్ర, సొహైల్ లాక్ పట్టుబడిన నిందితులు. ఓ రౌడీ సహచరుడైన నాగేంద్రపై నాలుగు హత్య కేసులున్నాయి. వీటిలో రెండింట్లో అరెస్టు వారంట్ జారీ అయింది. గత ఏడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నాగేంద్ర ఇటీవల బన్నేరుఘట్ట మెయిన్ రోడ్డులో బాడుగ ఇంట్లో మకాం వేశాడు, పోలీసులు పసిగట్టి అతన్ని బంధించారు. అతని వద్ద ఓ పిస్టల్ లభించింది, విచారించగా మైసూరుకు చెందిన ప్రముఖ రౌడీషీటర్ సొహైల్ లాక్ దానికి విక్రయించాడని, అతనిపై 7 కేసులున్నాయని తేలింది. ఇందులో 5 హత్యాయత్నం కేసులు. వారి నుంచి 2 పిస్తోళ్లు, కొన్ని తూటాలను సీజ్ చేసిశారు. -
కమనీయం.. కన్నంబాడి రథోత్సవం
మైసూరు: జిల్లాలోని పిరియాపట్టణ శక్తిదేవతల్లో ఒకరైన కన్నంబాడి అమ్మవారి బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. ఉదయమే ఆలయంలో అమ్మవారికి కలశారోహణం, బలిపూజ తదితర పూజలను నెరవేర్చారు. అమ్మవారిని పల్లకీలో కూర్చొబెట్టి దేవస్థానం చుట్టుపక్కల ప్రదక్షిణ చేశారు. మేళతాళాలతో అలంకరించిన తేరులో అమ్మవారిని కూర్చొబెట్టి భక్తుల జయజయధ్వానాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వృషభ లగ్నంలో రథోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద నుంచి బీఎం రోడ్డు వరకు రథాన్ని లాగారు. రథంపైకి ధవనం, పండ్లు విసిరి భక్తిని చాటారు. వందలాది మంది కొత్త దంపతులు పాల్గొన్నారు. మైసూరు, కొడగు తదితర చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కల సేకరణ
హొసపేటె: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి మే 15 వరకు మొదటి దశ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, అధికారులు ఖచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని ఏడీసీ ఈ.బాలకృష్ణ ఆదేశించారు. భారత జనాభా లెక్కల సేకరణ–2027లో భాగంగా జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బందికి సోమవారం జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో 3 రోజుల శిక్షణ సదస్సును ప్రారంభించి ఆయన మాట్లాడారు. జనాభా గణన మొదట 1872లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు మొత్తం 15 జనాభా గణనలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం తర్వాత 8 జనాభా గణనలు జరిగాయి. మునుపటి జనాభా గణన 2011లో జరిగింది. ఆ ప్రకారం 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడింది. మొదటి సారిగా జనాభా లెక్కలను దేశ వ్యాప్తంగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ మోడ్లో నిర్వహించనున్నారు. అందువల్ల అధికారులు జిల్లాలోని పట్టణ, తాలూకా, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితమైన, సృష్టమైన డేటాను సేకరించాలని ఆయన సూచించారు. జనాభా లెక్కల సేకరణ కోసం గణకదారులు, పర్యవేక్షకులను నియమించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 6 మంది, పట్టణ ప్రాంతాల్లో 8 మంది జనాభా లెక్కల సేకరణలో పాల్గొంటారన్నారు. లెక్కింపు సమయంలో ఏదైనా గందరగోళం ఉంటే వారు పర్యవేక్షకులు లేదా ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆయన అన్నారు. తహసీల్దార్ శృతి, సీడీపీఓ అన్నదానయ్య, మున్సిపల్ కౌన్సిలర్ శివకుమార్ ఎర్రగుడి, వర్క్షాప్ ప్రజెంటర్లు మాథ్యూ, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ద్రాక్ష సాగు.. లాభాలు బాగు
రాయచూరు రూరల్ : రూ.లక్షలాది ఖర్చు పెట్టి చదివిన చదువుకు తగిన వేతనంతో కూడిన ఉద్యోగం లభించక చివరికి డిప్లొమా చదివిన ఓ విద్యార్థి ద్రాక్ష పంటను సాగు చేసి అధిక దిగుబడిని సాధించి లాభాలను గడిస్తూ రైతే రాజు అని నిరూపించారు. జిల్లాలోని లింగసూగూరు తాలూకాకు చెందిన కెసరట్టి రవికుమార్ ద్రాక్ష సాగులో దిట్టగా నిలిచారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన రవికుమార్ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యానవన శాఖ అధికారుల సలహా సూచనలతో విజయపుర జిల్లా జమఖండి తాలూకా బిదరి నుంచి నాలుగేళ్ల క్రితం 3 వేల ద్రాక్ష మొక్కలను తెచ్చి ఐదు ఎకరాల తోటలో వాటిని నాటారు. పంట మంచి దిగుబడి రావడంతో ఏడాదికి రూ.22 లక్షల మేర ఆదాయం గడించారు. ఎండిన ద్రాక్షను మహారాష్ట్రలోని సాంగ్లీ వద్ద గోదాములో నిల్వ ఉంచి మంచి ధర లభించగానే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో దానిమ్మ, మోసంబి, జామ, ఇతర వాణిజ్య పంటలను సాగు చేశానని తెలిపారు.ద్రాక్ష గుత్తులను బుట్టల్లో నింపుతున్న దృశ్యం చెట్టుకు ఏపుగా పెరిగిన ద్రాక్ష గుత్తులు పంట సాగులో దిట్ట రవికుమార్ ఏడాదికి రూ.22 లక్షల ఆదాయం రైతే రాజు అని నిరూపించిన వైనం -
11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
● బైక్ల చోరుని అరెస్ట్ హొసపేటె: బైక్లను దొంగలించిన దొంగను చిత్తవాడిగి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ హొసపేటె, బళ్లారి, కొప్పళ జిల్లాల్లో వివిధ చోట్ల దొంగలించిన రూ.5 లక్షల విలువైన 11 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ తాళాలను ఉపయోగించి హ్యాండ్లాక్లను తెరిచి బైక్లను దొంగిలించేవాడు. ఇతనిపై హొసపేటెలోని చిత్తవాడిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్హత మేరకు రుణాలు కల్పించండి బళ్లారిటౌన్: లబ్ధిదారులకు అర్హత నియమాల ప్రకారం బ్యాంక్ వారు రుణ సదుపాయాలను కల్పించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ సభాంగణంలో బ్యాంక్ వ్యవస్థాపకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రుణ సదుపాయాలు కల్పించే దిశలో రుణాలను మంజూరు చేస్తున్నాయన్నారు. అయితే బ్యాంక్ వ్యవస్థాపకులు వారి అర్హత నియమాలకు అనుగుణంగా పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. దీనిపై ఆలస్యం జరిగితే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల కన్నా బళ్లారి జిల్లా ప్రగతిలో తగ్గుముఖంలో ఉందన్నారు. జిల్లా ప్రగతి సాధించాలంటే బ్యాంకుల సహకారం అవసరం అన్నారు. జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ సుమేరా మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ ప్రదేశాల్లో అమలవుతున్న రుణాలను వ్యవసాయ గుంపులకు కల్పించాలన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం కోటగిరి శ్రీనివాసరావు, జెడ్పీ ఉపకార్యదర్శి శశికాంత్ శివపురె, యువరాజు, గిరీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మార్చాలి రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో ఉష్ణోగ్రతలు అధికం కావడం వల్ల ఏప్రిల్, మే రెండు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షుడు కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రతి ఏడాది సర్కార్ కళ్యాణ కర్ణాటక భాగంలోని రాయచూరు, కలబుర్గి, బళ్లారి, బీదర్, యాదగిరి, కొప్పళ, విజయనగర జిల్లాల్లో రెండు నెలల పాటు ఎండాకాలంలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని వేళలు కల్పించేలా చూడాలని కోరుతూ ఏడీసీ శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో యంకప్ప, సంతోష్, మల్లేష్, భీమేష్ నాయక్, గురురాజ్లున్నారు. వైభవంగా కనకాచలపతి రథోత్సవం రాయచూరు రూరల్: కొప్పళ జిల్లాలోని కనకగిరిలో వెలసిన కనకాచలపతి వేంకటేశ్వరుని జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సోమవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు సతీస్ సూర్యబాబు ఉత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. రెండవ తిరుపతిగా పేరొందిన కనకగిరి వెంకటా చలపతిని గోవిందా, గోవిందా అంటూ నామస్మరణ చేస్తూ ఘనంగా రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, కొప్పళ, గంగావతిల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ తంగడిగి, లోక్సభ సభ్యుడు రాజశేఖర్ హిట్నాళ్, మాజీ శాసన సభ్యులు దడేసూగూరు బసవరాజ్, సుజాత, అధికారులు విశ్వనాథ్, విరుపాక్షయ్య, రాజశేఖర్, నారాయణ, లక్ష్మణలున్నారు. టూరిస్ట్ గైడ్లు వారసత్వ రాయబారులు ● జిల్లాధికారిణి కవిత మన్నికేరి హొసపేటె: టూరిస్ట్ గైడ్లు కేవలం సమాచార ప్రదాతలు మాత్రమే కాదు, మన జిల్లా గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రాయబారులు అని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి అన్నారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన పర్యాటక శాఖ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 87 మంది టూరిస్ట్ గైడ్లకు బూట్లు, జాకెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ రోజు పంపిణీ చేసిన యూనిఫాం కేవలం సౌకర్యం మాత్రమే కాదు, గైడ్ల వృత్తి నైపుణ్యానికి సంకేతం అన్నారు. యూనిఫాం ధరించడం వల్ల పర్యాటకులలో ఆత్మవిశ్వాసం పెంపొందడమే కాకుండా, భద్రతా భావం కూడా ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యూనిఫాం ధరించాలి. పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. గైడ్లు కూడా పాత చరిత్రకే పరిమితం కాకుండా జిల్లాలోని కొత్త పర్యాటక ప్రదేశాల గురించి ఖచ్చితమైన, ఆసక్తికరమైన సమాచారాన్ని కలిగి ఉండాలన్నారు. పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రభులింగ తళకేరి, ఆ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
శాంతలింగ శివాచార్యతో ‘గాలి’ భేటీ
సాక్షి,బళ్లారి: పంచపీఠాలలో ఒకటైన, మహిమాన్విత పుణ్యక్షేత్రంగా భాసిల్లుతూ, సాక్షాత్తు శివుడు లింగరూపంలో అవతరించిన కేదారనాథుడు కొలువు దీరిన కేదార పీఠానికి శ్రీశ్రీశ్రీ నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపికవడం హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకాలోని శాఖ మఠంలో స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శాంతలింగ శివాచార్య కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు కావడంతో పాటు ఈ ప్రాంత ప్రజలకు సుపరిచుతులన్నారు. ఎంతో ఆధ్యాత్మికతతో భక్తి మార్గంలో నడుస్తూ లక్షలాది మంది భక్తులను కూడగట్టుకున్నారన్నారు. మహిమాన్వితుడు శాంతలింగ సన్మార్గంలో నడుస్తూ, సమాజాన్ని ఉత్తమ మార్గంలో తీసుకెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, జీవితాన్ని అంకితం చేసిన మహిమాన్వితుడని కొనియాడారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాన్ని పోగొట్టుకునేందుకు హిమాలయాలకు వెళ్లి శివుడిని దర్శించుకోవాలని శ్రీకృష్ణుడు సూచించిన నేపథ్యంలో పంచ పాండవులు హిమాలయాలకు వెళ్లారన్నారు. అక్కడ శివుడి కోసం పాండవులు గాలిస్తున్న సమయంలో ఒక ఎద్దు(నంది) అక్కడ వెళుతున్న సమయంలో ఇంత నిర్జన ప్రాంతంలో ఎద్దు వెళుతుండటం ఏమిటని భావించిన పాండవులు వెంటనే నంది దగ్గరకు వెళ్లగా నంది భూమిలోకి వెళ్లగా భీముడు గోపురాన్ని పట్టుకోవడంతో అదే లింగరూపంలో అవతరించిందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంగా కేదారనాథ్ ఈ క్షేత్రం ఉత్తరాఖండ్లోని కేదారనాథ్ ప్రస్తుతం పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవంగా కేదారలింగేశ్వరుడు దర్శనం ఇస్తున్నారని, సాక్షాత్తు లింగరూపంలో గోపురం తరహాలో కొలువుదీరిన కేదారనాథ్కు మన ప్రాంతానికి చెందిన నాల్వడి శాంతలింగ శివాచార్య పీఠాధికారిగా ఎంపిక కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భారత దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంప వ్యాప్తంగా కేదారనాథ దర్శనానికి వెళుతున్నారంటే ఎంత మహిమాన్విత పుణ్యక్షేత్రమో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈసందర్భంగా పలువురు బళ్లారి వాసులు కూడా స్వామీజీని దర్శించుకున్నారు. కేదారనాథ పీఠాధికారిగా నాల్వడి శాంతలింగ శివాచార్య స్వామీజీ ఎంపిక -
తుంగభద్ర నదిలోకి దూకిన ప్రేమ జంట
సాక్షి,బళ్లారి: ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువజంట తుంగభద్ర నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. దావణగెరె జిల్లా హొన్నాళి పట్టణ సమీపంలో తుంగభద్ర నదిలోకి దూకి ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గుర్తించి అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించగా వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రక్షణా చర్యలు చేపట్టారు. సాహసోపేతంగా పడవ సాయంతో నదిలోకి వెళ్లి ప్రేమ జంటను సురక్షితంగా బయటకు తీశారు. బయటకు తీసిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువజంట ఇంట్లో ప్రేమను నిరాకరించడంతో పాటు పెళ్లి చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. సకాలంలో సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి రక్షించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై హొన్నాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణతోనే ఆత్మహత్యాయత్నం సాహసోపేతంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది -
శ్రీశైలానికి భక్తుల యాత్ర షురూ
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక శ్రీశైల భక్తుల కాలినడకన పాదయాత్ర ప్రారంభమైంది. బుధవారం నుంచి కర్ణాటకలోని బాగల్కోటె, విజయపుర, జమఖండి, గదగ్, ధార్వాడ, హునగుంద, ఇలకల్ భక్త సమూహం వివిధ మార్గాల్లో ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు తమ మొక్కులు తీర్చాలంటూ పాదయాత్రలకు అంకురార్పణ గావించారు. ఏ రహదారిలో చూసినా భక్తులు మల్లయ్య విగ్రహాన్ని మోసుకొని కాలినడకన, కొంత మంది యువకులు కాళ్లకు కర్రలు కట్టుకుని నడక రూపంలో యాత్రలు చేపట్టారు. బాగల్కోటె నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర దూరం 650 కి.మీ. అవుతుంది. ప్రతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. -
గుడి తొలగింపుపై తీవ్ర నిరసన
హుబ్లీ: స్థానిక కేశ్వాపుర రైల్వే గాల్ఫ్ మైదానం ఆవరణలోని స్వామి వివేకానంద విగ్రహం, బన్ని మహంకాళి గుడి తొలగింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ మంగళవారం మార్నింగ్ వాకర్స్ ఆకస్మిక నిరసన చేపట్టారు. ఈనెల 14 లోగా రైల్వే శాఖ విగ్రహం పునః ప్రతిష్టాపనతో పాటు గుడిని నిర్మించి ఇవ్వాలని గడువును ఇచ్చారు. ఆలయం తొలగించిన అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గడువులోగా ఆలయ నిర్మాణం జరగక పోతే తీవ్ర పోరాటం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. సదరు గాల్ఫ్ మైదానం రైల్వే అధికారుల వసతి గృహం వద్ద బన్ని వృక్షం కింద ఉన్న మహంకాళి గుడి, అక్కడికి కొంత దూరంలో ప్రతిష్టించిన 5 అడుగుల ఎత్తు ఉన్న వివేకానంద విగ్రహాన్ని సోమవారం తొలగించారు. మంగళవారం ఉదయం షికారుకు వచ్చిన స్థానికులు దాన్ని గమనించి రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే అధికారులు తక్షణమే ఘటన స్థలానికి రావాలి. బన్ని మహంకాళి గుడి, స్వామి వివేకానంద విగ్రహాన్ని మూలస్థలంలోనే ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తామే కాంపౌండ్ కూల్చి గుడిని నిర్మిస్తామని గాల్ఫ్ లేక్ ఆఫీసర్స్ కాలనీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ హబీబా నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. ప్రభు చిదానంద, శేఖర్, శివకుమార్ తదితరులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. -
చెట్టుకు బస్సు ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి వద్ద వేగంగా వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో డ్రైవర్, కండక్టర్తో సహా అనేక మంది ప్రయాణికులు తీవ్ర గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. కూడ్లిగి డిపోకు చెందిన బస్సు ఉదయం తాలూకాలోని కాసాపుర నుంచి తిరిగి వస్తుండగా పట్టణంలోని గుడేకోటె రోడ్డులోని సాగర్ డబ్బా సమీపంలో బైక్ను తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు తప్పిన బస్సు రోడ్డుకు కుడి వైపున ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం కుడి వైపు పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా డ్రైవర్ శశిధర్కు కుడి కాలు విరిగింది. కండక్టర్ పాటిల్కు ముఖంపై, ప్రయాణికులకు శరీరంపై గాయాలయ్యాయి. బస్సులో విద్యార్థులతో సహా 62 మంది ఉన్నారు. వారిలో కొంత మందికి తీవ్ర గాయాలు కాగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కూడ్లిగి పోలీస్ స్టేషన్ సీఐ ప్రహ్లాద్ చెన్నగిరి, ఎస్ఐ ప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎస్పీ జాహ్నవి ఆస్పత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులను పరామర్శించారు. -
విమానాశ్రయాన్ని నిర్మించండి
సాక్షి,బళ్లారి: రైతుల నుంచి బలవంతంగా విమానాశ్రయ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకున్న 900 ఎకరాల భూమిలో ఎందుకు విమానాశ్రయం నిర్మించడం లేదని, ఒకవేళ విమానాశ్రయం నిర్మించకపోతే రైతులకు తిరిగి భూమి వాపసు ఇవ్వాలని విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం విధాన పరిషత్లో ఈ సమస్యపై గళం విప్పి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బళ్లారి సమీపంలోని సిరివార గ్రామ శివార్లలో 2009లో 900 ఎకరాల భూములను విమానాశ్రయం కోసం స్వాధీనం చేసుకున్నారన్నారు. అప్పటి నుంచి నిర్మాణం చేపట్టడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. భూములు తిరిగివ్వడం అసాధ్యం–మంత్రి దీనిపై మంత్రి ఎం.బీ.పాటిల్ స్పందిస్తూ బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లాల్లో విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. త్వరలో మూడు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. బళ్లారిలో విమానాశ్రయం కచ్చితంగా నిర్మిస్తామన్నారు. రైతులకు భూమి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కుడితిని సమీపంలో ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమ కోసం స్వాధీనం చేసుకున్న భూమిని ప్రాజెక్టు నిర్మాణం చేయని పక్షంలో రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలని కూడా ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. లేకుంటే రైతులకు భూమి వాపసు ఇవ్వండి పరిషత్లో ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్ డిమాండ్ -
స్నేహితుల చేతిలో బాలుడు హత్య
చెరువులో నుంచి కార్తీక్ మృతదేహాన్ని వెలికి తీస్తున్న దృశ్యం రాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కొత్త బట్టలు ధరించాలనుకున్న స్నేహితులు చిన్న కారణానికి ఉన్మాదులుగా మారి తోటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా కరడకల్ చెరువులో జరిగింది. ఆదివారం గుండసాగర గ్రామం నుంచి లింగసూగూరు పట్టణానికి కొత్త బట్టల కొనుగోలుకు తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్(15), వినోద్(15), సోహైల్(15), ముత్తప్ప(15) అనే నలుగురు పిల్లలు వచ్చారు. అయితే వీరిలో కార్తీక్ మినహా ముగ్గురు మాత్రమే సాయంత్రానికి గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో కార్తీక్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మార్గమధ్యంలో కార్తీక్ను తామే చంపి గోనెసంచిలో రాయి కట్టి చెరువులోకి తోసి వేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించారు. సోమవారం చెరువులో గాలించి కార్తీక్ శవాన్ని వెలికితీసి పంచనామా కోసం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అరుణాంగ్శు గిరి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. లింగసూగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. లింగసూగూరు తాలూకాలో దుర్ఘటన -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సు సర్వీసులు
బళ్లారిఅర్బన్: ఉగాది పండుగ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేకేఆర్టీసీ) బళ్లారి విభాగం నుంచి శ్రీశైలానికి వివిధ చోట్ల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ బళ్లారి డివిజనల్ కంట్రోలర్ ఇనాయత్ బాగ్బాన్ ఓ ప్రకటనలో తెలిపారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ప్రత్యేక దర్శనం కోసం బళ్లారి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తారు. భక్తుల సౌకర్యార్థం తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విషాహారం తిని 10 గేదెల మృతి హుబ్లీ: విష పూరిత ఆహారం తిని 10కి పైగా గేదెలు ఆకస్మికంగా మృతి చెందిన ఘటన హావేరి జిల్లా రట్టిహళ్లి తాలూకా మేదూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గేదెలన్ని ఆ గ్రామ రైతు సిద్దప్పకు చెందినవి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంతో పాటు రోడ్డు పక్కన దొరికిన వాటిని గేదెలు తిన్నాయి. సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతుండగా అస్వస్థతకు గురై మార్గమధ్యంలోనే మరణించాయి. దీంతో జీవనోపాధికి ఆధారమైన 10 గేదెలు ఒక్కసారిగా మృతి చెందడంతో పాడి పరిశ్రమనే నమ్ముకున్న రైతు సిద్దప్ప కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాగా ఆ తాలూకా పశు వైద్యాధికారి గేదెల కళేబరాలను పరిశీలించారు. గేదెల కళేబరాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగ శాలకు తరలించారు. శతాధిక ఆయుర్వేద వైద్యురాలు కన్నుమూత హుబ్లీ: దేహదానం, అవయవదాన ప్రక్రియలో విశేషంగా కృషి చేసిన బెళగావి జిల్లా బైలహొంగలకు చెందిన డాక్టర్ సుశీలాదేవి రామన్నవర(101) కన్నుమూశారు. ఆమె కుమారుడు డాక్టర్ మహంతేష్ రామన్నవర సారథ్యంలో ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నెరవేర్చిన తర్వాత దేహదాన ప్రక్రియను పూర్తి చేశారు. సదరు డాక్టర్ రామన్నవర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలుగా పని చేసిన డాక్టర్ సుశీలాదేవి మరణానంతరం తన భర్తలానే బెళగావిలోని కేఎల్ఈ బీఎం కంకనవాడి ఆయుర్వేద కళాశాలకు దేహాన్ని దానం చేశారు. ఈమె భర్త కూడా 18 ఏళ్ల క్రితం దేహదానం చేశారు. సుశీలా దేవి మృతికి డాక్టర్ ప్రభాకర్ కోరే తదితర ప్రముఖులు ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెళ్లకెరె రూరల్: కాన్పు కోసం వచ్చిన ఓ మహిళ ప్రసవం అనంతరం మరణించిన ఘటన చిత్రదుర్గ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ ఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాలు.. చెళ్లకెరె తాలూకా పరశురాంపురకు చెందిన శిల్ప(28) మరణించిన బాలింత. నవజాత శిశువుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రసవం తరువాత వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిల్ప మరణించిందని కుటుంబ సభ్యులు, శిల్ప తల్లి దుర్గమ్మ ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని జిల్లా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ రవీంద్రపై తీవ్రంగా మండిపడ్డారు. సకాలంలో సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్తి కోసం దివ్యాంగురాలి ఒంటరి పోరాటం రాయచూరు రూరల్: తాళి కట్టిన భర్తే తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ దివ్యాంగురాలైన మహిళకు, కన్న కూతురికి నరకం చూపుతున్న వైనం యాదగిరి జిల్లాలో సంభవించింది. రెండో భార్య, కొడుకులు కలిసి మొదటి భార్య, కూతురిపై దాడి చేశారు. దివ్యాంగురాలైన భార్య భీమాబాయి హన్మంతు బిళ్లార్ను పెళ్లి చేసుకొని జీవిస్తుండేవారు. అనుకోకుండా హన్మంతు బిళ్లార్ రెండో వివాహం చేసుకోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆస్తి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో రెండో భార్య, కొడుకులు ప్రతి రోజు చిత్రహింస పెడుతున్నట్లు తెలిపింది. భర్త హన్మంతు, రెండో భార్య కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ వడగేర పోలీస్ స్టేషన్ వద్ద నిరవధిక ఆందోళనకు పూనుకుంది. -
ఖాద్రీ బ్రహ్మ రథోత్సవం.. చూసి తరిద్దాం
కదిరి: అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న కదిరి నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం నేడు మంగళవారం ఉదయం 8:25 నుంచి 8:45 గంటల మధ్య శుభ మేష లగ్నంలో జరగనుందని ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. ఇప్పటికే ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధులలోని భవనాలు భక్తులతో కిట కిటలాడుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు చోటు లేకుండా భక్తజనం రద్దీ నెలకొంది. రథోత్సవంలో 3 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం పట్టణంలో దాతలు అన్నదాన శిబిరాలను ఏర్పాటు చేశాయి. రథోత్సవం ప్రశాంతంగా జరిగేలా వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటైంది. ఐరావతంపై నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి తెల్లని ఐరావతంపై నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. హిరణ్యకశిపుని సంహరించిన నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూడలేని దేవతాగణం మొర మేరకు ఆయన తెల్లని ఐరావతంపై దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐరావతంపై ఊరేగిన అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లారు. పూజల అనంతరం తెల్లవారుజామున రథంపైకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తజనం నేడు కదిరిలో మహా వేడుక -
మెట్లు, గోడ కూలి దంపతుల దుర్మరణం
రాయచూరు రూరల్: నిర్మాణంలో ఉన్న ఇంటి మెట్ల వరుస, గోడ కూలి దంపతులు దుర్మరణం పాలైన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకాలో చోటు చేసుకుంది. సోమవారం యలగట్టిలో ఇంటి నిర్మాణ సమయంలో దంపతులిద్దరూ గార పనుల్లో తలమునకలుగా ఉన్నారు. అయితే నాసిరకంగా, పిల్లర్లు లేకుండా ఇంటిపైకి వెళ్లడానికి గోడకు ఆనుకుని నిర్మించిన మెట్ల వరుసతో పాటు గోడ ఆకస్మికంగా కూలిపోవడంతో ద్యావప్ప సూగూరు(38)శివమ్మ(32) అనే దంపతులు మరణించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు హట్టి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు. క్షుణ్ణంగా వాహన తనిఖీలు ● 586 వాహనాల యజమానులకు జరిమానా హొసపేటె: జిల్లా పోలీసు శాఖ, ఆర్టీఓ సంయుక్తంగా లోపభూయిష్ట నంబర్ ప్లేట్లు ఉన్న వాహన యజమానులపై చర్యలు ప్రారంభించాయి. 586 వాహన డ్రైవర్లకు జరిమానా విధించారు. హొసపేటె సబ్డివిజన్లో 345, కూడ్లిగి సబ్ డివిజన్లో 154, హరపనహళ్లి సబ్డివిజన్లో 87తో సహా మొత్తం 586 కేసులు నమోదు కాగా జరిమానా వసూలు చేశారని ఎస్పీ జాహ్నవి తెలిపారు. ప్రజలు తమ వాహనాలు నడుపుతున్నప్పుడు డీఎల్ఆర్సీ, బీమా, కాలుష్య తనిఖీ సర్టిఫికెట్ వెంట పెట్టుకోవాలి. మోటార్ వాహన చట్టం ప్రకారం నెంబర్ ప్లేట్ క్రమం తప్పకుండా ఉండాలని తెలిపారు. నగరం అంతటా నెంబర్ ప్లేట్లపై ప్రచారం చేయడంతో పాటు హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు. మహిళలు ముందడుగు వేయాలి రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో దుష్ట సంస్కృతి సంహారానికి మహిళలు ముందడుగు వేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. ఆదివారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు గగన యాత్రలు, సాంకేతిక, విజ్ఞాన సమాచార రంగాల్లో రాణిస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలున్నాయన్నారు. భ్రూణ హత్యలు, వరకట్న మరణాలు వంటి విషయాల్లో న్యాయం, చట్టం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో శారద, సురేఖ, సుమ, రాధ, రాబియా బేగం, రంజిత్లున్నారు. ధైర్యంగా పరీక్షలు రాయండి బళ్లారిఅర్బన్: పరీక్షలకు సిద్ధమవుతున్న ఎస్ఎస్ఎల్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి ప్రత్యేక లేఖ రాశారు. నగర నియోజక వర్గంలో 45కు పైగా పాఠశాలల్లో చదువుతున్న సుమారు 3 వేల మంది విద్యార్థులకు ఆయన వ్యక్తిగతంగా ఈ లేఖను పాఠశాలల్లో విద్యార్థులకు అందేలా పంపించారు. ఈనెల 18న ప్రారంభమయ్యే ఎస్ఎస్ఎల్సీ పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో పిల్లలపై ఒత్తిడి చేయకుండా వారిలో విశ్వాసం నింపి, ప్రోత్సాహం అందించాలని సూచించారు. -
ఆ అధికారులు.. అక్రమాల కోటీశ్వరులు
బనశంకరి: ఉద్యోగం అండతో జనం నుంచి లంచాలు, కానుకల రూపంలో వెనకేసుకున్న కోట్లాది రూపాయల ఆస్తుల గుట్టురట్టయింది. గత గురువారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 10 మంది ప్రభుత్వ అధికారుల నివాసాలు, ఆఫీసుల్లో లోకాయుక్త అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.35.65 కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. వారితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేయగా పెద్దమొత్తంలో డబ్బులు, బంగారం, స్థలాలు, పొలాలు, విలువైన సొత్తు దొరికింది. ఆ వివరాలను లోకాయుక్త విడుదల చేసింది. కనీసం రూ.4, 5 కోట్లు... ● అసిఫ్ ఇక్బాల్ ఖలీల్–అసిస్టెంట్ ఇంజనీర్, కర్ణాటక నగర నీటి సరఫరా భూగర్బడ్రైనేజీ మైసూరు: రూ.5.80 కోట్ల విలువ చేసే 5 స్థలాలు,7 ఇళ్లు, 38 గుంటల భూమి, రూ.2.78 కోట్ల విలువచేసే స్థిరాస్థులు, రూ.22.50 లక్షల విలువచేసే బంగారం సహా రూ.8.81 కోట్ల ఆస్తులు కనిపెట్టారు. ● వసంత వాలప్ప నాయక్– చీఫ్ ఇంజనీర్ ప్రజాపనుల శాఖ బెంగళూరు: 10 చోట్ల రూ.5.65 కోట్ల విలువచేసే 4 ప్లాట్లు, 7 నివాస ఇళ్లు, 22.20 ఎకరాల పొలం, రూ.75 లక్షల నగదు, రూ.12.25 లక్షల నగలు, రూ.34.25 లక్షల విలువ చేసే కార్లు, రూ.27.49 లక్షల డిపాజిట్లు లభించాయి. ● డాక్టర్ హెచ్సీ.ఇంద్రేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెబ్బాల మెడికల్ కాలేజీ, బెంగళూరు: 6 చోట్ల రూ.2.20 కోట్ల విలువచేసే 10 స్థలాలు, 2 ఇళ్లు, రూ.11.95 లక్షల బంగారం, రూ.18.90 లక్షల వాహనం, మొత్తం రూ.2.53 కోట్ల ఆస్తులు కనిపెట్టారు. ● ఆర్.శశిధర్, సీఈఓ సింగనాయకనహళ్లి రైతు సేవా సహకార సంఘం యలహంక, బెంగళూరు: 5 చోట్ల రూ.4.25 కోట్ల భూములు,, 4 స్థలాలు, 2 ఇళ్లు, 2 ఎకరాల భూమి, రూ.29.74 లక్షల బంగారం, రూ.42.25 లక్షల విలాసవంతమైన కార్లు, .17.25 లక్షల బ్యాంకు డిపాజిట్లతో కలిపి రూ.5.15 కోట్ల ఆస్తులు దొరికాయి. ఇలా మిగతా ఆరుమంది వద్ద రూ.4 కోట్ల నుంచి 6 కోట్ల అక్రమ ఆస్తులు వెలుగుచూశాయి. లోకాయుక్త దాడుల్లో వెలుగుచూసిన ఆస్తిపాస్తులు -
యువ జంట ఆత్మహత్య
● మండ్య జిల్లాలో విషాదంమండ్య: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది.చెరువులపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు బనశంకరి: చెరువులపై తేలియాడే సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు మీద దృష్టి సారించాలని చిన్ననీటిపారుదల శాఖమంత్రి ఎన్ఎస్.బోసురాజు అధికారులకు సూచించారు. సోమవారం వికాససౌధలో నీటిపారుదల, విద్యుత్ అధికారులతో భేటీ జరిపారు. ఎత్తిపోతల పథకాలకు అయ్యే భారీ ఖర్చు, విద్యుత్ వ్యయాన్ని తగ్గించాలని, అందుకు గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో చెరువులలో తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు గురించి బీహెచ్ఈఎల్ ను అధ్యయన నివేదిక ఇచ్చిందన్నారు. కోలారు జిల్లా సోమాంబుధి అగ్రహార చెరువులో ప్రయోగాత్మకంగా తేలియాడే సౌరవిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన గురించి బీహెచ్ఈఎల్ నివేదిక సిద్ధం చేసిందని తెలిపారు. ఆ నివేదికను పరిశీలించి పథకం అమలుపై కసరత్తు చేయాలని ఆదేశించారు. గజ దాడిలో మహిళ మృతి యశవంతపుర: ఓ మహిళను అడవి ఏనుగు దాడి చేసి చంపిన ఘటన కొడగు జిల్లాలో జరిగింది. వివరాలు.. కుశాలనగర తాలూకా నంజరాయపట్టణ గ్రామం బాళెగుండి గిరిజన వాడలో గ్రామ పంచాయతి మాజీ సభ్యురాలు జలజాక్షి (51) నివసించేది. ఆమె సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దగ్గరిలోని అడవిలోకి వెళ్లి అటవీ ఉత్పత్తుల కోసం వెతుకుతుండగా, ఓ ఏనుగు దాడి చేసింది. కాళ్లతో తొక్కి అక్కడే ఆమె ప్రాణాలు తీసింది. విషయం తెలుసుకుని గ్రామస్తులు, కుశాలనగర అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని కుశాలనగర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఊరు చుట్టుపక్కల సంచరిస్తున్న ఏనుగులను తరిమివేయాలని కోరారు. కాగా, రాష్ట్రంలో గజదాడులు పెరిగిపోయాయి. తరచూ కూలీలు, రైతులు బలవుతున్నారు. -
జనాభా లెక్కింపు పక్కాగా చేపట్టాలి
బళ్లారిటౌన్: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న జనాభా లెక్కింపు ప్రక్రియను అధికారులంతా బాధ్యతతో నిర్వహించాలని జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ సభాంగణంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కోవిడ్ వల్ల 2021లో జరగవలసిన దేశంలోని ప్రధాన జనాభా లెక్కింపు వాయిదా పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొత్తగా సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి జనాభా లెక్కింపులో మొదటి సారిగా నూతన పరిజ్ఞానంతో ఆన్లైన్ ద్వారా వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ప్రజలే స్వచ్ఛందంగా వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు. ఏప్రిల్ 16 నుంచి మే 16 వరకు ఇంటింటా సమీక్ష చేపడతారన్నారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ హ్యారీష్ సుమేర, డీడీసీఓ జ్ఞాన ప్రకాశం, పాలికె కమిషనర్ మంజునాథ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
హాస్టళ్లపై పర్యవేక్షణ ఏదీ?
సాక్షి,బళ్లారి: నగరంలోని పలు విద్యా సంస్థలు పేరుకు మాత్రమే గొప్పగా బోర్డులు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను మాయలో పడేస్తున్నాయి. వారి పిల్లలను తమ స్కూళ్లు, కాలేజీల్లో చేర్పించుకుని రూ.లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ కనీస నిర్వహణ చేపట్టకపోవడంతో విద్యార్థులు ఆడిందే ఆట..పాడిందే పాటగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలో పలు స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వస్తున్నాయి. దీనిపై పలు విద్యార్థి సంఘాలు గతంలో ఆందోళనలు కూడా చేశాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులో ఉన్న బళ్లారి నగరం ప్రధానంగా వ్యాపార, విద్యా కేంద్రాలకు నిలయంగా ఉంది. దీంతో ఇక్కడకు పొరుగున ఉన్న కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన పలువురు తమ పిల్లలను బళ్లారిలో చదివించడం పరిపాటిగా మారింది. ఫీజుల విషయం పరిశీలిస్తే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు, ఇక్కడికి రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నా విద్యార్థులు ఎలా చదువుతున్నారు? వారి బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గంజాయి ఆరోపణలు గుప్పు రెండు రోజుల క్రితం నగర శివార్లలోని గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కలకలం రేపింది. 9వ తరగతి విద్యార్థి ఉన్మాదిగా మారి, తోటి విద్యార్థి హేమంత్(14)ను దారుణంగా హత్య చేయడంతో పాటు అడ్డొచ్చిన 7 మంది విద్యార్థులను తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. హాస్టల్లో ఏ విద్యార్థి ఎలా ఉన్నాడన్న కనీస పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. స్కూల్ హాస్టల్లో కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారి కదలికలను కూడా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడి చేసిన బాలుని ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. హత్య దురంతంతో నగరంలో ఇతర హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారు. విద్యా శాఖ అధిఽకారుల తనిఖీలు కూడా కరువై హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా మారినట్లు తెలుస్తోంది. హాస్టల్లో దాడి ఘటనపై చర్యలకు డిమాండ్ బళ్లారిఅర్బన్: తాళూరు రోడ్డులోని గురుకుల ఇంటర్నేషనల్ పాఠశాల హాస్టల్లో జరిగిన దాడి నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. సోమవారం సరళా దేవి కళాశాల నుంచి రాయల్ సర్కిల్ మీదుగా జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. యువత డ్రగ్స్, గంజాయి వినియోగానికి పాల్పడుతుండటం ఆందోళనకరమని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. హాస్టల్లో వార్డెన్, తగిన భద్రత సిబ్బంది లేకపోవడం పెద్ద నిర్లక్ష్యం అని, విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా హాస్టల్ నిర్వహించిన పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థుల ప్రాణాలకే ప్రమాదం కలకలం రేపిన గురుకుల పాఠశాలలో దాడి ఘటన దాడి కేసులో నిందితుడు అరెస్టు సాక్షి,బళ్లారి: నగరంలోని గురుకుల పాఠశాల హాస్టల్లో పలువురు విద్యార్థులపై దాడి చేసి గాయపరిచి పరారైన నిందితుడిని పోలీసులు సోమవారం నగరంలోని రూపనగుడి రోడ్డులో గంగప్ప జిన్ సర్కిల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. తన కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ సుమన్ డి.పన్నేకర్ మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈనెల 7న నగరంలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ హాస్టల్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న బాలుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఘటన జరిగిన పాఠశాల యాజమాన్యానికి స్కూల్, హాస్టల్ నిర్వహణ సంబంధిత చట్టబద్ధ అనుమతి పత్రాలను సమర్పించాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జెడ్పీ సీఈఓకు కూడా ఆ పాఠశాల చట్టబద్ధ అనుమతులతో నడుస్తోందా? లేదా? పరిశీలించాలని అధికారికంగా లేఖ రాసినట్లు ఆమె పేర్కొన్నారు. -
గ్రేటర్ బెంగళూరులో 88.92 లక్షల ఓటర్లు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని 5 నగర పాలికెలలో మొత్తం 88,92,528 మంది ఓటర్లు ఉన్నారని జీబీఏ కమిషనర్ మహేశ్వరరావ్ తెలిపారు. సోమవారం జీబీఏ కేంద్ర ఆఫీసులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు కేంద్ర, ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నగర పాలికెలలో మొత్తం 369 వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 45,69,752 మంది పురుషులు, 43,31,143 మంది మహిళా ఓటర్లు, ఇతర ఓటర్లు 1,635 మంది ఉన్నారని చెప్పారు. 51వ వార్డులో అత్యధికం గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 8,024 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో 51వ వార్డు (సుబ్రమణ్య నగర)లో అత్యధికంగా 54,026 ఓటర్లు ఉన్నారు. తూర్పు పాలికేలో 16 వార్డు (కొత్తూరు)లో అతి తక్కువగా 10,940 మంది ఓటర్లే ఉన్నారని తెలిపారు. ఏప్రిల్లో తుది జాబితా జాబితాలలో పేరు లేనివారు, వేరే వార్డులో ఓటు నమోదైనవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం తరువాత ఏప్రిల్ 6వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ప్రజలు చూసుకోవడానికి వార్డుల వారీగా ఓటర్ల జాబితాను జీబీఏ వెబ్సైట్లో పీడీఎఫ్ రూపంలో ప్రకటిస్తామన్నారు. అలాగే ఒక్కో పాలికెలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పురుష ఓటర్లే అధికం జాబితా విడుదల -
కార్మికులను పర్మినెంట్ చేయాలి
రాయచూరు రూరల్: రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్)లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆర్టీపీఎస్ కార్మికుల సంఘం అధ్యక్షుడు మహామని అయ్యన్న ఆరోపించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 10 నుంచి 25 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. వారికి రావాల్సిన పీఎఫ్, జీపీఎఫ్, గ్రాచ్యుటీలను ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుబట్టారు. కూలీ కార్మికులకు చెల్లించాల్సిన రూ.10 కోట్లను సొంతానికి వాడుకున్న విషయంపై సమగ్ర విచారణ జరపాలన్నారు. రిజర్వేషన్ కల్పించాలని ధర్నా రాయచూరు రూరల్: ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశాలు కల్పించొద్దని కర్ణాటక చలవాది జిల్లా మహాసభ సంచాలకుడు విశ్వనాథ్ పట్టి డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎంకు పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్వర్మకు సమర్పించారు. అగ్నిప్రమాదంలో వెదురు బొంగులు దగ్ధం సాక్షి,బళ్లారి: నగరంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కోట ప్రాంతంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా మేదర సమాజం వారు వ్యాపారం కోసం తెచ్చి పెట్టిన వెదురు బొంగులు, కట్టెల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ఘటనలో వెదురు కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. రూ.లక్షలాది మేర నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సమాజానికి మహిళే ఆలంబన
బనశంకరి: అలనాటి మేటి నటీమణులకు ఘనంగా సన్మానించారు. సోమవారం గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఆఫీసులోని గ్లాజ్హౌస్లో జీబీఏ–పాలికె అధికారులు , ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కమిషనర్ మహేశ్వర్రావ్ ప్రారంచారు. ప్రముఖ నటీమణి జయప్రద మాట్లాడుతూ... మహిళ తల్లి, చెల్లి, అక్కగా కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి శ్రమిస్తున్నారని తెలిపారు. నటి మహాలక్ష్మీ మాట్లాడుతూ మహిళలు స్వాభిమానిగా , స్వావలంబనతో జీవించాలని తెలిపారు. జయప్రద, ఉర్వశి, మహాలక్ష్మీ, ప్రమీళా జోషాయ్, మంజుళా గురురాజ్ సహా నటీమణులు, పలురంగాల మహిళలైన డాక్టర్ ఇందిరా కబాడే, రేణుకా, శుభ, చైత్ర అంచన్, వీణాపూజారి, డాక్టర్ ప్రియదర్శిని, శైలజా, లక్ష్మీదేవి, వాణిశ్రీ, సంధ్యా ప్రభు, చైత్ర పూర్ణిమా, ఆరతి ప్రసాద్, పూనం బెళ్లప్ప, లక్ష్మీ దివ్య, వరలక్ష్మీ, విజయలక్ష్మీ, తనూజా తదితరులను సన్మానించారు. ప్రముఖ నటి జయప్రద బెంగళూరులో మహిళా దినోత్సవం -
ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎం
శివాజీనగర: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్తో గత కొన్ని వారాలుగా హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు. కొలిక్కిరాని పోరాటం రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్కే సలహాలు ఇవ్వడం గమనార్హం. విందుకు వేళాయె డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది. సీఎం పదవినిప్పించాలని హైకమాండ్కు వినతి అగ్రనేతలతో భేటీలు? నేడు బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీ విందు డిన్నర్ మీటింగ్పై కుతూహలంబనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరోసారి డిన్నర్ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు. -
కారు దగ్ధం, పెళ్లి సామగ్రి బూడిద
శివమొగ్గ: ఓమ్ని కారు కదులుతుండగా మంటలు చెలరేగి దగ్ధమైంది. శివమొగ్గ జిల్లా హోసనగర తాలూకాలోని రిప్పన్పేట దగ్గర బెల్లూర్ గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుడు శ్రీకాంత్ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన సోదరి పెళ్లి పత్రికలను పంచడానికి బంధువుతో కలిసి కారులో శివమొగ్గకు వెళ్లాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కారు ఇంజిన్లో నుంచి పొగ మంటలు రావడంతో అందులో ఉన్నవారు దిగిపోయారు. కారులోని కూరగాయలు, కొత్త బట్టలు, ఇతర పెళ్లి వస్తువులు కూడా కాలిపోయాయి. ఇంజన్ హీటెక్కడం, లేక షార్ట్ సర్క్యూట్ వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుమానాలున్నాయి. ఘనంగా కుంభాభిషేకం మైసూరు: జిల్లాలోని నంజన్గూడు తాలూకాలోని కసువినహళ్లి గ్రామంలో పురాతన నారాయణస్వామి ఆలయ పునరుద్ధరణ ఉత్సవం ఘనంగా జరిగింది. కొత్త విమాన గోపురానికి కుంభాభిషేకం, కలశారోహణం, యజ్ఞ యాగాదులను వేదపండితుల ఆధ్వర్యంలో పూర్తి చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాలిన కారులో వ్యక్తి మృతి బాగేపల్లి: బాగేపల్లి తాలూకాలోని బాలారెడ్డిపల్లి సమీపంలో మారుతి–800 కారు, అందులో ఓ వ్యక్తి కాలిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కారు కాలిపోతున్నట్లు గ్రామస్తులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి నీళ్లు చల్లి మంటలను ఆర్పివేసి లోపల పరిశీలించగా ఒక వ్యక్తి కాలిపోయి ఉన్నాడు. మృతుడు ఉదయ్కుమార్ (65) బాగేపల్లి తాలూకాలోని పెనుమాల్ గ్రామవాసిగా గుర్తించారు. ఈయన చాలాఏళ్ల నుంచీ కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన తల్లిని చూడటానికి సొంతూరికి వచ్చి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతదేహాన్ని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ప్రమాదమా.. లేక మరేదైనా అనేది ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ సంఘటన స్థానికుల్లో భయాందోళన కలిగించింది. 21 విమానాల రద్దు యశవంతపుర: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి రావలసిన అనేక విమానాల సర్వీసులు రద్దయ్యాయి. అరబ్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే 21 విమానాలు బందయ్యాయి. దీంతో బెంగళూరు ఎయిర్పోర్టులో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మార్చి 1 నుంచి 9 వరకు అనేక దేశాలకు విమానాల రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. 200లకు పైగా విమాన సేవలు రద్దయ్యాయి. కారుపై పడిన కంటైనర్ లారీ ● బాలిక దుర్మరణం యశవంతపుర: ఉత్తరకన్నడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడటంతో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. వివరాలు.. సోమవారం కార్వార నుంచి అంకోలా వైపు కారు, కంటైనర్ లారీ వెళ్తున్నాయి. కంటైనర్ డ్రైవరు నిర్లక్ష్యంగా నడుపుతూ కొండ అంచును తాకడంతో అది పక్కనే వెళ్తున్న కారు మీద బోల్తా పడింది. దీంతో కారు నుజ్జయింది, ఐదేళ్ల బాలిక చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు, మరో చిన్నారి చిన్న చిన్న గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఈ దంపతులు వైద్యులని తెలిసింది. కంటైనర్ డ్రైవర్ బాగా తాగి ఉన్నాడు, లారీ నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కేకలు వేయసాగాడు. ఈ రభసతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. కార్వార పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. -
రిజర్వేషన్ ప్రకటించే వరకు నియామకాలు వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలలు తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు విరుపాక్షి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేదికల ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా జరిగితే మాదిగ విద్యార్థులకు మరణ శాసనంగా మారుతుందన్నారు. రవీంద్ర, భీమన్న, ఆంజనేయ, నరసప్ప, మౌనేష్లున్నారు. చిచ్చు రేపిన కులాంతర వివాహం ● రెండు వర్గాల మధ్య ఘర్షణ ● బాలగేరిలో ఉద్రిక్త వాతావరణం హొసపేటె: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకాలోని బాలగేరి గ్రామంలో కులాంతర వివాహం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఒక గ్రామస్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గ్రామానికి చెందిన యువతీ యువకుడు పరస్పరం ప్రేమించుకుని ఇటీవల వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గదగ్ జిల్లా రోణ తాలూకాలోని శాంతగేరి ఇటగి గ్రామానికి చెందిన యువతి బంధువులు బాలగేర గ్రామానికి వచ్చి గొడవ సృష్టించారు. దీంతో గ్రామస్తుడు బసప్ప తళవార్ (69) తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స కోసం కుకనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతను సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే కుకనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయక పోవడంతో సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. -
సదృఢ సమాజాన్ని నిర్మిద్దాం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి మహిళలు నడుం బిగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్ పేర్కొన్నారు. ఆదిఽవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కళాసంకుల సంస్థ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. వివేకతుల్యమైన చింతనలు, మౌల్యాలతో కూడిన సమాజం అభివృద్ధికి అనుగుణంగా ఉంటుందన్నారు. సమావేశంలో మారుతి, రేఖ, ఆశాలత, అనిత, పంపాపతి, బసవరాజ్, శ్రీనివాస్, రాజశేఖర్, రమేష్, ప్రేమలతలున్నారు. -
త్వరలో కేన్సర్ ఆసుపత్రి ప్రారంభిస్తాం
బళ్లారి రూరల్ : బళ్లారి నగరంలో కేన్సర్ రోగుల కోసం త్వరలో ఆసుపత్రి ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రి కేన్సర్ వైద్యుడు డాక్టర్ ఎస్.ఎస్.నిరాణి తెలిపారు. సోమవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బళ్లారిలో ప్రైవేటు కేన్సర్ ఆసుపత్రి లేనందున బెంగళూరు, హుబ్లీ, కర్నూలు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బళ్లారిలో ఒమేగా ఆసుపత్రి సౌజన్యంతో మరో ఆరు మాసాల వ్యవధిలో కేన్సర్ ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చికిత్సలో భాగంగా నోరు, గర్భసంచి, స్తన తదితర అనేక కేన్సర్ వ్యాధులకు వైద్యం, శస్త్రచికిత్సలు అందిస్తారన్నారు. కేన్సర్ను గుర్తించడానికి బయాప్సీ, మెమో తదితర పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కేన్సర్ రోగులకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారతి తదితర ప్రయోజనాలు వర్తింపచేయనున్నట్లు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. బాలుడు మృతి
సాక్షి,బళ్లారి: ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బీదర్ జిల్లా భాల్కి తాలూకా పరిధిలోని మడకట్టి క్రాస్ సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడగా, అందులో వెళుతున్న శోహమ్(13) అనే బాలుడు కింద పడి మరణించాడు. బాలుడి మృతితో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలియగానే చించోళి పోలీసులు హుటాహుటిన చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై నిరసన రాయచూరు రూరల్: కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్ మాట్లాడారు. గృహోపయోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ.115 చొప్పున పెంచడాన్ని ఖండించారు. గతంలో గ్యాస్ సిలిండర్ ధరను పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నడ్డివిరిచారని ఆరోపించారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ప్రధానికి పంపదలచిన వినతిపత్రాన్ని తహసీల్దార్ సురేష్వర్మకు అందించారు. ఆందోళనలో మంజుల, ప్రతిభారెడ్డి, సురేఖ తదితరులున్నారు. నరేగ పనులు ప్రారంభించండి రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో నరేగ పథకం పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని గ్రామీణ కూలి కార్మికుల సంఘం సంచాలకుడు అభయ్ డిమాండ్ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ప్రస్తుతం వేసవిలో పొలం పనులు లభించవని, వ్యవసాయ కూలీ కార్మికులకు ఏడు రోజుల పనులు కల్పించాలని, కూలీ డబ్బుల బకాయిలను చెల్లించి నరేగ పథకం కింద పనులను సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వేతన బకాయిలు చెల్లించరూ రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతిథి ఉపాధ్యాయులకు వేతన బకాయిలు చెల్లించాలని ఏఐడీవైఓ డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. జిల్లాలో ఆవిష్కార పథకం కింద నియమించుకున్న ఉపాధ్యాయులకు గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వేతన బకాయిల ను వెంటనే చెల్లించాలని కోరుతూ డీడీపీఐ జగదీష్కు వినతిపత్రం సమర్పించారు. పోక్సో కేసులో ముత్యాకు నో బెయిల్ హుబ్లీ: ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన బాలికతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో మల్లికార్జున ముత్యా దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ రిట్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఆ మేరకు యాదగిరి జిల్లా ప్రధాన, ప్రత్యేక సెషన్స్ కోర్టు ఆదేశాలు వెల్లడించింది. కాగా ముత్యాపై పోక్సో కేసు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో సదరు కోర్టు న్యాయమూర్తి మరుళ సిద్దారాధ్య ఈ మేరకు ముత్యా ముందస్తు బెయిల్ రిట్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలిచ్చారు. జానపద గాయని మృతి హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకాలోని సోగి గ్రామానికి చెందిన జానపద గాయని డి.హొన్నమ్మ(78) వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో సోమవారం మరణించారు. అనేక జానపద పాటలు పాడటం ద్వారా జిల్లాలో తనదైన ముద్ర వేసిన గాయని గ్రామ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. -
ఢిల్లీలో డీకే మంత్రాంగం
బెంగళూరు: ముఖ్యమంత్రి మార్పిడిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిన తనకు కూడా ఒక అవకాశం కల్పించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇదే డిమాండ్తో గత కొన్ని వారాలుగా హైకమాండ్పై ఒత్తిడి తీసుకొస్తున్న ఆయన ఆదివారం హఠాత్తుగా హస్తినకు వెళ్లారు. అయితే వెంటనే పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకకపోవడంతో రాత్రికి అక్కడే మకాం వేశారు. సోమవారం ఉదయం నుంచి రాహుల్గాందీ, సోనియాగాంధీ, ప్రియాంక గాందీతో పాటుగా పలువురు నాయకులతో సమావేశం కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తనకు సీఎం పదవి కావాలనే ఏకవాక్య అజెండాతో పర్యటన సాగించారు.కొలిక్కిరాని పోరాటం రాష్ట్రంలో సీఎం కుర్చీ కోసం సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే మధ్య గత 4, 5 నెలలుగా పోరాటం సాగుతోంది. ఇది శీతల యుద్ధం నుంచి వీధి పోరాటాల వరకూ వ్యాపించింది. కొందరు మంత్రులు, ఇరువర్గాల ఎమ్మెల్యేలు జంతువులతో పోల్చుతూ ఆరోపణలు చేసుకుంటున్నారు. హైకమాండ్ మాత్రం గట్టి నిర్ణయం తీసుకోవడం లేదు. సీఎం సీటు గురించి ఎవరూ బయట మాట్లాడరాదని ఢిల్లీ పెద్దలు ఆదేశించినా, అనుకూల–వ్యతిరేక వ్యాఖ్యలు అడపాదడపా వెలువడుతున్నాయి. పైగా ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని హైకమాండ్కే సలహాలు ఇవ్వడం గమనార్హం. విందుకు వేళాయె డీకే మంగళవారం బెంగళూరుకు తిరిగి వస్తున్నారు. అదే రోజు బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆయన భారీ విందు ఇవ్వబోతున్నారు. దీంతో అందరి చర్చ విందు మీదే సాగుతోంది. సీఎం సిద్దరామయ్యను, మంత్రులను కూడా ఆహ్వానించారు. ఎంతమంది వస్తారు, ఎంతమంది ముఖం చాటేస్తారు, ఏం జరుగుతుందీ అన్నది కుతూహలం రేపుతోంది.ఎవరిని కలిశానో చెప్పను: డీసీఎంబనశంకరి: నేను ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాను అనేది బహిరంగంగా చెప్పడం కుదరదని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. సోమవారం ఢిల్లీలో కర్ణాటక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీకి వచ్చిన తరువాత నేను అందరినీ కలుస్తాను. కానీ హైకమాండ్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వక పోవడంతో నేను వేచి చూస్తున్నాను అని మీడియాలో ప్రసారం చేస్తారు. అందుకే వేచిచూస్తున్నాను. పూణేలో నా స్నేహితుని ఇంట్లో పెళ్లి ఉంటే ఆదివారం బయల్దేరాను. సోమవారం అసోం పీసీసీ అధ్యక్షునితో భేటీతో పాటు అనేక సమావేశాల్లో పాల్గొన్నాను’ అని తెలిపారు. మంగళవారంతో కేపీసీసీ అధ్యక్షునిగా 6 ఏళ్లు పూర్తి అవుతుంది, ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బెంగళూరులో విందు ఏర్పాటు చేశానని చెప్పారు. ఓడిన అభ్యర్థులు, జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు మరోసారి డిన్నర్ ఇస్తానని చెప్పారు. ఢిల్లీ భేటీపై ఎలాంటి ప్రత్యేక చర్చ వద్దన్నారు. ఇక బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఉందని తెలిపారు. -
యువ జంట ఆత్మహత్య
కర్ణాటక: కలిసి ఏడడుగులు వేశారు, ఎంత కష్టం వచ్చిందో గానీ కలిసే తనువు చాలించారు. జిల్లాలోని కెఆర్ పేట పట్టణంలోని జయనగర బ్లాక్లో యువ దంపతులు ఒకే తాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. హోస్కోటే గ్రామానికి చెందిన దర్శన్ (29), నతనహళ్లికి చెందిన భార్య ఎన్.ఎల్. దివ్య (25) మృతులు. వీరికి 3 ఏళ్ల కిందట పెళ్లయింది, ఏడాదిగా ఇక్కడ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. దర్శన్ క్యాబ్ డ్రైవర్ కాగా, దివ్య ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నారు. వీరికి రక్ష అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఏం సమస్యలు వచ్చాయోగానీ.. ఆదివారం రాత్రి వారితో పాటు పాపకు ఉరి బిగించి ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఉరి జారిపోవడంతో పాప క్షేమంగా తప్పించుకుంది. చిన్నారి ఏడుస్తూ ఉండడంతో ఇరుగు పొరుగు వచ్చి చూడగా దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. దర్శన్ తండ్రి గణేష్ గౌడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు కుటుంబాలవారు చేరుకుని మీరంటే మీరు కారణమని ఆరోపణలు చేసుకున్నారు. తల్లిదండ్రులు కానరాని లోకాలకు చేరడంతో కూతురు అనాథగా మారింది. -
ఎల్పీజీ ఎఫెక్ట్... బెంగళూరులో హోటళ్లు బంద్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లకు ఎల్పీజీ షాక్ తగిలింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరమంతటా హోటళ్లు మూతబడనున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ఒక ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. ‘‘ఎల్పీజీ లేకుండా హోటళ్లను నడపడం అసాధ్యమని అందరికీ తెలుసు.అందుకే మాకిష్టం లేకపోయినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు’’అని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.సి.రావు విలేకరులకు తెలిపారు. కేంద్రం తక్షణం ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరుకు చెందిన పలువురు ఎంపీల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లామన్నారు. హోటళ్లకు పరిమిత స్థాయిలోనైనా ఎల్పీజీ సరఫరాలు కొనసాగేలా చూడాలని కోరారు. ఎల్పీజీ కొరతపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన వెలిబుచ్చారు. మరోవైపు చెన్నైలో కూడా బెంగళూరు తరహా పరిస్థితే నెలకొన్నట్టు వార్తలొస్తున్నాయి. -
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు! -
ట్రంప్కు బానిసలా మోదీ.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
కలబురిగి (కర్నాటక): పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం, టారిఫ్ అంశాల్లో కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఒక నియంతగాను, ప్రధాని మోదీని ఆయనకు బానిసగాను అభివర్ణించారు. ట్రంప్ ఎప్స్టీన్ ఫైళ్లను అడ్డుపెట్టుకుని మోదీని ఆడిస్తున్నారన్నారు.కర్నాటకలోని కలబురిగి జిల్లా చిత్తాపూర్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. ‘ఇరాన్ సుప్రీం నేతను అమెరికా చంపేసింది. ఏకంగా దేశ నేతనే చంపేస్తే ఆ దేశం, ఇక ప్రపంచం సురక్షితంగా ఉంటుందా? ఇరాన్ నేత ఖమేనీ లేదా వెనెజువెలా నేత మదురో..ఇలా ఎవరైనా కావచ్చు. దేశాల నేతలను ఇలా బెదిరింపులకు గురిచేస్తే ప్రపంచంలో శాంతి అనేదే ఉండదు. అమెరికా తన అహంకారంతో అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది’ అని ఖర్గే మండిపడ్డారు. భారత్ను టారిఫ్ల పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయించిందన్నారు. మోదీ, ట్రంప్లు మన దేశాన్ని నాశనం చేస్తూ, అమెరికాకు దాసోహమనేలా చేస్తున్నారని ఆరోపించారు. -
అర్ధరాత్రి.. చెరువులోకి కారు పల్టీ
● రైతు సంఘం నేత మృతి ● కోలారు వద్ద దుర్ఘటన కోలారు: కారు చెరువులోకి పడిన ప్రమాదంలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం (కెపిఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు టిఎం వెంకటేష్ మరణించారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తాలూకాలోని ముదువాడి చెరువులో చోటు చేసుకుంది. కమ్యూనిస్టు, రైతు సంఘాల నేత అయిన టిఎం వెంకటేష్ (45), ఆదివారం నుంచి కోలారులో జరిగే 3 రోజుల కెపిఆర్ఎస్ రాష్ట్ర సమ్మేళనం ఏర్పాట్లను చూసి, కారులో ఒక్కరే బయల్దేరారు. కారు ముదువాడి చెరువు రోడ్డులో వెళ్తుండగా వెంకటేష్ నిద్రమత్తులో అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయినట్లు అనుమానాలున్నాయి. ఆదివారం ఉదయం చెరువులో కారు తేలుతుండడం చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈలోగా రైతు సంఘాల నాయకులు, పోలీసులు చేరుకుని కారును బయటకు తీయగా లోపల మృతదేహం కనిపించింది. కోలారు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేతలు, కార్యకర్తలు తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఇద్దరు దొంగల అరెస్టు మైసూరు: జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని కవలందె గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. తగడూర్ గ్రామానికి చెందిన టి.బి.రాజు, టి.డి. అభిషేక్ నిందితులు, వారి నుంచి రూ.2.28 లక్షల నగదు, 22 గ్రాముల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ఫిబ్రవరి 16న తగడూరులో ఓ మహిళ ఇంట్లోకి చొరబడిన నిందితులు ఆమెను బెదిరించి 22 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.28 లక్షల నగదును దోచుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి దొంగలను పట్టుకున్నారు. డీకే శ్రీనివాస్కు హైకోర్టులో బెయిలు యశవంతపుర: వ్యాపారవేత్త కె.రఘునాథ్ అనుమానాస్పద మృతి, అతని ఆస్తులను బలవంతంగా బదిలీ చేసుకున్న కేసుల్లో జైలుపాలైన డీకే ఆది కేశవులనాయుడు కుమారుడు డీకే శ్రీనివాస్కు కర్ణాటక హైకోర్టు షరతులతో బెయిల్ను మంజూరు చేసింది. ఈ కేసుల్లో అతనిని సీబీఐ ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. రెండు నెలల నుంచి కారాగారంలో ఉంటున్నాడు. బెయిలుకు మంజూరు చేసుకోగా, న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ అమరణ్ణవర్ ధర్మాసనం విచారించి, వాదనల తరువాత బెయిలును మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, వారం రోజుల లోపు పాస్పోర్టును కోర్టుకు అప్పగించాలని, విచారణ నివేదిక వచ్చే వరకు కర్ణాటకను వదలి వెళ్లరాదని షరతులను విధించింది. -
గ్రేటర్ బెంగళూరులో సగం వార్డులు మహిళలకే
మొత్తం 369 వార్డుల సమాచారం శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలో 5 నగర పాలికెల ఎన్నికలకు సంబంధించి వార్డుల ఫైనల్ రిజర్వేషన్ జాబితాను ప్రకటించారు. మొత్తం 369 వార్డుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 185 స్థానాలు వారికే దక్కాయి. గతంలో ప్రకటించిన రిజర్వేషన్ జాబితాపై వివిధ సంఘాలు, పార్టీలు, ప్రజల నుంచి వందలాది అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు లోపాలను సరిచేసి తుది రిజర్వేషన్ జాబితాను సిద్ధం చేశారు. రికార్డుస్థాయిలో మహిళలకు 50 శాతం సీట్లు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గత రిజర్వేషన్లలో మార్పులు చేశారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ల మేరకు కొన్ని వార్డుల్లో పార్టీకి అనుకూలంగా సవరణలు చేశారని తెలిసింది. బెంగళూరులో 5 పాలికెలు రిజర్వేషన్ల జాబితా విడుదల 369 వార్డుల్లో అతివలకు 185 కేటాయింపు రిజర్వేషన్ జాబితాలో మహిళలకు 185 వార్డులు రిజర్వుడు. 43 వార్డులు ఎస్సీలకు, 7 ఎస్టీలకు, బీసీఏ వర్గానికి 97, బీసీ బీకి 24, జనరల్ వర్గానికి 192 వార్డులు రిజర్వుడు. 1. బెంగళూరు దక్షిణ నగర పాలికెలో మొత్తం వార్డులు –72 ఎస్సీ –7, ఎస్టీ–1, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్ – 40 వార్డులు 2. బెంగళూరు ఉత్తర నగర పాలికె మొత్తం వార్డులు–72, ఎస్సీ–9, ఎస్టీ–2, బీసీఏ–19, బీసీబీ–5, జనరల్–37 వార్డులు 3.బెంగళూరు పశ్చిమ నగర పాలికె మొత్తం వార్డులు–112 ఎస్సీ –9, ఎస్టీ–2, బీసీఏ–30, బీసీబీ–7, జనరల్– 64 వార్డులు 4. బెంగళూరు తూర్పు నగర పాలికె మొత్తం వార్డులు –50 ఎస్సీ–7, ఎస్టీ–1 వార్డు, బీసీఏ–14, బీసీబీ–3, జనరల్ –25 వార్డులు. 5. బెంగళూరు కేంద్ర నగర పాలిక మొత్తం వార్డులు–63 ఎస్సీ–11, ఎస్టీ–1, బీసీ ఏ–15, బీసీ బీ–4, జనరల్ –32 వార్డులు. -
జాలీరైడ్లో విషాదం.. ముగ్గురు యువకుల మృతి
దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడే దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరు సమీపంలో కనకపుర మెయిన్ రోడ్డులోని కగ్గలీపుర అగర క్రాస్ వద్ద జరిగింది. సయ్యద్ బాషా (22), యూనస్ బాన్ (23), అజహర్ బాషా (22) మృతులు కాగా, ఫరాజ్ క్షతగాత్రుడు. నలుగురూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారులో జాలీ రైడ్కు బయలుదేరారు. అతి వేగం వల్ల అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు బెంగళూరువాసులని సమాచారం. కగ్గలీపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్ఫూర్తిదాయకం.. మహిళా దినోత్సవంశివాజీనగర: అంతర్జాతీయ మహిళా దినాచరణ సందర్భంగా బెంగళూరులో వివిధ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. హెబ్బాళ ఫ్లై ఓవర్ కింద నారీ శక్తి రైడ్ పేరిట మహిళా బైకర్ల ర్యాలీ జరిగింది. వివిధ ప్రాంతాల గుండా ర్యాలీ జరిపారు. ఇందులో మహిళా క్యాబ్ డ్రైవర్లు, వైద్యులు, టెక్కీలు పాల్గొన్నారు. ధైర్యం, ఐక్యత, ఆత్మవిశ్వాసానికి మహిళలు ప్రతీక అని వక్తలు కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, సమాజానికి ఉత్తమ సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. నగరవ్యాప్తంగా మహిళలచే సమావేశాలు, చైతన్య ర్యాలీలు జరిగాయి. మైసూరులో స్వచ్ఛతా నినాదం మైసూరు: మైసూరు మహానగర పాలక సంస్థ ఆదివారం స్వచ్ఛతా రోడ్ షో నిర్వహించింది. నగరంలోని అంబా విలాస్ ప్యాలెస్ ముందు మంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప జెండా ఊపి రోడ్ షోను ప్రారంభించారు. మైసూరులో పరిశుభ్రత, మాదకద్రవ్యాల నివారణ, ఆరోగ్య సమస్యల గురించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైసూరు నగరం ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి కారణం నాల్వడి కృష్ణరాజ ఒడయార్ అని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి, దానిని తరువాతి తరానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ఆయన అన్నారు. రోడ్లపై చెత్త వేయడం, పెంపుడు జంతువులచే మలవిసర్జన చేయడం వంటిని నిలిపివేయాలని కోరారు. మహిళా దినోత్సవాన్ని స్మరిస్తూ కుటుంబ నిర్మాణం, మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర ముఖ్యమైనదన్నారు. ఈ సందర్భంగా అలనాటి వింటేజ్ కార్లు, మహిళా బైకర్లు, కళా బృందాలు, పౌర కార్మికులు, విద్యార్థుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఎమ్మెల్యేలు తన్వీర్ సేట్, జీటీ దేవెగౌడ, కె.హరీష్ గౌడ, కలెక్టర్ లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇనుప రాడ్డుతో సహచర విద్యార్థి దాడి.. ఏపీ విద్యార్థి మృతి
సాక్షి,బెంగళూరు: సాక్షి,బెంగళూరు: తొమ్మిదో తరగతి విద్యార్థి విచక్షణ కోల్పోయాడు. హాస్టల్ గదిలో గాఢ నిద్రలో ఉన్న సహచర విద్యార్థులు, హాస్టల్ వార్డెన్ని సైతం ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఎనిమిది మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలైంది. ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థి తండ్రి.. దాడికి పాల్పడ్డ విద్యార్థి మతి స్థిమితం కోల్పోవడం, లేదంటే డ్రగ్స్ మత్తులో దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ‘గురుకులం’హాస్టల్లో చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి బళ్లారి ‘గురుకులం’ ఓ విద్యార్థి కలకలం సృష్టించాడు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో దాడికి తెగబడ్డాడు. విద్యార్థుల పక్కనే నిద్రిస్తున్న హాస్టల్ వార్డెన్పై దాడికి దిగడం ఆయన తీవ్రంగా గాయాపడ్డారు. ఘటనపై అప్రమత్తమైన స్థానికులు, ఇతర హాస్టల్ సిబ్బంది బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం బళ్లారి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(బీఎంఐఎస్)తరలించారు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది.వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న బ్రూస్పేట పోలీసులు ఘటన జరిగిన హాస్టల్తో పాటు విద్యార్థులు చికిత్స పొందుతన్న బీఎంఐఎస్ ఆస్పత్రికి చేరుకున్నారు. తోటి విద్యార్థులపై ఇనుప రాడ్డుతో ఎందుకు దాడి చేశాడు? దాడికి ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురుకులంలో విద్యార్థులపై దాడి ఘటనతో తల్లిదండ్రులు హుటాహుటీన ఆస్పత్రికి తరలివచ్చారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు స్థానికుల్ని కంటితడి పెట్టిస్తున్నాయి.ఈ సందర్భంగా విద్యార్థి దాడిలో మృతి చెందిన ఏపీ విద్యార్థి హేమంత్ తండ్రి లక్ష్మీకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. శనివారం రాత్రి 11గంటల సమయంలో హాస్టల్ ఘటనపై సమాచారం అందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా తన కొడుకు హత్యకు గురైనట్లు తెలిసింది.విద్యార్థుల్ని రక్షించడంలో, పర్య వేక్షించడంలో యాజమాన్యం విఫలమైంది. విద్యార్థి.. తోటి విద్యార్థులపై జరిపిన దాడి తీరును చూస్తుంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడ్డ మానసిక సమస్యతో బాధపడటం లేదంటే డ్రగ్స్ మత్తులో ఘోరానికి పాల్పడ్డాడేమోనన్న అనుమానం ఉందని చెప్పారు. -
ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా మరబ్బిహాల్ గ్రామ పంచాయతీ పరిధిలో వరదాపూర్, నారాయణ దేవరకెరె మధ్య ఉన్న జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి విషపూరిత నీలం రంగు వ్యర్థాలు రైతుల ఆరోగ్యం, పశువులపై ప్రభావం చూపుతున్నాయి. పంటలు కూడా దెబ్బతింటున్నాయని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు జే.ఎం.వీరంసంగయ్య తెలిపారు. ఫ్యాక్టరీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కవితా ఎస్.మన్నికేరి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారికి వినతిపత్రం సమర్పించారు. వరదాపూర్, నారాయణ దేవరకెరె, కెంచటనహళ్లి, కెంచటనహళ్లి తాండా, మరబ్బిహాల్, మరబ్బిహాల్ తండాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. కర్మాగారం నుంచి వెలువడే దుమ్ము, విషపూరిత నీలం వ్యర్థాలతో ప్రజలు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. భారీగా శబ్ధాలతో పిల్లలు చదువుకోలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.గోనిబసప్ప, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ తంబ్రల్లి తదితరులు పాల్గొన్నారు. -
హనీట్రాప్ రాకెట్ గుట్టురట్టు
● ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో రూ.25 లక్షలు డిమాండ్ ● ప్రైవేట్ నర్స్తో సహా నలుగురు అరెస్ట్ సాక్షి, బళ్లారి: దావణగెరె నగరంలో ఓ వ్యాపారిని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలతో బెదిరించిన హనీట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారిని వలలో వేసుకున్న ప్రైవేట్ నర్సు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్ నర్స్తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలు.. దావణగెరె నగరంలో నివసిస్తున్న సుష్మిత అనే నర్స్.. ఓ వ్యాపారికి మాయమాటలు చెప్పి వలలో వేసుకుంది. వ్యాపారితో సన్నిహితంగా ఉంటూ తన బుట్టలో వేసుకుంది. వ్యాపారితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలు చూపించి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. భయపడిన వ్యాపారి అప్పుడప్పుడు కొంత నగదును నర్స్ సుష్మితకు ఇచ్చాడు. మళ్లీ మళ్లీ డబ్బు ఇవ్వాలంటూ వ్యాపారిని ఇబ్బందులు పెట్టారు. విసిగిపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వల పన్ని నర్స్తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. కాగా.. సదరు నర్స్ చాలామంది హనీట్రాప్ చేసి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు సమాచారం. దావణగెరె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలయం నిర్మించడం హర్షణీయం
హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించాలని గరగ నాగలపురలోని శ్రీగురు ఒప్పటేశ్వర స్వామి మఠం అధిపతి నిరంజన ప్రభు మహాస్వామి సూచించారు. శనివారం హొసపేటె తాలూకా హరువనహళ్లిలో గ్రామ దేవత ఊరమ్మ దేవి ఆలయ కొత్త భవనం, గోపుర కలశస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నిరంజన ప్రభు మహాస్వామి మాట్లాడుతూ.. గ్రామస్తులు కుల, పార్టీ బేధాలు మరచిపోయి ఐక్యమత్యంతో ఊరమ్మ దేవి ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మీ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మరియమ్మనహళ్లి గురుపాద దేవర మఠం మల్లికార్జున శివాచార్య స్వామిజీ ద్వి సన్నిధి నిర్వహించారు. గణపతి వాస్తు, రక్తోపన, నవగ్రహ దుర్గా, కలశ ప్రతిష్ఠాప నేగాలు, శాంతి వాస, జలధి వాస, ధ్యానదివాస, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిష్ఠాపన హోమం, దుర్గా హోమం, దిగ్గలి గోపుర సంరక్షణ, శుద్ధ బలి పూర్ణహుతి, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో పి.ఓబప్ప, తమ్మజ్జ, బోసప్ప, శరణప్ప, వీరేశ్వర స్వామి, కృష్ణమూర్తి, హోసూరు వెంకటేష్, రామప్ప, మరగడప్ప, బొమ్మప్ప, శరణప్ప, గొల్లర చంద్రప్ప, నాగరాజ్, సోమన్న, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పూర్వ పీఠాధిపతి సుయితీంద్ర తీర్థుల పుణ్యారాధన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మూల విరాట్్కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్ ప్రత్యేక పూజలు చేశారు. సుయితీంద్ర తీర్థుల 13వ వర్ధంతి, స్మరణోత్సవ వేడుకల్లో భాగంగా వందలాది భక్తుల సముక్షంలో వెండి రథోత్సవాలు జరిపారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఉచిత భోజనంరాయచూరు రూరల్: శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనార్థం వచ్చే కళ్యాణ, ఉత్తర కర్ణాటక భక్తులకు ఉచితంగా భోజనం అందజేసేందుకు శ్రీకారం చుడుతున్నట్లు బ్రమరాంభ శ్రీశైల మల్లికార్జున సేవా సమితి గౌరవ అధ్యక్షుడు ప్రకాష్ మాడగిరి తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని క్రిష్ణ మండలం గుడే బల్లూరు ఆధ్వర్యంలో నేరుడగం సిద్ధలింగ స్వామి సంయుక్త సహకారంతో భక్తులకు భోజన వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు భక్తులకు భోజనం అందజేస్తామన్నారు. శ్రీశైలం అడవుల్లో పాదయాత్ర చేసే భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. జనగణన సమర్థవంతంగా చేపట్టాలి బళ్లారి రూరల్: జనగణన గంభీరంగా పరిగణించి కచ్చితమైన వివరాలను సేకరించాలని దావణగెరె డీసీ జి.ఎం.గంగాధర స్వామి అధికారులను ఆదేశించారు. కేంద్ర జనగణన శాఖ ఆధ్వర్యంలో శనివారం జెడ్పీ సభాంగణంలో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుపు నిర్వహించిన సామాజికి, ఆర్థిక జనగణనలో ఎదురైన సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని జనగణన సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. అన్ని తాలూకాల్లో జనగణన నిర్వహించే వ్యక్తులకు శిక్షణ ఇచ్చి చిన్న బృందాలుగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు వస్తే సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవాలన్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ గిత్త మాధవరావు విట్టల్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏడీసీ శీలవంత శివకుమార్, ఉప విభాగాధికారి సంతోష్ పాటిల్, హొన్నళ్లి ఉప విభాగాధికారి చెన్నప్ప, జనగణన శాఖ జిల్లా నోడల్ అధికారి వివేక్సిన్హ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదువుకోండి రాయచూరు రూరల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని రాయచూరు డీఎస్పీ శాంతవీర్ పిలుపునిచ్చారు. శనివారం పోలీస్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యతో పాటు కళలు, సాహిత్యం, క్రీడల్లో రాణించడానికి ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. పిల్లలను భావి భారత నిర్మాతలుగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. కార్యక్రమంలో కవిత, చంద్రశేఖర్, గోవిందప్ప, యంకప్ప, క్రిష్ణ, ఇస్మాయిల్, కోమల, ఉషాబాయి, సుజాత, మల్లికార్జున, రుబీనా తదితరులు పాల్గొన్నారు. ర్యాంకులు సాధించడం అభినందనీయంరాయచూరు రూరల్: వైద్య విద్యార్థులు పేద ప్రజల సేవకు పునీతులు కావాలని ధార్వాడ ఐఐటీ డైరక్టర్ వెంకప్పయ్య దేశాయి పేర్కొన్నారు. శనివారం నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో గ్రాడ్యయేషన్ డే నిర్వహించారు. నర్సింగ్, పిజియోథెరపీ, ఫార్మసీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కోవిడ్లో ఎవ్వరు చేయని పనులు నర్సులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. రాయచూరు నవోదయ వైద్య కళాశాల ఉన్నత విద్యకు పేరుగాంచిందన్నారు. విద్యార్థులు సమాజానికి, కళాశాలకు మంచి పేరు తీసుకుని రావాలన్నారు. కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించడం అభినందనీయమన్నారు. సమావేశంలో నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, న్దేవానంద, గిరీష్, దొడ్డయ్య, అర్జున్, విజయ్ కూమార్, ఉమాకాంత్, కాజల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
పూజలు చేయించేందుకు వస్తూ పరలోకాలకు
సాక్షి బళ్లారి: కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బెంగళూరులోని సుబ్బణ్ణపాల్యకు చెందిన శ్రీనివాస రావు, రత్నాబాయి దంపతుల కుమారుడు రూపేష్ పుట్టిన రోజు సందర్భంగా హంపీ–అంజనాద్రి దేవాలయాల్లో పూజలు చేయించాలని బయలుదేరారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగి తాలూకా హైవేలో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస రావు (70), రత్నాబాయి (65) ఇద్దరు మృతి చెందగా వీరితో పాటు ప్రయాణిస్తున్న కుమారుడు రూపేష్ (37), కవిత బాయి (33) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు రూపేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఘటనా స్థలంలో కారు దూరంగా ఎగిరి పడిపోవడంతో స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కూడ్లిగి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కూడ్లిగి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు బోల్తా: ఇద్దరు మృతి -
కిష్కింధ అందాలు చూసొద్దామా..
సాక్షి బళ్లారి: పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువుదీరిన పుణ్యభూమి కిష్కింధ. సాక్షాత్తు ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం. పరమ శివుడు లింగం రూపంలో స్వయంభువుగా వెలసిన పవిత్ర క్షేత్రంగా కిష్కింద బాసిల్లుతోంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఇలాంటి కిష్కింధ అందాలను జీవితంలో ఒకసారైనా చూసి రావాల్సిందే మరి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీ విరుపాక్షేశ్వర స్వామి స్వయంభువుగా కొలువుదీరడంతో పాటు కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి జన్మించారని భక్తుల విశ్వాసం. గంగావతి–హంపీ మధ్య అత్యంత సుందర, సువిశాల ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని కిష్కింధగా పిలుస్తారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పచ్చని పంట పొలాలు, తుంగభద్ర నది నిరంతరం పారే సెలయేరు, తుంగభద్ర డ్యాం నుంచి నది పొడవునా ఎత్తయిన రాతి కొండలు కనిపిస్తాయి. తుంగభద్ర నదికి ఇరువైపులా సాగు చేసిన పచ్చని పంట పొలాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కిష్కింధ ప్రాంతంలో కొప్పళ జిల్లా గంగావతి తాలూకా ఆనెగొంది ప్రాంతంలో ప్రకృతి ఒడిలో కనిపించే సుందర మనోహర దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రకృతి ఒడిలో సుందర దృశ్యాలు, కొండల మధ్య పారే నీరు, ఎంత చూసిన తనివి తీరని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా కిష్కింధ చరిత్ర పుట్టల్లో నిలిచిపోతోంది. పెరిగిన పర్యాటకుల తాకిడి కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, కలకత్తా, తదితర ప్రాంతాలతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో కిష్కింధ ప్రాంతానికి కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తున్నారు. ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి కొండను దర్శించుకుని భక్తులు పునీతులవుతుంటారు. హంపీ స్మారకాలను వీక్షించే పర్యాటకులందరూ కిష్కింధను సందర్శిస్తారు. విజయనగర కాలం నాటి కట్టడాలు, శిఖరాలు, తుంగభద్ర నది పరివాహక ప్రాంతాన్ని వీక్షించవచ్చు. హంపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించే శిలల నిర్మాణం ఓ వైపు ఆకర్షణగా నిలుస్తుండగా ఈ ప్రాంతం ఫొటోగ్రఫీ ప్రియులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తుంగభద్ర నదిలో పడవ విహారం, కిష్కింద ప్రాంతంలోని కనిపించే కొండలు, రాళ్ల నిర్మాణాలు, చరిత్రాత్మక కట్టడాలు చూస్తే కలిగే అనుభూతి చెప్పలేనిది. ఇక హంపీ–కిష్కింద ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తి. పెద్ద ఎత్తున పంటలు సాగు చేస్తుండటంతో ఎటుచూసిన పచ్చదనం కనిపిస్తోంది. కిష్కింధలో వెలసిన అంజనాద్రి కొండసెలయేరు అందాలు పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువుదీరిన పుణ్యభూమి కిష్కింధ ఆకట్టుకునే రాతి నిర్మాణాలు, చరిత్రాత్మక కట్టడాలు దేశ, విదేశీ పర్యాటకుల సందడి -
అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు
బళ్లారి అర్బన్: దేశంలో 1500లకు పైగా మానవ హక్కుల సంస్థలు ఉన్నప్పటికీ వాటిలో దక్షిణ ఆసియా మానవ హక్కుల వేదిక ప్రజా సమస్యలకు స్పందిస్తూ పని చేసే ప్రజాపర సంస్థగా నిలుస్తోందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు ఎల్సార్ బాబు తెలిపారు. శుక్రవారం బళ్లారి నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంస్థ భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నమోదు చేయబడిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా సుమారు 80 వేల మందికి పైగా సభ్యులతో ఈ వేదిక పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని బలహీన వర్గాలు, అన్యాయానికి గురైన ప్రజలకు న్యాయం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజా సమస్యలకు స్పందిస్తూ బాధితుల తరఫున చట్టబద్ధంగా పోరాడుతామన్నారు. సంస్థ పేరును దుర్వినియోగం చేయడం లేదా అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనే సభ్యులపై ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుని సంస్థ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వలిపీర్, నాగప్ప, దూద్బాషా, నవీన్, మహమ్మద్బాషా, మడివాల హుస్సేనప్ప, నవాజ్, అమీనా, సుజాత, పద్మావతి, హులిగెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి భక్తుల పాదయాత్ర
రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక భక్తులు శ్రీశైలానికి పాదయాత్ర ప్రారంభించారు. బాగల్ కోట, బీజాపూర్, జమఖండి, గదగ్, దారవాడ, హునగుంద, ఇలకల్ భక్త సముహం వివిధ మార్గాల్లో మార్చి 5 నుంచి 18వ తేదీ వరకూ 15 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిస్తారు. బాగల్కోట నుంచి శ్రీశైలం 650 కి.మీ దూరంలో ఉంది. రోజు తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమైన పాదయ్రాతలు.. ఉదయం 11 గంటల వరకూ కొనసాగుతుంది. మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. బాగల్ కోట జిల్లా అమీన్గడ్ నుంచి నర్మద, ఇలకల్ నాగరాజ్ కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న తీరు ఆకట్టుకుంటోంది. కేహెచ్ మునియప్ప సేవలు ఆదర్శం సాక్షి బళ్లారి: కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని లిడ్కర్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ముండ్రిగి నాగరాజు కొనియాడారు. శనివారం కేహెచ్ మునియప్ప జన్మదినం పురస్కరించుకుని నగర శివారులోని ఆదర్శ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, పండ్లు, బ్రెడ్డు, దుస్తులు పంపిణీ చేశారు. దళిత సమాజంలో జన్మించిన మునియప్ప అంచెలంచెలుగా ఎదిగారన్నారు. కేహెచ్ మునియప్ప సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్.మారెణ్ణ, గ్యారంటీ ప్రాధికార జిల్లాధ్యక్షుడు చిదానందప్ప, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైద్య శిబిరాలతో పేదలకు మేలు రాయచూరు రూరల్: జిల్లాలో వివిధ రకాల వ్యాధులకు అందించే చికిత్సలపై ప్రచారం చేపట్టాలి. పేదలు ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నగర సభ కమిషనర్ జుబీన్ మహపాత్రో పిలుపునిచ్చారు. శనివారం సంతోష్ హోంటెల్లో శిల్పా మెడికేర్, కొప్పళ్ అగస్య్త ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరికి వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. కీళ్లనొప్పి, తల నొిప్పి, సంది వాతం, కిడ్ని వ్యాధులకు చికిత్సలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శిల్పా మెడికేర్ ఎండీ విష్ణు కాంత బూటాడే, కొప్పళ అగస్త్త్యాయుర్వేద కళాశాల అధికారి లోకేష్ టెల్, గౌతం, రమేష్ భూబ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తాలూకా కేంద్రంగా ప్రకటించాలి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మాన్వి తాలూకా నుంచి కవితాళను వేరు చేసి తాలూకా కేంద్రంగా ప్రకటించాలని అభినవ సిద్ధలింగ మహస్వామి సూచించారు. శనివారం అమీన్గడ్ వటగల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 కి.మీ దూరమున్న సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి మూడేళ్లు అవుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కవితాళను తాలుకా కేంద్రంగా ప్రకటించక పోవడం సరికాదన్నారు. ఈ విషయంలో శాసన సభ్యులు హంపయ్య నాయక్, బసనగౌడ విఫలమయ్యారని మండిపడ్డారు. కవితాళ పరిధిలోకి సుమారు 45 గ్రామాలు వస్తాయని పేర్కొన్నారు. -
అగ్ని ప్రమాదంలో గొర్రెల మృతి
రాయచూరు రూరల్: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో వరి బస్తాలు దగ్ధం కాగా.. గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. సింధనూరు తాలుకా ముక్కుంద గ్రామంలో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గొర్రెల షెడ్డుకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షెడ్డులో ఉన్న 700 గొర్రెలు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు గొర్రెలు పూర్తిగా కాలిపోయి బూడిద అయ్యాయి. 700 గొర్రెలు మృత్యువాత పడటంతో కాపరులు బోరున విలపించారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో పట్టణంలోని సుక్కాల పేటలోని వరి బస్తాలు నిల్వ చేసిన గోదాముకు నిప్పంటుకుంది. ఈ ప్రమాదంలో 700 వరి బస్తాల ధాన్యం కాలిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ వెల్లడించారు. -
విద్య, విజ్ఞాన, పరిశోధన, ఉపాధి రంగాలకు కేంద్రమైన బెంగళూరు నగరంలో కోటీ 50 లక్షలకుపైగా జనాభా ఉంది. వీరిలో అత్యధికులు విద్యావంతులే. అయితే ఈ నగరంలోనే ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి.
● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంచన ● మొదటి స్థానానికి చేరుకున్న బెంగళూరు బనశంకరి: దేశంలోని మహానగరాల్లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. 19 మెట్రో నగరాలకు గాను మొత్తం సైబర్ నేరాల్లో సగానికి పైగా బెంగళూరు నగరంలో నమోదు కావడంతో సిలికాన్ సిటీ దేశంలోనే డిజిటల్ క్రైం రాజధానిగా మారుతోంది. ఇతర నగరాలతో పోలిస్తే సిలికాన్సిటీ సైబర్నేరాల్లో మొదటి స్థానంలోకి చేరుకుంది. సైబర్ కేటుగాళ్ల నయా మోసకార పంథా నేరగాళ్లు సైతం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని వంచనలకు తెగబడుతున్నారు. ప్రజల డిజిటల్ పర్సులోకి చేతులుపెట్టి నగదు దోచేస్తున్నారు. దేశంలో రోజూ సరాసరి 7 వేల సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఇందులో 85 శాతం కేసులు ఆన్లైన్ ఆర్థిక వంచనకు సంబంధించినవే. ఉద్యాన నగరే టార్గెట్ విద్యావంతులు, ఐటీ, బీటీ ఉద్యోగులకు కేంద్రంగా మారిన బెంగళూరును సైబర్ వంచకులు టార్గెట్గా ఎంచుకున్నారు. బెంగళూరు నగరంలో నమోదైన మొత్తం నేరాలకుగాను 30 శాతం సైబర్ నేరాలు ఉండటం విశేషం. వైట్ఫీల్డ్ విభాగంలో నమోదవుతున్న మొత్తం నేరాల్లో 40 శాతం సైబర్ నేరాలు ఉన్నాయి. పెట్టుబడి వంచనలు, గేమింగ్ అప్లికేషన్లు, రుణాలు అందించే అప్లికేషన్లు, ఓటీపీ వంచనలు ఇందులోకి చేరుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ లాభం, అధిక ఆదాయం తీసుకువచ్చే పెట్టుబడులు, వర్క్ఫ్రం హోం లాంటి ప్రలోభాలతో వంచనకు తెగబడుతున్నారు. కోవిడ్ నుంచి పెరిగిన సైబర్ క్రైం రేట్ సైబర్ నేరాలు పెరగడానికి ప్రధాన కారణం కోవిడ్ మహమ్మారి నియంత్రణకు అమల్లోకి తీసుకువచ్చిన లాక్డౌన్ చర్యలేనని సైబర్నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ సమయంలో సామాజిక అంతరం కోసం కరెన్సీ నోట్ల వినియోగం తగ్గించాలని, డిజిటల్ చెల్లింపులు పెంచాలని, అందుకు యూపీఐ అప్లికేషన్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. దీంతో చిన్నపాటి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పెరగడంతో సైబర్ నేరాల వంచకుల ముఠా కూడా విస్తరించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన, సాధారణ బీమా వంచనలు సైబర్ వంచకులకు అధిక లాభదాయకంగా మారాయి. డిజిటల్ అరెస్ట్ డెబిట్, క్రెడిట్ వంచన పార్ట్టైమ్ ఉద్యోగుల పేరుతో వంచన వైవాహిక వంచన ఎగుమతుల వ్యవహారాల్లో ఈ–మెయిల్ వంచన లాటరీ వంచన ముందస్తు ఫీజు చెల్లింపు పేరుతో వంచన సిమ్క్లోనింగ్ ఫిషింగ్ సోషల్ మీడియా నేరాలు బహుమతుల ఆశ చూపించే మెసేజ్లు నకిలీ ఉత్పత్తుల సమాచారం నగదు రెట్టింపు పేరుతో ప్రలోభాలు -
భారీ కొండచిలువ పట్టివేత
శివమొగ్గ: శివమొగ్గలోని బసవేశ్వర నగర్ 2వ స్టేజ్ ప్రధాన రోడ్డులోని కాలువ వంతెన సమీపంలో ఈనెల 6న రాత్రి సమయంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడకు చేరుకొని ఎనిమిది అడుగుల పొడవు, 15 కిలోల బరువు ఉన్న కొండచిలువను బంధించాడు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో దానిని అడవిలో వదిలేశాడు. బాగల్కోటెలో పోలీసుల మోహరింపు దొడ్డబళ్లాపురం: బాగలకోటెలో శివాజీ జయంతి ఊరేగింపులో రాళ్లు రువ్విన సంఘటన మరువకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఒక వ్యక్తి తన కుమారుడితో ఓ సముదాయానికి చెందిన ప్రార్థనా మందిరం గోడమీద జై శ్రీరామ్ అని రాయించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రార్థనా మందిరం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యమనూరు పోలీసులు ఆ తండ్రీకుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గోడపై ఉన్న రాతలను చెరిపేశారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరింపజేశారు. ప్రధాని రాజీనామా చేయాలి ● సీఎం సిద్ధరామయ్య డిమాండ్ బనశంకరి: సిలిండర్ ధర పెంచిన ప్రపంచ స్థాయిలో దేశం పరువు తీస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలని సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. శనివారం సోషల్ మీడియా ద్వారా కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తిన సీఎం గృహవినియోగ సిలిండర్ల ధర సుమారు రూ.60ల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాల నిర్వహణవ్యయం భారం అవుతుందన్నారు. సిలిండర్ల ధర పెంపు అనివార్యం కాదన్నారు. విదేశాంగ విధానంలో వైఫల్యంతో నరేంద్ర మోదీ అమెరికా మాటలకు తలొగ్గి దేశ స్వాతంత్య్రాన్ని ఆ దేశానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రష్యా, ఇరాన్ లాంటి దేశాలతో భారత్ దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం పాడైందన్నారు. అంతేగాక అనేక దశాబ్దాలుగా భారతీయులకు ఇంధనం అందిస్తున్న దేశాలు అని మోదీ మరిచిపోయారని మండిపడ్డారు. సర్కారుపై కాంట్రాక్టర్లు కదం శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం శనివారం నగరంలోని ఫ్రీడం పార్కులో భారీ ధర్నా నిర్వహించింది. ధర్నాను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినా కూడా ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి పెండింగ్ సొమ్ము విడుదల చేయలేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కర్ణాటకలో సుమారు 1.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొన్న చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు ఉండగా, గత మూడేళ్ల నుంచి వివిధ శాఖల ద్వారా పనులను పూర్తి చేసినా కూడా పెండింగ్ సొమ్ము విడుదల కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రత్యేక అనుకూలాలు కాలేదన్నారు. గత ప్రభుత్వం కంటే కొన్ని శాఖల్లో కమీషన్ ప్రమాణం అధికంగా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్లు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. -
సురక్షిత డిజిటల్ వ్యవస్థ కర్ణాటక సొంతం
బనశంకరి: కర్ణాటక ప్రపంచంలోనే అత్యంత సురక్షిత డిజిటల్ వ్యవస్థ కలిగి ఉందని హోంమంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్ తెలిపారు. శనివారం నగరంలోని ప్రైవేటు హోటల్లో సీఐడీ, సైబర్ నేరాల శిక్షణా శిబిరం, పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసిన 3వ సైబర్ నేరాల తనిఖీ టెక్సమ్మిట్ను హోంమంత్రి ప్రారంభించి మాట్లాడారు. కర్ణాటక కేవలం ఒక రాష్ట్రమే కాకుండా ప్రపంచ బ్రాండ్ అన్నారు. ప్రపంచమే బెంగళూరు వైపు చూస్తోందని, అత్యంత సురక్షిత డిజిటల్ వ్యవస్థను కలిగి ఉన్నామన్నారు. సైబర్ నేరాలు దర్యాప్తు చేయడానికి డిజిటల్ ఆధారాలు సేకరించడం అత్యంత కీలకం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక సైబర్ నేరాల కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. కర్ణాటకలోని అన్ని జిల్లాలు, ప్రముఖ నగరాల్లో మొత్తం 43 సీఈఎన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు సైబర్ సురక్షత కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏఐ, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రమాద నివారణ లాంటి వివిధ రంగాల్లో పరిణితి కలిగిన వైవిధ్యమైన కంపెనీలతో సైబర్ భద్రత వ్యవస్థకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందన్నారు. ప్రజలకు డిజిటల్ సురక్షత అందించడానికి ప్రైవేటు రంగం, అంతర్జాతీయ సంస్థలతో నిరంతరంగా చేతులు కలిపి చర్యలు చేపట్టిందన్నారు. సైబర్నేరాల దర్యాప్తుపై శిక్షణ, పరిశోధన కేంద్రం రాష్ట్ర పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ రాష్ట్ర, కేంద్ర సంస్థల సభ్యులతో కలిపి 62 వేల మందికి పైగా శిక్షణ అందించిందన్నారు. సైబర్నేరాలు ఎలాంటి భౌగోళిక ప్రదేశానికి పరిమితం కాలేదన్నారు. హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ -
ఏ కులం, మతం ద్వేషాన్ని బోధించదు
మైసూరు: ప్రజల ఆశీస్సులు ఉంటేనే నేను ముఖ్యమంత్రిని కాగలను. నా పని సమాజంలోని పేదలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేయడమేనని, వారే తనకు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు తాలూకా వరుణ నియోజకవర్గ పరిధిలోని పిల్లహళ్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ఆదిశక్తి దండిమారెమ్మ ఆలయ స్థాపన, కుంభకలశాల స్థాపనలో పాల్గొన్న తర్వాత ఆయన మాట్లాడారు. సమాజంలో అసమానతలను తగ్గించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ సమానత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఉన్నాయన్నారు. అన్ని కులాలు, మతాలు ఆర్థిక, సామాజిక శక్తిని పొందాలన్నారు. లింగ వివక్షను తొలగించి, మహిళలకు సాధికారత కల్పించడానికి శక్తి యోజన అమలు చేశారన్నారు. పేదలు, బలహీనులకు సాధికారత కల్పించడమే తన లక్ష్యమన్నారు. సమాజంలో అణగారిన వ్యక్తికి సౌకర్యాలు లభించినప్పుడే సామాజిక న్యాయం లభిస్తుందని ఆయన అన్నారు. దేవుడిని ఎల్లవేళలా తలుచుకోవాలి అదే సమయంలో చిన్నతనం నుంచి దండిమారెమ్మ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్న సీఎం, ఇబ్బందులు తలెత్తినప్పుడే కాకుండా ఎల్లవేళలా దేవుడిని తలుచుకోవాలని అన్నారు. ఆలయాల్లో దేవుడు ఉంటాడని మనం నమ్ముతాం. దేవుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకాన్ని నేను వ్యతిరేకించను. కానీ నేను దేవుడు అంతటా ఉన్నాడని నమ్ముతాను, ఆచరిస్తానని అన్నారు. 1978లో మొదటిసారి టీపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజల ఆశీస్సులు తనకు లభించాయన్నారు. తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు తనను గెలిపించారన్నారు. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల ప్రజల ఆశీస్సులతో తాను ఇప్పటివరకు 8 సార్లు ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిని కాగలిగానన్నారు. ఎమ్మెల్సీలు డాక్టర్ యతీంద్ర, డాక్టర్ డి.తిమ్మయ్య, హామీ పథకం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుష్ప అమర్నాథ్ పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతోనే సీఎంను అయ్యాను మైసూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య -
గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కాంగ్రెస్ ధర్నా
శివాజీనగర: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక ధోరణిని ఖండిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. ఇటీవల దేశంలో చమురు మార్కెట్ కంపెనీలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచి, గృహోపయోగ 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య వినియోగపు 19 కేజీల సిలిండర్ ధరను రూ.115 చొప్పున పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపిందని ఆందోళనకారులు అన్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం భారంగా పరిణమించింది. ఎన్నికలకు ముందు వంటగ్యాస్, పెట్రోల్ నిత్యవసర వస్తువులను తగ్గించి ఆ తరువాత ఇచ్చిన హామీలకు వ్యతిరేకంగా నడుచుకొంటోందన్నారు. 2014 నుంచి 2025 మధ్య అవధిలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో నిరంతర పెరుగుదలతో సామాన్య కుటుంబాల జీవితం కష్టకరంగా మారిందన్నారు. సబ్సిడీ సదుపాయాన్ని క్రమేణ తగ్గించడం ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపడం ఖండనీయం అన్నారు. ధర్నాలో కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.మనోహర్, మీడియా అధికార ప్రతినిధి ఆనంద్కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
అంత్యక్రియలకు తీసుకెళుతుండగా అద్భుతం..!
సాక్షి,బళ్లారి: మరణించాడని భావించిన ఓ వృద్ధుడిని అంత్యక్రియలకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శ్వాస ఆడటంతో అందరూ ఆశ్చర్యానికి గురై తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాగల్కోట జిల్లాలోని జమఖండి పట్టణంలోని ముబారక్ అవతి(65) అనే వృద్ధుడు గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు బెళగావి ఆస్పత్రిలో చేరి్పంచారు. అక్కడ ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాపాయం ఉందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వెంటిలేటర్పై నుంచి తొలగించిన తరుణంలో శ్వాస ఆగిపోయిందని వైద్యులు కూడా సూచించారు. ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక చనిపోయాడని భావించి వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలోని లోకాపుర వద్ద శ్వాస కదలికలు వచ్చాయి. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో కొన్నిసార్లు శ్వాస అలా మందగించి కనిపించకపోవచ్చని, అలాంటి సందర్భాల్లో వ్యక్తి మరణించినట్లు భావించే అవకాశం ఉంటుందని తెలిపారు. సరైన వైద్య పరీక్షలు లేకుండా మరణించాడని కూడా నిర్ధారించడం సరికాదని కూడా వారు సూచించారు. ఈ ఘటన బాగల్కోట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
బెంగళూరుకు కొత్త హంగులకు హామీ
కారిడార్లు, సొరంగ మార్గాల నిర్మాణం బెంగళూరు బస్టాండులో బడ్జెట్ ప్రసారాన్ని వీక్షిస్తున్న ప్రజలు రాజధాని నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా కొత్త కారిడార్లు బనశంకరి: బెంగళూరు నగరాభివృద్ధికి బడ్జెట్లో పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. రోడ్లు, మెట్రో రైలు, ఫుట్పాత్ మార్గాల అభివృద్ధి, పాలనా వ్యవస్థను మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నామని సీఎం బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నగర అభివృద్ధి పనులకు రూ.7,000 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. రోడ్లు, చెరువుల అభివృద్ధి ● బెంగళూరు సమగ్రాభివృద్ధికి 2041 రివైజ్డ్ మాస్టర్ప్లాన్(ఆర్ఎంపీ) అమలు. దీంతో నగర రూపురేఖలను మెరుగుపరుస్తామని సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ● బెంగళూరులో 450 కిలోమీటర్ల పొడవైన ప్రముఖ రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్లు కేటాయింపు. 175 జంక్షన్ల అభివృద్ధి, 500 కిలోమీటర్ల ఫుట్పాత్ మార్గాల నిర్మాణం, 100 స్కైవాక్లు నిర్మాణం చేస్తామని వెల్లడి. ● రూ.2 వేల కోట్లతో చెరువుల అభివృద్ధి పనులు. రూ.8 వేల కోట్ల లాభాల్లో మెట్రో బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టు లాభాల్లో ఉందని సీఎం తెలిపారు. సిటీలో 97 కిలోమీటర్ల మేర ఈ రైలు సేవలున్నాయి. గత ఆర్థిక సంవత్సవరంలో రూ.67,460 కోట్లు సమకూరగా, రూ.59,376 కోట్లు ఖర్చయింది, రూ.8,084 కోట్ల లాభం గడించిందని సంస్థ నివేదికలో పేర్కొందని చెప్పారు. బడ్జెట్లో రూ.7 వేల కోట్ల కేటాయింపు రోడ్లు, వంతెనలు, చెరువుల అభివృద్ధి హెబ్బాళ జంక్షన్ నుంచి హెచ్ఎస్ఆర్.లేఔట్ వరకు ఉత్తర– దక్షిణ కారిడార్ పథకం. దీనిని రూ.17,789 కోట్లతో చేపడతారు. కేఆర్.పురం నుంచి మైసూరు రోడ్డు వరకు మొబైల్ కారిడార్ ప్రాజెక్టు, మొత్తం 40 కిలోమీటర్లు పొడవు సొరంగమార్గాన్ని రూ.40 వేల కోట్ల వ్యయంతో చేపడతారు. హెబ్బాళ జంక్షన్ నుంచి మేక్రి సర్కిల్ వరకు సొరంగమార్గం, ఫ్లై ఓవర్ (రోడ్డు)ను రూ.2,250 కోట్ల వ్యయంతో బీడీఏ ఆధ్వర్యంలో నిర్మాణం. నెలమంగల, తావరకెరె, బిడది మార్గంలో 41 కిలోమీటర్ల హైవే నిర్మాణాన్ని పూర్తి చేయాలని తీర్మానం. దీంతో ప్రయాణానికి అనుకూలం కానుంది బెంగళూరు జనాభా 1.40 కోట్లు కాగా, నీటి సరఫరాకు జేఐసీఏ సహాయంతో రూ.6,939 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు బెంగళూరు ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్తగా 73 కిలోమీటర్లు పొడవైన రోడ్ల పథకాల పూర్తికి చర్యలు రాష్ట్రంలో మునిసిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి అమృత నగరోత్థాన (మున్సిపాలిటి) పథకం ద్వారా నిర్వహిస్తామని, ఇందుకు రూ.3,885 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. -
కారు– బైక్ ఢీ, ముగ్గురు మృతి
దొడ్డబళ్లాపురం: కారు– బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన గదగ్ జిల్లా ముండరగి తాలూకా మేవుండి వద్ద జరిగింది. శివప్ప పాటిల్ (35), ముత్తప్ప (32), ఆనంద్ (29) ముండరగి తాలూకా జంత్లి గ్రామవాసులు. ముగ్గురూ గురువారం రాత్రి ఒకే బైక్పై ముండరగి నుండి జంత్లి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొనింది. ఈ దుర్ఘటనలో పై ముగ్గురూ అక్కడే చనిపోగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముండరగి పోలీసులు కేసు నమోదు చేశారు. చెవులు కోసి నగలు చోరీ ● దొంగల కిరాతకం శ్రీనివాసపురం: చెవి కమ్మలను దొంగిలించడానికి ఏకంగా మహిళ చెవిని కోసేసి లాక్కెళ్లిన కిరాతక దొంగల ఉదంతమిది. కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని హూవళ్లి గ్రామంలో జరిగింది. గురువారం రాత్రి రత్నమ్మ (70) అనే వృద్ధురాలు పడుకుని ఉండగా దొంగలు చొరబడ్డారు. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు చైన్ను లాక్కున్నారు. చెవి కమ్మలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఆమె తిరస్కరించడంతో దొంగలు కత్తితో చెవులను కోసేసి కమ్మలను లాక్కుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఎస్పీ, సిక్రివాల్, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుని నగలను తిరిగి అందిస్తామని హామీ ఇచ్చారు. క్లూస్టీం, జాగిలాలతో గాలించి ఆధారాలను సేకరించారు. బాధితురాలికి ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఈ సంఘటనతో గ్రామంలో మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ పాలన విఫలం: యడ్డి మైసూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారు. వారు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి నేను రాష్ట్ర పర్యటన చేపట్టానని బీజేపీ నేత, మాజీ సీఎం బి.ఎస్.యడియూరప్ప అన్నారు. శుక్రవారం చాముండేశ్వరి దేవస్థానాన్ని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత సుత్తూరు మఠానికి వెళ్లి శివరాత్రి దేశికేంద్ర స్వామిని కలిశారు. మఠంలోనే అల్పాహారం తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, సీఎం సిద్ధరామయ్య సర్కారు ప్రజలందరి నమ్మకాలను వమ్ము చేసిందని, సీఎం కుర్చీ కోసం గొడవలు పడుతున్నారని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు ఆయన వెంట వచ్చారు.వెంకట గిరియప్ప స్వామికి పూజలు మాలూరు: తాలూకాలోని డీఎన్ దొడ్డి గ్రామంలో ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం వెంకట గిరియప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్ పూలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. -
ఆదాయ, వ్యయాలు ఇలా
● రాష్ట్ర ఆదాయం, ఖర్చుల కేటాయింపుల సమాచారం దొడ్డబళ్లాపురం: రూ.4.48 లక్షల కోట్లతో 2026–27 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి స్ధిరామయ్య ప్రవేశపెట్టారు. ప్రజలపై వేసే పన్నుల ద్వారానే సర్కారుకు అధిక ఆదాయ చేకూరుతోందని తేలింది. ఆదాయ, వ్యయ మార్గాలు ఎలా ఉన్నాయంటే... ఆదాయం ఎలా వస్తుంది (పైసల్లో)... ● రాష్ట్ర పన్నేతర ఆదాయం– 4 పైసలు ● రాష్ట్ర పన్నుల ఆదాయం– 49 ● పెట్టుబడులు జమ, అప్పులు– 29 ● కేంద్ర పన్నుల ఆదాయం– 14 ● కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు– 4 ఇలా ఖర్చవుతుంది.. ● రుణాల చెల్లింపులు– 20 పైసలు ● సంక్షేమ కార్యక్రమాలు – 15 ● ఇతర ఆర్థిక సేవలు– 14 ● వ్యవసాయం,నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి– 13 ● విద్యారంగం – 10 ● ఆరోగ్యం– 4 ● నీటి సరఫరా, పారిశుధ్యం– 3 ● ఇతర సామాజిక సేవలకు–213:40 గంటలు సీఎం ప్రసంగంశివాజీనగర: 3 గంటల 40 నిమిషాల పాటు సీఎం సిద్దరామయ్య బడ్జెట్ ప్రసంగం సాగింది. వచనకారిణి అక్కమ్మ ప్రవచనంతో ఆరంభించారు. డా.అంబేడ్కర్ సహా పలువురు ప్రముఖ కవుల వ్యాఖ్యలను కూడా ప్రసంగంలో ప్రస్తావించారు. గ్యారంటీ స్కీములకు..దొడ్డబళ్లాపురం: పంచ గ్యారంటీ సంక్షేమ పథకాలకు బడ్జెట్లో సాధారణంగానే నిధులను ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి, జన సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చానని సీఎం చెప్పారు. గృహలక్ష్మి పథకానికి రూ.28,608 కోట్లు, అన్నభాగ్యకు రూ.6,200 కోట్లు, గృహజ్యోతికి రూ.10,578 కోట్లు, మహిళల ఉచిత బస్సు పథకానికి రూ.5,300 కోట్లు కేటాయించారు. అయితే యువనిధి పథకానికి ఏమీ మంజూరు చేయలేదు. -
మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
బెంగళూరు: మద్యం ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం పాలసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇక నుంచి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల నిర్ణయాన్ని లిక్కర్ కంపెనీలే నిర్ణయించేలా అవకాశం కల్పించింది. ఈ మేరకు 2026-27 బడ్జెట్లో మద్యం పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కారు. ఏప్రిల్1 వ తేదీ నుండి మద్యం ధరలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించి, లిక్కర్ కంపెనీలే ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. ఆరు దశాబ్దాల నుంచి ఉన్న మద్యం ధరల నియంత్రణను ప్రభుత్వం తొలగించింది. దీంతో డిస్టిలరీలు మరియు బ్రూవరీస్ తమ ఉత్పత్తుల ధరలను నిర్ణయించుకోవచ్చు. ఇది వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. మరొకవైపు ఆల్కహాల్ శాతం ఆధారంగా ఎక్సైజ్ సుంకం ఉండనుంది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరగడమే కాకుండా, పరిశ్రమలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. అసెంబ్లీ సమావేశాల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. మొబైల్ వినియోగంతో కలిగే దుష్ప్రభావాలను సిద్ధరామయ్య ప్రస్తావించారు. పిల్లలపై మొబైల్స్ దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయడానికి బ్యాన్ చేసినట్లు సీఎం తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు సోషల్ మీడియాపై నిషేధం ఉండగా.. ఫిన్లాండ్, యూకే కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.కాగా, సోషల్ మీడియాతో ప్రయోజనాలే కాదు.. అనర్థాలూ పొంచి ఉన్నాయి. ఆ ప్లాట్ఫారమ్లలో అసభ్యకరమైన కంటెంట్ను చూడటం, వేధింపులకు గురికావడంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ అంశాన్ని పలు దేశాలు ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.గత ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం అమలు చేసింది. ఆస్ట్రేలియా కంటే ముందే.. అమెరికాలోని పలు రాష్ట్రాలు స్థానిక చట్టాల ద్వారా నియంత్రిస్తున్నాయి. ఆస్ట్రేలియా పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచే నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ స్ఫూర్తితో.. యూరోపియన్ యూనియన్ అంశాన్ని పరిశీలిస్తోంది. మరి కొన్ని దేశాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి. -
డిమాండ్ల సాధనకు ఆందోళన చేపడతాం
హుబ్లీ: రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ కొలువుల కోసం ధార్వాడలో భారీగా నిరుద్యోగులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిథి ఉపన్యాసకులు కూడా ఆందోళన బాట పట్టారు. తమ వివిధ సమస్యల పరిష్కారం కోసం సదరు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని ఆ సంఘం నేతలు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. గత 20 ఏళ్ల నుంచి అతిథి అధ్యాపకులుగా పని చేస్తున్నాం. ఈ ఏడాది యూజీసీ నియమాల సాకు చూపి 6 వేలకు పైగా అధ్యాపకుల నియామకం చేపట్టలేదు. దీంతో గత మూడు నెలల నుంచి పనులు లేక ఖాళీగా కూర్చున్నారు. సిద్దరామయ్య శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో తమకు న్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకోవాలని సదరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ హనుమంత గౌడ మీడియాకు తెలిపారు. సానుకూల నిర్ణయాలు తీసుకోక పోతే తుమకూరు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపట్టి బెంగళూరు ఫ్రీడం పార్కులో నిరవధిక దీక్ష చేపడతామన్నారు. గత ఏడాది కళాశాలలను బహిష్కరించి పోరాటం చేశామని, ఈసారి కూడా అదే బాటలో సాగుతామన్నారు. తమకు యూజీసీ వేతనాలు వద్దు. రాష్ట్ర వేతనాలు చాలు. గత 20, 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను విధుల నుంచి తొలగించకుండా 60 ఏళ్ల వయసు దాకా సేవా భద్రత కల్పించాలన్నారు. ఆ మేరకు ప్రభుత్వం నియమాలను రూపొందించాలన్నారు. -
నదిలో స్నానానికెళ్లి ఇద్దరు యువకులు మృతి
హొసపేటె/రాయచూరు రూరల్: హోలీ పండుగ సందర్భంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ముగ్గురు యువకులు బుధవారం సాయంత్రం ప్రమాదవశాత్తు తుంగభద్ర నదిలో మునిగిపోయారు. వారిలో ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన కొప్పళ జిల్లా గంగావతి తాలూకా సణాపురలోని వైట్ సాండ్ గెస్ట్ హౌస్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో జరిగింది. మరణించిన యువకులను గంగావతిలోని గాంధీనగర్ నివాసితులైన సూర్య(17), అభిషేక్ (17)గా గుర్తించారు. హోలీ పండుగ తర్వాత గంగావతి తాలూకాలోని సణాపురలోని వైట్ సాండ్ హోటల్ వెనుక ఉన్న తుంగభద్ర నదిలో కాలు జారిపడి మరణించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. భోజనం చేసిన తర్వాత స్నానానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. స్థానిక ఈతగాళ్లు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, యువకులు నాటు పడవను ఉపయోగించి మూడు గంటలకు పైగా నిరంతర గాలింపు తర్వాత మృతదేహాలను వెలికి తీశారు. ఈ విషయంపై గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అవినీతిపరులపై లోకాయుక్త పిడుగు
ఎవరెవరి ఇళ్లపై దాడులు? ● ఎంసీ.సత్యనారాయణ–ఏఈఈ, హాసన్ మహానగర పాలికె ● వసంత వీ.నాయక్– కేఆర్ఐడీఎల్ చీఫ్ ఇంజనీర్ ● వీరేశ హిరేమఠ, ఉప విద్యుత్ బెస్కాం ఉన్నతాధికారి, యాదగిరి ● సతీశ్ –ఏఈఈ, పీడబ్ల్యుడీ గదగ్ ● ఎంకే.సురకోడ్– బీసీ సంక్షేమ అధికారి–గదగ్ ● అసిఫ్ ఇక్బాల్ హుసేన్ – ఏఈఈ, నగర నీటి సరఫరా మండలి, మైసూరు ● శశిధర్– సీఈఓ , రైతుసేవాసహకార సంఘం యలహంక, బెంగళూరు, ● హెచ్సీ. ఇంద్రేశ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ కాలేజీ, హెబ్బాళ, బెంగళూరు ● డాలేశ్–బీడీఏలో ఆర్ఎఫ్ఓ అధికారి, బెంగళూరు, ● ప్రకాష్ –జలమండలి జూనియర్ ఇంజనీర్, బెంగళూరు బనశంకరి: ఆదాయానికి మించి ఆస్తులను అక్రమంగా కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ఇళ్లు, ఆఫీసులపై లోకాయుక్త అధికారులు గురువారం ఉదయం నుంచి మెరుపు దాడులు ప్రారంభించారు. బెంగళూరు, మైసూరు, హాసన్, మండ్య, గదగ్, యాదగిరి, హుబ్లీ, విజయపుర, బాగల్కోటే తదితర ప్రాంతాలలో సోదాలు జరిగాయి. దాడుల్లో కోట్లాది రూపాయల డబ్బులు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, ఇళ్లు, పొలాలు, వాహనాలను గుర్తించారు. రాత్రి వరకూ సోదాలు ● మండ్యలో ఏఈఈ సతీశ్ ఆఫీసు, ఇళ్లతో పాటు మొత్తం నాలుగు చోట్ల లోకాయుక్త అధికారులు దాడులు చేశారు. భారీఎత్తున బంగారు నగలు, నగదు, అక్రమాస్తులను కనిపెట్టారు. ● కర్ణాటక రోడ్ల అభివృద్ధి మండలి (కేఆర్డీసీఎల్) చీఫ్ ఇంజనీర్ వసంత వాలప్ప నాయక్ బాగల్కోటే, పరిసర గ్రామాల్లో నివాసం, తల్లి, సోదరుల ఇళ్లపై దాడిచేశారు. లోకాయుక్త అధికారులు వెళ్తే కుటుంబ సభ్యులు గేట్లు మూసివేశారు. కొంతసేపటికి గేట్లు తీశారు. బాగల్కోటే పోస్టల్ కాలనీలో నాయక్ సోదరుడు, ఏఎస్ఐ భీమసేన్నాయక్ ఇంటిలో సోదాలు చేస్తుండగా గ్రౌండ్ ఫ్లోర్లో పాము కనబడింది. లోకాయుక్త అధికారులు పాములు పట్టే వారిని పిలిపించి పామును పట్టించి, రాత్రయ్యేవరకూ సోదాలు కొనసాగించారు. ● బెంగళూరులో సింగనాయకనహళ్లి రైతుసేవా సహకారసం ఘం యలహంక సీఈఓ ఆర్.శశిధర్ నివాసం, హెబ్బాళ పశువైద్యకాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్సీ ఇంద్రేశ్ కార్యాలయం, ఇంటి పై దాడులు నిర్వహించారు. కొనసాగుతున్న తనిఖీలు ● విజయపుర జిల్లా ఇండి తాలూకా కే.బీ.జే.ఎన్.ఎల్ జూనియర్ ఇంజనీర్ పీజీ ప్రకాశ్ బెంగళూరు మహాదేవపుర, బీదర్ జిల్లా హుమనాబాద్లోని ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇతని భార్య పేరుతో ఉన్న స్కూల్లోనూ సోదాలు జరిగాయి. బెంగళూరులో పలువురు అధికారుల ఇళ్లలో తనిఖీలలో లెక్కలు లేని డబ్బు, ఆస్తులు, బంగారు నగలు లభించాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఇంకా తనిఖీ చేయాల్సి ఉందని, అక్రమ ఆస్తుల విలువ కోట్లలోనే ఉండవచ్చని లోకాయుక్త వర్గాలు తెలిపాయి. బెంగళూరు సహా రాష్ట్రంలో 10 మంది అధికారుల ఇళ్లలో ఆకస్మిక సోదాలు తలుపులు తీయకుండా అధికారుల ఆటంకం పెద్దమొత్తంలో డబ్బు, బంగారం, ఆస్తుల గుర్తింపు గోడలెక్కి ఇంట్లోకి వెళ్లారు హాసన్ రవీంద్రనగరలో కార్పొరేషన్ ఏఈఈ సత్యనారాయణ నివాసానికి తెల్లవారుజామున 5:30కు లోకాయుక్త అధికారులు వెళ్లగా, లోపలున్నవారు గేట్లు మూసివేశారు. లైట్లు కూడా ఆఫ్ చేశారు. సుమారు అర్ధగంట పాటు తలుపు తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అధికారులే తమ జీపును ఇంటి గోడ పక్కన నిలిపి దానిపైకెక్కి మొదటి అంతస్తు ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ సోదాలు చేయగా పెద్దమొత్తంలో నగదు, బంగారుఆభరణాలు, ఆస్తిపత్రాలు లభించాయి. -
నేత్రపర్వం.. రంగనాథ రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని తంబ్రహళ్లిలోని బండె రంగనాథ స్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది ప్రజల సమక్షంలో వైభవంగా జరిగింది. రథోత్సవం సందర్భంగా వంశపారంపర్య భక్తులు, పూజారుల కుటుంబం కొండలో నివసించే రంగనాథ స్వామి, లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఉదయం స్వామికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు డాక్టర్ మహేశ్వర స్వామీజీ నాయకత్వంలో అన్ని రకాల అలంకరణలతో ఉత్సవమూర్తిని కొండపై నుంచి వీధిలోకి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం రథాన్ని లాగారు. వేలంలో స్వామి వారి జెండాను కొప్పళకు చెందిన రంగప్ప పూజారి రూ.3,01,101కు పాడారు. రథాన్ని వివిధ పూలమాలలతో అలంకరించారు. అరటి ఆకులు, రంగురంగుల దుస్తులతో అలంకరించిన రథంలో ఉత్సవ మూర్తిని ప్రతిష్టించారు. లక్ష్మీ రమణ గోవిందా..గోవింద..అంటూ అక్కడ గుమిగూడిన భక్తుల ఆనందోత్సాహాల మధ్య రథోత్సవం సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథంపైకి అరటిపండ్లు విసిరి తమ భక్తిని చాటారు. రథోత్సవం నేపథ్యంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసు సిబ్బంది తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు -
గ్యాస్ పేలుడు.. ఇల్లు దగ్ధం
మండ్య: మండ్య తాలూకాలోని హలగూరు వద్ద చెన్నిపురలో ఉమేష్ అనే వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం వంట గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. మొదట పేలుడు జరిగి ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి, బట్టలు, ఆహార పదార్థాలు తదితర వస్తు సామగ్రి కాలిపోయింది. స్థానికులు వెళ్లి నీళ్లు పోసి మంటలను ఆర్పివేసేందుకు యత్నించారు. తరువాత ఫైర్ సిబ్బంది శ్రమించి ఆర్పివేశారు. ఈ దుర్ఘటనలో ఎవరూ గాయపడకపోయినా ఇంట్లో ఉన్న ఓ పిల్లి చనిపోయింది. ఇనుప పెట్టెలో ఉంచిన పత్రాలు, రూ 25 వేల డబ్బులు ఆహుతైనట్లు బాధితుడు విలపించాడు. -
కార్లే బార్లు.. బెళగావిలో పోకిరీల జల్సా
దొడ్డబళ్లాపురం: బెళగావిలో ఎక్కడంటే అక్కడ కార్లు నిలిపి అందులోనే మద్యం తాగుతున్నవారి మీద పోలీసులు కన్నేశారు. పోకిరీలు సిటీలో రోడ్డుపక్కన, హైవేలపై కార్లు నిలిపి అందులోనే మద్యం పార్టీలు చేసుకునే సంఘటనలు ఎక్కువయ్యాయి. నిర్జన ప్రదేశాలు, మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ కారు బార్ దందాలు అధికమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదులు రావడంతో వారం రోజులు తనిఖీలు చేయగా ఇలాంటివి 24 ఘటనలు బయటపడ్డాయి, కేసులు నమోదు చేసి 36 మందిపై చర్యలు తీసుకున్నారు. రాత్రివేళ రోడ్డుపక్కన కార్లు నిలిపి మద్యం తాగి ప్రయాణిస్తూ గొడవలకు, ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎథనాల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు● హావేరి జిల్లాలో ప్రమాదం సాక్షి, బళ్లారి: హావేరి జిల్లాలో రాణిబెన్నూరు పట్టణ శివారులో జాతీయ రహదారిలో గురువారం ఎథనాల్ ట్యాంకర్ లారీ బోల్తా పడి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ట్యాంకర్ హుబ్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తూ ఉండగా అదుపు తప్పి సర్వీసు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. క్షణాల్లోనే ఎథనాల్ లీకై ట్యాంకరు నుంచి మంటలు లేచాయి. డ్రైవర్ పరుగులు తీసి బయటపడ్డాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిలో గంటల తరబడి వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలున్నాయి. రాణిబెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టు కేసులో డీకేకు ఊరట శివాజీనగర: గతంలో బీజేపీ నాయకులను కించపరిచేలా పోస్టు పెట్టారనే కేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై నమోదైన కేసులో హైకోర్టు స్టే జారీ చేసింది. దీంతో డీకేకు ఊరట లభించింది. హుబ్లీలో 1992లో జరిగిన రామ జన్మభూమి పోరాటంలో పాల్గొన్న హిందూ కార్యకర్త శ్రీకాంత పూజారిని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దీనిని ఖండిస్తూ బీజేపీ నాయకులు మేము కూడా కరసేవకులు, అరెస్టు చేయాలి అని అభియానను ప్రారంభించారు. దీనిని ఖండిస్తూ డీకే శివకుమార్ ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు రెండు వర్గాల మధ్య ద్వేషం రేకెత్తించేలా ఉన్నాయని బీజేపీ నాయకులు బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో డీకే పై కేసు నమోదైంది. నంది హిల్స్లో కార్చిచ్చు చిక్కబళ్లాపురం: విశ్వవిఖ్యాత నంది హిల్స్లో మంగళవారం సాయంత్రం నుంచి కార్చిచ్చు వ్యాపించింది. కొండ మధ్యభాగంలో మంటలు లేచి క్రమంగా సుల్తాన్పేట వరకు వ్యాపించాయి, సుమారు 10 ఎకరాలలో చెట్లు, గుట్టలు కాలిపోయాయి. ఎత్తైన కొండప్రాంతం కావడంతో అక్కడకు అగ్నిమాపక వాహనాలు వెళ్లలేవు. పాదచారి మార్గం నుంచి పైకి వెళ్లి అగ్నిని ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి ఇప్పుడే ప్రారంభం కాగా అగ్నిప్రమాదాలు మొదలైనట్లు అనుమానాలున్నాయి. బీజేపీలో విభేదాలు నిజమే: విజయేంద్ర యశవంతపుర: తమ పార్టీలో విభేదాలున్న మాట వాస్తవమే. త్వరలో వాటిని పరిష్కరించుకొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. గురువారం దావణగెరెలో మాజీ ఎంపీ రేణుకాచార్య వర్గం నేతలు ఓ రిసార్ట్లో జరిపిన భేటీలో విజయేంద్ర పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ దావణగెరె జిల్లాలో చిన్నపాటి లోపాలున్నాయి. అన్నింటినీ సరి చేసుకొంటాం, దావణగెరె దక్షిణ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల గురించి టికెట్ ఆకాంక్షులతో చర్చించామని తెలిపారు. త్వరలో మరో వర్గం నేతలతో భేటీ జరిపి అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెప్పారు. -
మైసూరు సిల్క్ను నాశనం చేయొద్దు
మైసూరు: జిల్లాలోని టి. నరసిపురలోని మైసూరు సిల్క్ దారం కర్మాగారం ఆవరణలో స్టేడియం నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం మైసూరులో రైతులు ర్యాలీ చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు గుమిగూడి చెళ్లకోళలు ఊపుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర రైతు సంఘాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హళ్లికెరెహుండి భాగ్యరాజ్ మాట్లాడుతూ 1912లో ఈ పట్టు కర్మాగారాన్ని స్థాపించారని అన్నారు. ఆ కర్మాగారం భూమిలో 5 ఎకరాలకు పైగా భూమిని తీసుకుని స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని, మైసూర్ సిల్క్ వారసత్వ సంపదను నాశనం చేయరాదని డిమాండ్ చేశారు. ఈ స్థలంలో దాదాపు 550 రకాల పక్షులు, మొక్కలు, చెట్లు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయరాదన్నారు. స్టేడియం నిర్మాణ యోచనను మానుకుని, పట్టు ఫ్యాక్టరీని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. -
నాసిరకం పనులు.. గట్లకు బీటలు
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ మరమ్మతు పనులు నాసిరకంగా చేపట్టడంతో కాలువ గట్లకు వేసిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్పై పగుళ్లు ఏర్పడ్డాయి. కొప్పళ జిల్లా కారటిగి తాలూకాలోని మైలాపుర వద్ద చేపట్టిన పనుల్లో పూర్తి స్థాయిలో నాణ్యత కొరవడింది. కాలువ మరమ్మతు పనుల్లో కింది భాగంలో కాంట్రాక్టర్లు తూతూమంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో తుంగభద్ర ఎడమ కాలువ గట్లకు పగుళ్లు ఏర్పడినట్లు కర్ణాటక ప్రాంత రైతు సంఘం నేత సుందర్రాజ్ తెలిపారు. ఆయన పగుళ్లు ఏర్పడిన కాలువ గట్ల పనులను పరిశీలించి మాట్లాడారు. రూ.2.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 4.6 కి.మీ.పనులను నాసిరకంగా చేశారని ఆరోపించారు. ఈ నేపఽథ్యంలో రైతులు కాలువ కింది భాగంలో చేతులతో పెకలించగానే సిమెంట్ కాంక్రీట్ పెచ్చులూడి పైకి వచ్చిందన్నారు. సంబంధిత శాఖ ఇంజనీర్లను పిలిచి పనుల తీరుపై ఆరా తీశామన్నారు. నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం, కాంట్రాక్టర్లు తప్పించుకోవడం తగదన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఎడమ కాలువకు పగుళ్లు పట్టించుకోని అధికారులు -
కోరలు చాస్తున్న కరువు
రాయచూరు రూరల్ : కర్ణాటక చరిత్రలో అతివృష్టి, అనావృష్టితో పలు జిల్లాల్లో రైతులు సాగు చేసిన పంటలు సక్రమంగా పండక, పశుగ్రాసం లేక పశువులు తల్లడిల్లుతున్నా పంట నష్టపరిహారం అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూగనోము పాటిస్తున్నాయి. బాధిత రైతులు ఎలా జీవించాలో తెలియని సందర్భంలో ఎక్కువ పరిహారం వస్తుందన్న ఆశతో అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగినా తమకేమీ పట్టనట్లు ఉండటంపై రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ కర్ణాటకలోని రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆలకించే తహసీల్దార్లే లేకపోవడంపై బాధితుల్లో విచారం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో తాము అన్నమో రామచంద్రా అంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మౌనం వహించడాన్ని రైతులు తప్పుబట్టారు. ఆరు తాలూకాల్లో తీవ్ర కరువు సంభవించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. పశుగ్రాసానికీ కటకటే.. వర్షాలు లేక పంటలు పండక పోవడంతో పశువులకు పశు గ్రాసం కూడా లభించని దుిస్థితి నెలకొంది. చెరువులు, కుంటలు, బావులు, వాగుల్లో నీరు లేక పోవడంతో పాటు పశువులను మేపడానికి పశుగ్రాసం లభించక రైతులు కబేళాలకు విక్రయించడం, జాతరలు, సంతల్లో తక్కువ ధరకు విక్రయించడం జరుగుతోంది. జిల్లాలో 1.55 లక్షలకు పైగా పశువులను ఇప్పటికే విక్రయించినట్లు సమాచారం. జిల్లాకు 25 వేల క్వింటాళ్ల పశుగ్రాసం అవసరముందని పశు సంవర్ధక శాఖాధికారులు జిల్లాధికారికి మూడు నెలల క్రితం ప్రతిపాదనలను పంపినట్లు తెలిపారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద వరి పంటను తక్కువ ప్రమాణంలో పండించడంతో పశుగ్రాసం కొరత ఏర్పడిందని సమాచారం. జాతరలో జోరుగా పశువుల విక్రయాలు సంతలో బారులు తీరిన పశువులు జిల్లాలో ఆరు తాలూకాల్లో దుర్భిక్షం కబేళాలకు తరలుతున్న మూగజీవాలు సంతల్లో తక్కువ ధరకు పశువుల విక్రయాలు -
జనాభా లెక్కలు పక్కాగా సేకరించాలి
రాయచూరు రూరల్ : కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ–2027కు అధికారులు సిద్ధం కావాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సభా భవనంలో అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా పేర్కొన్న అంశాలను ఆధారంగా చేసుకొని వివిధ గ్రామాల్లో సంచరించి ఇంటింటికెళ్లి సర్వే చేయాలని సూచించారు. రెండు విడతల్లో జనాభా లెక్కల సేకరణ, సమీక్షలు ఉంటాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలో సమీక్షించాలని కోరారు. సమావేశంలో ఏఎస్పీ శివానంద, ఏసీ బసవణ్ణప్ప, హంపణ్ణ, రోణ, బసవరాజ్, బడిగేర్, గురురాజ్ సోలంకి తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు తీర్చేనా.. నిరాశ పర్చేనా?
నేటి నుంచి 27 వరకు అసెంబ్లీ ● ప్రతిపక్షాల చేతిలో పదునైన ఆయుధాలు ● రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ● మార్చి 27వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుంది. ● సీటు రగడ, బడ్జెట్ చర్చలు, రాష్ట్రంలో ప్రముఖంగా నలుగుతున్న పలు అంశాలతో పోరాటానికి ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్లు సిద్ధమయ్యాయి. ● గత ఉభయ సభల సమావేశాల్లో ఎకై ్సజ్ మంత్రి తిమ్మాపుర లంచాల గోలతో సర్కారుకు తీవ్ర ఇక్కట్లు వచ్చాయి. నాలుగైదు రోజులు అదే చర్చ జరిగింది. ● ఈసారి బడ్జెట్లో పథకాలకు, ఆయా జిల్లాలకు కేటాయింపులు, నీటి ప్రాజెక్టుల ప్రగతి, నరేగా, కరువు సాయం తదితరాలతో ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశముంది. ● గ్యారెంటీల భారం, ఖజానా దివాలా తీసిందని, అప్పులు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండగా సొంత మంత్రులపైనే ఫోన్ ట్యాపింగ్ నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇది అసెంబ్లీలో చర్చించే అవకాశముంది. ● ఇటీవల ధార్వాడలో జరిగిన నిరుద్యోగ ఆందోళన ప్రభంజనం ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. నిరుద్యోగుల్లో వేడిని చల్లార్చేందుకు సీఎం సిద్దరామయ్య బడ్జెట్లో ఉద్యోగ నియామకాలను భారీగా ప్రకటించాల్సి ఉంటుంది. ● ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి మరింతగా నిధులకు డిమాండ్ చేసే అవకాశముంది. ● సీఎం మార్పిడి రచ్చ, విదేశీ టూర్లు, విందు భేటీలు కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి. మొత్తం మీద ఈ బడ్జెట్ సమావేశాలు అందరి అనుమానాలను తీర్చేలా ఉండాలని కోరుతున్నారు. శివాజీనగర: సీఎం సీటు మార్పిడి వివాదాలను తట్టుకుని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేడు శుక్రవారం రాష్ట్ర బడ్జెట్ను ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానుండగా, తొలిరోజే 2026–27 బడ్జెట్ను సీఎం సమర్పిస్తారు. ఆర్థికమంత్రి, సీఎంగా ఆయనకు ఇది 17వ బడ్జెట్ కావడం విశేషం. దీంతో రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్లు సమర్పించిన సీఎంగా రికార్డులు సృష్టించారు. ఈ బడ్జెట్ ప్రజలకు సంతోషం కలిగిస్తుందా?, పన్నుల వాత వేస్తుందా? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. కత్తి మీద సామే బడ్జెట్ మీద రైతులు, మహిళలు, సామాన్య ప్రజలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు.. ఇలా అన్ని రంగాలవారూ ఆశలు పెట్టుకోవడంతో సిద్దరామయ్యకు కత్తిమీద సాముగా మారింది. విద్య, నీటి పారుదల, పశు సంవర్ధక, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. సీఎం సీటు రభస వల్ల ఆలస్యంగా బడ్జెట్ సన్నాహక సమావేశాలను నిర్వహించిన సీఎం ఆయా వర్గాలతో భేటీలు జరిపారు. గత బడ్జెట్లో పంచ గ్యారెంటీ పథకాలకు రూ. 56 వేల కోట్లు కేటాయిస్తే మొత్తం 70 వేల కోట్ల వరకూ ఖర్చయినట్లు తెలిసింది, ఇది సర్కారుకు పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పద్దులో మరిన్ని నిధులను గ్యారెంటీలకు కేటాయించాల్సి రావచ్చు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పనులకు భూ స్వాధీనానికే రూ.70 వేల కోట్లు అవసరముంది. ఈ సారి అందుకు రూ.10 వేల కోట్లను ప్రకటించే అవకాశముంది. భారీ కేటాయింపులు కావాలి వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, హోం, నగరాభివృద్ధి, రవాణా, ప్రజాపనులు వంటి శాఖలు కూడా భారీగా కేటాయింపులను కోరుతున్నాయి. అన్ని నిధులను సర్దుబాటు చేయడం సిద్దరామయ్యకు సవాల్గా మారింది. కొత్త పథకాల కోసం అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఏమేం స్కీములు ఉంటాయనేది కుతూహలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్ పథకం కోరుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో అది కష్టసాధ్యమని తెలుస్తోంది. అందుచేత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నజరానాలను ప్రకటించవచ్చని తెలుస్తోంది. సంక్షేమ పథకాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నిధులకు చాలా తేడా ఉన్న సమయంలో సమతుల్యమైన బడ్జెట్ను సిద్దరామయ్య ప్రకటించాల్సి ఉంది. నిధులను రాబట్టుకోవడానికి స్థిరాస్తులు, మద్యం, మోటారు వాహనాలు తదితర అనేక పన్నులను పెంచే అవకాశం లేకపోలేదు. నేడు సీఎం సిద్దరామయ్యచే రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనాలు సిద్దుకు ఇది 17వ పద్దుగా రికార్డు నమోదు ప్రజలపై భారం గ్యారెంటీ: అశోక్ బనశంకరి: ఈసారి సీఎం సిద్దరామయ్య రూ.1.15 లక్షల కోట్ల అప్పులు చేసి బడ్జెట్ సమర్పిస్తున్నారు, ప్రజలపై పన్నుల భారం వేయడం గ్యారంటీ అని బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిద్దరామయ్య అంటే పన్నుల భారానికి మరోపేరుగా మారారు. ఇప్పటికే 36 పన్నులు ప్రజలపై వేశారు. ఆయన పదవి ముగిసేలోగా రాష్ట్రం అప్పులు రూ.8 లక్షల కోట్లకు చేరతాయని దుయ్యబట్టారు. అప్పులు చేసి ప్రభుత్వం నడపరాదు, బడ్జెట్ కోసం సిద్దరామయ్య రూ.1.15 లక్షల కోట్లు రుణం తీసుకుంటున్నారు, ఈ బడ్జెట్లో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తారు అని అన్నారు. కేపీఎస్సీలో కులం, డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఇచ్చేస్తారని, దానిని మూసేయాలని కోరారు. ఈ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు! గత బడ్జెట్ పరిమాణం రూ.4.09 లక్షల కోట్లు కాగా, ఈదఫా రూ.5 లక్షల కోట్ల పద్దు ఉండవచ్చని అంచనాలున్నాయి. 2024–25 బడ్జెట్ మొత్తం రూ.3.65 లక్షల కోట్లు. ఇలా ఏటేటా రూ.40 వేల కోట్లకు పైగా సైజు పెరుగుతోంది. -
యువకుడిని హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు చేసి..
●బ్యాగ్లో వేసి పారేసిన దుండగులు హొసపేటె: యువకుడిని దారుణంగా హత్య చేసిన నిందితులు, మృతదేహ శరీర భాగాలను కత్తిరించి, ప్లాస్టిక్ సంచిలో నింపి, విసిరి వేసి పారిపోయిన ఘటన విజయనగర జిల్లాలోని హువిన హడగలి తాలూకా బీరబ్బి గ్రామంలో జరిగింది. హత్యకు గురైన యువకుడిని గ్రామానికి చెందిన వీరేష్(25)గా గుర్తించారు. హత్యకు గురైన బీరేశ్ గత 15 రోజులుగా కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. అయితే బుధవారం సాయంత్రం బీరేశ్ మృతదేహం ఇంటి వెనుక కనిపించింది. ఏదైనా చనిపోయిన జంతువు కళేబరం నుంచి దుర్వాసన వస్తుందేమో అని వారు తనిఖీ చేయగా, బీరేశ్ మృతదేహం కనిపించింది. హంతకులు శరీర భాగాలను ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచిలో నింపినట్లు వెలుగులోకి వచ్చింది. మృతుడు బీరేశ్ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. సమాచారం అందిన తర్వాత విజయనగర ఎస్పీ జాహ్నవి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హిరేహడగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడికి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రేపు బెళగావిలో జిల్లా స్థాయి ఉద్యోగ మేళాహుబ్లీ: బెళగావిలోని శివబసవ నగర్లోని ఎస్జీ బాళెకుంద్రి సాంకేతిక కళాశాలలో ఈ నెల 7న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా స్థాయి ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశామని ఆ జిల్లా జెడ్పీ సీఈఓ రాహుల్ సింధె తెలిపారు. జిల్లా యంత్రాంగం, జెడ్పీ, కౌశల్య అభివృద్ధి తదితర సంస్థలు, సిద్దరామేశ్వర విద్యా సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుందన్నారు. మేళాను జిల్లా ఇన్చార్జి మంత్రి సతీష్ జార్కిహొళి, రాష్ట్ర సీ్త్ర శిశు శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ప్రారంభిస్తారన్నారు. ఎమ్మెల్యే ఆసిఫ్ సేఠ్, వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారన్నారు. 100కు పైగా కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగ నియమాలను చేపడతారన్నారు. 10వ తరగతి, పీయూసీ, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర అర్హతలు ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రిమ్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నారాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం ఆస్పత్రి ముందు భాగంలో విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ మైసూరుకు చెందిన స్విస్ కంపెనీ యాజమాన్యం గత రెండు, మూడు నెలల నుంచి వేతనాలు, పీఎఫ్, జీపీఎఫ్, బోనస్ వంటివి చెల్లించకుండా, పైగా వేతనాల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు కోత కోయడాన్ని తప్పుబట్టారు. న్యాయసమ్మతంగా బకాయి వేతనాలను త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో రమేష్, సందీప్, నరేష్, వినోద్, అనురాధ, సునీత, మల్లికార్జున, పుష్ప, ఈరమ్మ, శ్రీనివాస్, అమరమ్మ, విశ్వనాథ్, నవీన్ కుమార్, ప్రశాంత్లున్నారు. కార్మికులకు కనీస వేతనాలివ్వరూ.. రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. గురువారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. అసంఘటిత రంగంలో విధులు నిర్వహించే కార్మికులకు నెలకు రూ.37 వేల నుంచి రూ.43 వేల వరకు వేతనాలు చెల్లించేలా సర్కార్ బడ్జెట్లో ప్రవేశ పెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. మత సామరస్యం చాటిన ముస్లింలు హుబ్లీ: హోలీ పండుగలో ముస్లింలు మత సామరస్యాన్ని చాటి దేశ సమైక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచారు. జిల్లాలోని కలఘటిగి పట్టణంలో గ్రామ దేవత జాతరలో అంజుమన్ ఇస్లాం సంస్థ ప్రముఖులు ఒడి నింపడమే కాకుండా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. స్వయంగా వారే వడ్డించి మత సామరస్యాన్ని చాటిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలై సర్వత్రా ప్రశంసలందుకున్నాయి. -
మద్యం మత్తులో స్నేహితుడి హత్య
రాయచూరు రూరల్: మద్యం తాగిన మత్తులో స్నేహితుడు హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి యాదగిరి జిల్లా సురపుర తాలూకా కెంబావిలో చోటు చేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని రాత్రి పీకలదాకా మద్యం తాగినప్పుడు వాగ్వాదం చెలరేగింది. దీంతో మద్యం బాటిల్తో రవికుమార్(37)ను పొడిచి చంపినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్ తెలిపారు. నిందితుడు మాయన్న(36) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ శంకర్, డీఎస్పీ జావేద్ ఇనాందార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యాదగిరి ఆస్పత్రికి తరలించారు. కెంబావి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో మునిగి యువకుడు మృతిరాయచూరు రూరల్: చెరువులో ఈత రాక యువకుడు నీటి పాలైన ఘటన రాయచూరు తాలూకా మర్చటాళ్లో బుధవారం సాయంత్రం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని చెరువులో స్నానానికి వెళ్లిన శరణప్ప(30) నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెరువు చుట్టూ తీగ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. వేద అధ్యయన సందేశాలు బోధించాలి రాయచూరు రూరల్: భారత దేశంలో హిందూ ధర్మంలో వేద అధ్యయన సందేశాలను పిల్లలకు చాటాలని కొత్తల బసవేశ్వర సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బసవరాజ్ పాటిల్ సేడం పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా సుల్తాన్పురలో గురులింగ శివాచార్య ఆధ్వర్యంలో జంగమ వటులకు ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరాలు, సామూహిక వివాహాలను జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి వారికి శిబిరంలో నేర్పే విద్య చిరకాలం గుర్తుంటుందన్నారు. నూతనంగా దాంపత్యంలోకి అడుగు పెడుతున్న నవజంటలు స్వామీజీల ఆశ్వీరాదాలతో శాంతియుత జీవితం గడపాలన్నారు. సుల్తాన్పుర శంభు సోమనాథ, కిల్లే బృహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్య, కపిల సిద్దరామ స్వామి, జాగటగల్ స్వామీజీ, ప్రశాంత్, గిరిజా శంకర్లున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపండి హొసపేటె: కేంద్ర ప్రభుత్వంలోని 78 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.78 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపాన్ని సంతరించుకుందని ఏఐడీవైఓ నేత ప్రకాష్ నాయక్ పేర్కొన్నారు. యువతకు ఉపాధిని కోరుతూ ఏఐడీవైఓ సంస్థ జిల్లాధికారి ద్వారా ప్రధానమంత్రికి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే ఉందన్నారు. 2014లో ప్రతి సంవత్సరం యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అవినీతి, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ శాఖల ప్రైవేటీకరణ పరిస్థితిని మరింత దిగజార్చాయన్నారు. ప్రజల పెరుగుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని వారి బలం, సామర్థ్యానికి అనుగుణంగా అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023లో యువత ఆత్మహత్యల సంఖ్య 14,234కి పెరిగిందన్నారు. అందువల్ల ఈ సమస్యల నుంచి యువతను రక్షించడానికి తమ సంస్థ పోరాడుతుందన్నారు. వివాహిత ఆత్మహత్యమైసూరు: చామరాజనగర తాలూకా అమచావాడి గ్రామంలో భర్త, అత్త వేధింపులను తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పల్లవి (30) మృతురాలు. ఆమె భర్త మహేష్ దంపతులు కాగా, ఏడాది కూతురుంది. భర్త, అత్త చిక్కతాయమ్మ తరచూ పల్లవిని సూటిపోటి మాటలతో వేధించేవారు. భర్త తాగి హింసిస్తున్నాడు. దీంతో విరక్తి చెందిన పల్లవి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి సిద్ధశెట్టి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. -
విద్యార్థులతో పాచి పని
సాక్షి,బళ్లారి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన అమానుష ఘటన కలకలం రేపింది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హగరిబొమ్మనహళ్లి తాలూకా హంపా పట్టణలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో మరుగుదొడ్లు కంపు కొడుతున్న నేపథ్యంలో శుభ్రం చేయించాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా విద్యార్థులతో శుభ్రం చేయించారు. వారికి మరుగుదొడ్లు శుభ్రం చేస్తే అరటిపండ్లు ఇస్తానని ఆశ చూపించడంతో పాటు, వారిని బెదిరించి శుభ్రం చేయించారు. కాగా విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారని బడికి పంపితే మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా? ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు ఈ ఘటనతో విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బాలల హక్కులను కాపాడాల్సిన ఉపాధ్యాయులే కాలరాస్తే ఎవరితో చెప్పుకోవాలి? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. బాలల హక్కల పరిరక్షణ సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. గతంలో కూడా విద్యార్థులతో పలు పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ బుద్ది తెచ్చుకొని పని చేయాల్సిన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా, విద్యార్థులపై చులకన భావంతో వ్యవహరిస్తూ, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మరుగుదొడ్లు శుభ్రం చేయించిన ఉపాధ్యాయులు అమానుష ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు -
లవ్ జిహాద్ అడ్డుకట్టకు కఠిన చట్టం తేవాలి
హుబ్లీ: రాష్ట్రంలో లవ్ జిహాద్ నివారణకు కఠిన చట్టం అమలు చేయాలని శ్రీరామ సేనా చీఫ్ ప్రమోద్ ముతాలిక్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నగరంలో లవ్ జిహాద్ బాధితులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఎందరో యువతులు అదృశ్యం అయ్యారన్నారు. ఇప్పటి వరకు కొందరి ఆచూకీ లభించలేదన్నారు. దేశంలో లవ్ జిహద్ కేసులు పెరుగుతున్నాయి. కనిపించకుండా పోయిన యువతులు లవ్ జిహాద్ ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇలాంటివి అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం నగరంలోని బీవీబీ కళాశాలలో హత్యకు గురైన నేహా హిరేమఠ తండ్రి నిరంజనయ్య హిరేమఠ మీడియాతో మాట్లాడుతూ లవ్ జిహాద్ పథకం ప్రకారం జరుగుతోందన్నారు. తన కుమార్తె హంతకుడికి జైలులో రాజభోగాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన కుమార్తె హత్య జరిగి రెండేళ్లు గడిచినా తమ కుటుంబానికి న్యాయం దొరకలేదన్నారు. నిందితుడికే పలువురు కుమ్మక్కును ఇస్తున్నారన్నారు. అందుకే తమ కుమార్తె హత్య కేసును ఎన్ఐఏ లేదా సీబీఐకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పోలీసుల ఎదుట ముత్యా ప్రత్యక్షం
సాక్షి,బళ్లారి: బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలతో పోక్సో కేసు నమోదైన అనంతరం కనిపించకుండా పోయిన స్వయం ప్రకటిత స్వామీజీ మల్లికార్జున ముత్యా పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యారు. యాదగిరి జిల్లా మహాల్రోజా మఠానికి చెందిన మల్లికార్జున ముత్యాపై బాలికతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. దీంతో గతనెల 25 నుంచి ముత్యా కనిపించకుండా పోయారు. మరో వైపు స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలించారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, బాలిక కుటుంబ సభ్యులు కూడా తనపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, కుట్రతో చేశారని, తాను త్వరలో కనిపిస్తానని ఆయన వీడియో పంపారు. వారం రోజుల నుంచి ముత్యా కనిపించకుండా పోవడంతో ఎట్టకేలకు బుధవారం రాత్రి యాదగిరి జిల్లా శహాపుర సర్కిల్ ఇన్స్పెక్టర్ ముందు హాజరయ్యారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసిన అనంతరం పంపించేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం కూడా విచారణకు రమ్మడంతో ముత్యా పోలీసుల ముందు హాజరయ్యారు. విచారణ చేసిన అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కాగా శహాపుర పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరింపజేశారు. కేసు నమోదు చేసుకుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయంపై చర్చ నడుస్తోంది. పోలీసు స్టేషన్ వద్ద హైడ్రామా సాగుతోంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా, కేసు విచారణ ఈనెల 6వ తేదీకి వాయిదా పడింది. -
దుబాయ్ నుంచి క్షేమంగా స్వస్థలానికి
సాక్షి,బళ్లారి: దుబాయ్లో వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు బళ్లారి నుంచి వెళ్లిన పర్యాటకులు అక్కడే చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడి ఎట్టకేలకు సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయంలో దిగారు. దాదాపు 50 మంది బళ్లారి వాసులు ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోని ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా భీకర దాడులు, ఆ దేశాధినేత హత్య నేపథ్యంలో అంతర్జాతీయ విమానయానాలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో దుబాయ్లో ఉండేందుకు అన్ని విధాలుగా ఇబ్బందులు నెలకొన్నాయి. లాడ్జీలు, హోటళ్లలో అధిక ధరలు పెంచడంతో పాటు యుద్ధం తీవ్రం కావడంతో వారం రోజుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన బళ్లారితో పాటు చిత్రదుర్గ తదితర జిల్లాకు చెందిన పర్యాటకులను సురక్షితంగా బెంగళూరు విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. విమానంలో నుంచి దిగిన బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లా వాసులకు మాజీ మంత్రి బీ.నాగేంద్ర స్వాగతం పలికారు. తమ కష్టాలను, బాధలను తెలియజేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి తమను భారత్కు తీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు.ఈ ఘటనతో విదేశీ ప్రయాణాలు ఒక్కోసారి ఎంత క్లిష్టతరం అవుతాయో మరోసారి రుజువైంది. బెంగళూరు విమానాశ్రయంలో దిగిన కర్ణాటక వాసులు అందరికీ స్వాగతం పలికిన మాజీ మంత్రి బీ.నాగేంద్ర -
అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య
యశవంతపుర(కర్ణాటక): మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్కుమార్తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. -
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి స్థలంలోనే మృతి చెందిన ఘటన బుధవారం నగరంలో జరిగింది. నగరంలోని పటేల్ నగర్ వార్డు గోపీనాథ్ పాఠశాల రోడ్డులో అతి వేగంగా వస్తున్న బైక్ ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నగరానికి చెందిన వీరాంజనేయ(46) అనే స్కూటీ చోదకుడి తలకు బలంగా దెబ్బ పడటంతో తీవ్ర రక్తస్రావంతో స్థలంలోనే మృతి చెందాడు. బైక్పై ఉన్న ఇద్దరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పాఠశాలలో హెచ్ఎం రెండో భార్య హైడ్రామా సాక్షి బళ్లారి: కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా సోమలాపుర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. బుధవారం ప్రధానోపాధ్యాయుడు సిద్దేశ్ శెట్టర్ వ్యక్తిగత వివాదం పాఠశాల ఆవరణలో వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్ఎం రెండో పెళ్లి చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా ఉండటంతో తన భర్త తన వద్దకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగడంతో పాఠశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. పాఠశాలలోని తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్న సమయంలో ఆమె ఆక్కడికి చేరుకొని తన ఇంటికి ఎందుకు రావడం లేదని ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి వ్యక్తిగత వ్యవహారంపై పాఠశాల తరగతి గదిలో రచ్చ చేయడం సరి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం రెండో పెళ్లి వివాదం చర్చనీయాంశమైంది. ఘటనపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తోటి ఉపాధ్యాయులు సర్దిచెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించారు. 6న మద్యపాన ముక్త భారత్పై సదస్సు రాయచూరు రూరల్: మద్య పాన ముక్త భారత్పై ఈనెల 6న సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ రమేష్ వెల్లడించారు. బుధవారం కళాశాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. నగరంలోని ఎస్పీ క్రీడా మైదానంలో నశా ముక్త భారత్ పేరుతో రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ప్రచార శిబిరం, మారథాన్ను మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్, రాజీవ్గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ భగవాన్ ప్రారంభిస్తారన్నారు. మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజు, శాసన సభ్యులు, అధికారులు పాల్గొంటారని తెలిపారు. ముత్యాపై వీడియోలు అప్లోడ్ చేయొద్దు రాయచూరు రూరల్: స్వయం ప్రకటిత దేవమానవ మల్లికార్జున ముత్యాపై ప్రజలు వీడియోలు, ఆడియోలను అప్లోడ్ చేయరాదని, అలా చేసిన వారిపై కేసులు తప్పవని యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజుల క్రితం దైవవాణిని వినిపించే ముత్యా బాలికపై అనుచితంగా ప్రవర్తించినట్లు వీడియోను వైరల్ చేయడంపై మహిళా శిశు సంరక్షణ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు. యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మహల్ రోజా మల్లికార్జున ముత్యాపై కమిషన్ సుమోటో కేసు నమోదు చేసుకుందని తెలిపారు. ముత్యాపై అసత్యపు ఆరోపణలు చేయడం మానాలని, అనవసరంగా కేసులను నమోదు చేయడంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాటికాపరులకు పెన్షన్ ఇవ్వరూ రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల మాదిరిగా కాటికాపరులకు కనీస వేతనాలు, పెన్షన్ చెల్లించాలని కాటికాపరుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనం వద్ద సంఘం అధ్యక్షుడు వీరేష్ మాట్లాడారు. అసంఘటిత రంగంలో విధులు నిర్వహించే కాటికాపరులకు నెలకు రూ.10 వేల వరకు పెన్షన్ చెల్లించేలా సర్కార్ బడ్జెట్లో నిధులు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: ఆహార, పౌర సరఫరాల శాఖ అధికారులు, పోలీసులు దాడి చేసి తాలూకాలోని కాకుబాళు గ్రామంలోని కరియమ్మన గుడి సమీపంలో ఒక ఇంటి ముందు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో నిర్ధిష్ట సమాచారం ఆధారంగా దాదాపు 60.80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.2,10,368 ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయంపై హొసపేటె గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ అన్నారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల గురించి ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
పరిమళించిన మానవత్వం
రాయచూరు రూరల్: మానసిక అస్వస్థతకు గురై పిచ్చివాడిలా రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా వ్యవహరించిన మానసిక అస్వస్థుడిని పట్టుకొని అతనికి క్షౌ రం చేయించి కొత్త దుస్తులు ధరింప చేసి కారుణ్యాశ్రమంలో చేర్పించి మహిళా సబ్ ఇన్స్పెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా తుర్విహాళ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సుజాత నాయక్కు తిడిగోళలో మానసికంగా అస్వస్థతగా ఉన్న వ్యక్తి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె తోటి పోలీసు సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి ప్రత్యేక చొరవ తీసుకుని అతనికి సపర్యలు చేయించి సింధనూరులోని కారుణ్యాశ్రమంలో చేర్పించారు. మానసిక అస్వస్థుడికి ఆశ్రయం కల్పించిన మహిళా ఎస్ఐ -
గ్రహణం రోజే ఒక్కటైన 19 జంటలు
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో నడిచే దేవుడుగా ప్రసిద్ధి చెందిన దివంగత పండిత పుట్టరాజ గవాయి 112వ జయంతి వేడుకలు మంగళవారం గదగ్ నగరంలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సర్వ ధర్మ సామూహిక వివాహ కార్యక్రమంలో చంద్రగ్రహణం రోజే 19 జంటలు కొత్త జీవితంలోకి అడుగు మోపాయి. ముందు నగరంలోని ఏపీఎంసీ ఆవరణలో గవాయి మఠంలో ప్రత్యేక పూజలతో పాటు గవాయి చిత్రపటం ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. మఠం సన్నిధిని వైవిధ్యంగా పూలతో అలంకరించారు. హోలీ పుణ్యమి, చంద్రగ్రహణ మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పే ఉద్దేశంతో హిందూ, ముస్లిం తదితర వివిధ మతాల జంటలు ఈ వేదికలో ఒక్కటయ్యారన్నారు. వధువులకు ఉచితంగా మాంగల్యంతో పాటు అవసరమైన వస్త్రాలను అందజేశారు. అలాగే భారీగా కేక్ కట్ చేశారు. 1012 మంది ముత్తైదువులతో వైభవంగా కుంభమేళా నెరవేర్చారు. వివిధ వాయిద్య మేళాలతో కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. వీరేశ్వర పుణ్యాశ్రమం పీఠాధిపతి కల్లయ్యజ్జ, తోంటధార్య మఠం డాక్టర్ తోంటద సిద్దరామ స్వామితో పాటు పలువురు ప్రముఖులు బాగలకోటె, హావేరి, ధార్వాడ తదితర జిల్లాల నుంచి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. -
కార్మికులకు కనీస వేతనాలివ్వాలని నిరసన
హొసపేటె: షెడ్యూల్డ్ పరిశ్రమల్లోని కార్మికులకు కనీస వేతనాన్ని అందించాలని డిమాండ్ చేస్తూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) నేతృత్వంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బళ్లారి రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఆర్ఎస్.బసవరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నాలుగు కార్మిక చట్టాల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త కోడ్లను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నేతలు యల్లాలింగ, ఆర్.భాస్కర్ రెడ్డి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. మంగళవారం కార్మిక శాఖ జిల్లాధికారి కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడారు. వేతనాలు చెల్లించేలా సర్కార్ బడ్జెట్లో ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని కోరుతూ జిల్లా కార్మిక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. -
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
రాయచూరు రూరల్: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం హట్టి జెస్కాం కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడారు. అధికారులు రైతుల వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్కార్డులు, డిజిటల్ మీటర్లు అమర్చే పనిని మానుకోవాలన్నారు. పంప్సెట్లకు స్మార్ట్కార్డులు, డిజిటల్ మీటర్ల అమరికకు రూ.10 వేలు డిపాజిట్ చేయాలని ఆదేశించడం భావ్యం కాదన్నారు. రైతులకు విద్యుత్ పరికరాలను అక్రమ సక్రమ పథకం కింద అందించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని కోరుతూ స్థానికాధికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. -
హంపీలో తెరుచుకున్న ఆలయం
హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం విడిచిన అనంతరం ఆలయం తలుపులు తెరిచి యథావిధిగా స్వామి వారికి విశేష పూజలు, ధార్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాన్ని సిబ్బంది శుద్ధి చేశారు. భక్తుల సందడితో ఆలయ ఆవరణ కళకళలాడింది. సమస్యలను వెంటనే పరిష్కరించరూ.. సాక్షి, బళ్లారి: రాష్ట్రంలోని ప్రభుత్వ పీయూ కళాశాలల్లో సేవలందిస్తున్న అతిథి ఉపన్యాసకుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అతిథి ఉపన్యాసకుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం సంఘం ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం జిల్లా కార్యదర్శి నాగరత్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మందికి పైగా అతిథి ఉపన్యాసకులు ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. తక్కువ జీతాలు, ఎక్కువ పని చేస్తూ కష్టాల్లో పడి ఇబ్బందులను అనుభవిస్తున్నామన్నారు. సమయానికి గౌరవ వేతనం అందక జీవించడం సాగించడం కూడా కష్టంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న జీతాన్ని రెట్టింపు చేయాలన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. జిల్లాధ్యక్షుడు రంగన్న, ప్రముఖులు రాజేష్ భట్, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించండి రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని యరగేర తాలూకా పోరాట సమితి సంచాలకులు నిజాముద్దీన్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 కి.మీ. దూరంలో ఉన్న యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించి త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో నిధులు కేటాయించాలన్నారు. మూడేళ్ల నుంచి తాలూకా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ అధికమవుతున్నందున 2026–27లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ప్రతిపాదించేలా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అసంపూర్తి రోడ్డు పనులపై ఆగ్రహం బళ్లారిఅర్బన్: నగరంలోని 18వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర నగర్ మూడవ ప్రధాన రోడ్డులో చేపట్టిన అభివృద్ధి పనులు నెలన్నర గడిచినా పూర్తి కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పేరుతో సుమారు ఒక అడుగు లోతు వరకు మొత్తం రోడ్డును తవ్వి వదిలేయడంతో పాటు ఓపెన్ డ్రైనేజ్ కూడా తవ్వి ఉంచినందున ఇళ్లకు వెళ్లి రావడం కష్టంగా మారిందని అక్కడి నివాసులు తెలిపారు. పనులు ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కానీ మహానగర పాలక సంస్థ సిబ్బంది కానీ పరిశీలనకు రాలేదని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున వెంటనే రోడ్డు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరుతూ మహానగర పాలికె కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. వెంకటేశ్వర నగర్ సేవా సంఘం అధ్యక్షుడు పీ.ధనంజయ్, భీమలింగనగౌడ, పీఎం.నటరాజ్, లోకరాజ్, వీరేష్, ఎం.రవి, సతీష్, ముల్లంగి గిరి, రఘు, మయూర ట్రాన్స్పోర్ట్ శీనా తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్టాలో స్టేటస్పై రగడ
సాక్షి బళ్లారి: పశ్చిమ ఆసియాలోని ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడిలో ఇరాన్ దేశాధినేత ఖమేనీని హత్య చేసిన నేపథ్యంలో ఓ హిందూ యువకుడు సోషల్ మీడియాలో ఇన్స్టాలో స్టేటస్ పెట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కొప్పళ జిల్లా గంగావతి పట్టణానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఇరాన్ దేశాన్ని పాలిస్తున్న ఖమేనీ హత్యకు సంబంధించిన వార్తపై ఒక వీడియోను తన ఇన్స్టాలో స్టేటస్గా పెట్టుకోవడంతో ఓ సమాజానికి చెందిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐదారుగురు యువకులు చంద్రశేఖర్ వ్యాపారం చేస్తున్న ప్రదేశానికి చేరుకొని మాటల తూటాలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వివాదం తీవ్రరూపం దాల్చడంతో అతనిపై దాడికి దిగారు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటన నేపథ్యంలో దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ గంగావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడిన నిందితులపై గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఘటన నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. యువకుడిపై దాడి కొప్పళలో ఉద్రిక్తత -
వైభవంగా అమరేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా గురుగుంట అమరేశ్వర జాతర ఉత్సవాలు ప్రశాంతంగా జరిగింది. మంగళవారం సాయంత్రం దేవాలయం వద్ద దేవస్థాన సమితి అధ్యక్షుడు రాజా సోమనాథ్ నాయక్ రథోత్సవానికి పూజలు చేశారు. వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం జరిపారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, కలబుర్గి, యాదగిరి, సురపుర, శహాపుర, కొప్పళ, గంగావతిల నుంచి భక్తులు అధికంగా పాల్గొన్నారు. మాజీ లోక్సభభ సభ్యుడు రాజా అమరేశ్వర నాయక్, మాజీ ఎమ్మెల్యేలు హులిగేరి, అమరేగౌడ బయ్యాపూర్లున్నారు. -
హంపీలో మిన్నంటిన హోలీ
హొసపేటె: దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. రంగు రంగుల ఈ పండుగలో ప్రజలంతా పాల్గొని రంగులు చల్లుకుని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. బుధవారం హంపీలో ఎక్కడ చూసినా ప్రజలంతా హోలీ ఆడి రంగులు పూసుకుని సంబరాల్లో మునిగి తేలారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల నడుమ కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ సంతోష క్షణాలను పూర్తిగా ఆస్వాదించారు. ఇలాంటి కలర్ఫుల్ హోలీ పండుగను ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో బుధవారం ఎంతో ఘనంగా జరుపుకొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు హంపీలో ఒకరి కొకరు ముఖానికి రంగులు పూసుకొని, ఒంటి మీద రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. హోలీ సంబరాలను హంపీలోని విరుపాక్ష దేవాలయం నుంచి ఎదురు బసవణ్ణ మంటపం వరకు గల ప్రధాన వీధిలో నిర్వహించారు. స్థానికులు విదేశీ పర్యాటకులతో కలిసి నృత్యాలు చేశారు. హోలీ పండుగ ముందు రోజు కామన దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా జిల్లా ఎస్పీ జాహ్నవి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హొసపేటెలో..నగరంలో బుధవారం హోలీ సంబరాలు ఆకాశాన్నంటాయి. చిన్న, పెద్ద, యువతీ యువకులు ఎంతో ఇష్టపడే ఈ హోలీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకొన్నారు. విజయనగర జిల్లా వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలు తమ తమ ప్రాంతాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఉత్సాహంగా ఆచరించారు. సంబరాల్లో పాల్గొన్న స్వదేశీ, విదేశీ పర్యాటకులు పరస్పరం రంగులు పూసుకుని ఆనందించిన వైనం -
బాలింతలు, శిశు మరణాల నివారణకు కృషి
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల నివారణకు నవోదయ వైద్య కళాశాల, రాయచూరు తల్లీబిడ్డల ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్ర రెడ్డి వెల్లడించారు. బుధవారం నవోదయ కళాశాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 34 ఏళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య పరంగా సేవలందిస్తున్నట్లు గుర్తు చేశారు. జిల్లాలో మారు మూల ప్రాంతాల్లోని గర్భిణులు ప్రసవం కోసం వచ్చే వారికి 24 గంటలు వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. నవోదయ ఆస్పత్రిలో తాయి మడిలు కిట్లను అందించామన్నారు. నవోదయ విద్యార్థులు క్రీడలు, విద్యాభ్యాసంలో ఉన్నత ర్యాంకులు సాధించారన్నారు. నేటి నుంచి రీగల్ సంభ్రమాలు ఈనెల 5 నుంచి మూడు రోజులపాటు నవోదయ వైద్య కళాశాలలో జరుగనున్న రీగల్ ఉత్సవాలు–2026కు వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప శ్రీకారం చుడతారన్నారు. 6న స్నాతకోత్సవాలను రాజీవ్గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ బీ.సీ.భగవాన్, గ్రాడ్యుయేషన్, 7న ధార్వాడ ఐఐటీ డైరెక్టర్ వెంకప్పయ్య దేశాయి నర్సింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. సాయంత్రం ఇఫోరియా ఉత్సవాలు, నవోదయ నగోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆరోగ్య అంశాలపై ప్రచారం కోసం నవోదయ రేడియో స్టేషన్ను ప్రారంభించామన్నారు. ఈ ఏడాదిలో 4,386 మందికి తల్లులకు మడిలు కిట్లతో పాటు రూ.3 వేల పారితోషికం ఆందించామన్నారు. 136 చోట్ల ఉచిత ఆరోగ్య శిబిరాల్లో 28,591 మందికి వైద్య సేవలందించామన్నారు. శ్రీనివాస్, దేవానందలున్నారు. -
డీకే అల్టిమేటం?
శివాజీనగర: ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్న డిప్యూటీ సీఎం డీ.కే.శివ కుమార్ సహనంతో ఉంటాననే చెబుతున్నారు. హైకమాండ్ కూడా అదే మాటను ఆయనకు చెబుతోంది, పలు రాష్ట్రాల శాననసభ ఎన్నికలు ముగిసేవరకూ వేచి ఉండాలని డీకేను సూచించినట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఓపికతో ఉంటానని, మాట తప్పితే తీవ్ర నిర్ణయాలు తప్పవని డీకే స్పష్టం చేసినట్లు సమాచారం. కొన్నిరోజులు ఘాటుగా ప్రకటనలు చేసిన సీఎం సిద్దరామయ్య అంతలోనే స్వరం మార్చడం గమనార్హం. డీ.కే.శివకుమార్, తన బంధం పాలు–తేనెలాంటిదని, డీకేని ఆకర్షించేందుకు బీజేపీ, జేడీఎస్ పగటి కలలు కంటున్నాయని చెప్పడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అసోం పరిణామాలు అసోం అసెంబ్లీ ఎన్నికలకు డీ.కే.శివకుమార్ ఇన్చార్జిగా ఉన్నారు, అసోంలో ఒకప్పటి కాంగ్రెస్ నేత అయిన హిమంత్ బిశ్వశర్మ బీజేపీలో చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీకే ఎక్కువకాలం అసోంలో ఉంటే అనుకోని పరిణామాలు జరిగే అవకాశాలున్నాయా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ కాంగ్రెస్కు కట్టుబడిన నాయకుడు, బీజేపీ ఆయనను జైలులో ఉంచి వేధించినా పార్టీకి విధేయునిగా ఉన్నారు అని సిద్దరామయ్య మెచ్చుకోవడం వెనుక ఏ లెక్కాచారం ఉందీ? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్సుకతగా ఉంది. అసహనం వెంటాడుతున్నా.. అప్పట్లో ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల తరువాత సిద్దు సీఎం పదవిని వదిలి తనకు పట్టం కట్టాలని డీకే డిమాండ్ చేస్తున్నారు. అయితే సిద్దరామయ్య పట్టుదల, హైకమాండ్ నాన్చివేత వల్ల డీకే కల నెరవేరడం లేదు. హైకమాండ్ మీద డీకే అసహనంతో ఉన్నా, బయటకు చెప్పడం లేదు. తాము శ్రమించి పెంచిన పార్టీని నాశనం చేయడానికి మనసు రాదని తెలిపారు. సిద్దరామయ్యతో పాలు–తేనె బంధముందా అంటే బలవంతంగా ఔను అంటున్న డీకేలో అసంతృప్తిలో అధికమవుతోందని సమాచారం. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత సీఎం పదవిని అప్పగించాలి, లేదంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చని డీకే హైకమాండ్ పెద్దలకు తెలిపినట్లు తెలిసింది. డీకే శివకుమార్, సిద్దరామయ్య కలసికట్టుగా ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో 140కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాగడి ఎమ్మెల్యే హెచ్.సీ.బాలకృష్ణ అన్నారు. సీఎం సీటు వివాదం వల్ల పార్టీకి హాని కలుగుతోంది, దీనిని పరిష్కారం చేయాలని అన్నారు. సీఎం సీటు బదిలీకి పట్టు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాతేనన్న హైకమాండ్ అప్పటికై నా మాట నిలబెట్టుకోవాలన్న డీసీఎం! విదేశాల నుంచి ఎమ్మెల్యేల రాక సీటు మార్పిడిపై వ్యాఖ్యలు శివాజీనగర: కాంగ్రెస్లో సీఎం సిద్దరామయ్య అనుకూల వర్గం ఎమ్మెల్యేలు కొందరు తీవ్ర కుతూహలం మధ్య విదేశీ యాత్రను ముగించుకుని బుధవారం తెల్లవారుజామున తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పిడి రచ్చ జరుగుతున్న సమయంలో ఈ విదేశీ టూర్పై విమర్శలు వచ్చాయి. కొందరు ఎమ్మెల్యేలు విమానాశ్రయం నుంచి మీడియా కంటికి చిక్కకుండా వెళ్లేందుకు యత్నించారు. ఈ సమయంలో జగళూరు ఎమ్మెల్యే దేవేంద్రప్ప మాట్లాడుతూ కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లాం, అధికారికంగా అధ్యయన పర్యటన కాదు, పాడిపరిశ్రమ, వ్యవసాయం గురించి పరిశీలించాం, అక్కడి వ్యవసాయానికి, మన వ్యవసాయానికి చాలా తేడా ఉంది. అక్కడి పద్ధతులను మనం అమలు చేయాలి అని అన్నారు. ఇక్కడే ఉండి ఏమి చేయాలి, అయితే అక్కడికి వెళ్లి ఏమి చేయగలం? అని అన్నారు. రాజకీయాలను చర్చించలేదన్నారు. మూడు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతోంది, మరో రెండేళ్లూ ఇదే కొనసాగుతుంది అని కుర్చీ మార్పిడి తతంగంపై వ్యాఖ్యానించారు. -
కన్నీటి ప్రయాణమైన తీర్థయాత్ర
కారులోనే విగతజీవులుగా మారిన దృశ్యం లారీ కిందికి దూసుకెళ్లిన కారు ముందు వెళ్తున్న లారీని కారు ఢీ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా పలమనేరు వద్ద ప్రమాదంపలమనేరు/ గంగవరం: కర్ణాటక నుంచి తిరుమలకు వెళ్తున్న కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. బెంగళూరులోని రాజాజీనగరకు చెందిన మోహన్రావు (71), కుసుమ (61) భార్యాభర్తలు. నాగరాజరావు(68), జయంతి (61) వృద్ధ దంపతులు. నాగరాజరావు కుమార్తె పూజ (32) కారులో వెళ్తూ వెనుక నుంచి లారీని ఢీకొనడంతో దుర్మరణం చెందారు. ఎలా జరిగింది? బుధవారం వేకువ జామున ఇంటి నుంచి కారులో బయలుదేరారు. కారును మోహన్రావు నడుపుతుండగా ఆయన పక్కన భార్య కుసుమ కూర్చున్నారు. వెనుక వైపు నాగరాజరావు, జయంతి, పూజ ఉన్నారు. ముళబాగిళ్ వద్ద ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసి కదిలారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద బైపాస్లో సరిగ్గా 9.05 నిమిషాల ప్రాంతంలో గంటకు 130 కి.మీ వేగంతో వెళుతున్న కారు ముందు వెళుతున్న ఖాళీ సిమెంట్ లారీని ఢీకొని లారీ కిందకు దూసుకెళ్లి చిక్కుకుంది. దీన్ని గమనించని లారీ డ్రైవర్ కొంతదూరం అలాగే వెళ్లిపోయాడు. పక్కరూట్లో వెళ్లే వాహనాల డ్రైవర్లు కేకలు వేయడంతో లారీని రోడ్డు పక్కన ఆపాడు. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న వారందరూ నిమిషాలలో మరణించారు. వీరిలో కుసుమ, జయంతి అక్కాచెల్లెళ్లు. ఆ కుటుంబంలో త్వరలో ఓ శుభ కార్యం ఉండడంతో బంధువులు ఎంతో సంతోషించారు. కార్యం దిగ్విజయం కావాలని.. ముందుగా ఇలవేల్పు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీర్వాదం పొందాలనుకున్నారు. కుటుంబంతో కలిసి కారులో తిరుమల కొండకు బయలుదేరారు. ఇంతలోనే విధి వక్రించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరువాసుల తీర్థయాత్ర విషాదమయమైంది.తెరుచుకోని ఎయిర్ బెలూన్లు కారు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకుని ఉంటాడని భావిస్తున్నారు. కారులోని వారంతా సీటు బెల్టులు ధరించే ఉన్నారు. ప్రమాదం జరిగినా ఎయిర్ బెలూన్లు మాత్రం ఓపెన్ కాలేదు. కారు ముందు వైపున్న సెన్సార్లకు తగలకుండా కారు లారీ కిందికి వెళ్లడంతో సెన్సార్లు పనిచేయలేదని తెలుస్తోంది. బెలూన్లు తెరుచుకుని ఉంటే ప్రాణనష్టం తగ్గేదని పోలీసులు పేర్కొన్నారు. జేసీబీతో చాలాసేపు ప్రయత్నించి కారును, మృతదేహాలను బయటకు తీశారు. వెంకటేశ్వరా.. కాపాడలేదే? బంధువుల రోదనలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చిన కాసేపటికే వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పొద్దున బై బై చెప్పి బయల్దేరిన వారు ఇలా అవుతారని అనుకోలేదు.. నెలకు రెండుసార్లు తిరుమలను దర్శించే తమ కుటుంబానికి ఆ దేవుడు ఈ శిక్ష వేయడం ఏమిటి..? అని కుసుమ, జయంతిల అన్న తీవ్రంగా విలపించారు. కారు పేరు కూడా సెవెన్హిల్స్ అని పెట్టుకున్నామే.. ఆ వెంకన్నకు మాపై దయలేదా..? అని రోదించారు. మృతుల్లో నాగరాజరావు గతంలో బళ్లారి జిల్లా పరిశ్రమల శాఖ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఆయన కుమార్తె, మృతురాలు పూజ బెంగళూరులోనే టెక్కీగా పనిచేసేది. నాగరాజరావు కుమారుడు జర్మనీలో ఉంటాడు. బంధువుల రోదనలు అందరినీ కంటతడిపెట్టించాయి. -
లక్ష్మీ నరసింహ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని మాగడి తాలూకాలో శుకపురిగా ప్రసిద్ధి చెందిన సుగ్గనహళ్లిలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం రమణీయంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు జరిగాయి. ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తేరులో ప్రతిష్టించారు. ఎమ్మెల్యే హెచ్.సి. బాలకృష్ణ రథోత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రథోత్సవం సందర్భంగా ఓ గరుడ పక్షి రథం చుట్టూ ప్రదక్షిణ చేసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తజనం తరలివచ్చారు. పవిత్రకు ఇంటి భోజనం రద్దు దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడకు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న ఆమెకు వారానికి ఒకసారి ఇంటి నుంచి భోజనం వెళ్లేది. అయితే ఇప్పుడు హైకోర్టు ఇంటి భోజనానికి అనుమతిని నిరాకరించింది. ఆమెతో పాటు ఇతర నిందితులు నాగరాజు, లక్ష్మణ్కు ఉన్న ఈ సౌకర్యాన్ని ప్రశ్నిస్తూ జైలు అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ, కోరినప్పుడల్లా ఇంటి భోజనం ఇవ్వడం కుదరదని జడ్జి ఆదేశించారు. పాఠశాలలో హెచ్ఎం మృతి యశవంతపుర: విద్యార్థులకు పాఠం చెబుతుండగా గుండెపోటు వచ్చి ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన హాసన జిల్లా అరకలగోడు తాలూకా కెబ్బెకొప్పలు గ్రామంలో జరిగింది. హెచ్ఎం సతీశ్ (53) బుధవారం తరగతిలో పాఠం చెబుతూనే కిందపడిపోయారు. విద్యార్థులు మరో ఉపాధ్యాయునికి చెప్పగా అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేలోపు సతీశ్ తుదిశ్వాస విడిచారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు. అత్త పోరు.. మహిళా టెక్కీ ఆత్మహత్య యశవంతపుర: మంచి ఉద్యోగం, దండిగా జీతం.. కానీ కుటుంబ కలహాలతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు అబ్బిగెరెలో జరిగింది. అత్త వేధింపులే కారణమని ఆరోపణలున్నాయి. వివరాలు.. బెంగళూరుకు చెందిన సుష్మ (35) డెల్ సంస్థలో ఐటీ ఇంజనీరు, ఐదేళ్ల క్రితం పునీత్కుమార్తో పెళ్లి కాగా, 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఇంటిలో చిన్నచిన్న విషయాలపై అత్త కల్పనతో సుష్మకు గొడవలు జరిగేవి. మంగళవారం అత్తతో పోట్లాట జరిగింది. దీంతో ఆవేదన చెందిన సుష్మ ఇంటిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. అత్త, భర్త వేధింపుల వల్లనే తమ కూతురు చనిపోయిందని, అదనపు కట్నం తేవాలని సతాయించేవారని సుష్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, సోలదేవనహళ్లి పోలీసులు విచారణ చేపట్టారు. కావేరి నదిలోకి దూకి బలవన్మరణం మైసూరు: కుటుంబ గొడవలతో విసిగిపోయిన మహిళ కావేరి నదిలోకి దూకింది. చామరాజనగర జిల్లా యళందూరు తాలూకా కినకహళ్లి గ్రామానికి చెందిన రశ్మీ (39)కి పొరుగూరికి చెందిన లోకేశ్తో పెళ్లయింది. ఇద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కానీ కుటుంబ కలహాలతో విరక్తి చెందిన ఆమె బెంగళూరు నుంచి తమ జిల్లాలోని శివనసముద్రానికి వచ్చింది. అక్కడ వెస్లీ వంతెన పై నుంచి కావేరి నదిలోకి దూకడంతో ప్రాణాలు పోయాయి. బంధువుల, కొళ్లేగాళ గ్రామీణ పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. మెడికల్ సీటు అని రూ.25 లక్షలు మస్కా బనశంకరి: యువతికి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మించి రూ.25 లక్షల వంచనకు పాల్పడిన ముఠా ఉదంతమిది. ఫిర్యాదు మేరకు డాక్టర్ కేపీ శరత్తో పాటు నలుగురిపై బనశంకరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. షంషేర్ బేగ్, సయ్యద్ తబ్రేజ్, డాక్టర్ శరత్ కలిసి యువతి ఆయేషా తండ్రి లాల్బాబును కలిసి మీ కూతురికి ఎంబీబీఎస్ సీటును ఇప్పిస్తామని కాలేజీ డొనేషన్ ఫీజుల పేరుతో రూ.25 లక్షలు వసూలు చేశారు. అయితే ఎన్ని నెలలు గడిచినా సీటును ఇప్పించలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
నేత్రపర్వంగా మహారథోత్సవం
బళ్లారి అర్బన్: బళ్లారి జిల్లాలోని కురుగోడు పట్టణంలో వెలసిన దొడ్డబసవేశ్వరస్వామి మహారథోత్సవాన్ని గ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు భక్తిశ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. దొడ్డబసవేశ్వరస్వామి మహారథాన్ని ఆలయం ముందు ఉన్న ప్రధాన రహదారిలో భక్తుల సమక్షంలో ఎమ్మెల్యే గణేష్ తదితర ప్రజాప్రతినిదులు, ప్రముఖులు, అర్చకులు, భక్తులు లాగి యథాస్థానానికి చేర్చారు. రథోత్సవంతో పాటు స్వామివారిని దర్శించుకునేందుకు బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జాతర సందర్భంగా భక్తులకు ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భక్తిశ్రద్ధలతో దొడ్డబసవేశ్వరస్వామి రథోత్సవం కురుగోడుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు -
భక్తిశ్రద్ధలతో నారేయణ గురు జయంతి
బళ్లారి అర్బన్: యోగి నారేయణ యతీంద్ర కై వార తాతయ్య జయంతిని మంగళవారం భక్తిశ్రద్ధలతో ఆచరించారు. చిత్రపటాన్ని రథంలో ఉంచి వడ్డరబండ బలిజ భవనం నుంచి శోభాయాత్రను సంగం సర్కిల్ మీదుగా రాయల్ సర్కిల్, మీనాక్షి సర్కిల్ గుండా తిరిగి బలిజ భవనం వరకు ఊరేగించారు. శోభాయాత్రలో నందికోలు, బ్యాండ్ వాయిద్యాలు, కలశాలతో కన్నుల పండువగా ఊరేగింపు జరిపారు. రాయచూరులో.. రాయచూరు రూరల్: నగరంలో యోగి నారేయణ యతీంద్ర జయంతిని మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఆచరించారు. ఽయోగి నారాయణ యతీంద్ర చిత్రపటానికి తహసీల్దార్ పరశురామ పూలమాల వేశారు. అనంతరం జ్యోతి వెలిగించి మాట్లాడుతూ గురువులు, శరణుల మార్గదర్శనంలో సమాజం అభివృద్ధి దిశలో సాగాలన్నారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, వినోద్ కుమార్, సురేష్, శైలజాలున్నారు. దుర్గమ్మకు గ్రహణ పూజలుబళ్లారి అర్బన్: బళ్లారి నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా వెండి ఆభరణాల పూలతో అలంకరణ పూజలను అర్చకులు నిర్వహించారు. మంగళవారం గ్రహణం కలిసి రావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. మధ్యాహ్నం గ్రహణం ఉన్నప్పటికీ ఆలయం తెరిచి ఉంచినట్లు ధర్మకర్త పూజారి గాదెప్ప తెలిపారు. పాక్షికంగా చంద్రగ్రహణం సంభవించింది. గ్రహణ సందర్భంగా పూజలు, దానధర్మాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగింది. హంపీలో ఆలయం మూసివేత హొసపేటె: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయం మూసివేశారు. ఆలయంలో ధార్మిక కార్యక్రమాలను కూడా నిలిపి వేశారు. చంద్రగ్రహణం తర్వాత ఆలయాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆలయాన్ని మూసివేశారు. భక్తులు లేనందున ఆలయ ఆవరణ నిర్మానుషంగా మారింది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణంరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన కలబుర్గి జిల్లాలో వెలుగు చూసింది. యథాప్రకారం సేడం తాలూకాలో నాగనాథరెడ్డి(56) అనే ఆర్టీసీ డ్రైవర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సేడం బస్టాండ్ నుంచి వాడి మీదుగా హళ్లిఖేడకు బస్సు తీసుకెళ్లాడు. అక్కడ విధుల్లో ఉండగా స్వల్పంగా ఛాతీలో నొప్పిగా ఉందని కండక్టర్కు తెలిపాడు. వెంటనే అతనిని అంబులెన్సులో కలబుర్గి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినూత్నంగా హాజరు సేకరణ హొసపేటె: టీపీ కార్యాలయ సభాంగణంలో మంగళవారం ఎన్ఎంఎంఎస్ ఫేస్ ప్రామాణీకరణ శిక్షణ సదస్సు జరిగింది. నరేగ పథకం కింద నిర్వహించిన ఈ సదస్సుకు జెడ్పీ డిప్యూటీ కార్యదర్శి కే.తిమ్మప్ప అధ్యక్షత వహించి మాట్లాడారు. నరేగ పథకం కింద కమ్యూనిటీ పనుల్లో పని చేసే వ్యక్తుల రోజు వారీ హాజరు, పని స్థలం ఛాయాచిత్రాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం వినూత్న మొబైల్ టెక్నాలజీని అమలు చేసిందన్నారు. జిల్లాలోని అన్ని తాలూకాలు, గ్రామ పంచాయతీల్లో ఈ టెక్నాలజీతో రియల్ టైమ్ హాజరును సేకరిస్తారన్నారు. అందువల్ల నరేగ పథకం కింద తాలూకా స్థాయి అధికారులు, కో–ఆర్డినేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పారదర్శకంగా తమ విధులను నిర్వహించాలన్నారు. మేనేజర్ లోకేష్ బాబు, టీపీ ఈఓ ఆలం బాషా, హడగలి టీపీ అధికారి పరమేశ్వరప్ప, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
హోలీ.. రంగుల కేళి
బళ్లారి అర్బన్: హోలీ పండుగ సందర్భంగా నగరంలో ఆనందోత్సవాలతో యువతీ, యువకులు ఒకరిపై మరొకరు రంగుల నీళ్లను చల్లుకొని హోలీ సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం హోలీ పండుగను చిన్నారులు, మహిళలు, యువతీ యువకులు చిన్నా పెద్ద తేడా లేకుండా రంగులను చల్లుకుని ఆచరించారు. నగరంలోని ప్రధాన వీధులు, కాలనీలు రంగులమయంగా మారాయి. స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులను చల్లుకుని, మిఠాయిలను పంచుకుని పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. పలు చోట్ల డీజే సాంగ్స్తో యువతీ యువకులు నృత్యాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సామూహిక హోలీ వేడుకలు నిర్వహించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు సౌహార్థ వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవడం విశేషంగా నిలిచింది. రాయచూరులో.. రాయచూరు రూరల్ : జిల్లాలో రంగుల హోలీ పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. నగరంలోని బెస్తవారి పేట ఉప్పార సమాజం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కామదహనం చేశారు. మంగళవారం ప్రజలు హోలీ పాటలు పాడుతూ రంగులు చల్లుకుని సంబరాల్లో మునిగి తేలారు. భంగికుంటలో ఉట్టి పగులగొట్టే పోటీల్లో యువత పోటీ పడి కుండను బద్దలు కొట్టారు. సంబరంగా హోలీ హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని కూడ్లిగి సర్కిల్లో మంగళవారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వేడుకలు జరిగాయి. పండుగను పురస్కరించుకొని వేలాది యువత రంగులను చల్లుకుని సంబరాలను ఆనందంగా జరుపుకున్నారు. డీజే సౌండ్ విత్ రైన్తో కన్నడ పాటలకు బాలబాలికలు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అదే విధంగా కన్నడ సినీ ప్రసిద్ధ నటుడు దివంగత అప్పు పాటలకు అభిమానులు నృత్యం చేస్తూ ఉత్సాహంగా నినాదాలతో సంబరాల్లో పాల్గొన్నారు. రంగులమయంగా నగర వీధులు ఊరూవాడ మిన్నంటిన సంబరాలు ఆ గ్రామాల్లో హోలీ వేడుక విభిన్నంహుబ్లీ: హోలీ పండుగ అంటే అందరిలోను అత్యంత ఉత్సాహం, ఉల్లాసం, సంబరాలే. అయితే రాష్ట్రంలో రెండు గ్రామాల్లో హోలీ పండుగను ఎంతో విభిన్నంగా ఆచరిస్తారు. ధార్వాడ జిల్లా ముళముత్తళ గ్రామంలో రంగులు చల్లుకోడానికి బదలుగా తమ ఇంట్లోని ఆయుధాలతో కామన మూర్తిని చోరీ జరగకుండా కాపాడతారు. గత చరిత్రలోని ఓ ఘటన ద్వారా ఈ విశిష్ట సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ విచిత్ర ఆచరణను చూడటానికి తరలివస్తారు. ఇది కేవలం ఆచరణే కాదు. ప్రజల విశ్వాసం కూడా. ఆ గ్రామ వ్యాయామశాల ఎదుట సుమారు 12 అడుగుల ఎత్తుతో మంటపాన్ని నిర్మించి చుట్టు కట్టెల భద్రతతో కాముడిని ప్రతిష్టాపిస్తారు. ఈ విగ్రహాన్ని ఎవరైనా చోరీ చేస్తారన్న కారణంతో పూర్వాచారం ప్రకారం ఈ పద్ధతిని అంటే ఆయుధాలను పట్టుకొని కాపలా కాస్తారు. అదే విధంగా చిత్రదుర్గ జిల్లాలో వదిన, ఆడ పడుచులు పరస్పరం తలలు ఢీకొట్టుకొని హోలీ పండుగను వైవిధ్యమయంగా ఆచరిస్తారు. చిత్రదుర్గ జిల్లాలో.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా చిక్కేరన్న మాళిగె గ్రామంలో హోలీ సందర్భంగా ఈ విశేష వేడుక జరుపుకుంటారు. దీని వల్ల సంబంధాలు గట్టి పడతాయని నమ్మకం. గిరిజన సంస్కృతికి నిదర్శనంగా ఈ సంప్రదాయం నిలుస్తుంది. తలలను ఢీకొట్టుకుని ప్రేమ పూర్వకంగా ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఈ పండుగ సంప్రదాయాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటామని ఆ గ్రామ సీనియర్ ఉపాధ్యాయుడు డాక్టర్.కరియప్ప మాళిగె తెలిపారు. ముఖ్యంగా ఈ పండుగకు ఇక్కడ పుట్టినింటికి చెందిన ఆడ పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి ఈ వేడుకలో పాల్గొంటారని అన్నారు. -
లబ్ధిదారులకు పట్టాల మంజూరు
హొసపేటె: సీఎం గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద భూమి లేని 74 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గవియప్ప తెలిపారు. మంగళవారం పాపినాయకనహళ్లిలోని నాగప్ప సంక్షేమ మందిరంలో లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం భూమి లేని వారికి పట్టాలు అందించడంతో పాటు ఇళ్లు కట్టించేందుకు వ్యవస్థను రూపొందించామన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని ఆయన సూచించారు. గ్రామ సభలో 95 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా వారిలో 74 మందికి ప్లాట్లను జారీ చేశామన్నారు. రాబోయే రోజుల్లో పెండింగ్లో ఉన్న వారికి స్థలాలను అందిస్తామన్నారు. టీపీ ఈఓ ఆలం బాషా, పీడీఓ బీరప్ప, గృహ నిర్మాణ శాఖ అధికారి మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన మహిళ హత్య మిస్టరీ
హుబ్లీ: కోర్టు మెట్లెక్కిన భార్యాభర్తల మధ్య వివాద వాజ్యంలో భార్యకు జీవన భృతి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని భర్త కిరాయి హంతకులతో ఆమెను మట్టుబెట్టిన ఘటనలో మిస్టరీ వీడింది. ఈ కేసులో ధార్వాడ జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య తెలిపిన వివరాలు.. ధార్వాడ తాలూకా సోమాపుర నివాసి లలిత (42) హతురాలు. 2002లో నరేంద్ర గ్రామానికి చెందిన ఉదయ్కుమార్ అతరికితో సోమాపుర నివాసి లలితకు వివాహం జరిగింది. నలుగురు నిందితుల అరెస్టు నరేంద్రకు చెందిన భర్త ఉదయ్కుమార్, అతడి స్నేహితులైన గరగ గ్రామ నాగప్ప మడివాళప్ప, నచ్చనకి గ్రామ అభిషేక్, దూడవాడ గ్రామ నాగరాజ మడివాళప్ప హత్యలో పాల్గొన్న నిందితులు. వీరిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి పంపించామన్నారు. హత్యకు వాడిన థార్ వాహనం, నాలుగు మొబైల్స్, రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. గత నెల 26న సవదత్తి రోడ్డులో అమ్మినబావి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సోమాపురకు చెందిన లలిత మృతి చెందారు. ప్రమాద దృశ్యం ఓ బస్సు కెమెరాలో రికార్డు అయింది. దీన్ని పోలీసులు పరిశీలించి పథకం ప్రకారం ప్రమాదం చేసినట్లుగా తేల్చారు. విభేదాలతో పుట్టింటికి లలిత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తి లలిత పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఇటీవల లోక్ అదాలత్లో లలితకు ఉదయ్కుమార్ జీవనభృతిగా 1.5 ఎకరాల పొలం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో భర్త తన భార్య లలితను హత్య చేయడానికి రూ.40 లక్షలకు కిరాయి ఒప్పందం చేసుకొని పథకం రూపొందించాడు. మాట్లాడదాం రమ్మని పిలిచి.. ఆ పథకం ప్రకారం గత నెల 26న మాట్లాడుదాం రమ్మని సవదత్తి రోడ్డుకు భార్యను పిలిపించుకున్న ఉదయ్కుమార్ తన స్నేహితులను ఉపయోగించుకొని నెంబర్ ప్లేట్ లేని నల్ల రంగు థార్ వాహనం ద్వారా ప్రమాదం చేయించారు. సీసీ కెమెరాల ద్వారా సదరు కారును, నలుగురు నిందితులను దర్యాప్తులో గుర్తించి కోర్టుకు చార్జిషీట్ సమర్పించామన్నారు. అది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్తో హత్య ధార్వాడ జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య వెల్లడి -
ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు సర్కార్ సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య విద్యా శాఖా మంత్రి శరణప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం యాదగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల నర్సింగ్హోంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం 21 ప్రభుత్వ వైద్య కళాశాలలు నడుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో నర్సింగ్ కళాశాలల నిర్మాణానికి రూ.985 లక్షలు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ చెన్నారెడ్డి పాటిల్, అధికారులు సందీప్లున్నారు. -
వేడుకగా భంభం బాబా ఆరాధనోత్సవం
సాక్షి బళ్లారి: సర్వధర్మ సంస్థాపకులు, మహిమాన్వితుడు, దైవాంశ సంభూతుడు, సద్గురు అన్వరానంద బాబా నెలకొల్పిన సర్వధర్మ ఆశ్రమంలో భంభం బాబా ఆరాధన మహోత్సవం కన్నుల పండువగా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మంగళవారం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున మైసూరు సమీపంలో మండ్య జిల్లా కేఆర్ఎస్ రహదారిలో బెలగొళ గ్రామ సమీపంలోని కావేరి నదీ తీరాన సువిశాల, ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన సర్వధర్మ ఆశ్రమంలో భం షేక్ అబ్దుల్ స్వామి 57వ ఆరాధన మహోత్సవాలు, సద్గురు భం అన్వరానంద బాబా 23వ ఆరాధన మహోత్సవాలను భం కబీర్ కిరణ్ దివ్య సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భంభం బాబా ఆరాధన మహోత్సవాలను తిలకించడానికి వేలాదిగా భక్తజన సందోహం తరలివచ్చారు. ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భం కబీర్ కిరణ్ స్వామీజీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 6 గంటల నుంచి ధ్యాన మందిరంలో దివ్య జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామీజీ అమృత హస్తాలతో ధర్మపతాకాన్ని ఆవిష్కరించారు. విశ్వశాంతి కోసం పావురాలను ఎగరవేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ధ్యాన మందిరం నుంచి కన్యలు కుంభాభిషేకాలతో స్వామీజీకి స్వాగతం పలుకుతూ పరమ పవిత్రమైన జ్యోతికట్ట, భం అన్వరానంద బాబా, పూజ్య మాతాజీ సన్నిధానాల వద్దకు భక్తిపూర్వకంగా భజనలు చేస్తూ వెళ్లారు. జ్యోతికట్ట వద్ద అభిషేకం, గంధం, కుంకుమ, విభూతి అంటించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 15 నిమిషాలు ధ్యానం, భజన, మహా మంగళహారతి నిర్వహించారు. భక్తిపారవశ్యంలో మునిగిన భక్తులు అనంతరం స్వామీజీ ఆధ్వర్యంలో నామకరణాలు, కేశఖండనాలు జరిపించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఆశ్రమంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆరాధన మహోత్సవాలకు విచ్చేసిన వేలాది మంది భక్తులకు ఉచిత అన్నదాన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కర్ణాటక నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామీజీ కృపకు పాత్రులయ్యారు. అలాగే ముఖ్యంగా భంభం బాబా ఆరాధన మహోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి పరమ పవిత్ర గురుపూజ కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. సర్వధర్మ ఆశ్రమం పీఠాధిపతి కబీర్ కిరణ్ స్వామీజీ గురుపూజలో నిమగ్నమై భక్తులకు దర్శనమిచ్చారు. గురుపూజలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించి పునీతులయ్యారు. సర్వధర్మ ఆశ్రమంలో కిక్కిరిసిన భక్తజన సందోహం భం కబీర్ కిరణ్ స్వామీజీ దివ్య సన్నిధిలో సేవలు -
మెలకువలపై అవగాహన అవసరం
రాయచూరు రూరల్: రైతులు వ్యవసాయ రంగంపై మక్కువ పెంచుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా కస్బే క్యాంప్లో శ్రీనివాసరావు పొలంలో ఏర్పాటు చేసిన క్షేత్ర స్థాయి పొద్దు తిరుగుడు, సోయాబీన్ పంటల సాగులో మెలకువల గురించి వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే విత్తనాలను వినియోగించి మంచి లాభాలు పొందారన్నారు. అధికారులు అమరేగౌడ, మల్లికార్జున, హుసేన్, సతీష్, సురేష్, వినూత, సోమశేఖర్, ఉమేష్, వికాస్, మల్లారెడ్డి, రవిశంకర్, విజయ్కుమార్, పూర్ణిమాలున్నారు. -
ద్వితీయ పీయూసీ పరీక్షల సందడి
బళ్లారి అర్బన్: ద్వితీయ పీయూసీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభం కాగా మున్సిపల్ కళాశాల ముందు విద్యార్థులు హాల్టికెట్లతో తమకు కేటాయించిన గదులు, టేబుల్ నెంబర్లను పరిశీలించుకుని సందడి చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ద్వితీయ పీయూసీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి కన్నడ పరీక్షతో ప్రారంభమయ్యాయి. పీయూ విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ హళ్లదమని, ప్రిన్సిపాల్ సుంకప్ప పీయూసీ పరీక్షలకు ఉదయం 9 గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతించారు. ఈ పరీక్షలు ఈనెల 16 వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు విద్యా శాఖ బళ్లారి, విజయనగర జిల్లాల్లో సర్వం సిద్ధం చేసింది. ఈ రెండు జిల్లాలో మొత్తం విద్యార్థులు 25,645 మంది పరీక్షలు రాస్తుండగా వారిలో బాలికలు 15,155 మంది, బాలురు 10,490 మంది ఉన్నారు. మొత్తం విద్యార్థులు 25,645 మంది ఏర్పాట్లు సిద్ధం చేసిన కేంద్రాలు 43 బళ్లారి జిల్లాలో 20, విజయనగరలో 23 -
సిమెంట్ లారీ, ట్రాక్టర్ ఢీ
హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకాలోని ఉత్తంగి గ్రామ సమీపంలో సుంకమ్మనహళ్ల వద్ద చెళ్లకెరె– హడగలి రాష్ట్ర రహదారిలో మంగళవారం సిమెంట్ లారీ, పొద్దు తిరుగుడు విత్తనాల బస్తాలను తీసుకెళుతున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పక్కకు, సిమెంట్ లోడ్తో ఉన్న లారీ రోడ్డు మధ్యన బోల్తా పడి పోయింది. లారీలోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ట్రాక్టర్, లారీల మధ్య జరిగిన ప్రమాదంతో రహదారిలో కొన్ని గంటల పాటు వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఇటిగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
రమణీయంగా కై వార రథోత్సవం
దేవేరులతో అమర నారాయణస్వాములు తేరు వేడుక చింతామణి: హోలీ పౌర్ణమి సందర్భంగా తాలూకాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కైవార యోగి నారాయణ మఠం పక్కన ఉన్న అమర నారాయణస్వామి దేవస్థానంలో బ్రహ్మరథోత్సవం మంగళవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను తేరులో ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. భక్తజనం గోవిందా గోవిందా అని కీర్తిస్తూ తేరును లాగారు. కై వార ధర్మాధికారి జయరాం దంపతులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కై వార తాతయ్య జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. -
పిల్లలను బావిలోకి విసిరి..
కోలారు: పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కుటుంబ సమస్యలతో ఘోరానికి పాల్పడింది. కవల పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయగా పిల్లలు మరణించారు. ఈ దుర్ఘటన కోలారు జిల్లా బంగారుపేట తాలూకా బూదికోట గ్రామంలోని హైదరాలి కోట జరిగింది. సోమవారం సాయంత్రం బంగారుపేట తాలూకా కోడగుర్కి గ్రామానికి చెందిన ఉషా (28), కవల పిల్లలు హర్షిత్, హితేష్ (2)తో కొండపైకి చేరుకుంది. అక్కడే ఉన్న పర్యాటక మిత్ర సిబ్బంది అనుమానంతో ఆమె దగ్గరికి వస్తుండగా, పిల్లలను బావిలోకి విసిరి వేసి, తానూ దూకింది. పర్యాటక మిత్ర సిబ్బంది బావిలోకి దూకి మహిళను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇంతలోపల పిల్లలు మరణించారు. కుటుంబ కలహాలే.. ఉషాకు 8 సంవత్సరాల క్రితం మురళి అనే వ్యక్తితో వివామైంది. తరచూ గొడవపడేవారని, దీంతో విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు అనుమానాలున్నాయి. కేజీఎఫ్ ఎస్పీ, డీఎస్పీ, బూదికోట పోలీసులు ఘటనా స్థలాని పరిశీలించారు. బాధితురాలు ఆస్పత్రిలో ఉండగా, ఆమెను విచారించనున్నారు. తల్లి కూడా ఆత్మహత్యాయత్నం పిల్లలు మృత్యువాత కోలారు జిల్లాలో ఘోరం -
చిన్నస్వామిలోనే ఆర్సీబీ 5 మ్యాచ్లు
● క్రికెట్ ప్రియులకు ఆనందం శివాజీనగర: బెంగళూరు క్రికెట్ అభిమానులకు శుభవార్త వినిపించింది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు జరుగనున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీం ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో మొత్తం 7 పోటీల్లో 5 మ్యాచ్లను బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతోంది. మరో 2 మ్యాచ్లు చత్తీస్గడ్లో ఆడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, క్రికెట్ సంఘం ప్రయత్నాలతో ఇది ఓ కొలిక్కి వచ్చింది. మొదటి మ్యాచ్ ఇక్కడే గతేడాది చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం తెలిసిందే. అప్పటి నుంచి మ్యాచ్లను బంద్ చేశారు. ఇకపై మ్యాచ్ల సమయంలో మరింతగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఈసారి ఐపీఎల్ ప్రారంభ పోటీ చిన్నస్వామిలోనే జరగనుంది. రూ.55 లక్షల గంజాయి సీజ్ బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ అమ్ముతున్న ఒడిశావాసి లింగరాజ్దాస్(24)ను మంగళవారం బెంగళూరులోని వైట్ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.55 లక్షల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. 27 కేజీల గంజాయి, 3 కేజీల హషిష్ ఆయిల్, బైకును సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. నాగొండనహళ్లిలో వాహనాలు తనిఖీ చేస్తున్న లింగరాజ్ పట్టుబడ్డాడు. నగరంలో ఐటీ బీటీ ఉద్యోగులు, ప్రజలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపాడు. ఉగాండా మహిళల నిర్బంధం మైకో లేఔట్లో వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న ఉగాండావాసులు రషీదా, జామ్కాలిస్కి అనే మహిళలను అరెస్టు చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించినట్లు తెలిపారు. డీసీపీ సైదులు పాల్గొన్నారు.బీఈఓ, బ్రోకరుకు కటకటాలు ● లంచం తీసుకుంటూ ఉండగా పట్టివేత శివమొగ్గ: జిల్లాలో భద్రావతి నగరంలోని బీఈఓ కార్యాలయంలో అదే ఆఫీసు ఉద్యోగి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ బీఈఓ నాగేంద్రప్ప, మధ్యవర్తి మంజునాథ్ లోకాయుక్త అధికారులకు దొరికిపోయారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. విద్యాశాఖ ఉద్యోగి లింగరాజుకు కొన్ని కారణాల వల్ల జీతం పెండింగ్లో పడింది. 2011 నుంచి 2023 వరకు రావాల్సిన జీతం, పదోన్నతి, ఇతర భత్యాలను మంజూరు చేయాలని బీఈఓ, ఉన్నతాధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేశారు. కానీ పని మాత్రం జరగలేదు. ఇంతలో, బీఈఓ, బ్రోకరు కలిసి నీ పని జరగాలంటే రూ.4 లక్షలు ఇచ్చుకో అని తెలిపారు. దీనిపై లింగరాజు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం ఆఫీసులోనే మొదటి కంతుగా రూ. 1 లక్ష ఇస్తుండగా, లోకాయుక్త పోలీసులు దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. నోరూరేలా.. నిప్పు లేని వంటలు ● మైసూరులో మహిళలకు పోటీలు మైసూరు: వంట చేయాలంటే, రుచికరమైన వంటకాలను వండాలంటే నిప్పు కావాలి. కానీ నిప్పుతో పనిలేని వంటకాలను చేసి చూపించారు మహిళామణులు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైసూరులో నేగిలయోగి మహిళా సంక్షేమ సేవా సంఘం ఈ వంటల పోటీని నిర్వహించింది. 25 మందికి పైగా మహిళలు దాదాపు 40 రకాల వైవిధ్యమైన వంటకాలను వండివార్చారు. కూరగాయలు, పండ్లతో కూడిన సలాడ్లు, ఇతరత్రా నోరూరించే పదార్థాలను సిద్ధం చేసి అబ్బుపరిచారు. ఎస్డీఎం మహిళా మహావిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ వినోద, విద్వాన్ రఘు, జె.శోభ తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలు ఎన్ని విజయాలు సాధించినా, కుటుంబానికి ఆలంబన అయిన వంటగదిని మర్చిపోకూడదని అన్నారు. ఆటలు, పాటల పోటీల్లో వనితలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యవర్తి మంజునాథ్ -
అరబ్ దేశాల నుంచి విమానాల రాక
బనశంకరి: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ తదితర దేశాల్లో చిక్కుకున్న కన్నడిగులను స్వరాష్ట్రానికి రప్పించే ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు 510 మందికి పైగా సురక్షితంగా చేరుకున్నారు. అబుదాబి నుంచి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి రెండు విమానాలు వచ్చాయి. కన్నడిగులే కాక ఇతర రాష్ట్రాలవారు ఇందులో ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధు కూడా బెంగళూరుకు వచ్చారు. ఎమ్మెల్యేలు బోజేగౌడ, ఏటీ.శ్రీనివాస్ మాట్లాడుతూ దుబాయ్లో తాము బసచేసిన హోటల్ పక్కనే బాంబులు పడ్డాయన్నారు. యుద్ధం ఉండగా, ఇంత తొందరగా వస్తామని అనుకోలేదన్నారు. -
మా మధ్య చిచ్చు పెట్టలేరు
శివాజీనగర: వేసవి ఎండలు.. సీఎం కుర్చీ రాజకీయాల మధ్య విందు సమావేశాలు ఊపందుకున్నాయి. డీసీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్ డిన్నర్ ఇవ్వబోతున్నారు. బెంగళూరులో ఓ విలాసవంత హోటల్లో జరిగే విందుకు సీఎం సిద్దరామయ్యకు ఆహ్వానం ఉందని తెలిసింది. ఈ నెల 6వ తేదీకి శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడై 6 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా ఆయన 10వ తేదీన డిన్నర్ ఇవ్వబోతున్నారు. 6న సీఎం సిద్దరామయ్య అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రకటిస్తారు. అందుచేత తన విజయోత్సవాన్ని 10కి మార్చుకున్నారు. అందరికీ పిలుపు సిద్దరామయ్య, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితర నేతలందరికీ డిన్నర్కి ఆహ్వానిస్తారు. భారీఎత్తున భోజన సమావేశం జరుగుతుందని డీకే ఆప్తులు ప్రచారం చేస్తున్నారు. కేపీసీసీ సారథిని, ప్రభుత్వ సారథిని మార్చాలని కాంగ్రెస్లోని పలు వర్గాలు పట్టుబడుతున్న తరుణంలో ఈ భేటీకి ఎంతమంది హాజరవుతారు, ఎంతమేర సక్సెస్ అవుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సిద్దు, శివ మధ్య 2 సార్లు విందు భేటీలు జరగడం తెలిసిందే. కేపీసీసీ చీఫ్ మార్పు లేనట్టేనా? కేపీసీసీ అధ్యక్షున్ని మార్చాలని ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి ఢిల్లీకి వెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకే కేపీసీసీ చీఫ్గా ఉండాలి, తరువాత వేరొకరికి అప్పగించాలి అని హైకమాండ్ పెద్దలు డీకే కి సూచించారు. అయితే మార్పు జరగలేదు. సీఎం సిద్దరామయ్య వర్గం మంత్రులు కేపీసీసీ అధ్యక్షున్ని మార్చాలని తరచూ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. కానీ హైకమాండ్ నాయకులు స్పందించడం లేదు. పరిస్థితిని గమనిస్తే శివకుమార్ను మార్చే ప్రయత్నం జరగదని తెలుస్తోంది. త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటకలో బెంగళూరు పాలికెలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకూ డీకే కొనసాగే అవకాశముంది. విందు భోజనం ద్వారా బల ప్రదర్శనకు ఆయన సిద్ధమయ్యారు. అతిథులకు కూడా వినూత్న రుచులు, కానుకలకు కొదవ ఉండదు.గత నెలలో జరిగిన అల్పాహార విందులో సీఎం, డీసీఎంలు వేసవి ఎండల మధ్య విందు రాజకీయాల విలాసం 10న డీసీఎం డీకే శివ డిన్నర్ సీఎం, మంత్రులు, పార్టీ నేతలందరికీ ఆహ్వానం! కేపీసీసీ చీఫ్గా ఆరేళ్లు కావడంతో బల ప్రదర్శన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. అశోక్, కుమారస్వామిపై సీఎం సిద్దరామయ్య ధ్వజంశివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్, ఆయన వర్గంపై నిఘా కోసం సీఎం సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అశోక్, కుమారలపై సీఎం సిద్దు మంగళవారం మండిపడ్డారు. దొంగే ఇతరులను దొంగ అన్నట్లుగా ఉంది, ఇది అసంతృప్తి ఆత్మల ఆక్రోశం అని ఆరోపించారు. ఈ నిరుద్యోగ ప్రతిపక్ష నాయకులు తాను, శివకుమార్ మధ్య విభేదాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారన్నారు. వారి పులుపు వారితోనే ఉంటుంది, పాలు– తేనెలాంటి తమ సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపదు అని ఓ ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. వారు కూడా గతంలో సీఎం, హోంమంత్రులుగా ఉన్నారు, ఆ మాటలను చూస్తోంటే ఇలాంటి పనులకు పాల్పడి ఉంటారు, ఆ అనుభవంతోనే ఆరోపణ చేస్తున్నట్లు ఉందని హేళన చేశారు. తమ ఎమ్మెల్యేలలో ఎవరూ తన, లేక డీకే వర్గం కాదు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అని చెప్పారు. సమావేశాలు కావడం, కలిసి భోంచేసే స్వేచ్ఛ ఉందన్నారు. తాను, శివకుమార్ పార్టీ హైకమాండ్కు తలొగ్గుతామని, తమ మధ్య గొడవలు రేపాలనుకుంటే పగటి కలే అని అన్నారు. శివకుమార్ ఒక నిజాయితీ కలిగిన కాంగ్రెస్ నాయకుడు, తప్పుడు కేసులతో జైలుకు పంపి ఆయనను లొంగదీసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని సిద్దరామయ్య దుయ్యబట్టారు. -
పెయింటింగ్స్ రూపంలో డ్రగ్స్ రవాణా
బనశంకరి: చూస్తే ఆకర్షణీయమైన పెయింటింగ్స్ మాదిరిగా ఉంటాయి, కానీ అవి కోట్ల రూపాయల విలువజేసే డ్రగ్స్తో తయారైనవని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేరళ జంటని పోలీసులు అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేరళకు చెందిన అశ్విన్ (24), ముబీనా (25) బెంగళూరులో బీబీఏ చదవడానికి వచ్చి మధ్యలోనే చదువును ఆపేసి మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగారు. థాయ్లాండ్ నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు.ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ ఫ్లాట్పై దాడి చేసి అశ్విన్, ముబీనాను అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన 8,335 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 5 కేజీల హైడ్రో గంజాయి, 534 గ్రాముల చరస్ తదితరాలను సీజ్ చేశారు. పెయింటింగ్స్ రూపంలో ఎల్ఎస్డీ స్ట్రిప్స్ను తయారు చేసి కావలసినవారికి విక్రయించేవారు. దీనివల్ల ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. అలాగే చాక్లెట్లు, బిస్కెట్ బాక్సుల్లో హైడ్రో గంజాయి ప్యాక్ చేసి తరలించేవారు. -
పంచ గ్యారెంటీలతో విద్యుత్ శాఖకు షాక్
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల్లో భాగంగా విద్యుత్ శాఖ పరిధిలోని నాలుగు ఎస్కాం సంస్థలకు షాక్ తగిలింది. సర్కార్ అమలు పరిచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరుతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలో ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్కి మొదట్లో వ్యతిరేకత చెప్పిన నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించలేదు. బస్సు టికెట్ ధరలు ఒకటిన్నర శాతం పెంచిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. కర్ణాటక విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ(కేఈఆర్సీ) నివేదిక ఆధారంగా మూడేళ్ల పాటు వరుసగా 2026లో 67, 2027లో 75, 2028లో 91 పైసల చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకుంది. 2025లో కేఈఆర్సీ నివేదిక సంస్థ మెస్కాం, బెస్కాం, హెస్కాం, జెస్కాంలలో 20 శాతం విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతి కోరారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేఈఆర్సీ నివేదికను జారీ చేయాలని సిద్ధమైనట్లు సమాచారం. నష్టాల ఊబిలో కూరుకున్న ఎస్కాంలు చార్జీలు పెంచినా తగ్గని నష్టం రెండో గ్యారంటీకి విద్యుత్ శాఖ విద్యుత్ చార్జీల మోతకు సిద్ధం మూడేళ్లు వరుసగా 67, 75, 91 పైసల పెంపుదల కేఈఆర్సీ నివేదిక కోసం ఎదురు చూపులు -
పట్టపగలే చెట్టు నరికివేత
హొసపేటె: నగరంలో పట్టపగలు రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఒక వ్యక్తి గొడ్డలితో నరికివేయడం పర్యావరణ వేత్తల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నగరంలోని పటేల్ నగర్ 6వ క్రాస్లోని బీజేపీ కార్యాలయం ముందు ఈ సంఘటన జరిగింది. రోడ్డుకు అడ్డుగా లేని, ఎవరికీ ఇబ్బంది కల్గించని ఈ చెట్టును ఇంటి యజమాని నరికివేశాడు. చెట్టును నరికి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ప్రజలు, పర్యావరణ వేత్తల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఎవరికీ ఇబ్బంది కలిగించని చెట్టును ఎందుకు ఇంత నిర్దాక్షిణ్యంగా, విచక్షణారహితంగా ఎందుకు నరికి వేశారని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యకు ఎవరు బాధ్యత వహిస్తారు, జిల్లా అటవీ అధికారులా? లేక ఇంటి యజమానా? చెట్టును నరికి వేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? అనే ప్రశ్న తలెత్తింది. చెట్లు, మొక్కలు లేకుండా వన్యప్రాణులు చనిపోతున్న నేటి రోజుల్లో వాటిని కాపాడటానికి బదులుగా ఉన్న చెట్లను నరికి వేయడానికి అనుమతి ఇవ్వడం విచారకరం అని, అటవీ శాఖ అధికారులు అనుమతి ఇస్తూ స్థల తనిఖీ నిర్వహించారా? లేక గుడ్డిగా అనుమతి ఇచ్చారా? అనేది స్పష్టం చేయాలని ప్రజలు, పర్యావరణ వేత్తలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రజలు, పర్యావరణ వేత్తల్లో పెల్లుబికిన ఆగ్రహం -
కార్మికుల పర్మినెంట్కు డిమాండ్
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్వర్క్ కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించినట్లు అధికారులు చెప్పడాన్ని తుంగభద్ర ఎడమ కాలువ టాస్క్వర్క్ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాగలింగ స్వామి ఖండించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిది నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో పాటు రబీ సీజన్లో తుంగభద్ర ఎడమ కాలువకు నీరు విడుదల చేయడం లేదన్నారు. పనులు లేని కారణంగా విధులకు రావడం తగదని ఇంజనీర్ విజయలక్ష్మి పేర్కొనడాన్ని తప్పుబట్టారు. టాస్క్వర్క్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి చెల్లించాల్సిన రూ.10 కోట్ల దుర్వినియోగంపై విచారణ జరపాలన్నారు. -
నియామకాల్లో రిజర్వేషన్ ప్రకటించరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్ ప్రకటించే వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలను నిలిపి వేయాలని, వారికి 6 శాతం రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక చలువాది మహాసభ తాలూకా సంచాలకుడు హేమరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, రిజర్వేషన్ ప్రకటించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. పంటలకు మద్దతుధర ప్రకటించండి రాయచూరు రూరల్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు పూజార్ మాట్లాడారు. పత్తి, మిరప, వరి, వేరుశనగ, సజ్జ, జొన్న, కందులు, పెసలకు గిట్టుబాటు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు పండించిన జొన్నలకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వారం రోజుల్లో రైతులకు ధాన్యం విక్రయ సొమ్మును అందించాలని, గోదాముల్లో నిల్వ ఉంచుకోడానికి అనుకూలం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న జొన్నల రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. హెల్ప్లైన్ల ఏర్పాటు హొసపేటె: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా అస్థిర పరిస్థితి ఏర్పడి విమాన సేవలలో అంతరాయం ఏర్పడింది. అనేకమంది కన్నడిగులు ఆయా దేశాలలో చిక్కుబడిపోయారు. ఈ సందర్భంగా విజయనగర జిల్లా ప్రజల కోసం అత్యవసర సహాయవాణిని ప్రారంభించినట్లు జిల్లాధికారి కవిత తెలిపారు. ఎవరైనా సాయం కావలసినవారు 08394–295655, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 9480805700, 080–22340676, 080–22253707 టోల్ ఫ్రీ నంబర్ : 1070లో సంప్రదించవచ్చని తెలిపారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోండి రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం 52,432 ఉద్యోగాల నియామకాలకు చర్యలు చేపట్టాలని నిరుద్యోగుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు చెన్నబసవ మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారం రోజుల క్రితం ధార్వాడ, కలబుర్గి, బాగల్కోటల్లో ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నియామకాలకు చర్యలు తీసుకుందన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి జిల్లాధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. జడ్పీలో కేఫ్ ప్రారంభం మైసూరు: మంత్రి హెచ్.సీ. మహదేవప్ప ఇక్కడి జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన అక్క కేఫ్ను ప్రారంభించి ఆహారాన్ని ఆరగించారు. నాణ్యత బాగుండాలని సిబ్బందికి సూచించారు. పనుల కోసం వచ్చే ప్రజలకు కేఫ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే తన్వీర్ సేట్, కాంగ్రెస్ నేత అరుణ్ కుమార్, జడ్పీ అధికారి యుకేష్ కుమార్, కమిషనర్ షేక్ తన్వీర్ ఆసిఫ్ పాల్గొన్నారు. -
వేసవిలో ఉ–కకు పొంచిన విద్యుత్ క్షామం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వర్షాలు కురిసినా వేసవిలో ఉత్తర కర్ణాటకకు జల క్షామంతో పాటు విద్యుత్ క్షామం ఏర్పడనుంది. బాగలకోటె జిల్లా ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేనందున ఈ ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. డ్యాం గరిష్ట నీటిమట్టం 519.60 మీటర్లు, 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 510.70 మీటర్లు, 52.400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 17.60 టీఎంసీలు కాగా మిగిలిన 34.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది డ్యాంలో 21.414 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. దీంతో విద్యుత్ క్షామానికి కారణమవుతోంది. రాయచూరు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి(ఆర్టీపీఎస్), యరమరస్థ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి(వైటీపీఎస్) కేంద్రాల నుంచి రాష్ట్రానికి 45 శాతం విద్యుత్ను సరఫరా చేసే యూనిట్లలో ఉత్పత్తి సామర్ద్యం సన్నగిల్లింది. ఆర్టీపీఎస్లో 8 యూనిట్లు, వైటీపీఎస్లో 2 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి మొత్తం 3,320 మె.వా. ఉంది. ఆర్టీపీఎస్లో 8 యూనిట్లలో 7 యూనిట్లు పని చేస్తున్నాయి. 210 మె.వా, వైటీపీఎస్లో 2 యూనిట్లలో ఒక్క యూనిట్ నుంచి కేవలం 800 మె.వా.విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నీటి ప్రమాణం తగ్గుతున్న కొద్ది మొత్తం 823 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. వైటీపీఎస్లో 2 యూనిట్ల నుంచి 1600 మె.వా. విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉండగా కేవలం 489 మె.వా. విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. -
కుక్కల బెడదతో జనం బెంబేలు
శ్రీనివాసపురం : పట్టణంలోని ప్రధాన వీధుల్లో వీధి కుక్కలు యథేచ్చగా తిరుగుతున్నాయి. వీధి కుక్కల బెడదతో పట్టణ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పిల్లలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, ద్విచక్రవాహనాల్లో వెళ్లేవారు ఎక్కడ కుక్కలు మీదపడి దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. తెల్లవారగానే కుక్కల భయం పట్టణ వాసులకు ప్రారంభం అవుతుంది. ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లేవారు, పరీక్షలను రాస్తున్న పదో తరగతి విద్యార్థులు తెల్లవారు జామున ట్యూషన్లకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. పలుచోట్ల చిన్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఒక్కసారిగా గుంపులుగా వచ్చి దాడులు చేస్తుండడం వల్ల ఒంటరిగా వీధిలోకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ద్విచక్రవాహనాల్లో వెళ్లే వారిపై కూడా దాడికి దిగడం వల్ల వారు కింద పడి గాయాల పాలవుతున్నారు. తెల్లవారు జామున నరసాపుర పారిశ్రామికవాడ ప్రాంతానికి కంపెనీలకు వెళ్లేవారు కంపెనీ బస్సు కోసం వేచి ఉన్న సమయంలోను వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. వీధి కుక్కలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా పురసభ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా వీధి కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
నేడు దొడ్డ బసవేశ్వర రథోత్సవం
సాక్షి,బళ్లారి: జిల్లాలోని కురుగోడులో వెలసిన దొడ్డ బసవేశ్వర ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్ర, కోరిన కోర్కెలు తీర్చే బసవణ్ణగా, కోట్లాది మంది భక్తులు ఆరాధించి కొలిచే అపారమైన భక్తి విశ్వాసం, ఆధ్యాత్మిక మహిమలతో భక్తులు కొలుస్తున్న దొడ్డ బసవేశ్వరుడి రథోత్సవం మంగళవారం జరగనుంది. బళ్లారి జిల్లాలోని కంప్లి నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రానికి దాదాపు 30 కి.మీ.ల దూరంలో వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్న తెలుగు పాటకు అద్దం పట్టేలా శిల్పులు ఎంతో అద్భుతంగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మామూలుగా అయితే శివుడి ఆలయంలో ఎదురుగా బసవణ్ణ విగ్రహం ప్రతిష్టించడం ఆనవాయితీ. అయితే ఈ ఆలయంలో సాక్షాత్తు శివుడే నందీశ్వరుడి రూపంలో అవతరించారని ప్రతీతి. అందుకే ఎత్తైన మంటపంలో పెద్ద నందీశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేశారు. ఉద్భవ బసవేశ్వరుడుగా గుర్తింపు పొందిన ఈ దొడ్డ బసవేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు కొలిచి తమ కోరికలు తీర్చుకోవడంతో పాటు తమ ఇంటి దైవంగా భావించి కులమతాలకతీతంగా ఈ నందీశ్వరుడిని కొలిచి ఆరాధిస్తుండటం విశేషం. విశిష్ట ఆలయం.. ప్రత్యేకత సొంతం కర్ణాటక ప్రాంతంలో భక్తి పరవశాన్ని కలిగించే ప్రముఖ శైవ క్షేత్రాల్లో కురుగోడు దొడ్డ బసవేశ్వర ఆలయం ప్రత్యేకత సంపాదించుకుంది. శతాబ్ధాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పవిత్ర పుణ్య క్షేత్రంలో వెలిసిన బసవేశ్వరుడిని కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తుండడం విశేషం. గ్రామీణ సంస్కృతి, శైవ సంప్రదాయం, బసవతత్వం, సమ్మిళతంగా కనిపించే అరుదైన క్షేత్రంగా భాసిల్లుతోంది. కురుగోడు పట్టణ నడిబొడ్డున ఈ ఆలయం వెలసింది. కురుగోడు దొడ్డ బసవేశ్వర స్వామి అంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన భక్తులకు ఒక రకమైన ఆనందం, భక్తిని కలిగిస్తోంది. ప్రతి రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతి సోమ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తుంటారు. చరిత్రకారుల ప్రకారం కురుగోడు ప్రాంతం ప్రాచీన కాలం నుంచి ధార్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆలయంలో ఉద్భవ బసవేశ్వరుడుగా గుర్తింపు పొందిన నంది విగ్రహం విస్తారంగా ఉండటంతో స్వామిని దొడ్డ బసవేశ్వరుడుగా పిలవడం ప్రారంభించారు. శిల్ప కళాసంపదకు నిలువెత్తు సాక్ష్యం విజయనగర రాజుల కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందగా, ఆలయ నిర్మాణానికి నాటి రాజులు సహకారం అందించినట్లు శాసనాలు చెబుతున్నాయి. రాతి నిర్మాణ శైలి, శిల్పుల ప్రతిభ, మండపాల నిర్మాణాలు కళాసంపదకు అద్దం పడుతున్నాయి. దొడ్డ బసవేశ్వరుడి అనుగ్రహంతో ఈ ప్రాంతంలో అనేక మంది కోరిన కోర్కెలు తీర్చుకుని పునీతులు అవుతున్నారు. కరువు కాటకాలు, కష్టాలు ఏర్పడినప్పుడు స్వామిని భక్తిపూర్వకంగా కొలిచే వర్షాలు వచ్చి పంటలు కూడా బాగా పండినట్లు ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రార్థిస్తే ఎందరికో ఉద్యోగాలు ప్రాప్తించినట్లు కూడా చెబుతుండటం విశేషం. ద్రావిడ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం శిల్పకళా సంపదకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. ఆలయంలో ప్రతిభాగం కళాత్మకంగా నిర్మించారు. రాతి స్తంభాలపై దేవతా విగ్రహాలు, విశాల గర్భగుడి, పురాతన శాసనాలు, సంప్రదాయం ద్వారా నిర్మాణం తదితర ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా రథోత్సవం, పల్లకీసేవ, అఖండ భజనలు, అన్నదానం, జానపద కళాప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. రథోత్సవానికి గట్టి బందోబస్తు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ ఆలయం రథోత్సవం అంటేనే ఈ ప్రాంత ప్రజలకు పండుగ వాతావరణం, ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరిగే ఈ జాతర, రథోత్సవం అంటే భక్తులకు ఎంతో పండుగ వాతావరణం నెలకొంది. కురుగోడు దొడ్డ బసవేశ్వర స్వామి రథోత్సవం నేపథ్యంలో జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సందోహం తరలివస్తున్న తరుణంలో ఆలయం చుట్టు ఎలాంటి వాహనాలకు అనుమతి లేకుండా ఆలయానికి దూరంగా ఆయా రహదారుల్లో వాహనాల పార్కింగ్తో పాటు ఆలయ ప్రాంగణంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆలయంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు వ్యవస్థ, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కురుగోడులో ఎత్తైన బసవణ్ణ విగ్రహం కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా గుర్తింపు -
అభివృద్ధి పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగర పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ సూచించారు. సోమవారం యక్లాస్పూర్ వద్ద వివిధ అభివృద్ధి పనులు, నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. నగరాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. యక్లాస్పూర్లో విద్యుత్ దీపాలంకరణకు రూ.1.30 కోట్లతో అభివృద్ధి, సముదాయ భవనాల నిర్మాణాలకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. టెన్త్లో మంచి ఫలితాల సాధనకు సూచన రాయచూరు రూరల్ : మార్చి నెలలో జరగబోయే పదో తరగతి పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ సూచించారు. ఆయన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో బాగా చదివించాలని తమకు రాసిన లేఖలను సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులకు విద్యాభ్యాసానికి అవకాశం కల్పించాలని ఆ లేఖల్లో కోరారు. సీహెచ్ పౌడర్ విక్రేత అరెస్ట్ రాయచూరు రూరల్ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సీహెచ్ పౌడర్ విక్రయం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ అరుణాంగ్శుగిరి వెల్లడించారు. ఆయన ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గద్వాల రహదారి వీరాంజనేయ ఆలయం వద్ద ఉరుకుందమ్మను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 153 లీటర్ల కల్తీ కల్లు, 203 లీటర్ల సీహెచ్ పౌడర్ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమర యోధుల సేవలు స్మరణీయం రాయచూరు రూరల్ : నేటి విద్యార్థులు స్వాతంత్య్ర సమర యోధుల సేవలను స్మరించుకోవాలని కవి శివరంజన్ సత్యంపేటె పేర్కొన్నారు. సోమవారం వీరమ్మ గంగమ్మ సిరి కళాశాలలో స్వాతంత్య్ర సమర యోధుడు చెన్నబసప్పపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు పాఠాలకు తోడు పాఠ్యేతర అంశాల్లో కూడా శ్రద్ధ కనబరచాలన్నారు. 1947లో దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ెపోరాటాలు చేసిన వారిని గుర్తుంచుకోవాలన్నారు. హెచ్కేఈ సంస్థ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్ర కొండా, ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ మహేష్, మహదేవప్ప, అనిల్ కుమార్, నాగణ్ణ, అమరనాథ్, పాటిల్, వీణా, మోహన్ రాజ్, శివరాజ్, అనురాధలున్నారు. కవితాళ తాలూకా కోసం ధర్నా రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా మాన్వి తాలూకా నుంచి వేరు చేసి కవితాళను తాలూకా కేంద్రంగా ప్రకటించాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోమవారం కవితాళ త్రయంబకేశ్వర ఆలయం వద్ద చేపట్టిన ధర్నాలో ప్రజలు మాట్లాడారు. 20 కి.మీ.దూరమున్న సిరవారను తాలూకా కేంద్రంగా ప్రకటించి మూడేళ్లు కావస్తోందన్నారు. కవితాళ పరిధిలో 45కు పైగా గ్రామాలు వస్తాయని తెలిపారు. కవితాళను కూడా తాలూకా కేంద్రంగా ప్రకటించేందుకు 2026–27వ సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదనకు శాసన సభ్యులు హంపయ్య నాయక్, బసనగౌడ ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నేడు స్థానిక సెలవు హోసూరు: హోసూరులో చంద్రచూడేశ్వర స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగు తాలూకాలకు స్థానిక సెలవు ప్రకటించారు. రథోత్సవం సందర్భంగా ఏటా హోసూరు, డెంకణీకోట, సూళగిరి తాలూకాలకు స్థానిక సెలవు ప్రకటించడం ఆనవాయితీ. అందులో భాగంగా మంగళవారం నాలుగు తాలూకాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. -
మహిళను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
హోసూరు: హోసూరు కార్పొరేషన్ పరిధిలోని బాగలూరు రోడ్డులో నిర్వహిస్తున్న పాత వస్తువుల గిడ్డంగిలో మహిళను పోలీసు పేరుతో పరిచయం చేసుకుని తుపాకీతో బెదిరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లూరు పోలీస్స్టేషన్ పరిధికి చెందిన పెరియణ్ణ భార్య ముత్తా. బాగలూరు రోడ్డులో పాత వస్తువుల గిడ్డంగి నిర్వహిస్తోంది. గత 25వ తేదీన ద్విచక్ర వాహనంలో వచ్చిన ఓ వ్యక్తి తను పోలీసు అని చెప్పి తుపాకీతో బెదిరించాడు. ముత్తా ధైర్యంగా సెల్ఫోన్లో వీడియో తీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై నల్లూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. హోసూరు అలసనత్తం తోటగిరి ప్రాంతానికి చెందిన మనోజ్ను అరెస్ట్ చేసి, అతడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. -
సింహవాహనంపై శ్రీవారు
కదిరి: శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచే సింహాన్నే వాహనంగా చేసుకుని ఖాద్రీశుడు తిరుమాడ వీఢుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కిరీటధారియై ఠీవిగా కనిపించిన ఖాద్రీశుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తజనం ఖాద్రీశా...గోవిందా అంటూ కీర్తించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజైన సోమవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహ వాహనంపై ఊరేగారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేడు హనుమంత వాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చంద్రగ్రహణం కారణంగా పగలంతా ఆలయం మూసివేసి రాత్రి సమయంలో సంప్రోక్షణ తర్వాత తలుపులు తెరుస్తారు. -
ఫోన్ ట్యాపింగ్ రచ్చ
సీఎం కుర్చీ కోసం రభస జరుగుతున్న తరుణంలో ప్రత్యర్థుల వ్యూహాలను కనిపెట్టి చెక్ పెట్టడానికి ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. దీంతో పదవీ కలహం కొత్త మలుపు తిరిగింది.శివాజీనగర: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన వర్గం నేతల మీద ప్రత్యేకంగా ఓ ఎస్పీతో సీఎం సిద్దరామయ్య నిఘా వేశారని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలపై నిఘా ఉంది, అనధికారికంగా సీఎం ఓ సిట్ను నడిపిస్తున్నారు, డీకే వర్గంవారు ఏం చేసేదీ కనిపెట్టడమే సిట్ పని అని తెలిపారు. కాంగ్రెస్ చీలిపోయిన ఇల్లుగా మారింది, సీఎం, డీసీఎం వర్గీయులు వీధుల్లోకి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగదు అని జోస్యం చెప్పారు. రాష్ట్రాన్ని రుణాల భారంలోకి దించుతున్నారన్నారు. ధనవంతులు గ్యారెంటీ సంక్షేమ పథకాలను వదులుకోవాలని మంత్రి ఎం.బీ.పాటిల్ చెప్పడాన్ని ప్రస్తావించారు, అందరికీ గ్యారెంటీలు అనే మాటను తప్పుతున్నారన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజం: కుమారస్వామి కేంద్రమంత్రి కుమారస్వామి మైసూరులో మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని అన్నారు. నేను నిజం చెబుతాను, ప్రతి సర్కారూ ఫోన్ ట్యాపింగ్ సాగిందన్నారు. కానీ సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేలపై నిఘా పెట్టడం ఇదే మొదటిసారి అని పరోక్షంగా సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్లపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి తమ ప్రభుత్వంపై నిఘా పెట్టడం ప్రారంభించడం విషాదమని అన్నారు. డీసీఎం డీకే శివకుమార్ వర్గంపై సీఎం సిద్దు నిఘా బీజేపీ పక్ష నేత అశోక్ ఆరోపణ -
నంజన్న ఆర్జనలో భారీ తగ్గుదల
● హుండీలలో రూ.82 లక్షల లభ్యం మైసూరు: దక్షిణ కాశీగా పిలువబడే మైసూరు జిల్లాలోని శ్రీ నంజుదేశ్వర స్వామి ఆలయంలో హుండీలలో విరాళాల సేకరణ రూ.82 లక్షలుగా తేలింది. ఆలయానికి ఆదాయంలో భారీ తగ్గుదల కనిపించింది. గతంలో కోట్లు దాటిన నంజన్న ఆర్జన ఇప్పుడు లక్షలకు తగ్గింది. సోమవారం ఆలయంలోని దాసోహ భవన్లో జరిగిన హుండీల లెక్కింపులో, గత ఫిబ్రవరి నెలకుగాను మొత్తం రూ.82,30,313 నగదు లభ్యమైంది. అలాగే 19 గ్రాముల బంగారం, సుమారు కేజీ వెండి సొత్తు ఉన్నాయి. ఆమెరికా, ఇంగ్లండ్, అరబ్ దేశాలు సహా మొత్తం 47 దేశాల డబ్బులు కనిపించాయి. దీంతో విదేశాల నుంచి ఎక్కువమంది భక్తులు నంజన్న దర్శనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రతి నెలా నంజుండేశ్వరుని హుండీలను లెక్కిస్తే రూ. 1 నుంచి 2 కోట్ల మధ్యలో రాబడి వచ్చేది. కానీ ఈసారి చాలా తక్కువ మొత్తం సమకూరిందని ఆలయ సిబ్బంది తెలిపారు. మైసూరు సిల్కు ఫ్యాక్టరీని మూసివేయంమైసూరు: టి.నరసీపురలో ప్రతిష్టాత్మక మైసూర్ సిల్క్ దారం తయారీ కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేయబోమని జిల్లా ఇన్చార్జ్ మంత్రి హెచ్సి మహదేవప్ప చెప్పారు. అక్కడ స్టేడియం కట్టేందుకు సిల్క్ ఫ్యాక్టరీని మూసివేయవచ్చా అని విలేకరులు ప్రస్తావించగా, ఫ్యాక్టరీని మూసివేసి స్టేడియం నిర్మిస్తామని మేము చెప్పలేదన్నారు. మైసూర్ వారసత్వాన్ని, ప్రతిష్టను పెంచే మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ, మైసూర్ శాండల్ సోప్ వంటి ఫ్యాక్టరీలను మూసివేయడం సాధ్యమేనా? అన్నారు. కొందరు అనవసర రాజకీయాలు చేస్తున్నారన్నారు. స్టేడియానికి మరో స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పాస్పోర్టు ఆఫీసుకు బాంబు బెదిరింపు శివాజీనగర: బెంగళూరులో ఉత్తుత్తి బాంబు బెదరింపుల వరుస కొనసాగుతోంది. కోరమంగల ప్రాంతీయ పాస్పోర్టు కార్యలయానికి సోమవారం గుర్తుతెలియని ఈమెయిల్ వచ్చింది, తమిళ భాషలో ఉన్న ఈమెయిల్లో.. అజ్మల్ కసబ్కు మరణ శిక్ష విధించిన మిమ్మల్ని మేము వదిలపెట్టబోమన్నారు. కొంతసేపటిలో మీ ఆఫీసులో ఉంచిన బాంబులు పేలిపోతాయని రాసి ఉంది. పోలీసులు, బాంబు స్క్వాడ్ ఆఫీసులోని ప్రజలు, సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు చేశారు. దీనివల్ల గంటలకొద్దీ పనులు స్తంభించి దరఖాస్తుదారులు ఇబ్బందులు పడ్డారు. చివరకు ఎలాంటి పేలుడు వస్తువులు లభించలేదు. ఇదొక ఉత్తుత్తి మెసేజ్ అని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 16న రాష్ట్రంలో అనేక కోర్టులకు ఇదే మాదిరి ఈమెయిల్స్ రావడంతో పనులు నిలిచిపోయాయి. తరచూ ఈమెయిల్స్ రావడం, భయాందోళన రేకెత్తడం పరిపాటిగా మారింది. ఇలాంటి దుండగులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. కామాంధునికి కటకటాలు తుమకూరు: గుబ్బి తాలూకాలోని హొసహళ్లిలో బాలికపై అఘాయిత్యం చేసి పరారీలో ఉన్న కామాంధున్ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తుమకూరు తాలూకాకు చెందిన రేణుకయ్య (26) పశువుల వ్యాపారి, గుబ్బి తాలూకాలోని కె.జి. ఆలయంలో జరిగిన పశువుల సంతకు వచ్చాడు. జి.హోసహళ్లి గ్రామంలో పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తున్న ఏడో తరగతి బాలికను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసి పారిపోయాడు. గ్రామస్తులు, బాలిక తల్లిదండ్రులు కలిసి గుబ్బి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు పరారీలో ఉన్న అతన్ని పట్టుకుని విచారించగా, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడే మనస్తత్వం ఉన్నవాడని గుర్తించారు. గతంలోనూ తుమకూరు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడి బహిరంగంగా దెబ్బలు తిన్నాడని తెలిసింది. అతనికి పెళ్లయి, భార్య గర్భంతో ఉంది. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
సంక్షోభం నుంచి.. స్వస్థలాలకు చేర్చాలి
కెంపేగౌడ విమానాశ్రయంలో కటకట● అరబ్ దేశాలలో చిక్కుకున్న కర్ణాటక ప్రయాణికుల సాయానికి వినతి ● రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్లైన్ల ఏర్పాటు ● బెంగళూరు ఎయిర్పోర్టులో అనేక విమానాల రద్దు ● కొనసాగుతున్న ఇబ్బందులు బనశంకరి: అమెరికా, ఇజ్రాయెల్– ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల విమానాశ్రయాల్లో చిక్కుకున్న కన్నడిగులను సురక్షితంగా తీసుకురావడానికి సహాయం కోరుతూ సీఎం సిద్దరామయ్య, ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాశారు. ‘విమానాలు రద్దు కావడంతో అక్కడ ఉన్న కన్నడిగులు క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా యుఏఈ (దుబాయ్) లాంటి చోట్ల అనేకమంది ఉన్నారు. విదేశాంగ శాఖ, పౌర విమానశాఖ సమన్వయంతో వారిని స్వస్థలాలకు తీసుకురావాలి. బాధితులకు, వారి కుటుంబాలకు సమాచారం అందించడానికి కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. విమాన టికెట్ల జారీని సరళతరం చేయాలి’ అని లేఖలో విన్నవించారు. 109 మంది చిక్కుకున్నారు.. మంత్రి కృష్ణ భైరేగౌడ శివాజీనగర: యుద్ధపీడిత దేశాల్లో సుమారు 109 మంది కన్నడిగులు చిక్కుకున్నారు, వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నట్లు రెవెన్యూ మంత్రి కృష్ణభైరేగౌడ తెలిపారు. సోమవారం విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి నుంచే హెల్ప్లైన్ ఆరంభించాం. ఇప్పటి వరకు 109 మంది సమాచారం ఇచ్చారు. తాము భయంభయంగా ఉన్నామని, ప్రత్యేక విమానం ద్వారా కాపాడాలని వారు కోరుతున్నారు. విమానాలు నడవడం లేదు, గగనతలాలు తెరిచేవరకూ ఓపికగా ఉండాలి అని మంత్రి తెలిపారు. హెల్ప్లైన్ 22253707కు ఫోన్ చేస్తే సాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. దుబాయ్, బహ్రెయిన్ ఎయిర్పోర్టుల్లో కన్నడిగులు చిక్కుకొన్నారు, అక్కడ సౌకర్యాలు లేవని చెబుతున్నారు. బయటికి వెళ్లనివ్వడం లేదంటున్నారు.. సహాయం చేయాలని అక్కడి భారత ఎంబసీలను కోరతామని చెప్పారు. దుబాయ్లో ఏ జిల్లావారు ఎందరు? బళ్లారి వాసులు– 32 మంది, బెంగళూరువాసులు – 25, చిక్కమగళూరు– 5, చిక్కబళ్లాపుర– 2, దక్షిణ కన్నడ– 3, చిత్రదుర్గ– 2, దావణగెర– 9, కొడుగు– 4, విజయపుర– 4, రాయచూరు– 3, శివమొగ్గ– 3, ఉడుపి– 2, కల్బుర్గి–2, ఇతర జిల్లాలకు చెందిన నలుగురు దుబాయ్ విమానాశ్రయంలో ఉన్నారు. హెల్ప్లైన్ సేవలు శివాజీనగర: ఆయా దేశాల్లో చిక్కుకున్న బెంగళూరు నగర జిల్లాకు చెందిన వారికి సహాయంగా ప్రభుత్వం సహాయవాణిలను ప్రారంభించింది. చిక్కుకొన్నవారి పేరు, పాస్పోర్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న స్థలం, మొబైల్ నంబరు ఇస్తే సంప్రదించి సాయం చేస్తామని జిల్లాధికారి తెలిపారు. ఫోన్ నంబర్ 080–22967200, వాట్సాప్ నంబర్–810599707, 9538047199 లకు మెసేజ్ ద్వారా గానీ లేదా కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. బాధితులకు సాయానికి చర్యలు తీసుకుంటామన్నారు. యుద్ధం ముగిసేదాకా ఇంతే: కుమారస్వామి మైసూరు: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం ముగిసే వరకు కన్నడిగులను రాష్ట్రానికి తిరిగి తీసుకురావడం కష్టం, రద్దయిన విమానాలు తిరిగి ప్రారంభమైతే, సురక్షితంగా తిరిగి వస్తారు అని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ, మధ్యాసియాలో యుద్ధం వల్ల విమానాలను నిలిపివేశారన్నారు. దుబాయ్లో స్థిరపడిన కన్నడిగులు అక్కడ విమానాశ్రయంలో చిక్కుకున్న కన్నడిగులకు సహాయం చేయడానికి వచ్చారు, చాలా మంది నాతో కూడా సంప్రదిస్తున్నారు అని చెప్పారు.ప్రధాని మోదీకి సీఎం సిద్దు లేఖబాంబులు పడుతున్నాయి అబూదాబిలో హావేరి టెక్కీ ఆందోళన హుబ్లీ: అబూదాబిలో హావేరికి చెందిన ఓ ఐటీ ఇంజనీరు కుటుంబీకులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యుద్ధం వల్ల ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే భారతదేశానికి వచ్చేలా చేయాలని హావేరి తాలూకావాసి కుదరి కోరుతున్నారు. అక్కడి కష్టాలను వివరించారు. ఉద్యోగం చేస్తూ మొదట నేను ఒక్కడినే అబూదాబిలో ఉండేవాడిని, నెల కిందట భార్య, ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాను. ఇక్కడి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. మేము నివసించే భవనం దగ్గరలో బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి, చాలా భయంగా ఉందని తెలిపారు.దొడ్డబళ్లాపురం: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కష్టాలు కొనసాగుతున్నాయి. అరబ్ దేశాలు గగనతలాన్ని మూసివేసిన కారణంగా విమాన ప్రయాణాలు సాగడం లేదు. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 10 విమానాలు, ఇక్కడకు రావాల్సిన 12 విమానాలు ఎగరలేకపోయాయి. అబుదాబి, జెడ్డా, దోహా, దుబాయ్, బహ్రెయిన్ తదితరాలకు వెళ్లాల్సిన ప్రముఖ ఎయిర్లైన్స్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి. అలాగే మంగళూరు ఎయిర్పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
గ్రహణ వేళ.. ఆలయాలలో విశేష ఏర్పాట్లు
బనశంకరి: నేడు (మంగళవారం) చంద్ర గ్రహణం నేపథ్యంలో బెంగళూరులోని ప్రముఖ ఆలయాలలో పూజలు, దర్శన సమయంలో మార్పులు చేశారు. గ్రహణం సమయంలో ఆలయాన్ని మూసివేసి, గ్రహణం వీడిన తరువాత శుద్ధీకరణ, విశేష పూజలు చేస్తామని బనశంకరీ దేవస్థానం అర్చకులు తెలిపారు. ఏ ఆలయంలో ఎలా.. ● సోమేశ్వర ఆలయంలో ఉదయం 11 గంటలకు మూసివేసి బుధవారం ఉదయం 7 గంటలకు తెరుస్తారు. ● కాడు మల్లేశ్వరస్వామి మందిరంలో మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత మూసివేసి సాయంత్రం 7 గంటలకు తెరుస్తారు. వివిధ పూజలు, హోమాలకు ఏర్పాట్లు చేశారు. ● గవి గంగాధరేశ్వర దేవస్థానం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేసి సాయంత్రం 7.30 గంటలకు మళ్లీ తెరుస్తారు. శుద్ధీకరణ చేసి మూల విరాట్టుకు క్షీరాభిషేకం చేసి, రాత్రి 10 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ● నగరంలో రక్త చంద్ర గ్రహణం ఏర్పడుతుందని చూడటానికి అనేకమంది ఏర్పాట్లు చేసుకున్నారు. టెలిస్కోపులు, పెద్ద తెరలను కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. -
వెంకన్న జాతర వేడుక
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో శ్రీదేవి, భూదేవి సమేతంగా వెలసిన వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మ రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. కళాకారుల నృత్యాలు అలరించాయి.రైలు పట్టాలపై సిటీ బస్ మకాం ● ఆనేకల్ వద్ద ఆందోళన బొమ్మనహళ్లి: బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకాలోని అత్తిబెలె– ఆనేకల్ ప్రధాన రహదారిలోని హల్లెనహళ్లి రైల్వే గేట్ వద్ద పట్టాలపై బీఎంటీసీ బస్సు చెడిపోవడంతో ఆందోళన నెలకొంది. సోమవారం అత్తిబెలె నుంచి ఆనేకల్కు వెళ్తున్న సిటీ బస్సు సరిగ్గా రైలు పట్టాలపైకి వచ్చి నిలిచిపోయింది. డ్రైవరు ఎంత ప్రయత్నించినా బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ఆ రోడ్డులో ముందు, వెనుక అత్తిబెలె నుంచి కర్పూర్ వరకు 2 కి.మీ.లకు పైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు వాహనదారులు విసుగుతో రోడ్డుపై చిక్కుబడిపోయారు. చివరకు ప్రజలు బస్సును పట్టాల పై నుంచి రోడ్డు మీదకు తోసుకుంటూ వెళ్లడంతో సమస్య పరిష్కారమైంది. ప్రత్యామ్నాయ మార్గం ఏదీ? ఇక్కడ వాహన రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది, ఓవర్పాస్ లేదా అండర్పాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గం కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్సులు, అత్యవసర పనిమీద వెళ్లేవారు రైలు వస్తే కనీసం అర్ధగంట నిలిచిపోవాలని తెలిపారు. ఇప్పటికై నా ప్రత్యామ్నాయ రోడ్డు సౌకర్యం నిర్మించాలని స్థానికుడు సునీల్ కుమార్ తెలిపారు. సోమేశ్వరాయ నమోస్తుతే తుమకూరు: తుమకూరు తాలూకాలోని బెల్లావిలో సోమవారం సోమేశ్వరస్వామి బ్రహ్మ రథోత్సవం రమణీయంగా జరిగింది. ఎత్తైన అలంకరించిన తేరులో మంగళ వాయిద్యాలతో దేవీ దేవతల విగ్రహాలను ప్రతిష్టించి తేరును లాగారు. ఎమ్మెల్యే బి.సురేష్గౌడ, భక్తజనం పాల్గొన్నారు. షియా ముస్లింల నిరసన దొడ్డబళ్లాపురం: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ హత్యకు నిరసనగా షియా ముస్లింలు నిరసన ర్యాలీలు కొనసాగిస్తున్నారు. దొడ్డ పట్టణంలో పాత బస్టాండులో వందలాది మంది ఖమేనీ చిత్రాలను పట్టుకుని పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


