రాయచూరు రూరల్: రైతులు వ్యవసాయ రంగంపై మక్కువ పెంచుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా కస్బే క్యాంప్లో శ్రీనివాసరావు పొలంలో ఏర్పాటు చేసిన క్షేత్ర స్థాయి పొద్దు తిరుగుడు, సోయాబీన్ పంటల సాగులో మెలకువల గురించి వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించే విత్తనాలను వినియోగించి మంచి లాభాలు పొందారన్నారు. అధికారులు అమరేగౌడ, మల్లికార్జున, హుసేన్, సతీష్, సురేష్, వినూత, సోమశేఖర్, ఉమేష్, వికాస్, మల్లారెడ్డి, రవిశంకర్, విజయ్కుమార్, పూర్ణిమాలున్నారు.


