మైసూరు సిల్క్‌ను నాశనం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

మైసూరు సిల్క్‌ను నాశనం చేయొద్దు

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

మైసూరు: జిల్లాలోని టి. నరసిపురలోని మైసూరు సిల్క్‌ దారం కర్మాగారం ఆవరణలో స్టేడియం నిర్మాణానికి వ్యతిరేకంగా గురువారం మైసూరులో రైతులు ర్యాలీ చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ముందు గుమిగూడి చెళ్లకోళలు ఊపుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర రైతు సంఘాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హళ్లికెరెహుండి భాగ్యరాజ్‌ మాట్లాడుతూ 1912లో ఈ పట్టు కర్మాగారాన్ని స్థాపించారని అన్నారు. ఆ కర్మాగారం భూమిలో 5 ఎకరాలకు పైగా భూమిని తీసుకుని స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నించడం తగదని, మైసూర్‌ సిల్క్‌ వారసత్వ సంపదను నాశనం చేయరాదని డిమాండ్‌ చేశారు. ఈ స్థలంలో దాదాపు 550 రకాల పక్షులు, మొక్కలు, చెట్లు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయరాదన్నారు. స్టేడియం నిర్మాణ యోచనను మానుకుని, పట్టు ఫ్యాక్టరీని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement