ఏ కులం, మతం ద్వేషాన్ని బోధించదు | - | Sakshi
Sakshi News home page

ఏ కులం, మతం ద్వేషాన్ని బోధించదు

Mar 8 2026 7:32 AM | Updated on Mar 8 2026 7:32 AM

మైసూరు: ప్రజల ఆశీస్సులు ఉంటేనే నేను ముఖ్యమంత్రిని కాగలను. నా పని సమాజంలోని పేదలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేయడమేనని, వారే తనకు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు తాలూకా వరుణ నియోజకవర్గ పరిధిలోని పిల్లహళ్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ఆదిశక్తి దండిమారెమ్మ ఆలయ స్థాపన, కుంభకలశాల స్థాపనలో పాల్గొన్న తర్వాత ఆయన మాట్లాడారు. సమాజంలో అసమానతలను తగ్గించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ సమానత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఉన్నాయన్నారు. అన్ని కులాలు, మతాలు ఆర్థిక, సామాజిక శక్తిని పొందాలన్నారు. లింగ వివక్షను తొలగించి, మహిళలకు సాధికారత కల్పించడానికి శక్తి యోజన అమలు చేశారన్నారు. పేదలు, బలహీనులకు సాధికారత కల్పించడమే తన లక్ష్యమన్నారు. సమాజంలో అణగారిన వ్యక్తికి సౌకర్యాలు లభించినప్పుడే సామాజిక న్యాయం లభిస్తుందని ఆయన అన్నారు.

దేవుడిని ఎల్లవేళలా తలుచుకోవాలి

అదే సమయంలో చిన్నతనం నుంచి దండిమారెమ్మ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్న సీఎం, ఇబ్బందులు తలెత్తినప్పుడే కాకుండా ఎల్లవేళలా దేవుడిని తలుచుకోవాలని అన్నారు. ఆలయాల్లో దేవుడు ఉంటాడని మనం నమ్ముతాం. దేవుడిని పూజించడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకాన్ని నేను వ్యతిరేకించను. కానీ నేను దేవుడు అంతటా ఉన్నాడని నమ్ముతాను, ఆచరిస్తానని అన్నారు. 1978లో మొదటిసారి టీపీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇక్కడి ప్రజల ఆశీస్సులు తనకు లభించాయన్నారు. తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలు తనను గెలిపించారన్నారు. చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల ప్రజల ఆశీస్సులతో తాను ఇప్పటివరకు 8 సార్లు ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిని కాగలిగానన్నారు. ఎమ్మెల్సీలు డాక్టర్‌ యతీంద్ర, డాక్టర్‌ డి.తిమ్మయ్య, హామీ పథకం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పుష్ప అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

ప్రజల ఆశీస్సులతోనే సీఎంను అయ్యాను

మైసూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement