రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణానికి మహిళలు నడుం బిగించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీదేవి నాయక్ పేర్కొన్నారు. ఆదిఽవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కళాసంకుల సంస్థ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. వివేకతుల్యమైన చింతనలు, మౌల్యాలతో కూడిన సమాజం అభివృద్ధికి అనుగుణంగా ఉంటుందన్నారు. సమావేశంలో మారుతి, రేఖ, ఆశాలత, అనిత, పంపాపతి, బసవరాజ్, శ్రీనివాస్, రాజశేఖర్, రమేష్, ప్రేమలతలున్నారు.


