breaking news
	
		
	
  Bollywood
- 
      
                   
                                                       ఈ వయసులో నటితో పెళ్లి.. వీడియో చూసి నెటిజన్స్ షాక్.. తీరా చూస్తే!ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యూలతో పాటు సినీతారలు సైతం వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లోనూ పెళ్లిళ్ల సందడి కనిపిస్తోంది. అలా బాలీవుడ్లోనూ ఓ సెలబ్రిటీ జంటకు సంబంధించిన పెళ్లి వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే వీరిద్దరి పెళ్లిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇద్దరు సీనియర్ నటులు కావడంతో బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా పెళ్లి దుస్తుల్లో మెరిశారు. ఈ వీడియోలో ఇద్దరు కూడా ఫోటోలకు కూడా పోజులివ్వడంతో నిజంగానే పెళ్లి చేసుకున్నారని నెటిజన్స్ షాకయ్యారు. వీరి పెళ్లి వీడియో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహానికి సంబంధించి అసలు విషయం తెలియడంతో నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.బాలీవుడ్ నటి మహిమా చౌదరి, నటుడు సంజయ్ మిశ్రా ప్రస్తుతం 'దుర్లభ్ ప్రసాద్ కీ దుస్రీ షాదీ' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వీరిద్దరు జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ మోషన్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పెళ్లికి సంబంధించిన కథ కావడంతో సంజయ్ మిశ్రా వరుడి దుస్తులలో మహిమా చౌదరి ఫోటోతో వధువుగా కూర్చున్నట్లు కనిపించారు. ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగానే ఇలా వధూవరుల్లా రెడీ అయ్యారు. అంతే తప్ప మహిమా చౌదరి, సంజయ్ మిశ్రా వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో వైరలైన విజువల్స్ 'దుర్లభ్ ప్రసాద్ కి దుస్రీ షాదీ' మూవీ కోసం ప్రమోషనల్ షూట్లో భాగంగానే చేశారురియల్ లైఫ్ విషయానికొస్తే.. మహిమా చౌదరి 2006లో ఆర్కిటెక్ట్ బాబీ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాజ ఈ జంట విడిపోయారు, ప్రస్తుతం ఆమె తన కుమార్తె అరియానాను పెంచడంపై దృష్టి సారించింది. మరోవైపు సంజయ్ మిశ్రా.. కిరణ్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. View this post on Instagram A post shared by Namaste Bollywood (@namastebollywood.in)
- 
      
                   
                                                       'దావూద్ ఇబ్రహీం టెర్రరిస్ట్ కాదు'.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్!అలనాటి అందాల భామ, బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి చాలా రోజుల తర్వాత ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 24 ఏళ్ల పాటు విదేశాల్లో ఉన్న నటి.. ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చింది. సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం సన్యాసిగా మారి బ్యూటీ మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటన కోసం గోరఖ్పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా మమతా వివాదాస్పద కామెంట్స్తో వార్తల్లో నిలిచింది. ఇంతకీ మమతా ఎలాంటి కామెంట్స్ చేసింది? అవీ వివాదానికి ఎందుకు దారితీశాయో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం టెర్రిరిస్ట్ కాదంటూ క్లీన్ చీట్ ఇచ్చిపడేసింది మమతా కులకర్ణి. అతను ముంబయిలో పేలుళ్లకు పాల్పడలేదంటూ కామెంట్స్ చేసింది. అతను ఎలాంటి బాంబు బ్లాస్ట్ చేయలేదని.. దేశ ద్రోహి కాదంటూ మాట్లాడింది. మమతా కామెంట్స్ కాస్తా వైరల్ కావడంతో హీరోయిన్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.దీంతో హీరోయిన్ మమతా కులకర్ణి తన వ్యాఖ్యలపై స్పందించింది. విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చింది. నేను మాట్లాడింది.. దావూద్ ఇబ్రహీం గురించి కాదు.. విక్కీ గోస్వామి గురించి అని తెలిపింది. దావూద్ నిజంగా ఉగ్రవాదినే అని వెల్లడించింది. కాగా.. గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలతో అరెస్టైన గోస్వామికి.. ఈమెతో రిలేషన్ ఉంది.దావూద్ను నేనెప్పుడు కలవలేదు..అంతేకాకుండా తాను దావూద్ను ఎప్పుడూ కలవలేదని.. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. నాకు ఇప్పుడు రాజకీయాలతో కానీ.. సినిమా పరిశ్రమతో కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ప్రస్తుతం పూర్తిగా ఆధ్యాత్మికతపై అంకితభావంతో ఉన్నానని పేర్కొంది. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులతో నాకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. కాగా.. 1993 ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్కు పారిపోయాడు. రెండు దశాబ్దాలకు పైగా కరాచీలో నివసిస్తున్నట్లు సమాచారం.మమతా కులకర్ణి సినీ జీవితం1990ల ప్రారంభంలో మమతా కులకర్ణి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. క్రాంతివీర్, కరణ్ అర్జున్, చైనా గేట్ వంటి చిత్రాలలో నటించింది. ఆ తర్వాత 2002లో నటనకు పూర్తిగా స్వస్తి పలికింది. 2016లో, థానే పోలీసులు ఆమెను 2 వేల కోట్ల అంతర్జాతీయ మాదకద్రవ్యాల కేసుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2024లో ఆమెపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టేసింది. గత కొన్ని సంవత్సరాలుగా మమతా సన్యాసిగా జీవనం సాగిస్తోంది.
- 
      
                   
                                                       ఒక్క దెబ్బతో జీవితమే తలకిందులు.. భిక్షాటన చేస్తున్న నటిమేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చిందంటే ఏ ఎమోషన్ అయినా ఇట్టే పండించగలదు. అందుకే శక్తిమాన్ సహా 150కి పైగా సీరియల్స్ చేసింది. ఎక్కువగా గ్లామరస్గానే కనిపించేది. కానీ, సడన్గా తనకు అన్నింటిపైనా విరక్తి వచ్చింది. బంధాలు, బాంధవ్యాలు అన్నింటినీ కాదనుకుని సన్యాసం పుచ్చుకుంది. పీంతబర మాగా మారింది. హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తోంది.జీవితంపై విరక్తితాజాగా ఓ ఇంటర్వ్యూలో నుపుర్ అలంకార్ (Nupur Alankar) అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. గూగుల్లో చూస్తే నా జీవితంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుస్తుంది. పీఎంసీ (పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్) బ్యాంక్ కుంభకోణం జరిగినప్పుడు జీవితంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఈ స్కామ్ తర్వాతే అమ్మ అనారోగ్యంపాలైంది. మెరుగైన చికిత్స అందించడనికి బ్యాంకులో డబ్బున్నా.. దాన్ని బయటకు తీసుకుని వాడలేని పరిస్థితి. అమ్మ, సోదరి చావులు చూశాక నా జీవితం కూడా ముగిసిపోయిందనుకున్నా.. ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్నాను. భిక్షాటనఅందుకే అన్ని కనెక్షన్లు తెంచేసుకున్నాను. ప్రాపంచిక జీవితానికి దూరంగా.. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో సంతోంషంగా ఉన్నాను. ఇక్కడ భిక్షాటన ఉంటుంది. నేను కూడా భిక్షాటన చేస్తుంటాను. అందరూ నాకు దానధర్మాలు చేసినదాంట్లో కొంత దేవుడికి, మరికొంత నా గురువుకి ఇస్తాను. ఈ భిక్షాటన వల్ల మనిషిలో ఇగో అనేది చచ్చిపోతుంది. ఇకపోతే నాలుగైదు జతల బట్టలతోనే కాలం గడిపేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చేవారు కొన్నిసార్లు దుస్తులు కూడా ఇస్తుంటారు. వాటినే ఉపయోగిస్తూ ఉంటాను. కొన్నిసార్లు మంచు తుఫానులు వంటివి వచ్చినప్పుడు గుహలో జీవించాను అని చెప్పుకొచ్చింది.PMB స్కామ్..నటి నుపుర్ సన్యాసం పుచ్చుకోవడానికి ప్రధాన కారణం తల్లి, సోదరి చావు! ఆ చావులకు ప్రధాన కారణం 2019లో జరిగిన పీఎంసీ బ్యాంక్ స్కామ్. వేల కోట్ల స్కామ్ వెలుగులోకి వచ్చినవెంటనే ఆర్బీఐ.. పీఎంబీ బ్యాంక్పై ఆరునెలలపాటు ఆంక్షలు విధించింది. వినియోగదారులు కేవలం రూ.1000 మాత్రమే నగదు విత్డ్రా చేసుకోవచ్చని కఠిన నిబంధనలు పెట్టింది. దీంతో ఆ బ్యాంక్లో నగదు డిపాజిట్ చేసుకున్న వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తర్వాత విత్డ్రా పరిమితులను సవరించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయారు.చదవండి: వాళ్లందరూ సర్వనాశనం అయిపోతారు.. మంచు లక్ష్మి శాపనార్థాలు
- 
      
                   
                                                       వివాహేతర సంబంధాలకు జై అన్న హీరోయిన్లు.. నెటిజన్స్ ఫైర్!ఈ సినిమా తారలకు ఏమైంది? మరీ ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులకు ఏమైంది? దశాబ్ధాల తరబడి భారతీయ సినిమాల్లో ప్రముఖంగా ఉంటూ మన ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూనే మన దేశ సంస్కృతీ సంప్రదాయాల పట్ల బాధ్యతా రహితంగా ఎలా ఉండగలుగుతున్నారు?ఇలాంటి ఆలోచనలు ఇటీవలి కాలంలో చాలా మందికి వస్తున్నాయి. సినిమాల్లో శృంగార సన్నివేశాల విజృంభణతో పాటు ప్రేమ, పెళ్లి, వివాహేతర సంబంధాలు వంటి అనేక సున్నితమైన, యువతను ప్రభావితం చేసే అంశాలపై ఇష్టారాజ్యంగా వీరు వ్యాఖ్యలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం విస్తుగొలుపుతోంది. అలాంటి బాధ్యతా రహిత సెలబ్రిటీల జాబితాలో తాజాగా సీనియర్ నటి కాజోల్, బాలీవుడ్ ప్రముఖురాలు ట్వింకిల్ ఖన్నాలు చోటు చేసుకున్నారు. పెళ్లయిన వాళ్లు వివాహేతర సంబంధాలు లేదా తాత్కాలిక శారీరక సంబంధాలు పెట్టుకోవడం తప్పులేదనే విధంగా వీరు వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.(చదవండి: ప్రశాంత్ వర్మ సినిమా.. 'మహాకాళి'గా భూమి శెట్టి)వివరాల్లోకి వెళితే... తాజాగా జాన్వీ కపూర్, కరణ్ జోహార్, కాజోల్(Kajol), ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna ) పాల్గొన్న టాక్ షో పెళ్లయిన దంపతులు ఒకరికి ఒకరు విశ్వాసంగా ఉండడం అనే అంశంపై చర్చ నెట్టింట రచ్చను రాజేసింది .ఈ చర్చలో భాగంగా వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవడం ద్వారా జీవిత భాగస్వామిని మోసం చేయడం క్షమించరానిదని జాన్వీ కపూర్ అభిప్రాయపడగా దీన్ని , కాజోల్ ట్వింకిల్ ఖన్నా లు తోసిపారేశారు. ఇది దాంపత్య ఒప్పందాన్ని ఉల్లంఘించేది కాదని తేల్చేశారు. తద్వారా వీరిద్దరూ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.(చదవండి: కొండచిలువను మెడకు చుట్టుకున్న గ్లోబల్ బ్యూటీ..)ఈ సెలబ్రిటీ టాక్ షో లో అతిధులుగా కాజోల్, ట్వింకిల్ ఖన్నా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), కరణ్ జోహార్ పాల్గొన్నారు. భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం కన్నా మానసికంగా మోసం చేయడం పెద్ద తప్పు అని అంగీకరిస్తున్నారా లేదా అనే చర్చ లేవనెత్తారు. దీంతో దేవర నటి జాన్వి శారీరక మోసాన్ని సహించలేమని అంటూ తన వైఖరిని గట్టిగా చెప్పింది. అయితే కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నా కాజోల్ ఆ అభిప్రాయం సరైంది కాదని నొక్కి చెప్పారు. ట్వింకిల్ అయితే ‘రాత్ గయీ బాత్ గయీ (రాత్రి పోయింది ఆ విషయమూ అయిపోయింది )’ అంటూ తేలిగ్గా తేల్చి చెప్పింది, కాబట్టి మానసిక వ్యభిచారమే తప్పన్నట్టు మాట్లాడింది.అయితే జాన్వి తన అభిప్రాయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఈ క్లిప్ ఇంటర్నెట్ అంతటా వైరల్ అయింది, ఒకవైపు, ‘పరమ సుందరి’ స్టార్ తన అభిప్రాయానికి ప్రశంసలు అందుకుంటుండగా, హోస్ట్లు కాజోల్ ట్వింకిల్ వారి అభిప్రాయానికి ఎదురుదాడిని ఎదుర్కొంటున్నారు. దీనిపై పలువురు మానసిక శాస్త్రవేత్తలు సైతం విశ్లేషణాత్మక విమర్శలు సంధిస్తున్నారు.పైగా జాన్వి చిన్నది, ఆమె 20 ఏళ్లలో ఉందని, కానీ ఆమె 50 ఏళ్ల వయస్సుకు చేరుకున్నప్పుడు, ఆమెకు ఇప్పుడు ఉన్న అభిప్రాయం మారుతుందని ట్వింకిల్ అనడాన్ని ప్రస్తావిస్తూ ఓ మనస్తత్వవేత్త ఇలా అన్నారు, ‘కాదు, ఇది వయస్సు లేదా పరిపక్వత గురించి కాదు, ఇది గౌరవం సరిహద్దుల గురించి.’’అంటూ గుర్తు చేశారు. ‘మోసం అంటే మోసం..అది భావోద్వేగంగా మాత్రమే కాదు శారీరకంగా లేదా సరసాలాడటం కూడా మోసమే. దానికి వేర్వేరు పేర్లు పెట్టి, సరదాగా గడపడానికి లేదా ‘మనస్సును మరల్చడానికి లేదా టైమ్ పాస్?‘ అని పిలవడం తప్పించుకోవడమేనన్నారు.పలువురు నెటిజన్లు జాన్విని అభినందించారు చాలా మంది అక్రమ సంబంధాల్ని సమర్థిస్తున్నారంటూ కాజోల్ ట్వింకిల్లను తీవ్రంగా విమర్శించారు. ‘ బాలీవుడ్ జీవనశైలిలో భాగంగా వారు దానిని సాధారణమైనదిగా చూస్తారు. వేరే విధంగా ఎవరైనా మాట్లాడటం అనేది వారికి వింతగా లేదా అమాయకంగా లేదా తెలివితక్కువగా అనిపిస్తుంది ‘ అని ఓ నెటిజన్ తీవ్రంగా దుయ్యబట్టారు.
- 
      
                   
                                                       ప్రియాంక మెడలో కొండచిలువ.. భయమనేదే లేదు!తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించడంతో అందరి కన్ను టాలీవుడ్పై పడింది. అలా దీపికా పదుకొణె కల్కి 2898ఏడీతో తెలుగులో ఎంట్రీ ఇస్తే, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. #SSMB29 మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కానుంది. డేర్ అండ్ డాషింగ్గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫోటోలు షేర్ చేసింది. అందులో కొండచిలువ సహా మరో భారీ పామును తన భుజాలపై వేసుకుంది. భర్త నిక్ జోనస్ కూడా పక్కనే నిల్చుని చూస్తూ ఉన్నాడు. భయమే లేదువీరి ముఖంలో కంగారు, భయం వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా.. నీ జ్యువెలరీ బాగుంది బేబ్ అని భార్యకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. పాములను మెడలో వేసుకుని దిగిన పలు ఫోటోలను తన పోస్ట్లో జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. అదిగో పాము అనగానే అరకిలోమీటర్ దూరం పడిగెతుంటారు జనాలు.. అలాంటిది ప్రియాంక ఏకంగా పామును మెడలో వేసుకుందంటే గుండెధైర్యం చాలానే ఉందని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి-మహేశ్బాబు సినిమాలో ఇలాంటి సాహసాలు ఎన్ని చేసిందో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.మిస్ వరల్డ్ నుంచి హీరోయిన్గా..జార్ఖండ్కు చెందిన ప్రియాంకచోప్రా.. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలిచింది. ఆ తర్వాతే బిగ్స్క్రీన్పై తళుక్కుమంది. 2002లో వచ్చిన తమిళన్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. అండాజ్, ముజ్సే షాదీ కరోగి, అయిత్రాజ్ వంటి పలు హిట్స్తో బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారింది. క్రిష్, డాన్, ఫ్యాషన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. రచయిత్రిగానూబర్ఫీ, బాజీరావు మస్తానీ, మేరీ కోమ్, ద స్కై ఈజ్ పింక్ ఇలా అనేక సినిమాలు చేసింది. రామ్లీలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్కు వెళ్లిపోయింది. సిటాడెల్ వంటి వెబ్ సిరీస్లతో పాటు అనేక ఇంగ్లీష్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘అన్ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. తన జీవితంలో ఎదురైన జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకుంది.పెళ్లి- కూతురుహాలీవుడ్ సింగర్,యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరి జన్మించింది. భర్త, కూతురితో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లోనే ఉంటోంది. పెళ్లయ్యాక ఇండియన్ సినిమాలపై ఫోకస్ తగ్గించేసిన ప్రియాంక.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాలో నటించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)చదవండి: ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?
- 
      
                   
                                                       నా పారితోషికాన్ని విరాళంగా ఇచ్చేశానుహిందీ ‘రామాయణ’ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని అధికారికంగా తెలిపారు వివేక్ ఓబెరాయ్. రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రెండు భాగాలుగా ‘రామాయణ’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రంలో వివేక్ ఓబెరాయ్ కూడా నటిస్తున్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో నిర్మాత నమిత్ మల్హోత్రా భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకు వెళ్తున్నారు. ఇది నచ్చి, ఈ సినిమా చేయాలనుకున్నాను. అలాగే ఈ సినిమాకు సంబంధించిన నా పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేశాను. ఇక ‘రామాయణ’ సినిమా కోసం రెండు రోజులు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. నితీష్, నమిత్, రకుల్లతో వర్క్ చేయడం బాగుంది’’ అని చెప్పుకొచ్చారు వివేక్ ఓబెరాయ్. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో శూర్పణఖగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్నారని, ఆమె భర్త విద్యుజ్జీహ్యుడుగా వివేక్ ఓబెరాయ్ నటిస్తున్నారని సమాచారం. ‘రామాయణ’ తొలి భాగాన్ని 2026 దీపావళికి, ‘రామాయణ: పార్టు 2’ని 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
- 
      
                   
                                                       సల్మాన్ ఖాన్కు రూ.200 కోట్లు.. నిర్మాత ఏమన్నారంటే?బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఇటీవల తెగ వినిపిస్తోంది. ఆయనపై పాకిస్తాన్ ఉగ్రవాద ముద్ర వేయడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. సౌదీ అరేబి యాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. దీంతో పాక్ తన వక్రబుద్ధిని చూపుతూ సల్మాన్పై టెర్రిరిస్ట్ ముద్ర వేసింది.ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ రియాలిటీ షో సీజన్-19కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అత్యంత భద్రతా వలయంలో ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. అయితే గతంలో సల్మాన్ రెమ్యునరేషన్పై పెద్దఎత్తున రూమర్స్ వినిపించాయి. ఈ షో కోసం ఏకంగా రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి.(ఇది చదవండి: సల్మాన్పై పాక్ ఉగ్ర ముద్ర)తాజాగా ఈ వార్తలపై బిగ్బాస్ రియాలిటీ షో నిర్మాత రిషి నెగి రియాక్ట్ అయ్యారు. ఆయనకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా.. అందుకు అర్హుడని అన్నారు. ఆయనకు జియో హాట్స్టార్తో ఉన్న ఒప్పంద ప్రకారమే పారితోషికం ఉంటుందని తెలిపారు. అయితే అది ఎంత అనేది మాత్రం తాను చెప్పలేనన్నారు. కాగా.. సల్మాన్ ఖాన్.. బిగ్బాస్ హోస్ట్గా రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకున్నారంటూ రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.
- 
      
                   
                                                       మహారాణి మళ్లీ వస్తోంది.. ట్రైలర్ చూశారా?బాలీవుడ్ భామ హేమా ఖురేషి(Huma Qureshi) ప్రధాన పాత్రలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ మహారాణి(Maharani Season 4). ఇప్పటికే రిలీజైన మూడు సీజన్లు ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్కు ఆదరణ ఉన్న ఈ రోజుల్లో మహారాణి హిట్గా నిలవడంతో మేకర్స్ మరో సీజన్ను తెరకెక్కించారు. తాజాగా నాలుగో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సీజన్ వచ్చేనెల 7 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్లో సందడి చేయనుంది. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ సీజన్పై మరింత ఆసక్తి పెంచుతోంది. మహారాణి తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది.
- 
      
                   
                                                       రోజుకు 22 గంటలు షూటింగ్లోనే.. నేలపై నిద్రపోయేవాడిని!కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా రోజంతా ఎక్కువ గంటలు పని చేయించుకుంటామంటే కుదరదు, 8 గంటల షిఫ్టే ఉండాలి అని దీపికా పదుకొణె వంటి స్టార్ హీరోయిన్స్ కొత్త కండీషన్స్ పెడుతున్నారు.సరిగా నిద్రుండేది కాదుఈ డిమాండ్లకు కొందరు నిర్మాతలు కుదరదని కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. అయితే రోజుకు ఎనిమిది గంటలు కాదు, ఏకంగా 22 గంటలు పని చేసేవాడిని అని చెప్తున్నాడు హిందీ బిగ్బాస్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు హితేన్ తేజ్వాని (Hiten Tejwani). తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. కెరీర్ తొలినాళ్లలో నిద్రపోవడానికి కూడా సమయం ఉండేది కాదు. నెలలో 30 ఎక్స్ట్రా షిఫ్టులు చేసేవాడిని. నా చెక్ నేనే వెళ్లి తెచ్చుకునేవాడిని. రూ.1 లక్ష చెక్ అందుకోగానే సంబరపడిపోయేవాడిని.ఛాన్స్ దొరికితే నేలపై నిద్రపొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్ అనేవారు. తీరా అది ఉదయం ఐదింటివరకు సాగేది. రెండు గంటల గ్యాప్తో నెక్స్ట్ షిఫ్ట్ మొదలయ్యేది. అలా 22 గంటలు పనిచేసేవాడిని. మిగతా రెండుగంటలు నేలపై నిద్రించేవాడిని. నా టైమింగ్స్ నచ్చక చాలామంది డ్రైవర్స్ సడన్గా పని మానేసేవారు. దాంతో నేనే కారు నడిపేవాడిని, ఓసారైతే డివైడర్ను ఢీ కొట్టాను. నిజానికి వేరే ఉద్యోగం చూసుకుంటే పనిగంటలు తక్కువ ఉండేవి, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని చాలాసార్లు అనుకున్నాను. అయినా ఇష్టపడి, కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్హితేన్.. సుకన్య, ఘర్ ఏక్ మందిర్, కభీ సౌతన్ కభీ సహేలి సీరియల్స్లో చిన్న పాత్రలు చేసేవాడు. కుటుంబ్ సీరియల్తో బ్రేక్ అందుకున్నాడు. క్యూంకీ సాస్ భీ కభీ బహుతీ, కుసుమ్, బాలికా వధు, కసౌటీ జిందగీ కే వంటి పలు ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు తీ 2 సీరియల్ చేస్తున్నాడు. హిందీ బిగ్బాస్ 11వ సీజన్లోనూ పాల్గొన్నాడు.చదవండి: టాస్కుల్లో పవన్ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!
- 
      
                   
                                                       గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'మేడ్ ఇన్ ఇండియా' సింగర్!అలీషా చినాయ్.. ఇప్పటి జనరేషన్కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. నైంటీస్ బ్యాచ్కి మాత్రం ఈ పేరు చెప్పగానే ‘మేడ్ ఇన్ ఇండియా’ పాటను ఆలపిస్తారు. 1990ల్లో 'మేడ్ ఇన్ ఇండియా', 'లవర్ గర్ల్', 'సెక్సీ సెక్సీ ముఝే లోగ్ బోలే' వంటి హిట్ పాటలతో ఇండిపాప్ రాణిగా రాణించిన పాప్ సింగర్ అలీషా చినాయ్(Alisha Chinai). గతకొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ సింగర్.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులతో టచ్లోనే ఉంటుంది. తాజాగా అలీషా తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసిన ఓ ఫోటో అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 60 ఏళ్ల వయసు ఉన్న ఆమె ‘మేడ్ ఇన్ ఇండియా' నాటి గెటప్లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ జనరేషన్ వాళ్లు ఆ ఫోటోని చూస్తే..అస్సలు గుర్తుపట్టలేరు. ఆమె లుక్ ఇప్పుడు మరింత మెచ్యూర్గా మారింది. కానీ వయసు ప్రభాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘షాకింగ్.. అలీషా ఇలా మారిపోయిందేంటి? ఏమైంది? ’, ఆమె పాప్ సింగర్ అలీషానేనా?.. ఆమె వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలీషా చినాయ్ 1965 మార్చి 18న అహ్మదాబాద్లో గుజరాతీ కుటుంబంలో జన్మించింది. 1985లో 'జాదూ' ఆల్బంతో తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, బప్పీ లహిరీతో కలిసి 'అడ్వెంచర్స్ ఆఫ్ టార్జన్', 'డాన్స్ డాన్స్' వంటి సినిమాల్లో డిస్కో హిట్లు ఇచ్చింది. 1995లో విడుదలైన 'మేడ్ ఇన్ ఇండియా' ఆల్బం భారీ విజయం సాధించి, ఆమెను 'క్వీన్ ఆఫ్ ఇండిపాప్'గా మార్చింది.బాలీవుడ్లో కూడా ఆమె మార్క్గా ఉంది. 'కజ్రా రే' (బంటీ ఆర్ బాబ్లీ, 2005) పాటకు ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డు అందుకుంది. 'రుక్ రుక్ రుక్', 'ప్యార్ ఆయా', 'టచ్ మీ', 'తింకా తింకా' వంటి హిట్లు ఆమె స్వరానికి గుర్తింపు తెచ్చాయి. అయితే, 1996లో అను మలిక్పై సెక్సువల్ హారస్మెంట్ ఆరోపణలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. తర్వాత 2018 మీటూ క్యాంపెయిన్లో ఆమె మాటలు మరోసారి గుర్తుకు వచ్చాయి.వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. మేనేజర్ రాజేష్ ఝవేరీతో 1986లో పెళ్లి చేసుకుని 1994లో విడాకులు తీసుకుంది. తండ్రి క్యాన్సర్తో బాధపడటంతో కెరీర్పై దృష్టి తగ్గింది. 2020 నుంచి తజకిస్తాన్కు చెందిన ఫుర్కత్ అజమోవ్తో రిలేషన్షిప్లో ఉంది.People of my generation will instantly know who she is. pic.twitter.com/Mk4PwRcsc8— Sapna Madan (@sapnamadan) October 28, 2025
- 
      
                   
                                                       రోడ్డుపై వెళ్తుంటే..బాబాయ్ లాంటివాడే అలా వేధించాడు: హీరోయిన్సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నవారిలో చాలా మంది ఒకప్పుడు లైంగిక వేధింపులకు గురైనవారే ఉన్నారు. కొంతమందికి ఇండస్ట్రీ నుంచి ఎదురైతే..మరికొంతమందికి బయట నుంచే ఇలాంటి వేధింపులు వస్తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండడం వల్లే ఇప్పుడు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు. హీరోయిన్ అయేషా ఖాన్(Ayesha Khan) కూడా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురైయ్యారట. బాబాయ్ లాంటివాడే తనతో అసభ్యకరంగా మాట్లాడి హింసించాడట. ఇప్పటికే ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్ల వెంట నీళ్లు ఆగవని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆయేషా.ముంబైకి చెందిన ఈ బ్యూటీ..బుల్లితెర నటిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు వెండితెరపై రాణిస్తుంది. కసాటి జిందగీ కే అనే సీరియల్లో ఆమె ఓ చిన్న పాత్ర పోషించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. హిందీ బిగ్బాస్ షో ఆమెను పాపులర్ చేసింది. సీజన్ 17లో పాల్గొన్న ఆమె..11 వారాల పాటు హౌస్లో ఉండి తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్సేన్ సరసన నటించి, మెప్పించింది. ఓ భీమ్ బుష్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం బెంగాలీతో పాటు పలు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది.సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయేషా.. ఎప్పటికప్పడు తన సినిమా అప్డేట్స్తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఆమె ఓ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్నప్పుడు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.‘ఒకప్పుడు మాది చాలా పేద కుటుంబం. తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు. చిన్న వయసులోనే లైగింక వేధింపులు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఓసారి రోడ్డుపై ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే.. మా నాన్న స్నేహితుడు ఒకరు పిలిచారు. నేను ఆయనను బాబాయ్ అని పిలిచేదాన్ని. నా దగ్గరకు వచ్చి ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు. బాబాయ్ లాంటివాడు అలా మాట్లాడేసరికి షాకయ్యారు. ఆ వెంటనే మళ్లీ నావైపుగా వచ్చి అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడు. అప్పుడు నా వయసు 9 ఏళ్లు మాత్రమే. ఆయన ఎందుకు అలా అన్నాడో, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వెళ్లి ఏడ్చేశా. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తుకు వస్తే.. కళ్లల్లోనుంచి నీళ్లు వచ్చేస్తాయి’ అని ఆయేషా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- 
      
                   
                                                       కొందరు నటులు అసలు సెట్కే రారు.. 'ఓజీ' విలన్ కామెంట్స్రీసెంట్ టైంలో నటీనటుల పనివేళలు, సెట్కి సమయానికి రావడం అనే విషయాలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అడపాదడపా నటీనటులు, సినీ ప్రముఖులు ఈ టాపిక్ గురించి నేరుగానో, పరోక్షంగానో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 'ఓజీ'లో విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మీ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు. కొందరు నటులు అస్సలు సెట్కి రారనే ఆశ్చర్యకర విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: 'సలార్' కాటేరమ్మ ఫైట్లో నేనే చేయాలి.. కానీ: టాలీవుడ్ హీరో)అసలు విషయానికొస్తే.. 'హక్'(HAQ) అనే హిందీ సినిమా చేసిన ఇమ్రాన్ హష్మీ దాని ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహనటి యామీ గౌతమ్ని ప్రశంసించాడు. సెట్కి సమయానికి వచ్చేస్తుందని చెప్పుకొచ్చాడు. మరి ఈ కాలంలో కూడా టైమ్కి రాని యాక్టర్స్ ఉంటారా? అని యాంకర్ అడగ్గా.. 'కొందరు నటులు అసలు సెట్కే రారు' అని కామెంట్స్ చేశాడు.అయితే ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యల్ని ఒక్కొక్కరు ఒక్కోలా తీసుకుంటున్నారు. పలువురు నార్త్ నెటిజన్లు సల్మాన్ ఖాన్ గురించి అన్నాడని అంటుండగా.. మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్ గురించి ఈ కామెంట్స్ చేశాడా అనే సందేహపడుతున్నారు. ఎందుకంటే 'ఓజీ'లో పవన్ కొన్నిరోజులే షూటింగ్కి రాగా మిగిలిన చోట్ల పవన్ డూప్ని పెట్టి మేనేజ్ చేశారు. ఇమ్రాన్ గతంలో సల్మాన్తో కలిసి 'టైగర్ 3' చేశాడు. అప్పుడేమైనా సల్మాన్ సెట్కి రాలేదా అని అనిపిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: అఫీషియల్.. ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఫ్యామిలీ మ్యాన్ 3')About whom Emraan Hashmi talking ????Recently he worked in #TheyCallHimOG #EmraanHashmi pic.twitter.com/MncfXvbTG2— TFI Movie Buzz (@TFIMovieBuzz) October 27, 2025
- 
      
                   
                                                       బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ దీపావళి కానుక ఇపుడు నెట్టింట విమర్శలకు తావిస్తోంది. సిబ్బందికి దివాలీ కానుకకు సంబంధించిన వీడియో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో చాలా మంది బిగ్బీ దివాలీ గిఫ్ట్కు మెచ్చుకోగా, మరికొందరు ఆయన కానుకపై నిరాశగా పెదవి విరిచారు. సిగ్గు చేటు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే... బిగ్బీ తన సిబ్బందికి దీపావళి కానుకగా రూ.10,000 నగదు, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారంటూ ముంబైలోని అమితాబ్ నివాసం జుహూ వద్ద ఒక కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తీసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాలీవుడ్ అతిపెద్ద నటుడు అమితాబ్ బచ్చన్ తన ఇంటి సిబ్బందికి ,భద్రతా సిబ్బందికి రూ. 10,000 నగదు , ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు అనే క్యాప్షన్తో ఈ వీడియోనే షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ఈ వీడియో వేలాది వీక్షణలతోపాటు నెటిజన్లలో చర్చకు దారితీసింది. పండుగ సీజన్లో తన ఉద్యోగులను ప్రశంసించినందుకు కొందరు అమితాబ్ను ప్రశంసించారు. మరికొందరు బిగ్బి లాంటి వాళ్ల స్థాయికి, ఆస్తులతోపోలిస్తే ఇది "చాలా తక్కువ" ,"ఇది చాలా విచారకరం అనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొందరైతే, రోజంతా మీ భద్రకోసం, మీకోసం కాపలాకాసే వారికి కేవల 10వేల రూపాయలా, సిగ్గు చేటు, దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ సిబ్బందికి రెట్టింపు జీతం ఇవ్వాలి. కొంతమంది 20-25 వేలు బోనస్గా కూడా ఇస్తారు" అంటూ స్పందించారు. పలు కంపెనీలు,  కార్పొరేట్లు తమ కార్మికులకు లగ్జరీ దీపావళి కానుకలు, హ్యాంపర్లు బహుమతిగా ఇస్తున్న వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయిన సమయంలో ఈ ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. View this post on Instagram A post shared by Sagarthakurvlog (@sagar.thakur84)నోట్: ఈ వీడియోలో అమితాబ్ క్లిప్లో పలువురు సిబ్బంది, భద్రతా సిబ్బంది బహుమతులు అందుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు.
- 
      
                   
                                                       మహేశ్బాబు స్వాగతం చెప్పడం ఆనందం: శిల్పా శిరోద్కర్‘‘సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘జటాధర’. ఇందులో స్టన్నింగ్ విజువల్స్, అద్భుతమైన సంగీతం, బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని నటి శిల్పా శిరోద్కర్ చెప్పారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ కీలకపాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ పంచుకున్న విశేషాలు...⇒ తెలుగులో నేను నటించిన తొలి చిత్రం ‘బ్రహ్మ’ (1992). ఆ తర్వాత తెలుగు సినిమా చేయలేదు. ఇన్నేళ్ల తర్వాత ‘జటాధర’ చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇందులో శోభ అనే ప్రాధాన్యం ఉన్నపాత్ర చేశాను. తనకి డబ్బంటే అత్యాశ. ఎలాగైనా సరే అనుకున్నది చేరుకోవాలి అనుకునేపాత్ర. ఈ క్యారెక్టర్ చేయడం సవాల్గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటిపాత్ర నేనెప్పుడూ చేయలేదు. అయితే మా డైరెక్టర్స్ వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ క్లియర్ విజన్, సపోర్ట్తో ఈపాత్రని చేయగలిగా.⇒ మహేశ్బాబుగారు మా ‘జటాధర’ ట్రైలర్ లాంచ్ చేయడం, ట్రైలర్ బాగుందని ఆయన కితాబివ్వడంతోపాటు టాలీవుడ్కి నాకు స్వాగతం చెప్పడం సంతోషాన్నిచ్చింది. నమ్రత శిరోద్కర్ (శిల్ప సోదరి)కి కూడా ట్రైలర్, నాపాత్ర నచ్చాయి. సుధీర్బాబుగారు మాకు బంధువే అయినప్పటికీ సెట్లో మేం కేవలం ఆర్టిస్టులం మాత్రమే. సుధీర్గారితో కలిసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. సోనాక్షీ సిన్హా చేసిన ధన పిశాచిపాత్ర చాలా బాగుంటుంది. నిర్మాతలు రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు.⇒ చిత్ర పరిశ్రమలో తెలుగు, హిందీ వంటి సరిహద్దులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం తెలుగు సినిమా బెస్ట్ ఫేజ్లో ఉంది. కంటెంట్ పరంగా, టెక్నికల్గా అడ్వాన్స్ అయ్యాం. ‘జటాధర’ సినిమా కోసం తెలుగు, హిందీ... ఇలా అన్ని చోట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబరు 7న ప్రేక్షకులు అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు. నాకు రొమాంటిక్ కామెడీపాత్రలంటే ఇష్టం. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల హ్యాపీగా ఉన్నాను. మంచిపాత్రలు, సినిమాలు చేసి, ప్రేక్షకులను అలరించాలన్నదే నా కల. ఇకపై తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తాను.
- 
      
                   
                                                       ఇండస్ట్రీలో విషాదం మిగిల్చిన అక్టోబరువయసు పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు తుదిశ్వాస విడువక తప్పదు. అయితే ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా సంభవిస్తున్న సెలబ్రిటీల వరస మరణాలు మాత్రం చాలా విషాదాన్ని నింపాయని చెప్పొచ్చు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు వరకు రోజుల వ్యవధిలో మరణించారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఆయా నటీనటులు ఎవరు?నటి డ్యాన్సర్ మధుమతి.. అనారోగ్య సమస్యల కారణంగా 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1960, 70ల్లో పలు సినిమాలు చేసిన ఈమె.. అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్కి డ్యాన్స్ నేర్పించింది. ఈమె అక్టోబరు 15న చనిపోయింది.మధుమతి చనిపోయిన రోజునే పంకజ్ ధీర్ అనే సీనియర్ నటుడు కూడా మృతి చెందారు. 'మహాభారతం'లో కర్ణుడిగా చేసిన ఈయన.. చాన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూశారు. 'చంద్రకాంత'లో ఈయన యాక్టింగ్ చాలా పాపులర్.నటుడు, కమెడియన్ గోవర్ధన్ అశ్రానీ(84).. ఈ అక్టోబరు 20న చనిపోయారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఈయన మరణానికి కారణం. ఈయన షోలే సినిమాలో జైలర్ పాత్ర పోషించి ఫేమ్ సొంతం చేసుకున్నారు. ఈయన యాక్టర్, కమెడియన్, దర్శకుడిగా పలు విభాగాల్లో పనిచేశారు.సింగర్ రిషభ్ టండన్.. దీపావళి పండగని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనేందుకు ఢిల్లీ వెళ్లారు. కానీ అక్టోబరు 21న గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు అయితే 35 ఏళ్లే. మరీ చిన్న వయసులో చనిపోవడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మనం చూసిన ఎన్నో యాడ్స్ సృష్టించిన పీయూష్ పాండే.. అక్టోబరు 24న కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా న్యూమోనియాతో పోరాడిన ఈయన 70 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ప్రధాని మోదీ, సచిన్ టెండూల్కర్ తదితరులు ఈయనకు సంతాపం తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.ప్రముఖ నటుడు-కమెడియన్ సతీష్ షా.. 74 ఏళ్ల వయసులో ముత్రపిండాల సమస్యతో ఇబ్బంది పడుతూ అక్టోబరు 25న మరణించారు. సరాభాయ్ vs సరాభాయ్, దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే తదితర చిత్రాలతో ఈయన చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఈ నెల 15-25వ తేదీల్లో ఏకంగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోవడం బాధాకరమైన విషయం.
- 
      
                   
                                                       జాబ్ చేస్తూ యాక్టింగ్.. కానీ 25 ఏళ్లకే తనువు చాలించిఈనెలలో బాలీవుడ్లో పలువురు సెలబ్రిటీల మరణాలు కలిచివేశాయి. వీటి నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం. 'జమత్ర' అనే వెబ్ సిరీస్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నమరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (25) తనువు చాలించాడు. ఇంట్లోనే ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రస్తుతం జమత్ర 2, అసురవన్ అనే సిరీస్లు చేస్తున్న సచిన్.. మరోవైపు విప్రో పుణె బ్రాంచ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కారణం ఏంటో తెలీదు గానీ ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇది తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు.. సచిన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ధులే సిటీకి తీసుకెళ్లారు. అలా దాదాపు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడి 24వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో తుదిశ్వాస విడిచాడు.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమున్న సచిన్.. అందుకు తగ్గట్లే ఓ వైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాలు, సిరీస్ల్లో నటిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం కూడా 'జమత్ర 2'లో తన పాత్ర గురించి పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే ఇలా ప్రాణాలు తీసుకోవడంతో సన్నిహితులు, సహ నటీనటులు షాక్ అవుతున్నారు.
- 
      
                   
                                                       ఎలక్ట్రిక్ కారు కొన్న శంకర్ మహదేవన్.. ధర ఎంతంటే?సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్ 9 ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో శంకర్ మహదేవన్.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.కారుఎంజీ ఎమ్9 మోడల్లో సీట్ మసాజ్, డ్యుయెల్ సన్రూఫ్, హీటింగ్, వైర్లెస్ చార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 548 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.సింగర్గా, సంగీత దర్శకుడిగా..శంకర్ మహదేవన్ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: కల్యాణ్ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్లో ఎవరున్నారంటే?
- 
      
                   
                                                       AI Film Hackathon: ఏఐ సినిమాలకు పోటీ..యాక్టింగ్, షూటింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్.. ఇలా అన్నీ ఏఐ (Artificial Intelligence) చూసుకుంటోంది. అవును, హీరోహీరోయిన్లతో పనే లేకుండా కేవలం ఏఐను వాడుకుని సినిమాలు తీస్తున్నారు. అలాంటి సినిమాలకు ఓ పోటీ కూడా పెట్టారు. అదే ఏఐ హాకథాన్. దేశంలో తొలిసారి ఈ ఏఐ హాకథాన్ జరుగుతోంది. ముంబైలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ హాకథాన్లో 50 మంది క్రియేటర్స్ పాల్గొననున్నారు. వీరు విడివిడిగా లేదా జట్లుగా తయారై ఏఐ టూల్స్ ఉపయోగించి షార్ట్ ఫిలింస్ రూపొందించాల్సి ఉంటుంది. పోటీ చివరిరోజు ఈ సినిమాలను ప్రదర్శించి విజేతలను ప్రకటిస్తారు. విజేతలకు రూ.10 లక్షల ప్రైజ్మనీ ఉంటుంది. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఏఐ ఈవెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి.చదవండి: 14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!
- 
      
                   
                                                       14 ఏళ్ల బంధానికి స్వస్తి! భర్తకు టాలీవుడ్ హీరోయిన్ విడాకులు!పెళ్లి అనేది మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. భార్యాభర్తలు అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా కనిపించే జంటలు కూడా చివరకు విడాకుల బాటలో పయనిస్తుండటం కొంత షాకింగ్గానే ఉంది. తాజాగా బుల్లితెర జంట జే భానుషాలి (Jay Bhanushali)- మహి విజ్ (Mahhi Vij) విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మీకెందుకు చెప్పాలి?ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారట! ముగ్గురు పిల్లల్ని పంచుకోనున్నారట! గతంలోనూ ఈ దంపతులు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. అప్పుడు మహి స్పందిస్తూ.. ఒకవేళ నిజంగా విడిపోయినా మీకెందుకు చెప్పాలి? మీరేమైనా నా చుట్టాలా? లాయర్ ఫీజు కడతారా? ఛాన్స్ దొరికిందని ఎవరినో ఒకర్ని నిందించడం తప్ప ఏమీ చేయరు అని సీరియస్ అయింది. బుల్లితెర జంటమహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్గా నటించింది. మలయాళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేసింది. వెండితెరను నమ్ముకోకుండా బుల్లితెరపైనే సెటిల్ అయిపోయింది. హిందీలో అనేక సీరియల్స్ చేసింది. జే భానుషాలి హేట్ స్టోరీ 2ల, దేసి కట్టే, ఏక్ పహేలీ లీలా సినిమాలు చేశాడు. బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు. జే భానుషాలి, మహి 2011లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ జంటగా నాచ్ బలియే సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.ఐవీఎఫ్ ప్రయత్నాలుజే.. హిందీ బిగ్బాస్ 15వ సీజన్లోనూ పాల్గొన్నాడు. సింగింగ్, డ్యాన్సింగ్ షోలకు యాంకరింగ్ చేస్తుంటాడు. జే- మహిలకు పెళ్లయిన తర్వాత చాలా ఏళ్లవరకు సంతానం కలగలేదు. దీంతో బాబు రాజ్వీర్, పాప ఖుషిలను 2017లో దత్తత తీసుకున్నారు. అప్పటికీ సంతానం కోసం ప్రయత్నించే క్రమంలో మూడుసార్లు ఐవీఎఫ్ ఫెయిలవగా నాలుగోసారికి సక్సెస్ అయింది. 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మించింది. View this post on Instagram A post shared by Mahhi Vinod Vij (@mahhivij) చదవండి: మీసాల పిల్ల.. 13 రోజులుగా ట్రెండింగ్.. ఏకంగా ఎన్ని వ్యూస్ అంటే?
- 
      
                   
                                                       సినీ ఇండస్ట్రీలో పురుషాహంకారం.. ఎన్నో పోరాటాలు చేశా!సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ విషయంలో తాను ఎన్నో పోరాటాలు చేశానని జాన్వీ కపూర్ వెల్లడించారు. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ టాక్ షోలో సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని సమస్యలపై జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. ఇక్కడికి వచ్చాకే కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే పురుషాహంకారాన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో ఎన్నో పోరాటాలు చేశాను.నలుగురు మహిళలు ఉన్న ప్రదేశంలో నా అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పగలను. అదే ప్రదేశంలో నలుగురు పురుషులు ఉంటే మాత్రం నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా చెప్పలేక పోతున్నాను. ఎందుకంటే వారు నొచ్చుకోకుండా చె ప్పాలి. ఇందుకు చాలా నేర్పు కావాలి. ఒక్కోసారి మనల్ని మనం తక్కువ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు నచ్చని విషయాలను నచ్చలేదని స్ట్రయిట్గా చెప్పకుండా నాకు అర్థం కావడం లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.కొన్నిసార్లు మౌనంగా ఉండి పోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రాజకీయాలను ఎదుర్కొన్నాను’’ అని చెప్పుకొచ్చారు జాన్వీ కపూర్. ఈ షోకు ఓ వ్యాఖ్యాతగా ఉన్న ట్వింకిల్ ఖన్నా కూడా జాన్వీ కపూర్ మాటలను స పోర్ట్ చేస్తూ, 1990 సమయంలో తాను ఈ తరహా పరిస్థితులను ఫేస్ చేశానని చె ప్పారు.
- 
      
                   
                                                       షారుక్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్బర్త్ డేకి ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేశారు షారుక్ ఖాన్. నవంబరు 2న షారుక్ 60వ బర్త్ డే. ఈ సందర్భంగా ‘షారుక్ ఖాన్ ఫిల్మ్ ఫెస్టివల్’ పేరిట షారుక్ నటించిన కొన్ని సూపర్హిట్ సినిమాలు ఈ నెల 31 నుంచి థియేటర్స్లో ప్రదర్శితం కానున్నాయి. ‘‘అక్టోబరు 31న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం అవుతుంది. ‘దిల్ సే, దేవ్దాస్, మై హూ నా, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్’... ఇలా నా కెరీర్లోని కొన్ని సూపర్హిట్ సినిమాలు థియేటర్స్లో మళ్లీ ప్రదర్శితం కానున్నాయి. ఈ సినిమాల్లోని మనిషి (తనను తాను ఉద్దేశించి) మారలేదు. జస్ట్ హెయిర్ మాత్రం మారింది.ఇంకాస్త అందంగా తయారయ్యాడు. పీవీఆర్ ఐనాక్స్ అసోసియేషన్తో భారతదేశంలోని కొన్ని థియేటర్స్లో మాత్రమే ఈ సినిమాలు ప్రదర్శితం అవుతాయి. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, యూరప్ దేశాల్లో వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిల్మ్స్) సంస్థ ఈ సినిమాలను రిలీజ్ చేస్తోంది’’ అని షారుక్ పేర్కొన్నారు. అక్టోబరు 31న ప్రారంభమయ్యే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ నవంబరు 14 వరకు కొనసాగుతుందట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో షారుక్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంతో ద్వారా కుమార్తె సుహానా నటిగా పరిచయం కానున్నారు.
- 
      
                   
                                                       బాలీవుడ్ ఎంట్రీ?తమిళ హీరో శివ కార్తికేయన్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందనే టాక్ తెరపైకొచ్చింది. ‘దేవదాస్, రామ్లీల, పద్మావత్’ వంటి సూపర్హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్కు వెళ్లొచ్చారు శివ కార్తికేయన్. దీంతో భన్సాలీతో ఈ హీరో ఓ సినిమా చేయనున్నారనే టాక్ బాలీవుడ్లో ఊపందుకుంది.మరి... భన్సాలీ దర్శకత్వంలోని సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారా? లేక శివ కార్తికేయన్ హిందీలో నటించే తొలి సినిమాకు భన్సాలీ నిర్మాతగా ఉంటారా? అనే విషయాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రణ్బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’తో బిజీగా ఉన్నారు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత శివ కార్తికేయన్తో భన్సాలీ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- 
      
                   
                                                       ఇండియాలో అవతార్ ఈవెంట్‘అవతార్’ ఫ్రాంచైజీ నుంచి రానున్న తాజా చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar: Fire And Ash). సామ్ వర్తింగ్టన్, జో సాల్డానా, సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, కేట్ విన్సె్లట్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంగా నటించగా, క్లిఫ్ కర్టిస్, డేవిడ్ థెవ్లిస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జేమ్స్ కామెరూన్, జాన్ లాండౌ నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఇంగ్లిష్తో పాటు కొన్ని భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదలవుతోంది. కాగా, ఈ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’కు సంబంధించి ఇండియాలో ఓ పెద్ద ఈవెంట్ను ప్లాన్ చేస్తారట మేకర్స్. మరోవైపు ఇండి యాలో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ సినిమా ప్రదర్శితం కానున్న థియేటర్స్లో ‘అవతార్’ ఫ్రాంచైజీ సినిమా అభిమానులు కొందరు ‘అవతార్’ సినిమా లోగోను దీపాల రూపంలో వెలిగించి, హ్యాఫీ ఫీలయ్యారు. ఇక 2009లో వచ్చిన ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్) ప్రేక్షకులను మెప్పించి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘అవతార్ 3’ రానుంది. అలాగే ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలూ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ కన్ఫార్మ్ చేసిన విషయం తెలిసిందే.
- 
      
                   
                                                       భారతీయ సినిమా వీరవిహారాలు..ఆస్ట్రేలియన్ సినిమా ఆర్తనాదాలుఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో తొలిసారిగా, స్థానిక బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ సినిమాల కలెక్షన్లను అధిగమించాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. త్వరలో వచ్చే వారం జరగనున్న ఒక ప్రధాన సినిమా పరిశ్రమ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసిన చిత్ర పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నిక్ హేస్, హిందీ, తెలుగు, తమిళం. ఇతర భారతీయ భాషలలోని చిత్రాలు అమెరికన్ బ్రిటిష్ చిత్రాల తర్వాత ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మార్కెట్గా మారాయని చెప్పారు.అవి 2021లో 32.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ సంవత్సరం అంచనా వేసిన దాని కన్నా మిన్నగా 50 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే కాలంలో, ఆస్ట్రేలియన్ చిత్రాలు ‘పేలవమైన‘ బాక్సాఫీస్ ప్రదర్శనతో 54.2 మిలియన్ డాలర్ల నుంచి ఈ సంవత్సరం 16.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని హేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంగ్లోఫోన్ మాట్లాడని చలనచిత్ర రంగం జాతీయ పరిశ్రమ కంటే ముందుకెళ్లిన మొదటి ప్రధాన ఆంగ్ల భాషా మార్కెట్ ఆస్ట్రేలియా ఇది యుకె. యుఎస్ లేదా కెనడాలో కనిపించని నిర్మాణాత్మక మైలురాయి‘ అని ఆయన అంటున్నారు. అంటే ఆంగ్లేతర చిత్రాలు ఆస్ట్రేలియాలో ఈ స్థాయి విజయం సాధించడం మరే దేశంలోనూ లేని వైచిత్రి అని ఆయన భావం.భారీ సంఖ్యలో ప్రేక్షకుల బలం, నమ్మకమైన చిత్రాల సరఫరా కమ్యూనిటీ ఆధారిత మార్కెటింగ్ భారతీయ విజయం వెనుక ఉన్నాయని డెండీ సినిమాస్, ఐకాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంబ్రెల్లా ఎంటర్టైన్మెంట్లలో సీనియర్ పాత్రలు పోషించిన హేస్ అభిప్రాయపడుతున్నారు.గత ఐదు సంవత్సరాలలో అతిపెద్ద భారతీయ హిట్లుగా హిందీ సినిమా యానిమల్(Animal Movie) 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా మరో బాలీవుడ్ మూవీ పఠాన్(Pathaan) 4.7 మిలియన్లు రాబట్టింది. అదే బాటలో జవాన్(Jawan) కూడా 4.7 మిలియన్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ అక్కడ సత్తా చాటింది. తెలుగు సినిమా పుష్ప: ది రూల్ – పార్ట్ 2 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ తర్వాతి స్థానంలోనూ మరో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ 3.6 మిలియన్లతో అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారత సినిమా సత్తా చాటినట్టు న్యూమెరో బాక్స్ ఆఫీస్ డేటా వెల్లడిస్తోంది. ‘‘ఆడియన్స్ స్పీక్ – ఇట్స్ టైమ్ వుయ్ లిజెన్’’ అనే పేరుతో వెలువరించిన ఈ నివేదిక గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్కు ముందు బహుళ మార్గాల ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సినిమాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచిస్తోంది.ఇదే పంథా కొనసాగితే... మరోఐదు సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగితే, న్యూజిలాండ్ సినిమాలు, బహుశా చైనీస్. ఫ్రెంచ్ సినిమాలు కూడా ఆస్ట్రేలియన్ సినిమాలను అధిగమించవచ్చని హేస్ విశ్వసిస్తున్నారు. ‘ఆస్ట్రేలియన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతుండగా, ప్రతి 10 సినిమా టిక్కెట్లలో ఒకటి కంటే తక్కువ ఇంగ్లీష్ కాని భాషా టైటిల్స్కు అమ్ముడవుతున్నాయి‘ అని నివేదిక చెబుతోంది. ‘శనివారం రాత్రి సిడ్నీ లేదా మెల్బోర్న్లోని ఏదైనా సినిమా థియేటర్లోకి నడిచి చూడండి, మీరు అరబిక్, తగలోగ్, హిందీ, వియత్నామీస్, మాండరిన్, గ్రీక్. లాబీలో తదితర డజను భాషలను వినవచ్చు కానీ లైట్లు మసకబారినప్పుడు, దాదాపు ప్రతి స్క్రీన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది.’’ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికీ అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వాటి మార్కెట్ వాటా 2021లో దాదాపు 95 శాతం నుంచి ఈ సంవత్సరం 91 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ‘జనాభా స్క్రీన్ వాటా మధ్య దాదాపు సమానత్వాన్ని సాధించిన ఏకైక విదేశీ భాషా రంగం భారతీయ భాష మాత్రమే‘ అని అది పేర్కొంది. ‘మాండరిన్, అరబిక్ వియత్నామీస్ జనాభా వారి జనాభాతో పోలిస్తే గణనీయమైన రీతిలో వారి స్క్రీన్ వాటా తక్కువగా కనిపిస్తోందని తేల్చింది.
- 
      
                   
                                                       శారీరక సంబంధాలు తప్పే కాదన్న హీరోయిన్స్.. షాకైన జాన్వీబాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna), కాజోల్ (Kajol) టూ మచ్ అనే టాక్ షో హోస్ట్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగానే కొన్ని విషయాల్లో కాస్త టూమచ్గా మాట్లాడేస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్లో వారి కామెంట్స్ విని హీరోయిన్ జాన్వీ కపూర్ షాకవ్వాల్సిన పరిస్థితి! ఇంతకీ ఏం జరిగింది? టూమచ్గా ఏం మాట్లాడారో చూసేద్దాం..ఎమోషనల్ చీటింగ్ పెద్ద తప్పు!'టూమచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్' షోకి జాన్వీకపూర్ (Janhvi Kapoor), కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ నలుగురు శారీరక బంధం (ఫిజికల్ రిలేషన్), ఎమోషనల్ కనెక్షన్ (ఎమోషనల్ రిలేషన్) గురించి చర్చ మొదలుపెట్టారు. ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగ్ పెద్ద ద్రోహం అని కాజోల్, ట్వింకిల్, కరణ్ ఏకాభిప్రాయానికొచ్చారు. కానీ, జాన్వీ ఎటూ తేల్చుకోలేకపోయింది. తన దృష్టిలో రెండూ తప్పేనని సమాధానమిచ్చింది. అందుకు హోస్ట్స్ ఒప్పుకోలేదు. పార్ట్నర్స్.. శారీరకంగా వేరేవారితో సంబంధం పెట్టుకోవడం అసలు మ్యాటరే కాదన్నట్లుగా మాట్లాడారు. ఆ ఎఫైర్స్ తప్పు కావుకరణ్ (Karan Johar) కూడా.. ఫిజికల్ చీటింగ్ వల్ల బంధాలేమీ కుప్పకూలవు అన్నాడు. దాన్ని జాన్వీ సమర్థించలేదు.. వేరేవారితో కనెక్షన్ పెట్టుకుంటే కచ్చితంగా రిలేషన్స్ పాడవుతాయని వాదించింది. ఎమోషనల్ చీటింగ్, ఫిజికల్ చీటింగ్.. రెండూ తప్పేనని బల్లగుద్ది చెప్పింది. అందుకు ట్వింకిల్ స్పందిస్తూ.. తనింకా 20'sలో ఉంది కదా.. ఇలాగే ఉంటదిలే.. 50 ఏళ్లు వచ్చాక మనం చెప్పేదే కరెక్ట్ అంటుంది. మనం చూసినవేవీ ఇంకా తను చూడలేదుకదా! అని కాజోల్, ట్వింకిల్ సెటైర్లు వేశారు. ఛీ, ఇలా ఉన్నారేంటి?వీరి అభిప్రాయాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియుడు లేదా భర్త ఇంకొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తే తప్పు కాదా? ఛీ, ఇలా ఉన్నారేంటి? అని తిట్టిపోస్తున్నారు. అదే సమయంలో జాన్వీ మెచ్యురిటీని అభినందిస్తున్నారు. కాగా హీరోయిన్ ట్వింకిల్కు అక్షయ్ కుమార్తో 2001లో పెళ్లయింది. అంతకంటే ముందు అక్షయ్కు రవీనా టండన్తో ఎంగేజ్మెంట్ అయంది, కానీ, అది పెళ్లివరకు రాకుండానే రద్దయిపోయింది. అలాగే శిల్పా శెట్టితోనూ ప్రేమాయణం సాగించాడు. కానీ అది సుఖాంతం కాలేదు.కొన్ని వినబడనట్లే ఉండాలి!కాజోల్ విషయానికి వస్తే.. అజయ్ దేవ్గణ్ను 1999లో పెళ్లాడింది. ఈ పెళ్లికంటే ముందు అజయ్.. కరిష్మా కపూర్తో కొంతకాలం లవ్లో ఉన్నాడు. ఆమెతో బ్రేకప్ అయ్యాక కాజోల్తో ప్రేమలో పడ్డాడు. దాదాపు 26 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. తన దాంపత్య జీవితం గురించి కాజోల్ ఓసారి మాట్లాడుతూ.. భర్త విషయంలో కొన్ని చూసీచూడనట్లుగా ఉండాలి, వినకూడనివి వినాల్సి వచ్చినా సరే.. వాటిని వెంటనే మర్చిపోవాలి. అదే నా సంసార జీవితం చక్కగా సాగేందుకు దోహదపడుతోంది అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.చదవండి: అల్లు అర్జున్ స్పెషల్ వీడియో.. రెండు లారీల థాంక్స్ చెప్పిన నాగ్
- 
      
                   
                                                       ఆశ్చర్యం.. ఐటమ్ బ్యూటీ ఇంత మోసం చేసిందా?సామాన్యులైనా సెలబ్రిటీలు అయినా సరే మనుషులే. కాబట్టి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం లాంటివి చేస్తుంటారు. ఈసారి బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ మలైకా అరోరా.. అలాంటి ఓ పొరపాటు చేసి దొరికిపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇంతకీ అసలేమైంది? ఏంటి విషయం?ఐటమ్ సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరాకు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే 'గబ్బర్ సింగ్' చిత్రంలో కెవ్వు కేక పాటలో డ్యాన్స్ చేసి ఇక్కడ కూడా క్రేజ్ సంపాదించుకుంది. చాన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన మలైకా.. ఈ మధ్యనే మళ్లీ సాంగ్స్ చేస్తోంది. రీసెంట్గా థియేటర్లలో రిలీజైన 'థామా'లోనూ ఓ క్రేజీ సాంగ్ చేసింది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా 50వ పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) సినిమా సెలబ్రిటీ.. బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం, సెలబ్రిటీలు సందడి చేయడం సాధారణమే. అయితే మలైకా తన 50వ పుట్టినరోజు అని చెప్పింది. కానీ నెటిజన్లు మాత్రం ఆమె అబద్ధం చెబుతోందని అంటున్నారు. ఎందుకంటే గతంలో 2019లో 46వ బర్త్ డేని జరుపుకొంది. అంటే ఇప్పుడు 52వ ఏడాదిలోకి వస్తుంది. కానీ విచిత్రంగా కేక్పైన 50 అని నంబర్ కనిపించింది. వికిపీడియా లేని టైంలో ఇలాంటివి ఏమైనా చేశారంటే సరేలే అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలోనూ ఇలాంటి రెండేళ్ల వయసు తగ్గించుకోవడం ఏంటోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.మలైకా విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ని 1998లో పెళ్లి చేసుకుంది. కానీ 2017లో విడాకులు ఇచ్చేసింది. వీళ్లకు అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నారు. అర్భాజ్కి విడాకులు ఇచ్చేసిన తర్వాత మలైకా.. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. ప్రస్తుతానికి సింగిల్గానే ఉంటోంది.(ఇదీ చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న 'జయం' చైల్డ్ ఆర్టిస్ట్)
- 
      
                   
                                                       పెళ్లి పేరుతో మోసం : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సంగీత దర్శకుడు, సచిన్ సంఘ్వి (Sachin Sanghvi) పై లైంగిక ఆరోపణలు సంచలనం రేపాయి. మ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని నమ్మిం,ఇ వివాహం హామీ ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.సచిన్-జిగర్ జంటలోని సంగీత దర్శకుడు, తమ్మా, స్త్రీ 2, భేదియా , జరా హట్కే, జరా బచ్కే వంటి చిత్రాలకు హిట్ పాటలతో పాపులర్ అయిన సంఘ్విని లైంగిక ఆరోపణల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే అనంతరం బెయిల్పై విడుదలైనారు. తన 20 ఏళ్ల వయస్సులో, ఫిబ్రవరి 2024లో సచిన్ సంఘ్వితో పరిచయం ఏర్పడిందని, అతను ఆమెకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనమ్యూజిక్ ఆల్బమ్లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని, వారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత ఆమెను తన స్టూడియోకు పిలిపించి, పెళ్లి ప్రపోజ్ చేశాడని, తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించిందని పోలీసు అధికారి తెలిపారు. చదవండి: వైద్యురాలిపై పోలీసుల అఘాయిత్యం, అరచేతిలో సూసైడ్ నోట్ కలకలంఇది ఇలా ఉంటే ఈ కేసులో సచిన్ సంఘ్వి తరపున వాదిస్తున్న న్యాయవాది ఆదిత్య మిథే తన క్లయింట్పై ఉన్న అన్ని ఆరోపణలను ఖండించారు. సంఘ్వీ అరెస్ట్ చట్టవిరుద్ధం అన్నారు. ఈ విషయంపై సచిన్ ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అతని అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా @soulfulsachin ఇన్యాక్టివ్గా ఉంది. అటు జిగర్ కూడా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.కాగా రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించి , దీపావళికి విడుదలైన థమ్మాకి సచిన్ అండ్ జిగర్ సంగీతం అందించారు. గత ఏడాది స్త్రీ 2 కోసం ఈ ద్వయం స్వర పర్చిన చేసిన "ఆజ్ కీ రాత్" బాగా హిట్అయిన సంగతి తెలిసిందే.చదవండి: కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
- 
      
                   
                                                       ట్రెండింగ్లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. ఒరిజినల్ సాంగ్ రిలీజ్దీంతో అది టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?చండీగఢ్కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by ACTRESS GURLEEN CHOPRA (@igurleenchopra)చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?
- 
      
                   
                                                       వారానికి రూ.3కోట్లట.. ముంబయిలో ఆదాయం..ఇప్పుడు గోవాలోనూ..!బిగ్ బ్రదర్ అనే షో పేరు ఇప్పుడు ఎంత మందికి గుర్తు ఉంటుందో కానీ బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. అప్పటి దాకా పడుతూ లేస్తూ వచ్చిన ఆమె సినీ కెరీర్ను ఆ ఇంటర్నేషనల్ షో ఒక్క చేత్తో ఆకాశానికి ఎత్తేసింది మరి. మరోచేత్తో మన మన దేశంలో జాతీయ స్థాయిలోనూ, పలు ప్రాంతీయ భాషల్లోకి సైతం బిగ్ బాస్ షోలను తెచ్చేసింది.ఆ క్రేజ్ తో కొంత కాలం పాటు సినిమాలను ఒక ఊపు ఊపిన శిల్పాశెట్టి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తెలివిడి బాగా కలిగిన సెలబ్రిటీ. అందుకే సినిమా గ్లామర్ని పాప్యులారిటీని బాగానే ఉపయోగించుకుంటూ విభిన్న రంగాల్లోకి ప్రవేశించింది. యోగా వీడియోలు, క్రీడా ఫ్రాంఛైజీలు, రెస్టారెంట్లు ఇలా కాదేదీ సంపాదనకు అనర్హం అన్నట్టుగా ఆమె దూసుకుపోతోంది. బహుశా బాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఇన్ని వ్యాపారాల్లో రాణిస్తున్న మరొక నటి లేదని చెప్పొచ్చు. అదే క్రమంలో భర్తతో కలిసి స్కామ్స్లో ఇరుక్కోవడం, పోలీసు కేసుల్ని ఎదుర్కోవడం అయినా చలించకుండా ముందుకే అడుగేయడం కూడా ఆమెకు మాత్రమే సాధ్యమైంది.ఈ నేపధ్యంలో తాజాగా శిల్పాశెట్టి తన కొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించింది. గోవాలో బాస్టియన్ కొత్త అవుట్లెట్ను శిల్పా శెట్టి ఏర్పాటు చేస్తోంది. ఈ విజయవంతమైన వ్యాపారవేత్త కూడా అయిన ’సుఖీ’ నటి గోవాలోని తన ప్రసిద్ధ రెస్టారెంట్ చైన్ బాస్టియన్ కొత్త అవుట్లెట్ కోసం గత శుక్రవారం ప్రారంభోత్సవ పూజ నిర్వహించింది. ఈ ఫొటోలను తన ఇన్స్టాలోని స్టోరీస్లో పోస్ట్ చేసింది. పూజ సందర్భంగా తెల్లటి ముద్రిత సల్వార్ కమీజ్ ధరించిన ఈ ’ధడ్కన్’ నటి ఓ యజ్ఞం చేస్తున్నట్లు కనిపించింది.ఇప్పటికే ముంబైలోని జుహులో బాస్టియన్ పేరిట ఒక రెస్టారెంట్ను ఆమె విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్ గత కొంత కాలంగా విజయవంతంగా నడుస్తోంది. ఇది వారం రోజుల్లోనే ఏకంగా రూ.2 నుంచి రూ.3కోట్ల ఆదాయం అర్జిస్తుందని అంటూ గతంలో సెలబ్రిటీల వ్యాపారాలపై మాట్లాడిన సందర్భంగా ప్రముఖ రచయిత్రి కాలమిస్ట్ శోభాడే వెల్లడించారు. అయితే అనూహ్యంగా గత సెప్టెంబర్లో, ముంబై, బాస్టియన్లోని శిల్పా ఐకానిక్ బాంద్రా రెస్టారెంట్ మూసివేయనున్నట్టు కొన్ని ఊహాగానాలు వచ్చాయి. తరువాత వారు బాస్టియన్ ను అమ్మకై అనే దక్షిణ భారత రెస్టారెంట్గా మారుస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత శిల్ప సోషల్ మీడియా ద్వారా ‘లేదు, నేను బాస్టియన్ను మూసివేయడం లేదని హామీ ఇస్తున్నాను.‘ అంటూ స్పష్టం చేసింది. ఇప్పుడు గోవాకు సైతం తమ రెస్టారెంట్ను విస్తరించడం ద్వారా అన్ని ఊహాగానాలకూ ఆమె చెక్ పెట్టింది.
- 
      
                   
                                                       ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ హీరో.. ధర ఎన్ని కోట్లంటే?బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. దాదాపు మూడు కోట్లకు పైగా విలువైన మెర్సిడెజ్ బెంజ్ను తన సొంతం చేసుకున్నారు. ముంబయిలోని బాంద్రాలో తన కొత్త కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫర్హాన్ తన భార్య శిబానీ దండేకర్తో కలిసి కనిపించారు. ఈ లగ్జరీ కారును ఇతర బాలీవుడ్ ప్రముఖులు దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, కృతి సనన్ గతంలోనే కొన్నారుఇక సినిమాల విషయానికొస్తే ఫర్హాన్ అక్తర్ 120 బహదూర్లో నటిస్తున్నారు. ఈ మూవీని రెజాంగ్ లా యుద్ధం (1962) నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం వహించారు. అమిత్ చంద్రతో కలిసి ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
- 
      
                   
                                                       డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్బాలీవుడ్లో స్వీటెస్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంట సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్. తాజాగా దీపావళి సందర్బంగా గుడ్ న్యూస్ చెప్పారు. ముంబైలోని తమ డ్రీమ్ హౌస్గురించి కొన్ని అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు.ఇటీవల తన ప్రేమమందిరం గురించి యూట్యూబ్ వ్లాగ్లో పంచుకున్న సోనాక్షి, ఇక్భాల్ జంట అందమైన ఇల్లు కుటుంబ సభ్యులతోపాటు , దబాంగ్ బ్యూటీ ,భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి తన ముంబైలోని కొత్త ఇంటిని అభిమానులకు చూపించింది. కొన్ని స్టైలిష్, రొమాంటిక్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇవి అభిమానులకు ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ జంట తమ వివాహానికి ముందే ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశామని, తన డ్రీమ్ హౌస్ పునరుద్ధరణ పనులు చేపట్టామని వెల్లడించింది. వంటగది ,లివింగ్ స్పేస్ గురించి వివరించారు ఇద్దరూ. ఈ సందర్బంగా ఇంటీరియర్ డిజైనర్ పాయల్ మక్వానా , గార్నెట్ కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు శుభ్రమైన, స్వచ్ఛమైన ప్లేస్ను ఊహించుకున్నానని సోనాక్షి అంటే, జహీర్ తనకు గట్టి ఫర్నిచర్ కావాలని "కాబట్టి ఎవరైనా దానిపై ఎప్పుడైనా నృత్యం చేయవచ్చు" అని చమత్కరించిన సంగతి తెలిసిందే.సోనాక్షి అప్కమింగ్ యాక్షన్ చిత్రం "జటాధార" నవంబర్ 7న తెలుగు, హిందీ భాషలలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీలో సోనాక్షి ఇంతకు ముందెప్పుడూ చూడని, విలక్షణమైన కొత్త అవతారంలో సూపర్ నేచురల్ విలన్గా కనిపించనుంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్లో సుధీర్ బాబు, దివ్య ఖోస్లా , శిల్పా శిరోద్కర్ కూడా నటించారు.
- 
      
                   
                                                       స్టార్ హీరోయిన్ బర్త్ డే.. విషెస్ చెప్పిన మాజీ ప్రియుడు!బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్తో అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్ కపూర్ సైతం బర్త్ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్కు రిప్లై కూడా ఇచ్చింది. ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్లో అర్జున్ కపూర్ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్కు శుభాకాంక్షలు తెలిపింది.అర్జున్ కపూర్తో డేటింగ్..మలైకా అరోరా- అర్జున్ కపూర్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్లో మాట్లాడిన అర్జున్ కపూర్.. తాను ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది సెప్టెంబర్లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్బౌండ్ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.అర్బాజ్ ఖాన్తో పెళ్లి- విడాకులు..కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు.
- 
      
                   
                                                       గోల్డెన్ క్రియేటర్ఇది పెద్ద ఘనతే. ఇన్స్టాగ్రామ్ ఇక పై ప్రతి ఏటా ఇద్దామనుకుంటున్న‘గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డు’ను 2025 సంవత్సరానికి ఇన్ఫ్లూయెన్సర్ డాలీ సింగ్కు ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా 25 మందితో తొలి జాబితా సిద్ధం చేయగా మన దేశం నుంచి డాలీ సింగ్ ఒక్కరికే చోటు దక్కింది. లక్షల ఫాలోయెర్లు ఉండటంతో పాటు స్థానిక సంస్కృతిని ప్రచారం చేయగలిగే కంటెంట్ క్రియేటర్లకే ఈ అవార్డు ఇస్తారు.డాలీ సింగ్ పరిచయండాలీ సింగ్ (32).. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు మారుమోగుతోంది. ప్రతి ఏటా ఇన్స్టాగ్రామ్ అందించే ‘గ్లోబల్ గోల్డన్ రింగ్’ అవార్డును సొంతం చేసుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీసింగ్ రికార్డు సృష్టించింది. తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతికి చాటే వారికి ఈ అవార్డు అందించాలని ఇన్స్టాగ్రామ్ ఈ అవార్డు ప్రారంభించింది. కంటెంట్ తయారీలో ఎటువంటి భయాలు, తేడాలు చూపని వారికి ఈ అవార్డును అందించనున్నట్లు ఇన్స్టా ప్రకటించింది. తొలి ఏడాదే డాలీ సింగ్ ఈ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా అందులో మన దేశం నుంచి ఆమె స్థానం పొందడం విశేషం. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె డిజిటల్ కంటెంట్ క్రియేటర్తోపాటు నటిగానూ పేరు పొందింది.ఇన్స్టాలో పాపులర్... ఆపై సినిమాల్లో...ఇన్స్టాలో పాపులర్ అయిన డాలీసింగ్ బాలీవుడ్లో నటిగా తెరంగేట్రం చేసింది. ‘డబుల్ ఎక్సెల్’ ఆమె మొదటి సినిమా. కరణ్ బూలనీ దర్శకత్వంలో వచ్చిన ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్’ సినిమాలో కీలకపాత్ర పోషించింది. ప్రస్తుతం ‘బెస్ట్ వరస్ట్ డేట్’ పేరుతో తనే సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. ఇటీవల ఇన్స్టాలో ఆ సిరీస్ మూడో సీజన్ విడుదలైంది.విజేతలకు ఇన్స్టాలో అదనపు సౌకర్యాలుడాలీ సింగ్తోపాటు గ్లోబల్ రింగ్ అవార్డు అందుకున్నవారికి ఇన్స్టా సంస్థ బంగారు రింగ్ను అందించనుంది. దీంతోపాటు ఆమె ఇన్స్టా ప్రొఫైల్లో డిజిటల్ రింగ్ కనిపించే ఏర్పాటు చేస్తోంది. వారు ఇన్ స్టోరీలు పోస్ట్ చేసే క్రమంలో వారి ప్రొఫైల్ పిక్ చుట్టూ డిజిటల్ రింగ్ కనిపిస్తుంది. ఈ రింగును గోల్డ్ కలర్లో ఉంచుకోవచ్చు. లేదా రంగులు మార్చుకోవచ్చు. తనకు ఈ పురస్కారం ప్రకటించడం నమ్మశక్యం కాని విషయమని డాలీసింగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను నిజాయితీగా చేసిన కంటెంట్ని ఇన్స్టా ప్రతినిధులు చూసి మెచ్చుకోవడం, గుర్తించడం చాలా సంతోషంగా ఉందంటున్నారు. తను మరింత ఉత్సాహంగా ముందుకు సాగేందుకు ఈ అవార్డు దోహదపడుతుందని తెలిపారు.‘రాజు కీ మమ్మీ’తో పాపులారిటీనైనిటాల్లో జన్మించిన డాలీసింగ్ ఢిల్లీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదివి ముంబై చేరుకున్నాక డిజిటల్ క్రియేటర్గా మారింది. కాని మొదట ఆమె కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. అయితే మెల్లగా వారే ఆమె కంటెంట్ చూసి తమ దృష్టి మార్చుకున్నారు. డాలీ సింగ్ మొదట ఫ్యాషన్ వీడియోలతో కెరీర్ ప్రారంభించి తర్వాత మెల్లగా స్కెచ్ వీడియోల వైపు దృష్టి సారించింది. నిత్యజీవితంలో జరిగే సరదా సంఘటనలు వీడియోల రూపంలో చూపితే ప్రేక్షకులకు నచ్చుతుందని గుర్తించింది. దీంతో వీడియోల ద్వారా కథ చెప్పే విధానాన్ని ప్రవేశపెట్టింది. అందుకు ‘రాజు కీ మమ్మీ’ పాత్ర ఆమెకు దోహదపడింది. ఆ పాత్ర ద్వారా అనేక అంశాలను సరదాగా చూపుతూ పాపులర్ అయ్యింది. ఇందులో కేవలం హాస్యమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండగలు, కుటుంబ సంబంధాల గురించి వివరిస్తుంటుంది. ఇది ఆమె ఫాలోవర్స్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు అమాయకత్వం, అయోమయం, హడావిడి కలగలిసిన దక్షిణ దిల్లీ అమ్మాయిగానూ ఆమె వీడియోలు పాపులర్ అయ్యాయి.
- 
      
                   
                                                       పండగపూట ప్రమాదం.. నా భుజం వరకు మంటలు..: బుల్లితెర నటిదీపావళి అంటేనే వెలుగుల పండగ. ఇంటి ముంగిట దీపాలు వెలిగించడంతో పాటు పలురకాల పటాసులు కాలుస్తుంటారు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హిందీ బిగ్బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటి ప్రియా మాలిక్ (Priya Malik) కూడా అందరిలాగే దీపావళిని వేడుకగా సెలబ్రేట్ చేసుకుంది. ఇరుగుపొరుగువారితో కలిసి ఫోటోలు దిగింది. ఈ సమయంలో తన వెనకున్న దీపానికి ఆమె డ్రెస్ అంటుకుంది.ఫోటోలు దిగుతుండగా..క్షణాల వ్యవధిలోనే అది పెద్ద మంటగా మారింది. కుడి భుజం దగ్గరివరకు అగ్నిరవ్వలు ఎగిసిపడ్డాయి. అది చూసిన నటి తండ్రి.. ఆమె డ్రెస్ చింపేశి ఆమెను కాపాడాడు. ఈ విషయం గురించి ప్రియ మాట్లాడుతూ.. ఈ సంఘటన తల్చుకుంటేనే భయంగా ఉంది. నేను, నా కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నాం. ఫోటోలు దిగే సమయంలో నా డ్రెస్కు నిప్పంటుకుంది. నన్ను కాపాడటం కోసం నాన్న డ్రెస్ చింపేశాడు. దానివల్లే నేను బతికిబట్టకట్టాను.నాకే ఆశ్చర్యం!చాలామంది ఏమనుకుంటారంటే.. ఇలాంటివి మనకెందుకు జరుగుతాయిలే అని లైట్ తీసుకుంటారు. కానీ చిన్న నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నాన్న హీరోలా వచ్చి కాపాడాడు. భుజాలు, వీపు, చేతివేళ్లపై కాలిన గాయాలున్నాయి. చిన్నపాటి గాయాలతో బయటపడ్డందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. సంతోషకర విషయమేంటంటే.. ఆ ప్రమాదం జరిగిన సమయంలో నా చేతిలో నా కొడుకు లేడు అని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ 9తో పాపులర్ అయిన ప్రియ మాలిక్.. 2022లో ఎంటర్ప్రెన్యూర్ కరణ్ బక్షిని పెళ్లాడింది. వీరికి 2024లో కుమారుడు జోరావర్ జన్మించాడు.చదవండి: నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీ
- 
      
                   
                                                       నేను, ఎన్టీఆర్.. ఆయన్ని నమ్మాం.. దొరికిపోయాం!: నాగవంశీవార్ 2 సినిమా (War 2 Movie)తో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14న విడుదలైంది. మూవీకి పెద్దగా బజ్ లేని సమయంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi)ఇచ్చిన స్పీచ్ బాగా వైరలైంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ చూశాక ఏమాత్రం అసంతృప్తిగా అనిపించినా పదింతలు తిట్టండి. ఒకవేళ ఇది మీకు అద్భుతమైన సినిమా అన్న ఫీలింగ్ రాకపోతే ఇంకెప్పుడూ నేను మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను.ఆస్తులమ్ముకుని దుబాయ్కు..తొలిరోజు హిందీ నెట్ వసూళ్లకంటే ఇక్కడ ఒక్క రూపాయి అయినా ఎక్కువరావాలి. తారక్ అన్న ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి అని హైప్ ఇచ్చాడు. కట్ చేస్తే సినిమా దారుణంగా ఫెయిలవడంతో నాగవంశీపై ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా రిజల్ట్ గురించి నాగవంశీ తొలిసారి స్పందించాడు. మాస్ జాతర మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆగస్టులో ఓ మీడియా నన్ను ఆడేసుకుంది. ఆస్తులమ్ముకుని దుబాయ్ వెళ్లిపోయానన్నారు. నాకర్థం కాని విషయమేంటంటే.. ఆస్తులమ్ముకునేంత దుస్థితిలో ఉంటే దుబాయ్ ఎలా వెళ్తాం? దుబాయ్ ఏమైనా పల్లెటూరా?తప్పు జరిగిందిఇకపోతే ఆరోజు(వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో) బాగా ఎగ్జయిట్ అయ్యాను. తప్పు జరిగింది.. తప్పులు చేయకుండా ఉంటామా? నేను, ఎన్టీఆర్.. ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని, యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ను నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు. వాళ్లు తప్పు చేస్తే మేము దొరికామంతే! అది నేను తీసిన సినిమా కాదు. ఆయన ఇండియాలోనే పెద్ద నిర్మాత. ఆయన్ను నమ్మాం.. మిస్ఫైర్ అయింది. దానికేం చేయగలం? ట్రోల్ చేశారు.. పడ్డాం. మనం తీసిన సినిమాకు కాకుండా బయట సినిమాకు దొరికినందుకు హ్యాపీ అన్నాడు. మాస్ జాతరరవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్లైన్. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం కావడం విశేషం! భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. చదవండి: తనూజను వదిలేశానన్న కల్యాణ్.. సంజనాను ముంచేశారు!
- 
      
                   
                                                       రష్మిక 'థామా' సినిమా.. ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా నటించిన థామా (Thamma) మొదటిరోజే భారీ కలెక్షన్స్ రాబట్టింది. హారర్ కామెడీ ఫిల్మ్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక హారర్ యూనివర్స్ను క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ థామాను తెరకెక్కించింది. అయితే, ఈ చిత్రానికి విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. కానీ దీపావళి పండుగ కారణంగా బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించగలిగింది.బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రకటించే సక్నిల్క్ ప్రకారం.. థామా చిత్రం సుమారు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది చాలా మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. ఆయుష్మాన్ కెరీర్లో ఇప్పటివరకు తన అతిపెద్ద ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా థామా రికార్డ్ క్రియేట్ చేసింది. ఛావా, పుష్ప 2 వంటి చిత్రాలతో రష్మికకు భారీ ఓపెనింగ్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి వరుసగా స్త్రీ, స్త్రీ2 బ్లాక్ బస్టర్లు కావడంతో థామాపై భారీ అంచనాలు పెరిగాయి. ఆపై దీపావళి సెలవులు ఉండటంతో భాగానే కలిసొచ్చింది.థామా సినిమాలో అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా), తడ్కా (రష్మిక) మెప్పించారు. భేడియాగా ప్రత్యేక పాత్రలో వరుణ్ ధావన్ అదరగొట్టేశాడు. ఈ మూవీ సెకడాఫ్ చాలా బాగుందని ఎక్కువగా రివ్యూస్ వచ్చాయి. మలైకా అరోరా, నోరా ఫతేహి ప్రత్యేక గీతాల్లో కనిపించి మెప్పించారు. సచిన్-జిగర్ సంగీతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
- 
      
                   
                                                       ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్బాలీవుడ్ జంట్ దీపికా పదుకొనే (Deepika Padukone), రణ్వీర్(Ranveer Singh) దివాలీ సందర్భంగా తమ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమ ముద్దుల తనయ ముఖాన్ని సోషల్ మీడియా కంటపడకుండా జాగ్రత్త పడిన దీపికా, రణ్వీర్ దంపతులు ఎట్టకేలకుల తమ గారాలపట్టి దువాను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. ముద్దుగా రెండు పిలకలు, నోట్లో వేలు, అమ్మ ఒడిలో కూర్చొని రెండు చేతులూ జోడించి దణ్నం పెట్టడం ఇలా ప్రతీ ఫోటో చాలా అందంగా ఉన్నాయి. దీంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహారాణిలా ఉంది, ఇంటర్నెట్ను బ్రేక్ చేస్తుంది అంటూ ప్రశంసిస్తున్నారు. డిటో రణవీర్, దీపికా డింపుల్స్ వచ్చేశాయి అంటూ కమెంట్స్ చేస్తున్నారు. కుమార్తె దువా దీపావళి పూజ ఫోటోలను దీపికా పంచుకోవడంపై చాలా మంది సెలబ్రిటీలు, సహనటీనటులు స్పందించారు. డార్క్ మెరూన్ కలర్ డ్రెస్సు, రెండు చిన్ని పిలకలతో పాపాయి అందంగా ఉంది అంటూ నెటిజనులు, సో క్యూట్ అంటూ హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్స్ మురిసిపోగా, దీపికా పదుకొనే కూతురు దువా ఫోటోలకు అలియా భట్ స్పందన విశేషంగా నిలిచింది. పాప ఫోటోలకు లవ్ ఎమోజీతో తన ప్రేమను ప్రకటించింది అలియా.సబ్యసాచి దుస్తుల్లో మెరిసిన యువరాణిక్లాసిక్ గ్రేస్ కు పేరుగాంచిన దీపికా పదుకొనే, కస్టమ్ క్రిమ్సన్ సబ్యసాచి డిజైన్ దుస్తుల్లో అందంగా కనిపించారు. గోల్డ్ జర్దోజీతో ఎంబ్రాయిడరీ చేయబడిన కస్టమ్ కుర్తా సెట్,మ్యాచింగ్ దుపట్టాతో పండుగ వైభవాన్ని ప్రతిబింబించేలా మెరిసారు. తన లుక్కు సరిపోయేలా, పచ్చలతో కూడిన పోల్కి చైన్ చెవిపోగులు , గాజులను ఎంపిక చేసుకున్నారు. ఇక దీపికతో పాటు, ఆచిన్న యువరాణి దువా కూడా సబ్యసాచి క్రియేషన్కు సరిపోయే చిన్న క్రిమ్సన్ కుర్తా, చేతితో తయారు చేసిన గోటా-పట్టి బార్డర్లతో ధరించింది. ఎర్రటి చిన్న బొట్టు, పిలకలో జంట తోకల సుందరిగా మెరిసింది. అలాగే రణ్వీర్ సింగ్ తెల్లటి కుర్తా సెట్లో నెహ్రూ జాకెట్,పసుపు రంగు షేడ్స్ ఉన్న అందమైన, పొడవైన బంగారు నెక్లెస్లో అందంగా కనిపించారు. కాగా దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ల లవ్ స్టోరీ సినీ అభిమానులకు తెలియందికాదు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ తమ ఇనీషియల్స్ను టాటూ కూడా వేయించుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని, వారి వారి కుటుంబాలతో హ్యాపీగా ఉన్నారు. రణబీర్, అలియాభట్ను పెళ్లి చేసుకోగా, వీరికి ఒక పాప ఉంది.
- 
      
                   
                                                       ఓటీటీలో ఒళ్లు గగుర్పొడ్చే హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?ఓటీటీల్లో హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇలాంటి చిత్రాలు చూసేందుకు ఓటీటీ ప్రియులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. 2023లో విడుదలై నేషనల్ అవార్డ్ దక్కించుకున్న హారర్ మూవీ వాష్. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. గుజరాతీలో తెరకెక్కించిన ఈ సినిమాను హిందీలోనూ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి సీక్వెల్గా వాష్ లెవెల్-2 మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజైన రెండు నెలల్లోపే డిజిటల్గా స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 22 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. గుజరాతీ భాషతో పాటు హిందీలోనూ అందుబాటులోకి రానుంది. అయితే సౌత్ భాషల్లో మాత్రం స్ట్రీమింగ్ కావడం లేదు. కాగా.. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాగ్నిక్ దర్శకత్వం వహించారు. Darr ka mahaul hai. Iss baar bachna hoga mushkil 👀 Watch Vash Level 2, out 22 October, on Netflix.#VashLevel2OnNetflix pic.twitter.com/5fIrKyBR5J— Netflix India (@NetflixIndia) October 21, 2025
- 
      
                   
                                                       చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!దీపావళి పండగ పూట బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు గోవర్ధన్ అస్రాని(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అస్త్రాని(Govardhan Asrani ) మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.గోవర్ధన్ అస్రాని 1941లో జైపుర్లోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలో జన్మించారు. తండ్రి కార్పెట్ షాప్ రన్ చేసేవాడు. ఫ్యామిలీ బిజినెస్పై అస్రానికి ఆసక్తి ఉండేది కాదు. చదువుతున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆర్టిస్ట్గా పని చేశాడు. దర్శకులు కిశోర్ సాహు, హృషికేశ్ ముఖర్జీ సలహా మేరకు పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ‘హమ్ కహా జా రహే హై’(1966) చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ‘షోలే’లోని జైలర్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. గోవర్ధన్ అస్రాని 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు.
- 
      
                   
                                                       లగ్జరీ కారు కొన్న కమెడియన్.. దివాళీ గిఫ్ట్ అంటూ పోస్ట్ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి 30 లక్షల విలువైన టయోటా కారును తనకు తానే గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. ఈ దిపావళికి సరికొత్త బహుమతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొత్త కారుతో దిగిన ఫోటోలను తన తల్లిదండ్రులతో కలిసి ఇన్స్టా స్టోరీస్లో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఇదే కారును కొనుగోలు చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఈ ఖరీదైన కారును కొన్నారు.అయితే ఈ ఏడాది ప్రారంభంలో సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్పై వివాదం మొదలైంది. ఈ వివాదం తర్వాత అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్లను తన యూట్యూబ్ నుంచి తొలగించారు. వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత సమయ్ రైనా భారత్లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 15న బెంగళూరులో మొదలైన ప్రదర్శన ముంబయి, కోల్కతా, చెన్నై, పూణే, ఢిల్లీ లాంటి నగరాల్లో తన షోలు నిర్వహించాడు.
- 
      
                   
                                                       బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Raghav Chadha (@raghavchadha88)
- 
      
                   
                                                       టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడుభారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన పలాశ్ ముచ్చల్కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు.
- 
      
                   
                                                       కచ్చా బాదం సింగర్ గుర్తున్నాడా? గుడిసెలో నుంచి కొత్తింట్లోకి!ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.పాత సామాన్లకు పల్లీలుపశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.కారు కొన్నాక యాక్సిడెంట్కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు. కొంతకాలంగా కనిపించని సింగర్చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.జీవితం మెరుగైందిజనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
- 
      
                   
                                                       కోటిన్నర విలువైన కారు కొన్న ప్రముఖ బుల్లితెర నటిప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్తో తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్బాస్లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్ను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90)
- 
      
                   
                                                       నాగార్జున లానే...మాకూ న్యాయం కావాలి అంటున్న నటీనటులుఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్ఎక్స్లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది. దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.భయపెడుతున్న ఏఐ..ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ప్లాట్ఫారమ్లలో సోషల్ మీడియా ప్రొఫైల్లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఇ–కామర్స్ సైట్లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్ఫారమ్లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వాది (షెట్టి) డీప్ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
- 
      
                   
                                                       డేట్ ఫిక్స్ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఈ చిత్రంలో రకుల్ప్రీత్ సింగ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు. కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేయనున్నట్లుగా శనివారం మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఓ సస్పెన్స్ ఎలిమెంట్తో రూపొందిన సినిమా ఇది.ఈ సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, కథను మలుపు తిప్పే పాత్రలో రకుల్ కనిపిస్తారని బాలీవుడ్ టాక్. ఇక కార్తీక్ ఆర్యన్ హీరోగా, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరోయిన్లుగా నటించిన సక్సెస్ఫుల్ మూవీ ‘పతీ పత్నీ ఔర్ వో’ (2019) సినిమాకు సీక్వెల్గా ‘పతీ పత్నీ ఔర్ వో దో’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.
- 
      
                   
                                                       ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.‘‘నాకు, ఆమిర్ ఖాన్కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్ అని కూడా షారుక్ తెలిపారు.అది సాధ్యమే: సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్.
- 
      
                   
                                                       25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న దంగల్ నటిదంగల్ ఫేమ్ జైరా వాసిం (Zaira Wasim) జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది. తాజాగా ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నిఖా జరిగినట్లు రెండు ఫోటోలను షేర్ చేసింది. అందులో తన ముఖం చూపించలేదు కానీ భర్తతో నెలవంకను చూస్తోంది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.దంగల్తో ఫేమ్16 ఏళ్ల వయసులో దంగల్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది జైరా. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో చిన్నప్పటి గీతా ఫొగట్ పాత్రలో యాక్ట్ చేసింది జైరా. ఈ మూవీకిగానూ ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. తర్వాత సీక్రెట్ సూపర్స్టార్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. సినిమాలకు గుడ్బైaఈ రెండు సినిమాలకుగానూ నేషనల్ చైల్డ్ అవార్డు గెలుచుకుంది. ఆమె నటించిన మూడో సినిమా ద స్కై ఈజ్ పింక్. ఇదే తన ఆఖరి సినిమా! తన విశ్వాసాలకు ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో సినిమా ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. సోషల్ మీడియాలో ఉన్న తన ఫొటోలను డిలీట్ చేయాలని అభిమానులను కోరింది. View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) చదవండి: ఒక్క టాస్క్కే ఏడ్చేసిన ఆయేషా.. భరణికి ఎలిమినేషన్ భయం
- 
      
                   
                                                       నువ్వు నాదానివే..!నచ్చిన డిజర్ట్ కళ్ల ముందు ఊరిస్తుంటే ఎవరికైనా నోరారా ఆరగించాలని అనిపిస్తుంది. రష్మికా మందన్నాకూ అలానే అనిపించింది. కానీ రష్మిక తినలేని పరిస్థితి. ఎందుకంటే... ప్రస్తుతం రష్మికా మందన్నా ఓ స్పెషల్ డైట్ను ఫాలో అవుతున్నారట. ఇందులో భాగంగా జిమ్లో స్పెషల్ వర్కౌట్స్ చేస్తున్నారు. అలాగే ఈ డైట్ మెనూలో రోజూ స్వీట్ తినకూడదు. దీంతో తన కళ్ల ముందు ఉన్న డిజర్ట్ను తినలేక పోతున్నానన్న బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ, ‘డియర్ డిజర్ట్... నువ్వు ఎప్పటికీ నా దానివే.కానీ ఈ రోజు కాదు’ అనే క్యాప్షన్తో ఇన్స్టాలో రష్మిక ఓ వీడియోను షేర్ చేయగా, వైరల్ అవుతోంది. ‘‘ఫిట్నెస్ కారణంగా సినిమా స్టార్స్ తమకు ఇష్టమైన ఆహారానికి దూరం కావాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్స్ మెరుపు తీగలా ఉండటం కోసం నచ్చిన ఆహారాన్ని త్యాగం చేస్తారు... ఇలాంటి త్యాగాలు తప్పవు’’ అని నెటిజన్లు స్పందిస్తున్నారు.ఇక రష్మికా మందన్నా నటించిన హిందీ చిత్రం ‘థామా’ ఈ నెల 24న విడుదల కానుంది. అలాగే రష్మిక లీడ్ రోల్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ నవంబరు 7న రిలీజ్ కానుంది. అలాగే ‘మైసా’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, హిందీలో ‘కాక్టైల్ 2’తో పాటు మరో రెండు సినిమాలతో రష్మిక ఎప్పటిలానే బిజీ బిజీ.
- 
      
                   
                                                       నేరుగా ఓటీటీకే సూపర్ నేచురల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. ఆడియన్స్ సైతం డిజిటల్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మరో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. మానవ్ కౌల్, భాషా సుంబ్లి నటించిన ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ పంచుకున్నారు. ఈ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. కశ్మీర్లోని బారాముల్లా లోయ ప్రాంతానికి చెందిన డిఎస్పీ రిద్వాన్ సయ్యద్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రిద్వాన్ బదిలీపై వచ్చిన వెంటనే ఓ యువకుడు అదృశ్యమవుతాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేదే బారాముల్లా కథ. ఈ చిత్రాన్ని బీ62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య, లోకేష్ ధార్తో కలిసి జ్యోతి దేశ్పాండే నిర్మించారు. Welcome to the town, where truth is a myth, and myths have truth. Enter the world of ‘Baramulla’ on 7th November. Only on Netflix.#BaramullaOnNetflix pic.twitter.com/pB7swLUIYm— Netflix India (@NetflixIndia) October 17, 2025
- 
      
                   
                                                       పన్నెండు వేల కోట్లకు అధిపతివి.. పాన్ మసాలా అమ్ముకునే ఖర్మేంటి?గత కొంత కాలంగా పలువురు యూట్యూబర్లు తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. చేతిలో చానెల్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వీడియోలు చేసేసి జనం మీదకు వదులుతున్నారని వీరిపై అనేక మంది మండిపడుతున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొందరు విశ్లేషణాత్మక, ఆలోచింపజేసే వీడియోలను చేస్తూ ఆసక్తిని కలిగిస్తున్నారు. అలాంటిదే ఒక తాజా వీడియో ని యూ ట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేశాడు. తన వీడియో ద్వారా కనీస సామాజిక బాధ్యత లేకుండా డబ్బే పరమావధిగా ప్రకటనల్లో నటించేందుకు తెగబడుతున్న సెలబ్రిటీలు అందరికీ రాథీ వాతపెట్టాడు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అని తేడా లేకుండా సెలబ్రిటీలు తమ పాప్యులారిటీని పైసల కోసం ఎడాపెడా వాడుకుంటున్న నేపధ్యంలో ఈ వీడియో అనేకమందిని ఆకర్షించింది.హాలీవుడ్ స్టార్స్ని దాటేసిన షారూఖ్షారూఖ్ ఖాన్ కు నా ప్రశ్న‘ పేరుతో భారతీయ యూట్యూబర్ థృవ్ రాథీ విడుదల చేసిన ఇటీవలి వీడియో లో చెప్పిన ప్రకారం... బాలీవుడ్ మెగా స్టార్ షారుఖ్ ఖాన్ అధికారికంగా బిలియనీర్ ట్యాగ్ని అందుకున్నారు, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ఈ నటుడి నికర విలువను 1.4 బిలియన్ డాలర్లుగా లెక్కించింది. ఈ నేపధ్యంలో ఈ బాలీవుడ్ స్టార్ నికర విలువ, సంపదల విషయంలో టామ్ క్రూజ్ ది రాక్ (డ్వేన్ జాన్సన్) వంటి టాప్ హాలీవుడ్ నటులను సైతం అధిగమించిట్టు వెల్లడించింది. ప్రస్తుతం షారూఖ్ ఆస్తుల విలువ అక్షరాలా.. దాదాపు రూ. 12,400 కోట్లు. మీరు విన్నది నిజమే ‘షారూఖ్ ఖాన్ ఇప్పుడు బిలియనీర్ అయ్యాడు. వార్తా నివేదికల ప్రకారం, ఆయన నికర విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే రూ. 12,400 కోట్లకు పెరిగింది‘ అని రాతీ చెప్పారు. ‘అది ఎంత డబ్బో మీకు తెలుసా? అబ్బో మనం ఊహించడం కూడా కష్టం,‘ అని అతను నొక్కి చెప్పాడు.కూర్చుని తిన్నా తరగనంత...పన్నులు వడ్డీ రేట్లు తీసివేసిన తర్వాత , ప్రతిరోజూ ఫస్ట్ క్లాస్లో ప్రయాణించి, అత్యంత ఖరీదైన హోటళ్లలో జవాన్ నటుడు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ కూడా, అతను తన మొత్తం నికర విలువలో దాదాపు రూ. 400–500 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తాడని రాథీ వీడియోలో విశ్లేషించాడు. ఈ నేపధ్యంలో ‘షారూఖ్ ఖాన్కి నా ప్రశ్న, మీకు ఈ డబ్బు సరిపోలేదా? అది సరిపోతే, మీరు ఇంకా పాన్ మసాలా వంటి హానికరమైనదాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? మీరు ఇంకా ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు?‘అంటూ రాథీ బాలీవుడ్ మెగాస్టార్ షారూఖ్ ఖాన్ కి సూటిగా ప్రశ్నిస్తున్నాడు.గత 2014లో పాన్ మసాలా బ్రాండ్ కోసం ఖాన్ వసూలు చేసిన ఎండార్స్మెంట్ రుసుము గురించి కూడా రాథీ చర్చించాడు ‘‘మీకు నిజంగా ఈ అదనపు రూ. 100–200 కోట్లు అవసరమా?‘ అని నిలదీశాడు‘ దాని గురించి మరొక విధంగా ఆలోచించండి: దేశంలోని అగ్ర నటుడు ఈ హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయడాన్ని ఆపివేస్తే, అది దేశంపై ఎంతటి మంచి ప్రభావం చూపుతుంది?‘ అంటూ ఆలోచించమని కోరాడు. అంతేకాదు ఆ వీడియోను సదరు సూపర్స్టార్కి చేరేలా ప్రచారం చేయమని ప్రేక్షకులను కోరడం ద్వారా అతను వీడియోను ముగించాడు.గత కొంతకాలంగా తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సహా అనేక రకాలైన సమాజ వ్యతిరేక ప్రచారాల్లో పాల్గొంటూ విమర్శలకు గురవుతున్నారు. కొన్ని వందల కోట్లకు అధిపతి అయిన టాలీవుడ్ హీరో బాలకృష్ణ సైతం ఓ మద్యం బ్రాండ్ కు ప్రచారం చేయడం తీవ్రమైన విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రతీ సెలబ్రిటీని, సినీ అభిమానిని ఆలోచింపజేసేలా థృవ్ రాథీ వీడియో ఉందనేది నిస్సందేహం.My question to Shah Rukh Khan.@iamsrk pic.twitter.com/MZjCbsIkjx— Dhruv Rathee (@dhruv_rathee) October 15, 2025
- 
      
                   
                                                       వెండితెరపై సినీ జీవితంసైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్లో రజనీకాంత్, కమల్హాసన్లు గెస్ట్ రోల్స్లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్పై ఉంది.ఆమిర్ లేదా రణ్బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్గారి బయోపిక్లో రణ్బీర్ కపూర్ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్గారి బయోపిక్లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్బీర్ కపూర్ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్లో రణ్బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్గా వెండితెరపై రణ్బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్గా కిశోర్ కుమార్ బయోపిక్లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు
- 
      
                   
                                                       నాకిప్పుడు 16 నెలల ప్రెగ్నెన్సీ.. రూమర్స్పై స్పందించిన సోనాక్షి సిన్హా!బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది. ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ కూడా కీ రోల్ ప్లే చేయనుంది.ఈ సినిమా సంగతి పక్కనపెడితే.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్లో కనిపించి సందడి చేసింది. దీంతో సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.అయితే తాజాగా తన ప్రెగ్నెన్సీపై వస్తున్నా వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. మానవ చరిత్రలోనే ప్రెగ్నెన్సీలో ప్రపంచ రికార్డ్ అని పోస్ట్ చేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇప్పటికీ నేను 16 నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది. తమపై వస్తున్న వార్తలపై మా స్పందన ఇలానే ఉంటుందని సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. గత కొన్ని నెలలుగా సోనాక్షి ఎక్కడా కనిపించినా ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ రియాక్ట్ అయింది. కాగా.. సోనాక్షి సిన్హా.. జూన్ 2024లో జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona)
- 
      
                   
                                                       ముంబైలో ల్యాండ్ కొన్న సోనూసూద్.. ధర ఎంతంటే?విలక్షణ నటుడు సోనూసూద్ (Sonu Sood) ప్లాట్ కొనుగోలు చేశాడు. కుమారుడు ఇషాన్తో కలిసి ముంబై పన్వేల్లోని 777 చదరపు గజాల భూమిని తన సొంతం చేసుకున్నాడు. దీనికోసం రూ.1.09 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు, స్టాంప్డ్యూటీ కింద రూ. 6.3 లక్షలు చెల్లించాడు. ముంబై-పుణె మార్గంలో పన్వేల్ ప్రాంతం ఉంది. పన్వేల్లో ఐటీ సంస్థలు, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రాబోతున్నాయి.ఇటీవలే అపార్ట్మెంట్ కొనుగోలుముంబై రెండో అంతర్జాతీయ విమానాశ్రయం (Navi Mumbai International Airport) కూడా మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. కాగా సోనూసూద్ కుమారుడు ఇషాన్.. ఇటీవల ఆగస్టులో సైతం ముంబైలోని అంధేరి వెస్ట్లో ఓ అపార్ట్మెంట్ కొన్నాడు. దీనికోసం రూ. 2.6 కోట్లు ఖర్చు చేశాడు. అదే నెలలో సోనూసూద్.. ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో తన అపార్ట్మెంట్ను రూ.8.10 కోట్లకు అమ్మేశాడు. దీన్ని 2012లో రూ.5 కోట్లకు కొనుగోలు చేయగా దాదాపు 13 ఏళ్ల తర్వాత 8 కోట్లకు అమ్మేశాడు.సినిమాసినిమాల విషయానికి వస్తే.. సోనూసూద్ చివరగా ఫతే సినిమాలో నటించాడు. స్వీయదర్శకత్వంతో పాటు సోనూసూద్ హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఇతడు పుష్కరకాలం క్రితం నటించిన తమిళ మూవీ మదజగరాజ మాత్రం జనవరిలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది.చదవండి: కొత్తింట్లోకి యాంకర్ లాస్య.. ఘనంగా గృహప్రవేశం
- 
      
                   
                                                       ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయట్లేదు. 2023లో రాజకీయ నాయకుడితో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. మెల్లమెల్లగా సినిమాలు చేయడం తగ్గించింది. గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించింది. ప్రస్తుతం కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్లో నటించింది.సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలోనే హీరోయిన్ పరిణితి చోప్రా బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలోనే పరిణీతికి మరో స్టార్ హీరోయిన్ గిఫ్ట్ను పంపి సర్ప్రైజ్ ఇచ్చింది. డెలివరీకి ముందే పుట్టబోయే బిడ్డ కోసం బహుమతి పంపిన విషయాన్ని పరిణీతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.(ఇది చదవండి: అలాంటి డ్రెస్లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!) మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్న పరిణీతి చోప్రాకు స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) సర్ప్రైజ్ ఇచ్చింది. తన సొంత బ్రాండ్ అయిన ఎడ్-ఎ-మమ్మా నుంచి సరికొత్త హ్యాంపర్ను గిఫ్ట్గా పంపింది. ఆలియా భట్ బహుమతిపై పరిణీతి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది. తన బిడ్డకోసం గిఫ్ట్ పంపినందుకు ధన్యావాదాలు తెలిపింది. కాగా.. పరిణితి చోప్రా ఇటీవలే ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కనిపించింది. ఆ తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకుంది.అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
- 
      
                   
                                                       సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ ధీర్(Pankaj Dheer) ( 68) ఇవాళ కన్నుమూశారు. కొన్నేళ్ల పాటు క్యాన్సర్తో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే క్యాన్సర్కు పలుసార్లు శస్త్ర చికిత్స జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పంకజ్ మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ముంబయిలోని విలే పార్లేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఇది చదవండి: తొలి తెలుగు సింగర్ ఇక లేరు)కాగా.. పంకజ్ ధీర్ నవంబర్ 9.. 1956న పంజాబ్లో జన్మించారు. 1980 ప్రారంభంలో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బాలీవుడ్లో బుల్లితెరతో పాటు సినిమాల్లో నటించారు. బీఆర్ చోప్రా తెరకెక్కించిన మహాభారత్ సీరియల్లో కర్ణుడి పాత్రలో మెప్పించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. మహాభారతంతో పాటు చంద్రకాంత(1994–1996), ది గ్రేట్ మరాఠా, ససురల్ సిమర్ కా లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా సడక్, బాద్షా, సోల్జర్ వంటి చిత్రాలలో కూడా కనిపించారు.అయితే అనితా ధీర్ను పంకజ్ వివాహం చేసుకున్నాడు. వీరికి నికితిన్ ధీర్ అనే కుమారుడు ఉన్నాడు. అతను కూడా నటనలో రాణిస్తున్నారు. ఆయన కుమారుడు నికితిన్ బుల్లితెర నటి క్రతికా సెంగర్ను వివాహం చేసుకున్నాడు. అతను తన తండ్రి పంకజ్ ధీర్తో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. Actor Pankaj Dheer, played Karn in Mahabharat, Passed Away. Om Shanti🙏#pankajdheer pic.twitter.com/uJSTFoOb4b— Sumit Kadel (@SumitkadeI) October 15, 2025
- 
      
                   
                                                       అలాంటి డ్రెస్లో సోనాక్షి.. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసినట్టేనా!బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధర మూవీలో కీలక పాత్రలో కనిపిచంనుంది. ఇటీవలే సోనాక్షి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. స్పెషల్ సాంగ్ను సైతం విడుదల చేశారు. ధన పిశాచి పేరుతో విడుదలైన పాట ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ మూవీలో సోనాక్షి విలన్ లాంటి పాత్రలో కనిపించనుంది. టీజర్లోనూ సోనాక్షి లుక్స్ అభిమానులను అలరించాయి.అయితే సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ గతేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ముంబయిలో జరిగిన వెడ్డింగ్ వేడుకలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. అయితే గత కొన్ని రోజులుగా సోనాక్షి ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరు జంటగా ఓ ఈవెంట్లో కనిపించారు. ఇందులో సోనాక్షి వదులుగా ఉండే అనార్కలి సూట్లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సోనాక్షి గర్భవతి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆమె ఫేస్ చూస్తుంటే ఈ వార్త నిజమేనని అనిపిస్తోందని ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. ఫోటోలకు పోజులిచ్చే సమయంలో సోనాక్షి తన చేతితో బేబీ బంప్ను దాచేందుకు ప్రయత్నించిందని మరికొందరు పోస్టులు పెట్టారు.అయితే ప్రెగ్నెన్సీ రూమర్స్పై సోనాక్షి, జహీర్ ఎలాంటి ప్రకటనైతే చేయలేదు. ఈ ఏడాది జూలైలోనూ సోనాక్షి తాను ఎప్పుడూ గర్భవతి అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారో వెల్లడించింది. జహీర్తో తన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను కూడా పంచుకుంది. అయితే జహీర్తో పెళ్లి తర్వాత సోనాక్షిని నెట్టింట తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
- 
      
                   
                                                       అశ్లీల సన్నివేశం.. నిజ జీవితంలోనూ అంతేనని ముద్ర.. ఎంతో ఏడ్చా!హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఐటం గర్ల్గా పలు సినిమాలు చేసింది దీప్షిక నగ్పాల్ (Deepshikha Nagpal). షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన 'కోయిల' మూవీ (Koyla Movie)లో ఓ అభ్యంతకర సన్నివేశంలో యాక్ట్ చేసింది. అందులో దుస్తులు తొలగిస్తున్నట్లుగా కనిపించినప్పటికీ.. అది నిజం కాదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కోయిల మూవీ డైరెక్టర్ రాకేశ్ సర్ నాకు ఆ సన్నివేశం గురించి ముందే చెప్పారు. నా తల్లి ఎదురుగానే సీన్ వివరించారు. సరే, షూటింగ్ ఎప్పుడు? అని ఎటువంటి బెరుకు లేకుండా అడిగాను.డ్రెస్ ధరించే సీన్ కంప్లీట్ చేశానేను చెప్పింది అంతా గుర్తుందిగా? అని ఆయన మరోసారి క్రాస్చెక్ చేసుకున్నారు. గుర్తుందని బదులిస్తూనే మీరేం భయపడవద్దని ధైర్యం చెప్పాను. కెమెరాను నా ఎదురుగా కాకుండా టాప్ యాంగిల్లో పెట్టమన్నాను. కేవలం నా భుజాల వరకే కనిపించేలా జాగ్రత్తపడ్డాను. నేను డ్రెస్ తీసేస్తున్నట్లుగా మీకు కనిపించింది కానీ, మినీ టాప్, అలాగే జీన్స్ నా ఒంటిపై అలాగే ఉన్నాయి. బట్టలు ధరించే ఎంతో సులువుగా ఆ సీన్ పూర్తి చేశాం. కానీ సినిమా రిలీజయ్యాక ఆ సీన్ ఎంతో వివాదాస్పదమైంది. హేళన చేశారుకెమెరా ముందు దుస్తులు తొలగించావా? అని నా అనుకున్నవాళ్లే నన్ను దారుణంగా విమర్శించారు. ఆ మాటలకు ఎన్నోసార్లు ఏడ్చాను. ఒకసారి నా కూతురు కోయిల సినిమా సీడీని కోపంతో విరిచేసింది కూడా! సినిమాల్లోలాగే నిజ జీవితంలో కూడా నేను అలాగే చేస్తానని నా క్యారెక్టర్ను తప్పుపట్టారు. నా పిల్లలు కూడా నన్ను గౌరవించరని హేళన చేశారు అని చెప్తూ ఎమోషనలైంది. ఒకప్పుడు సినిమాలు చేసిన దీప్షిక.. ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఈమెకు రెండు పెళ్లిళ్లవగా రెండుసార్లు విడాకులయ్యాయి. హిందీ బిగ్బాస్ 8వ సీజన్లో పాల్గొనగా మూడు వారాల్లోనే ఎలిమినేట్ అయింది.చదవండి: బాయ్ఫ్రెండ్ ఉన్నాడు, కానీ పెళ్లి చేసుకోను: ఫ్లోరా సైనీ
- 
      
                   
                                                       రకుల్ ప్రీత్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. ట్రైలర్ వచ్చేసిందిఅజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, టబు లీడ్ రోల్స్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే’. అకివ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ 2019లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా దే దే ప్యార్ దే 2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో మరోసారి రకుల్, అజయ్ కనిపించనుండగా.. టబు మాత్రం నటించడం లేదు. అయితే సీక్వెల్కు అన్షుల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అజయ్ దేవగణ్, రకుల్ మధ్య కామెడీ సీన్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. మీ బాయ్ఫ్రెండ్ వయస్సు.. మీ నాన్న వయసంత ఉంటే.. అంటూ ట్రైలర్ను పోస్ట్ చేసింగి రకుల్ ప్రీత్ సింగ్. కాగా.. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, మీజాన్ జాఫ్రీ, ఇషితా దత్తా, గౌతమి కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం చిల్ర్డన్స్ డే సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి లవ్ రంజన్ కథను అందించడంతో పాటు టి-సిరీస్ భూషణ్ కుమార్తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించారు.When your BF is your dad’s age and not yours, you know it’s time for a #PyaarVsParivaar showdown! 🥊#DeDePyaarDe2 Trailer out now 👇https://t.co/y9YQB8wFLmReleasing In cinemas Nov 14 🎟️@ajaydevgn @ActorMadhavan #MeezaanJafri @anshul3112 @luv_ranjan @gargankur #TarunJain… pic.twitter.com/WoFj2WHp21— Rakul Singh (@Rakulpreet) October 14, 2025
- 
      
                   
                                                       'నా కూతురిని ఒకరి భార్యగా పెంచలేదన్నాడు'.. సుస్మితా సేన్బాలీవుడ్ భామ సుస్మితా సేన్ పరిచయం అక్కర్లేని పేరు. తనకు 18 ఏళ్ల వయసులోనే విశ్వసుందరిగా ఘనతను సొంతం చేసుకుంది. తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుస్మితా సేన్.. బాలీవుడ్, టాలీవుడ్లోనూ నటించింది. తెలుగులో నాగార్జునతో కలిసి 'రక్షకుడు' అనే సినిమాలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది.అయితే స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుస్మితా సేన్ తన వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. పలువురితో డేటింగ్ చేసిన ఆమె..ఏ ఒక్కరిని పెళ్లాడలేదు. ఆమె రిలేషన్స్ మున్నాళ్ల ముచ్చటగానే మారాయి. ప్రేమాయణం కొనసాగించడం.. కొన్నేళ్లకు బ్రేకప్ ఆమె లైఫలో సర్వసాధారణంగా మారిపోయింది.ఇద్దరు పిల్లలకు తల్లిగా..అయితే సుస్మితా సేన్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది. 24వ ఏట రీనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకుంది. తన తల్లిదండ్రుల మద్దతుతో కొన్నాళ్లకు ఇంకో బిడ్డ (అలీసా)నూ దత్తత తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుస్మితా సేన్ పిల్లలను దత్తత తీసుకోవడంలో ఎదురైన ఇబ్బందులను పంచుకుంది. తన తండ్రి సుబీర్ సేన్ తిరుగులేని మద్దతువల్లే ఇది సాధ్యమైందని తెలిపింది. 2000 సంవత్సరంలో రెనీని దత్తత తీసుకున్నప్పుడు జరిగిన సంఘటలను పంచుకుంది. ఒంటరి మహిళలు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకోవడాన్ని జువెనైల్ జస్టిస్ చట్టాలు ఎప్పుడు నిషేధించలేదని వెల్లడించింది.సుస్మితా మాట్లాడుతూ.. 21 ఏళ్ల వయసులో చట్టబద్ధంగా ఏం చేయాలో నాకు తెలుసు. రెనీ కోసం చట్టపరమైన పోరాటం చేసే సమయంలో నాలో ఆందోళన మొదలైంది. రెనీ విషయంలో కుటుంబ కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే.. వారు బిడ్డను తిరిగి తీసుకుంటారు. అప్పటికే రెనీ నన్ను అమ్మా అని పిలవడం ప్రారంభించింది. అప్పు నాకు ఓ ఐడియా వచ్చింది. పాపను తీసుకుని కారులో నువ్వు పారిపో అని నాన్నతో చెప్పాను. మనం అలాంటి పని చేయకూడదు. కానీ బిడ్డను మా నుంచి ఎవరు తీసుకోలేరని గట్టిగా అనుకున్నాం."అని అన్నారు. అయితే ఈ కేసు మాకు అనుకూలంగా రావడంతో తన తండ్రి పెద్ద పాత్ర పోషించారని పంచుకుంది. నా తండ్రి వల్లే నాకిప్పుడు పిల్లలు ఉన్నారు.. నా బిడ్డను పోషించడానికి కోర్ట్ చెప్పినట్లుగా సగం ఆస్తిని రెనీ పేరిట రాసిచ్చారని తెలిపింది.ఆ సమయంలో న్యాయమూర్తి తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ను ప్రస్తావించింది. మంచి కుటుంబంలోని అబ్బాయి ఎవరూ కూడా నన్ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడరని న్యాయమూర్తి నా తండ్రిని కూడా హెచ్చరించారని వివరించింది. నేను ఆమెను ఎవరి భార్యగా పెంచలేదని నాన్న జడ్జితో చెప్పారని వెల్లడించింది. ఆ తీర్పే నా జీవితాన్ని మార్చేసిందని సుస్మితా సేన్ తెలిపింది. కాగా.. సుస్మితా సేన్ 1975 నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించింది.
- 
      
                   
                                                       బిడ్డకు పాలు పట్టి.. షూటింగ్కి వెళ్లా.. ఎవరూ అలా చెప్పరు: నటిఏ రంగంలో అయినా మహిళలు రాణించాలంటే.. చాలా త్యాగాలు చేయాల్సిందే. ఒకవైపు ఫ్యామిలీ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు ఎంచుకున్న రంగంపై ఫోకస్ చేయాలి. ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ ఆ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకోలేరు. చిత్రపరిశ్రమలో ఆ కష్టాలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. ఫ్యామిలీ బాధ్యతతో పాటు వేధింపులను, ఒత్తిడిని తట్టుకొని నిలబడితేనే ‘స్టార్’ హోదా పొందుతారు. అలాంటి కష్టాలను ఎన్నో భరించే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ(Rani Mukerji). ఇటీవలే ఉత్తమన నటిగా జాతీయ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ ప్రారంభంలో తకు ఎదురైన ఇబ్బందుల గురించి వివరించింది.‘ఇండస్ట్రీలోకి రావడానికి చాలా పోరాటాలే చేయాల్సి వచ్చింది. నేను ఇండస్ట్రీలోకి రావడం మా పెరెంట్స్కి ఇష్టమే లేదు. బలవంతంగా ఒప్పుకున్నారు. వారి పేరు చెడగొట్టకూడనే ఉద్దేశ్యంతో నేను కమిట్మెంట్తో పని చేశాను. నేను నటించిన ‘హిచ్కీ’ సినిమా షూటింగ్ సమయంలో నా కుమార్తె అదిరాకి కేవలం 14 నెలల వయసు మాత్రమే. అప్పటికీ పాలు పడుతున్నా. ఉదయం ఆరున్నర గంటలకు పాలు పట్టించి.. షూటింగ్కి వెళ్లేదాన్ని. ఒంటి గంటలోపు నా పార్ట్ పూర్తి చేసుకొని తిరిగి నా బిడ్డకు పాలు ఇవ్వడానికి ఇంటికి వచ్చేదాన్ని. రోజుకు 6-7 గంటలు షూటింగ్ చేసి.. ఇంటికి వెళ్లేదాన్ని. మా దర్శకుడితో పాటు యూనిట్ అంతా నాకు సపోర్ట్ చేసేది. ఈ సినిమా మొత్తం అలానే పూర్తి చేశా. ఇప్పుడు పని గంటల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. నిర్మాతకు, దర్శకుడికి ఓకే అయితే సినిమా చేయాలి. లేదంటే ఆ సినిమా మానేయాలి. అది మన చేతుల్లో ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమా చేయాల్సిందే అని ఎవరు చెప్పరు’ అని రాణి ముఖర్జీ అన్నారు. ఇక జాతీయ అవార్డు గురించి మాట్లాడుతూ.. ‘నటీనటులుకు చిన్న పురస్కారం కూడా చాలా గొప్పదే. అయితే ఏ అవార్డు అయినా.. అర్హత గలవారికి వచ్చిందని ప్రేక్షకులు భావించాలి. నాకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అందరూ అంగీకరించారు. అలా అందరూ అంగీకారం తెలపడం నాకు అవార్డు కంటే చాలా గొప్పగా అనిపించింది’ అన్నారు.
- 
      
                   
                                                       ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్ఫామ్లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025
- 
      
                   
                                                       51 ఏళ్ల వయసులోనూ ఐటమ్ సాంగ్.. వీడియో రిలీజ్రష్మిక హీరోయిన్గా చేస్తున్న లేటెస్ట్ హిందీ సినిమా 'థామా'. 'స్త్రీ' యూనివర్స్ నుంచి వస్తున్న కొత్త మూవీ ఇది. అక్టోబరు 21న హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రంలో పాటలు మాత్రం ప్రతిదీ ఐటమ్ సాంగే అనిపిస్తుంది. తాజాగా రిలీజైన సాంగ్లో అయితే 51 ఏళ్ల బ్యూటీ అదిరిపోయే స్టెప్పులేయడం విశేషం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)'థామా' నుంచి తాజాగా 'పా*యిజన్ బేబీ' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కూడా పార్టీ నేపథ్యంగా సాగే గీతం అర్థమవుతోంది. తొలుత మలైకా అరోరా గ్లామరస్గా కనిపిస్తూ స్టెప్పులేయగా, చివరలో రష్మిక కూడా మలైకతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇదే కాదు గతంలో 'దిల్బర్' అంటూ సాగే మరో పాట రిలీజ్ చేశారు. ఇందులో నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఇది ఐటమ్ సాంగ్. అంతకుముందు రష్మిక పాట కూడా చూడటానికి ఐటమ్ సాంగ్లానే అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాలో కామెడీతో పాటు ఐటమ్ గీతాలు చాలానే ఉన్నాయి!(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్స్ కృతి శెట్టి, కల్యాణి బెల్లీ డ్యాన్స్.. వీడియో సాంగ్ రిలీజ్)
- 
      
                   
                                                       సినిమాల్లో బోల్డ్ సీన్స్.. ఆ విషయంలో భయపడ్డా..: హీరోయిన్బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పంజాబీ ముద్దుగుమ్మ సోనమ్ బజ్వా. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సోనమ్.. బాలీవుడ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఇంటిమేట్ సీన్స్ చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.బాలీవుడ్లో తాను చాలా సినిమాలు తిరస్కరించినట్లు సోనమ్ బజ్వా తెలిపింది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్, ముద్దు సన్నివేశాలకు నో చెప్పానని వెల్లడించింది. అయితే ఆ అవకాశాలు వదిలేసుకున్నందుకు తానిప్పుడు చింతిస్తున్నట్లు పేర్కొంది. తన సొంత రాష్ట్ర పంజాబ్లో ప్రజలు, తమ కుటుంబం ఆ సీన్స్ చూస్తే ఎలా స్పందిస్తారోనని భయపడ్డానని రివీల్ చేసింది.సోనమ్ మాట్లాడుతూ..'బాలీవుడ్లో చాలా సినిమాలకు నేను నో చెప్పాను. ఎందుకంటే తన సొంత రాష్ట్రం పంజాబ్ ఇలాంటి వాటిని అంగీకరిస్తుందా భయపడ్డాను. మా కుటుంబాల మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే అప్పట్లో సినిమాల్లో ముద్దు సన్నివేశం చేయడానికి చాలా భయపడ్డాను. నన్ను అలా చూస్తే ప్రజలు ఎలా స్పందిస్తారు? నన్ను నేనుగా మార్చిన వ్యక్తులు ఏమనుకుంటారు? ఇదంతా సినిమా కోసమేనని నా కుటుంబం అర్థం చేసుకుంటుందా?' అని నా మనసులో నేనే బాధపడ్డా' అని పంచుకుంది.అయితే తన తల్లిదండ్రుల మద్దతు ఇచ్చారని సోనమ్ వెల్లడించింది. ఈ రెండేళ్ల క్రిత దాని గురించి మా అమ్మానాన్నలతో మాట్లాడా.. అది కేవలం సినిమా కోసం అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అది నేను కూడా షాక్ అయ్యా.. ఈ విషయం గురించి మొదట వారితో ఎందుకు మాట్లాడలేదని బాధపడ్డా.. దీని గురించి నా తల్లిదండ్రులతో చర్చించడానికి చాలా సిగ్గుపడ్డానని తెలిపింది.ఇక సోనమ్ కెరీర్ విషయానికొస్తే 2013లో బెస్ట్ ఆఫ్ లక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పంజాబ్ 1984 మూవీతో ఫేమ్ తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా నిక్కా జైల్దార్, క్యారీ ఆన్ జట్టా 2, అర్దాబ్ ముతియారన్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేశ్ హీరోగా బాబు బంగారం, సుశాంత్ నటించిన ఆటాడుకుందాం రా చిత్రంలో కనిపించింది. 2019లో బాలా మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత స్ట్రీట్ డాన్సర్ 3డీ, హౌస్ఫుల్ 5 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఏక్ దీవానే కి దీవానియాత్తో పాటు టైగర్ ష్రాఫ్తో బాఘి 4లో కనిపించినుంది.
- 
      
                   
                                                       సాయంత్రం 6 గంటలకే వచ్చాడుగా ఏమైంది? మురుగకి సల్మాన్ కౌంటర్ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు.. స్టార్ హీరోల గురించి, సినిమాల ఫెయిల్యూర్స్ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మాత్రం అసందర్భంగా ఇలాంటి విషయాలు బయటపడుతుంటాయి. కొన్నిరోజుల క్రితం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. సల్మాన్పై నేరుగా కౌంటర్స్ వేశాడు. 'సికిందర్' ఫ్లాప్ కావడానికి అతడే బాధ్యుడు అన్నట్లు మాట్లాడాడు. దీంతో సల్మాన్ ఫ్యాన్స్తో పాటు చాలామంది షాకయ్యారు.'మదరాసి' సినిమా ప్రమోషన్లలో టైంలో దర్శకుడు మురుగదాస్.. సల్మాన్ ఖాన్పై ఈ కామెంట్స్ అన్నీ చేశాడు. రాత్రి 9 గంటల తర్వాత హీరో షూటింగ్కి వచ్చేవాడని, పిల్లల్ని స్కూల్కి పంపే సీన్స్ కూడా అర్థరాత్రి 2-3 గంటలకు తీశామని మురుగదాస్ అన్నాడు. అప్పటినుంచి సైలెంట్గానే ఉన్న సల్మాన్.. ఇప్పుడు బిగ్బాస్-19 వీకెండ్ ఎపిసోడ్లో ఈ విషయమై స్పందించాడు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ మురుగదాస్పై అదిరిపోయే పంచులు వేశాడు.(ఇదీ చదవండి: Bigg Boss 9: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!)'విపరీతమైన గాయాల వల్ల నేను షూటింగ్గా ఆలస్యంగా వస్తే దాన్ని మరోలా చెప్పుకొని నెగిటివ్ చేశారు. ముందు నిర్మాత సాజిత్ నడియావాలా తప్పుకొంటే.. తర్వాత సౌత్ సినిమా మదరాసి తీయడానికి మురుగదాస్ వెళ్లిపోయారు. అక్కడి యాక్టర్ సాయంత్రం ఆరు గంటలకే సెట్కి వచ్చావాడు. అందుకే అది సికిందర్ కన్నా చాలా పెద్ద బ్లాక్బస్టర్ అయింది' అని సల్మాన్ ఖాన్ సెటైరికల్గా గట్టిగానే కౌంటర్స్ వేశాడు.ఇన్ని చెప్పిన మురుగదాస్.. 'మదరాసి' సినిమాతో ఘోరమైన ఫలితాన్ని అందుకున్నాడు. తెలుగులో ఇది డిజాస్టర్ అయితే, తమిళంలో యావరేజ్గా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్ల టైంలోనే తెలుగు సినిమాలకు రూ.1000 కోట్ల కలెక్షన్స్ వస్తుండటంపైనా విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. తమిళంలో ప్రేక్షకుల్ని ఎడ్యుకేట్ చేసే చిత్రాలు తీస్తామని అందుకే అన్ని కోట్ల కలెక్షన్స్ రావని అన్నాడు. దీంతో 'మదరాసి' చిత్రంతో మురుగదాస్.. ప్రేక్షకులకు ఏం విలువలు నేర్పించాడో చెప్పాలని రిలీజ్ టైంలో కౌంటర్స్ గట్టిగానే పడ్డాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు)
- 
      
                   
                                                       దీపిక అడిగింది ఇవ్వాల్సిందే!: అర్జున్ రెడ్డి బ్యూటీమిగతా ఇండస్ట్రీల మాదిరిగా సినీ పరిశ్రమ ఓ పద్ధతి ప్రకారం లేదు. ఇక్కడ పనిగంటలు కరెక్ట్గా ఉండవు. అన్నిచోట్లా ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఎనిమిది గంటలు పనిచేసే విధానాన్ని అనుసరించాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. చిన్న, మధ్యతరహా సినిమాలకు ఈ డిమాండ్లు సెట్ అవుతాయేమో కానీ భారీ బడ్జెట్ చిత్రాలకు వీటిని ఫాలో అవడం కష్టం!దీపికా.. నాకు చాలా ఇష్టంఈ కారణం వల్లే స్పిరిట్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు దీపిక చేజారిపోయాయి. దీపిక డిమాండ్ గురించి తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకు దీపికా పదుకొణె అంటే చాలా ఇష్టం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి తనను చూస్తున్నాను. ఆమె జర్నీని ఫాలో అయ్యాను. తనొక గొప్ప యాక్టర్. తనకు ఏది అవసరమో దాని గురించి నిర్భయంగా మాట్లాడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నొక్కి చెప్పింది. తనవల్లే మేమందరం మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. సినిమాతను కోరుకున్నది తనకు దక్కాల్సిందేనని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అటు కొంకణ సేన్ శర్మ మాట్లాడుతూ.. మేమేం సర్జరీ చేసే డాక్టర్స్ కాదు కదా.. మేమూ మనుషులమే! మాకూ చిన్నపాటి బ్రేక్స్ కావాలి అని పేర్కొంది. షాలిని పాండే తొలి చిత్రం అర్జున్ రెడ్డితో బాగా పాపులర్ అయింది. తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్లోనూ తళుక్కుమని మెరిసింది. ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీలో కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తోంది.చదవండి: ఏయ్, ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి
- 
      
                   
                                                       ఫిలింఫేర్ అవార్డ్స్: రికార్డు సృష్టించిన లాపతా లేడీస్.. ఏకంగా..ఫిలింఫేర్ అవార్డుల్లో (Filmfare Awards 2025) లాపతా లేడీస్ సినిమా విజయ ప్రభంజనం మోగించింది. ఏకంగా 13 విభాగాల్లో పురస్కారాలు ఎగరేసుకుపోయింది. ఎక్కువ ఫిలింఫేర్లు అందుకున్న సినిమాగా ఇప్పటివరకు గల్లీ బాయ్ పేరిట (13 పురస్కారాలతో) రికార్డు ఉంది. ఇప్పుడు లాపతా లేడీస్ (Laapataa Ladies Movie) ఆ రికార్డును సమం చేసింది. అహ్మదాబాద్లో శనివారం జరిగిన 70వ ఫిలింఫేర్ వేడుకకు షారూఖ్ ఖాన్, కరణ్ జోహార్, మనీష్ పాల్ యాంకర్స్గా వ్యవహరించారు.'ఐ వాంట్ టు టాక్' మూవీకి గానూ అభిషేక్ బచ్చన్, 'చందు: ఛాంపియన్' సినిమాకుగానూ కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. జిగ్రా చిత్రానికిగానూ ఆలియా భట్ (Alia Bhatt) ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. లాపతా లేడీస్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందించారు.అవార్డు విజేతలు వీళ్లే..ఉత్తమ దర్శకుడు: కిరణ్ రావు (లాపతా లేడీస్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): ఐ వాంట్ టు టాక్ (డైరెక్టర్ సుజిత్ సర్కార్)ఉత్తమ నటుడు (క్రిటిక్స్ ఛాయిస్): రాజ్కుమార్ రావ్ (శ్రీకాంత్ మూవీ)ఉత్తమ నటి (క్రిటిక్స్ ఛాయిస్): ప్రతిభ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటుడు: రవి కిషన్ (లాపతా లేడీస్)ఉత్తమ సహాయ నటి: ఛాయా కదమ్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ నటుడు: లక్ష్య (కిల్)ఉత్తమ డెబ్యూ నటి: నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: కునాల్ కెమ్ము (మడగావ్ ఎక్స్ప్రెస్), ఆదిత్య సుహాస్ జంబలే (ఆర్టికల్ 370)ఉత్తమ యాక్షన్: సీయాంగ్ ఓ, పర్వేజ్ షైఖ్ (కిల్)ఉత్తమ స్క్రీన్ప్లే: స్నేహ దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ టక్కర్ (ఆర్టికల్ 370)ఉత్తమ సంభాషణలు: స్నేహా దేశాయ్ (లాపతా లేడీస్)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ లిరిక్స్: ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్)ఉత్తమ గాయకుడు: అర్జిత్ సింగ్ (లాపతా లేడీస్)ఉత్తమ గాయని: మధుబంతి బగ్చి (స్త్రీ 2)ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: రితేశ్ షా, తుషార్ షీతల్ జైన్ (ఐ వాంట్ టు టాక్)ఉత్తమ సౌండ్ డిజైన్: సుభాష్ సాహో (కిల్)ఉత్తమ నేపథ్య సంగీతం: రామ్ సంపత్ (లాపతా లేడీస్)ఉత్తమ వీఎఫ్ఎక్స్: రీడిఫైన్(ముంజ్యా)ఉత్తమ కొరియోగ్రఫీ: బోస్కో-సీజర్ (బ్యాడ్ న్యూస్ మూవీలో తాబ తాబ పాట)ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానికర్ (కిల్)ఉత్తమ కాస్ట్యూమ్: దర్శన్ జలన్ (లాపతా లేడీస్)ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మయూర్ శర్మ (కిల్)ఉత్తమ సినిమాటోగ్రఫీ: రఫీ మహ్మద్ (కిల్)ప్రత్యేక అవార్డులుజీవిత సాఫల్య పురస్కరం: శ్యామ్ బెనగల్ (మరణానంతరం), జీనత్ అమన్ఆర్డీ బర్మన్ పురస్కారం: అచింత్ టక్కర్ (జిగ్రా, మిస్టర్ అండ్ మిసెస్ మహి)చదవండి: నేను కూర్చుంటే లేచి వెళ్లిపోయేవారు.. పవన్-రీతూల లవ్ట్రాక్ ఫేక్!
- 
      
                   
                                                       జీవన తాత్వికతను ప్రతిబింబించిన అమర స్వరం‘జిందగీ కా సఫర్ కోయి సమ్ ఝా రహ’... ‘ముసాఫిర్ హు యారో న ఘర్ హై నా ఠికాన’... ‘మేరే నైనా సావన్ బాధో ఫిర్ భి మేరా మన్ ప్యాసా’... ‘ఘుంఘురూ కి తరా బజ్ థా హి రహా హూ మై’... ఆ బరువైన స్వరం వినగానే విషాదంలో కూరుకొనిపోయిన వారికి ఉపశమనం కలుగుతుంది. జీవన సమరంలో ఓడిపోయిన వారికి పోరాడే ధైర్యం వస్తుంది. నిరాశ నిస్పృ హలో కొట్టు మిట్టాడినవారికి ఆశలు చివురిస్తాయి.పల్లవులను చూడగానే ఆ స్వరం ఎవరిదో తెలిసిపోతుంది... ఆ పల్లవులను వింటే చాలు, రాసిన రచయితలకంటే, సంగీతం అందించిన స్వరకర్తల కంటే ముందుగా సాక్షాత్కరించే గాన గంధర్వుడెవరన్నది... అది నాలుగు దశాబ్దాలుగా తన నవరసభరిత గాత్రంతో బాలీవుడ్ సినీ రంగాన్ని శాసించిన అపురూప, అరుదైన గాయకుడు కిషోర్ కుమార్దేనని. అందరూ ప్రేమగా పిలుచుకొనే ‘కిషోర్ దా’ భౌతికంగా దూరమై, మూడున్నర దశాబ్దాల పైనే అవుతోంది.‘నీవు లేవు నీ పాట వుంది’ అని తిలక్ అన్నట్లు కిషోర్ దా మన మధ్య లేకున్నా ఆయన పాటలు స్వర స్మరణీయలుగా మన హృదయాలను స్పృశించడానికి కారణం ఆయన స్వరంలోని జీవశక్తి... ఆయన గాత్రంలోని జీవన తాత్వికత... కవి హృదయాన్ని అవగతం చేసుకొని కథా సన్నివేశాన్ని, పాత్రల మనోభావాలను మమేకం చెంది, సంగీత దర్శకుని బాణీలను ఇంప్రో వైజ్ చేసి, స్వీయ అనుభవాలను మిళితం చేసి, అనుభూతి చెంది పాడ డం వల్ల కిషోర్ స్వరం భాస్వరంలా ప్రజ్వరిల్లింది.ఆయన గాత్రంలోని జీర, బరువు, స్థాయి, మధురిమ, డైనమిక్స్ అన్నీ పంచామృతమై గానధారలుగా రస ప్లావితం చేసింది. ఆ శైలీ ప్రభంజనంలో పడిపోయిన వేలాది గాయకులు జూనియర్ కిషోర్ కుమారులై వేదికల మీద పాడుతూ మురిసిపోతున్న మాట వాస్తవం..కిషోర్ కుమార్ నటుడు కావాలనుకున్నాడు కానీ గాయకుడయ్యాడు. ‘జిద్దీ’ (1948) చిత్రంలో ఖేమ్ చంద్ర ప్రకాశ్ తొలి పాటను పాడించాడు. కానీ ఆయనలోని ప్రతిభను, చిలిపితనాన్ని, వలపుతనాన్ని గుర్తించింది ఎస్.డి. బర్మన్. యాభైలలో రఫీ ప్రభంజనం ఉన్న రోజుల్లో కిషోర్కు మంచి పాటలిచ్చి ్రపోత్సహించాడు.1960 దశకం ప్రారంభంలో ఆయన సినిమాలు విఫలమైన తరుణంలో ఎస్.డి. బర్మన్ కొడుకు ఆర్.డి. బర్మన్ ‘పడోసన్’లో ‘మేరే సామ్ నె వాలే ఖిడ్ కీ మే’ పాటనిచ్చి కిషోర్ గొంతులోని రొమాంటిజాన్ని ఆవిష్కరించి, అందరి దృష్టినీ ఆకర్షించాడు.కిషోర్ జీవితంలోని ‘ఆరాధన’ (1969) పెద్ద మలుపు. ఆ చిత్ర స్వరకర్త ఎస్.డి. బర్మన్... రఫీతో రెండు పాటలు రికార్డు చేశాక జబ్బు పడడంతో ఆర్.డి. కిషోర్తో ‘రూప్ తేరా మస్తాన...’ పాడించి హిట్ చేయడంతో కిషోర్ ప్రభంజనం మొదలైంది. ఆ పాటలతో హిందీ సినీ గీతాల దిశ కూడా మారింది.కిషోర్ యువతీ యువకుల పాలిట రొమాంటిక్ సింగర్ అయ్యాడు. అయితే కిషోర్ మరోవైపు జీవన తాత్వికతను తెలిపే బరువైన పాటలూ పాడాడు. ఆ పాటలే ఆయనను సమున్నత స్థానానికి చేర్చాయి. నిజానికి విషాద గీతాలను పాడి మెప్పించడం చాలా కష్టమని ప్రసిద్ధ గాయకులు చెప్పే మాట... కానీ కిషోర్ దా పాడిన ప్రతి విషాద గీతం కంటతడి పెట్టిస్తుంది. ఆయన గొంతులోని మార్దవం మనల్ని ఓదారుస్తుంది.‘యే జీవన్ హై... ఇస్ జీవన్ కా యహీహై యహీహై రంగ్ రూప్... ‘పియా కా ఘర్’ (1972) లోని ఈ పాట అర్థం తెలిస్తే మనం ఎంతో ఉపశమనం ΄÷ందుతాం... ఇందులో ‘జీవితం కొంత సుఖం... కొంత కష్టం... బతుకుతో పంతం వద్దు’ అని చెబుతుంది. ఈ పాట కిషోర్కు ఎంతో ఇష్టమైనది. ఇదే ఆనంద్ భక్షి రాసిన ‘చింగారి కోయీ భడ్ కే, తొ సావన్ ఉసే భుజాయే, సావన్ జొ అగన్ లగాయే, ఉసె కౌన్ భుజాయె’ (నిప్పును వర్షం చల్లారుస్తుంది, అయితే వర్షంలోనే నిప్పు పుడితే ఎవరు చల్లారుస్తారు) అని ‘అమర్ ప్రేమ్’లోని పాట ఆద్యంతం మనకు విధి నిర్ణయాలలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. కిషోర్ ఈ పాటను ఎంతో నెమ్మదిగా... మంద్రంగా పాడాడు. ‘మేరా జీవన్ కోరా కాగజ్ కోరా హి రహ్ గయా... జో లిఖాథా ఆంసు వోంకె సంగ్ బహ్ గయా’ (నా జీవితం ఓ తెల్ల కాగితం... ఏదైనా రాస్తే అదంతా కన్నీటితో తుడచుకుపోయింది) అని ‘కోరా కాగజ్’ చిత్రంలోని ఈ పాట కంట తడి పెట్టిస్తుంది. జీవితంలో అంతా కోల్పోయిన వారు వేదాంతిలా మారిపోతారు, లేదా జీవించే ప్రయత్నం చేయక మరణాన్నే ప్రేమిస్తుంటారు. ‘ఘుంఘురూ కీ తరహా బజ్ థా హూ రహా హు మై’ (చోర్ మఛాయే షోర్) మొదలైన పాటలు ఇందుకు ఉదాహరణలే.జీవన వైచిత్రిని, జీవన సత్యాన్ని తెలిపే గీతాలకు కిషోర్ ప్రాణ ప్రతిష్ఠ చేశాడు.జిందగీ కా సఫర్ ... హై యే కైసా సఫర్కోయి సమ్ ఝా నహి కోయి జానా నహిహై యే కైసే డగర్... చల్ తె హై సబ్ మగర్... (ఈ జీవిత పయనం ఎవరికీ తెలియదు.. ఎవరికీ అర్థం కాదు. అందరం ఏ తోవన వెళుతున్నామో తెలియకున్నా వెళుతూనే వున్నాం). ‘సఫర్’ (1970) చిత్రంలోని ఈ పాట అందర్నీ కదిలిస్తుంది...అలాగే ‘ఆప్ కి కసమ్‘ సినిమా (1974)లో జీవితంలో గడచిన క్షణాలు, సంఘటనలు మళ్ళీ రావు అనే సత్యాన్ని ఆరు రుతువులతో పోలుస్తూ రాసిన గీతాన్ని కిషోర్ హృద్యంగా పాడారు.‘జిందగీ కా సఫర్ మై గుజర్ జాతే హై జో మఖామ్... వో ఫిర్ నహీ ఆతీ... వో ఫిర్ నహీ ఆతీ’... (ఇందులో శిశిరంలో రాలిన పూలు వసంతంలో చిగురిస్తాయని అనుకోవద్దని, ఒక్కసారి దూరమైన వ్యక్తులు మరల చేరువ కారని మనిషికి అనుమానం ఉంటే అది పెనుభూతమవుతుందని, జీవితం అశాంతిమయమనే) భావనతో రాసిన గీతాన్ని కిషోర్ ఎంతో గంభీరంగా పాడాడు. ‘అందాజ్’ (1971) చిత్రంలోని ‘జిందగీ ఎక్ సఫర్ హై సుహానా యహ కల్ క్యా హో కిస్ నే జానా’ ఆల్ టైం హిట్గా నిల్చింది. (రేపు ఏమవుతుందో తెలియదు. మృత్యువు అనుక్షణం వెంటా డుతుంటుంది. అనుభవించేదేదో ఈ క్షణమే అనుభవించు) అనే భావంతో ఈ పాట సాగుతుంది. ‘అమర్ ప్రేమ్’ (1972) లోని ‘కుఛ్ తో లోగ్ కహేంగే... లోగోంక కామ్ హై కహనా’ (ప్రజలు ఎప్పుడు ఏవో మాట్లాడుతూ వదంతులు సృష్టిస్తూనే వుంటారు... ఆ మాటలను పట్టించుకోవద్దు... సీతమ్మ వారినే నిందించింది లోకం... మనం లోకానికి జవాబుదారు కాము) గీతాన్ని ఎంతో అనునయంగా పాడాడు కిషోర్...‘కాలా పత్తర్’ (1979) చిత్రంలోని ‘ఎక్ రాస్ థా హై జిందగీ’ గీతాన్ని కిషోర్ పాడిన తీరు మనల్ని కట్టి పడేస్తుంది..కిషోర్ వ్యక్తిగత జీవితమూ రక రకాల గతుల్లో పయనించింది. ఆయన జీవితంలో నలుగురు స్త్రీలు ప్రవేశించి కొన్నాళ్ల తరువాత నిష్క్రమించారు. తొలుత రూమాదేవి 1950ల్లో తరువాత మధుబాలను, తరువాత 1970ల్లో యోగితా బాలిని, చివరికి 1980ల్లో లీనా చందా వర్కర్ను వివాహమాడాడు... వీరందరూ ప్రసిద్ధ నటీమణులే... కిషోర్ వాయిద్యాలతో, సంగీత దర్శకులతో ట్యూన్ అయ్యాడు కానీ ఆయన భార్యలు మాత్రం ఆయనతో ట్యూన్ కాలేదు. కారణం ఆయన నిలకడ లేనితనం, చిన్నపిల్లాడి తత్వమే! 1969లో మధుబాల మరణంతో కిషోర్ డిప్రెషన్ లోకి వెళ్ళాడు. తరువాత చాలా కాలానికి యోగితా బాలి ఆయన జీవితంలో ప్రవేశించింది. ఆ తర్వాత లీనా చందా వర్కర్... కిషోర్ జీవితంలో చివరివరకున్నది... కిషోర్ ఉమనైజర్ కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన వ్యక్తిగత జీవితం తెగిన గాలి పటమైంది. కానీ ఇవేవీ ఆయన స్వర జీవితంపై ప్రభావం చూపలేదు..కిషోర్ తరచూ గుండె నొప్పి అని, అందర్నీ ఆట పట్టించేవాడు. అక్టోబర్ 13న (1987) కూడా అలాగే అంటే భార్య లీనా జోక్ కాబోలనుకుంది... కానీ మరుక్షణంలోనే డాక్టర్ను పిలిపించింది... డాక్టర్ వచ్చే లోపే కిషోర్ తుది శ్వాస వదిలాడు. అప్పుడు ఆయన వయసు 58 యేళ్ళు... కిషోర్ లేడు అనుకోగానే... ‘మౌత్ ఆయేగీ ఆయేగీ ఎక్ దిన్... జాన్ జాయేగీ జాయేగీ ఎక్ దిన్’ కిషోరే పాడిన పాట గుర్తుకు వస్తుంది... కానీ కిషోర్ మాత్రం తనకు ఎన్నడు వీడ్కోలు ఇవ్వద్దని వెళుతూ మరీ చె΄్పాడు.‘చల్ తే చల్ తే మేరే యే గీత్... యాద్ రఖ్ నా కభి అల్ విద నా కహనా’ (చల్ తే చల్ తే)... అవును.. కిషోర్ దా గాత్రానికి మరణం లేదు.. అది అజరం, అమరం.– డా. వి.వి. రామారావు (గాయకుడు, రచయిత, వ్యాఖ్యాత)
- 
      
                   
                                                       అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తా.. పేరెంట్స్ అర్థం చేసుకుంటారుబాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్ టక్కర్ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్ ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. ఫ్యామిలీ హౌస్.. కానీ!కరణ్ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్కు బదులుగా దిలీప్ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్ డోర్ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్? అని సరదాగా అడిగింది. నాకింకా పెళ్లవలేదుఅందుకు కరణ్ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్ రూమ్ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. రియాలిటీ షోలుకరణ్ టక్కర్.. లవ్ నే మిలాది జోడి, ఏక్ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్లో నటించాడు. డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిక్లాజా 7'వ సీజన్లో పార్టిసిపేట్ చేయగా ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. 'ద వాయిస్', 'నాచ్ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్ ఆప్స్, ఖాకీ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు. తన్వి: ద గ్రేట్ సినిమాలోనూ నటించాడు. View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
- 
      
                   
                                                       అభిషేక్ బచ్చన్కు ప్రతిష్టాత్మక అవార్డ్.. హాజరు కాని ఐశ్వర్య రాయ్!బాలీవుడ్ హీరో, బిగ్బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ ఈ అవార్డ్ సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్లో అవార్డ్ అందుకున్నారు. చందు ఛాంపియన్ సినిమాకు గాను కార్తీక్ ఆర్యన్ సైతం అవార్డ్ అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న సందర్భంగా అభిషేక్ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ 83వ పుట్టినరోజు కావడం మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.అభిషేక్ మాట్లాడుతూ.. "ఈ ఏడాదితో సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నాకు అవకాశాలు ఇచ్చిన అందరు దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటా. ఈ ఘనత రావడం అంత సులభం కాదు. నా లైఫ్లో విలువైంది. ఈ అవార్డు కోసం నేను ఎన్నిసార్లు స్పీచ్ ఇచ్చేందుకు ప్రాక్టీస్ చేశానో గుర్తులేదు. ఇది ఒక కల. ఈ అవార్డ్ వచ్చినందుకు చాలా వినయంగా ఉన్నా. నా కుటుంబం ముందు అవార్డ్ అందుకోవడం మరింత ప్రత్యేకం. ఇక్కడ నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కార్తీక్ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. తమ డ్రీమ్ కోసం ప్రతి ఒక్కరూ నమ్మకంతో పనిచేయండి. నిరంతరం కృషి చేయండి' అని పంచుకున్నారు.(ఇది చదవండి: సతీమణి బాటలో అభిషేక్ బచ్చన్.. 24 గంటల్లోనే కోర్టుకు!)సతీమణి ఐశ్వర్య గురించి అభిషేక్ మాట్లాడుతూ.."ఐశ్వర్య, ఆరాధ్యలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను బయటకు వెళ్లి నా కల నిజం చేసుకునే అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడానికి వారి త్యాగాలే కారణం. ఈ అవార్డును ఇద్దరు చాలా ప్రత్యేకమైన వ్యక్తులకు అంకితం చేయాలనుకుంటున్నా. నా తండ్రితో పాటు కుమార్తెకు అంకితం చేయాలనుకుంటున్నా." అని అన్నారు.ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ గైర్హాజరు..అయితే అభిషేక్ బచ్చన్ ఈ అవార్డ్ను తల్లి జయ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్, మేనకోడలు నవ్య నవేలి నందా సమక్షంలో అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు భార్య ఐశ్వర్య రాయ్ , కుమార్తె ఆరాధ్య హాజరు కాలేదు. కాగా.. గతంలో ఐశ్వర్య- అభిషేక్ విడాకుల రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు పలుసార్లు జంటగా కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది.
- 
      
                   
                                                       నెట్ఫ్లిక్స్లో ఉన్న టాప్ 10 మూవీస్ ఇవే.. ట్రెండింగ్లో పాత చిత్రం!ఒటీటీల క్రేజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. థియేటర్స్ వెళ్లి సినిమా చూసేవారి కంటే..ఓటీటీలో చూసేవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో టాప్ 1లో ఉన్న ఓటీటీ ఫ్లాట్ఫార్మ్ నెట్ఫ్లిక్స్. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు అన్ని ప్రాంతాల హిట్ సినిమాలు ఎక్కువగా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియాలో ఉన్న టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం వార్2. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీ హిందీ వెర్షన్ టాప్ 10లో మొదటి స్థానంలో ఉండగా.. తెలుగు వెర్షన్ టాప్ 5లో ఉంది.ఇక టాప్లో 2లో మూడేళ్ల క్రితం వచ్చిన కాంతార చిత్రం హిందీ వెర్షన్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్గా వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ థియేటర్స్లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటి వరకు రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రిషబ్ శెట్టి ఖాతాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.ఇక టాప్ 3లో యానిమేషన్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహా’ ఉంది. థియేటర్స్లో రూ.320 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీల్లోనూ అదరగొడుతోంది.నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా రిలీజ్ అయిన ‘ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10’ మూవీ టాప్ 4లో కొనసాగుతుంది. ఇదొక మిస్టరీ థ్రిల్లర్. సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు.టాప్ 6లో సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం ఉంది. ఇందులో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు మృణాల్ ఠాకూర్, రవి కిషన్, రోష్ని వాలియా, విందు దారా సింగ్, దీపక్ దోబ్రియాల్, కుబ్రా సైట్, సంజయ్ మిశ్రా, చుంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్ట్లో థియేటర్స్లో రిలీజై అయిన ఈ చిత్రం.. అపజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నివారాలుగా ఈ చిత్రం టాప్ 10లో కొనసాగడం గమనార్హం. టాప్ 7లో దడక్ 2 ఉంది. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నేపథ్యంలో సాగే ఈ కథలో అత్యంత సున్నితమైన కుల వివక్షను చూపించారు.టాప్ 8లో బ్లాక్ బస్టర్ మూవీ సయ్యారా కొనసాగుతుంది. ఇక టాప్ 9 లో క్రైమ్ థ్రిల్లర్ ఇన్స్పెక్టర్ జెండె ఉంది. ఒకప్పటి నొటోరియస్ బికినీ కిల్లర్ ఛార్లెస్ శోభరాజ్ కేసును ఛేదించిన ఓ పోలీసు ఆఫీసర్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ మనోజ్బాజ్పాయూ లీడ్ రోల్లో నటించారు. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘ఓడుం కుతిర చాదుం కుతిర’టాప్ 10లో కొనసాగుతుంది. ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, రేవతి పిళ్లై హీరోయిన్లుగా నటించారు.
- 
      
                   
                                                       రాక్స్టార్ పుట్టిన రోజు : ఫ్యాన్స్ ‘జల్సా’, మమత స్పెషల్ విషెస్బాలీవుడ్ సీనియర్ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శనివారం (అక్టోబర్ 11) 83వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాదు, టీవీ షోలు ముఖ్యంగా కౌన్ బనేగా కరోడ్పతి షో ద్వారా మరింత ప్రజాదరణ సంపాదించుకున్న సెలబ్రిటీ అమితాబ్ బచ్చన్. ఎన్నో విలక్షణమైన పాత్రలు గంభీరమైన స్వరం, అనన్య సామాన్యమైన నటన, అంతకుమించిన వ్యక్తిత్వం ఆయనను లెజెండ్రీగా నిలబెట్టాయి. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ముంబైలోని ఆయన నివాసం ముందు ఫ్యాన్స్చేసిన సందడి అంతా ఇంతా కాదు.అమితాబ్ బచ్చన్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా తమ అభిమాన నటుడిని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. మ ముంబై లోని బిగ్ బీ బంగ్లా 'జల్సా' వెలుపల గుమిగూడారు. అంతేకాదు ఆయన పోషించిన ప్రముఖ పాత్రల వేషధారణలో, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు బిగ్ బీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ కురిసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్డే విషెస్ అందించారు.#WATCH | Mumbai, Maharashtra | Fans of the Veteran Actor Amitabh Bachchan gather outside his bungalow, 'Jalsa', to catch a glimpse of their favourite movie star on the occassion of his birthday. His fans dressed up as famous characters played by the actor, and sang songs and… pic.twitter.com/MfE34Y5RWl— ANI (@ANI) October 10, 2025 బిగ్ బీతో కలిసి నటించిన హీరో ప్రభాస్, కాజోల్, అజయ్ దేవ్గన్, శత్రుఘ్న సిన్హా,సునీల్ శెట్టి అ లాంటి సినీప్రముఖులతో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అమితాబ్కు విషెస్ చెప్పడం విశేషం. "లెజెండరీ అమితాబ్ బచ్చన్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! మీరు ఎపుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిని ప్రసాదించాలన్నారు. అలాగే 1984లో తామిద్దరం ఎంపీలు అనే విషయానఇన గుర్తు చేసుకున్నారు.
- 
      
                   
                                                       రూ.100 కోట్లు ఇచ్చినా సరే తనతో పని చేయనురూ.100 కోట్లు ఇచ్చినా సరే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ (Ismail Darbar). వీరిద్దరూ 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్' సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాల ఘన విజయంలో ఇస్మాయిల్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కలిసి బ్లాక్బస్టర్లు కొట్టిన వీళ్లిద్దరి మధ్య తర్వాత పెద్ద అగాధమే ఏర్పడింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ మాట్లాడాడు.భయమెందుకు?'హీరామండి ప్రాజెక్ట్ ఈ మధ్య అనుకుంది కాదు. రెండున్నర దశాబ్దాల కిందటే ఆ ప్రాజెక్ట్కు పునాది పడింది. ఆ సమయంలో ఓ వార్తాపత్రికలో హీరామండి ప్రాజెక్ట్కు నేను అందించే సంగీతమే వెన్నెముకలా నిలవనుంది అని రాశారు. ఇది నేనే పత్రికలో వేయించానని సంజయ్ అనుమానించాడు. పిలిచి నిలదీశాడు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు భయపడాల్సిన అవసరమే లేదు. నీ ముందు కూడా అదే చెప్తాను. అయినా పేపర్లో అది ఎవరు రాశారో నాకసలు తెలీనే తెలియదు అని చెప్పాను.నేనే బ్యాక్బోన్సరే, వదిలెయ్ అని అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వదిలెయ్ అన్నది ఈ విషయాన్ని కాదు, ప్రాజెక్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. తనతో చెప్పించుకోవడం దేనికని నేనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా! తర్వాత.. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ సినిమాలకు నేనే వెన్నెముక అని సంజయ్ పీఆర్ టీమ్కు కూడా తెలిసొచ్చింది. కానీ సంజయ్కు ఇగో ఎక్కువ. నా కష్టానికి కూడా తనే క్రెడిట్ తీసుకుంటాడు. అందుకే తనతో పనిచేయకూడదనుకున్నాను. తను రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాకు పని చేయను' అని ఇస్మాయిల్ చెప్పుకొచ్చాడు.చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్
- 
      
                   
                                                       పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్, ఇద్దరితో పెళ్లి!కుటుంబం గురించైనా, వ్యక్తిగత విషయాల గురించైనా కొందరు ఓపెన్గా మాట్లాడుతుంటారు. మరికొందరు మాత్రం అన్నీ గోప్యంగానే ఉంచాలనుకుంటారు. బాలీవుడ్ నటి, సింగర్ కునికా సదానంద్ (Kunickaa Sadanand) మొదటి కోవకు చెందుతుంది. దాపరికాల్లేకుండా అన్నీ బాహాటంగానే మాట్లాడుతుంది. ఈమె ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో పాల్గొంది.మందుకు బానిసయ్యాబిగ్బాస్ (Bigg Boss Reality Show) హౌస్లో తనకున్న చెడు అలవాట్ల గురించి ఓపెన్ అయింది. నేనెప్పుడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదు. కానీ నాకు మందు తాగే అలవాటుంది. బ్రేకప్ అయినప్పుడు మందుకు బానిసయ్యాను. బాధతో ఇంకా ఎక్కువ తాగేసి చాలా బరువు పెరిగిపోయాను. డబ్బింగ్ చెప్పడానికి స్టూడియో వెళ్లినప్పుడు నన్ను నేను అద్దంలో చూసుకుని షాకయ్యాను. నేనిలా అయిపోయానేంటి? అనుకున్నాను. గుండెనిండా బాధతో పగలూరాత్రీ తేడా లేకుండా మద్యం సేవించేదాన్ని. పట్టపగలే బీర్ తాగేదాన్ని. యాక్టర్స్ను ప్రేమించలేదురాత్రి క్లబ్కు వెళ్లి మళ్లీ మందు తాగుతూ కూర్చునేదాన్ని. మందు తాగడం మానేయ్ అని నాన్న హెచ్చరించినా లెక్క చేయలేదు. రిలేషన్స్ విషయానికి వస్తే.. నేను ఇద్దరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా.. నలుగురితో రొమాన్స్ చేశా.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ యాక్టర్స్తో మాత్రం ప్రేమలో పడలేదు. యాక్టర్స్ ఎప్పుడూ అద్దంలో వారి ముఖాన్ని చూసుకుని మురిసిపోతుంటారు. పక్కవాళ్లకంటే ముందు వారినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ అద్దం ముందు ఉండేవాళ్లతో నేనెలా ఉండగలను? అని చెప్పుకొచ్చింది.పర్సనల్ లైఫ్కాగా కునికా సదానంద్.. ఢిల్లీకి చెందిన అభయ్ కొటారిని పెళ్లి చేసుకోగా వీరికి ఓ బాబు పుట్టాడు. కానీ, దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 35 ఏళ్ల వయసులో వినయ్ లాల్ను పెళ్లి చేసుకోగా.. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కానీ, ఈ జంట కూడా కలిసుండలేకపోయింది. భార్యాభర్తలిద్దరూ విడిపోయారు.చదవండి: వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్
- 
      
                   
                                                       వాడికి యాక్టింగ్ వద్దు.. కోహ్లి బ్యాట్ కావాలి, రోహిత్..: కరీనా కపూర్స్టార్ సెలబ్రిటీల పిల్లలు యాక్టింగ్ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. అలా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మొదటి భార్య (అమృత సింగ్) పిల్లలు ఇబ్రహీం అలీ ఖాన్, సారా అలీ ఖాన్ కూడా పేరెంట్స్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. అయితే సైఫ్- కరీనా కపూర్ (Kareena Kapoor) పిల్లలు మాత్రం యాక్టింగ్పై అంతగా ఆసక్తి చూపించడం లేదట! ఈ విషయాన్ని కరీనా తాజాగా ఓ పాడ్కాస్ట్లో వెల్లడించింది.యాక్టింగ్ ఇంట్రస్ట్ లేదుసైఫ్ అలీఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్కాస్ట్కి కరీనా హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తైమూర్కు యాక్టింగ్పై ఏమాత్రం ఆసక్తి లేదు. డ్రామా క్లాసుల్లో జాయిన్ అవుతావా? అని అడిగితే వాడు నో చెప్పేవాడు. ఒకసారి యాక్టింగ్ ట్రై చేసి చూడు అని అడిగితే.. లేదమ్మా, యాక్టింగ్ నేను ఎంజాయ్ చేయలేను అన్నాడు. అందుకే వాడిని నేను బలవంతం చేయదల్చుకోలేదు.కోహ్లి బ్యాట్ ఇప్పిస్తావా?సైప్కు వంట చేయడం ఇష్టం. తండ్రిని చూసి వాడు కూడా కుకరీ క్లాస్లో జాయిన్ అవుతానన్నాడు. వాడెప్పుడూ నాతోపాటు సెట్స్కు రాలేదు. ఏ యాక్టర్నూ కలవలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ నీ ఫ్రెండ్సేనా? వాళ్ల బ్యాట్ ఇవ్వమని మెసేజ్ చేస్తావా? లియోనాల్ మెస్సీ ఫోన్ నెంబర్ నీ దగ్గరుందా? ఇలాంటి ప్రశ్నలే అడుగుతుంటాడు. వాళ్లెవరి నెంబర్లూ నా దగ్గర లేవని చెప్పేదాన్ని. వాడికి యాక్టర్స్ గురించి పెద్దగా ఏమీ తెలీదు. ఎంతసేపూ విరాట్తో మాట్లాడిస్తావా? అంటూ క్రీడాకారుల గురించే ఆరా తీస్తుంటాడు అని చెప్పుకొచ్చింది.సైఫ్-కరీనా ఫ్యామిలీసైఫ్- కరీనా కపూర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో తైమూర్ జన్మించాడు. 2021లో జహంగీర్ పుట్టాడు. సైఫ్ జంట ఎంత పెద్ద సెలబ్రిటీలైనా సరే.. పిల్లల స్కూల్ ఈవెంట్స్కు మాత్రం తప్పక హాజరవుతూ ఉంటారు. తైమూర్కు స్పోర్ట్స్ అంటేనే ఇష్టం అని కరీనాయే స్వయంగా చెప్తోంది. మరి జహంగీర్ కూడా అన్నలాగే ఆలోచిస్తాడా? పేరెంట్స్ దారిలో పయనిస్తాడా చూడాలి!చదవండి: వరస్ట్ కంటెస్టెంట్ నుంచి కెప్టెన్గా కల్యాణ్
- 
      
                   
                                                       ఓటీటీలో హృతిక్ స్టార్మ్ఓటీటీలో హృతిక్ రోషన్ ‘స్టార్మ్’ మొదలైంది.పార్వతి తిరువోత్తు, ఆలియా .ఎఫ్, శ్రిష్టి శ్రీవాత్సవ, సబా ఆజాద్ ప్రధానపాత్రల్లో నటించనున్న వెబ్ సిరీస్ ‘స్టార్మ్’ (వర్కింగ్ టైటిల్). ముంబై నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ సిరీస్కు అజిత్పాల్ సింగ్ దర్శకత్వం వహిస్తారు. ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్కు హృతిక్ రోషన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. శుక్రవారం ఈ ‘స్టార్మ్’ సిరీస్ను ప్రకటించి త్వరలోనే షూటింగ్ ఆరంభించనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.హృతిక్ రోషన్కు నిర్మాతగా ఓటీటీలో తొలిప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ‘‘భారతీయ వినోద రంగంలో నేను నిర్మాతగా పరిచయం అవుతున్నాను. ఇండస్ట్రీలో నటుడిగా నేను 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇలా కొత్త అడుగు వేయడం చాలా సంతోషంగా ఉంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న ‘స్టార్మ్’ సిరీస్ కథనం ఆకట్టుకుంటుంది’’ అని హృతిక్ రోషన్ పేర్కొన్నారు.
- 
      
                   
                                                       దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా!బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఇండస్ట్రీలో 8 గంటల పనిపై కామెంట్స్ చేయడమే. స్టార్ హీరోలంతా కేవలం ఎనిమిది గంటలే పని చేస్తున్నారని.. తాను కూడా అంతేనని తేల్చి చెబుతోంది. ఇటీవలే కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల నుంచి అనూహ్యంగా తప్పుకుంది. దీపికా రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని వార్తలొచ్చాయి. అంతేకాకుండా తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఇవాళ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం కావడంతో దీపికా పదుకొణెను ఇండియాకు అంబాసిడర్గా నియమించారు. ది లివ్ లవ్ లాఫ్ (LLL) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన దీపికాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మనదేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికైంది. దీపికా ఎంపిక భారతదేశంలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి విస్తృతంగా అవగాహన కల్పించడంలో సహాయపడుతుందని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.ఈ నియామకంపై దీపికా పదుకొణె మాట్లాడుతూ.. 'కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా పనిచేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో గణనీయమైన పురోగతి సాధించింది. మనదేశంలో అవగాహన కల్పించడానికి.. మరింత బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.అంతేకాకుండా 2015లో తాను స్థాపించిన ది లైవ్ లవ్ లాఫ్ ప్రయాణం గురించి మాట్లాడింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించానని తెలిపింది. ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు..నువ్వు నా కూతురికి సహాయం చేశావు అని చెప్పినప్పుడు వచ్చిన ఆనందం మరెక్కడా తనకు లభించలేదని తెలిపింది. మనదేశంలో మానసిక ఆరోగ్య సంరక్షణ యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను రోజువారీ జీవితంలో ఒక సాధారణ ప్రక్రియగా మార్చడంలో కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మానసిక ఆరోగ్య అవగాహన అనేది ఏదో ఒక రోజు గల్లీ క్రికెట్ లాగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని చెప్పుకొచ్చింది.
- 
      
                   
                                                       ఆ హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు: దీపికా పదుకొణెస్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కొంతకాలంగా వివాదాల్లో నానుతూనే ఉంది. కల్కి 2, స్పిరిట్ వంటి రెండు పెద్ద సినిమాల్లో భాగమైన ఆమె.. అనూహ్యంగా వాటినుంచి సైడ్ అయిపోయింది. కారణం తను పెట్టిన కండీషన్లే! 8 గంటల పనిదినాలతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందని, తనతో పాటు తన టీమ్ మొత్తానికి వానిటీ వ్యాన్లు, లగ్జరీ హోటల్స్లో వసతులు కల్పించాలని షరతులు పెట్టినట్లు ప్రచారం జరిగింది.భారీ సినిమాలు చేజార్చుకున్న దీపికాస్టార్ హీరోయిన్ కాబట్టి అన్నింటికీ తలాడించిన నిర్మాతలు 8 గంటల పనిదినాల దగ్గర మాత్రం ఒప్పుకోవడానికి నిరాకరించారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఈ రూల్ పని చేయదు. అది పాటిస్తే బడ్జెట్ చేయిదాటిపోతుందన్నది వారి వాదన! అందుకే ఆమె చేతినుంచి సినిమాలు చేజారుతున్నాయి. తాజాగా తొలిసారి దీపికా పదుకొణె మీడియా ముందు ఈ వివాదంపై పెదవి విప్పింది. స్టార్ హీరోలు 8 గంటలే..ఆమె మాట్లాడుతూ.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది సూపర్స్టార్స్, టాప్ హీరోలు ఎన్నో ఏళ్లుగా 8 గంటలు మాత్రమే పని చేస్తున్నారు. ఇదేమీ సీక్రెట్ కాదు. అయినా ఎప్పుడూ ఈ విషయం వార్తల్లోకెక్కలేదు. వాళ్ల పేర్లు నేను చెప్పను. ఇప్పుడుకానీ వాళ్ల పేర్లు ప్రస్తావిస్తే విషయం పెంటపెంట అవుతుంది. అందుకే ఆ హీరోల గురించి చెప్పాలనుకోవడం లేదు. చాలామంది హీరోలు 8 గంటలే పని చేస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేస్తారు, వీకెండ్లో సెలవు తీసుకుంటారు. నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా..ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన కొందరు హీరోయిన్లు కూడా 8 గంటలే వర్క్ చేయడం ప్రారంభించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడరు. నన్ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీలో మొదట దీపికను అనుకున్నారు. కానీ, సడన్గా తన స్థానంలోకి త్రిప్తి డిమ్రి వచ్చి చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో దీపిక నటించిన విషయం తెలిసిందే! ఈ మూవీ సీక్వెల్లో నిబద్ధతతో పనిచేసేవారు అవసరమంటూ దీపికను తప్పించారు.చదవండి: ఇలాగైతే నావల్ల కాదు, ఇంటికి పంపించేయండి.. సంజనా ఏడుపు
- 
      
                   
                                                       గొప్ప ప్రయాణంబాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’. ప్రియదర్శన్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రోడక్ష న్స్, తెస్పియన్ ఫిలింస్పై వెంకట్ కె. నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్లో అక్షయ్ కుమార్ పాల్గొంటున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘సరికొత్త థ్రిల్లర్గా రూ పొందుతోన్న చిత్రం ‘హైవాన్’. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు అక్షయ్ కుమార్’’ అన్నారు మేకర్స్. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘హైవాన్’ చిత్రంతో ఒక గొప్ప ప్రయాణం చేస్తున్నాను. ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర పలు విధాలుగా నన్ను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి రోల్లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ ప్రియదర్శన్కు థ్యాంక్స్. ఆయన చేస్తున్న మూవీ సెట్లో ఉంటే ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. సైఫ్తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అంటూ అక్షయ్ తెలి పారు.
- 
      
                   
                                                       సినీ ఇండస్ట్రీలో విషాదం.. టైగర్-3 నటుడు కన్నుమూత!సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ నటుడు, బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(41) మరణించారు. తన గాయానికి సర్జరీ కోసం అమృత్సర్లోని ఫోర్టిస్ ఆస్పత్రికి వెళ్లిన వరీందర్ సింగ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అతను కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. ఛాంపియన్ బాడీబిల్డర్ ఛాంపియన్ కూడా. అతని మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతిని కలిగించింది.కాగా..వరీందర్ సింగ్ గుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఆ తర్వాత మిస్టర్ ఆసియాలో రన్నరప్గా నిలిచాడు. వరీందర్ సింగ్ బాడీ బిల్డింగ్తో పాటు చిత్ర పరిశ్రమలో కూడా తనదైన ముద్ర వేశారు. అతను 2012లో పంజాబీ చిత్రం 'కబడ్డీ వన్స్ ఎగైన్'లో కీలక పాత్రలో నటించాడు ఆ తర్వాత 2014లో 'రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్'తో హిందీలో రంగ ప్రవేశం చేశాడు. అతను 2019లో 'మర్జావాన్'తో సహా పలు హిందీ చిత్రాల్లో కనిపించాడు. ఇటీవలే సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన 'టైగర్ 3'లో పాకిస్తాన్ జైలు గార్డు షకీల్ పాత్రలో గుమాన్ కనిపించాడు. టైగర్ 3 చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు.
- 
      
                   
                                                       మొదటి భార్యతో విడాకులు.. బుల్లితెర నటితో ఎంగేజ్మెంట్..!ప్రముఖ బుల్లితెర నటుడు నందీశ్ సందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రముఖ నటి కవితా బెనర్జీని ఆయన పెళ్లాడనున్నారు. గతనెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేశారు. నందిశ్ -కవిత ఎంగేజ్మెంట్ వేడుక బీచ్లో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషం తెలుసుకున్న పలువురు బుల్లితెర తారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. నటి కవిత బెనర్జీ.. రిష్టన్ కా మంఝా, భాగ్య లక్ష్మి, దివ్య ప్రేమ్: ప్యార్ ఔర్ రహస్య కీ కహానీ, ఏక్ విలన్ రిటర్న్స్, హికప్స్ అండ్ హుక్అప్స్ సీరియల్స్తో పాటు పలు చిత్రాల్లో నటించింది.నటి రష్మీ దేశాయ్తో నందీశ్ విడాకులు..కాగా.. నందీశ్ సందు 2012లో బుల్లితెర నటి రష్మీ దేశాయ్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో ఈ జంట మార్చి 2016లో విడిపోయారు. గతంలో ఈ జంట ఉత్తరన్ అనే సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు. వీరిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నందీశ్ సందు రెండో పెళ్లికి రెడీ అయ్యారు. మరో బుల్లితెర నటి కవిత బెనర్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. View this post on Instagram A post shared by NANDISH SINGH SANDHU (@nandishsandhu)
- 
      
                   
                                                       ప్రతి రోజు టార్చర్.. బలవంతంగా గర్భస్రావ మాత్రలు.. నటుడిపై సంచలన ఆరోపణలు!గత కొన్ని నెలలుగా భోజ్పురి నటుడు, రాజకీయ నేత పవన్ సింగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ ఈవెంట్లో హీరోయిన్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరలైంది. దీంతో ఆమె ఏకంగా భోజ్పురి పరిశ్రమనే వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పవన్ సింగ్ హీరోయిన్కు క్షమాపణలు చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంచితే.. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్ సైతం అతన్ని వదలట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని అరాచకాలను బయటపెడుతూ వస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న జ్యోతి సింగ్.. భోజ్పురి యాక్టర్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనకు ఏకంగా గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చేవాడిని షాకింగ్ విషయాలను వెల్లడించింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా శారీరకంగా తనను హింసించేవాడని జ్యోతి సింగ్ ఆరోపించింది.జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. 'పవన్ సింగ్ బిడ్డ కోసం ఆరాటపడుతున్నానని అబద్దాలు చెబుతున్నాడు. బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులు ఇవ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారీ మందులు ఇచ్చేవాడు. నేను మీడియాకు చాలా విషయాలు వెల్లడించలేదు. కానీ ఈ రోజు పవన్ నన్ను కూడా బలవంతం చేశాడు. ఈ విషయంలో నేను పవన్ను కించపరచడం లేదు. నేను నా వాయిస్ వినిపిస్తున్నా. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో పంచుకుంటున్నా' అని ఆవేదన వ్యక్తం చేసింది.25 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నా..పవన్ సింగ్ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు వేసుకునేదాన్ని.. అర్ధరాత్రి రెండు గంటలకు 25 స్లీపింగ్ పిల్ తీసుకున్నానని జ్యోతి సింగ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని సోదరుడు రణు భయ్యా, దీపక్ భయ్యా, విక్కీ జీ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ముంబయి అంధేరిలోని బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో నాకు చికిత్స అందించారని తన బాధను పంచుకుంది.ఖండించిన పవన్ సింగ్..అయితే జ్యోతి సింగ్ చేసిన ఆరోపణలను ఆమె భర్త, నటుడు పవన్ సింగ్ ఖండించారు. జ్యోతి తనపై చేసిన ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశాడు. నేను కూడా ఒక మనిషినే.. స్త్రీలు దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అది మాత్రమే అందరికీ కనిపిస్తుంది.. కానీ ఎవరూ పురుషుడి బాధను పట్టించుకోరు.. ఎందుకంటే పురుషుడు కూడా తన బాధను చూపించలేడని అన్నారు. మరోవైపు వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది.
- 
      
                   
                                                       మహారాణి మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ వాటికైతే ఎక్కువమంది ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. వీటితో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్కు సైతం విశేష ప్రేక్షకాదారణ ఉంటోంది. అలా రాజకీయ కోణంలో వచ్చి.. సూపర్ హిట్గా నిలిచిన పొలిటికల్ సిరీస్ మహారాణి(Maharani Season4). ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. తాజాగా మరో సీజన్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది.బాలీవుడ్ స్టార్ హ్యుమా ఖురేషీ (Huma Qureshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన రాణి భారతి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఈ వెబ్ సిరీస్కు పునీత్ ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహారాణి సీజన్ 4 స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు. నవంబర్ 7వ తేదీ నుంచి సోని లివ్లో ప్రసారం కానుందంటూ ట్రైలర్ను షేర్ చేశారు మేకర్స్.తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఎలాంటి భయం లేకుండా ఉండే ముఖ్యమంత్రి రాణి భారతిగా హ్యుమా ఖురేషి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లే పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీజన్లో రాణి భారతి పాట్నాను వదిలి.. ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. The lioness returns to defend her home! Rani gears up for her biggest battle yet.#Maharani4 streaming from 7th Nov only on Sony LIV#MaharaniOnSonyLIV pic.twitter.com/Xzkt7owqrp— Sony LIV International (@SonyLIVIntl) October 9, 2025
- 
      
                   
                                                       ప్రెగ్నెన్సీతో కత్రినా కైఫ్.. పుట్టబోయే బిడ్డపై జోస్యంబాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తెలుగువారికి కూడా సుపరిచితమైన పేరు. తెలుగులో మల్లీశ్వరి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించిన కత్రినా.. హీరో విక్కీ కౌశల్ను పెళ్లాడింది. ఇటీవలే ఈ జంట అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. కత్రినా గర్భంతో ఉన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అయితే తమ అభిమాన హీరోయిన్ ఎప్పుడు బేబికి వెల్కమ్ చెబుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుధ్ కుమార్ మిశ్రా జోస్యం చెప్పారు. కత్రినా- విక్కీ కౌశల్కు మొదటి బిడ్డగా కూతురు పుడుతుందని జోస్యం చెప్పారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీ అంచనా కేవలం 50 శాతం మాత్రమే నిజమంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం కూతుళ్ల సీజన్ నడుస్తోందని మరో నెటిజన్ ఫన్నీగా రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతోంది.కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా కైఫ్ చివరిసారిగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది. The first child of Vicky Kaushal and Katrina Kaif will be a daughter. pic.twitter.com/2wjWk7SaKN— Anirudh Kumar Mishra (Astrologer) (@Anirudh_Astro) October 8, 2025
- 
      
                   
                                                       ది ఇండియా స్టోరీ పూర్తి‘ది ఇండియా స్టోరీ’ సినిమాను పూర్తి చేశారు కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్సాడే, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ సినిమా ‘ది ఇండియా స్టోరీ’. డీకే చేతన్ దర్శకత్వంలో ఎమ్ఐజీ ప్రోడక్షన్స్ అండ్ స్టూడియోస్ పతాకంపై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు సోమవారం ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో లాయర్గా నటించారు కాజల్.రైతుల కష్టాలు, కార్పొరేట్ సంస్థలు తయారు చేసే పంటల పిచికారీ మందుల వ్యా పారాలు వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ సమాచారం. మురళీ శర్మ, మనీష్ వాధ్యా, త్రిషా సర్ధా కీలక పాత్రల్లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. 2026లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్.
- 
      
                   
                                                       58 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయిన నటుడుఅన్న పెళ్లి మాటే మర్చిపోయాడు. కానీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోవడమే కాదు, 58 ఏళ్ల వయసులో రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) గతంలో మలైకా అరోరాను పెళ్లి చేసుకోగా వీరికి అర్హాన్ ఖాన్ సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు.ఏడాదిన్నర తిరిగేలోపు..ఈ ఏడాది ప్రారంభంలో షురా గర్భం దాల్చింది. నేడు (అక్టోబర్ 5న) ముంబైలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన సల్మాన్.. ఫామ్హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి పయనమయ్యాడట! అర్బాజ్ ఖాన్.. ప్యార్ కియా తో డర్నా క్యా, హలో బ్రదర్, దబాంగ్, దబాంగ్ 2, దబాంగ్ 3, నిర్దోష్, తేరే ఇంతేజార్, మే జరూర్ ఆవుంగా వంటి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో జై చిరంజీవ మూవీలో విలన్గా నటించాడు. కిట్టు ఉన్నాడు జాగ్రత్త, శివం భజే సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు.చదవండి: హిమాలయాల్లో రజనీకాంత్.. వారం రోజులు అక్కడే!
- 
      
                   
                                                       ఏఆర్ రెహ్మాన్ను సైతం ఆకట్టుకున్న ఫాతిమా ఫ్యామిలీతిరువనంతపురంలోని ఆ ఇంట్లోకి అడుగు పెడితే సంగీత కళాశాలలోకి అడుగు పెట్టినట్లుగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ కుటుంబ సంగీత కచేరి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ముచ్చటపడిన సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు.ఫాతిమా వయోలిన్ వాయిస్తుంది. ఆమె చెల్లి గిటార్ వాయిస్తుంది. ఆమె తండ్రి తబలా వాయిస్తూ గానం చేస్తాడు. వీరందరూ కలిసి రెహమాన్ ట్యూన్ చేసిన ‘గురు’ సినిమాలోని ‘తెరే బినా’పాటను అద్భుతంగా ఆలాపించారు. ‘హార్ట్’ ‘క్లాప్’ ఇమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. View this post on Instagram A post shared by Fathima Shadha (@fathimashadhav) కనుల, వీనుల విందు చేసే ఈ వీడియో చూస్తూ.... ‘ఆ ఇల్లు ఎంత అదృష్టం చేసుకుందో!’ అని స్పందించారు నెటిజనులు.కన్నుల.. వీనుల విందు
- 
      
                   
                                                       అవి నా చేతుల్లో ఉండవు: హృతిక్ రోషన్‘‘హీరో.. డైరెక్టర్.. నిర్మాత.. ఇలా ఓ సినిమాకి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సినిమా విజయం సాధించాలనే కోరుకుంటారు. అయితే అన్ని సినిమాలూ విజయం సాధిస్తాయని చెప్పలేం. వందశాతం ఎఫర్ట్ పెట్టి పనిచేయడమే నా చేతుల్లో ఉంటుంది. హిట్లు, ఫ్లాపులు అనేవి నా చేతుల్లో ఉండవు.. వాటిని నిర్ణయించేది ప్రేక్షకులే. ఓ సినిమా ఫలితం ఎలా ఉన్నా పాజిటివ్గానే తీసుకోవాలి’’ అని హీరో హృతిక్ రోషన్ తెలిపారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’.అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల అయింది. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ విషయంపై హృతిక్ రోషన్ తాజాగా స్పందించారు. ‘‘వార్ 2’ కోసం అయాన్ ముఖర్జీ చాలా కష్టపడ్డారు. తన ఎనర్జీ చూసి నాకు కూడా ఎంతో ఉత్సాహంగా పని చేయాలనిపించేది. ఈప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాను. ఒక నటుడిగా మన బాధ్యతను 100 శాతం పూర్తి చే యాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రతి దాన్ని సీరియస్గా కాకుండా ఈజీగానే తీసుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ, ఫలితం మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. వీటన్నిటినీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి’’ అంటూ హృతిక్ రోషన్పోస్ట్ చేశారు.
- 
      
                   
                                                       ఐదేళ్ల తర్వాత చేతికి పాస్పోర్ట్.. హీరోయిన్ భావోద్వేగంఐదేళ్ల క్రితం లాక్డౌన్ టైంలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ విషయమై అప్పట్లో ఇతడి మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు, కేసులు అంటూ ఆ కేసు చాన్నాళ్ల పాటు సాగుతూనే వచ్చింది. అయితే ఇన్నాళ్లకు ఈమెకు కొంతమేర విముక్తి దొరికినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ నుంచి మాస్క్ మ్యాన్ ఎలిమినేట్.. కాకపోతే!)దాదాపు ఐదేళ్ల తర్వాత పాస్పోర్ట్ తన చేతికి తిరిగొచ్చిందని రియా చక్రవర్తి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే తోటినటీనటులు కంగ్రాట్స్ చెబుతున్నారు. గత ఐదేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో రియానే స్వయంగా చెప్పింది. వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో విషయాల్లో రాజీ పడాల్సి వచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ కేసు విచారణ సమయంలో రియాకు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. పాస్పోర్ట్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఇన్నాళ్లకు తిరిగిచ్చేయడంతో రియా ఆనందగానికి హద్దుల్లేకుండా పోయింది.పశ్చిమ బెంగాల్కి చెందిన రియా చక్రవర్తి.. 'తూనీగ తూనీగ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైంది. మొత్తంగా ఏడెనిమిది చిత్రాల్లో మాత్రమే నటించింది. ఎప్పుడైతే సుశాంత్ సింగ్ చనిపోయాడో అప్పటినుంచి ఈమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇప్పుడు కొంతమేర క్లియర్ కావడంతో మళ్లీ సినిమా ఛాన్సులు వస్తాయేమో చూడాలి. ప్రస్తుతానికైతే రియా చక్రవర్తి.. బిగ్బాస్ షోలో పాల్గొని తనని తాను నిరూపించుకోవాలని అనుకుంటోంది.(ఇదీ చదవండి: నన్ను 'లేడీ ప్రభాస్' అని పిలుస్తుంటారు: శ్రీనిధి శెట్టి) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)
- 
      
                   
                                                       ‘కల్కి’2 కి బ్రేక్.. సాయి పల్లవితో చర్చలు.. నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి?ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కల్కి’ 2898 ఏడీ’(Kalki 2898 AD) ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్లో రిలీజైన అయిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ సమయంలోనే ప్రకటించాడు. అంతేకాదు దానికి సంబంధించిన వర్క్పైనే నాగ్ అశ్విన్ ఇన్నాళ్లు దృష్టి పెట్టాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని భావిస్తున్నవేళ ప్రభాస్ ఫ్యాన్స్కి నాగ్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ల పాటు పక్కకు పెట్టి.. ఓ లేడి ఓరియెంటెండ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.ఆలియా అవుట్.. సాయి పల్లవి ఇన్?కల్కి చిత్రానికి కంటే ముందే నాగ్ అశ్విన్ ఓ లేడీ ఓరియెంటెండ్ స్టోరీ రాసుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కి కథ కూడా వినిపించాడట. ఆమె కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ నుంచి ఆలియా తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో నాగ్ అశ్విన్కి నో చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ కథను సాయి పల్లవి(sai Pallavi)తో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే సాయి పల్లకి స్టోరీ నెరేట్ చేశాడని..ఆమె కూడా ఒప్పుకుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.కల్కి 2 ఎప్పుడు?వాస్తవానికి నాగ్ అశ్విన్ ఇప్పుడు కల్కి 2 చిత్రాన్నే తెరకెక్కించాలి. ఈ మేరకు పనులు కూడా ప్రారంభించారు. అయితే ప్రభాస్ డేట్స్ కుదరడం లేదట. ప్రస్తుతం ఆయన రాజాసాబ్(పాటలు), ఫౌజీ సినిమాల షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే ‘స్పిరిట్’ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. మరోవైపు సలార్ 2 స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. వీటి తర్వాతే కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది. ఈ లెక్కన దాదాపు ఏడాది వరకు ప్రభాస్(Prabhas) డేట్స్ దొరకడం కష్టమే. మరోవైపు ఈ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించారు. ఇప్పుడు కొత్త హీరోయిన్ని ఎంపిక చేయాలి. దీనికి కొంత సమయం పడుతుంది. అందుకే నాగ్ అశ్విన్ ఈ గ్యాప్లో మరో సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కూడా ఖాలీగానే ఉన్నాయట. ‘రామాయణ్’ మినహా ఆమె చేతిలో మరో చిత్రమేది లేదు. నాగీ కూడా వచ్చే రెండు, మూడు నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే నాగ్ అశ్విన్- సాయి పల్లవిల సినిమాను తెరపై చూడొచ్చు.
- 
      
                   
                                                       ఎంగేజ్మెంట్ : దేవ కన్యలా అన్షులా కపూర్, అమ్మకోసం అలా..!బాలీవుడ్ నిర్మాత, అందాల నటి దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ (Anshula Kapoor) గోర్ ధన (నిశ్చితార్థం) వేడుకలో తన దివంగత తల్లి మోనా శౌరీ (Mona Shourie)పై చూపిన ప్రేమ నెట్టింట విశేషంగా నిలుస్తోంది.బోనీ కపూర్ మొదటి భార్య దివంగత మోనా శౌరీ కుమార్తె అన్షులా కపూర్ తన చిరకాల ప్రియుడు రోహన్ ఠక్కర్ను త్వరలోనే పెళ్లాడనుంది. దీనికి సంబంధించి కపూర్ కుటుంబం గోర్ ధన వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది అన్షులా. ఈ క్రమంలో తన దివంగత తల్లి మోనా శౌరీ కోసం అన్షులా కపూర్ ఒక సీటును ఖాళీగా ఉంచడం, అందులో తనతోపాటు తల్లి ఉన్న ఫోటోను ఉంచడం అందరి హృదయాలను కరిగించింది. తన జీవితంలో ముఖ్యమైన రోజున తన తల్లి మిస్ అవుతున్న వైనాన్ని చెప్పకనే చెప్పింది. అమ్మ ప్రేమ.. అప్పటికీ... ఎప్పటికీ తమ చుట్టూనే ఉంటుంది. ఆమె మాట, ఆమె మాటల్లో పువ్వుల్లో ఆమె సీటులో, మా గుండెల్లో ఆమె ఎప్పుడూ శాశ్వతమే అని పోస్ట్ చేసింది. పర్పుల్ లెహంగాలో దేవకన్యలాఈ వేడుక కోసం అర్పితా మెహతా రూపొందించిన పర్పుల్ కరల్ లెహంగా, దానికి మ్యాచింగ్ చోళీ, దుప్పట్టాలో అన్షులా ఒక దేవకన్యలా కనిపించింది. ఆమె అందమైన మేకప్ జడతో తన లుక్ను అందంగా అమిరాయి. మరోవైపు, రోహన్ నల్లటి షేర్వానీలో అందంగా కనిపించాడు. అంతేకాదు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్ (బోనీ కపూర్ రెండో భార్య శ్రీదేవి పిల్లలు) తమ సోదరి అన్షులా గోర్ ధన వేడుకకు హాజరై సందడి చేశారు. కాబోయే బావగారితో ఫోటోలకు పోజులిచ్చారు. అన్షులా-రోహన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నట్లు సమాచారం.కాగా బోనీ కపూర్ మొదటి భార్య మోనాకు విడాకులిచ్చి, 1996లో హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు.అర్జున్ కపూర్, అన్షులా కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు కాగా జాన్వీ, ఖుషి కపూర్ శ్రీదేవి పిల్లలు.
- 
      
                   
                                                       ఇండియన్ అంకుల్లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళకొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్ అంకుల్స్ ఇలాగే చేస్తారు కదా!సెల్ఫీ ఫోటోలుఇట్స్ ఓకే.. నన్ను ఇండియన్ అంకుల్ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్క్రీమ్ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్ను ఈ పోస్ట్లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.సినిమాహిందీలో.. రామన్ రాఘవ్ 2.0, చెఫ్, ద బాడీ, లవ్ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్ సెల్వన్ ఫస్ట్, సెకండ్ పార్ట్స్లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్ ఇన్ హెవెన్, ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్ డైరెక్షన్లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్ చేస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్.. ఎప్పుడంటే?
- 
      
                   
                                                       రావణుడు కొంటెవాడు కానీ రాక్షసుడు కాదు: బాలీవుడ్ నటిరావణాసురుడు కొంటెవాడే కానీ రాక్షసుడు కాదంటోంది బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్. దసరా పండగనాడు రావణుడి బొమ్మను దహనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది దసరా రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ రావణా.. నువ్వు కాస్త కొంటెగా ఉన్నావే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం తప్ప అంతకుమించి ఏ తప్పూ చేయలేదు.తిండి పెట్టావ్తొందరపడి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశావు. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవమర్యాదలతో పోలిస్తే అప్పట్లో నువ్వే ఒక స్త్రీ(సీతాదేవి)ని ఎంతో గౌరవించావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. తన భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను నియమించావు(వాళ్లు అందంగా లేరనుకో..). పార్లమెంటులో ఉన్న సగం మంది సభ్యులకంటే కూడా నువ్వే ఎక్కువ చదువుకున్నావు. ట్వీట్ డిలీట్రావణుడి బొమ్మను కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న.. అంతే! హ్యాపీ దసరా అని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్పై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు ట్వీట్ను డిలీట్ చేసింది. కాగా సిమి గరేవాల్.. దో బడాన్, మేరా నామ్ జోకర్, కర్జ్ వంటి సినిమాల్లో నటించింది. యాంకర్గా టాక్ షోలు కూడా చేసింది. కొన్ని సీరియల్స్, సినిమాలకు డైరెక్టర్గానూ వ్యవహరించింది.చదవండి: తప్పు లేకపోయినా దివ్య కాళ్లు మొక్కిన మాస్క్ మ్యాన్..
- 
      
                   
                                                       ఏఐతో అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్కు ఐశ్వర్య దంపతుల షాక్!ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండానే అనేక వెబ్సైట్లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం అనుకూలంగా తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న అలాంటి వాటిని తొలగించేలా ఆదేశాలిస్తామని కోర్టు వెల్లడించింది.తాజాగా ఈ జంట మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా గూగుల్, యూట్యూబ్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ రూ.4 కోట్ల దావా వేశారు. ఏఐ సాయంతో రూపొందించిన వీడియో కంటెంట్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. లైంగికంగా అసభ్యకరమైన వీడియోలను రూపొందిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని.. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానెల్లో దాదాపు 259 వీడియోల కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.కాగా.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2008లో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉన్నారు. ఇక కెరీర్ విషయానికొస్తే ఐశ్వర్య ప్రస్తుతం ఎలాంటి సినిమాలు ప్రకటించలేదు. ఆమె చివరిసారిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-2 చిత్రంలో కనిపించింది.
- 
      
                   
                                                       రూ.40 కోట్ల మాదక ద్రవ్యాలు.. అదుపులో బాలీవుడ్ నటుడుబాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.40 కోట్ల విలువైన డ్రగ్స్ను సరఫరా చేస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు. ఈ మాదకద్రవ్యాల రాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.కాగా.. అస్సాంకు చెందిన నటుడు విశాల్ బ్రహ్మ ఇండస్ట్రీలో అవకాశాల్లేక ఆర్థిక సమస్యల వల్లే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం కొందరు స్నేహితుల నైజీరియా ముఠాతో పరిచయాలు ఏర్పడినట్లు సమాచారం. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు వెళ్లమని.. భారత్కు మాదకద్రవ్యాలు చేరవేసేందుకు కొంత నగదు ఇస్తామని ఆశ చూపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. కాగా.. రెండు వారాల క్రితమే ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లాడు. రిటన్ జర్నీలో ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ ఇచ్చాడని, అందులోనే డ్రగ్స్ ఉన్నట్టు సమాచారం. సింగపూర్ మీదుగా కాంబోడియా.. అక్కడి నుంచి చెన్నై.. చెన్నై నుంచి ఢిల్లీకి రైల్లో వెళ్లాలని నైజీరియా ముఠా అతనితో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా.. విశాల్ బ్రహ్మ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటించారు.
- 
      
                   
                                                       స్టార్ హీరోయిన్కు రెండోసారి ప్రెగ్నెన్సీ..!బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ (Sonam Kapoor) గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఆ తర్వాత 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2022లో మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పింది. తన ముద్దుల కుమారుడికి వాయు అనే పేరు పెట్టుకుంది. తాజాగా సోనమ్ కపూర్ రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించినట్లు లేటేస్ట్ టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తారని సమాచారం. సోనమ్ కపూర్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. కాగా.. సోనమ్ కపూర్ తన ప్రియుడు, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాని పెళ్లాడింది. (ఇది చదవండి: తల్లి అయ్యాక పూర్తిగా మారిపోయాను.. నచ్చితేనే చేస్తా : హీరోయిన్)ఇక సోనమ్ కపూర్ కెరీర్ విషయానికొస్తే..ఆమె చివరిసారిగా బ్లైండ్ (2023) చిత్రంలో కనిపించింది. ఈ మూవీని 2011లో అదే పేరుతో వచ్చిన కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పురబ్ కోహ్లీ, వినయ్ పాఠక్, లిల్లెట్ దుబే కీలక పాత్రల్లో నటించారు. ఆ తర్వాత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor)
- 
      
                   
                                                       దేనికీ భయపడను, ఎవరికీ తలవంచను: దీపికా పదుకొణెతానెన్నడూ భయపడిందే లేదంటోంది స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). కష్టతరమైన మార్గంలోనూ దర్జాగా నడిచానని, ప్రశ్నించేందుకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదని పేర్కొంది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్డీబీ (IMDB) 25 ఏళ్ల భారతీయ సినిమా (2000-2025) అంటూ 130 అత్యుత్తమ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది. అందులో 10 చిత్రాల్లో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించడం విశేషం.కష్టాలదారిలోనే నడిచా..ఈ అరుదైన ఘనత అందుకోవడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రెండు పెద్ద సినిమాలైన స్పిరిట్, కల్కి 2లు చేజారడంపైనా పరోక్షంగా కామెంట్లు చేసింది. ఈ మేరకు తన జర్నీ గురించి దీపిక మాట్లాడుతూ.. నటిగా ప్రయాణం ప్రారంభించిన కొత్తలో నేనెలా ఉండాలి? ఏం చేస్తే సక్సెస్ అవుతానని నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే నేను ముక్కుసూటిగా ఉన్నాను. ఏదైనా తప్పనిపిస్తే ప్రశ్నించేందుకు వెనకడుగు వేయలేదు. కష్టాలదారిలోనే కొనసాగాను, నాకెదురైన పరిస్థితులను సవాల్ చేస్తూ ముందడుగు వేశాను తప్ప ఎక్కడా తలవంచలేదు.నా తర్వాత వచ్చేవారికోసం..నా కుటుంబసభ్యులు, అభిమానులు నాపై ఉంచిన నమ్మకమే నేను తీసుకునే బలమైన నిర్ణయాలకు కారణం. నా తర్వాత వచ్చేవారు అనుసరించే మార్గాన్ని నేను శాశ్వతంగా మారుస్తానని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. బహుశా 8 గంటల షిఫ్ట్ గురించే ఆమె పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీపికా ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి కింగ్ మూవీ చేస్తోంది. అలాగే అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.చదవండి: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాశ్-సైంధవి
- 
      
                   
                                                       ప్రముఖ సింగర్ అనుమానాస్పద మృతి.. ఆ ఇద్దరు అరెస్ట్ప్రముఖ గాయకుడు, కింగ్ ఆఫ్ హమ్మింగ్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) మృతి కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) నిర్వాహకుడు శ్యాంకను మహంత, జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్దార్థ శర్మను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్లో ఈవెంట్ ముగించుకుని వచ్చిన మహంతను న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో, సిద్దార్థ శర్మను గురుగ్రామ్లోని అతడి అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిద్దరినీ గౌహతికి తీసుకెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు.సింగర్ అనుమానాస్పద మృతిసింగపూర్లో జరిగిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన జుబీన్.. సెప్టెంబర్ 19న సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఆ సమయంలో అతని ఒంటి మీద లైఫ్ జాకెట్ లేదు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగర్ మృతికి కారణమైనవారిని వదిలేది లేదని అస్సాం ముఖ్యమత్రి హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది.ఎవరీ జుబీన్ గార్గ్?జుబీన్ గార్గ్ అసలు పేరు మోహిని మోహన్. 1972 నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. తల్లి గాయని, తండ్రి కవి కావడంతో ఇద్దరి ప్రతిభను అందిపుచ్చుకుని మంచి గాయకుడిగా మారారు. మూడేళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. ప్రఖ్యాత సంగీతకారుడు జుబీన్ మెహతా అంతటివాడు కావాలని జుబీన్ గార్గ్ అని పెట్టుకున్నారు. 40కిపైగా భాషల్లో పాటలు పాడారు. సింగర్గానే కాకుండా రచయిత, సంగీత దర్శకుడు, సినీ దర్శకుడు, నటుడిగా ప్రేక్షకులను అలరించారు.చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు
- 
      
                   
                                                       వివాదాలు సృష్టించవద్దు!: ఫరా ఖాన్దర్శకురాలు ఫరా ఖాన్, హీరోయిన్ దీపికా పదుకోన్ల మధ్య అబీప్రాయభేదాలొచ్చాయని, అందుకే ఇన్స్టాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారన్నది బాలీవుడ్ టాక్. దీపిక కెరీర్లోని రెండు బ్లాక్బస్టర్ చిత్రాలు ‘ఓం శాంతి ఓం’ (2007), ‘హ్యాపీ న్యూ ఇయర్’ (2014)లో షారుక్ ఖాన్ హీరోగా నటించగా, ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇలా దీపిక–ఫరాల మధ్య మంచి అనుబంధం ఉంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినిమాల్లో హీరోయిన్స్ 8 గంటలే పని చేయాలన్నట్లుగా, ‘ఎయిట్ అవర్స్ షిఫ్ట్’ కాన్సెప్ట్ గురించి దీపిక మాట్లాడారు. ఈ కాన్సెప్ట్పై భిన్నాబీప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల ఓ షోలో పాల్గొన్న ఫరా ఈ ‘ఎయిట్ అవర్స్ షిప్ట్’ గురించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో దీపికను ఉద్దేశించే ఫరా ఖాన్ అలా మాట్లాడారని, అందుకే వీరిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాలో అన్ఫాలో అయ్యారని ప్రచారమవుతోంది.ఈ ప్రచారంపై ఫరా స్పందించారు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా షూటింగ్ సమయంలోనే నేను, దీపిక ఇన్స్టాలో కాకుండా డైరెక్ట్ మెసేజ్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడాలనుకున్నాం. అప్పుడే మేం ఒకరినొకరం అన్ఫాలో అయ్యాం. కొన్ని వెబ్పోర్టల్స్ కొత్త వివాదాలు సృష్టిస్తున్నారు’’ అంటూ తన ఇన్స్టా స్టోరీలో ఫరా షేర్ చేశారు. ఈ స్టోరీకి ఓ నమస్కారం ఎమోజీతో దీపిక స్పందించారు.
- 
      
                   
                                                       గంగూభాయి కతియావాడి స్టోరీ.. ఆలియా భట్ కోసం కాదట!బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సూపర్ హిట్ చిత్రం గుంగూభాయి కతియావాడి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డ్ను సాధించిపెట్టింది. అలియా భట్ లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా పది విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డులు సాధించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా ఆదిత్య నారాయణ్ గంగూభాయి కతియావాడి మూవీ గురించి మాట్లాడారు.ఈ చిత్రానికి మొదట ఆలియా భట్ను తీసుకోవాలని అనుకోలేదని ఆదిత్య నారాయణ్ వెల్లడించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో పాల్గొన్న ఆదిత్య నారాయణ్.. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గంగూబాయి కతియావాడి సినిమాను ఇటీవలే జాతీయ అవార్డ్ అందుకున్న రాణి ముఖర్జీతో తెరకెక్కించాలని అనుకున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనే ఆసక్తితోనే సంజయ్ వద్ద అసిస్టెంట్గా చేరానని తెలిపారు. అయితే మొదట్లో భన్సాలీ తనను సీరియస్గా తీసుకోలేదని.. విసుగొచ్చి మానేస్తాడని అనుకున్నాడని పేర్కొన్నారు. ఓ వారం తర్వాత నాకు పని చెప్పడం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ వద్ద రామ్-లీలా, గంగూబాయి కతియావాడి (2022) మూవీస్ స్క్రిప్ట్లు ఉన్నాయని తెలిపారు. అప్పుడే రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో గంగూబాయి కతియావాడిని నిర్మించాలని ఆలోచన ఉందని మాతో చెప్పాడని పేర్కొన్నారు.
- 
      
                   
                                                       పెళ్లి చేసుకున్న చిన్నారి పెళ్లి కూతురు.. గ్రాండ్గా వెడ్డింగ్చిన్నారి పెళ్లి కూతురు సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది జూన్లో నిశ్చితార్థం ముద్దుగుమ్మ సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.కాగా.. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. తెలుగులోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఉయ్యాలా జంపాలా' మూవీతో పరిచయంలోనే హిట్ కొట్టిన ఈమె.. తర్వాత సినిమా చూపిస్త మావ, లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, రాజుగారి గది 3, థ్యాంక్యూ లాంటి తెలుగు మూవీస్ చేసింది, ప్రస్తుత 'షణ్ముఖ' సినిమాలో చేస్తోంది. అసలు విషయానికొస్తే.. 2019లో సామాజిక కార్యకర్త అయిన మిలింద్ని ఓ సందర్భంలో అవికా కలిసింది. అలా ఏడాది పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ 2020 నుంచి దాదాపు ఐదేళ్లుగా ప్రేమాయణం కొనసాగించారు. తాజాగా ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
- 
      
                   
                                                       హర్ట్ అయిపోయిన దీపిక.. ఆ డైరెక్టర్తో కటీఫ్బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో రెండుసార్లు కలిసి పనిచేసిన ఓ దర్శకురాలి మాటలకు హర్ట్ అయింది. ఆమె ఏదో సరదాగా అన్న వ్యాఖ్యల్ని మరీ సీరియస్గా తీసుకున్న దీపిక.. దూరం పెట్టేసింది. సోషల్ మీడియాలోనూ అన్ ఫాలో కొట్టేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఎవరా డైరెక్టర్?కొన్ని రోజులు క్రితం దీపిక పదుకొణెని ప్రభాస్ 'స్పిరిట్' కోసం హీరోయిన్గా తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నాడు. ఈ మేరకు డిస్కషన్ జరిగింది. అంతా ఓకే అనుకునే టైంలో దీపిక చెప్పిన కండీషన్స్ నచ్చక.. సందీప్ తన మూవీ నుంచి దీపికని పక్కకు తప్పించాడనే టాక్ వచ్చింది. దీంతో ఈ టైంలో చాలామంది సందీప్ కి సపోర్ట్గా నిలిచారు. మరికొందరు దీపికకు సపోర్ట్ చేశారు. మొన్నీమధ్య ప్రభాస్ 'కల్కి' టీమ్ కూడా దీపిక తాము తీయబోయే సీక్వెల్లో ఉండదని తేల్చి చెప్పారు.(ఇదీ చదవండి: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'జూనియర్')అయితే దీపిక.. రోజుకు 7 గంటలే పనిచేస్తానని చెప్పిందని, తన టీమ్ దాదాపు 25 మంది కోసం ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్స్, ఫుడ్ లాంటివి కావాలని అడిగిందని.. అలానే రెమ్యునరేషన్ కూడా తొలి పార్ట్కి తీసుకున్న దానికంటే భారీగా డిమాండ్ చేసిందని.. అందుకే 'కల్కి' మేకర్స్ దీపికని తప్పించారని మాట్లాడుకున్నారు. తాజాగా ఓ షోలో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరా ఖాన్ పాల్గొంది. నటీనటుల వర్కింగ్ అవర్స్(పనిగంటలు) గురించి ఫన్నీగా కామెంట్ చేసింది.'ఆమె ఇప్పుడు పనిచేసేదే 8 గంటలు, ఇక ఈ షోకు ఎలా వస్తారా? ఆమెకు అంత టైమ్ ఎక్కడ ఉంటుంది' అని చెప్పి దీపికని ఉద్దేశిస్తూ పరోక్షంగా ఫరా ఖాన్ ఫన్నీగా మాట్లాడింది. ఈ మాటలకు దీపిక బాగానే హర్ట్ అయిపోయినట్లు ఉంది. ఇన్ స్టాలో ఫరా ఖాన్ని అన్ ఫాలో చేసింది. దీంతో ఫరా కూడా దీపికని అన్ ఫాలో చేసింది. గతంలో ఫరా తీసిన 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూఇయర్' సినిమాల్లో దీపికనే హీరోయిన్. కానీ ఇప్పుడు కామెడీగా చేసిన కామెంట్స్ ఇద్దరి మధ్య దూరానికి కారణమైనట్లు కనిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్ షాక్..!)
- 
      
                   
                                                       మనం కలిసి బతుకుదామా...‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్హెచ్సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి.
- 
      
                   
                                                       చాహల్తో పెళ్లి.. మొదటి ఏడాదిలోనే అంతా తెలిసిపోయింది: ధనశ్రీ వర్మప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుని ఆరు నెలలైనా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా ఉన్న ధనశ్రీ.. తన వివాహం, విడాకులపై కామెంట్స్ చేస్తూనే ఉంది. తాజాగా చాహల్ వివాహం తర్వాత ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. చాహల్ తనను మోసం చేశాడని షాకింక్ విషయాన్ని రివీల్ చేసింది. పెళ్లైన మొదటి ఏడాది రెండో నెలలోనే అతని మోసాన్ని కనిపెట్టానని ధనశ్రీ తెలిపింది. దీంతో మరోసారి చాహల్- ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ఈ షోలో తన వివాహ బంధంపై ధనశ్రీ వర్మకు ఓ ప్రశ్న ఎదురైంది. చాహల్తో పెళ్లి.. పొరపాటు చేశానని మీకెప్పుడు అనిపించింది? అని మరో కంటెస్టెంట్ కుబ్రా సైత్ అడిగింది. దీనిపై చాహల్ మాజీ భార్య ధనశ్రీ స్పందించింది. పెళ్లైన మొదటి సంవత్సరం.. రెండవ నెలలోనే చాహల్ను పట్టుకున్నా అంటూ సమాధానమిచ్చింది. ఈ సమాధానం విన్న కుబ్రా సైత్ షాకింగ్రు గురైంది. కాగా.. చాహల్తో విడాకుల తర్వాత ధనశ్రీ పెద్ద మొత్తంలో భరణం డిమాండ్ చేసిందనే వార్తలొచ్చాయి. ఈ షోలోనే వీటిపై కూడా క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ కొట్టిపారేసింది ధనశ్రీ వర్మ.
- 
      
                   
                                                       మాజీ భార్య మరణం.. స్పందించని అదుర్స్ నటుడు!బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్లో అదుర్స్, సాహో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) మాజీ భార్య మరణించింది. ఆయన మొదటి భార్య, ఫ్యాషన్ డిజైనర్ దీపా మెహతా ఇవాళ కన్నుమూశారు. తల్లి మరణ వార్తను కుమారుడు సత్య మంజ్రేకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్ యూ అమ్మా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.దీపా మెహతా మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్ మంజ్రేకర్, దీపా మెహతాను 1987లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1995లో విభేదాలు రావడంతో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి కుమారుడు సత్య మంజ్రేకర్, కుమార్తె అశ్వమి మంజ్రేకర్ ఉన్నారు. ఆ తర్వాత మహేశ్ మేధా మంజ్రేకర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సాయి మంజ్రేకర్ అనే కుమార్తె ఉంది. అయితే మాజీ భార్య మరణం పట్ల మహేశ్ ఎలాంటి పోస్ట్ చేయలేదు.కాగా.. మహేశ్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) వాస్తవ్ అనే చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. వాస్తవ్ సినిమాలో సంజయ్దత్, నమ్రత శిరోద్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. పరేశ్ రావల్, దీపక్, సంజయ్ నర్వేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ 1999 అక్టోబర్లో విడుదలైంది. వాస్తవ్ హిట్టవడంతో దర్శకుడు మహేశ్ దీనికి సీక్వెల్గా హత్యార్ తీశాడు. ఇందులోనూ సంజయ్ దత్ హీరోగా నటించాడు. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు భాషల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో ఎన్టీఆర్ నటించిన అదుర్స్.. ప్రభాస్ సాహో మూవీస్లోనూ మెప్పించాడు.
- 
      
                   
                                                       రష్మిక.. ఎప్పుడూ జిమ్లోనే ఉంటావా?పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం బిజీ యాక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక మాత్రమే. ఎందుకంటే ఓవైపు ప్రాంతీయ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడు మూవీస్ కూడా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. సరే ఇదంతా పక్కనబెడితే రష్మిక గురించి తోటి హీరోయిన్ ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: రష్మిక గ్లామరస్ సాంగ్ విడుదల)ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర చిత్రాలతో వచ్చింది. వీటిలో రెండు హిందీ మూవీస్. వచ్చే నెలలో 'థామా' అనే బాలీవుడ్ హారర్ సినిమాతో రాబోతుంది. ఇది కాకుండా 'గర్ల్ ఫ్రెండ్' అనే తెలుగు చిత్రం కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీ కూడా చేస్తోంది. ఇందులో రష్మికతో పాటు కృతి సనన్ హీరోయిన్గా చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరూ ఓ జిమ్లో కలిశారు. అయితే కృతి అక్కడకి వెళ్లడానికంటే ముందే రష్మిత వర్కౌట్స్ చేస్తూ కనిపించింది.'రష్మిక నువ్వు ఎప్పుడు చూసినా జిమ్లోనే కనిపిస్తున్నావ్. కొంపదీసి ఇక్కడే బతికేస్తున్నావా?' అని కృతి సనన్ నవ్వుతూ అడగ్గా.. బదులిచ్చిన రష్మిక.. 'నువ్వు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఉంటున్నాను. ఎక్కువగా ఏం చేయడం లేదు' అని నవ్వేసింది. 'నువ్వు చాలా కష్టపడుతున్నావ్' అని కృతి సనన్ అనేసరికి వీళ్లిద్దరూ గట్టిగా నవ్వేసుకున్నారు. ఈ వీడియోని కృతి సనన్ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతి)The only place @iamRashmika isn't tired is the gym! 💪 @kritisanon caught the gym beast in action. 😂 Can't wait for her to bring this energy to the sets of #Cocktail2 soon. More shooting pics with the cast, pls. 🙏Thank u kriti 4 this video 🫶#KritiSanon #RashmikaMandanna ❤️ pic.twitter.com/eMGk2hYSDG— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) September 28, 2025
- 
      
                   
                                                       విషాదం.. 'వీర్ హనుమాన్' బాల నటుడు మృతిప్రమాదం ఏ వైపు నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. ఇప్పుడు కూడా అలా అనుకోని సంఘటన కారణంగా ఓ బాల నటుడు, అతడి సోదరుడు కన్నుమూశారు. ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతుండగా జరిగిన అగ్ని ప్రమాదం కాస్త ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. దీంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.(ఇదీ చదవండి: 'స్పిరిట్'లో మలయాళీ భామ.. మరో బాలీవుడ్ బ్యూటీ ఔట్!)హిందీలో 'శ్రీమద్ రామాయణ్', 'వీర్ హనుమాన్' సీరియల్స్లో నటించిన వీర్ శర్మ(10), ఇతడి సోదరుడు శౌర్య శర్మ(15) ఆదివారం రాత్రి ఇంట్లో ఓ గదిలో నిద్రపోతున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి, అన్నదమ్ములిద్దరూ పడుకుని ఉన్న రూంతో పాటు హాల్ అంతా పొగ వ్యాపించింది. అయితే గాఢనిద్రలో ఉండేసరికి వీర్, శౌర్య కదల్లేక పొగ పీల్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.ఈ ప్రమాదం జరిగే సమయంలో వీర్ తల్లి మరో గదిలో ఉండగా.. తండ్రి బయటకు వెళ్లారు. దీంతో వీళ్లకు ఏమి కాలేదు. చిన్నారులు మాత్రం తుదిశ్వాస విడిచారు. అయితే కొడుకులు చనిపోయారే బాధలో ఉన్నప్పటికీ.. పిల్లలిద్దరూ కళ్లని దానం చేసేందుకు తల్లదండ్రులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ విషయం హిందీ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే సీరియల్స్ చేసిన వీర్.. త్వరలో ఓ హిందీ సినిమాతో బిగ్ స్క్రీన్పై కనిపించబోతున్నాడు. ఇంతలోనే ఇలా జరగడం ఆ పిల్లల తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చింది.(ఇదీ చదవండి: 'బాయ్కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?)
- 
      
                   
                                                       లతా మంగేష్కర్కి నివాళిగా...బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘120 బహదూర్’. ఈ దేశభక్తి చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహించగా, రాశీ ఖన్నా కీలక పాత్రలో నటించారు. 1962లో జరిగిన భారత్–చైనా యుద్థం నేపథ్యంలో మేజర్ షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మేజర్ షైతాన్ సింగ్గా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నారు. రెజాంగ్ లా యుద్ధ సంఘటనలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. ఆదివారం ఈ సినిమా సెకండ్ టీజర్ను విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే... భారత్–చైనా (1962) యుద్ధంలో వీరమరణం పొందిన భారత అమరవీరులను గౌరవించేందుకు 1963లో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ అనే పాటను ఆలపించగా, ఈ పాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది.ఆదివారం (సెప్టెంబరు 28) లతా మంగేష్కర్ జయంతి. తాజాగా విడుదలైన ‘120 బహదూర్’ సినిమా సెకండ్ టీజర్ బ్యాక్గ్రౌండ్లో ‘ఏ మేరే వతన్ కే..’ పాట వినిపించింది. ఈ విధంగా లతా మంగేష్కర్కు ‘120 బహదూర్’ టీమ్ ప్రత్యేక నివాళిగా సెకండ్ టీజర్ను రిలీజ్ చేసింది. ఈ ఏడాది నవంబరు 21న ఈ చిత్రం థియేటర్స్లో రిలీజ్ కానుంది.
- 
      
                   
                                                       ప్రేమ విహారంఇటలీ వీధుల్లో ప్రేమవిహారం చేస్తున్నారు హీరోయిన్ రష్మికా మందన్నా. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్ఫుల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘కాక్టైల్ 2’. హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోందని తెలిసింది. షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీ సనన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా షాహిద్ కపూర్, రష్మికల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఇటలీ షూటింగ్ షెడ్యూల్లో టాకీ పార్టుతో పాటు సాంగ్స్ని కూడా చిత్రీకరించాలని ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోనే ఈ సినిమా మేజర్ షూటింగ్ జరుగుతుందని బాలీవుడ్ భోగట్టా. దినేష్ విజన్, లవ్ రంజన్ నిర్మిస్తున్న ఈ ‘కాక్టైల్ 2’ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుంది. ఇక సైఫ్ అలీఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటీ ప్రధాన పాత్రధారులుగా హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘కాక్టైల్ (2012)’కి సీక్వెల్గా ‘కాక్ టైల్ 2’ చిత్రం తెరకెక్కుతోంది.
- 
      
                   
                                                       లతా మంగేష్కర్ జయంతి.. స్పెషల్ టీజర్తో నివాళి!బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళిగా ప్రత్యేక టీజర్ను విడుదల చేశారు. 1962 భారత-చైనా యుద్ధంలో అమరవీరులను గౌరవించటానికి లతా మంగేష్కర్ 1963లో మొదటిసారి 'ఏ మేరే వతన్ కే లోగోన్' అనే సాంగ్ను ఆలపించారు. ఈ పాట చాలా కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.కాగా.. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే యుద్ధ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్లోని విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్లో రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, అమిత్ చంద్రా నిర్మించారు.
- 
      
                   
                                                       దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ప్రతీ ఏడాది ముంబైలో జరిగి దసరా ఉత్సవాలు, దుర్గా పూజలో బాలీవుడ్ హీరోయిన్లు ఉత్సాహంగా పాల్గొనడం ఆనవాయితీ. ముఖ్యంగా కాజోల్ , రాణి ముఖర్జీ ఈ కార్యక్రమాల్లో ముందంజలో ఉంటూ బంధుజనంతో కలివిడిగా తిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కానీ ఏడాది ఉత్సవాల్లో వారిద్దరూ తీవ్ర భావోద్వాగానికి లోనయ్యారు. అటు తన తండ్రి తరువాత అయాన్ ముఖర్జీ దుర్గా పూజ ఉత్సవాల్లో తొలిసారి పాల్గొన్నారు. తమ సమీప బంధువు, అత్యంత ఆప్తుడైన నటుడు దేబ్ ముఖర్జీ ఈ ఏడాదితమ మధ్య లేకపోవడమే ఇందుకు కారణం. ఆయనను గుర్తు చేసుకుని ఆయన మేనకోడళ్ళు నటీమణులు కాజోల్ , తనీషా రాణీ ముఖర్జీ భావోద్వాగానికి లోనయ్యారు. ఈ దృశ్యలు ఆన్లైన్లో దర్శనిమిచ్చాయి. ప్రతి సంవత్సరం దుర్గా పూజ పండల్ ఘనంగా దేబ్ ముఖర్చీ ఈ ఏడాది లేరు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చిత్రనిర్మాత,బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ. ఫ్యామిలీ అంతా ప్రేమగా 'దేబు కాకా' అని పిల్చుకునే దేబ్ ముఖర్జీ మార్చి 14, 2025న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ ఏడాది తమ కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి, ఉత్సవాలను కలిసి ప్రారంభించారు కాజోల్, రాణీ ముఖర్జీ తనీషా ముఖర్జీ తదితర కుటుంబ సభ్యులు నార్త్ బాంబే సర్బోజానిన్ దుర్గా పూజ పండల్ను ఆవిష్కరించారు.రాణి ముఖర్జీ కుటుంబం యొక్క దుర్గా పూజ 2025 కి సహ-నిర్వాహకురాలిగా ఉన్నారు.‘‘అయిగిరి నందిని’’అనే స్తోత్రం మధ్య కాజోల్, రాణి దుర్గా మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అమ్మవారిని చూడగానే ఇద్దరూ భక్తితో చేతులో జోడించి నమస్కరించారు. అనంతర అటు అమ్మవారి రూపాన్ని చూసి, ఇటు దివంగత దేబ్ ముఖర్జీని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. VIDEO | Mumbai, Maharashtra: Actors Kajol and Rani Mukherjee witness the unveiling of the Goddess' idol at the North Bombay Sarbojanin Durga Puja Samiti. (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/EgP2o1xVOH— Press Trust of India (@PTI_News) September 27, 2025ఈ సందర్భంగా తనీషా మాట్లాడుతూ"మా కుటుంబానికి ఇది కొంచెం విచారకరమైన సమయం, కొంచెం ఉత్సాహంతో పాటు, ఈ సంవత్సరం మా కుటుంబంలో ముగ్గురు ఆప్తులను కోల్పోయాం. ప్రతి సంవత్సరం దుర్గా పూజను నిర్వహించే మా దేబు కాకా (దేబ్ ముఖర్జీ) ఇక లేరు, ఈసారి పూజకు హాజరు కావడం కొంచెం కష్టంగానే అనిపించింది. అయినా గానీ ఆయన కలను ముందుకు తీసుకెళ్తున్నందున చాలా ఆనందంగా కూడా ఉంది." అన్నారు. View this post on Instagram A post shared by Rohit Saraiya (@rohitsaraiya.official)
- 
      
                   
                                                       ఆమెకు ముద్దులిస్తే..వారానికి రూ. 1000 ఇచ్చేది : స్టార్ హీరోబాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్గా ఎదిగాడు. ఆస్తులు, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ..ఆయనకు ఈజీగా చాన్స్లు రాలేదు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. హీరోగా చాన్స్ రాకకోవడంతో సెకండ్, థర్డ్ లీడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. 1993లో పరంపర సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం పట్టింది. ఒకానొక దశలో పాత్రల కోసం అడుక్కోవాల్సి వచ్చిందంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదైరన ఓ వింత ఘటన గురించి చెప్పాడు. డబ్బుల కోసం ఓ మహిళా నిర్మాతకు పదిసార్లు ముద్దులు పెట్టానని చెప్పాడు.(చదవండి: సినిమా బాగోలేకపోతే నేనేం చేస్తా? మహేశ్ ఫ్యాన్స్ అన్న మాటలకు ఏడ్చేశా..)‘కెరీర్ ప్రారంభంలో చాన్స్లు రాలేదు. ఓ మహిళా నిర్మాత ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చేది. అయితే ఆమె ఒక కండీషన్ పెట్టింది. తన బుగ్గలపై ముద్దు పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా 10 ముద్దులు పెట్టి వారానికి రూ. 1000 తీసుకునేవాడిని’అని సైఫ్ చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. మరి ఆ ఇద్దరు ఏం త్యాగం చేశారు? శ్రీజకు పనిష్మెంట్!)ఇక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతోనే అవకాశాలు వచ్చాయన్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించాడు. ‘నాకు సినిమా బ్యాక్గ్రౌండ్( బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ కొడుకే సైఫ్) ఉందని, అదృష్టంతో స్టార్ అయ్యానని అంతా అనుకుంటారు. కానీ నాకు అవకాశాలు అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేనని నేను భావిస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేం’ అన్నారు. కాగా సైఫ్కు 2001లో వచ్చిన ‘దిల్ చాహ్తా హై’ మూవీతో మంచి బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. చివరగా జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్తో కలిసి ‘హైవాన్’అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ థ్రిల్లర్ చిత్రానికి పిరయదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిహేడేళ్ల క్రితం హిందీ చిత్రం ‘తషాన్’ (2008)లో అక్షయ్ కుమార్–సైఫ్ అలీఖాన్ నటించారు. మళ్లీ ఇప్పుడు ‘హైవాన్’లో ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్నారు.
- 
      
                   
                                                       'ద ట్రయల్ 2' రివ్యూ: ఈ సిరీస్ పెద్దల కోసమే!ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ‘ది ట్రయల్’ రెండో సీజన్ ఒకటి. ఈ సిరీస్ గురించి తెలుసుకుందాం.ఏదైనా నేరం జరిగితే తగిన సాక్ష్యాలతో నేరస్థుడిని నిరూపించే ప్రక్రియలో న్యాయవాదులు ఉంటారు. ఆ న్యాయవాదుల సమూహంగా కొన్ని కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీలలో ఎంతో మంది న్యాయవాదులు తమ క్లయింట్ల తరఫున కోర్టులో విచారణకు హాజరవుతుంటారు. అటువంటి లా ఫర్మ్లపై తీసిన సిరీస్ ‘ది ట్రయల్’. 2023లో ఈ సిరీస్ మొదటి భాగం హాట్ స్టార్ వేదికగా రిలీజ్ అయింది. మళ్ళీ రెండేళ్ళకు దానికి కొనసాగింపుగా ఇప్పుడు 2025లో ‘ది ట్రయల్’ రెండో సీజన్ రిలీజ్ అయింది. కాజోల్ ప్రధాన పాత్రలో నటించగా ఆమె భర్త అజయ్ దేవగన్ ఈ సిరీస్కి నిర్మాతగా వ్యవహరించడం విశేషం.రెండు సిరీస్లు కలిపి 14 ఎపిసోడ్లతో ఉన్న ‘ది ట్రయల్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ కథాంశానికొస్తే... న్యోనికాసేన్ గుప్తా ఓ పేరున్న ఫర్మ్లో మంచి లాయర్. ఆమె భర్త రాజకీయ నాయకుడు. ఆమె చేస్తున్న లా ఫర్మ్లో ఎన్నో రాజకీయాలతో ఆమె ప్రమోషన్ని అడ్డుకుంటూ న్యోనికా కుటుంబానికి కూడా ఆపద కలిగిస్తుంటారు ఆమె ప్రత్యర్థులు. ఆ లా ఫర్మ్లోకి వచ్చే కేసులు కూడా ఈ భార్యాభర్తలకు లింకు అవుతుంటాయి. ఆ లింకులు పెద్ద పెద్ద కష్టాలనే తెచ్చిపెడతాయి. మరి... ఆ కష్టాలన్నింటినీ తట్టుకుని తన క్లయింట్ల కేసులను వాదిస్తూ, ఫర్మ్లోని రాజకీయాలను ఎదుర్కొంటూ న్యోనికా నిజంగా ట్రయల్ గెలుస్తుందా? లేదా అన్నది మాత్రం సిరీస్లోనే చూడాలి. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది ట్రయల్’ మంచి కాలక్షేపం. ఈ లా ఫర్మ్ కథలు పెద్దలు మాత్రమే చూడదగినవి. ఎంజాయ్..– హరికృష్ణ ఇంటూరు
- 
      
                   
                                                       బాలీవుడ్ ఎంట్రీ‘హిట్ 2, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్నారు మీనాక్షీ చౌదరి. ఈ బ్యూటీ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైందని సమాచారం. జాన్ అబ్రహాం నటించనున్న హిందీ చిత్రం ‘ఫోర్స్ 3’లోని హీరోయిన్ పాత్ర కోసం మీనాక్షీ చౌదరిని ఎంపిక చేసిందట యూనిట్. భావ్ దులియా దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మీనాక్షి పాత్రకూ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, ఇందుకోసం ఆమె శిక్షణ తీసుకోనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయని, కొన్ని వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయని భోగట్టా. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
- 
      
                   
                                                       మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా...ప్రతి ఇండస్ట్రీలోనూ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతూనే ఉంటాయి. ఓ సీనియర్ హీరో, ఓ రైజింగ్ హీరో కలిసి చేసిన మల్టీస్టారర్ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు స్టార్స్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి మల్టీస్టారర్ సినిమాలూ ఉన్నాయి. కానీ ఇండస్ట్రీలో సుధీర్ఘమైన సక్సెస్ఫుల్ కెరీర్తో రాణించిన తర్వాత కొంత గ్యాప్ తీసుకుని, ఇద్దరు సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తుండటం, చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ‘మల్టీస్టారర్ చేసేద్దాం మిత్రమా’ అంటూ రెడీ అయిన కొంతమంది సీనియర్ హీరోలు చేస్తున్న మూవీస్పై ఓ లుక్ వేయండి.46 సంవత్సరాల తర్వాత... కెరీర్ తొలినాళ్ళలో ‘అపూర్వ రాగంగాళ్, మూండ్రు ముడిచ్చు, అంతులేని కథ’... ఇలా దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో కలిసి నటించారు రజనీకాంత్, కమల్హాసన్. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ తర్వాత రజనీకాంత్, కమల్హాసన్ కలిసి నటించింది లేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది. రజనీకాంత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే హ్యాపీ అని ఇటీవల ఓ సందర్భంలో కమల్హాసన్ చె΄్పారు.ఇలా కమల్ చెప్పిన తక్కువ రోజుల్లోనే కమల్హాసన్తో తాను సినిమా చేస్తున్నానని, రెడ్ జెయింట్ మూవీస్–కమల్హాసన్ ప్రోడక్షన్ హౌస్ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తాయని రజనీకాంత్ స్పష్టం చేశారు. దీంతో రజనీకాంత్, కమల్హాసన్ కలిసి సినిమా చేయనున్నారనే ప్రచారం కోలీవుడ్లో ఊపందుకుంది.కాగా, ఈ చిత్రానికి తొలుత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరిగింది. కమల్తో ‘విక్రమ్’ వంటి హిట్ మూవీ తీశారు లోకేశ్. అలాగే రజనీకాంత్కు ‘కూలీ’తో తమిళనాట మంచి విజయాన్ని అందించారు లోకేశ్. దీంతో కమల్–రజనీకాంత్ కాంబినేషన్ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మంచి కథ, స్క్రీన్ ప్లే కుదిరితేనే లోకేశ్తో సినిమా చేయాలని భావిస్తున్నారట కమల్–రజనీ. అంతేకాదు... మరికొంత మంది యువ దర్శకులను కూడా మంచి కథల కోసం అ్రపోచ్ అవుతున్నారట.తాజాగా ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడిగా ‘కోమలి’ సినిమాతో తొలి ప్రయత్నంతోనే హిట్ అందుకున్న ప్రదీప్ రంగనాథ్ ఆ తర్వాత ‘లవ్ టుడే’ సినిమాతో దర్శకుడితో పాటు హీరోగానూ సక్సెస్ అయ్యారు. రజనీకాంత్–కమల్హాసన్ కాంబినేషన్కు తాజాగా ఈ యువ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. ఫైనల్గా 46 సంవత్సరాల తర్వాత కమల్హాసన్–రజనీకాంత్ కాంబోతో రానున్న సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.పండక్కి వస్తున్నారు సిల్వర్స్క్రీన్పై ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, వెంకటేశ్ కనిపిస్తే తెలుగు ఆడియన్స్కు పండగే. అదీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా పండక్కి రిలీజైతే, ఈ పండగ సంక్రాంతి అయితే... ఇక చెప్పేది ఏముంది? వినోదాల సంబరాలు రెట్టింపు అవుతాయి. వచ్చే సంక్రాంతికి ఈ వినోదాల సంబరాలను సిల్వర్ స్క్రీన్పై చూపించనున్నారు ‘మన శంకర వరప్రసాద్గారు’. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, వెంకటేశ్, కేథరీన్, వీటీవీ గణేశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాకు ఫ్యామిలీ ఎమోషన్స్ను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోందని తెలిసింది. చిరంజీవి పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్లో వెంకటేశ్ కూడా పాల్గొననున్నారు. చిరంజీవి – వెంకటేశ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్. అలాగే చిరంజీవి–వెంకటేశ్–నయనతార– కేథరీన్ల కాంబినేషన్లో ఓ సెలబ్రేషన్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్స్లో రిలీజ్ కానుంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై కూడా స్పష్టత రానుంది. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.మరో మల్టీస్టారర్! మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో సీనియర్ హీరో వెంకటేశ్ ముందు వరుసలో ఉంటారు. ‘ఎఫ్ 2, వెంకీమామ, గోపాల గోపాల’... ఇలా వెంకీ కెరీర్లో మల్టీస్టారర్ మూవీస్ మెండుగానే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా వెంకటేశ్ మరో మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ సీనియర్ హీరోతో కలిసి సినిమా చేయనున్నట్లు వెంకటేశ్ తెలిపారు. అయితే ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’ కాదు. దీంతో వెంకటేశ్ చేయనున్న లేటెస్ట్ మల్టీస్టారర్లోని తాజా చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పేట్రియాటిక్ మూవీలో...మలయాళ స్టార్ హీరోలు మోహన్లాల్, మమ్ముట్టీ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ 2008లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత మమ్ముట్టీ, మోహన్లాల్ కలిసి మరో సినిమా చేయడానికి పదహారేళ్లు పట్టింది. మహేశ్ నారాయణ్ దర్శకత్వంలోని ‘పేట్రియాట్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో మమ్ముట్టీ, మోహన్లాల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లుగా తెలిసింది.ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా కోసం ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ శ్రీలంకలో ముగిసింది. అయితే మమ్ముట్టీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఈ సినిమాకు తాత్కాలిక బ్రేక్ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుందనీ అజర్ బైజాన్, యూకే, మిడిల్ ఈస్ట్ దేశాల లోకేషన్స్లో చిత్రీకరణను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పఠాన్ వర్సెస్ టైగర్! షారుక్ ఖాన్ హీరోగా చేసిన బ్లాక్బస్టర్ మూవీ ‘పఠాన్’లో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘టైగర్ 3’ చిత్రంలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ సల్మాన్ ఖాన్–షారుక్ ఖాన్ సిల్వర్ స్క్రీన్పై కనిపించినప్పుడు ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఈ ఇద్దరూ కలిసి లీడ్ రోల్స్లో నటించి, దాదాపు 30 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన ‘కరణ్ అర్జున్’ సినిమా తర్వాత సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్లు కలిసి లీడ్ రోల్స్లో మరో సినిమా చేయలేదు. అయితే గత ఏడాదిగా సల్మాన్, షారుక్ హీరోలుగా ఓ సినిమా ప్లానింగ్ జరుగుతోందని బాలీవుడ్ సమాచారం.‘పఠాన్’, ‘టైగర్ 3’... ఈ రెండూ వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లోని చిత్రాలే. కాబట్టి ఈ స్పై యూనివర్స్లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ అనే సినిమా రానుందని, యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తారని టాక్. ‘పఠాన్, వార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని, కాకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ రావడానికి కొంత సమయం పడుతుందనే వార్త బాలీవుడ్లో ప్రచారంలోకి వచ్చింది.అలాగే ‘వార్’ సినిమా కూడా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగమే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే నిజమమైతే అప్పుడు సల్మాన్, షారుక్, హృతిక్లను ఒకే ఫ్రేమ్లో చూడొచ్చని బాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. మరి... ఫ్యాన్స్ ఆశలు నిజమౌవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.17ఏళ్ల తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ల కాంబినేషన్లో బాలీవుడ్లో ‘హైవాన్’ అనే మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ హిందీ థ్రిల్లర్ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. వెంకట్ కె. నారాయణ, శైలాజా దేశాయ్ ఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కొచ్చి, ఊటీ లొకేషన్స్లో కొంత భాగం చిత్రీకరణ జరిపారు మేకర్స్. తాజా షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రదర్శకుడు ప్రియదర్శన్కు మోహన్లాల్తో మంచి అనుబంధం ఉంది. దీంతో ఈ ‘హైవాన్’లో మోహన్లాల్ ఓ గెస్ట్ రోల్ చేసేందుకు అంగీకరించారట. ఇక ఈ చిత్రంలో మోహన్లాల్నే ఎందుకు గెస్ట్ రోల్కి తీసుకోవాలనుకున్నారంటే.. ‘ఒప్పం’కు హిందీ రీమేక్గా ‘హైవాన్’ సినిమా తెరకెక్కుతోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. మోహన్లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒప్పం’ సినిమా 2016లో విడుదలై, బ్లాక్బస్టర్ విజయాన్ని సాధించింది. మరోవైపు ‘తషాన్’ చిత్రం తర్వాత 17 ఏళ్లకు సైఫ్ అలీఖాన్, అక్షయ్ కుమార్ కలిసి నటిస్తున్న చిత్రం ‘హైవాన్’యే కావడం విశేషం. ముగ్గురు డాన్లు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ డాన్స్ ముగ్గురూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘డాన్ 3’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2023 ఆగస్టులోనే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే 1978లో వచ్చిన ‘డాన్’ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్, 2006, 2011లో వచ్చిన ‘డాన్, డాన్ 2’ చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ సైతం ‘డాన్ 3’లో భాగం కానున్నారని, ఆ దిశగా ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ టాక్.మరి... రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్లు కలిసి ఒకే ఫ్రేమ్లో హిందీ సిల్వర్స్క్రీన్పై కనిపిస్తే, అంతకుమించిన ఆనందం హిందీ సినీ లవర్స్కి ఏముంటుంది. ఇక ‘డాన్ 3’లో హీరోయిన్గా కియారా అద్వానీ నటించనున్నారు. విలన్గా విజయ్ దేవరకొండ, విక్రాంత్ మెస్సే, అర్జున్ దాస్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్గా ‘డాన్ 3’ చిత్రంలో ఎవరు విలన్గా నటిస్తారనే విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2027లో ‘డాన్ 3’ చిత్రం థియేటర్స్లో రిలీజ్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.కథే హీరో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రధారులుగా ఆర్.బి. శెట్టి మరో ప్రధాన పాత్రధారిగా నటించిన సినిమా ‘45’. వందకు పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పని చేసిన అర్జున్ జన్యా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఎం. రమేశ్ రెడ్డి, ఉమా రమేశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది.సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చిత్రయూనిట్ పేర్కొంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ లేరని, కథే ఈ సినిమాకు హీరో అని శివ రాజ్కుమార్ ఓ సందర్భంలో చె΄్పారు. ఇక ఉపేంద్ర దర్శకత్వంలో శివ రాజ్కుమార్ హీరోగా నటించిన ‘ఓం’ (1995) సినిమా సూపర్హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ రాజ్కుమార్, ఉపేంద్ర కలిసి మళ్లీ అసోసియేట్ కావడం ఇదే అని టాక్. కొంత గ్యాప్ తర్వాతనో లేక సరికొత్తగానో మల్టీస్టారర్ సినిమాలు చేసే సీనియర్ హీరోలు మరికొందరు ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు
- 
      
                   
                                                       35 ఏళ్ల తర్వాత తల్లైయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!సినీ తారల పెళ్లిళ్లు కాస్త లేట్గానే అవుతుంటాయి. వయసులో ఉన్నప్పుడు కెరీర్పైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావనే భయంతో చాలా మంది హీరోయిన్లు వివాహాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లయిన తర్వాత కూడా సినిమా చాన్స్లు వస్తున్నాయి. కానీ ఒకప్పుడు హీరోయిన్కి పెళ్లి అయిందంటే.. ఇండస్ట్రీకి దూరం అయినట్లే. మళ్లీ తెరపై కనిపించేవాళ్లు కాదు. అందుకే పెళ్లి కాస్త లేట్గా చేసుకునేవాళ్లు. దీంతో పిల్లలను కూడా లేటు వయసులోనే కనేవాళ్లు. 42 ఏళ్ల వయసులో కత్రినా కైఫ్ ఇప్పుడు గర్భవతి అయింది. కత్రినా మాత్రమే కాదు.. చాలా మంది తారలు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత అమ్మగా ప్రమోషన్ పొందారు. అలా తల్లైయిన తారలపై ఓ లుక్కేద్దాం.కరీనా కపూర్కరీనా కపూర్ 2012లో నటుడు సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసులో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 40 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.బిపాషా బసుబిపాషా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత 2022లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అప్పటికీ బిపాషా వయసు 43 ఏళ్లు.ఐశ్వర్యరాయ్38 ఏళ్ల వయసులో ఐశ్వరరాయ్ బచ్చన్ తల్లయింది. 2011లో ఆమె ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పేరు ఆరాధ్య. ఐశ్వర్య-అభిషేక్ల వివాహం 2007లో జరిగింది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఐశ్వర్య అమ్మగా ప్రమోషన్ పొందింది.రాణి ముఖర్జీ2015లో రాణి ముఖర్జీ ఓ బిడ్డకు జన్మన్చింది. అప్పటికే ఆమె వయసు 37 ఏళ్లు. లేటు వయసులో తల్లయ్యారు. 47 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ అవార్డు అందుకున్నారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికిగాను ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.
- 
      
                   
                                                       ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ (They Call Him OG Movie). ఇందులో పవన్.. గ్యాంగ్స్టర్గానే కాకుండా తండ్రి పాత్రలోనూ యాక్ట్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. సినిమాలో పవన్- ప్రియాంకల కూతురిగా సాయేషా అనే పాప యాక్ట్ చేసింది. వెండితెరపై ఆమె నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం!ఇదే ఫస్ట్ మూవీ!ముంబైకి చెందిన సాయేషా ఇప్పటివరకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించింది. సంతూర్, లెన్స్కార్ట్, ఫస్ట్క్రై వంటి బ్రాండ్స్తో పాటు రియల్ ఎస్టేట్ యాడ్స్లోనూ యాక్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్తోనూ ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నటించింది. ఇప్పుడీ చిన్నారి సినిమాల వైపు అడుగులు వేస్తోంది. లాగౌట్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్రలో యాక్ట్ చేసింది. కానీ ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు ఓజీ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా అద్భుతంగా నటించింది. అందరికీ థాంక్స్ఈ పాపను చూసిన వారంతా తనకు మంచి భవిష్యత్తు ఉందని మెచ్చుకుంటున్నారు. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్తో దిగిన ఫోటోలను సాయేషా సోషల్ మీడియాలో షేర్ చేసింది. హీరోయిన్ ప్రియాంకతో ఆటలు ఆడుకోవడం మిస్ అవుతానంది. తనకు చాక్లెట్లు ఇచ్చిన అర్జున్దాస్కు కృతజ్ఞతలు చెప్పింది. ప్రకాశ్ రాజ్తో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. తనకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుజిత్కు, అలాగే పవన్ సహా ఓజీ టీమ్కు థాంక్స్ చెప్పింది. View this post on Instagram A post shared by Sayesha Shah (@sayesha0307) చదవండి: ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లు
- 
      
                   
                                                       చార్మినార్లో అనన్యా పాండే సందడి.. వీడియో వైరల్స్టార్ట్ కెమెరా... టేక్ అన్నారు డైరెక్టర్ వివేక్ సోని. అంతే... హీరో లక్ష్య బైక్ స్టార్ట్ చేశారు... వెనకాల హీరోయిన్ అనన్యా పాండే కూర్చుకున్నారు. రయ్మంటూ బైక్ ముందుకు సాగింది. సీన్ పూర్తయింది. షాట్ ఓకే అన్నారు వివేక్. ఈ షూటింగ్ జరిగింది ఎక్కడంటే హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర. ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో లక్ష్య, అనన్య కలర్ఫుల్గా కనిపించారు. అక్కడి జనాలు వీరిని గుర్తు పట్టి, చుట్టుముట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. లక్ష్య, అనన్యా పాండే జంటగా నటిస్తున్న కాలేజ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ కోసమే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం షూటింగ్ని వారం రోజుల పాటు హైదరాబాద్లో ప్లాన్ చేశారు. చార్మినార్ తర్వాత మరో పాపులర్ ప్లేస్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by mainly_hyderbadi ❤️📌 (@mainly_hyderabadi)
- 
      
                   
                                                       ఆమె పనిచేసేది 8 గంటలే.. ఇంకెక్కడొస్తుంది!: దీపికపై సెటైర్లుతల్లయ్యాక తనకంటూ కొన్ని హద్దులు గీసుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone). రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పని చేయలేనని కరాఖండిగా చెప్తోంది! భారీ బడ్జెట్ సినిమాలకు ఇలాంటి కండీషన్లు పెడితే కష్టమని కల్కి 2 నుంచి ఆమెను తప్పించేశారు. దానికంటే ముందు స్పిరిట్ నుంచి కూడా దీపికా సైడ్ అయిపోయింది. దీంతో అసలు 8 గంటల షిఫ్ట్ తప్పా? ఒప్పా? అని ఎవరికి వారు చర్చల్లో మునిగిపోయారు.8 గంటలే దీపిక పనిఅయితే ఈ విషయంపై దీపికాపై ఫన్నీ సెటైర్లు వేసింది బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ (Farah Khan). తన చెఫ్ దిలీప్తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లింది ఫరా. ఈ మేరకు ఓ యూట్యూబ్ వ్లాగ్ చేసింది. అందులో మొదటిసారి రోహిత్ సరఫ్ తల్లిని చూపించింది. నా సినిమా కోసం దీపికను ఒప్పించడానికి కూడా ఇంత సమయం పట్టలేదేమో! అంటూ రోహిత్ తల్లిని హత్తుకుంది. ఇంతలో ఫరా చెఫ్ దిలీప్.. దీపిక పదుకొణె మేడమ్ మన షోకి ఎప్పుడొస్తారు? అని అడిగాడు. అందుకామె.. దీపిక ఇప్పుడు రోజులో 8 గంటలు మాత్రమే పని చేస్తుంది. మన షోకి వచ్చేంత తీరిక తనకెక్కడిది? అంది. సినిమాఫరాఖాన్ దర్శకత్వంలోనే దీపిక బాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. వీరి కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓం శాంతి ఓం. ఇందులో షారూఖ్ హీరోగా నటించాడు. ఫరా, దీపికా, షారూఖ్.. ముగ్గురూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్ (2014) అనే మరో సినిమా చేశారు. ఆమధ్య 'కల్కి' మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె.. చివరగా ఫైటర్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం షారూఖ్ ఖాన్తో కలిసి 'కింగ్' మూవీ చేస్తోంది. అలాగే అట్లీ-అల్లు అర్జున్ సినిమాలోనూ భాగమైంది. ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్ అనే హాలీవుడ్ సినిమా సీక్వెల్లోనూ భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది.చదవండి: నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్త
- 
      
                   
                                                       నా భార్య బ్రష్తో పళ్లు తోముకుంటున్నా: షెఫాలీ భర్తబతికున్నప్పుడు ఆమె చేయి వదల్లేదు, చనిపోయాక తన జ్ఞాపకాలను, గుర్తులను వదలడం లేదు. ఆమె జీవించినప్పుడే కాదు మరణం తర్వాత కూడా తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, బాలీవుడ్ నటి షెఫాలీ జరివాలా (Shefali Jariwala) మరణించి మూడు నెలలు కావస్తున్నా ఆమెను క్షణమైనా మర్చిపోలేకున్నాడు భర్త, నటుడు పరాగ్ త్యాగి (Parag Tyagi). అందుకే అణువణువునా ఉన్న ప్రేమను పచ్చబొట్టు రూపంలో హృదయంపై ఆమె ముఖచిత్రాన్ని పదిలంగా పరుచుకున్నాడు. భార్య దిండుపైనే నిద్రతాజాగా 'షెఫాలీ పరాగ్ త్యాగి' అంటూ ఓ పాడ్కాస్ట్ చానల్ను ప్రారంభించాడు. ఇందులో మొదట తన సెల్ఫ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. పరాగ్ మాట్లాడుతూ.. షెఫాలీ బ్రష్తోనే నా పళ్లు తోముకుంటున్నాను. తన దిండుపైనే నిద్రిస్తున్నాను. తన టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. వాటినెప్పుడూ నాపక్కనే పెట్టుకుంటున్నాను. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో తను ఆర్డర్ చేసిన వస్తువులు ఇప్పటికీ డెలివరీ అవుతూనే ఉన్నాయి. ఆమె విడిచిన బట్టల్ని ఇంతవరకు ఉతకలేదు. అవి మరీ చిన్నగా ఉండటం వల్ల ధరించలేకపోతున్నాను. కానీ, వాటిని కప్పుకునే ప్రతిరోజు నిద్రిస్తున్నాను.సీపీఆర్ చేశా..షెఫాలీ చివరిరోజు మా సింబా(పెంపుడు శునకం)ను వాకింగ్కు తీసుకెళ్లమని నాకు చెప్పింది. బయటకు వెళ్లి వచ్చేలోపు అపస్మారక స్థితిలో పడి ఉంది. సీపీఆర్ కూడా చేశాను. రెండుసార్లు శ్వాస తీసుకుంది. ఆ వెంటనే కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. యాంటీఏజింగ్ డ్రగ్స్ వల్లే షెఫాలీ మరణించిందన్న వార్తలను పరాగ్ కొట్టిపారేశాడు. తనెప్పుడూ డ్రగ్స్ వాడలేదని క్లారిటీ ఇచ్చాడు. కేవలం మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ తీసుకునేదని తెలిపాడు.చదవండి: మిడ్నైట్ ఎలిమినేషన్.. కార్నర్ చేసి పంపించారు! నేరుగా సీక్రెట్రూమ్కు
- 
      
                   
                                                       నా కుమార్తెకు అనుమతి లేదు.. అందుకే ఆ నెక్లెస్ ధరించా: రాణీ ముఖర్జీబాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ(Rani Mukerji ) 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో చాలా ప్రత్యేకంగా కనిపించారు. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో ఆమె నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు ఉత్తమ నటిగా అవార్డ్ దక్కింది. రీసెంట్గా జరిగిన అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలో రాణీ ముఖర్జీ ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన కూతురు అదిరా చోప్రా పేరులోని అక్షరాలతో ప్రత్యేకంగా తయారుచేయించుకున్న గోల్డ్ నెక్లెస్ను ఆమె ధరించారు. అయితే, నెక్లెస్ వెనుక దాగి ఉన్న ఎమోషనల్ స్టోరీని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆమె పంచుకున్నారు.రాణి ముఖర్జీ తన కూతురు అదిరా గురించి ఇలా చెప్పింది. తనకు కలిసొచ్చిన ఒక అదృష్ట దేవతగా ఆమె చెప్పింది. 'నేషనల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొనేందుకు అదిరా కూడా ఆసక్తి చూపింది. కానీ, 14ఏళ్ల లోపు ఉన్నవారికి అనుమతి లేదు. దీంతో చాలా నిరాశ చెందాము. నేను అవార్డ్ అందుకున్న సమయంలో ఆమె ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'అదిరా'ను శాంతింప చేసేందుకు ఏం చేయాలో నాకు తెలియలేదు. కానీ, ఆమె పేరులోని అక్షరాలతో ఒక నెక్లస్ చేయించాను. అవార్డ్ తీసుకుంటున్న సమయంలో నాతోనే ఉంటావని చెప్పాను. అప్పుడు ఆమె కాస్త కుదుట పడింది. అదిరాను సంతోష పెట్టేందుకు నాకు తోచింది నేను చేశాను.. కానీ, ఇన్స్టాగ్రామ్లో నెక్లెస్ ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 'రాణి తన కూతురిని వెంట తీసుకెళ్లింది' అని చాలామంది పోస్ట్లు పెట్టారు. అవన్నీ అదిరాకు చూపించాను. అప్పుడు తను చాలా సంతోషించింది. వాటిని పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.' అని ఆమె పంచుకున్నారు. 14ఏళ్ల లోపు ఉండటంతో తన కుమార్తెను వేడుకలోకి తీసుకెళ్లలేకపోయానని రాణీ ముఖర్జీ చాలా బాధ పడ్డారు. ఈ చర్య చాలా అన్యాయం అంటూ ఆమె పేర్కొన్నారు.మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో తన నటనకు రాణి తన మొట్టమొదటి ఉత్తమ నటి జాతీయ అవార్డును గెలుచుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమంలో, ఆమె గోధుమ రంగు చీర, అదిరా అనే అక్షరాలు ఉన్న బంగారు హారాన్ని ధరించింది. రాణి 2014లో ఆదిత్య చోప్రాను వివాహం చేసుకుంది. ఈ జంట 2015లో తమ కుమార్తె అదిరాను స్వాగతించారు.
- 
      
                   
                                                       మా ప్రపంచం వేరుఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్ మిస్టరీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా మందన్నా నటించారు.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శుక్రవారం ముంబైలో జరిగింది. శ్రద్ధా కపూర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ని లాంచ్ చేశారు. ‘‘ఏ... నాటకాలు ఆపు... నీకేం కాలేదు, నా కొడుకు సైతాన్... సైతాన్, నేను నీతో ఉండలేను... మా ప్రపంచం వేరు’’ అని అర్థం వచ్చే డైలాగ్స్ ఈ హిందీ ట్రైలర్లో ఉన్నాయి. దీపావళి పండగ సందర్భంగా ‘థామా’ సినిమాను అక్టోబరు 21న రిలీజ్ చేయనున్నట్లుగా అధికారికంగా వెల్లడించారు.
- 
      
                   
                                                       రష్మిక చేసిన దెయ్యం సినిమా.. ట్రైలర్ రిలీజ్హీరోయిన్ రష్మిక చేస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ సినిమా 'థామా'. భేడియా, స్త్రీ, స్త్రీ 2, ముంజ్య చిత్రాల తర్వాత హారర్ యూనివర్స్లో వస్తున్న మూవీ ఇది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తుండగా నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబరు 21న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బికినీ ఫొటోలు.. వెటకారంతో క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి)ట్రైలర్ చూస్తుంటే ఓవైపు భయపెడుతూనే మరోవైపు నవ్విస్తున్నారు. హీరో ఆయుష్మాన్.. వ్యాంపైర్ అవుతాడు. ఇతడి ప్రేమికురాలిగా రష్మిక నటించింది. మరి ప్రియుడిలో దెయ్యం లక్షణాలు వచ్చేసరికి రష్మిక ఏం చేసింది? చివరకు ఏమైంది అనే కాన్సెప్ట్తో మూవీ తీసినట్లు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రామిసింగ్గా ఉంది. గతంలో వచ్చిన స్తీ, స్త్రీ 2 చిత్రాలు వందల కోట్ల కలెక్షన్స్ సాధించాయి. మరి ఇప్పుడు 'థామా' ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'హృదయపూర్వం' సినిమా రివ్యూ (ఓటీటీ))
- 
      
                   
                                                       ఆ హీరో అంటే విపరీతమైన క్రష్.. నా గదిలో కూడా: బద్రి హీరోయిన్బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ తెలుగువారికి కూడా సుపరిచితమే. హిందీ మూవీస్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ.. టాలీవుడ్లో బద్రిలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేశ్ బాబు 'నాని', ఎన్టీఆర్ 'నరసింహుడు', పరమవీరచక్ర తదితర చిత్రాల్లోనూ మెప్పించింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత గదర్-2లో మెప్పించింది. అయితే ఇటీవల ఓ పాడ్కాస్ట్కు హాజరైన అమీషా పటేల్ తన పెళ్లితో పాటు కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాల పంచుకుంది.అంతేకాకుండా తన క్రష్ గురించి కూడా ఈ పాడ్కాస్ట్లో మాట్లాడింది. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ అంటే తనకు విపరీతమైన ప్రేమ ఉందని అమీషా పటేల్ మనసులోని మాటను బయటపెట్టింది. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే టామ్ క్రూజ్ పట్ల తనకున్న అభిమానాన్ని అమీషా పటేల్ పంచుకోవడం ఇదేం మొదటిసారి కాదు.. 2023లోను తన గదిలో ఆ స్టార్ పోస్టర్లు ఉన్నాయని అమీషా వెల్లడించింది. టామ్తో కలిసి పనిచేయాలనేది తన కోరిక అని తెలిపింది.అమీషా పటేల్ మాట్లాడుతూ.. "నాకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టం. మీరు అతనితో పాడ్కాస్ట్ చేయగలిగితే.. దయచేసి నన్ను కూడా ఆ పాడ్కాస్ట్కి పిలవండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి టామ్ క్రూజ్ అంటే ఇష్టం. నా పెన్సిల్ బాక్స్లో.. నా ఫైల్స్లో అతని ఫోటో ఉండేది. నా గదిలో ఉన్న ఏకైక పోస్టర్ టామ్ క్రూజ్దే. అతను ఎప్పుడు.. ఎప్పటికీ నా క్రష్. నేను అతని కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. అతనితో ఒక నైట్ ఉండేందుకు కూడా వెనకాడను. అతనికి పెద్ద అభిమానిని అని.. అవకాశం ఇస్తే పెళ్లి చేసుకునేదాన్ని" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని..సరైన వ్యక్తి దొరికితే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడతానని కూడా అంటోంది అమీషా పటేల్.ఇక కెరీర్ విషయానికొస్తే.. ఐదేళ్ల విరామం తర్వాత అమీషా పటేల్.. గదర్- 2తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో సన్నీ డియోల్, ఉత్కర్ష్ శర్మ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచింది. ఆమె చివరిసారిగా 2024లో వచ్చిన తౌబా తేరా జల్వా మూవీలో కనిపించింది. ప్రస్తుతం ఈ 50 ఏళ్ల బ్యూటీ ఎలాంటి ప్రాజెక్ట్ను ప్రకటించలేదు.
- 
      
                   
                                                       మహిళలపై ట్రోలింగ్.. అలావాటు పడిపోయాం: హీరోయిన్ప్రముఖ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రస్తుతం దల్దాల్ అనే వెబ్ సిరీస్లో కనిపించనుంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రలో మెప్పించనుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. ఈ ఏడాది మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో మెప్పించిన బ్యూటీ.. ఇప్పుడు ఓటీటీ సిరీస్లతో బిజీగా ఉంది. అయితే ఇటీవల ముంబయిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్కు హాజరైన బాలీవుడ్ భామ మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్పై మాట్లాడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోల్స్ చేస్తున్నారని.. వీటిని ఎదుర్కోవడంతో ఉమెన్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.భూమి పెడ్నేకర్ మాట్లాడుతూ.. "ట్రోలింగ్.. బెదిరింపులు.. దీన్ని మీరు ఏ విధంగా పిలిచినా.. మనం దానికి అలవాటు పడ్డాం. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు.. వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నాకు అంత ధైర్యం లేదు. ఇంకో మార్గం లేనందున నన్ను నేనే సర్ది చెప్పుకుంటా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. నాపై వచ్చే ట్రోల్స్ను ఎలాగైనా తట్టుకోగలగనని తెలుసుకున్నా" అని తెలిపింది.సోషల్ మీడియా ఆధిపత్యం చెలాయించే ఈ రోజుల్లో జీవించడం నిరంతరం భిన్నమైన అభిప్రాయాలను తీసుకొస్తుందని తెలిపింది. నా జీవితంలో పరిస్థితులు నాకు చాలా ఎక్కువగానే నేర్పించాయని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం దమ్ లగా కే హైషా సినిమా తన జీవితాన్ని మార్చేసిందని భూమి తెలిపింది. టీనేజ్ వయసులో ఉన్నప్పుడే హీరోయిన్ కావాలనే పెద్ద కలతో నా ప్రయాణాన్ని ప్రారంభించానని పేర్కొంది. అప్పట్లో అవకాశాల కోసం వేచి చూసేదాన్ని అని వెల్లడించింది. కానీ ఈ రోజు నా లక్ష్యంతో పాటు ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందానని భూమి పెడ్నేకర్ పంచుకుంది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే భూమి చివరిసారిగా ది రాయల్స్లో అనే వెబ్ సిరీస్లో కనిపించింది.
- 
      
                   
                                                       నాకు పిల్లలు కావాలి: సల్మాన్ ఖాన్ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నారు సల్మాన్ ఖాన్. కానీ సల్మాన్ ఖాన్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఫలానా హీరోయిన్తో ప్రేమలో ఉన్నారని, ఫలానా అమ్మాయితో సల్మాన్ పెళ్లి అని చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ సల్మాన్ మాత్రం ఏ అమ్మాయితోనూ ఏడడుగులు వేయలేదు. అయితే భవిష్యత్లో మాత్రం తనకు పిల్లలు కావాలని చెబుతున్నారు సల్మాన్ ఖాన్. ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో’లో ఆమిర్ ఖాన్తో కలిసి సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ షోలో సల్మాన్ ఖాన్ పెళ్లి, ప్రేమ అంశాల ప్రస్తావనను తీసుకువచ్చారు ట్వింకిల్.గతంలో కాఫీ విత్ కరణ్ షోలో సల్మాన్ ఖాన్ తనను తాను నవమన్మథుడిగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని ట్వింకిల్ ప్రస్తావిస్తూ, సల్మాన్కు డజనుమంది పిల్లలు ఉండి ఉండొచ్చని, వాళ్ల గురించి మనకు తెలియదని, ఈ విషయం సల్మాన్కు కూడా తెలియదన్నట్లుగా కాస్త చమత్కారంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందిస్తూ– ‘‘నాకు పిల్లలు ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ నాకు పిల్లలు ఉంటే మీ ముందుకు తీసుకురాకుండా ఉంటానా?’’ అని పేర్కొన్నారు సల్మాన్.ఆ తర్వాత పిల్లల్ని దత్తత తీసుకునే చాన్స్ ఏమైనా ఉందా? అని సల్మాన్ను ట్వింకిల్ ప్రశ్నించగా, ‘‘దత్తత తీసుకునే ఆలోచన అయితే లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. భవిష్యత్లో ఏం జరుగుతుందో ఊహించి చెప్పలేం. అంతా దేవుడి దయ. నాకు పిల్లలు పుడితే వారి ఆలనా పాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది. అయాన్ (సల్మాన్ మేనల్లుడు), అలీజ్ ( మేనకోడలు)లు ఉన్నారు. వీరు పెద్దవాళ్లు అయ్యారు. అంతా ఇంట్లోవాళ్లే చూసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఇక ప్రస్తుతం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ చిత్రం షూటింగ్తో సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు.
- 
      
                   
                                                       సీక్వెల్కి గ్రీన్ సిగ్నల్బాలీవుడ్ ‘క్రూ’లోకి మళ్లీ తిరిగొచ్చారట హీరోయిన్ కరీనా కపూర్. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘క్రూ’. రాజేశ్ ఎ. కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2024లో విడుదలై, సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఏక్తా కపూర్ ‘క్రూ’కు సీక్వెల్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సన్నాహాల్లో భాగంగానే కరీనా కపూర్ను మేకర్స్ సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.‘క్రూ’ సినిమాలో మాదిరిగానే ‘క్రూ 2’లోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. కాక పోతే తొలి భాగంలో నటించిన టబు, కృతీ సనన్ రెండో భాగంలో ఉండరనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఇద్దరు కొత్త హీరో యిన్లు అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మరి... ఫైనల్గా ‘క్రూ 2’లో కరీనాతో పాటు నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.
- 
      
                   
                                                       తెలుగు డైరెక్టర్ సినిమా.. నాలుగేళ్ల చిన్నారికి జాతీయ అవార్డ్ఇటీవల ఢిల్లీలో జాతీయ చలన చిత్రం అవార్డుల కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2023కు గానూ 71వ జాతీయ సినీ అవార్డ్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుక సెప్టెంబర్ 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరిగింది. ఈ మెగా ఈవెంట్లో మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఎంపికైన సినీ ప్రముఖులు జాతీయ అవార్డులు స్వీకరించారు.అయితే ఈ జాతీయ అవార్డుల వేడుకల్లో అందరి దృష్టి ఆ చిన్నారి వైపు మళ్లింది. అత్యంత పిన్న వయసులో జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. ఉత్తమ బాలనటిగా త్రీషా వివేక్ తోసర్ నిలిచింది. మహారాష్ట్రకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.మరాఠీ చిత్రం 'నాల్ 2'లో నటనకు గానూ ఈ అవార్డ్ దక్కించుకుంది. ఈ సినిమాను తెలుగు వ్యక్తి సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. నాగరాజ్ ముంజులే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో త్రీషాకు మూడేళ్లే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న నాలుగేళ్ల త్రీషా వివేక్ తోసర్ను ట్విటర్ వేదికగా కమల్ హాసన్ అభినందించారు. మీరు నా రికార్డును అధిగమించారని చిన్నారిని కొనియాడారు. నేను ఆరేళ్ల వయసులో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని తెలిపారు.జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న తర్వాత త్రీషా తోసర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రపతి నన్ను అభినందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. ఈ చిన్నారితో మోహన్ లాల్, షారూఖ్ ఖాన్ ఫోటోలు దిగారు.
- 
      
                   
                                                       షారూఖ్ ఖాన్కు బిగ్ షాక్.. రెండు కోట్ల పరువు నష్టం కేసు!బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు. ఈ నెల 18న ఓటీటీకి వచ్చిన ఈ సిరీస్ ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. ఈ వెబ్ సిరీస్లో తనను తప్పుగా చూపించారంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో ఆర్యన్ను డ్రగ్ కేసులో అరెస్టు చేసిన అధికారి సమీర్ వాంఖడేతో పోలిక ఉందని నెటిజన్లు కామెంట్స్ చేయడంతో ఈ వివాదానికి దారితీసింది.దీంతో తనను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా చూపించారని మాజీ అధికారి సమీర్ వాంఖడే ఆరోపిస్తూ.. షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో పాటు నెట్ఫ్లిక్స్పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రెండు కోట్ల రూపాయల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. ఇందులో తనపై దురుద్దేశంతోనే తప్పుగా చిత్రీకరించారని సమీర్ వాంఖడే ఆరోపించారు. ఇలాంటి వాటితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్లో ప్రస్తావించారు. ఈ రూ. 2 కోట్ల పరిహారాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్కు విరాళంగా ఇవ్వాలని పిటిషన్లో ప్రతిపాదించారు.కాగా.. గతంలో సమీర్ వాంఖడే ముంబై తీరంలో కార్డెలియా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ను అరెస్టు చేశారు. ఆ సమయంలో సమీర్ వాంఖడే ఈ కేసును డీల్ చేశారు. ఈ కేసులో ఆర్యన్ను దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఆ తర్వాత 2023లో ఈ కేసులో ఉన్న వారి నుంచి రూ.25 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై వాంఖడేతో పాటు మరో నలుగురు అధికారులపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.Sameer Wankhede, former NCB Mumbai zonal director, has filed a defamation suit in the Delhi High Court against Red Chillies Entertainment Pvt. Ltd., owned by actor Shah Rukh Khan and Gauri Khan, global streaming platform Netflix, and others. He alleges that their series “Ba**ds…— ANI (@ANI) September 25, 2025
- 
      
                   
                                                       రోడ్డుపై అమిర్ ఖాన్ ప్రియురాలు.. ఇక్కడ కూడా వదలరా?బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఈ ఏడాది అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. తన బర్త్ డే రోజున ప్రియురాలిని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్తో డేటింగ్ ఉన్నానని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆరు పదుల వయస్సులో లవ్లో పడ్డానంటూ రివీల్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు పలు ఈవెంట్లలో జంటగా కనిపించారు.ఇదిలా ఉంచితే తాజాగా అమిర్ ఖాన్ ప్రియురాలు గౌరీ స్ప్రాట్ తాజాగా ముంబయిలోని బాంద్రాలో కనిపించింది. రోడ్డుపై నడుచకుంటూ వెళ్తున్న ఆమెను కొందరు ఫోటోగ్రాఫర్స్ వెంటపడ్డారు. దీంతో అసహనానికి గురైన గౌరీ.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి.. నేను వాకింగ్కు వెళ్తున్న అంటూ తన ఫోటోలు తీస్తున్న వారిపై మండిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వాకింగ్ చేసేందుకు వెళ్తున్న ఆమెను వెంటపడమేంటని నెటిజన్స్ సైతం తప్పు పడుతున్నారు. సెలబ్రిటీలను ఇలా రోడ్లపై వేధించడం సరికాదని హితవు పలుకుతున్నారు.ఇక అమిర్ ఖాన్ విషయానికొస్తే ఈ ఏడాది 'సితారే జమీన్ పర్' చిత్రంలో బాస్కెట్బాల్ కోచ్గా నటించి మెప్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన రజినీకాంత్ కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap)
- 
      
                   
                                                       పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు: సల్మాన్ ఖాన్బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయి. బ్రెయిన్ ఎన్యోరిజమ్ (మెదడులో వచ్చే సమస్య), ఏవీ మాల్ఫొర్మేషన్ (రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ స్థితి). వీటివల్ల ఎముకలు విరుగుతూ.. అతడి శరీరం ఎంతో ఒత్తిడికి గురవుతూనే ఉంది. గతంలో ట్రైజెమినల్ న్యూరాల్జియా (ముఖంలో వచ్చే తీవ్రమైన నొప్పి)తోనూ బాధపడ్డాడు. అయితే ఈ వ్యాది పగవాడికి కూడా రాకూడదంటున్నాడు సల్లూ భాయ్.ఎనిమిదేళ్లు బాధపడ్డా..తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన సల్మాన్.. ట్రైజెమినల్ న్యూరాల్జియా వల్ల నేను పడ్డ నరకం మాటల్లో చెప్పలేనిది. పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదనే కోరుకుంటాను. ఏడెనిమిదేళ్లు ఈ వ్యాధితో బాధపడ్డాను. ప్రతి నాలుగైదు నిమిషాలకోసారి నొప్పి నన్ను వేధించేది. దానివల్ల బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా గంటన్నర సమయం పట్టేది. ఒక ఆమ్లెట్ తినాలన్నా కూడా కష్టంగా ఉండేది. నొప్పి నన్ను వెంటాడేది.దాన్ని భరించలేక ప్రాణాలు వదిలేవారుబలవంతంగా ఆమ్లెట్ నోట్లో కుక్కుకునేవాడిని. పెయిన్కిల్లర్స్ వాడినా ఫలితం లేదు. ఈ వ్యాధి వచ్చిన చాలామంది దాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడు దానికి చికిత్స లభిస్తోంది. ఏడెనిమిది గంటలపాటు సర్జరీ చేసి ముఖంలో మనల్ని ఇబ్బందిపెడుతున్న నరాలను ఫిక్స్ చేస్తున్నారు. నేనూ ఆ సర్జరీ చేయించుకున్నా.. ఇకమీదట నొప్పి 30% తగ్గుతుందన్నారు. అదృష్టవశాత్తూ ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్.. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా చేస్తున్నారు.చదవండి: మోహన్లాల్ రికార్డ్.. ఒకే ఏడాదిలో రూ. 600 కోట్లు
- 
      
                   
                                                       నేనూ సెలవు తీసుకుంటా!బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఎప్పుడూ వరుస సినిమాలతో, క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉండే ఆయన కూడా సెలవులు తీసుకుంటారట. అది కూడా ఏడాదిలో 125 రోజులట. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ‘‘మనందరికీ రోజుకి 24 గంటలుంటాయి. ఏడాదికి 365 రోజులే. అందరిలానే నేను కూడా సెలవులు తీసుకుంటా. అది కూడా దాదాపు 125 రోజులు. ఏడాదిలో 52 ఆదివారాలు, 40 రోజుల వేసవి విహారయాత్ర, క్రిస్మస్కు 12 రోజులు, దీపావళికి 3 రోజులు. ఇవి కాకుండా ప్రతి మూడు నెలలకు కుదిరితే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటాను. నేనయినా.. ఇతరులైనా సమయాన్ని సరిగ్గా నిర్వహణ చేసుకోవడమే జీవితమంటే. సంతోషంగా ఉండమని దేవుడు మనల్ని భూమ్మీదకు పంపించారు. ఎందుకంటే ఈ భూమి కూడా స్వర్గానికి ప్రతిరూపం. ఎలాంటి ఒత్తిడి జోలికి పోకుండా సంతోషంగా ఉండాలి’’ అని అక్షయ్ చెప్పారు.
- 
      
                   
                                                       ఇంటిమేట్ సీన్.. హీరోను ఏడిపించిన హీరోయిన్'బాబీ' సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిపోయింది డింపుల్ కపాడియా (Dimple Kapadia). హిందీలో అనేక హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా రాణించింది. అయితే అనిల్ కపూర్ (Anil Kapoor)తో చేసిన ఓ సినిమాలో మాత్రం డింపుల్ బాగా ఇబ్బందిపడింది. ఆ సీన్ కహానీ ఏంటో చూసేద్దాం.. 1986లో జన్బాజ్ మూవీలో అనిల్ కపూర్, డింపుల్ కపాడియా జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇందులోని పాటలు ఇప్పటికీ పాడుకుంటూ, వింటూ ఉంటారు.అనిల్ కపూర్, డింపుల్ కపాడియారొమాంటిక్ సీన్అయితే ఈ మూవీలోని ఓ షాట్ కోసం.. ఫిరోజ్ ఖాన్ ఫామ్హౌస్ను ఎంచుకున్నారు. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య కాస్త క్లోజప్ (ఇంటిమేట్) సీన్స్ పెట్టారు. ఆ విషయం హీరోహీరోయిన్లిద్దరికీ చెప్పారు. సమయానికి ఇద్దరూ సెట్లోకి వచ్చారు. కానీ అనిల్ చొక్కా విప్పగానే డింపుల్ అడుగు ముందుకు వేయలేదట! కారణం.. అతడి ఛాతీనిండా గుబురుగా వెంట్రుకలు ఉండటం! దీంతో దర్శకుడు ఆమెను బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. చిట్టచివరకు ఆమె ఆ సీన్ చేసేందుకు అంగీకరించింది. అనిల్ ఛాతీపై వెంట్రుకలు చూసి డింపుల్ అతడిని చాలారోజులపాటు ఏడిపించిందట! ఇకపోతే జన్బాజ్ మూవీలోని ఓ సాంగ్లో హీరోయిన్ శ్రీదేవి తళుక్కుమని మెరిసింది.చదవండి: అర్ధరాత్రి ఇంటికి రీతూ.. తననలాగే చూస్తా! డిప్రెషన్లో ఉన్నా: ధర్మ మహేశ్
- 
      
                   
                                                       'ఆదిపురుష్' రిజల్ట్.. ఇన్నాళ్లకు ఒప్పుకొన్న ఓం రౌత్ఆదిపురుష్.. ఈ పేరు చెబితే చాలు ప్రభాస్ ఫ్యాన్స్, దర్శకుడు ఓం రౌత్పై ఇంతెత్తున ఎగిరిపడతారు. ఎందుకంటే మూవీలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. పురాణాల్లో రాముడు, రావణాసురుడు అంటే కొన్ని అంశాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిగా మార్చేసి ఇష్టమొచ్చినట్లు ఓం రౌత్ తీయడంపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఏ గ్రాఫిక్స్ మూవీ వచ్చినా సరే ఔం రౌత్పై కచ్చితంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే రిలీజ్ తర్వాత దీని గురించి ఎప్పుడూ మాట్లాడని ఈ దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పందించాడు. విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడో చెప్పాడు.(ఇదీ చదవండి: హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్)'జీవితంలో తప్పులు చేయడం సహజం. హిట్ సంతోషాన్ని ఇస్తుంది. ఫ్లాప్ పాఠం నేర్పిస్తుంది. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ముందుకెళ్లిపోవడమే జీవితం. అదే మనిషిని బతికిస్తుంది. 'ఆదిపురుష్' విషయంలో వచ్చిన విమర్శల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. టీమ్తో పాటు ఆ ప్రభావం నా కుటుంబంపైనా పడింది. ఫలితంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. అలా కోలుకోగలిగాను. ప్రేక్షకుల నమ్మకం తిరిగి పొందేందుకు ఇప్పుడు చాలా కష్టపడాలి' అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.2015లో 'లోక్మాన్య' అనే మరాఠీ సినిమాతో దర్శకుడు అయిన ఓం రౌత్.. తర్వాత హిందీలో 'తానాజీ' అనే పీరియాడికల్ మూవీతో హిట్ కొట్టాడు. ఎప్పుడైతే 'ఆదిపురుష్' వచ్చిందో ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పటినుంచి మరో చిత్రం చేయలేదు. రీసెంట్గా 'ఇన్స్పెక్టర్ జెండే' మూవీని నిర్మించగా ఇది నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం ధనుష్తో అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాడా సరేసరి లేదంటే మాత్రం అంతే!(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)
- 
      
                   
                                                       తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. అప్పుడు భర్తకే తెలియదా?సినిమా తారల కెరీర్ విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా జనాలకు ఆసక్తి ఎక్కువ. వాళ్లు తినే తిండి మొదలు.. ధరించే దుస్తుల వరకు ప్రతీది సాధారణ ప్రజలకు వార్తే అవుతుంది. ఇక వాళ్ల పర్సనల్ లైఫ్పై కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లి.. ప్రెగ్నెన్సీ.. ఇలాంటి శుభవార్తలను విని ఆనందించే అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే కొంతమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. మరికొంతమంది అయితే.. వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడించేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal ) కూడా ఒకరు. ఆయన పర్సనల్ లైఫ్ని గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడతాడు. ముఖ్యమైన విషయాలను మాత్రమే అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఓ గుడ్ న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు. త్వరలోనే ఆయన తండ్రి కాబోతున్నాడు. ఆయన సతీమణి, స్టార్ హీరోయిన్ కత్రీనా కైఫ్(Katrina Kaif ) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తాజాగా ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేస్తూ..‘మా జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభమైంది’ అని రాసుకొచ్చారు. అప్పుడు అలా.. కత్రినా కైఫ్ గర్భం దాల్చిందని గత కొన్నాళ్ల క్రితమే వార్తలు వచ్చాయి. ఆమె ప్రెగ్నెంట్ అని.. అందుకే బయటకు ఎక్కువ రావడం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇదే విషయాన్ని ఓ సినిమా ఈవెంట్ని విక్కీ కౌశల్ని అడిగితే.. అలాంటిదేమి లేదని, శుభవార్త ఉంటే తామే చెబుతామని అన్నారు. దీంతో కత్రినా ప్రెగ్నెంట్ రూమర్ మాత్రమే అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా ఆమె బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కత్రినా తన నివాసంలో బేబీ బంప్తో ఫోటో షూట్ చేసిన నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. కత్రినా ప్రెగ్నెంట్ విషయం భర్తకే తెలియదా..విక్కీ ఎందుకు అలా చెప్పాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా వెల్లడించింది. దీంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.నాలుగేళ్ల తర్వాతకొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్.. 2021 డిసెంబర్ 9న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వయసులో కత్రినా కంటే విక్కీ చిన్నవాడు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘ఛావా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ.. ప్రస్తుతం లవ్ అండ్ వార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కత్రినా విషయానికొస్తే.. ‘మల్లీశ్వరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణతో కలిసి నటించిన అల్లరి ప్రియుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత కత్రినా.. తన మకాంని బాలీవుడ్కి మార్చింది.అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చివరగా 2024లో విజయ్ సేతుపతితో కలిసి ‘మేరి క్రిస్మస్’ చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif)
- 
      
                   
                                                       అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్ముంబైలో జరిగిన హోమ్బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్తో లుక్ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్బౌండ్ 2026 ఆస్కార్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor)
- 
      
                   
                                                       నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన రణ్బీర్ కపూర్పై చర్యలుబాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డారు. నిషేధ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చర్యలకు సిద్ధమైంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో రణ్బీర్ కపూర్ అతిథి పాత్రలో నటించారు. అయితే, ఒక సీన్లో ఈ-సిగరెట్తో ఆయన కనిపిస్తారు. భారత్లో ఎలక్ట్రానిక్ సిగరెట్ట నిషేధ చట్టం ఉంది. దీనిని ఆయన ఉల్లంఘించారని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్తో పాటు చిత్రనిర్మాతలు, ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలకు ఎన్హెచ్ఆర్సీ సిద్ధమైంది. భారత్లో నిషేధించిన ఉత్పత్తులను నెట్ఫ్లిక్స్ ఎలా చూపించిందంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారిచేసింది. ఈ సిరీస్లో రణ్బీర్ కపూర్ ఎటువంటి చట్టబద్ధమైన హెచ్చరిక లేకుండా ఈ-సిగరెట్ తాగుతున్నట్లు చూపించారని లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ దాఖలు చేసిన ఫిర్యాదులో పపేర్కొన్నారు. నిషేధిత పదార్థాలను ఇలా ప్రోత్సాహించడం నేరం దాని ద్వారా యువతను తప్పుదారి పట్టించేలా ప్రభావితం చేస్తుందని తెలిపారు.అయితే, ఈ వివాదం జరిగిన కొద్దిసేపటికే ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రియాంక్ కనూంగో స్పందించారు. 'భారతదేశంలో ఈ-సిగరెట్లు నిషేధం. ఇక్కడి చట్టం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఈ-సిగరెట్లను ప్రోత్సహించకూడదు. ఎవరైనా భారత్లో వాటిని విక్రియించినా లేదా దిగుమతి చేసుకున్నా నేరం. కనీసం ఎలాంటి అమ్మకాలు జరిపేందుకు అనుమతి లేదు. రణ్బీర్ కపూర్తో పాటు నిర్మాణ సంస్థ, ఓటీటీ ప్లాట్ఫామ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాని ముంబై పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశాం' అని చెప్పారు.
- 
      
                   
                                                       మెరుగైన ఇంటి వైపు హోమ్బౌండ్ఈ దేశవాసులకు ఈ దేశమే ఇల్లు. ఇక్కడే ఉండాలి. జీవించాలి. కాని ఈ నేల ప్రతి ఒక్కరికీ నివాసయోగ్యంగా ఉందా? ప్రతి ఒక్కరినీ సమానంగా, గౌరవంగా చూస్తోందా? ఏ మహమ్మారో వస్తే వలస కూలీలను ‘మీ ఊరికి పోండి’ అని సాటి మనుషులే తరిమికొడితే ‘ఇంటి వైపు’ నడక సాగుతుందా? మన హైదరాబాదీ దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీసిన ‘హోమ్బౌండ్’ ఎన్నో సామాజిక ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివక్షలను ప్రశ్నిస్తోంది. భారత దేశం నుంచి ఆస్కార్కు ఆఫీషియల్ ఎంట్రీగా ఎంపికైన ఈ సినిమా వివరాలు.మే 21, 2025. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనీవినీ ఎరగనట్టుగా స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నారు ప్రేక్షకులు. సినిమా అయ్యాక లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక నిమిషం... రెండు నిమిషాలు... చప్పట్లు ఆగడం లేదు... 9 నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాలో నటించిన నటీనటులు, నిర్మాత, దర్శకుడు ఉద్వేగంతో కన్నీరు కారుస్తూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. బహుశా ఆ చప్పట్ల మోత ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ను తాకినట్టున్నాయి. 2026లో జరగనున్న 98వ ఆస్కార్ అవార్డ్స్ పోటీకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరి కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా ఆ సినిమాను ఎంపిక చేశారు. పేరు: హోమ్బౌండ్ (Homebound).→ అదే దర్శకుడికి అదే గుర్తింపు‘హోమ్బౌండ్’ (ఇంటి వైపు) దర్శకుడు నీరజ్ ఘేవాన్ (Neeraj Ghaywan). ఇంతకు ముందు ఇతను తీసిన ‘మసాన్’ సినిమా మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. దానికి కారణం ఆ సినిమాలో ఎత్తి చూపించిన వివక్ష, తాత్త్వికత. ఇప్పుడు కూడా అలాంటి వివక్షను, ఆధిపత్యాన్ని దర్శకుడు గొప్ప కళాత్మకంగా, సెన్సిబుల్గా చూపించడం వల్లే ‘హోమ్బౌండ్’కు ఘన జేజేలు దక్కుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజం మార్టిన్ స్కోర్సెసి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండటమే కాదు సినిమా విపరీతంగా నచ్చడంతో పొగడ్తలతో ప్రచారంలోకి తెచ్చాడు. ఆ తర్వాత ఫిల్మ్ఫెస్టివల్స్లో సినిమాకు ప్రశంసలు మొదలయ్యాయి. కాన్స్ తర్వాత టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ‘హోమ్బౌండ్’ రెండవ స్థానంలో నిలిచింది. ‘మసాన్’ సినిమా సమయంలో కేన్స్లో పాల్గొన్న నీరజ్ తిరిగి ఈ సినిమాతో అదే కేన్స్లో సగర్వంగా నిలిచాడు.→ ఇద్దరు స్నేహితుల కథ‘హోమ్బౌండ్’ షోయెబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథ. వీరిద్దరూ అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న యువకులు. చిన్నప్పటి నుంచి వీరు పోలీస్ కానిస్టేబుళ్లు అవ్వాలనుకుంటారు. అందుకై ప్రయత్నిస్తూ నగరంలో అంత వరకూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కాని ఒకసారి ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక ప్రపంచపు పోకడ, మన దేశంలో వేళ్లూనుకుని ఉన్న వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. చందన్ దళితుడైన కారణంగా అవమానాలు ఎదుర్కొంటుంటే, షోయెబ్ ముస్లిం కావడం వల్ల వివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ‘దేశం’ అనే ‘ఇల్లు’ వీరికి ‘కొందరికి’ ఇస్తున్నట్టుగా మర్యాద, గౌరవం ఇవ్వడం లేదు. ‘కానిస్టేబుల్ ఉద్యోగం’ వస్తే అన్ని వివక్షలు పోతాయని వీరు అనుకుంటారుగాని అదంతా ఉత్తమాట... కొందరు ఎంత ఎదిగినా కిందకే చూస్తారని కూడా అర్థమవుతుంది. వీరికి పరిచయమైన అమ్మాయి సుధా భారతి అంబేద్కరైట్గా సమాజంలో రావలసిన చైతన్యం గురించి మాట్లాడుతుంటుంది. ఈలోపు పులి మీద పిడుగులా లాక్డౌన్ వస్తుంది. అక్కడి నుంచి ఆ స్నేహితులిద్దరూ సొంత ఊరికి బయలుదేరడంతో ఆ ప్రయాణం వారిని ఎక్కడికి చేర్చిందనేది కథ. ఇందులో ఇద్దరు స్నేహితులుగా విశాల్ జేత్వా, ఇషాన్ ఖట్టర్ నటించారు. సుధా భారతిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కరణ్ జొహర్, అదర్ పూనావాలా (కోవీషీల్డ్ తయారీదారు) నిర్మాతలు. సహజమైన పాత్రలు, గాఢమైన సన్నివేశాలు, దర్శకుడు సంధించే ప్రశ్నలు ఈ సినిమా చూశాక ప్రేక్షకులను వెంటాడుతాయని ఇప్పటి వరకూ వస్తున్న రివ్యూలు చెబుతున్నాయి. ఆస్కార్ నామినేషన్స్ను జనవరి 22, 2026న ప్రకటిస్తారు. హోమ్బౌండ్ నామినేట్ అవుతుందని ఆశిద్దాం. మరో ఆస్కార్ ఈ సినిమా వల్ల వస్తే అదీ ఘనతే కదా. నిజ సంఘటన ఆధారంగా...ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు నీరజ్ ఘెవాన్ తీశాడు. 2020లో న్యూయార్క్ టైమ్స్లో కశ్మీర్ జర్నలిస్ట్ బషారత్ పీర్ ఒక ఆర్టికల్ రాశాడు. ఒక మిత్రుడి సమాధి పక్కన కూచుని ఉన్న మరో మిత్రుడి ఫొటో వేసి. ‘టేకింగ్ అమృత్ హోమ్’ అనే ఆ ఆర్టికల్ కోవిడ్ కాలంలో సూరత్ ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న ఇద్దరు మిత్రులు ఉత్తర్ ప్రదేశ్లోని తమ సొంత ఊరుకు బయలుదేరి ఎలా సర్వం కోల్పోయారో, వారిలో ఒక మిత్రుడు చనిపోతే మరో మిత్రుడు కోవిడ్కు భయపడకుండా ఆ శవాన్ని ఎలా ఇంటికి చేర్చాడో బషారత్ ఆ ఆర్టికల్లో రాశాడు. అది చదివిన నీరజ్ కోవిడ్ సమయాన్ని నేపథ్యంగా ఉంచుతూనే ఈ దేశంలో వ్యాపించిన సామాజిక దుర్నీతులను ముందు వరుసలో పెట్టి ‘హోమ్బౌండ్’ను తీశాడు.
- 
      
                   
                                                       సీట్ ఎడ్జ్ థ్రిల్లర్రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మర్దానీ 3’. అభిరాజ్ మినావాలా దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దసరా నవరాత్రులు శుభారంభం సందర్భంగా ‘మర్దానీ 3’ పోస్టర్ను ఆవిష్కరించారు మేకర్స్. ‘‘మర్దానీ (2014), మర్దానీ 2 (2019)’ వంటి విజయాల తర్వాత ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ను ఇచ్చేలా ‘మర్దానీ 3’ తెరకెక్కుతోంది.మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. తనకు ఎంతో ఇష్టమైన, ప్రేమించిన డేర్ డెవిల్ పోలీస్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి కనిపించబోతున్నారు. ఓ కేసుని పరిష్కరించడానికి, దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే శివానీ సంకల్పం ఎలాంటిదో సినిమాలో చూడాలి’’ అని యూనిట్ తెలిపింది. ఈ చిత్రం 2026 ఫిబ్రవరి 27న రిలీజ్ కానుంది.
- 
      
                   
                                                       రణ్వీర్ సింగ్ విలన్గా ఊహించని పేరు.. ఎంట్రీ ఇస్తాడా?బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం దురంధర్ మూవీ చేస్తోన్న బాలీవుడ్ స్టార్.. డాన్-3 మూవీ కూడా చేయనున్నారు. ఈ చిత్రంలో మొదటి కియారా అద్వానీని హీరోయిన్గా ప్రకటించారు. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కియారా ప్లేస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హీరోయిన్ను మార్చేసిన మేకర్స్.. విలన్ విషయంలో అదే జరుగుతోందని టాక్. డాన్-3లో మొదట 12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మాస్సేను అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ రోల్కు విక్రాంత్ మాస్సే నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్రలో లోతు లేకపోవడం వల్ల అతను వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే విలన్ రోల్కు ఊహించని పేరు తెరపైకి వచ్చింది.ఈ ఏడాది అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీలో తన విలనిజంతో మెప్పించిన అర్జున్ దాస్ను విలన్గా ఎంపిక చేయనున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇదే నిజమైతే ఈ కోలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అర్జున్ దాస్ ఇప్పటికే మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, కైతి లాంటి హిట్ సినిమాలతో తన విలనిజాన్ని చూపించాడు. ప్రస్తుతం అర్జున్ దాస్తో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తోంది.
- 
      
                   
                                                       'అతని నుంచి ప్రేరణ పొందా'.. ఫ్యాన్స్కు అమితాబ్ చిరు కానుకలుబాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.అమితాబ్ తన ట్వీట్లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.కాగా.. కౌన్ బనేగా కరోడ్పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్పతి -17 సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety .. A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could .. Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025
- 
      
                   
                                                       రూ.100 కోట్లు.. కాదు వెయ్యి.. రెండు వేల కోట్ల FD ఉంటే చాలు!దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఒకానొక సమయంలో భారత్లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. నిజాయితీగా ట్యాక్స్ కట్టినందుకుగానూ ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది. అయితే అక్షయ్కు డబ్బుపిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా ద కపిల్ శర్మ షోకి హాజరైన అక్షయ్ మనీ మైండెడ్ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు. రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే..హీరో మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్ రూ.100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను. నాకు బాగా గుర్తు.. అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను. డాడీ, రూ.100 కోట్లు ఎఫ్డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అని అడిగాను. అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ 13% ఉండేది. ఈ లెక్కన నెలకు రూ.1.3 కోట్లు అన్నాడు. అంటే నేను రూ.100 కోట్లు ఎఫ్డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను. ఆశకు హద్దు లేదుకానీ మనషుల ఆశకు అంతెక్కడిది? రూ.100 కోట్లు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు.. వెయ్యెందుకు? రూ.2 వేల కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని. అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు. మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశావు? అని కపిల్ అడగ్గా.. అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్.8 ఏళ్లుగా నేనే..ఆప్కీ అదాలత్ షోకి వెళ్లినప్పుడు కూడా అక్షయ్కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది. అందుకీ బాలీవుడ్ స్టార్.. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా.. గత 8 ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. అలా అని నేను మనీ మైండెడ్ అని అర్థం కాదు. బతకాలంటే డబ్బు అవసరం.నేనేమైనా దొంగతనం చేస్తున్నానా?నేను సంపాదిస్తున్నా.. ట్యాక్స్ కడుతున్నా, సేవ చేస్తున్నా.. సేవాగుణం నా మతం. అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరైనా కార్యక్రమానికి రండి, డబ్బులిస్తాం అన్నారనుకోండి. తీసుకుంటే తప్పేంటి? మనమేం ఎవరి జేబులోనో చేయి పెట్టి దొంగిలించట్లేదు కదా! అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జానీ:LLB మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు దాటేసింది.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల్లో ఎంత సంపాదించాడంటే?


