ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన దృశ్యం డైరెక్టర్..! | Drishyam 2 Director Abhishek Pathak good news for his Fans | Sakshi
Sakshi News home page

Abhishek Pathak: నటితో ప్రేమ పెళ్లి.. తండ్రి కాబోతున్న దృశ్యం డైరెక్టర్..!

Dec 19 2025 4:01 PM | Updated on Dec 19 2025 5:20 PM

Drishyam 2 Director Abhishek Pathak good news for his Fans

సూపర్ హిట్ మూవీ దృశ్యం-2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్‌ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. నటి శివాలిక ఓబెరాయ్‌ను పెళ్లాడిన ఆయన ఇవాళ శుభవార్తను పంచుకున్నారు. బేబీ పాఠక్ 2026లో వస్తోందంటూ ఫోటోను షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ జంట ఫిబ్రవరి 2023లో గోవాలో వివాహం చేసుకున్నారు. అభిషేక్ పాఠక్‌ నిర్మించిన ఖుదా హాఫిజ్ మూవీతో శివాలిక నటించారు. అదే సమయంలో  వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అభిషేక్ పాఠక్ టర్కీలో  శివాలికకు ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. వచ్చే ఏడాదిలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కాగా.. అభిషేక్ పాఠక్ బాలీవుడ్‌లో పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన భార్య శివాలికి ఓబెరాయ్ మూడు సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement