breaking news
Amaravati
-
నీతులు చెప్పే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. ఇప్పుడేమంటావ్!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్ను పెంచి పోషిస్తున్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొదలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్ ఆదినారాయణరెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్ను పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?తండ్రీకొడుకులు పరువు తీశారు ‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీయిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్ను అలవాటు చేసి రౌడీలను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్కు అలవాటుపడి తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లా పరువును బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారు.రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజాయి నిర్మూలన కోసం నాటి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యంచంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
సెల్ ఫోన్.. గూగుల్ డేటా సెంటర్.. భోగాపురం!.. బాబు మరో క్రెడిట్ చోరీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ను నేనే కట్టాను.. సెల్ ఫోన్ను నేనే కనిపెట్టాను.. సత్య నాదెళ్ల, పీవీ సింధులు నా వల్లే ఎదిగారు.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను.. అని గొప్పలు చెప్పుకునేదెవరని అడిగితే.. ‘చంద్రబాబే’ అని ఎవరైనా ఇట్టే సమాధానమిస్తారు. రూపాయి పని చేయకపోయినా మొత్తం తానే చేసినట్లు, గంపెడు మట్టి పోయకున్నా ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఇసుమంత కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారు.వాస్తవానికి ఈ విమానశ్రయానికి ఏ మాత్రం అనుమతులు, భూసేకరణ వంటి ప్రాథమిక ప్రక్రియలు చేపట్టకుండానే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇదే చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎయిర్పోర్టుకు సంబంధించిన కోర్టు కేసులను కొలిక్కి తెచ్చారు. భూసేకరణ పూర్తి చేసి, భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి విమానాశ్రయానికి సంబంధించి దాదాపుగా పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పనుల పూర్తికి చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకుని.. ఈ ఎయిర్పోర్టు నిర్మాణం అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తద్వారా మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జనం చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో భూ సేకరణ ⇒ 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. ⇒ భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది. ⇒ విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ⇒ ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తయ్యింది. చంద్రబాబువి టెంకాయ రాజకీయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5 వేల ఎకరాలకు దిగొచ్చారు. భూ సేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నామన్నది ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం గమనార్హం. క్రెడిట్ చోరీకి పోటాపోటీ వైఎస్ జగన్ కృషినంతటినీ పక్కన పెట్టి.. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్లు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ చోరీలో పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్కు వచ్చినప్పుడల్లా భోగాపురం ఎయిర్పోర్టు పనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. లోకేశ్ ఓ దశలో కేంద్ర మంత్రి రామ్మోహన్ను నిలదీశారంటూ కూడా ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘనత తమదేనని ఈ ముగ్గురూ ఎవరంతకు వారు తమ కోటరీల ద్వారా ప్రచారానికి తెర లేపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టు ఘనత వైఎస్ జగన్ది అయినప్పటికీ.. ఆయనకు పేరు రాకుండా ఉండేందుకు వీరు పాట్లు పడుతుండటంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్దే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగవిుంచింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్షిప్ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది.ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకోవడంతో జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
రాయుడి హత్యలో బొజ్జల సుదీర్రెడ్డే సూత్రధారి
ఏర్పేడు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్యలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుదీర్రెడ్డే ప్రధాన సూత్రధారి అని, తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెట్టి నిర్దోíÙత్వం నిరూపించుకుంటామని జనసేన పార్టీ బహిష్కృత నేత కోట వినుత భర్త కోట చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన శనివారం మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ... ‘‘నా భార్య వినుత రాజకీయంగా ఎదుగుతుండడం ఓర్వలేక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి ఇదంతా చేశారు. ఆమెను అడ్డు తొలగించేందుకు డ్రైవర్ రాయుడు హత్యకు కుట్ర చేసి, అందులో మమ్మల్ని ఇరికించేలా పక్కా స్క్రిప్ట్ రచించి అధికార బలంతో అమలు చేశారు.మా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చకముందే... రాయుడిది హత్యనా? ఆత్మహత్యనా? అని పోలీసులు తేల్చకముందే సు«దీర్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి మాపై ఆరోపణలు చేశారు. ఆయన వ్యాపారాలన్నీ చెన్నై కేంద్రంగా చేస్తున్నారు. అక్కడినుంచే మాపై కుట్ర చేశారు. రాయుడిని మేమే హత్య చేసి ఉంటే శ్రీకాళహస్తి నుంచి 150 కి.మీ. దూరంలోని చెన్నై వెళ్లి మృతదేహాన్ని పడేయాల్సిన అవసరం ఏముంది?’’ అని కోట చంద్రబాబునాయుడు ప్రశి్నంచారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్యే సుదీర్రెడ్డి పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి వన్టౌన్ సీఐ గోపీని చెన్నై పంపి, అక్కడి పోలీసులతో ఎమ్మెల్యే మంతనాలు జరిపించారని, విచారణ ద్వారానే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. మా కారు డ్రైవర్తో ఆయనకు పనేంటి? జూన్ 25న తన మామ నగరం భాస్కర్కు ప్రమాదం జరగడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్చి వారం పాటు అక్కడే ఉండి వైద్యం చేయించామని కోట చంద్రబాబునాయుడు తెలిపారు. అప్పటినుంచి ఆస్పత్రి పనిపైనే చెన్నై తరచూ వెళ్లామని వెల్లడించారు. సుధీర్రెడ్డికి అనుచరులే సరిగా గుర్తుండరని, తమ కారు డ్రైవర్తో ఆయనకు పనేంటని ప్రశి్నంచారు. రాయుడిని సు«దీర్రెడ్డి ఎమ్మెల్యే కాకముందు చాలాసార్లు ఇంటికి పిలిపించుకుని తమపై కుట్రకు బీజం వేశారని ఆరోపించారు. -
చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై విచ్చలవిడిగా దాడులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ విజయవాడ పశి్చమ నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు.‘మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్, ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసి కొట్టారు. నేడు దర్శి నియోజకవర్గంలోని గంగదేవిపల్లిలో దశాబ్దకాలంగా రేషన్ డిపో నిర్వహిస్తున్న శ్రీరామ్ వెలుగొండ రామయ్యపై వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీలర్షిప్ వదులుకోవాలని శ్రీరామ్ వెలుగొండ రామయ్యను బెదిరించారు. లేకపోతే ఆయన కుమారుడిని కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు భరించలేక శ్రీరామ్ వెలుగొండ రామయ్య ఇల్లు వదిలి వెళ్లి దేవస్థానంలో తలదాచుకున్నారు. టీడీపీ కూటమి నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.’ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. బతకాలంటేనే భయపడుతున్న ఆర్యవైశ్యులు ‘రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదు. అసలు ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు బతకాలంటే భయపడుతున్నారు. వరుస దాడులపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎందుకని ప్రశి్నంచడం లేదు? పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను అరికట్టాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులమంతా కలిసి తిరుగుబాటు చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు. -
బాబు పాలనలో దేవుడికే రక్షణ కరువు
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు పాలనలో దేవుడికే రక్షణ కరువైంది. ఒక ఉన్మాది తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం లోపలి నుంచి పైకెక్కి కలశాలను ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాలను కాళ్లతో తన్నడం అత్యంత ఆందోళనకరం. ఇది పూర్తిగా ప్రభుత్వం, దేవదాయ శాఖ, భద్రతా సిబ్బంది, విజిలెన్స్ అధికారుల ఘోర వైఫల్యమే. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు వస్తారని తెలిసినా, కనీస ఏర్పాట్లలో టీటీడీ చేతులెత్తేసింది. చివరకు గోవిందమాల స్వాములనూ అడ్డుకోవడం దారుణం’ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు దర్శనాలు నిలిపివేయడం దుర్మార్గమని, తిరుమలకు భక్తులను రావొద్దనడం చరిత్రలో ఇదే ప్రథమమని ఆక్షేపించారు. ఆలయాల్లో తొక్కిసలాటలు, శివలింగం ధ్వంసం వంటి వరుస అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు పాలనలో 20 నెలలుగా టీటీడీలో కోకొల్లలుగా అవకతవకలు జరుగుతున్నాయి. కొండపైకి మద్యం, మాంసంతో యథేచ్ఛగా వస్తున్నారు. చెప్పులు వేసుకుని దర్శనానికి వెళ్తున్నారు. అయినా, పాలక మండలి చోద్యం చూస్తోంది. వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది వీఐపీలకు దర్శన టికెట్లు ఇచ్చారో వెల్లడించాలి’ అని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. దుర్గగుడి ఘటనకు మంత్రి బాధ్యత వహించరా? ‘విజయవాడ దుర్గగుడికి మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ఘోర తప్పిదం. ఆ సమయంలో 70 వేల మంది భక్తులు ఉన్నారు. దీనికి చిన్నస్థాయి అధికారిని బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎంవోకు తెలియకుండా కరెంట్ సరఫరా నిలిపివేశారా?’’ అని విష్ణు ప్రశి్నంచారు. తిరుమల లడ్డూపై దు్రష్పచారంతో రాష్ట్రానికి చెడు ‘తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేసిన రోజు నుంచే రాష్ట్రానికి చెడ్డ కాలం మొదలైంది. నేడు ఆలయాలకు భద్రత లేదు, హుండీలకు భద్రత లేదు, గోశాలలో గోవులకు రక్షణ లేదు.హిందూ ధర్మాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది?’ అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
‘సీమ’ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం. – తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. తాగునీటి పనులకూ బ్రేక్రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది. ⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది. ⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు. -
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అన్నమయ్య జిల్లా కేంద్రంపై పిల్
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లా పరిపాలన కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చిన ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. జిల్లా కేంద్రం రాయచోటుగానే కొనసాగించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేంద్రాన్ని మార్చడం చట్ట విరుద్ధమని పిల్లో పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ వాదించారు. జిల్లా కేంద్ర మార్పుకు సంబంధించిన జీవో, గెజిట్ నోటిఫికేషన్లను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు. కార్యాలయాలు, రికార్డులను మదనపల్లికి మార్చకుండా తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో అభ్యర్థించారు.ప్రతివాదులుగా రెవెన్యూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ను చేర్చిన పిటిషనర్. చట్ట నిబంధనల ప్రకారం ముందుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలి. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ పిల్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
ఈ మరణాలు ప్రభుత్వ హత్యలే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటితో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆహారం, తాగునీరు కలుషితం కావడం వల్లే పిల్లల వరుస మరణాలు సంభవిస్తున్నా.. ప్రభుత్వానికి ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలూ పట్టడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో జీవో 46తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ పడితే.. కేవలం అక్కసుతోనే ఆ జీవోను నిలిపివేసి చంద్రబాబు.. పేద పిల్లల ఉసురు తీస్తున్నారని స్పష్టం చేేశారు. దాని ఫలితమే అధ్వాన్న స్దితిలో ఉన్న సంక్షేమ హాస్టళ్లు అని విడదల రజిని తీవ్రంగా ఆక్షేపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం మొద్దునిద్రరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,783 సంక్షేమ హాస్టళ్లలో సుమారు ఆరున్నర లక్షల మంది విద్యార్ధులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. వారి హక్కుల్ని కాలరాస్తోంది. విద్యార్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. పారిశుద్ధ్యం కరవై అనారోగ్యం పాలై చనిపోతున్నారు. ఇది పాలనా వైఫల్యం కాదా ?, ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. 18 నెలల్లో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు అనారోగ్యం పాలవుతూనే ఉన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం కరవై ఆస్పత్రుల పాలవుతున్నారు.సంక్షేమ హాస్టళ్లలో మరణమృదంగంఈ 18 నెలల్లో తిరుపతి జిల్లాలో 139 మంది గురుకుల హాస్టల్ విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో భోజనంలో పురుగులు వచ్చాయి. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ హాస్టల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో పిల్లలు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బాలికల ఆశ్రమ పాఠశాలలో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలో 8 మంది చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. సత్యసాయి జిల్లా గిరిజన సంక్షేమ పాఠశాలలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. ఇలా 18 నెలల్లోనే మొత్తం 46 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోనప్పుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుంది.ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలు గొలికొదిలిన ప్రభుత్వం..సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధుల మరణాలకు కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోకుండా ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా అనేది చెప్పాలి. సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదు, బాథ్యత అస్సలే లేదు. ఇది పేదలకు పెట్టే ప్రభుత్వం కాదు, కార్పోరేట్ వాళ్లకు పెట్టే ప్రభుత్వం. పిల్లల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారంటే ఇది ముంచే ప్రభుత్వమని అర్థమవుతోంది.హాస్టళ్ల విషయంలో నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్( ఎన్సీపీసీఆర్) కొన్ని మార్గదర్శకాలు ఇస్తోంది. హైకోర్టు కూడా వీటిని అమలు చేయాలని మొట్టికాయలు వేస్తూనే ఉంది. తాగునీరు ఎప్పుడిస్తారని అడుగుతోంది. ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాల ప్రకారం భద్రమైన వాతావరణం కల్పించాలని, క్వాలిఫైడ్, బాధ్యత కలిగిన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, లివింగ్ కండిషన్స్ ఉండాలని, పౌష్ఠికాహారం ఇవ్వాలని, మందులు అందుబాటులో ఉంచాలని చెబుతోంది. అలాగే విద్యార్ధులకు మానసిక అంశాలపై కౌన్సిలింగ్ కూడా కల్పించాలని చెబుతోంది. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.జీవో 46తో సంక్షేమ హాస్టళ్లను ఆదుకున్న వైఎస్ జగన్జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉండగా జీవో నంబర్ 46 తెచ్చింది. వీటిలో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అన్ని మార్గదర్శకాలను పొందుపరిచింది. అన్ని శాఖలతో సమీక్షలు నిర్వహించి ఈ చక్కటి జీవోను తెచ్చింది. ఇందులో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, విద్యార్ధుల భద్రత, ఆహారం, ఇలా ఎన్నో అంశాలున్నాయి. ఇందులో మరో గొప్ప అంశం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి క్షేత్రస్దాయిలో ఇబ్బందుల్ని అక్కడికక్కడే పరిష్కరించాలని జీవోలో చెప్పాం.అందుకే ఇలాంటి ఘటనలు అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ జీవో నంబర్ 46ను పూర్తిగా పక్కనబెట్టేశారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఎంత దారుణమైన పాలన చేస్తున్నారో అర్దమవుతోంది. విద్యార్ధుల డైట్ ఛార్జీలు చంద్రబాబు హయాంలో తక్కువగా ఉంటే మా హయాంలో పౌష్టికాహారం ఇవ్వాలని వాటిని సమూలంగా మార్చి చక్కడి డైట్ ప్లాన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు హాస్టళ్లలో పిల్లలకు నీళ్ల పప్పు, ఉడకని అన్నం ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చారనే కారణంతో ఈ జీవోను పక్కనబెట్టేశారు.ప్రభుత్వ శాఖల మధ్య కొరవడిన సమన్వయంరాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు ఈ భోజనాలు తినలేక ఆకలితో నీరసించిపోతున్నారు. చలి వణికిస్తున్నా కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో హాస్టళ్లు నడుపుతున్నారు. ప్రశ్నిస్తే వార్డెన్ కొడతారో, ఇంటికి పంపేస్తారనే భయంతో పిల్లలు అలాగే ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రతీ వసతి గృహానికి నిర్వహణ, రిపేర్ల కోసం 20-30 వేలు అత్యవసర నిధులు అందుబాటులో ఉంచే వాళ్లం.ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. వార్డెన్లు వస్తున్నారో లేదో కూడా తెలియట్లేదు. వైయస్.జగన్ ప్రభుత్వంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకునే వాళ్లం. పిల్లల భవిష్యత్తు, హాస్టళ్లలో పారిశుద్ధం, పౌష్టికాహారం అందించే విషయంలో నిరంతరం సమీక్షలు చేసి ఆదేశాలు ఇచ్చే వాళ్లం. కానీ ఇప్పుడు అవేవీ లేకుండా పోయాయి. అలాగే ఆరోగ్య, వైద్య, సంక్షేమ శాఖల మధ్య సమన్వయం ఉండాలని వైయస్.జగన్ చెప్పేవారు. ఇప్పుడు అలాంటి ఆనవాళ్లు, పర్యవేక్షణ లేదు.వైఎస్ జగన్ హయాంలో నాడు-నేడుతో మారిన స్కూళ్లువైఎస్ జగన్ హయాంలో నాడు-నేడు పథకంతో పాఠశాలల రూపురేఖలు మార్చారు. ప్రభుత్వ స్కూల్స్కు సైతం రికమండేషన్ చేయించుకోవాల్సిన స్థాయికి వాటిని తెచ్చారు. కార్పోరేట్ స్కూల్స్ లా మార్చారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆటస్థలాల్ని అభివృద్ధి చేసి ఇచ్చారు. గోరు ముద్ద పేరుతో మంచి మెనూతో పౌష్టికాహారం అందించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం ఓ నిధి ఏర్పాటు చేసి పూర్తి పారిశుద్ధ్యంగా ఉండేలా చూశారు. ప్రతీ పేద విద్యార్దికీ కార్పోరేట్ స్కూల్ అన్న ఫీలింగ్ తెచ్చారని విడదల రజిని స్పష్టం చేశారు. దీంతో పాటు అంతర్జాతీయ వేదికల మీద పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్ధితి ఉండేదని.. కానీ ఇప్పుడు కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం
సాక్షి, అమరావతి: నూజివీడు పేకాట క్లబ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. క్లబ్లో గేమింగ్స్కు సంబంధించి ఆంక్షలతో ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని పాటించకుంటే చర్యలు తీసుకోవాలని అటు పోలీసులకు స్పష్టం చేసింది. డిసెంబర్ 22వ తేదీన మ్యాంగో బే క్లబ్పై పోలీసులు రైడ్స్ నిర్వహించి.. పేకాట ఆడుతున్న 285 మందిని పట్టుకున్నారు. మొత్తం రూ.34 లక్షల నగదుతో పాటు 128 కార్లు, 40 టూ వీలర్స్ కూడా సీజ్ చేశారు. ఈ కేసులో నాలుగురోజుల కిందట ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 13 కార్డ్స్ పేకాట లేదంటే డబ్బులు పందేలకు ఏ ఆట ఆడవద్దని.. అలా ఆడే వారిపై చర్యలు తీసుకోవచ్చని పోలీసులకి హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో.. హైకోర్టు ఉత్తర్వులపైన మ్యాంగో బే కల్చరల్ అండ్ రీక్రియేషన్ సొసైటీ నడపబడుతోందని గమనిక బోర్డు ఏర్పాటు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
జల వివాదాలపై కేంద్ర కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఈమేరకు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారుడు, ఈఎన్సీ(ఇరిగేషన్), అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ ఉంటారు.తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు, శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీ (జనరల్)తోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) సీఈలను సభ్యులుగా నియమించారు. సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల మదింపు విభాగం(పీఏవో) సీఈని కమిటీ సభ్య కార్యదర్శిగా నియమించారు. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గతేడాది జూలై 16న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో కమిటీని నియమించి సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.ఆ మేరకు ఇప్పుడు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సమన్యాయంతో నీటి పంపకాల మార్గాలను సూచించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం పేర్కొంది. జల వివాదాల పరిష్కారానికి మూడు నెలలులోగా నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. ఇందుకోసం ఇతర విభాగాల అధికారులు, నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.పరిష్కారమయ్యేనా..?కృష్ణా జలాలను ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయిస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు కల్పించింది. అయితే కృష్ణా నదీ జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమలులోకి వచ్చే వరకు, బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో తమకు 50 శాతం నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. గోదావరిపై ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల/నల్లమలసాగర్పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ వివాదాలపై చర్చించి పరిష్కారాలను సూచిస్తూ కేంద్రానికి కమిటీ ఇచ్చే నివేదికతోనైనా జల వివాదాలు పరిష్కారమవుతాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. -
అవినీతిలో రెవెన్యూ శాఖ ఫస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. ఇదే సమయంలో అవినీతి అధికారులకు శిక్షలు మాత్రం తగ్గుతున్నాయి. 2025లో రాష్ట్రంలో అవినీతి కేసులపై ఏసీబీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అవినీతిలో రెవెన్యూ శాఖదే మొదటి స్థానమని తేలి్చంది. ఏసీబీ డీజీ అతుల్సింగ్ శుక్రవారం విడుదల చేసిన ఆ నివేదిక రాష్ట్రంలో అవినీతి పెరుగుతోందని వెల్లడించింది. 2025లో ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మొత్తం 115 అవినీతి కేసులను నమోదు చేశారు. వాటిలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న (ట్రాప్) కేసులు 69 ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 8 నమోదు కాగా, వీటిలో కారి్మక శాఖకు చెందినవి రెండు.. విద్యుత్తు, వైద్య–ఆరోగ్య, పురపాలక – పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఒక్కో కేసు నమోదైంది.నేరపూరితమైన ప్రవర్తన కేసులు 7, సాధారణ విచారణ కేసులు 19, ఆకస్మిక తనిఖీల కేసులు 12 ఉన్నాయి. ట్రాప్ కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 69 కేసుల్లో అత్యధికంగా 19 కేసులు ఆ శాఖ అధికారులపై నమోదు చేసినవే. ఓ వైపు అవినీతి పెరుగుతూ ఉంటే మరోవైపు అవినీతికి పాల్పడిన అధికారులపై మాత్రం శిక్షలు తగ్గుతుండటం విస్మయ పరుస్తోంది. ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి సంవత్సరం 2023లో 48 శాతం కేసుల్లో అవినీతి అధికారులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించారు. 2025లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం శిక్షల శాతం 46 శాతానికి తగ్గింది. న్యాయస్థానాల్లో విచారణ ముగిసిన 36 కేసుల్లో కేవలం 12 కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి. అవినీతి తగ్గించేందుకు కృషి: అతుల్ సింగ్, డీజీ, ఏసీబీ ‘రాష్ట్రంలో అవినీతి పెరుగుతోంది. దాన్ని ఒక్క ఏసీబీనే కట్టడి చేయలేదు. ప్రజల సహకారం చాలా అవసరం’ అని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై 46 శాతం శిక్షల రేటుతో తాను సంతృప్తికరంగా లేనని చెప్పారు. శిక్షల రేటు 75 శాతం ఉండాలన్నారు. మధ్య స్థాయి, ఉన్నత స్థాయి అధికారులు బినామీల పేరుతో ఆస్తులను కూడగడుతుండటాన్ని గుర్తించడం ఏసీబీకి సవాల్గా మారిందన్నారు. అందుకోసం ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ను త్వరలో ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. -
రాబడిని పెంచండి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నేతర రాబడిని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రభుత్వ విభాగాలకు సూచించింది. గత కొన్నేళ్లుగా పన్నేతర ఆదాయంలో పెరుగుదల లేదని, ఇందుకు ప్రధాన కారణం పరిపాలన విభాగాలు క్రమానుగతంగా చార్జీలను సవరించకపోవడంతో పాటు పర్యవేక్షణ లేకపోవడమని తెలిపింది. పన్ను రాబడులు పెంచేందుకు సంబంధిత శాఖలు ప్రస్తుత పన్ను రేట్ల ఆధారంగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రస్తుత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాల సమర్పణకు సమగ్ర సూచనలు చేస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.ఫిబ్రవరిలో 2026–27 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీకి సమర్పించనున్నట్లు అందులో తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదనలను నిధి ఆన్లైన్ పోర్టల్లో ఈనెల 9లోగా ఆన్ని శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడున్న దానికంటే పన్నేతర ఆదాయం పెంచేందుకు అన్ని శాఖలూ నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలి్సందిగా సూచించారు. వివిధ రకాల వడ్డీలు, డివిడెండ్లు రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని, పరిపాలన విభాగాల్లో పటిష్టమైన పర్యవేక్షణతో లక్ష్యాలను సాధించాలని కోరింది. హెచ్ఓడీలు బకాయిల వసూళ్లపై డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రస్తుత సంవత్సరంలో వసూలయ్యే అవకాశమున్న బకాయిలను అంచనా వేయాలని.. రాబడుల్లో లీకేజీలను అరికట్టడానికి చర్యలు చేపట్టడంతోపాటు కఠినమైన నిఘాతో అన్ని స్థాయిల్లో ఉద్యోగుల పనితీరును మెరుగుపర్చి సూచికలను అమలుచేయాలని తెలిపింది.కొత్తగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రతిపాదించొద్దు..ప్రస్తుతమున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సమీక్షించడం ద్వారా వారి సంఖ్య తగ్గించాలని, కొత్తగా ఎవరినీ ప్రతిపాదించొద్దని.. అలాగే ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన సిబ్బంది వేతనాలకు మంజూరైన ఉత్తర్వుల ఆధారంగా ఒప్పంద సేవలకు అవసరమైన నిధులు ప్రతిపాదించాలని ఆర్థిక శాఖ తెలిపింది. సంబంధిత శాఖల ఆమోదం తరువాతే కన్సల్టెంట్స్, రిటైర్డ్ ఉద్యోగుల పునర్నియామకాలకు వేతనాలను ప్రతిపాదించాలని పేర్కొంది. గత మూడేళ్ల వ్యయం ఆధారంగా నిర్వహణ వ్యయం ప్రతిపాదించాలంది. ప్రభుత్వ అనుమతిలేని ఎలాంటి అంశాలకూ కేటాయింపులు ప్రతిపాదించరాదని చెప్పింది. రాయితీలు, నిర్వహణ, సామాజిక పింఛన్లు మొదలైన తప్పనిసరి వ్యయాలకు పూర్తిగా కేటాయింపులు చేస్తామని.. అయితే, లబ్ధిదారుల సంఖ్యతో సహా బడ్జెట్ ప్రతిపాదనలు చేయాలి. అప్పులతోనే మూలధన వ్యయం..ఇక మౌలిక సదుపాయాల మూలధన వ్యయానికి అప్పులపైనే ఆధారపడాలని ఆర్థిక శాఖ స్పష్టంచేసింది. కనెక్టివిటీ, గృహ నిర్మాణం, తాగునీరు, విద్య, ఆరోగ్యంతో పాటు పారిశ్రామీకరణ వంటి మూలధన వ్యయ వనరుల ప్రతిపాదనలను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ), ఈఏపీ, నాబార్డు, హడ్కోల నుంచి నిధులు రాబట్టేలా సంబంధిత ఇంజనీర్లు పూర్తి వివరాలను ఆన్లైన్లో సమర్పించాలని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను సమీక్షించడంతో పాటు వాటి అవసరం, ప్రాధాన్యత, వ్యయాలు, ఫలితాలను పరిశీలించి కాలం చెల్లిన పథకాలను రద్దుచేయాలని చెప్పింది. వేతనాలేతర వ్యయంలో 20 శాతం పొదుపు చేయాలని కోరింది. సాధ్యంకాని, సరిపోని కేటాయింపుల ప్రతిపాదనలను చెయొ్యద్దని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది.పథకాల వ్యయం అంచనాలు ఇలా..‘పథకాల వ్యయానికి సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. మేనిఫెస్టో పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి డేటాతో సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాకే ప్రతిపాదనలు పంపాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ప్రతిపాదనలు కేంద్రానికి పంపే ముందు కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పథకాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖల అధికారులు సమీక్షించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గత ఏడాది వాస్తవ నిధుల విడుదల ఆధారంగా ప్రతిపాదనలు ఉండాలి. ఊహాజనిత గణాంకాలతో ప్రతిపాదనలు చెయొ్యద్దు. ఉప ప్రణాళికలతో పాటు మహిళలు, పిల్లల బడ్జెట్ను ప్రతిపాదించాలి. బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లు, ఉత్తర్వులను శాఖాధిపతులు, సచివాలయ శాఖలు సమర్పించాలి’ అని ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
మూడు నెలల్లో మళ్లీ రూ.17,500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అప్పుల క్యాలెండర్తో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) బాబు సర్కారు రూ.17,500 కోట్లు బడ్జెట్ అప్పు చేయనుంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో ఆర్బీఐ శుక్రవారం మూడు నెలల బాబు సర్కారు అప్పుల క్యాలెండర్ను ప్రకటించింది. బాబు ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తున్నా, సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు, యువతకు ఉద్యోగాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు.ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు కూడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో మూడు నెలల్లో చేసే అప్పుల్లో వచ్చే మంగళవారం అంటే ఈ నెల 6వ తేదీన రూ.6,500 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. గత మంగళవారం నాడే బాబు సర్కారు రూ.4,000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారం వ్యవధిలోనే రూ.6,500 కోట్లు అప్పు చేస్తోంది. అంటే వారం వ్యవధిలోనే బాబు సర్కారు ఏకంగా రూ.10,500 కోట్లు అప్పు చేసినట్లవుతోంది. -
మామిడి రైతుకు అందని ‘మద్దతు’!
సాక్షి, అమరావతి: గిట్టుబాటు ధర దక్కక గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధరగా కిలోకు రూ.12 ప్రకటించిన సర్కారు ఆ మేరకు రైతులకు ధర దక్కేలా చేయడంలో ఘోరంగా విఫలమైంది. కేంద్రం ఇచ్చిన రాయితీ మొత్తాన్ని రైతులకు జమచేయడంతో తమ పని అయిపోయినట్లుగా చేతులు దులిపేసుకుంది. మరోవైపు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకి రూ.8 చొప్పున ఇవ్వకుండా గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు కూడా చేతులెత్తేయడంతో రానున్న సీజన్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆందోళన మామిడి రైతులను పీడిస్తోంది. ఈ నేపథ్యంలో.. మరో నాలుగు నెలల్లో మార్కెట్కు రానున్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.కేంద్రం నిధులతో సరి..వైఎస్సార్సీపీ పోరాట ఫలితంగా చిత్తూరు జిల్లాలో 32,257 మంది నుంచి 3.72 లక్షల టన్నులు.. తిరుపతి జిల్లాలో 6,137 మంది నుంచి 67 వేల టన్నులు.. అన్నమయ్య జిల్లాలో 2,401 మంది నుంచి 24 వేల టన్నులు.. వెరసి 40,795 మంది రైతుల నుంచి 4.62 లక్షల టన్నుల మామిడి కాయలను గుజ్జు పరిశ్రమలు, వ్యాపారులు, మండిలోని ర్యాంపు నిర్వాహకుల ద్వారా సేకరించినట్లు లెక్కతేల్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.130 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, 1.62 లక్షల టన్నుల మామిడికి మార్కెట్, మద్దతు ధరల మధ్య వ్యత్యాసం ఇస్తామని కేంద్రం ప్రకటించింది.చివరికి.. లక్ష టన్నులకు రూ.109 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి మరో రూ.76 కోట్లు జతచేసి కిలోకు రూ.4 చొప్పున రూ.185 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 14న విడుదల చేసింది. కానీ, ఇప్పటివరకు రూ.150 కోట్లకు మించి జమకాలేదని తెలుస్తోంది. పైగా.. ఈ–పంట డేటా ఆధారంగా రాయితీ సొమ్ము జమచేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం చివరికి, ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి సేకరించిన జాబితా ప్రకారం జమచేయడంతో అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.చేతులెత్తేసిన పరిశ్రమలు.. పట్టించుకోని ప్రభుత్వం..ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలోకు రూ.8 చొప్పున చెల్లించాల్సిన గుజ్జు పరిశ్రమలు, ర్యాంప్ నిర్వాహకులు ఆ మొత్తాన్ని చెల్లించడంలో చేతులెత్తేశాయి. కొన్ని పరిశ్రమలు రూ.3–4లు, మరికొన్ని పరిశ్రమలు రూ.4–5 చొప్పున చెల్లించాయి. ర్యాంపుల్లో అయితే రూ.3కు మించి చెల్లించిన దాఖలాల్లేవు. మరికొన్ని ఫ్యాక్టరీలైతే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు, ర్యాంప్ నిర్వాహకుల నుంచి రూ.400 కోట్లు జమకావాల్సి ఉండగా, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు 40 వేల మందికి రూ.350 కోట్లకు పైగా రావాల్సి ఉండడంతో ఆ మొత్తం కోసం రైతులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.అయినా సరే ప్రభుత్వం పట్టనట్లుగా ఉంది. కిలో రూ.8 చొప్పున చెల్లించేందుకు తాము అంగీకరించలేదని, అలాంటప్పుడు ఏ విధంగా చెల్లిస్తామని గుజ్జు పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లుగా ఎగుమతుల్లేక ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన పల్ప్ నిల్వలకు మార్కెటింగ్లో సహకరించాలని మొరపెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వమే హామీ ఇచ్చినందున తమకు రావాల్సిన మొత్తం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదేనని రైతులు తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. గత సీజన్లో తలెత్తిన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న సీజన్లో మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.వైఎస్ జగన్ చొరవతోనే కిలోకు రూ.4 సబ్సిడీ..చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి, అల్ఫాన్సా, బెనిషా, మల్లికతో పాటు దాదాపు 10 రకాల వెరైటీలు సాగవుతున్నాయి. అత్యధికంగా 40 వేల హెక్టార్లలో తోతాపురి రకమే సాగవుతోంది. ఇలా అన్ని రకాల మామిడి కలిపి గతంలో 6.45 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. తోతాపురి అయితే 5.60 లక్షల టన్నుల వరకు వచ్చిందని అంచనా. అయితే, తోతాపురి వెరైటీ మామిడిని అమ్ముకునేందుకు రైతులు గత సీజన్లో ఎన్నడూలేని రీతిలో పడరాని పాట్లు పడ్డారు. ధరలేక.. కొనేవారు లేక రోడ్డెక్కిన వీరికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలవడంతో కిలో రూ.12లకు తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కిలో రూ.12 చొప్పున 5.60 లక్షల టన్నుల కొనుగోలుకు రూ.672 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. కానీ, ఆ రేటుకు కొనేందుకు గుజ్జు పరిశ్రమలు ముందుకురాకపోవడంతో సబ్సిడీ రూపంలో కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వమే రైతులకు చెల్లిస్తుందని, ఫ్యాక్టరీలు రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే, తాము చెల్లిస్తామన్న సబ్సిడీ మొత్తం విడుదలలో తొలుత చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్, షార్ట్టర్మ్ రుణం రూపంలో కార్పొరేషన్ల ద్వారా సమీకరించుకోవాలంటూ ఉద్యాన శాఖను ఆదేశించింది. -
‘ఉత్త’ షోకు రంగం సిద్ధం!
‘అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట’ సామెత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అతికినట్లు సరిపోతుంది.. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే ఈ పథకానికి గోదావరి జలాలు తరలిస్తామన్న చంద్రబాబు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేసింది లేదు.. 2014–19 మధ్య, ఇప్పుడు ఈ 18 నెలల్లో చేసిందంటూ ఏమీ లేదు. కనీసం తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు. అలాంటిదిప్పుడు ఈ నెలలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిధులు వెదజల్లుతారట! గత ప్రభుత్వం ప్రారంభించిన పనులు కొనసాగేలా కూడా దృష్టి పెట్టని ఈ సర్కారు.. ప్రజలను మభ్యపెట్టడానికి సరికొత్త ‘షో’కు ఉద్యుక్తమవుతుండటం విస్మయ పరుస్తోంది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,200 గ్రామాల్లో 30 లక్షల మంది దాహార్తి తీర్చే బాబూ జగ్జీవన్రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఉత్తుత్తి ‘షో’ చేయడం ద్వారా ప్రజలను మభ్యపెట్టాలని యత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తకపోవడం ఇందుకు నిదర్శనం. చంద్రబాబు పథకానికి 2024–25 బడ్జెట్లో రూ.79.97 కోట్లు చూపి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు కేటాయించినా పైసా విదిల్చలేదు. ఫలితంగా ఈ పథకానికి గ్రహణం పట్టిందని సాగు నీటి రంగ నిపుణులు వాపోతున్నారు.పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 162.409 కిలోమీటర్ల నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున 63.2 టీఎంసీల గోదావరి జలాలను తరలిండం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి 2009 జనవరి 2న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అంకురార్పణ చేశారు. వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో టెండర్లు పిలిచారు. కానీ, ఆయన హఠాన్మరణంతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత విభజిత ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు ఈ పథకాన్ని పట్టించుకోలేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు తొలి దశ పనులను రూ.2020.20 కోట్లతో చేపట్టినట్టు చూపుతూ 4.85 శాతం అధిక ధరకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. కానీ, పైసా పని అయినా చేయనే లేదు.వైఎస్ జగన్ చొరవతో అడుగులు ముందుకు..సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2022లో నాటి సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను రూ.17,411 కోట్లతో చేపట్టేందుకు అనుమతిచ్చారు. తొలి దశలో పోలవరం ఎడమ కాలువలో 162.40 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వకం, రెండు ఎత్తిపోతలు, పెదపూడి రిజర్వాయర్ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీల పనులను రూ.954.09 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించారు.రెండో దశలోనూ పాపయ్యపాలెం ఎత్తిపోతల, 121.62 కిలోమీటర్ల పొడవునా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల పనులను రెండు ప్యాకేజీల కింద రూ.5,134 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. వాటికి అనుబంధంగా భూదేవి, వీరనారాయణపురం, తాడిపూడి రిజర్వాయర్ల నిర్మాణాన్ని దశల వారీగా చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశ, రెండో దశ పనుల డిజైన్లు అన్నింటిని 2023 నాటికే ప్రభుత్వం ఆమోదించింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. తొలి దశ పనులకు 3,822 ఎకరాలు, రెండో దశకు 12,214.36 ఎకరాల భూ సేకరణను కొలిక్కితెచ్చారు.చంద్రబాబు రాకతో ఎక్కడి పనులు అక్కడే!⇒ ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన నెలకు.. అంటే 2024 జూలై 11న అనకాపల్లి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందిస్తానని హామీ ఇచ్చారు. కానీ, 17 నెలలైనా పనుల్లో కదలిక లేదు. 2024–25 బడ్జెట్లో తొలుత రూ.63.02 కోట్లు, సవరించిన బడ్జెట్లో రూ.79.97 కోట్లు కేటాయించినా, పైసా వ్యయం చేయలేదు. 2025–26 బడ్జెట్లో రూ.605.75 కోట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తర్వాత సెప్టెంబర్ 11న నిర్వహించిన సమీక్షలో ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది రూ.వెయ్యి కోట్లు వ్యయం చేసి, తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటిదాక రూపాయి కూడా విడుదల చేయలేదు.ఉత్తరాంధ్రకు గోదావరి జలాభిషేకం ఇలా⇒ వెనుకబడిన ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో పోలవరం ఎడమ కాలువను 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ⇒ పోలవరం ఎడమ కాలువలో 162.409 కి.మీ. నుంచి రోజుకు 8 వేల క్యూసెక్కుల చొప్పున అనకాపల్లి జిల్లాలో పాపయ్యపాలెం వరకు 23 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలిస్తారు. ఈ కాలువలో 4.5 కి.మీ నుంచి మరో లింక్ కెనాల్ తవ్వి.. జామద్దులగూడెం నుంచి కొత్తగా 3.16 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పెదపూడి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ పాపయ్యపాలెం నుంచి 45 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేసి, 106 కి.మీ పొడవున విజయనగరం జిల్లా గాదిగెడ్డ రిజర్వాయర్ వరకు తవ్వే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువ ద్వారా తరలిస్తారు. ⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రధాన కాలువలో 14 కి.మీ తవ్వే లింక్ కెనాల్ ద్వారా నీటిని మళ్లించి.. భూదేవి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే భూదేవి రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 49.50 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, వీఎన్ పురం (వీర నారాయణపురం) వద్ద ఎత్తిపోతల ద్వారా కొత్తగా 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే వీఎన్ పురం రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 73 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా కొత్తగా 3.80 టీఎంసీలతో నిర్మించే తాడిపూడి రిజర్వాయర్కు ఎత్తిపోస్తారు.⇒ ప్రధాన కాలువలో 102 కి.మీ నుంచి తవ్వే మరో లింక్ కెనాల్ ద్వారా నీటిని తరలించి, కొండగండరేడు నుంచి 60 కి.మీల పొడవున తవ్వే కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువ నుంచి బీఎన్ వలస బ్రాంచ్ కెనాల్, జి.మర్రివలస లిఫ్ట్ కెనాల్, బూర్జువలస లిఫ్ట్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తారు.⇒ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ఉమ్మడి విశాఖపట్నంలో 3.21 లక్షలు, విజయనగరంలో 3.94 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 85 వేల ఎకరాలకు నీరందిస్తారు. -
న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలి
సాక్షి, అమరావతి: న్యాయాధికారులకు జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే... న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. సీనియర్, యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదట సహకారం అందించే వ్యక్తిని తానే అవుతానని కూడా ఆయన ప్రకటించారు. న్యాయవాదులకు లీగల్ అకాడమీ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థలో తాజా పరిణామాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు.మారిన పరిస్థితుల్లో కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారని పేర్కొంటూ అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలన్నారు. గుంటూరులో శనివారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహ శుక్రవారం హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏఐ విప్లవాత్మక పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అత్యంత అవసరమన్నారు. ఘన సన్మానంఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గం జస్టిస్ శ్రీనరసింహను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు గ్రంథాలయాన్ని, హైకోర్టు నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం రాత్రి జస్టిస్ నరసింహ గౌరవార్థం హైకోర్టు న్యాయమూర్తులందరూ విందు ఏర్పాటు చేశారు. కాగా, హైకోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహను ఆయన పూర్వీకుల గ్రామమైన ప్రకాశం జిల్లా, మేదేపల్లి గ్రామానికి చెందిన పలువురు కలిసి, ఆయన తండ్రి దివంగత కోదండరామయ్య చిత్ర పటాన్ని అందచేశారు.పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు: జస్టిస్ శ్రీనరసింహ వన్టౌన్(విజయవాడపశి్చమ): పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని జస్టిస్ శ్రీనరసింహ పేర్కొన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ శ్రీనరసింహ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పుస్తక పఠనం గొప్ప సంస్కృతిగా అభివర్ణించారు. పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు. -
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
⇒ 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.4 వేలు చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు. ⇒ తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి రూ.30 వేలు ఇవ్వాలి. తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు.. రెండో ఏడాది 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద రూ.19,848.64 కోట్లకు పైగా ఎగనామం. ⇒ దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు.. తొలి ఏడాది రూ.3,218.48 కోట్లు, రెండో ఏడాది రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తంగా రూ.4,700.96 కోట్లు ఎగవేశారు. ⇒ ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేల చొప్పున రెండేళ్లలో రూ.36 వేలు ఇవ్వాలి. కానీ, చంద్రబాబు ఒక్కపైసా ఇవ్వకుండా రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. ⇒ నిరుద్యోగులకు భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున రెండేళ్లలో రూ.72 వేలు చొప్పున ఇవ్వాలి. కానీ, సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా రూ.14,400 కోట్లు బకాయిపెట్టారు. ⇒ అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలకు గాను రూ.10 వేలే ఇచ్చి.. రూ. 30 వేలు ఎగ్గొట్టారు. తద్వారా రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు 2024 జూన్ నుంచే ప్రారంభమవుతుందంటూ ఇంటింటికీ బాండ్లు పంచిన టీడీపీ కూటమి నయవంచనకు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం పెల్లుబుకుతోంది. ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ..’ అంటూ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇంటింటికీ పంచిన బాండ్లు ప్రకారం తమకు రావాల్సిన మొత్తాన్ని లెక్కగట్టి వడ్డీతో సహా కొత్త ఏడాదిలోనైనా చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు 11 నెలల ముందే.. 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వేదికగా సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రకటించారు.సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంటింటా ప్రచారం చేసి.. ఐదేళ్లలో చేకూరే లబ్ధిపై గ్యారంటీ ఇస్తూ బాండ్లు జారీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’గా పేరు పెట్టుకుని అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా హామీలను నెరవేర్చకుండా కుచ్చుటోపీ పెట్టారు! చంద్రబాబు ప్రజలకు ఎగ్గొట్టిన ఆ మోసాల ఖరీదు ఏకంగా రూ.లక్షన్నర కోట్లు!!ఆ మోసాలకు సాక్ష్యాలు.. ఇంటింటా బాబు బాండ్లుమహానాడు ముగిసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ టీడీపీ సమన్వయకర్తలు, నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి.. కుటుంబ సభ్యుల పేర్లు ఆరా తీసి, టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేశారు. కుటుంబ యజమాని ఫోన్ నంబర్ తీసుకుని టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్ సైట్ ద్వారా ఓటీపీ పంపించారు. ఆ ఓటీపీ నంబరును టీడీపీ మేనిఫెస్టో డాట్కామ్ వెబ్సైట్లో నమోదు చేసి.. ఆ కుటుంబానికి సూపర్ సిక్స్సహా వివిధ పథకాల కింద ఏటా చేకూరే లబ్ధి.. ఐదేళ్లలో ఒనగూరే ప్రయోజనాలను హోరెత్తించారు.టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు మిస్డ్ కాల్ ఇప్పించారు. ఆ వెంటనే.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ద్వారా చేకూర్చే ప్రయోజనానికి గ్యారంటీ ఇస్తూ వారి ఫోన్ నంబర్కు బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు పంపారు. ఆ బాండ్లను కుటుంబ సభ్యుల ముందే డౌన్లోడ్ చేయించారు. వివిధ పథకాల కింద ఆ కుటుంబానికి చేకూరే లబ్ధి, ఆ హామీలను అమలు చేస్తానని త్రికరణశుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నానని బాండ్లలో చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ సిక్స్సహా హామీలన్నీ 2024 జూన్ నుంచే అమలు ప్రారంభమవుతుందని ఆ బాండ్లలో చెప్పారు. కానీ ఇంతవరకు ఆ బాండ్లలో ఇచ్చిన హామీల మేరకు లబ్ధి చేకూరకపోవడంతో మోసపోయామని ప్రతి ఇంటా ప్రజలు ఆక్రోశిస్తున్నారు. సూపర్ సిక్స్ సహా వివిధ హామీల కింద చంద్రబాబు ప్రభుత్వం తమ కుటుంబానికి ఎంత ఎగ్గొట్టిందో లెక్కలు వేసుకుంటున్నారు. నిరుద్యోగులకు రూ.14,400 కోట్లు ఎగవేత..సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. 20 లక్షల మందికి ఉద్యోగాలు లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఇంతవరకు నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున 2024–25లో రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు. 2025–26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అంటే.. ఈ ఏడాది నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినట్లే. ఒక్కో నిరుద్యోగికి చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.72 వేలు! ఇప్పటికే నిరుద్యోగ భృతి కింద యువతకు సీఎం చంద్రబాబు రూ.14,400 కోట్లు బకాయిపడ్డారు. సుఖీభవ బకాయిలు రూ.16,747.52 కోట్లుప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాతా సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. తొలి ఏడాది దీన్ని పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో 46,85,838 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.4,685.54 కోట్లు మాత్రమే విదిల్చారు. అంటే.. 6,72,428 మంది రైతులకు పూర్తిగా ఎగనామం పెట్టారు. రెండేళ్లలో రూ.40 వేలకుగానూ రూ.పదివేలే విదిల్చి.. ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సీఎం చంద్రబాబు ఇప్పటికే రూ.16,747.52 కోట్లు బకాయిపడ్డారు.ఆడబిడ్డ నిధితో ఎగ్గొట్టింది రూ.64,800 కోట్లు సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకం మరొకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది ఉంటారు. వీరికి ఏటా రూ.18 వేలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరం. కానీ.. 2024–25, 2025–26 బడ్జెట్లలో ఒక్క పైసా కూడా కేటాయించలేదు. ఏ ఒక్కరికీ పైసా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఏటా రూ.18 వేలు చొప్పున చంద్రబాబు రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.36 వేలు! ఆడబిడ్డ నిధి కింద సీఎం చంద్రబాబు మహిళలకు ఇప్పటికి రూ.64,800 కోట్లు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే పెన్షన్ల పేరుతో వంచన..50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు, పురుషులకు పెన్షన్ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. తొలి ఏడాది వారికి పెన్షన్ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లోనూ ఆ పథకానికి పైసా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాది కూడా ఎగ్గొట్టినట్టే. ఈ వర్గాలకు చెందిన వారికి ఎన్నికల హామీని నెరవేర్చకుండా రెండేళ్లలో పెన్షన్ కింద చంద్రబాబు రూ.96 వేలు ఎగ్గొట్టారు. మొత్తమ్మీద ఇప్పటికే 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం చంద్రబాబు పెన్షన్ రూపంలో రూ.19,200 కోట్లు బకాయిపడ్డారు.తుస్సుమన్న ఉచిత బస్సు..మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,200 కోట్ల మేర ఆర్టీసీకి ఇవ్వాలి. 2024–25లో ఆ హామీని అమలు చేయలేదు. అంటే.. తొలి ఏడాది ఉచిత బస్సు హామీ కింద రూ.3,200 కోట్ల మేర సీఎం చంద్రబాబు మహిళలకు బకాయిపడ్డారు. 2025–26లో ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమలు చేసినట్లుగా ప్రకటించారు. ఆర్టీసీలో 16 రకాల సర్వీసులు ఉండగా.. అందులో ఐదు సర్వీసుల్లో మాత్రమే ఉచిత బస్సును అమలు చేస్తున్నారు.తొమ్మిది రకాల సర్వీసులను ఉచిత బస్సు పథకాన్ని వర్తింపజేయడం లేదు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండి ఉంటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చేవారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు.తల్లులకు ఎగ్గొట్టింది రూ.19,848.64 కోట్లకుపైనే!తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇక 2025–26లో 67,27,124 మందికి రూ.10,090 కోట్లను తల్లికి వందనం కింద పంపిణీ చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ.. ఇప్పటికి 66 లక్షల మందికి రూ.6,377 కోట్లను మాత్రమే చెల్లించారు. అంటే... ఒక్కొక్కరికి రూ.8 వేలు, రూ.9 వేలు.. రూ.పది వేలు చొప్పున చెల్లించినట్లు స్పష్టమవుతోంది. ఆ అరకొర సొమ్మును కూడా 21 లక్షల మందికి ఎగ్గొట్టారు. మొత్తమ్మీద తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే తల్లులకు రూ.19,848.64 కోట్లకుపైగా సీఎం చంద్రబాబు బకాయిపడ్డారు.‘దీపం’లో రూ.4,700.96 కోట్లు ఎగవేత..దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర రూ.855 ఉంది. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్కు మాత్రమే రూ.865 కోట్లు ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. ఇక 2025–26 బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించారు. అంటే.. రెండో ఏటా రూ.1,482.48 కోట్లు బకాయిపడ్డారు. మొత్తమ్మీద దీపం పథకం కింద ఇప్పటికే మహిళలకు రూ.4,700.96 కోట్లను సీఎం చంద్రబాబు ఎగ్గొట్టారు. -
‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా’.. ఇలా చేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే!
సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.సీసీ కెమెరాలుసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఇళ్ల భద్రతా చర్యలు ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.వాహనాల భద్రత విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.టెక్నాలజీ ఆధారిత భద్రత ఇళ్లలో టైమర్తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలిసోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
సాక్షి, విజయవాడ: మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. జోగీ రమేష్పైకు డాక్టర్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల సందర్భంగా జోగి రమేష్ను కలిసేందుకు వచ్చిన భార్య, కుమారుడితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు అందించారు. కాగా, కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జోగి రమేశ్ను అరెస్టు చేసింది. -
చంద్రబాబు ‘కనబడుటలేదు’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ల ఆచూకీ లేకుండా పోవడంతో, సోషల్ మీడియాలోనూ ప్రజల్లో వీరి ఆచూకిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్ఫష్టీకరించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తమ విదేశీ పర్యటలపై తండ్రీకొడుకుల ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీసిన ఆయన... సీఎస్, డీజీపీలే ప్రజలకు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా.. తెచ్చిన అప్పంతా దోచుకుంటోందని మండిపడ్డారు. చివరకు టీడీపీ కార్యకర్తల నూతన సంవత్సర అభినందనలకు కూడా అందకుండా తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ ల కోసం టీడీపీ కార్యకర్తలు వెదుకుతున్నారని... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రహస్య పర్యటనలేంటని వెంకటరెడ్డి ఆక్షేపించారు.ప్రతి 3 నెలలకు చంద్రబాబు, 2 నెలలకు లోకేష్ ప్రత్యేక విమానాల్లో దోచుకున్నది దాచుకోవడానికే రహస్య పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఆచూకీ లేని సీఎం చంద్రబాబునాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఏమైపోయాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కనబడుట లేదు. ఆచూకీ ఎక్కడ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆచూకీ గురించి రాష్ట్ర డీజీపీ, సీఎస్ల వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు చెప్పాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఆచూకీ కనుగోనమని కోరాలి. సీఎం చంద్రబాబుతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ సైతం గడిచిన వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చంద్రబాబు ఆచూకీ గురించి ఎల్లో మీడియా సైతం పలు దేశాల పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఎవరూ క్లారిటీగా ఫలానా దేశం వెళ్లాడని కూడా చెప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు, ఇలా రహస్యంగా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడం లేదు.శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో జంప్రాష్ట్రమంతా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకుంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం అదే రోజు (30.12.2025)న శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉదయం 10.28 గంటలకు వీజేటీ 101 అనే స్పెషల్ ఫ్లైట్లో బాలి వెళ్లాడని తెలుస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్లాడని ప్రచారం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ మీటింగ్ కూడా వదిలేసి 28-12-2025న శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్లాడని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగా కీలకస్థానాల్లో ఉండి ఇలా రహస్య పర్యటనలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేకుండా కేబినెట్ మీటింగ్లు కూడా వదిలేసి ప్రత్యేక విమానాల్లో ఎందుకు వెళ్లారు? వారి పర్యటన వివరాలు ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారు? కనీసం వారు తిరిగి ఎప్పుడోస్తారో కూడా చెప్పకపోవడానికి ఏవైనా కారణాలున్నాయా? ఇవన్నీ ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.ప్రతి మూడు నెలలకు చంద్రబాబు, రెండు నెలలకు లోకేష్చంద్రబాబు సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఆరుసార్లు విదేశీ పర్యటనలు చేస్తే, అందులో రెండుసార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి చేసిన రహస్య పర్యటనలే ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ పర్యటనలకు వెళ్లాడు. ప్రస్తుతం బాలి వెళ్లినట్టు తెలుస్తోంది. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఇప్పటికే 9 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. ప్రతి రెండు నెలలకోసారి ప్రత్యేక విమానాల్లో ఆయన విదేశాల్లో విహరించి వస్తున్నాడు. యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఏ దేశ పర్యటనలో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయకులకే క్లారిటీ లేదు.దోచుకున్నది దాచుకోవడానికేకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రూ. 2.93 లక్షల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ సంపదను తన బినామీలకు అప్పనంగా దోచిపెడుతున్నాడు. ఆ డబ్బును విదేశాల్లో దాచుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఏపీ ప్రజల సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకోవడానికే తండ్రీకొడుకులు రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు.అరాచకాలకు కేరాఫ్గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేల బాగోతాలు చూస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి దారుణాలన్నీ కూటమి ఎమ్మెల్యేల కేంద్రంగానే జరుగుతున్నాయి. మహిళలను వేధిస్తూ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోల సాక్షిగా దొరికిపోయారు. మరికొందరి బాగోతాలు బాధితుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి.ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు పోలీసులు ఆయనతోపాటు అతడి అనుచరుడు సుజిత్ రెడ్డి, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన, టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో ఒక అమాయకుడు బలైపోయాడు. డ్రైవర్ రాయుడి హత్యలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పూనుకున్నాడని అభియోగాలున్నాయి. ఆ కుట్రలో పావుగా మారిన డ్రైవర్ రాయుడు హత్యకు గురైనట్టు తెలుస్తోందని వెంకటరెడ్డి తెలిపారు. రాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినా.. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో నేటి నుంచి పబ్లిష్ అయ్యే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా మీడియా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించారని.. తక్షణమే వాటిని తొలగించాలని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రూ.10 కోట్ల పరిహారానికి దావా వేశారు. ఈ పిటిషన్ను శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు. వాదనల విన్న తర్వాత ఇదివరకే ప్రచురించిన కథనాలపై నిర్ణయం తీసుకుంటామన్న కోర్టు.. కథనాలపై ఇంటెరిం ఇన్జంక్షన్ ఇవ్వాలన్న వినతిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా వేసింది. తిరుమల లడ్డూ ప్రసాద వివాదంలో ఓవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరోవైపు ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సహా పలు మీడియా సంస్థలు కల్పిత కథనాలు రాస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ‘‘తిరుమల లడ్డూ వ్యవహారం గురించి గానీ, వైవీ సుబ్బారెడ్డి గురించి గానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. ఇష్టారాజ్యంగా తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి’’ అంటూ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఏపీలో పదే పదే అదే తప్పు!
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కపటత్వంపై మాత్రమే ఆధారపడి పనిచేస్తోందని పదే పదే రుజువు అవుతోంది. స్వయానా మంత్రులే ఫేక్ వీడియోల ప్రదర్శనకు దిగడం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తుందని ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు సైతం చెబుతూండటం అత్యంత బాధాకరం. చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు ఇప్పటికీ రౌడీయిజం చేయాలని చూస్తున్నాయని, జగన్ పుట్టిన రోజున జంతుబలి చేస్తారా? పోస్టర్లపై రక్తం చల్లి సమాజాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తారా విమర్శించారు. ఇది కూడా పక్కదోవ వ్యూహంలో భాగమే.జగన్ జన్మదినోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అతడికి వచ్చిన మద్దతు, జరిగిన సంబరాలను కూటమి పెద్దలు జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. అంతే.. కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోయి బైకులు ర్యాలీలు తీసినా కేసులు పెట్టారు. కేక్ కట్ చేసినా అరెస్టు చేశారు. జాతరలో మాదిరి పొట్టేళ్లను నరికారంటూ పలువురు కార్యకర్తలపై కేసులు పెట్టడమే కాకుండా, వారిని అమానుషంగా రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. చివరకు పోలీసు శాఖ ఇవన్నీ ఏవో గొప్ప పనులైనట్లు ప్రచారం చేసుకునే దుస్థితికి చేరింది. దీనికి డిజిపి గుప్త సమర్థన మరీ ఘోరంగా ఉంది.తమ వద్ద వాహనాలులేవని, అందుకే నడిపించామని ఆయన చెప్పారు.నిజమే! ఎవరు చట్ట ఉల్లంఘన చేసినా తప్పే. కేసులు పెట్టవచ్చు. అలా కాకుండా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ వారిపైనే కేసులు పెడతామని, టీడీపీ, జనసేనలకు చెందిన వారు ఎలాంటి తప్పులు చేసినా, తీవ్ర వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమని పోలీసులు బాహాటంగా చెబుతున్నట్లుగా వ్యవహరిస్తే ఎలా? నీతులు చెప్పే చంద్రబాబు ఏమని ఆదేశాలు ఇవ్వాలి? ఎవరు బహిరంగంగా జంతు బలి చేసినా ఒప్పుకోరాదని, వివక్ష లేకుండా కేసులు పెట్టాలి అని. ఆ పని చేయలేదు. కొంతకాలం క్రితం టీడీపీ కార్యకర్తలు పలుచోట్ల పొటేళ్లలను రోడ్డుపైనే నరికారు.చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు.అంతకన్నా దారుణం ఏమిటంటే ఆయన బావమరిది, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కటౌట్ కు పోటేళ్ల తలల దండ వేశారు. ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్, కొందరు టీడీపీ నేతల సమక్షంలోనే పొటేళ్లను నరికి వేడుక చేస్తుంటే ఇదే పోలీసులు వారికి కాపలాగా ఉన్నారు.అంతే తప్ప వీరెవ్వరిపైన కేసులు పెట్టలేదు. చంద్రబాబు మాటలలోని డొల్లతనం ఈ ఘటనలు తెలియచేయడం లేదా?నిందితులను పెరేడ్ చేయించకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి డీజీపీకి తెలియదా? లేక నిందితులను శిక్షించే హక్కు నేరుగా ఏమైనా రాజ్యాంగం ఇచ్చిందా? డీజీపీ అలా మాట్లాడితే కింది స్థాయి పోలీసులకు ఏమి సంకేతం ఇస్తున్నట్లు? అన్ని రంగాలలో విఫలమైన నేపథ్యంలో పోలీసులే కూటమి పెద్దలకు దిక్కయ్యారు.అందులో వీర విధేయతతో, రాజును మించిన రాజభక్తితో వ్యవహరించే కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అరాచకంగా నడుపుతున్నారు. ఇంత అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ పరిస్థితి అవమానకరం అని వేరే చెప్పనవసరం లేదు.పోలీసు అధికారులు చంద్రబాబు మాటకన్నా ఆయన కుమారుడు ,మంత్రి లోకేశ్ ఆదేశాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది చంద్రబాబుకు ఏపాటి ప్రతిష్టో ఆయనే ఆలోచించుకోవాలి. మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎవరో ఒక వ్యక్తి రఫ్ఫా, రఫ్ఫా అంటే తప్పన్నారు.ఒకే! అలాగే అనుకుందాం? మరి లోకేశ్ రడ్బుక్ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్టా? దాని ప్రకారం పోలీసులను పని చేయించడం సరైనదేనా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాళ్లు విరగగొడతాం, కీళ్లు విరగగొడతాం, చేతులు అరగదీస్తాం అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేందుకు ఏ చట్టం అనుమతి ఇస్తోంది? కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి? వారు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదే.పైగా బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేస్తూ బెదిరిస్తున్నారే! వినుకొండలో రషీద్ అనే యువకుడిని టీడీపీ వారే నడిరోడ్డుపై నరికి చంపితే దానిని ఏమంటారు. కనీసం ప్రభుత్వం ఆ ఘటనను ఖండించిందా? అంతదాక ఎందుకు ! చంద్రబాబు ఇన్ని సుద్దులు చెబుతున్న సమయంలోనే నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు కత్తులు పట్టుకుని రోడ్డుపై ప్రదర్శన చేశారే. వారిపై కేసులు పెట్టారా? రోడ్డుపై నడిపించి అవమానించారా? ఈ రెడ్బుక్ అండ చూసుకుని పోలీసులు పలు చోట్ల సామాన్య ప్రజలపై కూడా రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పల్నాడులో సీఐ బెదిరింపులు భరించలేక ఓ ఆర్యవైశ్య మహిళ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య యత్నం చేసింది. ఇది మహిళలను కూటమి ప్రభుత్వం గౌరవిస్తున్న తీరా!పొదిలిలో ఒక వ్యాపారిపై పోలీసులు దాడి చేసి కొట్టడంపై ఆర్యవైశ్య సంఘం వారు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారే. సీపీఎం నాయకుడు అప్పలరాజు పై పిడి చట్టం పెట్టడంపై టీడీపీకి చెందిన కొందరు మేధావులు కూడా ఖండిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. గంజాయి వంటివి విచ్చలవిడిగా దొరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయే! అనంతపురంతో సహా పలు చోట్ల భూ కబ్జాలపై వస్తున్న ఆరోపణల మాటేమిటి? ఇవి కాకుండా అనంతలో గన్ కల్చర్ కూడా పెరుగుతోందని వార్తలు సూచిస్తున్నాయి.తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డి రాజ్యాంగం నడుస్తోందే! ఆయన పోలీసు అధికారులనే అవమానిస్తే నోరు విప్పలేకపోయిన వ్యవస్థ మనది. అమాయకులపై మాత్రం లాఠీ ఝళిపిస్తారా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? హోం మంత్రి అనిత వాటికి సమర్థన ఇవ్వడమా? నిందితులను నడిరోడ్డుపై నడిపించడం ఏదో గొప్ప విషయంగా ఆమె చెబుతారా? రేప్, హత్యల వంటి సీరియస్ నేరాలకు పాల్పడిన వారెవరికి ఇలా చేయలేదే? తెనాలిలో పోలీసుల ముగ్గురు దళితుల అరికాళ్లపై బహిరంగంగా కొట్టి అరాచకంగా ప్రవర్తించినా చర్య తీసుకోకపోగా, అది తప్పు కాదన్నట్లు మాట్లాడితే ఏపీ ప్రజలను కాపాడేదెవ్వరు? కదిరి వద్ద ఒక గర్భిణిపై వైసీపీ కార్యకర్త ఒకరు కాళ్లతో దాడి చేశారంటూ స్వయంగా హోం మంత్రే ఒక ఫేక్ వీడియోను ప్రదర్శించారట.ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దానిని ప్రభుత్వం ఖండించలేకపోయింది. తీరా చూస్తే అతను జనసేన కార్యకర్త అని ఆ పార్టీ నాయకుడు చెప్పినా, అతని సోదరి తెలిపినా హోం మంత్రి మాత్రం అదే అసత్యాన్ని వల్లెవేసే యత్నం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు హింసించి నడిరోడ్డుపై నడిపించారు. ఒక వైపు ఫేక్ వీడియోలు, మరో వైపు ఫేక్ ఆరోపణలు, ఇంకో వైపు కక్షపూరితంగా ఏకపక్షంగా వైసీపీ వారిపై కేసులు,అరెస్టులు..ఇవన్ని ఈ ప్రభుత్వం ఎంత నీచంగా పనిచేస్తుంది తెలియచేస్తుంది తప్పమరొకటి కాదు.ఇలాంటి దుష్టచర్యలను ఉన్మాదం అంటారన్న సంగతి ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.వైసిపివారిని ఎంత వేధిస్తే వారు అంతగా రాటు తేలుతున్నారన్న విషయం కూడా ప్రజలకు అర్ధం అవుతోంది.కేవలం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ అకృత్యాలకు ఎప్పుడో అప్పుడు చెక్ పడకుండా ఉంటుందా! -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
కూలీల కడుపుకొట్టిన బాబు సర్కారు!
సాక్షి, అమరావతి: కేంద్రం మంజూరు చేసిన సంఖ్య మేర ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించకుండా గత ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఉపాధి కూలీల పొట్టకొట్టింది. నోటిఫై చేసిన రోజువారీ కూలి కూడా ఇవ్వలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, నిర్మాణాత్మక బలహీనతలకు తోడు నిధుల దుర్వినియోగమేనని ఎస్బీఐ ఎకనమిక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.⇒ 2024–25లో ఉపాధి హామీ కింద రాష్ట్రంలో 64.2 లక్షల కుటుంబాల ఉపాధి కల్పనకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కానీ, చంద్రబాబు సర్కారు 46.9 లక్షల కుటుంబాలకు మాత్రమే ఉపాధి చూపింది. అంటే, 17.3 లక్షల కూలీల కుటుంబాలకు నష్టం వాటిల్లింది.⇒ దేశంలో చాలా రాష్ట్రాలు గత ఆర్థిక సంవత్సరం ఉపాధి కూలీల రోజువారీ వేతనం నోటిఫై (నిర్దేశిత) చేసిన మేరకు చెల్లించినా, ఏపీ దానిని పాటించలేదు. రోజువారీ కూలి రూ.300 నోటిఫై చేయగా రూ.256 చొప్పున మాత్రమే చెల్లించింది. ఒక్కో కూలీకి రూ.44 మేర చూస్తే 46.9 లక్షల కుటుంబాలకు తక్కువ చెల్లించింది.⇒ ఓపక్క కేంద్రం మంజూరు చేసిన మేర ఉపాధి కల్పించకుండా 17.3 లక్షల కుటుంబాలకు నష్టం చేకూర్చిన బాబు సర్కారు మరోపక్క నోటిఫై చేసిన రోజువారీ వేతనం ఇవ్వకుండా కష్టార్జితాన్ని దోపిడీ చేసిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.⇒ ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26) రోజువారీ ఉపాధి హామీ కూలిని రూ.307గా నోటిఫై చేశారు. డిసెంబర్ 29 వరకు డేటాను విశ్లేషిస్తే ఒక్కో కూలీకి రూ.268 మాత్రమే చెల్లించారు. నిర్దేశిత మొత్తానికి ఇది రూ.39 తక్కువ. దీనివల్ల 41 లక్షల కుటుంబాల శ్రమదోపిడీ చేసినట్లైంది. -
నాడు రూ.16.. నేడు రూ.20
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ వినియోగదారులను నిలువునా దోచుకుంటోంది. ఒకవైపు మార్కెట్లో నిత్యావసర సరకుల రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే చోద్యం చూస్తూ... మరోవైపు రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకుల రేట్లు మాత్రం అమాంతం పెంచేస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ పేద ప్రజలపై భారం మోపుతోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ గాడితప్పింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీని అటకెక్కించింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే బియ్యం నాణ్యతకు పాతరేసింది. ఇప్పుడు పండగల వేళ ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పంపిణీలనే కొత్తగా చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో తొలిసారిగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేయగా... అధికారంలోకి వచ్చాక దానిని చంద్రబాబు కక్షపూరితంగా నిలిపివేసి... ఏడాదిన్నర తర్వాత రేటు పెంచి మళ్లీ పంపిణీ ప్రారంభిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కిలోకి రూ.4 చొప్పున పెంచేసి... వైఎస్సార్సీపీ హయాంలో పేదలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో రాగులు, జొన్నల పంపిణీతోపాటు ఫోర్టీఫైడ్ గోధుమ పిండిని అందించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బియ్యానికి బదులుగా ఉచితంగా రాగులు, జొన్నలు ఇచ్చేలా ఒప్పించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎఫ్సీఐ నుంచి గోధుమలు సేకరించి వాటిని మరాడించి, ఫోర్టీఫైడ్ చేసి నాణ్యమైన ప్యాకింగ్లో కిలో రూ.16కే లబి్ధదారుల ఇంటి వద్దకే చేర్చారు. కానీ ఏడాదిన్నరగా ఆ గోధుమ పిండి పంపిణీని నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జనవరి నుంచి కిలో రూ.20కి ఇస్తున్నట్టు ప్రకటించి అభాసుపాలైంది. ఎందుకంటే అప్పట్లో భారత్ బ్రాండ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా కిలో ప్యాకెట్ను రూ.27.50కి వినియోగదారులకు ఇస్తే.. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రం కిలో రూ.16కే అందించి ప్రజల మన్ననలు పొందింది. ఇప్పుడు అదే గోధుమ పిండి ప్యాకెట్కు ఏకంగా రూ.4 అదనంగా చంద్రబాబు దండుకోవడం విస్తుగొలుపుతోంది. అరకొర పంపిణీకే హడావిడి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నెలకు 1,839 టన్నుల గోధుమలను అందిస్తోంది. వాటిని మరాడిస్తే 1,690 టన్నుల పిండి వస్తుంది. ఈ పిండినే కిలో ప్యాకెట్లలో నింపి ప్రజలకు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ఏపీలో 1.48 కోట్ల రైస్ కార్డులున్నాయి. వీళ్లందరికీ కిలో గోధుమ పిండి అందించాలంటే నెలకు 15 వేల టన్నులు అవసరం. అలాంటిది నెలకు కేవలం 1690 టన్నులు మాత్రమే సరఫరా చేస్తుండడం... అది కూడా జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఇస్తుండటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.బినామీల కోసమే రేటు పెంచేసి..చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి స్కీము సరికొత్త స్కామ్ను తలపిస్తోంది. ఇందుకు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా వదలట్లేదు. ప్రభుత్వం ఎఫ్సీఐ నుంచి కిలో గోధుమలు రూ.6.10కి కొనుగోలు చేస్తోంది. వాటిని మరాడించి... ఆ పిండిని కిలో చొప్పున ప్యాకింగ్ చేసి, ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చి రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు రూ.20కు ఇస్తోంది. వాస్తవానికి నవంబర్ 5న సాక్షాత్తూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కిలో గోధుమ పిండిని రూ.18కి ఇస్తున్నట్టు మీడియా సమక్షంలో ప్రకటించారు. అయితే, ప్రభుత్వం మాత్రం డిసెంబర్ 24 ఇచ్చిన జీవోలో కిలో గోధుమ పిండి రేటును రూ.20గా పేర్కొంది.ఇంతలోనే అంత వ్యత్యాసం రావడం వెనుక బినామీలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.16కు అందించిన గోధుమ పిండి ఇప్పుడు ఏకంగా రూ.20కి చేరుకుంది. అప్పుడు.. ఇప్పుడూ రేషన్ దుకాణ డీలర్ కమిషన్ రూపాయిగానే ఉంది. కానీ ప్రజలపై మాత్రం భారం మోపుతోంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీకి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు అప్పగించారు. ఆ ఏజెన్సీ తమ దగ్గర ఎంప్యానల్ అయిన కంపెనీలకు మాత్రమే మిల్లింగ్, ప్యాకింగ్ బాధ్యతలు ఇచ్చింది.ఇందులో విచిత్రం ఏమంటే.. చంద్రబాబు బినామీ, మంత్రి వియ్యంకుడికి చెందిన కాకినాడ జిల్లాలోని ఓ కంపెనీకి గోధుమ పిండి మిల్లింగ్, ప్యాకింగ్ కాంట్రాక్టు దక్కింది. సదరు కంపెనీ సరఫరా విధానంలో గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టిన సర్కార్ నోడల్ ఏజెన్సీ ద్వారా అనుకున్నది చేసింది. ఇక్కడ ఎంప్యానల్ చేసిన మిల్లుల కంటే బహిరంగంగా టెండర్ పిలిస్తే పోటీ పెరిగి మిల్లింగ్, ప్యాకింగ్ ధర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. -
కొండవీటి వాగు ఎత్తిపోతల్లో రూ.150 కోట్ల అవినీతి వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతికి కొండవీటి వాగు వరద ముప్పు తప్పించేందుకు, ఉండవల్లి వద్ద ఆ వాగు నుంచి 8,400 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేలా ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. ఈ ఎత్తిపోతల పనులకు రూ.423.64 కోట్ల విలువతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో కాంట్రాక్టు విలువ కంటే రూ.4.75 శాతం అధిక ధర... రూ.443.76 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు పనులను అప్పగించేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాయి.ఈ మేరకు పనులను మేఘాకు అప్పగిస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు పనుల కేటాయింపుతో ఖజానాపై రూ.20.12 కోట్ల భారం పడింది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.79.42 కోట్లను కాంట్రాక్టర్కు రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. అంటే, కాంట్రాక్టు విలువ రూ.523.18 కోట్లకు చేరుకుంది.5 వేల క్యూసెక్కుల ఎత్తిపోతకు రూ.222.44 కోట్లుకొండవీటి వాగు నుంచి రోజుకు 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి మళ్లించేందుకు ఉండవల్లి వద్ద 2017–18లో రూ.222.44 కోట్లతో ప్రభుత్వం ఎత్తిపోతలను పూర్తి చేసింది. వీటిని మేఘా సంస్థనే చేపట్టింది. నాటితో పోల్చితే ఎత్తిపోతల పనుల్లో వినియోగించే స్టీల్, సిమెంటు, పంప్లు, మోటార్లు, విద్యుత్ ఉపకరణాలు తదితరాల ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. కానీ, ప్రస్తుతం 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసే పనులను రూ.523.18 కోట్లకు మేఘా సంస్థకే ప్రభుత్వం కట్టబెట్టింది. కాగా, దీని వ్యయం రూ.360 కోట్ల నుంచి రూ.380 కోట్లకు మించే అవకాశం లేదని, అంచనాల దశలోనే రూ.100 కోట్ల నుంచి రూ.130 కోట్ల మేర భారీగా అక్రమాలు జరిగాయని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కట్టబెట్టడం వల్ల కాంట్రాక్టర్కు ప్రయోజనం చేకూర్చారని.. ఆ మేరకు ఖజానాకు నష్టం కలిగిందంటున్నారు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ ఉండి ఉంటే..!జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానంతో టెండర్ల వ్యవస్థకు 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవం పోసింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన వెంటనే వీటిని రద్దు చేసింది. 2014–19 తరహాలోనే టెండర్ల వ్యవస్థను నీరుగార్చింది. మొబిలైజేషన్ అడ్వాన్సు పద్ధతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు సర్కార్ పునరుద్ధరించింది. ఒకవేళ జ్యుడీషియల్ ప్రివ్యూ ఇప్పుడు అమల్లో ఉన్నట్లైతే... టెండర్ నోటిఫికేషన్కు ముందే ఆ ప్రతిపాదనలోని తప్పులను ఇంజినీరింగ్ నిపుణులు, మేధావులు నుంచి సాధారణ ప్రజల వరకు ఎత్తిచూపే అవకాశం ఉండేది. వాటిని పరిగణనలోకి తీసుకుని అంచనా వ్యయాన్ని సరి చేయాలని ఏడీసీఎల్ అధికారులను జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి ఆదేశించి ఉండేవారు అని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కాంట్రాక్టు విలువ కంటే 5 శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు కనీసం రూ.20 కోట్లు ఆదా అయ్యేదని నిపుణులు వివరిస్తున్నారు. వీటిని లెక్కలోకి తీసుకుంటే ఎత్తిపోతల పనుల్లో రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకుందని, దాన్ని కాంట్రాక్టర్తో కలిసి ముఖ్య నేత నీకింత, నాకింత అంటూ పంచుకు తినేందుకు సిద్ధమయ్యారని ఆరోపిస్తున్నారు. -
ఏపీలో అత్యంత దారుణంగా 108 సేవలు
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు చంద్రబాబు సర్కారు ఉరి వేస్తోంది! కుయ్ కుయ్ మూగబోతోంది..! నిమిషాల వ్యవధిలో చేరుకోవాల్సిన అంబులెన్సుల జాడ లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయ్! 108 సేవల నిర్వహణలో తీవ్ర అలక్ష్యం, ప్రభుత్వ అసమర్థతతో రోడ్డు ప్రమాదాల క్షతగాత్రుల నుంచి అనారోగ్య బాధితులు, నిండు గర్భిణులు దాకా బలైపోతున్నారు! 108 రాకపోవడంతో గర్భిణులు ఆటోలను ఆశ్రయిస్తుండటం.. సకాలంలో వైద్యం అందక ఆటోలోనే పసిగుడ్డు ప్రాణాలు విడవడం.. రోడ్డుపై రయ్ రయ్మంటూ పరుగులు తీయాల్సిన ఆపద్బాంధవి నిస్సహాయంగా షెడ్లకే పరిమితం కావడం.. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సర్వత్రా అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలో 108 సేవల తీరును ‘సాక్షి’ బృందం రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా మారిన 108వాహనాలు శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ ద్విచక్రవాహనదారుడి ప్రాణాలను కాపాడేందుకు 108 కోసం కాల్ చేస్తే ఎంతసేపైనా రాలేదు. చివరకు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ.. విలవిల్లాడుతూ క్షతగాత్రుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు విడిచాడు. రణస్థలం జాతీయ రహదారి–16పై బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో 108 సేవల నెట్వర్క్ నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో చెప్పేందుకు నిదర్శనం.‘ఊపిరి’ ఆగుతోంది..! పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన అబ్బూరి శ్రీనివాసరావు ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా త్రిపురాపురం వద్ద ట్రిప్పర్ ఢీకొని గాయాలపాలయ్యాడు. 108 కోసం ఫోన్ చేయగా 20 నిమిషాలు గడిచినా రాకపోవడంతో ప్రైవేట్ వాహనంలో వైద్యశాలకు తరలించారు. ఇక్కడ రెండు మండలాలకు ఒకే వాహనం ఉంది. పల్నాడు జిల్లాలోనే జలాల్పురంలో ఇటీవల మరియమ్మ అనే మహిళకు ఊపిరి అందకపోవటంతో మెరుగైన వైద్యం కోసం సీహెచ్సీ నుంచి 108లో గుంటూరు తరలించారు. తిరుగు ప్రయాణంలో బ్యాటరీ చార్జింగ్ లేక వాహనం మొరాయించడంతో రోగి కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులు తోయాల్సి వచ్చింది. ఏలూరు జిల్లాలో పాత అంబులెన్స్లకు రంగులేసి నడిపిస్తున్నారు. అవి ఎప్పుడు మొరాయిస్తాయో చెప్పలేని దుస్థితి.ఏలూరు జీజీహెచ్లో మూలపడి ఉన్న 108 వాహనాలు పయ్యావుల ఇలాకాలో ‘హ్యాండ్సప్’.. అనంతపురం జిల్లాలో 108 సేవలు అస్తవ్యస్థంగా మారాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండలో ఇతర ప్రాంతాలకు చెందిన వాటిని బ్యాకప్గా వినియోగిస్తున్నారు. ఉరవకొండ వాహనం పాడవడంతో గుంటూరులో షెడ్డుకు పరిమితమైంది. రాయదుర్గం, డి.హీరేహాళ్, కణేకల్లు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్న అనంతపురం జిల్లాలో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వాహనాలు అత్యంత కీలకం. కానీ ఇవి మరమ్మతులకు గురవుతున్నాయి. బెడ్డు వద్దకు కాదు.. షెడ్డుకే! వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలంలో ఇటీవల స్పృహ కోల్పోయిన ఓ వ్యక్తిని కాపాడాలని కాల్ సెంటర్కు సమాచారం ఇవ్వగా ‘108 వాహనం మరో చోటకు వెళ్లింది. కడపలో వాహనాలు అందుబాటులో లేవు. మరమ్మతులకు గురైన వాహనాలను పాత రిమ్స్లో షెడ్డుకు తరలించారు. చెన్నూరు మండలం నుంచి 108 రావడానికి దాదాపు గంట పడుతోంది. వచ్చే వరకు వేచి చూడాలి. లేదంటే ఆటో తీసుకొని కడపలో ఆస్పత్రికి వెళ్లాలి’ అని సిబ్బంది సలహా ఇచ్చారు. రోగిని తరలిస్తుండగా పేలిన టైరు.. నంద్యాల జిల్లాలో కొద్ది రోజుల క్రితం బిల్లా బక్కన్న అనే వృద్ధుడిని 108లో తరలిస్తుండగా బండి ఆత్మకూరు వద్దకు చేరుకోగానే వాహనం టైర్ పేలి రోడ్డు మీద ఆగిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టైర్లు, బ్యాటరీల సమస్యలతో పలు వాహనాలు షెడ్డుకు పరిమితమయ్యాయి. దయచేసి వేచి ఉండండి...! విజయవాడ సిటీ పరిధిలో కాల్ చేసిన 18 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం దాదాపు అరగంటకుగానీ చేరుకోవడం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు లాంటి దూర ప్రాంతాల నుంచి రిఫర్ కేసులను విజయవాడకు తీసుకొస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్ చేస్తే రావడానికి మరో వాహనం అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో పూర్తిగా పనికిరాని (కండెమ్) 108 వాహనాన్ని జీజీహెచ్ ఆవరణలో ఉంచారు. ప్రైవేట్ సేవలకు వేలకు వేలు.. చిత్తూరు జిల్లాలో 108 వాహనాలు మొరాయిస్తున్నాయి. అరిగిన టైర్లతో దర్శనమిస్తున్నాయి. కొన్నింటి సైరన్ కూడా పని చేయడంలేదు. ఆపదలో పది మందికి సాయపడాల్సిన 108.. నలుగురు తోస్తేగానీ కదలని దుస్థితి. పల్లెల్లో 108 సేవలు అరుదుగా మారాయి. ప్రసవం కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరుకు (30 కి.మీ) ప్రైవేటు అంబులెన్స్లో వెళ్లాలంటే కనీసం రూ.5 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతి జిల్లాలో తరచూ 18 వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. రోజూ 8 నుంచి 10 వాహనాలు షెడ్లకే చేరుతున్నాయి.అనుభవం లేని అస్మదీయ సంస్థ వల్లే ఈ దుస్థితి అంతర్జాతీయంగా పేరుగాంచిన, వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ సంస్థలను కాదని అస్మదీయ సంస్థకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా 108, 104 నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టడమే ఈ దుస్థితికి కారణమని స్పష్టమవుతోంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాభాపేక్ష లేకుండా సేవా దృక్ఫథంతో ముందుకొస్తున్న, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన సంస్థలను పక్కనపెట్టి.. టీడీపీ డాక్టర్స్ విభాగంలోని పవన్కు చెందిన ‘భవ్య’ అనే ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఈ కాంట్రాక్టును అప్పగించింది. ప్రజల ప్రాణ, ఆరోగ్య రక్షణ కోసం తీసుకొచ్చిన వీటి నిర్వహణపై ఇంత నిర్లక్ష్యం క్షమార్హం కాదని ప్రజలు మండిపడుతున్నారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం రాగానే అప్పటి వరకు బాగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు పొగపెట్టారు. గడువు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లే పనులు వదులుకుని వెళ్లిపోయేలా వేధింపులకు దిగారు. దీంతో 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 నిర్వహణ కాలపరిమితి 2027 వరకూ ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ ఎంవోయూను రద్దు చేసుకున్నారు. అనంతరం భవ్య హెల్త్ సర్వీసెస్కు ఈ కాంట్రాక్ట్ను కట్టబెట్టడం కోసం పక్కా ప్రణాళికతో నిబంధనలు రూపొందించి టెండర్ పిలిచారు. ఈ సంస్థకు అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అనుభవం లేకపోవడంతో ఏకంగా నిబంధనలే మార్చేయడం గమనార్హం. – సాక్షి నెట్వర్క్ -
దోపిడీ ‘అంచనా’!
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి సమీకరణ (పూలింగ్) కింద భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస (రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇచ్చే మాటేమో గానీ... లే అవుట్ పనుల టెండర్లలో కాంట్రాక్టర్లతో కలిసి ముఖ్య నేత భారీఎత్తున దోచుకుంటున్నారని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. జోన్–8 (కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి) లేఅవుట్ అభివృద్ధి పనుల అంచనాలను ప్రతిపాదన దశలోనే భారీగా పెంచేయడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ లేఅవుట్ అభివృద్ధికి ఎకరానికి సగటున రూ.2 కోట్ల మేర వ్యయం చేస్తున్నారని... దేశ చరిత్రలో ఇది ఎక్కడా లేదని ఎత్తిచూపుతున్నారు. ⇒ రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్ కేబుల్ వంటి వాటికి యుటిలిటీ డక్ట్లు, మురుగు శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్ వినియోగించేందుకు పైప్లైన్, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులకు రూ.1305.39 కోట్ల వ్యయంతో నవంబర్ 14న అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీఎసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.వీటిని 4.03 శాతం అధిక ధర... రూ.1,358 కోట్లకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించడానికి సీఆర్డీఏ, కేబినెట్ ఆమోదం తెలిపాయి. ఆ మేరకు ఏడీసీఎల్కు అనుమతి ఇస్తూ గురువారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ఖజానాపై రూ.52.61 కోట్ల భారం పడనుండగా ఆ మేరకు కాంట్రాక్టర్కు లబ్ధి చేకూరనుంది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.277.85 కోట్లను రీయింబర్స్ చేస్తామని ఏడీసీఎల్ పేర్కొంది. తద్వారా కాంట్రాక్టు విలువ రూ.1,635.85 కోట్లకు చేరనుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే...రాజధాని జోన్–8 లేఅవుట్ అభివృద్ధి పనులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఉంటే కనీసం 5 శాతం తక్కువ ధరకు పనులు చేయడానికి కాంట్రాక్టర్ ముందుకొచ్చేవారని, ఖజానాకు రూ.వంద కోట్లు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక జ్యుడీషియల్ ప్రివ్యూ విధానం అమల్లో ఉండి ఉంటే... టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అక్రమాలు వెలుగులోకి వచ్చేవని, తద్వారా అంచనా వ్యయం తగ్గేదని చెబుతున్నారు. ప్రజాధనం భారీగా ఆదా అయ్యేదని స్పష్టం చేస్తున్నారు.మొబిలైజేషన్ అడ్వాన్సులో నీకింత నాకింతకాంట్రాక్టర్కు రూ.1,358 కోట్లకు పనులను అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఆ మేరకు ఏడీసీఎల్ ఒప్పందం చేసుకోనుంది. ఆ వెంటనే కాంట్రాక్టు విలువలో పదిశాతం రూ.135.80 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద ముట్టజెప్పనుంది. ఇందులో 8 శాతం ముఖ్య నేత తొలి విడత కమీషన్ల రూపంలో వసూలు చేసుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులను కాంట్రాక్టర్కు దోచిపెట్టి నీకింత నాకింత అంటూ పంచుకుతినడాన్ని ముఖ్య నేత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. -
సంపద సృష్టి లేదాయే .. ఉన్నదీ ఆవిరాయే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి.. రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు.. కొత్తగా సంపద సృష్టించగా పోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.1,785 కోట్లు పడిపోయింది.2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రూ.33,371 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం ఈ ఏడాది 5.34 శాతం తగ్గి రూ.31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ ఆదాయం 6.8 శాతం పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1 శాతం, తమిళనాడు 8.1 శాతం, కేరళ 8.4 శాతం, తెలంగాణ 5.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.నెలనెలా తగ్గుతున్న ఆదాయంరాష్ట్ర జీఎస్టీ ఆదాయం ప్రతినెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రూ.4,686 కోట్లుగా ఉన్న జీఎస్టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ నెలలో జీఎస్టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6 శాతం వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు.చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. రెడ్బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలోనే డెంగీ మరణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో అమాయకులు డెంగీకి బలయ్యారని వైద్య, ఆరోగ్యశాఖ అంగీకరించింది. గత ప్రభుత్వంలో 2021 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్క డెంగీ మరణం కూడా లేదని గురువారం అధికారికంగా ప్రకటించింది. 2024లో ఇద్దరు, 2025లో ఐదుగురు చొప్పున రెండేళ్లలో ఏడుగురు డెంగీతో మరణించారని తెలిపింది. ‘డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం’ శీర్షికతో సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. 2024, 2025ల్లో దేశంలో డెంగీ వ్యాప్తి, నమోదైన మరణాలపై ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకే రాష్ట్రం నాలుగోస్థానంలో ఉందని సాక్షి పేర్కొంది.దీనికి గురువారం రాష్ట్ర వైద్యశాఖ ఇచ్చిన వివరణలో 2021 నుంచి దేశంలో డెంగీ వ్యాప్తి, మరణాల నివేదికను వెల్లడించింది. దీనిని గమనిస్తే 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఒక్క డెంగీ మరణం కూడా నమోదు కాలేదు. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా 2021లో 346 మంది, 2022లో 303 మంది, 2023లో 485 మంది డెంగీతో మరణించారు.రాష్ట్రంలో డెంగీ బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించడం ద్వారా ప్రజల ప్రాణాలు పోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలో 2024లో 297, గతేడాది 95 మరణాలు నమోదయ్యాయి. కాగా.. 2025లో దేశం మొత్తం మరణాలు భారీగా తగ్గాయి. కానీ దేశంలో నమోదైన మరణాల్లో 5 శాతానికి పైగా మన రాష్ట్రంలోనే ఉన్నాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్రజారోగ్య పరిరక్షణలో బాబు ప్రభుత్వం ఏ మేరకు విఫలమైందో తెలుస్తోంది. -
పిల్లలకు తాగునీరు ఎప్పుడిస్తారు?
సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు ఎప్పటిలోగా తాగు నీరు అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? దానికి సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదు. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా చాలా సాధారణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు తాగునీరు ఎప్పటిలోగా అందిస్తారో కూడా స్పష్టంగా చెప్పలేరా? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 453 హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు లేవన్న విషయాన్ని ప్రభుత్వం ఖండించడం లేదని ప్రస్తావించింది. హాస్టళ్లకు ఎన్ని ఆర్వో ప్లాంట్లు అవసరం? అందుకు సంబంధించిన లోపాలను ఎలా అధిగమిస్తారు? అనే వివరాలను ప్రభుత్వం సమర్పించడం లేదని ఆక్షేపించింది. హాస్టళ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన చాలా సాధారణంగా ఉందని ధర్మాసనం తప్పుబట్టింది.రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా హాస్టళ్లు ఉన్నందున ప్రతి చోటా తాము స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని, అందువల్ల, తాలూకా/ జిల్లా/ రాష్ట్ర స్థాయిల్లో మౌలిక సదుపాయాలను క్రమం తప్పకుండా పరిశీలించే వ్యవస్థను ఏర్పాటు చేయడం అవసరమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కాల పరిమితితో సమగ్ర ప్రణాళికను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. స్నానపు గదులు, మరుగుదొడ్లకు తలుపులే లేవు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం హాస్టల్లో 86 మంది విద్యార్థులు కామెర్లకు గురికావడం, విద్యార్థి మరణించడం, 150 మంది విద్యార్థులు ఇతర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనపై సీజే ధర్మాసనం విజయనగరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిని విచారణకు ఆదేశించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఆ హాస్టల్ను తనిఖీ చేసి నివేదికను హైకోర్టుకు సమరి్పంచారు. బావి నుంచి నేరుగా ట్యాంక్లోకి పంపిన నీటినే విద్యార్థులు తాగుతున్నారని తన నివేదికలో పేర్కొన్నారు.611 మంది విద్యార్థులు ఉంటే కేవలం 58 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయని, ఇందులో 40 దొడ్లను వ్యాధి ప్రబలిన తరువాతే నిరి్మంచారని కార్యదర్శి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 11 మరుగుదొడ్లకు, 2 సాన్నపు గదులకు అసలు తలుపులే లేవని నివేదించారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ ఆ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తున్నామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు. ప్రణతి నివేదించిన వివరాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు ఎక్కడ? రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం కేవలం మాటలకు, కాగితాలకే పరిమితం చేయడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి సంక్షేమ హాస్టళ్లను సందర్శించి రాత్రి అక్కడ బస చేయాలంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 46 అమలు కాకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఉత్తర్వులు హాస్టళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు, విద్య నాణ్యతను పెంపొందించటానికి ఉద్దేశించినవని గుర్తు చేసింది.హాస్టళ్లలో పిల్లలకు శుభ్రమైన తాగునీరు ఎప్పటిలోపు అందిస్తారో కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని ఆక్షేపించింది. 320 కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్లు మంజూరయ్యాయని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవానికి అవి ప్రస్తుతం ఉన్న హాస్టళ్ల సంఖ్యకు ఏమాత్రం సరిపోవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం ప్రతి 15 రోజులకొకసారి పరిస్థితిని పర్యవేక్షించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.కమిటీ పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత మొత్తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని తేల్చి చెప్పింది. సంక్షేమ శాఖల అధికారులకు ఈ కమిటీలో స్థానం కల్పించాలని సూచించింది. నెలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనను పర్యవేక్షించాలని పేర్కొంది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హాస్టళ్లలో ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. మౌలిక సదుపాయాల కల్పనకు పిల్ సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ జరిపింది.2025లో హైకోర్టు అడిగినా సీఎస్ ఇంతవరకూ నివేదిక ఇవ్వలేదు హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఆహారం, వ్రస్తాలు, ఆశ్రయం ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను అధిగమించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని 2025 జూలైలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినా ఇంతవరకు తమకు సమరి్పంచలేదని ధర్మాసనం తెలిపింది. హాస్టళ్ల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు్ల క్షేత్రస్థాయి సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించకపోవడం, ఆ సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం జరుగుతోందని ధర్మాసనం పేర్కొంది. నెలకొకసారి తనిఖీలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సమస్యను అధిగమించేందుకు పరిష్కార చర్యలు చేపట్టకుంటే ఎన్ని తనిఖీలు చేసినా ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. -
‘పోలవరం–నల్లమలసాగర్’ డీపీఆర్ టెండర్కు ఆమోదం
సాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధానం (లింక్) ప్రాజెక్టును చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. రూ.7.67 కోట్లకు ఐఐసీ టెక్నాలజీస్కు అప్పగించింది. పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును నల్లమలసాగర్ వరకే పరిమితం చేస్తూ.. ఆ లింక్ ప్రాజెక్టు చేపట్టడానికి డీపీఆర్ తయారీతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు నవంబరు 27న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్లో రూ.7,67,56,539లకు కోట్చేసి ఐఐసీ టెక్నాలజీస్ ఎల్–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని గుంటూరు జిల్లా ఎస్ఈ పంపిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. డీపీఆర్ తయారీలో భాగంగా లైడార్ సర్వే చేయాలని నిర్దేశించింది. ఈ లింక్ ప్రాజెక్టును మూడు భాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.పోలవరం నుంచి కృష్ణా నదిలోకి గోదావరి జలాల మళ్లింపు.. రెండో దశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు మళ్లింపు.. మూడో దశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్కు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్మెంట్ను ఖరారు చేసి.. గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది. అక్టోబరు 7న పిలిచిన టెండర్లు రద్దు..ఇక సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు జలవనరుల శాఖ అక్టోబరు 7న టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులకు కాంట్రాక్టు విలువను రూ.9.20 కోట్లుగా నిర్ణయించింది. టెండర్లో బిడ్ల దాఖలు గడువు గత అక్టోబరు 22తో ముగిసింది. కానీ, ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్ను రద్దుచేసింది.ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్కే పరిమితం చేసి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత ఏడాది మే 22న పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీఓఆర్–టెరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) జూన్ 30న తోసిపుచ్చింది.గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీఓఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇదిలా ఉంటే.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్లైఫ్ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను గతేడాది జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. -
అదుపు తప్పి నోళ్లకు క్యాన్సర్ !
సాక్షి, అమరావతి: క్యాన్సర్ మహమ్మారి ఏటా దేశంలో లక్షలాది మందిని కబళిస్తోంది. రోజురోజుకూ జబ్బు విజృంభణ పెరుగుతూనే ఉంది. పలు క్యాన్సర్ల వ్యాప్తికి ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధుల్లో నోటి క్యాన్సర్ ఒకటి. దేశంలో 62 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగమే అని తెలుస్తోంది. ఈ అంశాన్ని ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) క్యాన్సర్ ఎపిడమాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవల ఈ విషయం వెల్లడించారు. 2010–2021 మధ్య 1,803 మంది నోటి క్యాన్సర్ బాధితులు, 1,903 మంది ఆరోగ్యవంతులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అధ్యయనంలోని అంశాలు ఇటీవల బీఎంజీ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ఆ కాంబినేషన్ యమా డేంజర్ మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రతి 10 మంది భారతీయుల్లో ఆరుగురు నోటి క్యాన్సర్తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. మితమైన చెడు అలవాట్లు ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపవనే భావనను ఈ అధ్యయనం పూర్తిగా కొట్టిపడేసింది. ఆరోగ్యకరమైన స్థాయిలో మద్యపానం అపోహేనని తోసిపుచ్చారు. వ్యసనాలు అత్యంత మితంగా ఉన్నా.. క్యాన్సర్ ముప్పు మాత్రం అధికంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రోజుకు 11.4 ఎంఎల్ మద్యం సేవించినా నోటి క్యాన్సర్ బారినపడే అవకాశం 50 శాతం పెరుగుతుందని స్పష్టం చేశారు.రోజూ బీర్ తాగేవారికి నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. మద్యం సేవించని వారితో పోలిస్తే, సేవించే వారిలో జబ్బు బారిన పడే ముప్పు 68 శాతం ఎక్కువేనని గుర్తించారు. మద్యపానంతోపాటు, పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారిలో మహమ్మారి ముప్పు అత్యధికంగా ఉంటుందని తేల్చారు. ఆల్కహాల్లోని ఇథనాల్ నోటి లోపలి పొరను పల్చబరుస్తుందని, పొగాకు వినియోగించే వారిలో క్యాన్సర్ కారకాలు సులభంగా కణాల్లోకి చొచ్చుకుని పోతాయని వివరించారు. మద్యం, పొగాకు కాంబినేషన్ ఆరోగ్యాన్ని త్వరగా క్షీణింపజేయడంతోపాటు, క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. దేశంలో సుమారు 11.3 శాతం నోటి క్యాన్సర్ కేసులకు ఆల్కహాల్ ప్రధాన కారణమని అధ్యయనం తేలి్చంది.కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం దేశంలో ఏటా నమోదవుతున్న క్యాన్సర్ కేసులు (అంచనా) సంవత్సరం కేసులు 2022 14.61 లక్షలు 2023 14.96 లక్షలు 2024 15.33 లక్షలు 2025 15.62 లక్షలు -
జేఈఈ మెయిన్స్కు భారీగా దరఖాస్తులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా జాతీయ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్–2026 జనవరి ఒక్క సెషన్కు మాత్రమే 14.50 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది గత ఏడాది జనవరి సెషన్ కంటే లక్షకుపైగా ఎక్కువ. ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి రెండు సెషన్లు కలిపి 17లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇది జాతీయ సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తోందని చెబుతున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తులు భారీగా పెరిగాయి. 2025 తొలి సెషన్కు 13.80 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. ఇది 2024 కంటే అధికం. అదేవిధంగా 95 నుంచి 96 శాతం మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అంటే, ఈసారి రెండు సెషన్లలోనూ భారీగా పోటీ ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. జనవరిలో 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. ఈ వారంలో విద్యార్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేయనుంది. మూడో వారంలో అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. -
‘కిక్కు’రేగ్గొట్టింది
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మందుబాబుల తుక్కురేగ్గొట్టింది. జేబులకు భారీగా చిల్లుపెట్టింది. ‘ఫుల్లుగా తాగండి...తాగి ఊగండి..’ అన్నదే తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది. ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేట్ ఖజానా అంతగా కాసులతో గలగల లాడుతుంది. అందుకే కొత్త సంవత్సరం వేడుకలను అవకాశంగా మలుచుకుని మద్యం ఏరులై పారించింది. అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులిచ్చి మరీ మందుబాబుల జేబులు గుల్ల చేసింది. చివరి నాలుగు రోజుల్లోనే భారీగా రూ.585.70 కోట్ల విలువైన మద్యాన్ని తాగించేసింది. 2024లో చివరి నాలుగు రోజులతోపోలిస్తే 2025లో చివరి నాలుగు రోజుల్లోనే ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు ఏకంగా 11 శాతం, బీరు అమ్మకాలు 34.4 శాతం పెరగడం విభ్రాంతి కలిగిస్తోంది. సిండికేట్కు ఫుల్ జోష్.. కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాల్లో పాత రికార్డులను తిరగరాయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు తేల్చి చెప్పింది. అందుకే మద్యం విక్రయ వేళలను ఉదయం 6గంటల నుంచి అర్దరాత్రి 1గంట వరకు అధికారికంగా పొడిగించింది. తెల్లవారే వరకు మద్యం విక్రయించినా పట్టించుకోవద్దని ఎక్సైజ్, పోలీసు అధికారులను అనధికారికంగా ఆదేశించింది. ఫలితంగా 2024తో పోలిస్తే 2025 చివరి నాలుగు రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇవిగో గణాంకాలు.. ⇒ 2024 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 5,18,844 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 2,42, 351 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.445.22 కోట్లు. ⇒ 2025 డిసెంబర్ 28 నుంచి 31 వరకు 7,32,658 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 3,91,082 బీరు కేసులను విక్రయించారు. వాటి విలువ రూ.585.70 కోట్లు. ⇒ అంటే 2024లో చివరి నాలుగు రోజుల కంటే 2025లో చివరి నాలుగు రోజుల్లో ఐఎంఎల్ లిక్కర్ అమ్మకాలు 11.5శాతం, బీరు విక్రయాలు 34.4 శాతం పెరిగాయి. తద్వారా రూ.140.48 కోట్ల అధిక రాబడి వచి్చంది. ⇒ ఇక 2024 డిసెంబర్తో పోలిస్తే 2025 డిసెంబర్లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. 2024 డిసెంబర్లో మొత్తం 33,88,275 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 11,25,050 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,568.18 కోట్లు. ⇒ కాగా 2025 డిసెంబర్లో మొత్తం 37,79,446 ఐఎంఎల్ లిక్కర్ కేసులు, 15,11,633 బీరు కేసులు విక్రయించారు. వాటి విలువ రూ.2,767.08కోట్లు. ఈ గణాంకాలన్నీ ఎక్సైజ్శాఖ అధికారికంగా వెల్లడించినవి. ఎమ్మార్పీ కంటే అధిక బాదుడు అదనం కాగా టీడీపీ మద్యం సిండికేట్ ఎమ్మార్పీ కంటే అదనంగా మందుబాబుల నుంచి దండుకుంది ప్రతి క్వార్టర్ మద్యం సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.50, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.30 అదనంగా వసూలు చేసింది. తద్వారా అనధికారికంగా మరో రూ.100 కోట్లకుపైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. టాప్లో విశాఖ డిసెంబర్లో మొత్తం 178.6 కోట్ల మద్యం అమ్మకాల్లో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. రూ.169.4కోట్ల మద్యం అమ్మకాలతో తిరుపతి జిల్లా రెండోస్థానంలో, రూ.155.4కోట్ల మద్యం అమ్మకాలతో ఎనీ్టఆర్ జిల్లా మూడో స్థానంలో ఉన్నాయి. రూ.30.7 కోట్ల మద్యం అమ్మకాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది. ⇒ 34.4 శాతం నాలుగురోజుల్లోనే పెరిగిన బీర్ల అమ్మకాలు⇒ 11 శాతంనాలుగు రోజుల్లోనే పెరిగిన లిక్కర్ విక్రయాలు⇒ రూ.178.6 కోట్లు డిసెంబర్లో ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం మద్యం అమ్మకాల విలువ⇒ రూ. 169.4 కోట్లు డిసెంబర్లో మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన తిరుపతి జిల్లా -
ఏపీలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి,విజయవాడ: ఏపీలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పెంచిన నేపథ్యంలో.. నెలాఖరులో మూడు రోజుల్లోనే (డిసెంబర్ 29, 30, 31) రూ.543 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 8 శాతం పెరిగాయి. మొత్తం డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాల విలువ రూ.2,767 కోట్లుగా నమోదైంది. ఈ పెరుగుదలతో రాష్ట్రంలో మద్యం వినియోగం మరింతగా పెరుగుతోందని స్పష్టమవుతోంది.అధికారికంగా అనుమతించిన దుకాణాలతో పాటు, బెల్టు షాపులు కూడా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల వినియోగం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి మద్యం నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. అయితే, ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల ఆర్థిక స్థితి దెబ్బతింటుందని, సామాజిక సమస్యలు మరింతగా ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కలుషిత ఆహారంతో 34 మంది విద్యార్థులకు అస్వస్థత
సుండుపల్లె: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లె మండలం రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం కలుషితమై 34 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం వీరంతా కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులుపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు వారిని రాయవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి.. రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్వో, స్థానిక వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శేఖర్రెడ్డి తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ భావన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పీహెచ్సీ వైద్యులతో మాట్లాడి విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలు, వారి పరిస్థితి తెలుసుకున్నారు. ఆహార తనిఖీ అధికారి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన ఆహారాన్ని పరీక్షించారు. -
ఏయూ దూర విద్యలో బీఈడీ కోర్సుకు మంగళం?
సాక్షి, అమరావతి: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) అసమర్థ పాలనలో కునారిల్లుతోంది. చంద్రబాబు ప్రభుత్వ స్వార్థ, కుటుంబ రాజకీయ ప్రయోజనాల కోసం ఉనికి, ప్రగతిని కోల్పోతోంది. దూరవిద్య బీఈడీ కోర్సులకు శాశ్వతంగా స్వస్తి పలికేందుకు సర్కారు పథక రచన చేస్తోంది. ఉపాధ్యాయులకు తీరని అన్యాయం కరోనా సమయంలో బీఈడీ స్టడీ మెటీరియల్కు యూజీసీ–డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో (డెబ్) అనుమతి, ఇతర పరిశీలన కోసం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఏయూలో దూరవిద్య బీఈడీ అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ అధికారులు డెబ్కు లేఖరాశారు. అటువంటి సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్కు తన అనుమతి అవసరం లేదని డెబ్ తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని అప్పటి అధికారులు ఎన్సీటీఈ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో 2023 డిసెంబర్లో వర్సిటీ అధికారులు సమర్పించిన వివరాలతో ఎన్సీటీఈ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పునఃగుర్తింపు కోసం వర్సిటీ అధికారులు ఎన్సీటీఈకి దరఖాస్తు పెట్టారు. ఇంతలో ఎన్నికల కోడ్, ఆ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను గాలికొదిలేసింది. ‘థర్డ్ మెథడాలజీ’పై అనిశ్చితి ఉపాధ్యాయులు తమ రంగంలో సబ్జెక్టు పెంచుకునేందుకు, ప్రమోషన్ల కోసం థర్డ్ మెథడాలజీని అభ్యసిస్తున్నారు. దీనిని దూరవిద్యలోనే పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. అలాంటిది కొన్నేళ్లుగా ఏయూలో థర్డ్ మెథడాలజీకి సంబంధించి నోటిఫికేషన్ వెలువడలేదు. బీఈడీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ మెథడాలజీకి నోటిఫికేషన్ ఇవ్వొచ్చనే ఆలోచనతో నిలిపివేశారు. తీరా బీఈడీ కోర్సు పరిస్థితి అగమ్యగోచరం కావడంతో.. థర్డ్ మెథడాలజీ విషయంలోనూ అనిశ్చితి ఏర్పడింది. వాళ్లకు ఇచ్చిన అనుమతి.. ఇక్కడెందుకు రావట్లేదు? ⇒ తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఈ ఏడాది సెపె్టంబర్లో ఎన్సీటీఈ నుంచి 500 బీఈడీ సీట్లతో కోర్సుకు అనుమతి తెచ్చుకుంది. ⇒ మైసూర్లోని కర్ణాటక స్టేట్ ఓపెన్ వర్సిటీ సైతం ఎన్సీటీఈ నుంచి బీఈడీ కోర్సుల నిర్వహణకు అనుమతి పొందింది. ⇒ ఇక వైస్ చాన్సలర్ సహా ఇప్పటివరకు ఏయూ నుంచి ఒక్క అధికారి కూడా ఎన్సీటీఈని సంప్రదించి బీఈడీ కోర్సు పునః గుర్తింపు కోసం అడిగిన పాపాన పోలేదు. ⇒ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. రెండేళ్లలో రూ.3.50 కోట్లు నష్టం ఏయూలో 500 బీఈడీ సీట్ల భర్తీకి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో దాదాపు 5–6వేల మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు పోటీపడతారు. రెండేళ్ల కోర్సుకు రూ.35 వేల చొప్పున ఫీజు నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.1.75 కోట్లు ఆదాయం దూరవిద్య సంస్థ ద్వారా ఏయూకు వచ్చేది. రెండేళ్లలో వర్సిటీకి రూ.3.50కోట్లకుపైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. బాబు బంధుప్రీతే కారణం చంద్రబాబు బంధుప్రీతి ఏయూను నిర్వీర్యం చేస్తోంది. విశాఖలోని తమ కుటుంబానికి చెందిన వ్యక్తుల కార్పొరేట్ విద్యా సంస్థకు మేలు చేసేందుకు ఏకంగా శతాబ్దాలు చరిత్ర కలిగిన ఏయూను దెబ్బతీసేందుకు వెనుకాడట్లేదు. ముందుగా దూరవిద్య నుంచి డ్యామేజ్ మొదలెట్టారు. అందులో భాగంగానే బీఈడీ కోర్సుల అనుమతి పునరుద్ధరణను కావాలనే పట్టించుకోవట్లేదని వర్సిటీ వర్గాలే విమర్శిస్తున్నాయి. త్వరలో అస్మదీయ కార్పొరేట్ విద్యా సంస్థ దూరవిద్యలోకి బీఈడీ కోర్సు వచ్చి చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. -
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. -
వచ్చే ఏడాదికి ‘వెలిగొండ’ పూర్తి
సాక్షి, అమరావతి : వెలిగొండ ప్రాజెక్టును 2026 సీజన్ మొదలయ్యే నాటికి పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తిలతో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించి రూ.456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ప్రారంభిస్తారన్నారు. 2027 గోదావరి పుష్కరాలు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును 2027లో జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2026లో అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలిస్తామన్నారు. 2019–24 మధ్య పోలవరానికి కేంద్రం రీయింబర్స్ చేసిన రూ.3,000 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లించిందని మంత్రి నిమ్మల ఆరోపించారు.నిధుల మళ్లింపు అంటే అడ్వాన్సును మళ్లించడం నిమ్మలా!?విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని వంద శాతం వ్యయంతో నిర్మించి, ఏపీకి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కానీ, కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2014, జూన్ నుంచి 2016 సెప్టెంబరు వరకూ కేంద్రాన్ని నాటి సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు సిద్ధమవడంతో 2016, సెప్టెంబరు 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. 2010–11 నాటి పరిమాణాల ప్రకారం 2013–14 ధరలతో నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు కూడా చంద్రబాబు అంగీకరించారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తొలుత ఖర్చుచేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం విధించిన షరతుకు సైతం చంద్రబాబు తలొగ్గారు. అంటే.. కేంద్రం రీయింబర్స్ చేసే నిధులు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినవే. రాష్ట్ర ఖజానాలోని నిధులను ప్రభుత్వం ప్రాధాన్యత పనులకు ఖర్చుచేస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే చేసింది. నిధులను మళ్లించలేదు. రాష్ట్రం ఖర్చు చేసిన నిధులనే కేంద్రం తిరిగి ఇచ్చింది. కానీ, మంత్రి నిమ్మల మాత్రం తనకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తిచేయడానికి అడ్వాన్సుగా నిధులిచ్చి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని 2019 నుంచి నాటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. 2023, జూన్ 5న ఆ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారమే 2024–25లో రెండు విడతలుగా రాష్ట్రానికి రూ.5,052.71 కోట్లు విడుదల చేసింది. వాటిని ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమచేసి.. పోలవరం ప్రాజెక్టు పనులకే వ్యయంచేయాలని కేంద్రం షరతు పెట్టింది. కానీ, ఆ నిధులను చంద్రబాబు సర్కారు ఇతర అవసరాలకు మళ్లించింది. అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను ఎలా మళ్లిస్తారంటూ పీపీఏ అధికారులు, కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి, సాక్షాత్తూ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ పదేపదే ఆగ్రహం వ్యక్తంచేయడంతో పలు విడతలుగా ఇప్పటివరకూ రూ.4,352.71 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో ప్రభుత్వం జమచేసి ఖర్చుపెట్టింది. ఇప్పటికీ అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో రూ.700 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసింది. నిధులను సద్వినియోగం చేసుకోకుండా ఇతర అవసరాలకు మళ్లించడంవల్లే 2025–26 బడ్జెట్లో పోలవరానికి రూ.5,936 కోట్లను కేంద్రం కేటాయించినా.. ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నది వాస్తవం కాదా మంత్రివర్యా!? -
డెంగీ మరణాల్లో ఏపీకి 4వ స్థానం
సాక్షి, అమరావతి : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు ఉందన్నట్లుగా ఉంది రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పనితీరు. దోమలపై డ్రోన్లతో యుద్ధం అంటూ మాటలు కోటలు దాటించిన కూటమి సర్కారు.. ఆచరణలో మాత్రం అభాసుపాలవుతోంది. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు కట్టబెట్టడంపైనే ధ్యాస పెట్టిన ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణపై మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా.. డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణలో దారుణంగా విఫలమవుతోంది. వ్యాధుల బారినపడి బాధితులు మరణిస్తుంటే విషయం బయటకు పొక్కకుండా చూసుకునే పనిలో పడింది తప్ప వాటి నియంత్రణ చర్యలపై ఏమాత్రం దృష్టిసారించడంలేదు. దీంతో.. డెంగీ మరణాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ బండారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ బట్టబయలు చేసింది. ఈ వివరాల ప్రకారం.. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య ఏపీలో 2,386 కేసులు నమోదు కాగా.. ఐదు మరణాలు సంభవించినట్లు వెల్లడించింది. 49 మరణాలతో కేరళ తొలి స్థానంలో, మహారాష్ట్ర (13), తమిళనాడు (12) రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబరు మధ్య దేశవ్యాప్తంగా 1.13 లక్షల పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.రూ.25 వేలు ఖర్చయింది..రెండు నెలల కిందట వైరల్ జ్వరం రావడంతో నగరంలోని ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా డెంగీ అని తేలింది. దీంతో.. వైద్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్తే ఉచిత వైద్యం కుదరదన్నారు. గత్యంతరంలేక బిల్లు చెల్లిస్తానని చెప్పి అడ్మిట్ అయ్యాను. చివరికి రూ.25 వేల ఖర్చయింది. డబ్బు కోసం బంధువుల దగ్గరఅప్పుచేయాల్సి వచ్చింది. – అప్పారావు, విజయవాడరెండేళ్లుగా మరణాలు..అయితే, రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం.. 2023లో రాష్ట్రంలో డెంగీ మరణాలు నమోదు కాలేదు. మలేరియా, జపనీస్ ఎన్సెఫాలిటిస్ (జేఈ) వైరస్ మరణాలు కూడా 2023లో ఒక్కటంటే ఒక్కటీ నమోదుకాలేదు. కానీ, 2025 జనవరి నుంచి సెప్టెంబరు వరకు.. ఈ వ్యాధులతో పలువురు చనిపోయారు.» అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముగ్గురు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మలేరియా బారినపడి మరణించారు. »గతేడాది శ్రీకాకుళం, అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. » ఇక డెంగీతో ఈ ఏడాది నవంబరు నాటికి ఐదుగురు మరణించారు. మృతులు కర్నూలు, అన్నమయ్య, బాపట్ల, ఇతర జిల్లాల వారు. » గతేడాది కూడా ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఇద్దరు డెంగీ బారినపడి మృత్యువాతపడ్డారు. » 2024లో జేఈ వైరస్ బారినపడిన ఇద్దరు మరణించారు. » ఇదే ఏడాది కలరా బారినపడి ఏడుగురు మరణించారు.చికిత్సల కోసం అప్పులు..వ్యాధుల వ్యాప్తి నియంత్రణలోనే కాక, బాధితులకు ఉచిత సేవల కల్పనలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కిడ్నీ, గుండె సంబంధిత, క్యాన్సర్ వంటి పెద్ద జబ్బులతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలుచేసింది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వైరల్ జ్వరాల బారినపడిన వారిలో ప్లేట్లెట్స్ తగ్గుదల సమస్య తలెత్తుతోంది. ఈ క్రమంలో.. ఎలిసా నిర్ధారణ పరీక్షతో సంబంధంలేకుండా వైరల్ జ్వరంతో బాధపడుతూ ర్యాపిడ్ కిట్లో పాజిటివ్ ఉండి, ప్లేట్లెట్ తగ్గుదల సమస్య ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డెంగీ చికిత్స అందించే విధానాన్ని వైఎస్ జగన్ హయాంలో అమలుచేశారు. అయితే, చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండడంతో డెంగీ, మలేరియా తదితర వ్యాధులతో పాటు, గుండె, కిడ్నీ బాధితులకు సైతం ఉచిత వైద్యసేవలు అందడంలేదు. డెంగీ, వైరల్ జ్వరాల చికిత్సలకు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆరోగ్యశ్రీ వర్తించక వైద్యం కోసం అప్పులుచేయాల్సి వస్తోందని పేద, మధ్యతరగతి కుటుంబాల వారు గగ్గోలు పెడుతున్నారు. -
ప్రభుత్వం దారుణంగా విఫలం
సంక్షేమ హాస్టళ్లలో 45 మంది పిల్లలు చనిపోవడం చిన్న విషయమేమీ కాదు. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల సంరక్షణ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో పిల్లలు మృతి చెందారని చెబుతున్నారంటే... ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో, తగిన వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లే!– రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని తేల్చిచెప్పింది. విద్యార్థులు జ్వరం, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తదితర కారణాలతో చనిపోవడం అంటే ముందుజాగ్రత్త చర్యలు, తగిన వైద్యం అందించడంలో దారుణంగా విఫలమైనట్లేనని ఆక్షేపించింది. సంక్షేమ హాస్టళ్లలో మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందజేసే విషయంలో నిర్దిష్ట విధానం ఉందా...? అని ప్రశ్నించింది. ఉంటే దానిని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాస్టళ్లలో నెలలో ఎన్నిసార్లు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న దానిపై కార్యాచరణ రూపొందించాలని, ఇప్పటివరకు సంభవించిన మరణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని సూచించింది. విద్యార్థులు ఏఏ కారణాలతో చనిపోయారో చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని స్పష్టం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఏమైనా పరిహారం చెల్లించి ఉంటే ఆ వివరాలను కూడా అందించాలంది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన ఓ పిల్లో కూడా ఈ వివరాలు అన్నింటినీ పొందుపరచాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. కారణాలు తెలుసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, 45 మంది విద్యార్థులు చనిపోయారని పిటిషనర్ చెబుతున్నారని... అందుకు కారణాలు ఏమిటి? హాస్టళ్లలోని పరిస్థితుల నేపథ్యమా? లేక ఇతర అంశాలు ఉన్నాయా? అన్న విషయాలను నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. పిల్లలు మరణించినప్పుడు అందుకుగల కారణాలపై నివేదికలు ఉంటాయని, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. ప్రతి 15 రోజులకు హాస్టళ్లకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని గ్రామాల్లోని ఏఎన్ఎంలకు ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు వీలుగా ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ హాస్టళ్లలో పిల్లల బాగోగులు చూసేందుకు హెల్త్ వలంటీర్లను నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంక్షేమ హాస్టళ్లలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల హాస్టళ్లలో మరణాలు పెరిగాయన్నారు. హెల్త్ వలంటీర్లను నియమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
బాపట్లలో టీడీపీ కార్యాలయానికి రెండెకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బాపట్లలో రెండెకరాల భూమిని కేటాయించుకున్నారు. పశ్చిమ బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1341–ఎ లోని రెండెకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. రెండు నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాలను ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు. ⇒ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను సంవత్సరానికి రూ.1,000 చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చారు. ఆ భూమిని గతంలో రవాణా శాఖకు ఇచ్చినా ఆ కేటాయింపును రద్దుచేసి మరీ టీడీపీ జిల్లా కార్యాలయానికి అప్పగించారు. ⇒ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కూడా రూ.వెయ్యికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు. ⇒ అలాగే, కడప నగరంలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్నా లెక్కచేయకుండా దాన్ని తన పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు. విశాఖలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాలు ఇదిలా ఉంటే.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమిని ఎకరాకు రూ.80 లక్షల చొప్పున మొత్తం రూ.14.85 కోట్లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడేళ్లు పొడిగిస్తూ ఇంకో ఉత్తర్వు ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టీకల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పేదలకు ఇవ్వకుండా పార్టీకి కేటాయింపులు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ హామీ గురించి పట్టించుకోలేదు. పైగా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా తన పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన స్థలాలను కేటాయించుకుంటున్నారు. అంతేకాక.. గతంలో లీజుకు తీసుకున్న భూములపై ఇంకా అధికారాలు పెంచుకునేలా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు. -
ఆప్కాఫ్.. నువ్వా.. నేనా..
సాక్షి, అమరావతి: సీనియర్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య (ఆప్కాఫ్) చైర్మన్ పదవి విషయంలో ఇద్దరూ నువ్వా.. నేనా.. అ న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మత్స్యశాఖలో కనీస అనుభవంలేని డోలా శంకర్ను ఆ శాఖ కమిషనర్గా నియమించడంతో మొదలైన వీరి పోరు ఆప్కాఫ్ పదవిపై కత్తులు దూసుకునే స్థాయికి చేరింది.ఆది నుంచి కొల్లు రవీంద్రదే పెత్తనం మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఈ శాఖపై పెత్తనం చలాయిస్తున్నారు. వేటనిషేధ భృతి దగ్గర నుంచి కేంద్ర పథకాలకు అర్హుల ఎంపిక, నిధుల వ్యయం వరకు అన్నింటా కొల్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తమ నియోజకవర్గానికి చెందిన డోలా శంకర్ను కమిషనర్గా నియమించుకోవడమేగాక.. వివిధ హోదాల్లో తన మనుషులకు మత్స్యశాఖలో రూ.లక్షల వేతనంతో కొలువులు కట్టబెట్టి వసూళ్లపర్వం సాగించారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ల సమావేశంలో డోలా పనితీరుపై సీఎం చంద్రబాబు కూడా మండిపడ్డారు. దీంతో సీనియర్ ఐఏఎస్ అధికారికి కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని మంత్రి అచ్చెన్నాయుడు ప్రయతి్నంచగా.. రవీంద్ర మంత్రి లోకేశ్ ద్వారా చక్రం తిప్పారు. దాదాపు పదేళ్ల కిందట రిటైరైన రామశంకర్కు పునర్నియామకం ద్వారా కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. కొల్లు జోక్యంపై అచ్చెన్నాయుడు పలుమార్లు చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మంత్రి కొల్లు తన అనుచరుడైన కొల్లు పెద్దిరాజుకు దక్కేలా చేయగలిగారు. కార్పొరేషన్ పరిధిలో ఓడబలిజ, జాలారి, నెయ్యల, పట్టపు, గుండ్ల వంటి ఉపకులాలకు చెందిన వారిని కాదని కార్పొరేషన్తో సంబంధం లేని అగ్నికులక్షత్రియ వర్గానికి చెందిన నరసాపురం వాసి పెద్దిరాజుకు ఈ పదవి ఇవ్వడంపై అచ్చెన్నాయుడు విభేదించినా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం చెప్పినా.. కోర్టుకెక్కిన కొల్లు వర్గీయులు నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా మంత్రి లోకేశ్ అండదండలతో రవీంద్ర తన అనుచరుడైన కడప జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య చైర్మన్ రాంప్రసాద్ను ఆప్కాఫ్ చైర్మన్గా అధిష్టానం ద్వారా ప్రకటింప చేయించుకున్నారు. తన శాఖలో మంత్రి కొల్లు జోక్యం ఏమిటో తేల్చాలంటూ మంత్రి అచ్చెన్న ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చంద్రబాబు.. రాంప్రసాద్ను పక్కనపెట్టి నంద్యాల ఎంపీ శబరి అనుచరుడైన కర్నూలు జిల్లా మత్స్యకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నవీన్కుమార్ను ఆప్కాఫ్ చైర్మన్గా ఎంపిక చేశారు. సీఎంవో ఆదేశాల మేరకు నియమితులైన నవీన్కుమార్ ఆప్కాఫ్ చైర్మన్గా బాధ్యతలు కూడా స్వీకరించారు. దీంతో రాంప్రసాద్ను బలపరుస్తున్న మంత్రి రవీంద్ర వర్గీయులైన జిల్లా సమాఖ్యల వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పదవికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తనశాఖ మంత్రి అచ్చెన్నాయుడైనా.. తొలినుంచి మంత్రి కొల్లుకు వత్తాసు పలుకుతున్న మత్స్యశాఖ కమిషనర్ రామ్శంకర్నాయక్ ఎన్నికల నిర్వహణకు సన్నద్దమయ్యారు. జనవరి 8వ తేదీన ఆప్కాఫ్ జనరల్ బాడీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ‘నా అనుమతి లేకుండా.. నాకు తెలియకుండా.. నా శాఖ పరిధిలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో చూస్తా..’ అంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలవాలని రాష్ట్రంలోని 13 జిల్లా సమాఖ్య చైర్మన్లను తమ వైపు తిప్పుకునేందుకు రాంప్రసాద్, నవీన్కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.5 లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని, నిలిపేయాలని మంత్రులు ఎవరికివారు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్లు కొల్లగొట్టేందుకే ఆప్కాఫ్పై పెత్తనం ఏపీ సహకార సంఘాల చట్టం–1964 ద్వారా 1987లో ఏర్పాటైన ఆప్కాఫ్.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 2,136 మత్స్య సహకార సొసైటీలు, వాటి పరిధిలో ఉన్న మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుంది. వేటకు వెళ్లే బోట్లకు సబ్సిడీ డీజిల్ ఆయిల్ సరఫరా చేసే అవుట్లెట్స్, వాటి మార్కెటింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆప్కాఫ్కు మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ ఎండీగా వ్యవహరిస్తుండగా, బైలా ప్రకారం చైర్మన్, వైస్ చైర్మన్లను జిల్లా సమాఖ్యల ద్వారా ఎన్నకుంటారు. ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఫ్పీవో)లుగా అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందట ఆప్కాఫ్కు జాతీయ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రూ.1,274 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.637 కోట్లు విడుదల కూడా చేసింది. వీటిని ఎంపిక చేసిన 182 ప్రాథమిక మత్స్య సహకార సొసైటీలను ఎఫ్ఎఫ్పీవోలుగా అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంది.ఇప్పటికే ఈ ప్రాజెక్టు పేరు చెప్పి 50 మందికి పైగా తమ అనుచరులను నియమించుకున్నారు. వీరికి పైసా పనిలేకున్నా రూ.లక్షల జీతాలిస్తున్నారు. ఈ నిధులపై కన్నేసినందునే మంత్రులు ఈ శాఖపై పెత్తనం కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. -
22ఏ భూములపై మళ్లీ రీ వెరిఫికేషన్
సాక్షి, అమరావతి: నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూములపై రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కసరత్తు జరుగుతోంది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భాగంగా యంత్రాంగం నాలుగు నెలలుగా రెండు సార్లు రీ వెరిఫికేషన్ చేసింది. అయినా, ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. వివాదాలు లేని భూములపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఆ పని చేయలేకపోతోంది. దీంతో మళ్లీ వెరిఫికేషన్ జరిపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చాక 22ఏ నుంచి తమ భూములను తొలగించాలని గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా 6,846 దరఖాస్తులు వస్తే కేవలం 829 మాత్రమే రెవెన్యూ యంత్రాంగం క్లియర్ చేసింది. 305 దరఖాస్తులకు అనుమతివ్వగా 524 తిరస్కరించింది. 6,017 పెండింగ్లో ఉంచారు. వీటిపై నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు వెనుకాడుతున్నారు. వివాదాల భయంతో ప్రభుత్వ స్థాయిలోనే పరిష్కరించాలనే రీతిలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు పంపుతున్నారు. అయితే, సీసీఎల్ఏ, ప్రభుత్వ స్థాయిలోనూ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తులు జిల్లాల నుంచి సీసీఎల్ఏ, అక్కడినుంచి జిల్లాల చుట్టూ తిరుగుతున్నాయి. వాస్తవానికి రైతులు, భూముల యజమానులు పెట్టుకున్న దరఖాస్తులు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కాగా, బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను తొలుత పరిగణనలోకి తీసుకుంది. వాటిలో 90 శాతం పరిష్కరించలేకపోయింది. మండలాల వారీగా 22ఏ జాబితాలో అన్ని భూములపైనా వెరిఫికేషన్ జరిపింది. వీఆర్వో, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేసిన తర్వాత ఆర్డీవో, జేసీ, కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తహసీల్దార్... 22ఏ నుంచి తొలగించాలని సిఫారసు చేసిన భూములనూ పెండింగ్లో ఉంచారు. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతల జోక్యం ఉండడంతో చిక్కుల్లో పడతామని జిల్లా అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు జంకుతున్నారు. 22ఏలోని భూములపై కన్నేసిన టీడీపీ ప్రజాప్రతినిధులు సంబంధిత యజమానులతో బేరాలు మాట్లాడుకుని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్రమంగా ఉన్నాసరే పరిష్కారానికి అధికారులు భయపడుతున్నారు. ఎలాగోలా సమస్యకు తెరపడాలని భూ యజమానులు భావిస్తుండగా, దానిని సొమ్ము చేసుకోవడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. దీంతో గందరగోళం నెలకొంది. -
మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’.. ‘పచ్చ’ సిండికేట్కి కిక్కే కిక్కు
సాక్షి, అమరావతి: మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’ వసూళ్లకు సర్కారు అనధికారిక అనుమతులు ఇచ్చేసింది. ఈ కానుకతో కొత్త సంవత్సరంతో ‘కిక్కే.. కిక్కు’ అంటోంది టీడీపీ మద్యం సిండికేట్. రాష్ట్రంలో మద్యం విక్రయాల వ్యవస్థను గుప్పెట పట్టిన టీడీపీ సిండికేట్ నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా చేసుకుని మరింత దోపిడీకి తెగబడింది. అదనపు విక్రయ సమయాలకు ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపగా.. అనధికారిక వసూళ్లకు కూడా సై అంది. తద్వారా రెండ్రోజుల్లోనే రూ.500 కోట్ల మద్యం అమ్మకాలు, అనధికారికంగా మరో రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కరకట్ట బంగ్లా కనుసన్నల్లో రాష్ట్రంలో సాగుతున్న మద్యం దోపిడీ విధానంలో కొత్త అంకానికి తెరలేచింది. ఇకపై ఏ పండుగ వచ్చినా ఇదే విధానమని స్పష్టమైన సంకేతాలిచ్చింది. క్వార్టర్ బాటిల్పై రూ.50 బాదుడు కొత్త ఏడాది వేడుకలను టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. అందుకోసమే బుధ, గురువారాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలోని 3,336 మద్యం దుకాణాలు, 540 బార్లు టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది. దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను అనధికారికంగా ఏర్పాటు చేసి ఊరూ వాడా మద్యం ఏరులై పారిస్తోంది. అంటే మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే ఉంది. ఇప్పటికే బాటిల్పై ఎంఆర్పీ ధర కంటే రూ.10 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం ధరలను అనధికారికంగా అమాంతం పెంచేశారు. ‘న్యూ ఇయర్ సెస్’ అంటూ అనధికారికంగా క్వార్టర్ బాటిల్పై రూ.50 అదనంగా వసూలు చేయాలని సిండికేట్ నిర్ణయించింది. అంటే ఫుల్ బాటిల్పై రూ.200 ధర పెంచేసినట్టే. ఇక బీర్ బాటిల్పై కూడా రూ.50 అనధికారికంగా పెంచేశారు. ఆ ప్రకారమే బుధవారం ఉదయం నుంచే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ న్యూ ఇయర్ హంగామా దోపిడీ కొనసాగనుంది. రెండ్రోజుల్లో రూ.500 కోట్ల అమ్మకాలే లక్ష్యంబుధ, గురువారాల్లో మద్యం విక్రయాలు ఎంతగా పెరిగితే.. అంతగా దోపిడీ చేయవచ్చని టీడీపీ సిండికేట్ గుర్తించింది. అందుకే మద్యం విక్రయాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇక సాధారణ రోజుల్లో ఎంఆర్పీ ధరల ప్రకారం రాష్ట్రంలో రోజుకు దాదాపు రూ.90 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. 2025 జనవరి 1న రూ.147 కోట్ల మద్యం, 2025 సంక్రాంతి రోజున రూ.225 కోట్ల మద్యం విక్రయించారు. ఇప్పుడు ఆ రికార్డులను తిరగ రాయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. డిసెంబర్ 31న అంటే బుధవారం ఒక్క రోజే రూ.300 కోట్ల మార్కు దాటించాలని స్పష్టం చేసింది. జనవరి 1న విక్రయాలు కలిపి రూ.500 కోట్ల మద్యం విక్రయించాలని ఎక్సైజ్ అధికారులకు అనధికారికంగా టార్గెట్ ఇచ్చింది. వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ మొత్తం అదే పనిలో నిమగ్నమైంది. ఎంత వీలైతే అంతగా తాగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. రాష్ట్రంలోని బీచ్లలోని కూల్డ్రింక్స్ షాపులు, పల్లెలు, పట్టణాల్లోని కిళ్లీ కొట్లు, కిరాణా కొట్లను కూడా బెల్ట్ దుకాణాలుగా చేసేసుకోవాలని సిండికేట్కు పచ్చ జెండా ఊపింది. సూర్యలంక బీచ్లో కూల్డ్రింక్ దుకాణాల్లో బహిరంగంగానే మద్యం విక్రయిస్తుండటం గమనార్హం. రాష్ట్రం అంతా అదే పరిస్థితి నెలకొంది. కాగా న్యూ ఇయర్ స్పెషల్గా క్వార్టర్ బాటిల్పై రూ.50, బీరు బాటిల్పై రూ.50 అదనపు దోపిడీ ద్వారా మరో రూ.100 కోట్లు కొల్లగొడతారని అంచనా. తద్వారా మద్యం విక్రయాల అసలు విలువ రూ.600 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే..రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ అంతా కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. అందుకోసమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొత్తం 3,336 మద్యం దుకాణాలు, 540 బార్ల లైసెన్సులను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కేటాయించింది. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మద్యం బాటిల్పై రూ.5 చొప్పున కరకట్ట బంగ్లాకు చేరుతోంది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35వేల కోట్ల మద్యం విక్రయాలను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించింది. ఇందుకు కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఇతర పండుగల సీజన్ను వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. -
రహస్య పర్యటనలో ఆంతర్యమేంటి?
సాక్షి, అమరావతి: పారదర్శకతకు పాతరేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రహస్యంగా విదేశీ పర్యటనలు చేయడం దుమారం రేపుతోంది. జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం ఏమిటనే ప్రశ్నకు అటు టీడీపీ నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ సరైన సమాధానం రావడం లేదు. గత నెల 30న ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అఖిల భారత సర్వీసు సహా వివిధ స్థాయి అధికారులు అధికారిక విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు వెలువడతాయి. సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు. సీఎం పర్యటన ఉంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని రాజకీయ, మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు ఏమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ ఐదు రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా బయట పెట్టలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా గుడ్డిగా సమర్థించుకోవడం తప్ప, తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయి టీడీపీ శ్రేణులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. -
బాబు కేసుల వివరాలన్నీ ఇవ్వండి
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్న 2014–19 మధ్య కాలంలో జరిగిన ఏపీ ఫైబర్నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ నమోదుచేసిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. సువర్ణరాజు దాఖలు చేసిన మూడు రివిజన్ పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం–నిందితుల మధ్య అపవిత్ర బంధంఏపీ ఫైబర్నెట్, మద్యం విధానం, ఉచిత ఇసుక కుంభకోణాలపై సీఐడీ పెట్టిన కేసుల్లో అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరిస్తూ ఈనెల 5న జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసి, అన్ని డాక్యుమెంట్లను తనకిచ్చేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సువర్ణరాజు హైకోర్టులో ఇటీవల క్రిమినల్ రివిజన్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ లక్ష్మణరావు బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం, నిందితుల మధ్య అపవిత్ర బంధం కొనసాగుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులను అన్యాయంగా, దారుణంగా మూసేస్తున్నారని.. ఇప్పటికే ఇలా ఐదారు కేసులను మూసివేశారని ఆయన వివరించారు. అలా మూసేసిన కేసుల తాలూకు కాపీలను కూడా బయటకు రానివ్వడంలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు నిందితులుగా ఉన్న కేసులకు తాలూకు డాక్యుమెంట్లను కోరినా కూడా ఏసీబీ కోర్టు ఇవ్వడంలేదని తెలిపారు. వాటిని తమకు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిందన్నారు. థర్డ్ పార్టీగా అన్ని డాక్యుమెంట్లు పొందే హక్కు పిటిషనర్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లేనని తెలిపారు. న్యాయం కోసమే పోరాటం చేస్తున్నాంసీఐడీ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాణిని సోమయాజీ జోక్యం చేసుకుంటూ.. థర్డ్ పార్టీకి కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్పార్టీ అయినా డాక్యుమెంట్లు పొందవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పిందని పొన్నవోలు సుధాకర్రెడ్డి తెలిపారు. ఆ కాపీలను ఏ ప్రయోజనం కోసం కోరుతున్నారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. కేసుల మూసివేతపై హైకోర్టులో రివిజన్ పిటిషన్లు దాఖలు చేసేందుకు కోరుతున్నామని సుధాకర్రెడ్డి బదులిచ్చారు. కేసుల మూసివేతపై థర్డ్ పార్టీనే పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరంలేదని, హైకోర్టు సైతం సుమోటోగా స్పందించవచ్చని ఆయన చెప్పారు. న్యాయం కోసమే తాము పోరాటం చేస్తున్నామన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మూడు క్రిమినల్ రివిజన్ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. -
కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన.అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా’’ అంటూ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారాయన. Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!#HappyNewYear2026— YS Jagan Mohan Reddy (@ysjagan) January 1, 2026అంతకు ముందు న్యూఇయర్ సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాక్షించారు. -
రక్షించాల్సిన పాలకులు.. భక్షిస్తున్నారు: వరుదు కల్యాణి
సాక్షి, తాడేపల్లి: ఈ ఏడాది (2025)లో కూటమి ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని.. మహిళలు, చిన్నారుల పాలిట చీకటి సంవత్సరంగా మారిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రక్షించాల్సిన పాలకులే భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం షాపులు, బెల్టు షాపులు నెలకొల్పి మహిళల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ పనితీరు అట్టడుగుకు పడిపోయింది.‘‘కేంద్ర హోంశాఖ హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం మారలేదు. డీజీపీ స్థాయి వ్యక్తి మాటలు వింటుంటే పోలీసు వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విశాఖ జిల్లాలో 213 శాతం గంజాయి, డ్రగ్స్ కేసులు పెరిగాయి. నెల్లూరులో గంజాయికి వ్యతిరేకంగా పని చేస్తున్న కమ్యూనిస్టు నాయకుడు పెంచలయ్యను హత్య చేశారు. 1,450 మందిపై లైంగిక దాడులు జరిగాయి. 5 వేల మందిపై వేధింపులు జరిగాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేదు’’ అంటూ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘మహిళలకు ఇచ్చిన ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మూడు పార్టీలు కలిసి మూడు చెరువుల నీళ్లు తాగించారు. కూటమి పాలనలో మహిళలు, చిన్నారులు తీవ్రంగా అన్యాయానికి గురయ్యారు. ఏ వర్గానికీ ప్రభుత్వం మేలు చేయలేదు. దోపిడీలో బంగ్లాదేశ్కు బాబుగా, శ్రీలంకకు చెల్లిగా మార్చారు. ఆవకాయ ఫెస్టివల్కి డబ్బులు ఉంటాయిగానీ, ఆడబిడ్డ పథకం అమలు చేయడానికి డబ్బుల్లేవా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు.‘‘మహిళలంటే సామాన్య మహిళలే కాదు, దేవతలను కూడా అవమానం చేశారు. దుర్గమ్మ ఆలయానికి కరెంటు కట్ చేసి అవమానం చేశారు. అనిత, సంధ్య, సవిత.. ఈ ముగ్గురికే న్యాయం జరిగింది. పేరుకే మంత్రులు, కానీ జగన్ని దూషించటానికే పని చేస్తున్నారు. హోంమంత్రి అనిత రౌడీలకు పెరోల్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. సంధ్యారాణి పీఏ ఒక మహిళను వేధిస్తే తిరిగి బాధితురాలి మీదనే కేసు పెట్టించారు. మంత్రి సవిత కుట్టు మిషన్ల స్కాం చేసి సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు. తప్పులు చేసిన వారిని వదిలేసి, బాధితులపైనే కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వం లోనే చూస్తున్నాం..సింహాచలం ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే వారిపైనే కేసులు పెట్టటం అన్యాయం. జల్సా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు అవాంఛనీయ శక్తులుగా వ్యవహరించారు. జగన్, అల్లు అర్జున్లను కించపరిచే మాస్కులు వేసుకుని వ్యవహరించారు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
‘ఆలయాలపై కూడా రెడ్బుక్ రాజ్యాంగమా?’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పటం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడు, ఆలయాల మీద కూడా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా?. ఇంతకంటే నీచమైన పని ఇంకోటి ఉంటుందా? అంటూ నాగార్జున యాదవ్ నిలదీశారు.‘‘ఇలాంటి నీచ రాజకీయాలను దేవుడు కూడా క్షమించడు. ఆలయాల పవిత్రతను దెబ్బ తీయవద్దు. సింహాచలం అప్పన్న ఆలయ ప్రసాదంలో నత్త రావటం ఆందోళనకు గురి చేసింది. ఇదే ఆలయంలో గోడ కూలి భక్తులు మరణించారు. ఇప్పుడు ప్రసాదంలో నత్త వచ్చింది. దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి, బెదిరించారు. ఆ దంపతులు ఒక వీడియో పోస్టు చేస్తే వారిని టార్గెట్ చేశారు. ఆ జంటపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం..ప్రసాదంలో నత్త రావటానికి కారణాలపై విచారణ జరపకుండా భక్తులపై కేసులు పెడతారా?. చివరికి దేవుడి మీద కూడా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. దీనిని దేవుడు కూడా క్షమించరు. నీచ రాజకీయాలకు దేవుడ్ని వాడుకోవద్దు. చంద్రబాబుకు దైవ భక్తి ఉంటే భక్తులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని నాగార్జున యాదవ్ డిమాండ్ చేశారు. -
పేరు పోలవరం.. ఊరు రంపచోడవరం
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా కూటమి ప్రభుత్వ మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో 28కి చేరింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు నేటి(బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించింది చంద్రబాబు ప్రభుత్వం. వివాదాస్పద రీతిలో.. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు. తాళ్లపాక కడపలోకి!రాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు. పోలవరం లేకుండానే.. ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు. అన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.శాస్త్రీయత లేకుండా..బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు. చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది. -
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసును మూసివేసేందుకు సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువరించవద్దని పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ విజయవాడ ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. ఆ మేరకు ఆయన ఏసీబీ కోర్టులో ఓ మెమో దాఖలు చేశారు. ‘స్కిల్ కుంభకోణం దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ హైకోర్టులో నేనే పిల్ దాఖలు చేశాను.దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ పిల్ దాఖలు చేశా. ఇదిలా ఉంటే, స్కిల్ కుంభకోణంపై నమోదు చేసిన కేసును మూసివేసేందుకు సీఐడీ చర్యలు చేపడతున్నట్లు నాకు తెలిసింది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పెండింగ్లో ఉన్నప్పటికీ, సీఐడీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేసు మూసివేత దిశగా చర్యలు చేపడుతోంది. హైకోర్టులో పిల్ తేలకుండా కేసును ముగిస్తే, పిల్ దాఖలు చేసిన అసలు ఉద్దేశమే దెబ్బతింటుంది. అలాగే విచారణ ప్రక్రియకు విఘాతం కలిగించినట్లు కూడా అవుతుంది.అలా చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కూడా. అంతేకాక అలా కేసును మూసేయడం న్యాయ విరుద్ధం కూడా. స్కిల్ కుంభకోణంపై సీఐడీ కేసును కొట్టేయాలని కోరుతూ ఆ కేసులో 37వ నిందితునిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. హైకోర్టులో నేను దాఖలు చేసిన పిల్ పరిష్కారం అయ్యే వరకు స్కిల్ కుంభకోణం కేసును మూసివేసే దిశగా సీఐడీ దాఖలు చేసే క్లోజర్ రిపోర్ట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ మొత్తం ప్రక్రియను నిలిపేయండి.’ అని తిలక్ తన మెమోలో ఏసీబీ కోర్టును అభ్యర్థిచారు. -
వెంటిలేటర్పై... సంజీవని!
ఇప్పుడు ఉచిత వైద్యం కాదు.. రూ.లక్షన్నర వరకు బాదుడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తే రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేశారు. ఈ దోపిడీకి గురైనవారు సింహాద్రిపురం వారు. ఇలాంటి కేసులు ఒకటి రెండు వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. – పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మడబ్బు కడితేనే గుండె ఆపరేషన్ చేస్తారటడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలానికి చెందిన స్వామి(65) ఆర్నెల్ల కిందట అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండె రక్త నాళాలు పూడుకుపోయాయని.. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. కొద్ది రోజులు మందులు వాడాక సర్జరీ చేస్తామని సూచించారు. అక్టోబర్లో ఆరోగ్యశ్రీ కార్డుతో స్వామి, కుటుంబ సభ్యులు మళ్లీ అదే ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద అడ్మిట్ చేసుకోవాలని కోరారు. ‘ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం. బైపాస్ సర్జరీకి రూ.మూడు లక్షలకు పైగా ఖర్చవుతుంది. అంత భరించే స్తోమత లేకుంటే వెళ్లిపోండి’ అని తేల్చిచెప్పారు. ఉసూరుమంటూ వెనుదిరిగిన స్వామి.. గతంలో వైద్యులు రాసిచ్చిన మందులు వేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో ఉంటే వైద్యం చెంతనున్నట్లే.. ఎంత పెద్ద జబ్చొచ్చినా చింత లేనట్లే. పేదలకు అదో సంజీవనే. భారీ కార్పొరేట్ ఆస్పత్రికైనా ధైర్యంగా వెళ్లి చికిత్స పొందే వెసులుబాటు... ఆ తర్వాత కోలుకునేవరకు ఆర్థిక ఆసరా.. -ఇది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని భరోసా పేద, మధ్య తరగతికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు రోజురోజుకు దూరం. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఛీత్కారం. అడ్మిట్ చేసుకున్నా శస్త్రచికిత్సలకు సకాలంలో అనుమతి రావడం గగనం. ఫలితంగా అప్పోసప్పో చేసి ఆస్పత్రిలో డబ్బు కట్టి ఆపరేషన్ చేసుకోవాల్సిన దుస్థితి..! -ఇదీ ప్రస్తుతం చంద్రబాబు సర్కార్లో దుస్థితిమూడు ఆస్పత్రులు తిరిగినా...గుంటూరుకు చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. కొన్నేళ్లుగా పైల్స్తో సతమతం అవుతున్నాడు. సమస్య తీవ్రం కావడంతో వైద్యులు సర్జరీ సూచించారు. దీంతో ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స కోసం గుంటూరులోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రిని ఆశ్రయించాడు. ప్రభుత్వం నిధులివ్వడం లేదని, ఉచిత చికిత్సలు చేయడం లేదని, రూ.45 వేలు చెల్లిస్తే సర్జరీ చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. అంత స్థోమత లేని రమేశ్ మరో రెండు, మూడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లాడు. అక్కడా ఉచిత సర్జరీ చేయలేమని చెప్పడంతో రమేశ్ ఇంటికి వెనుదిరిగాడు. తీవ్రమైన పైల్స్ సమస్యతో బాధపడుతున్నాడు.సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, కడప/నెట్వర్క్: ఏ క్షణంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలకు జబ్బు చేసింది. ‘ఎన్టీయార్ వైద్య సేవ’ అంటూ పేరు మార్పులో ఉన్న శద్ధ్ర... పథకం అమలులో కొరవడింది. పేద, మధ్య తరగతికి కార్పొరేట్వైద్యం ఉచితంగా అందించే మహోన్నత లక్ష్యంతో దివంగత మహా నేత వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత సమర్థంగా అమలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఈ పథకంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోవడంతో వైద్యసేవలు వెంటిలేటర్పైకి చేరాయి. ఫలితంగా రాష్ట్రంలో అనారోగ్యం బారిన పడిన పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది.⇒ 1.40 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారు. గద్దెనెక్కిన వెంటనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రభుత్వ నిధులను దోచిపెట్టే బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా, పథకం అమలును గాలికి వదిలేశారు. ప్రభుత్వం తీరుతో ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచిత వైద్యం కోసం వచ్చినవారిని నిర్దాక్షిణీయంగా తిప్పి పంపుతున్నాయి.బకాయిల కోసం పోరుబాట పట్టినా...రాష్ట్రవ్యాప్తంగా 600పైగా ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అనుమతులున్నాయి. వాటికి రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిని సాధించేందుకు అక్టోబర్లో వైద్యులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేసి పెద్దఎత్తున ఉద్యమించారు. ఉద్యోగ భద్రత కోరుతూ ఆస్పత్రుల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఆ సమయంలో బ్యాంక్ల నుంచి అప్పు తెచ్చి బకాయిలన్నీ ఒకేసారి చెల్లిస్తామని (వన్టైమ్ సెటిల్మెంట్) చేస్తామని బాబు సర్కారు హామీ ఇచ్చింది. కానీ, ఉద్యమం విరమించాక మెలిక పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి బకాయిలు వచ్చే పరిస్థితి లేదని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయానికి వచ్చాయి.రూ.లక్షల్లో గుంజేస్తున్న వైనంబిల్లుల విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ ఆస్పత్రులకు అవకాశంగా మారింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెబుతున్నా పట్టించుకోకుండా డబ్బు కడితేనే వైద్యం అని రోగులకు తేల్చి చెప్పేస్తున్నాయి. ఓపీ ఫీజు, రక్త పరీక్షలు, ఈసీజీ, ఎకో, ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి వివిధ డయాగ్నస్టిక్స్, మందులు రాసి అందినంత గుంజేస్తున్నాయి. డెలివరీ, కంటి శుక్లాలు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మొదలు మెదడు, కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బుల బాధితుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. కొన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందిస్తామని తొలుత నమ్మబలికి... రోగిని అడ్మిట్ చేసుకుని, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాక మరో సమస్య బయటపడిందని, దానికి ఆరోగ్యశ్రీ వర్తించదంటూ దోచేస్తున్నాయి.ఈ ప్రభుత్వంలో పేదలను దోచుకుంటున్నారుకాలు ఫ్రాక్చర్ అయిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లినవారి వద్ద ఏకంగా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల దాక వసూలు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వర్మ సంచలన విషయం బయటపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో పేదలు దోపిడీకి గురవుతున్న తీరుకు వర్మ వ్యాఖ్యలే పెద్ద నిదర్శనం. వాస్తవానికి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ దగ్గర నుంచి వైద్య పరీక్షలు, ఇన్పేషెంట్ కింద సర్జరీలు, ఇతర సేవలన్నింటినీ అందించాలి. అంతేకాక డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే రోజున మందులను కూడా పూర్తి ఉచితంగా రోగికి ఇవ్వాలి. వైఎస్సార్సీపీ హయాంలో రోగి కోలుకునేదాక నెలకు రూ.5 వేల వరకు ఆరోగ్య ఆసరా కూడా అందించేవారు. ఈ ఆసరా సాయాన్ని బాబు ప్రభుత్వం అటకెక్కించింది.ఉన్నతాధికారి విన్నవించినా దిక్కు లేదుబకాయిల విషయంలో బాబు ప్రభుత్వం హామీలివ్వడం, అమలు చేయకుండా మొండిచేయి చూపిస్తుండడంతో విసిగిపోయిన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీనే కాదు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ (ఈహెచ్ఎస్) కింద ఉచిత వైద్య సేవలు అందించబోమని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర సచివాలయం ఉద్యోగి భార్య కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. తాడేపల్లిలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి... ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయాలని కోరారు. ఉచిత వైద్యం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని, ముందు డబ్బు చెల్లించి, తర్వాత మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకోమని ఉద్యోగికి ఆస్పత్రికి యాజమాన్యం సూచించింది. చేతిలో అంత డబ్బు లేకపోవడంతో సదరు ఉద్యోగి సమస్యను సచివాలయం ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన నేరుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉన్నతాధికారులకు సమస్య వివరించారు. స్పెషల్ కేస్ కింద పరిగణించి, ఉచిత వైద్యం చేయాలని ఆరోగ్య శ్రీ సీఈవోను కోరినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదని సమాచారం. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య వైద్యానికి రూ.లక్షల్లో సొంతంగా ఖర్చు పెట్టుకున్నారు.రూ.60 వేలు అప్పు చేసి చికిత్సనెల కిందట అకస్మాత్తుగా కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లా. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని విజయవాడలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేస్తామని చెప్పి చేర్చుకున్నా మూడు రోజులైనా సర్జరీ చేయలేదు. అదేమంటే... ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి రాలేదని చెప్పారు. రోజురోజుకు నొప్పి ఎక్కువ కావడంతో రూ.60 వేలు అప్పు చేసి సర్జరీ చేయించుకున్నా. పేదింటికి చెందిన నాకు అప్పు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం సకాలంలో అనుమతిచ్చి ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. –లాజరస్, తాళ్లపాలెం, మచిలీపట్నం.జగన్ హయాంలో పూర్తి భరోసా..ఆరోగ్యశ్రీ పథకాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్రంలో పేదలందరికీ చేరువ చేశారు. రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందేలా విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. వైద్య ప్రక్రియలను ఏకంగా 3,257కు పెంచారు. రూ.వెయ్యికి పైగా ఖర్చయ్యే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. శస్త్ర చికిత్సలు చేయించుకున్న పేదలకు పూట గడవడం కోసం ఇదివరకెన్నడూ లేని విధంగా ‘ఆరోగ్య ఆసరా’ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద వైద్యులు సూచించిన మేరకు రోగి కోలుకునే వరకు రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున సాయం అందించేందుకు శ్రీకారం చుట్టారు. 108, 104 వ్యవస్థలను గాడిన పెట్టారు. ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు వైద్యుల చొప్పున నియమించి గ్రామాల్లో ‘ఫ్యామిలీ డాక్టర్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నడవలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా సమయంలో తీసుకున్న చర్యలు యావత్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఇంటింటి సర్వేలు, క్వారంటైన్ సెంటర్లు, వైద్యుల నియామకాల కోసం వాకిన్ ఇంటర్వ్యూలు, టెలి మెడిసిన్ తదితర సేవల పట్ల నాడు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగాన్ని ఇంత సర్వోన్నతంగా మార్చేసిన స్థితి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం రాకతో ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చినట్లయింది. గుండె ఆపరేషన్కు రూ.3.5 లక్షలు ఖర్చు చేశానాకు అక్టోబరులో గుండెపోటు వచ్చింది. ఒంగోలు కిమ్స్కు వెళ్తే వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అన్నారు. ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లింపులు లేవని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయలేమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంగా చెప్పింది. సొంతంగా రూ.3.5 లక్షలు ఖర్చు పెట్టుకుని ఆపరేషన్ చేయించుకున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతోమంది పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేయించుకున్నారు. మందులు, ఆస్పత్రి ఖర్చులతో పాటు, కోలుకునేవరకు రోజుకు రూ.225 చొప్పున చెల్లించింది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు.– కుక్కల వెంకటేశ్వర్లురెడ్డి, రాజుబంగారుపాలెం, చినగంజాం మండలం, బాపట్ల జిల్లాపేదవారికి దక్కని భరోసానేను చిన్నాచితక పనులతో జీవనం సాగిస్తున్నా. గుండె నొప్పితో బాధపడుతూ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రికి పంపారు. పరీక్షలన్నింటికీ డబ్బు చెల్లించాలని చెప్పారు. చేతిలో డబ్బు లేదు. అనారోగ్యంతో ఉన్నా చేసేదిలేక వెనుదిరిగా. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు మాలాంటి పేదలకు భరోసా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. – వెంకటరెడ్డి, బొమ్మలసత్రం. నంద్యాలవైద్యం అందక మంచంపైనే..మాది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ముగ్గురు ఆడ పిల్లలను పెంచి పెళ్లి చేశాను. కొడుకు లారీ డ్రైవర్. అతడి సంపాదనే మాకు జీవనాధారం. నాకు మూడేళ్ల కిందట పక్షవాతం రాగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రిలో చికిత్స పొందా. కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో 15 రోజులకోసారి గ్రామానికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేసేవారు. ఇప్పుడు ఏడాదిన్నరగా ఊరికి వైద్యులు రావడం లేదు. మందులు కొనలేకపోయాను. మళ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆరోగ్యశ్రీలో చికిత్స కుదరదంటున్నారు. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోలేక మంచానికే పరిమితమయ్యా. – మేరమ్మ, గండేపల్లి, ఎన్టీఆర్ జిల్లా.డబ్బులు పడలేదని పంపించేశారునా భర్త పేరు శరవణరెడ్డి. వెనుకభాగంలో ఎముక అరిగిందని ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాం. 20 రోజులు ఉన్నాం. ఆరోగ్యశ్రీ డబ్బులు పడలేదని చెప్పి.. ఆపరేషన్కు రూ.50 వేలు కట్టాలన్నారు. మా దగ్గర అంత డబ్బు లేదని చెప్పాం. దీంతో మందులు రాసి డిశ్చార్జి చేశారు. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డుతో భరోసా దక్కడం లేదు. – దీపా, జంభూగోళంపల్లె, చిత్తూరు జిల్లా.ఆపరేషన్కు ముందే రూ. 8 వేలు ఖర్చునాకు కాలు విరగడంతో ప్రొద్దుటూరు నెట్వర్క్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి... ఎక్స్రే రాశారు. కట్టు కట్టారు. రూ.8 వేలు తీసుకున్నారు. మందులు కూడా డబ్బు పెట్టి కొన్నాం. ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇవ్వాలి కదా అని అడిగితే.. మీ ఫైల్ అప్రూవల్ కాలేదు. అన్నింటికీ డబ్బులు చెల్లించాల్సిందేనని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అదనపు ఖర్చులు ఉండేవి కావు. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగానే ఆపరేషన్ చేసేవారు. కానీ, ఇప్పుడు దోపిడీ జరుగుతోంది. అడిగినా పట్టించుకునే నాథుడు లేడు. – రామరాజు, తొండూరు మండలం, వైఎస్సార్ కడప జిల్లాఅదనంగా చెల్లించాల్సి వచ్చింది...మా నాన్నకు తుంటి ఎముక విరిగింది. నెల్లూరులోని కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే ఖరీదైన మందులంటూ రూ.20 వేలు అదనంగా వసూలు చేశారు. రశీదు కూడా ఇవ్వలేదు. మా అత్తకు కూడా కాలు విరిగి ఆస్పత్రికి వెళ్లాం. తొడ ఎముక చీలిపోయిందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని భయపెట్టారు. ఆరోగ్యశ్రీలో గిట్టుబాటు కావడం లేదంటూ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు అదనంగా డబ్బు వసూలు చేస్తున్నాయి. – బీబీజాన్, నెల్లూరు -
బాబు సర్కారు అప్పులు రూ.2.93 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పు...! భారీగా రుణాలు తీసుకుంటూ ప్రజలపై పెనుభారం..! సంపద సృష్టించడం దేవుడెరుగు... ఉన్న ఆస్తులు ప్రైవేటుపరం...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వ పనితీరు..! ఏడాదిన్నరలో ఏకంగా రూ.2.93 లక్షల కోట్లు అప్పులు చేసి ఆయన రికార్డుల మీద రికార్డు సృష్టిస్తున్నారు. రాష్ట్ర సర్కారు మంగళవారం బడ్జెట్ లోపల 7.54 శాతం వడ్డీతో రూ.4 వేల కోట్ల రుణం తీసుకుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్బీఐ సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపలే బాబు సర్కారు రూ.1,65,637 కోట్లు అప్పు చేసినట్లయింది. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పు చేశారు. ఇందులో కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో రూ.80,245 కోట్లు రుణం తీసుకున్నారు. మరోపక్క రాజధాని పేరుచెప్పి ప్రపంచ బ్యాంక్, జర్మనీ సంస్థ కేఎఫ్డబ్ల్యూ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పు చేసింది.సంపద లేదు అప్పే..!చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర సంపద పెంచడంలో, కొత్త సంపద సృష్టించంలో విఫలమైంది. భారీగా అప్పులు చేస్తూ ప్రజలపై కొత్తగా అప్పుల భారాన్ని మోపుతున్నారు. బడ్జెట్ లోపల, బయట ఇష్టానుసారం అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్లో కీలకమైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేయకుండా ఎగనామం పెట్టారు. చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించకపోగా... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తోంది. వాస్తవానికి అప్పులను ఆస్తుల కల్పనపై వెచ్చించాలి. ఇదే విషయాన్ని ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు పదేపదే నొక్కిచెప్పారు. కానీ, అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ రంగంలో ఆస్తులను కల్పించగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్పరం చేస్తోంది. మరోవైపు చేసిన అప్పులను మెడికల్ కాలేజీల్లో మిగిలిన నిర్మాణాలకు వ్యయం చేయడం లేదు.కళ్లు మూసుకుపోయిన ఎల్లోమీడియా...కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.93 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లేని అప్పులను కూడా ఉన్నట్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసింది పచ్చ మీడియా. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ దుష్ప్రచారం చేసింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగానే వైఎస్సార్సీపీ సర్కారు అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు కనిపించకపోతుండడం గమనార్హం. -
నేటి నుంచి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమలు
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటికి సంబంధించిన తుది నోటిఫికేషన్లు మంగళవారం ఇచ్చింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ 16 వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో వాటి సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు. పేరు అన్నమయ్యది.. జిల్లా మదనపల్లెదిరాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు. ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు. పేరు పోలవరం.. ఊరు రంపచోడవరంఅన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.తగ్గిన బాపట్ల ప్రాధాన్యంబాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు. చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది. -
సచివాలయాల ఉద్యోగులపై సర్కారు కక్ష
సాక్షి, అమరావతి: అత్తమీద కోపం దుత్తమీద చూపిన చందంగా.. ప్రజల మీద అసహనాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రదర్శిస్తోంది చంద్రబాబు సర్కారు. ‘మన మిత్ర’ పేరిట ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల గురించి రాష్ట్రంలోని 68 శాతం మందికి అవగాహన లేదని తేలడంతో.. అందుకు సచివాలయ ఉద్యోగులను బాధ్యుల్ని చేస్తోంది. ఈ ఏడాది జనవరి 30న ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం అమల్లో ఉన్నట్టు రాష్ట్రంలో మూడింట రెండొంతుల మందికి పైగా కనీసం తెలియలేదని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27,280 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ చేసింది.20 శాతం మందికే అవగాహన‘ప్రభుత్వం నిర్వహిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసా’ అంటూ ఐవీఆర్ఎస్ విధానంలో ప్రభుత్వం 20 లక్షల మందికి ఫోన్లు చేసి సమాచారం సేకరించింది. ఏకంగా 67.99 శాతం మంది ఆ కార్యక్రమం గురించి తమకు తెలియదని చెప్పారు. ఈ విధానం ఉన్నట్టు తెలుసని కేవలం 20.54 శాతం మంది మాత్రమే చెప్పారు. ఈ గణాంకాలను ఇటీవల ప్రభుత్వమే వెల్లడించింది. డిసెంబర్ 17, 18 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సందర్భంగా సర్వే వివరాలు బహిర్గతం కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో ఈ కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి ప్రచారం చేయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఇకనుంచి ప్రతి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలని సచివాలయాల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డిసెంబర్ 26వ తేదీ మొదటి శుక్రవారం 27,280 సచివాలయాల ఉద్యోగులు ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదని సచివాలయాల శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి 27,280 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. తెలియకపోవడానికి కారణాలివీ2019–24 మధ్య గ్రామ, వార్డు వలంటీర్ల ఆధ్వర్యంలో సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల గడపవద్దే అందేవి. ఆ కాలంలో దాదాపు 10 కోట్లకు పైగా సేవలు ప్రజలు ఇంటినుంచే పొందారు. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే.. సీఎం చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు. వలంటీర్ల సేవల స్థానంలో మనమిత్ర యాప్ పేరుతో వాట్సాప్ గవర్నెర్స్ సేవల్ని ప్రవేశపెట్టారు. ఈ సేవలు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండాలి. నిరుపేదలు, సామాన్యుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. కొందరి వద్ద ఉన్నా వారు ఇంటర్నెట్ సేవల్ని పొందడం లేదు. ఒకవేళ ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్నా మనమిత్ర యాప్ ఉపయోగించడం, సేవలు పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తమ ఫోను ద్వారా ఆ యాప్లో అప్లోడ్ చేసే పరిజ్ఞానం కూడా చాలామందికి తెలియదు. మరోవైపు తోడు స్మార్ట్ ఫోన్లలో యాప్లు వినియోగిస్తే మోసాలకు గురవుతామన్న భయాందోళనలు చాలామందిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, సామాన్యులకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఈ లోపాలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులపై చూపాలన్న పాలకుల నిర్ణయాన్ని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.డొల్లతనం బట్టబయలుమన మిత్ర యాప్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా 20 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంటే కేవలం సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మాత్రమే 33 నుంచి 35 శాతం మంది అవగాహన ఉందని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. యాప్ వాడటం రాదని 37.42 శాతం మంది వెల్లడించగా.. 32.13 శాతం మంది యాప్ వాడితే ఎక్కడ డబ్బులు పోతాయన్న భయంతో వినియోగించడం లేదని చెప్పారు. 30.45 శాతం మంది తమకు స్మార్ట్ఫోన్ లేదని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. తొలుత 161 సేవలు ప్రవేశపెట్టామని.. వీటిని ఇప్పుడు 700 వరకు పెంచామని ప్రతి వేదికపై సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. ఇది కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా 21 శాఖలకు చెందిన 1.20 లక్షల మంది ఉద్యోగులతో ప్రచారం చేపట్టారు. అయినా ప్రయోజనం కనిపించే అవకాశం లేదని తేలిపోవడంతో.. దీనంతటికీ వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందే కారణమని చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పోలవరం.. హత‘నిధి’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2026, మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం అడ్వాన్సు రూపంలో రెండు విడతలుగా రూ.5,052.71 కోట్లను కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర జల్ శక్తి శాఖ నిర్దేశించిన మేరకు ఎస్ఎన్ఏ(సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనుల కోసమే వ్యయం చేయాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖ ఎత్తిచూపినప్పుడు మాత్రమే ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేస్తోంది. దీంతో.. గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.5,052.71 కోట్లలో ఇప్పటిదాకా రూ.4,352.71 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.700 కోట్లను ఇప్పటికీ ఎస్ఎన్ఏ ఖాతాలో బాబు ప్రభుత్వం జమ చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన రూ.5,936 కోట్లు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఆ నిధుల్లో రూ.3,034 కోట్లు మాత్రమే విడుదల చేయాలంటూ కేంద్ర జల్ శక్తి శాఖకు పీపీఏ ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు సరిపోతాయని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా మిగతా నిధులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని సూచించింది.నాడు రిజర్వాయర్.. నేడు బ్యారేజ్పోలవరం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. 2004–05లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆమోదించిన ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసి.. కుడి, ఎడమ కాలువ కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించి 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే లక్ష్యంతో చేపట్టింది. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, అప్రోచ్ చానల్, స్పిల్ చానల్, ఫైలట్ ఛానల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, గ్యాప్–1లో డయాఫ్రం వాల్, జలవిద్యుత్ కేంద్రంలో అత్యంత కీలకమైన పనులను పూర్తి చేసింది. చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం చంద్రబాబు సర్కారు 2014–19 మధ్య గోదావరి ప్రవాహాన్ని మళ్లించేసేలా స్పిల్ వే, స్పిల్ చానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే.. గ్యాప్–2లో డయాఫ్రం వాల్ వేయడం ద్వారా చారిత్రక తప్పిదం చేసింది. దీంతో వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్ గోదావరి వరదల ఉద్ధృతికి దెబ్బతింది. ఇక గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం వరద ఉద్ధృతికి కోతకు గురై ధ్వంసమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యాప్–2లో కోతకు గురైన ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చింది. డయాఫ్రం వాల్కు మరమ్మతు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్నది కేంద్రం అప్పట్లో తేల్చలేదు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే.. 2022–23 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసేదని ఆ ప్రాజెక్టు పనులను ఆది నుంచీ నిశితంగా పర్యవేక్షించిన అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే దానికి టీడీపీ మంత్రులు అంగీకరించడం.. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం అందరినీ విస్మయపరిచింది. దీని వల్ల డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 115.44 టీఎంసీలకు తగ్గిపోతుంది. దీని వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించవచ్చునని అధికారులు చెబుతున్నారు. పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసిన ఘనత చంద్రబాబు సర్కారుకే దక్కిందని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19 నెలల్లో ఒక్క ఇల్లూ పూర్తి చేయని బాబు సర్కారుపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లను మంజూరు చేయడానికి 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. భారీ వరదలు వంటి విపత్తులు ఉత్పన్నమైతే ప్రాజెక్టును పూర్తి చేసే గడువును మరో ఏడాది అంటే 2027 మార్చి నాటికి పొడిగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి వీలుగా 2024–25లో రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేసింది. విదేశీ నిపుణుల కమిటీతో ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించి.. సత్వరమే ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించడంలో విఫలమైంది. ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ పనులు నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికీ సాగడం లేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం కోసం పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటినీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని ఉంటే.. నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు ఈ పాటికే కొలిక్కివచ్చేవని అధికారవర్గాలే చెబుతుండటం గమనార్హం. -
వైకుంఠవాసా... శ్రీవేంకటేశా
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు. అలాగే, శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఓ దాత ఏర్పాటు చేసిన శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు భక్తులను ఆకట్టుకుంది. కాగా, వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది. రామతీర్థంలో వైభవంగా గిరి ప్రదక్షిణనెల్లిమర్ల రూరల్: ఆంధ్రా రెండో భద్రాద్రిగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీరామ నామస్మరణతో బోడికొండ (నీలాచల పర్వతం) చుట్టూ 8 కిలోమీటర్ల మేర నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారికి బాల¿ోగం, సుప్రభాత సేవ అనంతరం ఉత్తరద్వారం నుంచి శ్రీ సీతా సమేత లక్ష్మణ స్వామివారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కోదండరామ స్వామివారి మెట్లను పసుపు, కుంకుమలతో అలంకరించి మెట్లోత్సవాన్ని జరిపించారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణ చేపట్టి 1,500 అడుగులు ఎత్తులో బోదికొండపై కొలువైన శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీల సేవలో తరించిన టీటీడీ» సామాన్య భక్తులను పక్కనపెట్టి.. » 6 గంటలకుపైగా వీఐపీలకే అవకాశం » వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా విచ్చేసిన సినీ నటులుసాక్షి టాస్క్ ఫోర్స్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీఐపీల సేవలో తరించారు. మొదటి నుంచి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచి్చన టీటీడీ అధికారులు.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా చేశారు. 6 గంటల పాటు వీఐపీల సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ద్వార దర్శనం కోసం మొదటి మూడురోజులు కేవలం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి అవకాశం కల్పించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమలలో సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం వేకువజామున ప్రారంభ సమయం 12.05 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభం కాగా.. 1.15 గంటలకు వీఐపీలను అనుమతించారు. సాధారణంగా అయితే వీఐపీలకు తెల్లవారుజామున 4.30 గంటల వరకు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ మంగళవారం నాటికి ఏకంగా 6,800 మంది వీఐపీలకు టికెట్లు కేటాయించడంతో ఉదయం 7.30 గంటలు వరకు వారే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ చర్యలతో విసుగు చెందిన అనేకమంది భక్తులు, స్థానిక తిరుపతి వాసులు టీటీడీ అనుబంధ ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఈసారి వైకుంఠ దర్శనానికి మాజీ ఎమ్మెల్యేలను తిరస్కరించడంతో టీటీడీ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేని అనేకమంది సినీనటులు మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు తిరుమలలో కూటమి నేతల హవా కనిపించింది. ఎమ్మెల్యేలు కాని వారికి సైతం వైకుంఠ ద్వారదర్శనం లభించింది. సింహగిరీశా..శరణు శరణుముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై వేంజేసి భక్తులకు దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి రాత్రి ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్తర రాజగోపురంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. – సింహాచలంచిన వెంకన్న నమోస్తుతే! ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిన వెంకన్న ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు నేత్రపర్వమైంది. తెల్లవారుజామున 4.15 గంటలకు అర్చకులు ఆలయ ఉత్తర ద్వారాలను తెరచి, వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం భక్తులకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు, స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. – ద్వారకాతిరుమల కైలాసవాసా.. పాప వినాశ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు మంగళవారం ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా ఆశీనులను చేసి విశేష పూజాదికాలు జరిపించారు. అనంతరం విశేషపూజాదికాలు, రావణవాహన సేవ చేపట్టారు. ఉత్సవమూర్తులను ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకి తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను తిరిగి ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేయించారు. గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించారు. – శ్రీశైలం టెంపుల్ శ్రీవారి సేవలో ప్రముఖులువైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. – తిరుమల -
‘కరెంట్ కట్’ పైనా డైవర్షనే
సాక్షి, అమరావతి: ప్రసిద్ధిగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని తొలిసారిగా చీకట్లు అలముకున్నాయి. ఈ నెల 27న దాదాపు మూడున్నర గంటలపాటు దుర్గ గుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జరిగింది చిన్న పొరపాటు కాదు. చేసింది ప్రైవేటు సంస్థలో.. వ్యక్తులో కాదు. విజయవాడ ప్రధాన కేంద్రంగా సీఆర్డీఏతో పాటు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఏపీ సీపీడీసీఎల్. అదీగాక సాక్షాత్తూ కనకదుర్గ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడమంటే అదేదో కిందిస్థాయి సిబ్బంది తీసుకునే నిర్ణయం కాదు. ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. కానీ.. మాకేం తెలియదంటూ ఎవరికివారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో పాటు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం పరువు పోయింది. నిర్లక్ష్యంపై 4 రోజులకు కళ్లు తెరిచిన సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రిని వివరణ కోరడంతో పాటు ఈ విషయాన్ని ‘డైవర్షన్’ చేయాలని ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి గొట్టిపాటి మంగళవారం దుర్గగుడి ఈవో, విద్యుత్ అధికారులతో మంత్రి సమావేశమైన అనంతరం మీడియా ముందుకు వచ్చారు. అధికారులపై నెపం దుర్గగుడిలో విద్యుత్ అంతరాయం అంశాన్ని కొందరు రాజకీయం చేయడం దురదృష్టకరమని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ గుడిలో సుమారు 15 నిమిషాల పాటు (వాస్తవంగా 3 గంటలు) విద్యుత్ అంతరాయం కలగడానికి గల కారణాలపై దేవదాయ, విద్యుత్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లే విద్యుత్ సరఫరా నిలిచి పోయిందన్నారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. జనవరి 6, 7 తేదీల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మరోసారి దుర్గ గుడి ఈవో, ముఖ్య అధికారులతో కలిసి సమావేశం కానున్నట్టు ప్రకటించారు.పెద్దలకు తెలిసే.. దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంలో తమ తప్పేమీ లేదంటున్న ప్రభుత్వం అధికారుల మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్లో దసరా ఉత్సవాలు అనంతరం దేవస్థానానికి చెందిన పది సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అప్పుడే సీఎంగానీ, మంత్రిగానీ దృష్టి సారించి ఉంటే ఇప్పుడు మరోసారి ఆ పరిస్థితి వచ్చేది కాదు. కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్లిన ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డికి సైతం ఆలయ అధికారులు సమస్యను విన్నవించి పరిష్కరించాలని కోరారు. ఆయన ఏమాత్రం పట్టించుకున్నా ఇప్పుడిలా విద్యుత్ సరఫరా ఆగేది కాదు. అదీగాక దుర్గగుడికి విద్యుత్ సరఫరా ఆపడమంటే అది కచ్చితంగా డిస్కం సీఎండీకి, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా జరిగే అవకాశం లేదు. అప్పుడు నిర్లక్ష్యంగా ఉండి.. తీరా అభాసుపాలవ్వడంతో అధికారుల సమన్వయ లోపం వల్లే పొరపాటు జరిగిందంటూ తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతిక వివరాలేవి? దేవస్థానం పరిధిలో ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేస్తున్నారు. దీనికి కచ్చితంగా నెట్ మీటరింగ్ విధానాన్ని అనుసరించాల్సి ఉంది. అది సక్రమంగా జరిగితే ఆ కేంద్రం నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్కు బదులుగా డిస్కం నుంచి విద్యుత్ను వినియోగించుకున్నప్పటికీ ఎలాంటి విద్యుత్ బిల్లు చెల్లించే అవసరం రాకపోవచ్చు. కానీ.. ఏవో సాంకేతిక కారణాలను సాకుగా చూపించి రూ.3.08 కోట్ల బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదేమీ గుట్టుగా ఉండే విషయం కాదు. ప్రతీదీ అధికారికంగా ఆన్లైన్లో నమోదై ఉండాల్సిందే. కానీ.. ఇంతవరకూ బకాయిలకు సంబంధించిగానీ, నెట్ మీటరింగ్కు సంబంధించిగానీ అధికారిక పత్రాలను, వివరాలను విద్యుత్ శాఖ బయటపెట్టలేదు. మరోవైపు మూడున్నర గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతే కేవలం 15 నిమిషాలేనంటూ విద్యుత్ శాఖ మంత్రి అసత్యాలు వల్లె వేస్తున్నారు. -
మరో భారీ అప్పు తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంం మరో భారీ అప్పు తెచ్చింది. తాజాగా సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల అప్పు చేసింది చంద్రబాబు సర్కారు. మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం మరో భారీ అప్పును తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ వేలం ద్వారా అప్పు సమీకరించింది. గడిచిన 18 నెలల్లో రూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఫలితంగా అప్పుల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది చంద్రబాబు సర్కారు.చంద్రబాబు ప్రభుత్వం ఈనెల ఆరంభంలో బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిందిఇలా బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది.కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారురూ. 2.77 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు. ఉండవల్లి నుంచి హైదరాబాద్కు.. అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే.. సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్ జగన్ పరామర్శ
ఆలూరు రూరల్: హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆర్యోగంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అల్లోపతి.. ఆయుర్వేదం.. చేయవద్దు మిక్సోపతి
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు (సర్జరీలు) చేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సైతం ప్రకటించింది. ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్ర చికిత్సలు స్వతంత్రంగా చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఈ నెల 23న రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు.వాటిలో 39 శల్యతంత్ర(సాధారణ శస్త్ర చికిత్సలు), 19 శలాక్య తంత్ర(ఈఎన్టీ, నేత్ర, దంత వంటి ఇతర) శస్త్రచికిత్సలు ఉన్నాయి. పురాతన వైద్య విధాన ప్రక్రియలను ఆధునిక చికిత్సలతో అనుసంధానం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్రంలోనే కాకుండా, జాతీయ స్థాయిలో అల్లోపతి వైద్యులు మండిపడుతున్నారు. స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలిఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ పి.భన్సాలీ ఇప్పటికే ప్రకటించారు. తమకు ఆయుర్వేద, హోమియోపతి వైద్య ప్రక్రియలపై గౌరవం ఉందన్నారు. ఆయుర్వేదం దాని అసలైన, స్వచ్ఛమైన రూపంలోనే ప్రోత్సహించాలని, ఆధునిక వైద్యంతో ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. సరైన శిక్షణ లేని వారు సర్జరీలు చేస్తే రోగుల ప్రాణాల మీదకు వస్తుందని ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.అల్లోపతి, ఆయుర్వేద, వివిధ వైద్య విధానాలను కలిపి మిక్సోపతి చేస్తే వైద్య ప్రమాణాలు దెబ్బతింటాయని తెలిపింది. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ 2020లోనే మార్గదర్శకాలు ఇచ్చింది. అప్పట్లోనే దీన్ని అల్లోపతి వైద్యులు దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు సైతం చేశారు. సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. వచ్చే నెల ఎనిమిదో తేదీన విచారణకు రానుందని ఐఎంఏ చెబుతోంది. అనుసంధానం చేయవద్దుఅల్లోపతి, ఆయుర్వేదం హోమియోపతి వైద్య విధానాలను ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో తప్పులేదు. అలా కాకుండా ఒకదానితో మరొకటి అనుసంధానం చేసి మిక్సోపతి చేయవద్దు. ఇలా చేస్తే వైద్యం నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మోడ్రన్ మెడిసిన్ వైద్యులకు అనాటమీ, పథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీలో నైపుణ్యం ఉంటుంది. వీటిపై ప్రాచీన వైద్య విద్య అభ్యసించిన వారికి అవగాహన తక్కువ ఉంటుంది. ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని అనుసంధానం చేయడం సరికాదు. – డాక్టర్ ఎస్.బాలరాజు, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు -
నేరం రుజువు కాకముందే ఖాకీల శిక్ష
సాక్షి, అమరావతి: ఇప్పటికే బరితెగించి వ్యవహరిస్తున్న ఏపీ పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం నిర్భీతిగా బేఖాతరు చేసే స్థాయికి చేరారు. రెడ్బుక్ రాజ్యాంగ అరాచకాలకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా రాజ్యాంగ ధర్మాన్ని నిస్సిగ్గుగా పోలీసు శాఖ విస్మరిస్తోంది. నిందితుల అరెస్టు, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై స్వయంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం విస్మయపరుస్తోంది. ఆయా అంశాలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఏమిటీ?.. ఏపీ పోలీసుల బరితెగింపు ఏ స్థాయికి చేరిందన్న అంశాలు పరిశీలిస్తే...నిందితులను పరేడ్ చేయించకూడదుడీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం ఏదైనా కేసుల్లో నిందితులను అరెస్టు విషయంలో పోలీసులు కచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. నిందితులను అరెస్టు చేయడం, న్యాయస్థానంలో హాజరుపరిచే ప్రక్రియలో అనుసరించాల్సిన విధి విధానాలను నిర్దేశించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం.. ⇒ ఒక కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారు నేరస్తులుగా భావించలేం. నేరం నిరూపితం కానంతవరకు నేరస్తులు కారు.⇒ ఇక నిందితుల సామాజిక గౌరవానికి పోలీసులు భంగం కలిగించ కూడదు. వారి గౌరవాన్ని పోలీసులు కచ్చితంగా పరిరక్షించాలి. అరెస్టు చేసిన నిందితులను బహిరంగంగా నడిపిస్తూ పరేడ్ చేయించకూడదు. వారిని ప్రజలకు కనిపించేలా ప్రదర్శించకూడదు. ⇒ నిందితులను సోదా చేసే ప్రక్రియ గౌరవప్రదంగా ఉండాలి. వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించకూడదు. ⇒ అరెస్టు సమయంలో పోలీసులు బల ప్రయోగం చేయడం సరికాదు. ⇒ నిందితులు తప్పించుకునేందుకు యత్నిస్తే, గాయాలు కాకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాలి. అంతేగానీ అరెస్టు కోసమని చెప్పి గాయపరచ కూడదు.సుప్రీం కోర్టు చెప్పినా లెక్క చేయం: ఏపీ పోలీసుల నిర్భీతి నిందితుల గౌరవానికి భంగం కలిగించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము లెక్కచేయబోమంటూ బాబు సర్కార్ హయాంలో ఏపీ పోలీసులు బరితెగిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కక్ష పూరితంగా అరెస్టు చేసిన పలువురు నిందితులను రోడ్డుపై నడిపించి పరేడ్ చేయించడం పోలీసుల దాషీ్టకానికి నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సంప్రదాయ జాతర తరహాలో నిర్వహించిన అభిమానులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. నరికిన పొట్టేళ్ల తలలను దండగా చేసి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫ్లెక్సీకి వేసి వేడుకలు చేసిన టీడీపీ అభిమానులను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ సాధారణ జాతర శైలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించిన వైఎస్సార్సీపీ అభిమానులపై మాత్రం కక్ష గట్టారు. శ్రీసత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి తదితర జిల్లాల్లో ఏకంగా 13 కేసులు నమోదు చేశారు. ఆ కేసుల్లో నిందితులుగా ఉన్న యువకులను అరెస్టు చేశారు. అంతేకాదు...వారిని తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించారు. తద్వారా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. నిందితుల సామాజిక గౌరవానికి భంగం కలిగించారు. వారి వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాశారు. మొత్తం మీద సుప్రీంకోర్టు ఆదేశాలంటే తమకు ఏమాత్రం లెక్క లేదని తేల్చి చెప్పారు. వాహనాలు లేవు.. అందుకే నడిపించాం: డీజీపీ గుప్తా బాధ్యతా రహిత స్పందన నిందితుల గౌరవానికి భంగం కలిగించ కూడని.. వారిని రోడ్డుపై నడిపిస్తూ పరేడ్ నిర్వహించకూడదని సుప్రీంకోర్టు డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ‘సుప్రీంకోర్టు చెబితే మాత్రం మేమేందుకు చేస్తాం’ అన్నట్టుగా సాక్షాత్తూ ఏపీ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా స్పందించడం విభ్రాంతి కలిగిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై మీడియా ప్రతినిధులు ఆయనను సోమవారం ప్రశ్నించారు. దీనిపై డీజీపీ పూర్తి బాధ్యతారహితంగా స్పందించారు. ‘నిందితులను న్యాయస్థానంలో హాజరు పరిచేందుకు పోలీసుల వద్ద వాహనాలు లేవు. అందుకే నడిపించి తీసుకువెళ్లాం’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.తద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర పోలీసు శాఖకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ చీఫ్ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. ఇక ఇతర పోలీసు అధికారుల ఎలా వ్యవహరిస్తారన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో సామాన్యుల గురించి ఎందుకు పట్టించుకుంటారని, పౌర హక్కుల మాటేమిటని మేధావులు, ప్రజాస్వామ్య హితైషులు ప్రశి్నస్తున్నారు. డీజీపీ గుప్తా ఒక దుస్సంప్రదాయానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అంతటా దాడులూ... దౌర్జన్యాలే..
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్బుక్ పాలనలో రాష్ట్రం దాడులు, దౌర్జన్యాలతో అట్టుడుకుతోంది. ప్రధానంగా భౌతికదాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 2025 సంవత్సరంలో శాంతిభద్రతల పరిస్థితిని వివరిస్తూ పోలీసు శాఖ వార్షిక నివేదికను సోమవారం డీజీపీ హరీశ్కుమార్గుప్తా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, పరిస్థితి అంతా బాగుందని చెప్పేందుకు గణాంకాలతో కనికట్టు చేసేందుకు ఆ నివేదికలో యత్నించారు. కానీ ఎంతగా దాచాలన్నా పోలీసు శాఖ వైఫల్యం మాత్రం బట్టబయలైంది. 2024తో పోలిస్తే 2025లో రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతోపాటు ఆర్థిక నేరాలు పెరిగాయని ఆ నివేదికే స్పష్టం చేసింది.పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలుటీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తోంది. అధికార టీడీపీ కూటమి నాయకుల అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లు, సామాజిక ఉద్యమకారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు చాలావరకు కేసులు నమోదు చేయడం లేదు. అయినా సరే 2025లో దాడులు, దౌర్జన్యాల కేసుల సంఖ్య పెరగడం గమనార్హం.బాధితుల ఫిర్యాదులు అన్నింటిపైనా విచారణ చేసి కేసులు నమోదు చేసి ఉంటే రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి మరింతగా వెల్లడయ్యేది. రాష్ట్రవ్యాప్తంగా 2024లో దాడులు, దౌర్జన్యాల కేసులు 137 నమోదు కాగా... 2025లో ఆ సంఖ్య 146కు పెరిగింది. భౌతిక దాడుల కేసులు 6.6శాతం పెరిగినట్టు పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని అంతం చేయడమే లక్ష్యంగా అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. 2024లో 1,403 హత్యాయత్నం కేసులు నమోదు కాగా... 2025లో హత్యాయత్నం కేసులు 1,566కు పెరగడం గమనార్హం. హత్యాయత్నం కేసులు 11.6 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. భారీగా పెరిగిన ఆర్థిక నేరాలుచంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక నేరాలు అమాంతంగా పెరిగాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్న పోలీసు పెద్దలు.. రాష్ట్రంలో ఆర్థిక నేరాల అదుపుపై ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. 2024లో 7,667 ఆర్థిక నేరాల కేసులు నమోదు కాగా... 2025లో ఆ కేసుల సంఖ్య 8,034కు పెరిగింది. రాష్ట్రంలో ఆర్థిక నేరాలు 4.78 శాతం పెరిగాయని పోలీసు శాఖ నివేదిక వెల్లడించింది. ఇక పగటిపూట దొంగతనాలు కూడా పెరిగాయి. 2024లో 824 కేసులు నమోదు కాగా, 2025లో ఆ కేసుల సంఖ్య 836కు చేరింది.లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం⇒ మహిళల భద్రతపై జనరలైజ్ చేసి మాట్లాడటం సరికాదు⇒ పవన్కళ్యాణ్ వ్యాఖ్యలకు డీజీపీ కౌంటర్‘తిరుపతికి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం సాధ్యమయ్యేపనా... వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి’ అని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల–తిరుపతిలలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో తొక్కిసలాటపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... లక్షల్లో భక్తులు వస్తుంటే భద్రత కల్పించడం, తగిన ఏర్పాట్లు చేయడం పూర్తిగా సాధ్యం కాదని డీజీపీ బదులిచ్చారు. అందుకు చాలా కారణాలు ఉంటాయని, పోలీసుల వైఫల్యంగానే చూడకూడదన్నారు. ఇక భద్రత కోసం మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను డీజీపీ గుప్తా వ్యంగ్యంగా తిప్పికొట్టారు.‘మహిళా భద్రతలో పోలీసు వైఫల్యం గురించి జనరలైజ్ చేసి చెప్పడం సరి కాదు. నిర్దిష్టంగా చెప్పాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. నేరాలను కట్టడి చేస్తున్నామని చెప్పారు. 2024లో రాష్ట్రంలో 1,10,193 కేసులు నమోదు కాగా, 2025లో 1,03,397 కేసులకు తగ్గాయని తెలిపారు. నేరాలు 6 శాతం తగ్గాయన్నారు. నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025లో 153 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. త్వరలో ఐపీఎస్ అధికారుల జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఐజీలు శ్రీకాంత్, రవికృష్ణ, పాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బాబు.. బాదుడే బాదుడు
విద్యుత్ చార్జీల వీర బాదుడు...భూముల క్రయవిక్రయాలపై రిజిస్ట్రేషన్ చార్జీల అదనపు మోత... తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ చార్జీల భారం! ఇవన్నీ చాలదన్నట్లు వాహనాల కొనుగోలుపై భారీగా సెస్ విధింపుతో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్లీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. వివిధ పేర్లతో అన్ని వర్గాల వారిపై పన్నుల మోత మోగిస్తున్న ఆయన ఈసారి వాహనదారులను లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాదిన్నర కిందట అధికారంలోకి వచ్చింది మొదలు ప్రజలపై ఎడాపెడా పన్నుల బాదుడే లక్ష్యంగా సాగుతోంది బాబు ప్రభుత్వ పాలన. అదనపు పన్నుల మోతతో వీలున్న ప్రతి రంగంలోనూ జనం జేబులకు చిల్లులు పెడుతూ వస్తున్నప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. తాజాగా మంత్రివర్గ సమావేశం వేదికగా మరో రుసుముల కొరడా ఝళిపించారు. తన మార్కు బాదుడుకు ఇదే నిదర్శనం అని చాటారు. సాక్షి, అమరావతి: అంతుపొంతు లేకుండా సాగుతున్న చంద్రబాబు సర్కారు పన్నుల మోత రాష్ట్ర ప్రజలపై పెనుభారంగా మారుతోంది. ఈ క్రమంలో ఆర్థికంగా కుంగదీసే మరో బాదుడుకు సిద్ధమైంది. వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరటను రాష్ట్ర ప్రజలకు లేకుండా చేస్తోంది. ‘‘రహదారి భద్రత సెస్’’ పేరిట ఏటా ఏకంగా రూ.270 కోట్లు బాదేయనుంది. యథాప్రకారం ఇందులో సరికొత్త దోపిడీకి తెరవెనుక పావులు కదుపుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే వాహనాలపై 10 శాతం రహదారి భద్రత సెస్ వేయాలని బాబు సర్కారు నిర్ణయించింది. వాహనాల లైఫ్ ట్యాక్స్లో ఈ సెస్ విధించాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించింది. అందుకోసం ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించింది. దాదాపు పదేళ్లుగా వాహనాల లైఫ్ ట్యాక్స్లో 28 శాతం జీఎస్టీ విధించేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను సరళం చేసింది. వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో కాస్త ఊరట లభించిందని రాష్ట ప్రజలు భావించారు. కానీ, ఈలోపే వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్తో చంద్రబాబు పన్నుల కొరడా ఝళిపించారు.⇒ ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలు ప్రజలపై పడనున్న భారీ ఆర్థిక భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 73 వేల వాహనాలను విక్రయిస్తారు. వాటిపై లైఫ్ ట్యాక్స్లో 10 శాతం సెస్ వేస్తే నెలకు రూ.22.50 కోట్లు కానుంది. ఆ ప్రకారం వాహన కొనుగోలుదారులపై ఏటా రూ.270 కోట్లు పన్ను మోత మోగనుంది. స్కూటర్ల నుంచి లారీల వరకు మున్ముందు వాహన విక్రయాలు పెరిగితే అందుకు తగినట్లే పన్ను భారం పెరుగుతుంది.రహదారి భద్రత ముసుగే... దోపిడీయే అసలు కథచంద్రబాబు ప్రభుత్వం వేసిన రహదారి భద్రత సెస్ అనేది దోపిడీ ఓ ముసుగు మాత్రమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగంటే... సెస్ బాదుడు ద్వారా వచ్చిన నిధులను ఎలా వెచ్చిస్తామన్నది మంత్రులు వెల్లడించలేదు. అంటే, సెస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని దారిమళ్లిస్తారని పేర్కొంటున్నారు. రహదారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందుకోసం ఖర్చు చేయని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హోం, వైద్యఆరోగ్య, ఆర్అండ్బీ శాఖల సంయుక్త కమిటీల ద్వారా నిధులను వెచ్చించాల్సి ఉండగా, ఆ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించడమే లేదు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం సెస్ పేరిట ఏటా వసూలు చేసే రూ.270 కోట్లను సద్వినియోగం చేస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకు అడ్డదారిలో కాంట్రాక్టు పనుల పేరిట దోచిపెడతారని ఆరోపిస్తున్నారు.రిజిస్ట్రేషన్ల చార్జీలు 50 శాతం పెంపుచంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ప్రజలపై సుమారు రూ.వెయ్యి కోట్ల భారంపడింది. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల విలువలను 50 నుంచి 60 శాతం పెంచారు. అర్బన్ ప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువను అమాంతం పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలు దండుకుంటున్నారు. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలకుండా విలువను పెంచారు. ఫలితంగా అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, ఇళ్లు కొన్నవారిపై భారంపడింది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం భూముల క్లాసిఫికేషన్లను మార్చేశారు. దీంతో ఏరియాను బట్టి కాక స్థలాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిపోయాయి. గతంలో చార్జీలు రూ.2 లక్షలు ఉండగా, రూ.50 వేల వరకు పెరిగాయి.బాబు వస్తూనే బాదుడు మొదలు‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదు. అవసరమైతే తగ్గిస్తాం. వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం’’ అంటూ ప్రగల్భాలు పలికారు చంద్రబాబు. ఇంతలా నమ్మబలికిన ఆయన అధికారం చేతికి రాగానే అసలు స్వభావం బయటపెట్టుకున్నారు. బాబు వస్తూనే రూ.15,485.36 కోట్ల భారీ భారాన్ని ప్రజలపై వేసి చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది చివరి నుంచే రూ.6,072.86 కోట్లను వసూలు చేస్తుండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది వసూలు చేసిన రూ.2,787.18 కోట్లలో రూ.1,863.64 కోట్లకు ఏపీఈఆర్సీ అనుమతి లభించింది. అంటే, బాబు ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ఏకంగా రూ.17,349 కోట్ల భారం ప్రజలపై మోపినట్లైంది. దీంతో ప్రజలకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. రూ.వేలల్లో వస్తున్న బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు, సరికదా ఇంకా చార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వాడిన విద్యుత్కు సమానంగా అదనపు చార్జీలు పడుతున్నాయి. ఇంతలేసి బిల్లులు కట్టలేం బాబూ అంటూ జనం గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.తాగునీటిపై యూజర్ చార్జీలు అనుకున్నప్పుడు అమలు!గ్రామాల్లో ప్రజలు తాగేందుకు రక్షిత పథకాల ద్వారా సరఫరా చేసే నీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏడాదికి రూ.1680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి, అందులో రూ.1,036.97 కోట్లను ప్రజల నుంచి యూజర్ చార్జీలుగా పిండుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం తెలిపి, ‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ రూపొందించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిప్రకారం రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగేచోట ఒక్కో వ్యక్తిపై నెలకు రూ.26.66 చొప్పున ఏడాదికి రూ.320 భారం మోపనున్నారు. గ్రామ పరిధిలో అంతర్గతంగా చిన్న రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.20 వంతున ఏడాదికి రూ.240 యూజర్ చార్జీ వసూలు చేయాలని నిర్ణయించారు. కాగా, ‘‘ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’’ పాలసీకి యూజర్ చార్జీల వసూలు ఎప్పటినుంచి అన్నది ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, నోటిఫికేషన్ ప్రభుత్వ జీవో రూపంలో జారీ అయినందున ఎప్పుడనుకుంటే అప్పటినుంచి యూజర్ చార్జీల వసూలు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
బాబు సర్కారు దోపిడి ‘పర్వం’
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసి ఉత్సవాలు, ఈవెంట్ల పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపింది. అధికారం చేపట్టినప్పటి నుంచి భారీగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ తన అనుయాయ సంస్థలకు భారీగా దోచిపెడుతోంది. ఇప్పటికే శక్తి విజయోత్సవ్, వరల్డ్ టూరిజం డే పేరిట భారీ అవినీతికి పాల్పడిన సర్కారు తాజాగా అమరావతిృఆవకాయ అంటూ మరో లూటీ ఈవెంట్కు సిద్ధమవు తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడింది. ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో, తీర ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. వీటిని అభివృద్ధి చేయకుండా ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా భూ పందేరాలు, ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడంతోనే పబ్బం గడిపేసింది. తమ బినామీ సంస్థలు, అనుయాయులకు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్ను వంతులు వేసి మరీ కేటాయించి అప్పనంగా దోచిపెడుతోంది. తాజాగా ‘అమరావతి–ఆవకాయ’ అంటూ హడావుడి చేస్తోంది.ఈ వేడుకల నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ.. పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేయడంలో చూపించట్లేదు. ఇప్పటివరకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమంటూ భారీ స్థాయిలో పర్యాటక రోడ్షోలు, పండుగలు, ఫెయిర్స్ నిర్వహణకు ఏకంగా రూ.150 కోట్లు ఖర్చు చేస్తుండడం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం పెట్టిన ఈ బడ్జెట్.. ఒక వార్షిక ఏడాదిలో ఏపీటీడీసీ నికర రాబడులతో సమానంగా ఉండటం గమనార్హం. అప్పుడు శక్తి విజయోత్సవ్.. ఇప్పుడు ఆవకాయ్! చంద్రబాబు సర్కారు జనవరిలో విజయవాడలో ‘అమరావతి–ఆవకాయ్’ పేరుతో ఉత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. మూడు రోజుల ప్రోగ్రామ్కి ఏకంగా రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించింది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవాన్ని చాటేందుకు ఉత్తరాదికి చెందిన ‘టీమ్ వర్క్ ఆర్ట్స్’కు బాధ్యతలిచ్చింది. అయితే, టెండర్లు లేకుండా ఎంప్యానల్ చేసిన సంస్థల్లో ఒక సంస్థకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది.గతంలోనూ ఇదే రీతిలో 2024 దసరా పండుగ సమయంలో శక్తి విజయోత్సవ్ పేరుతో తూతూ మంత్రంగా చేపట్టి ఏకంగా రూ.7 కోట్లు తమ అనుయాయులకు దోచిపెట్టింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగం చేయడంతో ఈ ప్రోగ్రామ్కు బడ్జెట్ అంచనాలకు మించి బిల్లులు చెల్లించింది. తొలుత శక్తి విజయోత్సవానికి రూ.2 కోట్లకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగా.. ఆ తర్వాత మరో రూ.5 కోట్లు అదనంగా కేటాయిస్తూ మొత్తం రూ.7 కోట్లకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతా ప్లాన్ ప్రకారమే.. గతంలో శక్తి విజయోత్సవ్ను హైదరాబాద్కు చెందిన ఓ ఈవెంట్ కంపెనీకి డమ్మీ టెండర్ల ద్వారా కాంట్రాక్టు అప్పగించింది. సదరు కంపెనీ 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ఇలాంటి ఈవెంట్లు ఎన్నో చేసింది. సదరు కంపెనీ ఇటీవల ఎన్నికల్లో అధికార పార్టీకి ఫండింగ్ చేయడంతో.. అందుకు లబ్ధి చేకూర్చేందుకు పర్యాటక శాఖలో శక్తి విజయోత్సవ్ షోల నిర్వహణ అప్పగించింది. వాస్తవానికి మొదటి రోజు సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం అయితే సీఎం సతీమణి భువనేశ్వరి నారీ శక్తిపై ప్రసంగించారు. ప్రభుత్వంలోని కొంత మంది మంత్రులు హాజరయ్యారు. రాత్రి 10 గంటల్లోపే కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత రెండు రోజులు సాయంత్రం పూటే తూతూ మంత్రంగా చిన్నారుల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసినా రూ.కోటి, రూ.కోటిన్నర కూడా బడ్జెట్ దాటని కార్యక్రమానికి కళ్లు చెదిరేలా రూ.7 కోట్లు విడుదల చేయడం నిధుల దుర్వినియోగానికి అద్దం పట్టింది. పైగా ప్రైవేటు స్థలం వినియోగించుకున్నందుకు యజమానికి ఒక్కపైసా కూడా చెల్లించకుండా వేధించింది. అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి పాస్లు పూర్తిగా దుర్వినియోగం అవ్వగా, కనీసం డ్యూటీలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగులకూ పాస్లు అందని పరిస్థితి. ఇందులో ఏపీ టూరిజం అథారిటీలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తూ ఎనిమిదేళ్లుగా ఒకే చోట పాతుకు పోయిన ఓ అధికారి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం.ఆయనకు సంబంధం లేని ఈవెంట్ విభాగాన్ని రాజకీయ నాయకుల ఒత్తిడితో చేజిక్కించుకుని కథను నడిపించారని సమాచారం. ఫైల్ నిర్వహించడం దగ్గర నుంచి బిల్లుల అప్లోడ్ వరకు అన్నీ తానై వ్యవహరించారని, ఇందుకు ప్రతిగా బిల్లుల్లో ఒకశాతం కమీషన్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదేమాదిరిగా సెప్టెంబర్లో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలోనూ భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అమరావతి–ఆవకాయ్లో కూడా ఇదే తంతు నడుస్తోందని వినికిడి. మౌలిక వసతులు మృగ్యం.. గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించేందుకు హరిత హోటళ్ల అప్గ్రేడేషన్ను చేపట్టింది. 12 హోటళ్లలో సుమారు రూ.78 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల చిన్న మొత్తంలో పనులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని గాలికొదిలేసింది. ఫలితంగా హోటళ్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది.రూ.కోట్లు ఖర్చు చేసి రూపురేఖలు మార్చిన ఆ హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఏకంగా ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను సైతం కూటమి సర్కారు ఆహ్వానించింది. ఈ క్రమంలో సగానికిపైగా హోటళ్ల ఆదాయం క్షీణించింది. పైగా అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ప్రైవేటు హోటళ్లకు వెళ్లి జేబులు గుళ్ల చేసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితిలో పర్యాటకుల ఆకర్షణ కోసం పండుగలు నిర్వహిస్తామంటూ సర్కారు రూ.కోట్లు వృథా చేయడం గమనార్హం. -
బాబు పాలనలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కట్లేదు
సాక్షి,అమరావతి: అన్నదాతలను ఆదుకోవడంతోపాటు, కనీస మద్దతు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (వ్యవసాయం, రైతు సంక్షేమం), ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలో సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సాగును పూరి్తగా విస్మరించిన కూటమి పాలనలో 2025 రైతుల పాలిట చీకటి సంవత్సరమని అభివర్ణించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతోపాటు రైతులు పండించిన కంది పంటకు గిట్టుబాటు ధర లేక కంది రైతులు విలవిలలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘2025 – 26లో రాష్ట్రంలో దాదాపు 7.96 లక్షల ఎకరాలలో కంది సాగు జరిగింది. కంది కనీస మద్దతు ధర క్వింటా రూ.8 వేలు. కానీ ఆ ధర దక్కడం లేదు. రైతులు క్వింటా రూ.6,500 నుంచి రూ.6,600 వరకు అయినకాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. పొరుగున కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం స్వయంగా కంది కొనుగోలు కేంద్రాలు తెరిచి, క్వింటా కంది రూ.8 వేలకు కొంటున్నట్లు చెబుతున్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పటికీ కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గత ఏడాది కంది పంట ఉత్పత్తి 1.71 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది అంచనా 1.17 లక్షల టన్నులు. అలాగే గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 473 కిలోలు కాగా, ఈ ఏడాది అది కూడా 401 కిలోలకు తగ్గింది.’ అని నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్నదీ అదే దుస్థితి ‘మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 కాగా, రైతులు క్వింటా మొక్కజొన్న రూ.1,500 నుంచి రూ.1,900 వరకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఈ పంటను రాష్ట్రంలో ఈ సీజన్లో 4.6 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, అదీ సగటు దిగుబడి తగ్గింది. తెలంగాణలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, మన ప్రభుత్వానికి మాత్రం ఆ ఊసే లేకుండా పోయింది. మొక్కజొన్న గత ఏడాది హెక్టారు సగటు దిగుబడి 4,710 కిలోలు కాగా, ఈ ఏడాది 4,254 కిలోలు మాత్రమే అని అంచనా వేస్తున్నారు’ రైతు కంట కన్నీరు మంచిది కాదు.. అది అరిష్టం ‘రాష్ట్రంలో ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రకృతివైపరీత్యాలకు దిగుబడి తగ్గి, ధరలు పడిపోవడంతో దిక్కుతోచక విలపిస్తున్నారు. అయినా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదు. ‘రైతు కన్నీరు మంచిది కాదు. రాష్ట్రానికి అరిష్టం’ అని ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. -
కేబినెట్ భేటీలో హైడ్రామా
సాక్షి, అమరావతి: జిల్లాల పునర్విభజనలో రాయచోటి ప్రాంతాన్ని చావుదెబ్బ కొట్టిన తర్వాత కూడా అక్కడి ప్రజలను మాయచేసేందుకు సీఎం చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెరలేపారు. ఇందుకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. రాయచోటి ఎమ్మెల్యేగా మంత్రివర్గంలో ఉన్న మండిపల్లి రాంప్రసాద్రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు, చంద్రబాబు ఆయన్ను ఓదార్చినట్లు అనుకూల మీడియాకు లీకులిచ్చి ప్రచారం చేసుకున్నారు. నిజానికి.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి తరలిస్తున్నా రాంప్రసాద్రెడ్డి కళ్లప్పగించి చూడడం తప్ప ఏమీచేయలేకపోయారు.పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే తన పదవులకు రాజీనామా చేస్తానని బీరాలు పలికిన ఆయన ఇప్పుడు కేబినెట్ భేటీలో అందుకు సమ్మతి తెలుపుతూ సంతకం పెట్టారు. తన సొంత ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా చంద్రబాబు చెప్పిందల్లా చేసి ఇప్పుడు సానుభూతి కోసం కన్నీరు పెట్టుకున్నట్లు డ్రామాలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాంప్రసాద్రెడ్డి రాయచోటి కోసం పోరాడారని.. అయినా జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందని చంద్రబాబు చిలక పలుకులు పలికినట్లు లీకులు వచ్చాయి.ఆ ప్రాంతం గొంతు పిసికి తీరిగ్గా సంతాపం వ్యక్తంచేసినట్లుగా చంద్రబాబు తీరు ఉందని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. తాజా నిర్ణయంతో మంత్రి స్థానికంగా తిరగలేని పరిస్థితి ఉంటుందని గ్రహించిన చంద్రబాబు ఈ డ్రామా ఆడించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఆయన మంత్రివర్గ సమావేశం నుంచి కళ్లు తుడుచుకుంటూ వచ్చి కారెక్కి వెళ్లిపోయారు. ఇక భావోద్వేగంతో ఆయన మాట్లాడలేకపోతున్నారని ఆయన సిబ్బంది సెలవిచ్చారు.మంత్రి రాజీనామా శపథం ఏమైంది?నిజంగా రాయచోటి ప్రాంతానికి మేలు చేయాలని ఉంటే మంత్రి రాంప్రసాద్రెడ్డి తాను శపథం చేసినట్లు ఈ పాటికే రాజీనామా చేయాలి. కానీ, ఆ పని చేయకపోగా చంద్రబాబు ఎదుట తన ప్రాంతం గోడును కూడా వినిపించకుండా ఆయన చెప్పినచోట సంతకం పెట్టారు. తన నియోజకవర్గానికి అన్యాయం జరిగేలా చేసిన ప్రతిపాదనకు తానే సంతకం పెట్టి ఆమోదముద్ర వేసిన ఘనకీర్తి రాంప్రసాద్రెడ్డికే దక్కుతుందని విమర్శకులు మండిపడుతున్నారు. మంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆయన కాపాడుకోలేకపోవడం అసమర్థతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కూడా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చేసి ప్రజాభిప్రాయం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. జనాగ్రహం నుంచి గట్టెక్కేందుకే ఓదార్పు నాటకం..ఇక జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు మంత్రి మండిపల్లిని ఓదార్చినట్లు.. జిల్లా కేంద్రాన్ని మార్చడంపట్ల తాను కూడా బాధపడినట్లు చంద్రబాబు లీకులిచ్చి నాటకాన్ని మరింత రంజింపచేశారు. అంత బాధపడేటప్పుడు జిల్లా కేంద్రాన్ని ఎందుకు మార్చారు? ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు? దురాలోచన లేకపోతే ప్రాథమిక నోటిఫికేషన్లో ఒకలా తర్వాత మరోలా ఎందుకు ప్రతిపాదన మార్చాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇదంతా కేవలం ప్రజాగ్రహం నుంచి తప్పించుకునే జిమ్మిక్కులేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల పేరును చంద్రబాబు సర్కారు మార్చేయనుంది. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పేర్లకు బదులు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులుగా నామకరణం చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. అలాగే, రెండు కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు మండలాలను అటూ ఇటూ మార్చనున్నారు.బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చనున్నారు. మోటారు వాహనాల లైఫ్టాక్స్పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు మోటార్ వాహనాల పన్నుల చట్టం–1963లో పలు వసరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు.. జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రంపచోడవరం నియోజకర్గంతో పోలవరం జిల్లా.. నాలుగు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు. ⇒ రాయచోటికి బదులుగా మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లాను మార్పుచేస్తున్నారు. రాయచోటి మదనపల్లిలో భాగంగా ఉంటుంది. తొమ్మిది జిల్లాల్లో ఎటువంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో 25 మార్పులు చేసినట్లు మంత్రి అనగాని తెలిపారు. పలు మండలాలను అటు ఇటూ మార్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులు చేర్పులతో ఈనెల 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుందని, వచ్చేనెల 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయన్నారు. ⇒ సామర్లకోటను పెద్దాపురం మండలంలోకి.. మండపేట మండలాన్ని రాజమండ్రిలో కలపనున్నారు. పెనుగొండ మండలం పేరు వాసవి పెనుగొండగా.. రైల్వేకోడూరు తిరుపతి జిల్లాకు.. రాజంపేట కడపలోకి.. సిద్దవటం ఒంటిమిట్ట కడపలోకి మారుస్తున్నారు. మడకసిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకానుంది. బాపట్ల నుంచి అద్దంకి నియోజకవర్గం తిరిగి ప్రకాశం జిల్లాకు మార్పు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాకు.. మరో రెండు మండలాలను తిరుపతి జిల్లాకు మార్పు. ఆదోని మండలాన్ని ఆదోని–1 మండలం, ఆదోని–2 మండలంగా మార్పు. గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనలున్నాయి. ⇒ మోటారు వాహనాల లైఫ్టాక్స్పై 10 శాతం చొప్పున రోడ్ సేఫ్టీ సెస్ విధింపు. ఈ సెస్ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీచేసి రోడ్ల మెరుగుదల, రోడ్డు భద్రతా చర్యలను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా ఏటా రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంతో వాహన కొనుగోలుదారులకు కొంత ఆదా అవుతోంది. ఈ చిన్న సెస్ విధించడంవల్ల వాహన యజమానులపై ఆరి్థక భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ⇒ దుగ్గరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు గ్రీన్సిగ్నల్. ⇒ నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు అనుమతి. అలాగే, జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన దాని ప్రకారం శాశ్వత లీజ్ హోల్డర్లకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకారం. ⇒ బాపట్ల మండలంలోని వెస్ట్ బాపట్ల గ్రామంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని బాపట్ల టీడీపీ జిల్లా అధ్యక్షుడికి లీజ్ పద్ధతిలో కేటాయించి, టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి అనుమతి. ఎకరాకు సంవత్సరానికి రూ.1,000 చొప్పున లీజ్ రుసుము చెల్లిస్తూ, 33 ఏళ్లపాటు లీజుకు ఆమోదం. ⇒ ఎన్ఎస్సీఎఫ్డీసీ (జాతీయ షెడ్యూలు కులాల ఆరి్థక అభివృద్ధి సంస్థ) ద్వారా ఎస్సీలు తీసుకున్న రుణాలపై వడ్డీ రూ.41 కోట్లు మాఫీ. ⇒ అమరావతిలో యోగా నేచురోపతి ఇనిస్టిట్యూషన్కు భూమి కేటాయింపు. అలాగే, విశాఖలో ఆసుపత్రి ఏర్పాటుకు కూడా.. ⇒ తొలుత ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం. అలాగే, విద్యుత్ రంగంలో మరిన్ని అప్పులకు అనుమతి. ⇒ సీఆర్డీఏలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు నాబార్డు నుండి రూ.7,387.70 కోట్ల రుణం పొందేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి. ⇒ సీఆర్డీఏలో ఉండవల్లి వద్ద ఫ్లడ్ పంపింగ్ స్టేషన్–2 కమిషనింగ్ (కెపాసిటీ 8,400 క్యూసెక్) 15 ఏళ్ల ఆపరేషన్–మెయింటెనెన్స్తో లంప్సమ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ఎల్–1 బిడ్ ఆమోదించేందుకు అనుమతి. ⇒ మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో రూ.1,673.51 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదనకు ఆమోదం. ⇒ డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 9.88 ఎకరాల లీజును మూడేళ్ల కాలానికి పునరుద్ధరించాలన్న రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు గ్రీన్సిగ్నల్. ఈ భూమిని వేదాంత లిమిటెడ్కు ఆన్షోర్ డ్రిల్లింగ్ కార్యకలాపాల కోసం కేటాయించనున్నారు. ⇒ సీఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపునకు సంబంధించిన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులకు ఓకే. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు–ఫేజ్– ఐ–స్టేజ్– ఐలోని పంపింగ్ స్టేషన్లకు ఆమోదించిన డిజైన్లు/డ్రాయింగ్ల ప్రకారం ఇండక్షన్ మోటార్లలో పెరిగిన మెగావాట్ కెపాసిటీ కోసం అదనపు ఖర్చు రూ.76,80,000ల మొత్తానికి పరిపాలనా అంగీకారం. ⇒ రాజముద్రతో త్వరలోనే 21.87 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ. పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు..ఇక వైద్య కళాశాలల నిర్మాణానికి పీపీపీ విధానంలోనే ముందుకెళ్తామని, వెనక్కు వెళ్లేదిలేదని మంత్రి సత్యకుమార్ స్పష్టంచేశారు. ఆదోని వైద్య కళాశాలకు రాజ్కుమార్ ప్రేమ్చంద్ షా బిడ్ దాఖలు చేశారని, మరికొన్ని సమరి్పంచడానికి గడువు కోరారని, అయితే.. గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక్క బిడ్ వచి్చనాసరే ముందుకెళ్తామని మంత్రి తేల్చిచెప్పారు. -
బాబు మరో మోసం.. రాయచోటి ప్రజలకు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.కాగా, ఏపీ కేబినెట్లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై మంత్రి రాంప్రసాద్రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు. -
Anakapalli: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు.. బోగీలు దగ్ధం
సాక్షి,అనకాపల్లి: ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.సోమవారం టాటా నగర్ నుండి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిపివేశారు. అగ్నిప్రమాదంపై రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.రైలు నిలిపివేయగానే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది చాకచక్యంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఒక బోగీలోని ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనలో మొదటగా బీ1 బోగీలో మంటలు చెలరేగగా.. అనంతరం ఎం1,బీ2 కోచ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఇతర కోచ్లకు వ్యాపించకుండా వాటిని వేరు చేసి, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు. -
'ఎగ్'బాకింది
విజయవాడ సత్యనారాయణపురంలో రోజూ మాదిరిగా రమేష్ తన స్నేహితులతో అల్పాహారం కోసం ఓ టిఫిన్ దుకాణానికి వెళ్లాడు. మూడు డబుల్ ఎగ్ దోశలు ఆర్డర్ చేసి తిన్నారు. ఎప్పటిలాగే దోశ రూ.40 చొప్పున మూడు దోశలకు రూ.120 ఫోన్ పే చేశాడు. ఆ సౌండ్ విన్న యజమాని మరో రూ.30 చేయండి బాబూ.. గుడ్లు ధర బాగా పెరిగిందని చెప్పాడు. దీంతో రమేష్ అదనంగా డబ్బులు చెల్లించి ఏంటి గుడ్డు రూ.8 అయిపోయిందా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విశాఖ నగరంలోని ఎండాడలో సత్యవతి అనే మహిళ ఇంటికి సమీపంలోని కిరాణాదుకాణానికి వెళ్లి అరడజను గుడ్లు అడిగింది. దుకాణదారుడు గుడ్డు రూ.8.50 అని చెప్పడంతో ఆమె అవాక్కయింది. ఎప్పుడూ ఇంత రేటు చూడలేదని నాలుగు గుడ్లుతో సరిపెట్టుకుంది. దుకాణదారుడు అమ్మా కొద్ది రోజుల్లో గుడ్డు ధర రూ.10 కి చేరవచ్చని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారని అనడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఇలా వీరే కాదు రాష్ట్రంలోని ఏ ఎగ్, చికెన్ మార్కెట్కి వెళ్లినా ప్రస్తుతం పెరిగిన గుడ్లధర గురించే చర్చ నడుస్తోంది. చికెన్ ధరలు కూడా అందనంత దూరంలో ఉన్నాయని ప్రజలు అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. – ఏపీ సెంట్రల్ డెస్క్నాన్ వెజ్ ప్రియులు జిహ్వచాపల్యాన్ని తీర్చుకోలేకపోతున్నారు.పెరిగిన గుడ్లు, చికెన్ ధరలతో అటు వైపు చూడడానికి సాహసించడంలేదు. ఒకవైపు పెరిగిన కూరగాయల ధరలతో ప్రజలు ఇబ్బందిపడుతుంటే మరోవైపు గుడ్డు ధర ఆల్టైం రికార్డుస్థాయికి చేరింది. హోల్సేల్లోనే రూ.7 పలుకుతోంది. ఇక కిరాణాషాపులు, చిన్న చిన్న దుకాణాల్లో రూ.8 నుంచి రూ.8.50 వరకూ విక్రయిస్తున్నారు. ఈ ప్రభావంతో గుడ్డు, చికెన్తో తయారయ్యే ఆహారపదార్థాల ధరలు పెంచేశారు. దీంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ధరలు పెరగడంతో ఏం తినాలి.. ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డుధర ఇంత ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు సైతం చెప్పడం విశేషం. తక్కువ ట్రేలే తెస్తున్నాం గుడ్లు ధర భారీగా పెరగడంతో చిరువ్యాపారులు సైతం స్టాక్ తగ్గించుకుంటున్నారు. గతంలో హోల్సేల్ దుకాణం నుంచి 10 ట్రేల గుడ్లు తెచ్చే వారు ప్రస్తుతం పెరిగిన ధరలకు భయపడి స్టాక్ తగ్గించేస్తున్నామని చెబుతున్నారు. ఒక్క సారిగా ధర తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే భయంతో తక్కువగా తెస్తున్నామని.. హోల్సేల్ వ్యాపారులు మాత్రం ఇప్పట్లో ధర తగ్గదు... పెరుగుతుందని చెబుతున్నా... వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రిస్క్ చేయలేక పోతున్నామంటున్నారు. ఎగ్ వంటకాల ధరలకు రెక్కలు 15 రోజుల్లోనే గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8కి చేరడంతో వంటకాల ధరలు కూడా వ్యాపారులు పెంచేశారు.సాధారణ టిఫిన్షాపులోనే సింగిల్ ఎగ్ దోశపై రూ.5, డబుల్ ఎగ్ దోశపై రూ.10 వరకూ పెంచేశారు. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో మరింత పెంచారు. ఎగుమతులు పెరగడమే కారణమా! రాష్ట్రంలో భారీగా కోడి గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఇందులో 60 శాతం వరకూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. ఈ ప్రభావం ధరల పెరుగుదలకు కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గుడ్లు ఉత్పత్తి చేసే కోళ్లు 5 కోట్లు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు 4.70 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 60 శాతం వరకూ పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం,ఢిల్లీ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా ఈ రాష్ట్రాల్లో చేపలు ఎక్కువగా వినియోగిస్తారు. నవంబర్ నుంచి జనవరి వరకూ ఆ రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి తగ్గడంతో గుడ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. దిగిరాని చికెన్ చికెన్ధరలు దిగిరావడం లేదు. కార్తీకంలో కూడా కిలో రూ.200కు పైగానే కొనసాగింది. అలా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ లెస్ చికెన్ కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో రూ.260 పలుకుతోంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, గుంటూరు, విజయవాడ జిల్లాల్లో కిలో రూ.280 నుంచి రూ.300 పలకడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కోడి కూర వైపు చూడడానికి సాహసించడం లేదు.చికెన్, గుడ్లు తినలేకపోతున్నాం నేను జూపాడుబంగ్లా గ్రీన్అంబాసిడర్గా పనిచేస్తున్నా. నాకు నెలకు రూ.6 వేల వేతనం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలతో సతమతం అవుతున్నాను. కనీసం నెలకోమారైనా చికెన్, గుడ్లు తిందామనుకొంటే చికెన్ కిలో రూ.260, గుడ్లు డజన్(12) రూ.100 చెబుతున్నారు. నాకొచ్చే అరకొర వేతనంతో చికెన్, గుడ్లు కొనుక్కొని తినలేని పరిస్థితి నెలకొంది. – రమణమ్మ, జూపాడుబంగ్లా, నంద్యాల జిల్లా గుడ్డు రేటు ఇంతా! సీజన్తో సంబంధం లేకుండా ఈ ఏడాది గుడ్లు, చికెన్ ధర పెరుగుతోంది. గుడ్డు ధర రూ.8.50 అంటే సామాన్యులు ఎలా కొనుక్కొని తినగలరు. చికెన్ధర కూడా అందనంత దూరంలో ఉంది. – ఎం.మణి, మంగమారిపేట, విశాఖపట్నంఇంత రేటు ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసి గుడ్డు ఎప్పుడూ ఇంత రేటు చూడలేదు. గుడ్డు రూ.8.50 పెట్టి కొనాలంటే కష్టం. ధర ఒక్కసారిగా పెరగడంతో ఎగ్ దోశ రేటు పెంచారు. సింగిల్ ఎగ్ దోశపై రూ.5. డబుల్ ఎగ్ అయితే రూ.10 పెరిగింది.–గౌరినాయుడు,సత్యనారాయణపురం, విజయవాడగుడ్లు కూడా కొనలేకపోతున్నాం మధ్యతరగతి వాళ్లకు వారానికి ఒక్క రోజైనా చికెన్ తినాలని ఉంటుంది. అయితే ఇప్పుడు చికెన్ కాదు కదా.. కోడిగుడ్లను కూడా కొనే పరిస్థితి లేదు. కేజీ చికెన్ ధర రూ.280పైనే ఉంది. కోడిగుడ్లతో సరిపెడదామా అంటే డజన్ వంద రూపాయలు అంటున్నారు. చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. - భాస్కర్, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా -
సర్కారుకు ‘ఆవకాయ’..ఏపీటీడీసీ ఉద్యోగులకు వెలక్కాయ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ఒకవైపు తీవ్ర తాత్సారం చేస్తూ.. మరోవైపు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించడమే కాకుండా ఇప్పటివరకు కొత్త చైర్మన్ను నియమించకుండా, పీఆర్సీ అమలును అడ్డుకుని, కనీసం ఐఆర్ను ప్రకటించకుండా నిలువునా ముంచేస్తోంది. ఇక్కడ ప్రభుత్వోద్యోగుల వెతలు ఒక ఎత్తయితే.. కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలు మరో ఎత్తు. ఇటీవల పర్యాటక శాఖలో ‘ఆవకాయ–అమరావతి’ పేరుతో ఒక సినిమా, సాహిత్య ఈవెంట్కు ఏకంగా రూ.5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. అదే పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగులకు గత ఐఆర్ ఎరియర్స్ విడుదల చేయడానికి మాత్రం డబ్బుల్లేవని చేతులెత్తేస్తోంది. వాస్తవానికి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీటీడీసీ ఆధ్వరంలో నడిచే హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఒడిగట్టింది. ఇలా ఒక్కొక్కటిగా ఏపీటీడీసీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే సంస్థకు చెందిన శాశ్వత ఉద్యోగులను బదిలీల పేరుతో ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించి తమ మాట వినే అధికారులకు డెప్యూటేషన్లపై పగ్గాలు అప్పగించింది. ఫలితంగా ఏడాదిన్నర కాలంలో ఏపీటీడీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. రూ.1.20 కోట్లు కూడా లేవా?ఏపీటీడీసీలో పనిచేస్తున్న 55 మంది ఇన్ సర్వీస్ ఉద్యోగులకు రూ.1.20 కోట్లు, 35 మంది రిటైర్డ్ ఉద్యోగులకు రూ.70 లక్షల వరకు ఐఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మేలో ఏపీటీడీసీ ఎండీ నిధుల విడుదలకు ఆర్డర్ ఇచ్చారు. అయితే, ఇన్సర్వీస్ ఉద్యోగులకు మూడు దఫాల్లో ఇస్తామని మెలికపెట్టారు. ఇందులో ఇప్పటివరకు కేవలం ఒక దఫా మాత్రమే చెల్లించారు. మిగిలిన రెండు దఫాలు గురించి అడిగిన ఉద్యోగులకు సంస్థలో డబ్బుల్లేవనే మాట తప్ప మరో సమాధానం రావట్లేదు. విచిత్రం ఏమిటంటే.. రిటైరైన ఉద్యోగులకు మాత్రం సింగిల్ సెటిల్మెంట్లో మొత్తం చెల్లించేశారు. దీని వెనుక ఏపీటీడీసీలో డెప్యూటేషన్పై పనిచేస్తున్న అధికారులు భారీఎత్తున ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇన్ సర్వీస్ ఉద్యోగులను ప్రధాన కార్యాలయంలోకి రానిస్తే తమ ఆటలు సాగవనే వారికి దక్కాల్సిన చెల్లింపులను అడ్డుకుంటున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమి న్యాయం మేడం..ఏపీటీడీసీలో డెప్యూటేషన్పై పనిచేస్తున్న ఓ కీలక అధికారిణికి ఏడాదిన్నరగా పొడిగింపు ఆర్డర్ లేదు. కానీ, ఆమె ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతినెలా జీతం తీసుకుంటూనే ఉన్నారు. ఏపీటీడీసీకి చెందిన శాశ్వత ఉద్యోగులకు ఆర్థిక బకాయిలు విడుదల చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సదరు అధికారి ఒక్కరే కాదు.. కీలక విభాగాలు అన్నింటిలోనూ డెప్యూటేషన్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారు. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్తబోటు కొనలేదు.. హోటళ్ల ఆదాయాన్నీ పెంచలేదు.. పైగా ఉత్సవాల పేరుతో ఏపీటీడీసీ ఆదాయాన్ని అప్పనంగా వాడేస్తున్న పరిస్థితి. కానీ, అక్కడి ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా డబ్బుల్లేవంటూ ఇబ్బందులకు గురిచేస్తోంది. వాస్తవానికి.. అక్టోబరు నుంచి జనవరి వరకు ఏపీటీడీసీకి పీక్ సీజన్. ఈ సమయంలో పర్యాటకుల ద్వారా సంస్థకు అధిక రాబడి వస్తుంది. కానీ, డెప్యూటేషన్ అధికారులు మాత్రం ఖజానాలో చిల్లిగవ్వ లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 27 శాతం ఐఆర్..2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఏడాది జూలైలో ఉద్యోగులకు పీఆర్సీ కంటే ముందు 27 శాతం ఐఆర్ అమలుచేసింది. అయితే, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీనిని వర్తింపజేసే క్రమంలో కరోనా విజృంభించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత 2021 నవంబరులో ఏపీటీడీసీ బోర్డు ప్రభుత్వం ఇచ్చిన ఐఆర్ జీఓతో సొంత నిధులు వాడుకుని ఉద్యోగులకు వర్తింపజేసేలా ఆమో దం తెలిపింది. దీనిపై 2021 డిసెంబరులోనే ప్రభుత్వం జీఓ జారీచేసింది. ఇంతలో 2022 జనవరి నుంచి ప్రభుత్వం పీఆర్సీ అమలులోకి తీసుకురావడం.. ఆ వెంటనే దానిని ఏపీటీడీసీ బోర్డు సైతం ఆమోదించి అమలుచేసింది. అయితే, ఆ తర్వాత ఏపీటీడీసీ రెవెన్యూ వృద్ధి చెందగా 2024లో బకాయిలు తీర్చే క్రమంలో ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి ఏపీటీడీసీ ఉద్యోగులు పోరాడుతూనే ఉన్నా ప్రభుత్వం కనికరించట్లేదు. -
పునర్వి‘భజన’లో రాజకీయ కుతంత్రం
సాక్షి, అమరావతి: స్వార్థ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జిల్లాల పునర్విభజన చేస్తున్నారు. ప్రజల, పాలనా సౌలభ్యాలకు తిలోదకాలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక శాస్త్రీయ ప్రాతిపదికన ఏర్పాటైన జిల్లాలను టీడీపీ ప్రయోజనాలే పరమావధిగా అస్తవ్యస్తంగా మారుస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక జిల్లా రద్దుకు సిద్ధమయ్యారు. 2023లో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన రాజంపేట పార్లమెంటు ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ జిల్లాకు అదే ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత వాగ్గేయకారుడు అన్నమయ్య గౌరవార్థం పేరు పెట్టారు. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. దీనికి అందరి ఆమోదం లభించింది. ఇప్పుడు దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కకావికలం చేస్తోంది. అప్పట్లో చిత్తూరు జిల్లా ప్రాధాన్యాన్ని కొనసాగించేందుకు రాజంపేట పరిధిలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేసే పేరుతో అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చివేసేలా ప్రతిపాదించారు. ఆ జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లె జిల్లాలో కలిపారు. చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు అసెంబ్లీ స్థానాన్ని మదనపల్లె జిల్లాలో విలీనం చేశారు. తుది నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి మిగిలిన రైల్వేకోడూరు, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాలను తిరుపతి, కడప, మదనపల్లె జిల్లాల్లో కలపి అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయాలని ప్రతిపాదించారు. అదే గనుక జరిగితే అన్నమయ్య జిల్లా కనుమరుగైనట్లే. తొలిసారి జిల్లా రద్దుకు అడుగులు రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ గతంలో ఏర్పాటైన జిల్లాలను ఏ ప్రభుత్వం రద్దు చేయలేదు. 11 జిల్లాలతో మొదలైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం 23 జిల్లాలకు విస్తరించింది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. చంద్రబాబు ఆ జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న 13 జిల్లాలను అలాగే ఉంచి కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్తగా మరో 3 జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముందు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరికి ఒక విధానం, హేతుబద్ధత లేకుండా రాజకీయ కారణాలతో అన్నమయ్య జిల్లాను లేకుండా చేయాలనే అభిప్రాయానికి వచ్చింది. రాజంపేట ఛిన్నాభిన్నమే లక్ష్యం రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీకి పట్టు లేకుండాపోవడంతో ఆ నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి టీడీపీ అక్కడ గెలవలేదు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో అక్కడ వైఎస్సార్సీపీ గెలిచింది. రాజకీయంగా ఆ నియోజకవర్గంలో టీడీపీకి ఇక పట్టు చిక్కే పరిస్థితులు లేకపోవడంతో జిల్లాల పునర్విభజన ముసుగులో అందులోని అసెంబ్లీ స్థానాలను చెల్లాచెదురు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె జిల్లా ఏర్పాటు చేయడానికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా ఆ పేరుతో ఉన్న జిల్లాను రద్దు చేయడం సరికాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలపాలని నిర్ణయించారు. దీంతో చిత్తూరు జిల్లా కేవలం ఆరు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. 32 మండలాలతో ఉన్న ఆ జిల్లా 26 మండలాలకే పరిమితమై ప్రాధాన్యం కోల్పోనుంది. తగ్గిపోతున్న బాపట్ల జిల్లా ప్రాముఖ్యంఅలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తుండగా దాని కోసం బాపట్ల జిల్లా ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి అద్దంకి, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. దీంతో 25 మండలాలతో ఉన్న బాపట్ల జిల్లా ఇప్పుడు 20 మండలాలకే పరిమితం కానుంది.పోలవరం లేకుండానే పోలవరం జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంతాన్ని విచిత్రంగా పునర్వ్యస్థీకరించింది. పోలవరం లేకుండా పోలవరం జిల్లాను ఏర్పాటు చేసి ప్రస్తుతం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అసలు ప్రాతిపదికే లేదని నిరూపిస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడమేకాకుండా దానికి పక్కనున్న ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరును దానికి పెట్టడం గమనార్హం. అరకు పార్లమెంటు స్థానం పరిధి ఎక్కువ కావడం, నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండడంతో ఈ జిల్లాను పునర్వ్యస్థీకరించడం 2022లోనే సవాలుగా మారింది. అయినా అప్పట్లో దాని విస్తృత పరిధి దృష్ట్యా రెండు జిల్లాలుగా విభజించారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు. తద్వారా రెండు గిరిజన జిల్లాలను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే రంపచోడవరం నియోజకవర్గం పాడేరుకు దూరంగా ఉందనే సాకుతో కేవలం ఆ ఒక్క నియోజకవర్గంతోనే ఇప్పుడు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. పైగా దానికి ఏలూరు జిల్లాలో ఉన్న పోలవరం పేరు పెట్టడం ఇంకా విచిత్రంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం ఒక నియోజకవర్గం కోసం జిల్లా ఏర్పాటు చేయడాన్ని బట్టి తాము చేసిన పునర్వ్యస్థీకరణకు తీరూతెన్నూ లేదని చంద్రబాబు ప్రభుత్వం నిరూపించుకుంది. ఒంగోలు, రాజంపేట, అరకు పార్లమెంటు స్థానాల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు చంద్రబాబు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.2014లో వదిలేసి ఇప్పుడు తూట్లు పొడుస్తున్న చంద్రబాబుఅమరావతి కోసం చంద్రబాబు 2014–19లో జిల్లాలను పునర్వ్యస్థీకరించకుండా వదిలేయడంతో అనేక సమస్యలు ఏర్పడ్డాయి. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక శాస్త్రీయ దృక్పథంతో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని జిల్లాలను పునర్వ్యస్థీకరించారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకూడదనే ప్రాథమిక సూత్రాల ఆధారంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి జిల్లాలో జనాభా సగటున 15 లక్షల నుంచి 20 లక్షలు ఉండేలా చూశారు. తద్వారా అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఉండేలా స్వరూపాలను నిర్దేశించారు. ఇందుకోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 76 డివిజన్లుగా పునర్వ్యస్థీకరించారు. చివరికి చంద్రబాబు సుదీర్ఘకాలం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా వైఎస్ జగన్ హయాంలోనే ఏర్పాటైంది. అంత శాస్త్రీయంగా జరిగిన పునర్విభజనను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం నీరుగార్చడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.అన్నమయ్య జిల్లాపై నేడు నిర్ణయంఅన్నమయ్య జిల్లా రద్దు అంశాన్ని సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తేల్చుదామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పినట్టు తెలిసింది. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశమైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా రద్దు చేయడానికి దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లానే అన్నమయ్య జిల్లాగా కొనసాగిస్తున్నట్లు చెప్పాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లె జిల్లాలో కలిపి జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయాలని దాదాపు ఖరారు చేశారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి తాజాగా పలు మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ నెల 31న జిల్లాల పునర్విభజనకు సంబంధించిన మార్పులపై తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
‘దళితుల భూముల్లో ప్రైవేట్’ దందా!
సాక్షి, అమరావతి: అవన్నీ దాదాపుగా దళితుల భూములే..! పారిశ్రామిక అవసరాల కోసం సేకరిస్తున్నామనడంతో స్థానికంగా అందరికీ ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో ఎంతో మంది రైతులు భూములిచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీలైతే.. ఏపీఐఐసీ తీసుకునే దాంట్లో చట్ట ప్రకారం 22.5 శాతం భూమిని దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తమ దక్షత చాటుకునేందుకు ఇదో మంచి అవకాశమని భావించారు. నమ్మి అసైన్డ్ భూములను అప్పగించారు. కానీ చంద్రబాబు సర్కారు ఏం చేస్తోంది..? విలువైన ఆ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది. దళిత యువ పారిశ్రామికవేత్తల ఆశలను నీరుగారుస్తోంది. పారిశ్రామిక పార్కుల ముసుగు తొడిగి.. దళితుల నుంచి తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసింది. చంద్రబాబు సర్కారు బరి తెగించి సాగిస్తున్న మరో భూదందా ఇదిగో ఇలా ఉంది...! ఏపీఐఐసీ భూములు ప్రైవేట్కు ధారాదత్తం... ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరిట ఇప్పటికే విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2024–29 పాలసీ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది. పీపీపీ విధానంలో 22 ప్రైవేట్ పార్కుల కోసం అస్మదీయులకు ఈ భూములను అప్పగించనున్నారు. పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఎటువంటి అనుభవం లేని వ్యక్తులను సైతం సొంతంగా బిడ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వ్యక్తులతో పాటు ప్రాపర్టీషి ప్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు ఈ బిడ్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ‘రియల్’ లబ్ధి కోసమే..! నివాస సముదాయాలు, రెసిడెన్షియల్ లే అవుట్లు, టౌన్షి ప్ లేఅవుట్లు వేసిన సంస్థలను కూడా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిడ్లలో పాల్గొనేందుకు అనుమతించటాన్ని బట్టి ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే అసలు ఉద్దేశమని స్పష్టం చేస్తున్నారు. పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్ల నిర్మాణానికి అనుమతిస్తున్నారంటే దీని వెనుక ఉన్న ‘రియల్’ ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. బిడ్లు ఆహ్వానించడానికి 2026 జనవరి 19 చివరి తేదీగా నిర్ణయించారు.తీరు మారిన ఏపీఐఐసీఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎటువంటి కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు ఫార్మా, బయో టెక్నాలజీ పార్కులను ఈ సంస్థ నిర్మించింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ భూమి సేకరిస్తోందంటే.. తమ బిడ్డలతోపాటు ఇరుగు పొరుగు వారికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎంతో మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో అత్యధికం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములే ఉన్నాయి. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తే వాటి ద్వారా తమకు ఉపాధి లభించడంతో పాటు చట్టప్రకారం 22.5% భూమిని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తాము కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చనే ఆశతో తమ భూములను అప్పగించారు. కానీ చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక ఏపీఐఐసీ తీరు పూర్తిగా మారిపోయింది. 547 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ఆ సంస్థ.. ఇప్పుడు కొత్తగా పారిశ్రామిక పార్కులను నిరి్మంచలేమంటూ చేతులెత్తేసింది. పేదల నుంచి సేకరించిన రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ఉత్సాహం చూపుతోంది. ఒకపక్క ఏపీఐఐసీ పారిశ్రామికపార్కుల పేరిట రూ.8,500 కోట్ల రుణాలను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోవడంతోపాటు.. పారిశ్రామిక పార్కుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూములు కట్టబెడుతుండటం పట్ల అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. పీపీపీ విధానంలో చేపట్టే ఈ పారిశ్రామికపార్కుల్లో రూల్ ఆఫ్ లా కింద ఎస్సీ ఎస్టీలకు 22.5% రిజర్వేషన్లు అమలు చేయరని, తద్వారా బడుగు వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల ఆశలను చంద్రబాబు సర్కారు తుంచేసిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.టెండర్లు పిలిచిన ఎంఎస్ఎంఈ పార్కులు ఆర్.కృష్ణపురం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా గుండ్లమడుగు, వైఎస్సార్ కడప జిల్లా టి.చౌడూరు, వైఎస్సార్ కడప జిల్లా పల్లుగుర్రంపల్లి, వైఎస్సార్ కడప జిల్లా చేదెళ్ల, పుంగనూరు, చిత్తూరు జిల్లా చిన్నపండూరు, తిరుపతి జిల్లా కుక్కరాజుపల్లె, అన్నమయ్య జిల్లా నిజాంపట్నం, బాపట్ల జిల్లా వై.కోట, అన్నమయ్య జిల్లా మంగాడు, చిత్తూరు జిల్లా అనంతపురం గోవాడ, బాపట్ల జిల్లా నాయునిపల్లి, బాపట్ల జిల్లా గంగపాలెం, ప్రకాశం జిల్లా ముత్యాలంపాడు, విజయవాడ పరవాడ, అనకాపల్లి జిల్లా నిడదవోలు, తూ.గో. జిల్లా హంసవరం, కాకినాడ జిల్లా చెరుకుమిల్లి, తూ.గోజిల్లా గోపాలపట్నం, ముడసరలోవ విశాఖ జిల్లా టెక్కలి, శ్రీకాకుళం జిల్లా -
రెడ్బుక్ అరాచకం.. పోలీసు పైశాచికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘పచ్చ ఖాకీ’లు పేట్రేగిపోతున్నారు. రెడ్బుక్ అరాచకానికి వత్తాసు పలికితే చాలు ప్రజల హక్కులను కాలరాసినా పర్వాలేదన్నట్లుగా బరితెగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తే సరి.. వారి భద్రతను గాలికొదిలేసినా అడిగేవారు ఉండరన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై పోలీసు గూండాగిరి ప్రదర్శించి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు మోపుతున్నారు. సీపీఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రాష్ట్రప్రభుత్వ దన్నుతో ఖాకీల బరితెగింపునకు పరాకాష్ట అని విమర్శకులంటున్నారు. తాజాగా.. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో రప్పారప్పా అన్నందుకే వారిని పోలీసులు అరెస్టు చేసి నడిరోడ్డులో నడిపిస్తూ.. కొట్టుకుంటూ తీసుకెళ్లారు.ఇలా చేయడం దేనికి సంకేతం? పోలీసులు అలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం న్యాయమేనా? వ్యవస్థలు దిగజారుతున్నాయనడానికి ఇదే సంకేతం. ఇలాంటి చర్యలతో న్యాయం బతుకుతుందా? అని మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. జంతు బలి ఇవ్వడాన్ని సాకుగా చేసుకుని హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నారంటూ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. హింసించి నడిబజార్లో నడిపిస్తారా!? రప్పా రప్పా అన్నారని, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేశారని వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. వారేదో దేశద్రోహులన్నట్లుగా నడిబజారులో కొట్టుకుంటూ నడిపించడం చూసి అంతా విస్తుపోయారు. ఈ ఉదంతాన్ని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించడం చూసి ఆశ్చర్యపోయారు. నిజానికి.. ఫ్లెక్సీల వద్ద జంతు బలులు, రక్త తర్పణాల జాఢ్యాన్ని మొదలు పెట్టింది టీడీపీయే. గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద టీడీపీ నేతలు ఒకటీ రెండు కాదు పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి రక్త తర్పణం చేశారు. ఆ తలలను గుచ్చి దండలా ఫ్లెక్సీలకు వేలాడదీశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా 2023లో పొట్టేలు తల నరికి ఫ్లెక్సీకి రక్తాభిõÙకం చేయలేదా? ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున చాలాచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిందేమిటి? ఇలాగే పొట్టేళ్ల తలలు నరికి, ఫ్లెక్సీలకు రక్త తర్పణం చేయలేదా? వాటిని ఏమంటారు? ప్రభుత్వ దోపిడీని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్.. యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీని ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిన్నరలోనే తమ పాలనపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతోందని హడలిపోతున్నారు. అయినా, దోపిడీ విధానాలను ఆయన విడిచిపెట్టడంలేదు. అవినీతిని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఇలా ఏడాదిన్నరలోనే వేలాది అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, రైతు సంఘం కార్యదర్శి ఎం. అప్పలరాజును లక్ష్యంగా చేసుకుంది. బల్క్డ్రగ్ పరిశ్రమ పేరిట రైతుల భూములను కొల్లగొట్టాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను ప్రశ్నించడమే ఆయన చేసిన నేరం. బల్క్డ్రగ్ పార్క్ ముసుగులో భూదోపిడీ, విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ, గాజువాకలో సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో భూదోపిడీపై అప్పలరాజు నిలదీస్తుండడంతో చంద్రబాబు బెంబేలెత్తారు. ‘ఆయన సంగతి తేల్చండి’ అన్న ప్రభుత్వ పెద్దల హుకుంకు పోలీసులు యస్ బాస్ అన్నారు. అంతే.. ఏకంగా 2013 నుంచి పెండింగులోని కేసులను తిరగదోడి మరీ అప్పలరాజుపై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. జై జగన్ అన్నా అక్రమ కేసులు, వేధింపులు..ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పచ్చ ఖాకీల క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. అక్రమంగా నిర్బంధించి నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీతో వేధిస్తోంది. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక వైఎస్సార్సీపీ శ్రేణులందరూ నీరుగారిపోతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వారు పోరుబాట పట్టారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కుతుండడం ప్రభుత్వ పెద్దలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలపై వెయ్యికిగా పైగా అక్రమ కేసులు పెట్టినా సరే అది వారిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. అక్రమ కేసులు పెడుతున్న కొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21న వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. ఆ వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో జాతరలను తలపించాయి. ఇదే ఉత్సాహం కొనసాగితే టీడీపీ కూటమి ప్రభుత్వం పుట్టి మునగడం ఖాయమని వారికి అర్ధమైంది. అంతే.. వైఎస్సార్సీపీ శ్రేణులపై సరికొత్త కుతంత్రానికి తెగించారు. జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదుచేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు ఆ వేడుకలపై అక్కసు వెళ్లగక్కి వారిని ఏం చేయాలన్న దానిపై పోలీసులకు స్పష్టమైన సంకేతాలిచ్చారన్న ఆరోపణలున్నాయి. శ్రీ సత్యసాయి, అనంతపురం, ఉభయ గోదావరి.. ఇలా పలు జిల్లాల్లో పోలీసులు ఏకంగా 13 అక్రమ కేసులు నమోదుచేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనం. వారికి అలా.. వీరిని ఇలా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటివరకు 265 మంది బాలికలు, యువతులు అత్యాచారానికి గురయ్యారు. 15 మంది యువతులను అత్యాచారంచేసి హత్య చేయడం అరాచకానికి పరాకాష్ట. టీడీపీ కార్యకర్తలు, జనసేన సానుభూతిపరులే నిందితులు. కర్నూలు జిల్లాలో బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన ఉదంతం జరిగి ఏడాది దాటినా పోలీసులు ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. బెడిసికొట్టిన ప్రభుత్వ కుట్ర.. తాజాగా.. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త అజయ్ దేవ కొద్దిరోజుల క్రితం ఓ గర్భిణిని కాలితో తన్ని దాడికి పాల్పడ్డాడు. ఆ ఉదంతాన్నీ వైఎస్సార్సీపీ మీదకు నెట్టేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. అజయ్ వైఎస్సార్సీపీ కార్యకర్త అంటూ ఎల్లో మీడియా కూడా దు్రష్పచారం చేసింది. కానీ, అజయ్ జనసేన కార్యకర్త అని.. అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని కుటుంబ సభ్యులే చెప్పడం, అందుకు తగిన ఆధారాలు కూడా బైటపడడంతో ప్రభుత్వ పెద్దలు, పోలీసుల కుట్ర బెడిసికొట్టింది.ఏపీ పోలీసుకు లాస్ట్ ర్యాంకు..ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను పూర్తిగా దిగజారిపోతున్నా పోలీసు శాఖ ఏమాత్రం పట్టించుకోవడంలేదు. కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసిన ర్యాంకుల్లో ఏపీ పోలీసు దేశంలోనే అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నేర న్యాయ చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎన్ఎస్ చట్టాల అమలులో ఏపీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర హోంశాఖ కుండబద్దలు కొట్టింది. ఆ చట్టాలను పటిష్టంగా అమలుచేస్తే రెడ్బుక్ వేధింపులకు ఆస్కారం ఉండదు. అందుకే ఆ చట్టాలను పోలీసులు ఉల్లంఘిస్తున్నారు. ఫలితంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానానికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖే వెల్లడించింది.అమిత్ షా అసహనంఏపీ పోలీసు శాఖ అసమర్థతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కుండబద్దలు కొట్టారు. ఆపదలో ఉన్నవారు ఫిర్యాదుచేస్తే 25.50 నిమిషాల వరకు పోలీసులు స్పందించడంలేదని ఆయన స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. చండీఘడ్ పోలీసులు కేవలం ఐదు నిమిషాల్లోనే స్పందిస్తుంటే.. ఏపీ పోలీసులు మాత్రం 25.50 నిమిషాల వరకు మొద్దునిద్ర పోతున్నారని ఆయన అసహనం వ్యక్తంచేశారు. నిజానికి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాల్లో అయితే ఐదు నిమిషాల్లోనూ, పల్లె ప్రాంతాల్లో ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు బాధితుల వద్దకు చేరుకుని రక్షణ కల్పించేవారు. అందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటుచేసింది. అయితే, ఏడాదిన్నరలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పోలీసు శాఖను నిర్వీర్యం చేసింది. -
ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబ్దుల్ వహాబ్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అ ట్వీట్లో ‘60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. 60 ఏళ్లకు పైగా ఇస్లాం ధర్మ ప్రచారానికి, విద్యకు అంకితమైన నెల్లూరుకు చెందిన ముఫ్తీ అబ్దుల్ వహాబ్ గారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/LMV96K43Bl— YS Jagan Mohan Reddy (@ysjagan) December 28, 2025 -
ఓర్వలేకే మా కార్యకర్తలపై అక్రమ కేసులు: తానేటి వనిత
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కూటమి ప్రభుత్వం గుండెల్లో గుబులు రేపిందని.. అది చూసి ఓర్వలేక మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు దిగారని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ప్లెక్సీల మీద సినిమా డైలాగులు రాసినా కేసులు పెట్టారు. నల్లజర్లలో ఒక కార్యకర్తను నడిరోడ్డు మీద నడిపించారు. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వతలచుకున్నారు?’’ అంటూ వనిత ప్రశ్నించారు.‘‘రక్త తర్పణం చేసిన వారిని రాష్ట్ర బహిష్కరణ చేయాలని హోంమంత్రి అనిత అంటున్నారు. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కడితే ఏం చేశారు?. ఆ రోజు జీవహింస, రాక్షస సంస్కృతి హోంమంత్రి అనితకు కనపడలేదా?. అసలు ఇలాంటి సంస్కృతిని తెచ్చిందే టీడీపీ. ఆ రోజే ఈ సంస్కృతిని ఎందుకు కట్టడి చేయలేదు?. మా వాళ్లపై పోలీసులతో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని హోంమంత్రి ఎలా అంటారు?. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అర్హత మీకు ఎవరిచ్చారు?. చట్టాన్ని చేతిలోకి తీసుకునే అధికారం ఎవరు ఇచ్చారు?..నల్లజర్ల సెంటర్లో వైఎస్సార్సీపీ కార్యకర్తని నడిపిస్తారని టీటీపీ కార్యకర్తలు ముందుగానే పోస్టు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు పొట్టేళ్ల రక్తంతో తర్పణం చేస్తుంటే హోంమంత్రికి కనపడలేదా?. జగన్ని దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని హోంమంత్రి భావిస్తున్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హోంమంత్రికి కనపడటం లేదు. రాజధాని రైతుల్లో కూడా తీవ్రమైన మార్పు వచ్చింది. తమను మోసం చేయటంపై రైతులు ప్రశ్నిస్తున్నారు..దాన్ని డైవర్షన్ చేసేందుకు జీవహింస అంటూ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తల విధ్వంసంపై ఎందుకు కేసులు పెట్టడం లేదు?. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అక్రమ చర్యకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జగన్పై నిత్యం విషం చిమ్మటమే పనిగా కూటమి నేతలు పెట్టుకున్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసు. ఇలాంటి విష ప్రచారాలు ఆపి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలంతా ధైర్యంగా నిలబడాలి. డిజిటల్ బుక్ లో అవన్నీ నమోదు చేయండి. అధికారం లోకి వచ్చాక తగిన విధంగా చర్యలు తీసుకుందాం’’ అని తానేటి వనిత చెప్పారు. -
కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం(డిసెంబర్ 28) ఆయన వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్ జగన్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.‘‘డేటా ప్రొఫైలింగ్ సరిగా ఉంటే మనకు భవిష్యత్లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సోల్జర్స్ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్ కూడా ఇప్పటికే ఇస్తున్నాం...ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్ నాయకులు కొందరితో టాస్క్ ఫోర్స్ టీమ్ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. -
కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు: మల్లాది విష్టు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఆలయాలు, దేవుళ్లను రాజకీయాల కోసం వాడుకుంటున్న కూటమి ప్రభుత్వ తీరుపై ప్రజలు చీదరించుకంటున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీలో అనేక అపచారాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మండిపడ్డారు.తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా, రీల్స్ చేస్తున్నా, మద్యం, మాంసాహారం యథేచ్ఛగా కొండమీదకు తీసుకొస్తున్నా టీటీడీ బోర్డు ఏం చేస్తుందో అర్ధం కాని పరిస్థితి నెలకొందని, కూటమి పాలనలో టీటీడీ వ్యవస్థ పూర్తిగా నీరుగారి పోయిందని అన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలోని ఆలయాల నిర్వహణలో నిలువెత్తు నిర్లక్ష్యం చోటు చేసుకుందని.. భక్తులు దైవ దర్శనానికి వెళ్తే ప్రాణాలతో తిరిగొస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని గుర్తు చేశారు.చంద్రబాబు హయాంలో ప్రతిసారి హిందుత్వం మీద దాడి జరగడం పరిపాటిగా మారిందని.. తిరుపతి, అన్నవరం,కాశీబుగ్గ క్షేత్రమేదైనా కూటమి పాలనలో వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నా.. భక్తుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మల్లాది విష్టు ఆక్షేపించారు. మరోవైపు రాష్ట్రంలో యధేచ్చగా గోవధ జరుగుతున్నా.. విశాఖ కేంద్రంగా భారీగా గోమాంసం నిల్వలు పట్టుబట్టినా కూటమి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మల్లాది విష్ణు నిలదీశారు. ప్రెస్మీట్లో ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:తిరుమలలో వరుస అపచారాలు..తిరుమలలో అధికారులు, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయింది. టీటీడీ పాలక మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సభ్యుడు ఏకంగా మహాద్వారం గుండా వెళ్లాలని అక్కడున్న సిబ్బందితో గొడవపడి నానా రాద్ధాంతం చేశారు. మరోవైపు టీటీడీకి చెందిన గోశాల నిర్వహణ దారుణంగా మారింది. అక్కడ తొలిసారిగా దాదాపు 190 గోవులు మరణించడం అత్యంత బాధాకరం.అదే విషయాన్ని వైయస్సార్సీపీ నాయకులు ఎత్తి చూపితే.. వారి మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. కానీ అదే టీటీడీ పాలకమండలి సమావేశంలో గోశాల నిర్వహణ కష్టంగా ఉందని చర్చించడం ద్వారా మేం చెప్పిన అంశం నిజమేనని రుజువైంది. మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం టీటిడీని రాజకీయ విమర్శలకు వేదికగా దుర్వినియోగం చేస్తోంది.ఈ ఏడాది ఏప్రిల్ 12న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్తున్న సమయంలో స్వామివారి గేటు తాళాలు మూసివేయడంతో స్వామివారి నైవేద్య సమర్పణ 15 నిమిషాలు ఆలస్యమైంది. ఇది ఘోరమైన అపచారం. పాలకమండలి పాలనా, నిర్వహణ వైఫల్యానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు తిరుమలలో వ్యవస్థ పని చేస్తుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరిస్తూ కొంతమంది చెప్పులు వేసుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్ లోకి వెళ్తున్న ఘోర తప్పిదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం హిందూధర్మ పరిరక్షణకు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం.దేవాలయాల్లో వరుస అపచారాలు..కూటమి ప్రభుత్వం తరహాలో వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏరోజూ ఇలా జరగలేదు. కానీ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిత్యం దేవుళ్లని, హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ వేదిక చేయెద్దని రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. టీటీడీకి సంబంధించిన వ్యవహారాలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం.. లడ్డూ తయారీ నెయ్యిలో లేని కల్తీ జరిగిందని సిట్ దర్యాప్తు వేసి.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దాన్ని వాడుకుంటోంది.అదే విధంగా కాశీనాయన క్షేత్రంలో గోశాల, అన్నదాన సత్రం, భక్తుల విశ్రాంతి భవనాలను టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందని.. అత్యంత అమానుషంగా బుల్డోజర్లతో కూలగొట్టారు. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు. వైయస్.జగన్ హయాంలో అయితే ఇదే కాశీనాయన క్షేత్రానికి సంబంధించి అటవీ భూముల నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖ మంత్రికి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వానికి, వైయస్.జగన్ ప్రభుత్వానికి ఇదే తేడా.వైయస్. జగన్ హయాంలోనే పరకామణి కోసం అత్యాధునిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించారు. కాబట్టే పరకామణి చోరీ వ్యవహారం బయటపడింది. అయితే ఈ కేసులో మాజీ ఏవీఎస్ సతీష్ వేధింపులకు ఎవరు కారణం?, ప్రభుత్వ వేధింపులు కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల నిర్వహణ అత్యంత అధ్వాధ్నాంగా తయారైంది. కేవలం టీటీడీ, కాశీనాయన క్షేత్రాల్లోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లోనూ ఇవే అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. 01–05–2025న సింహాచలం దేవస్దానంలో గోడకూలి 7 మంది సజీవసమాధి అయితే దానికి ఎవరు బాధ్యత వహించారు? ఎవరి మీద చర్య తీసుకున్నారు? పర్వదినాన దర్శనానికి వచ్చిన భక్తులు ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పేతే ఎవరు జవాబూదారీతనంరాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల్లో అసాంఘిక కార్యకలాపాలకు విపరీతంగా పెరిగిపోతున్నా.. పట్టించుకునే నాధుడు లేకుండా పోతుంది. కోడిగుడ్లు తినడం, మద్యపానం, పేకాట వంటివి అష్టాదశ శక్తిపీఠ శ్రీశైలంలో విపరీతంగా పెరిగిపోయాయి. పైగా కూటమి ఎమ్మెల్యే తప్పతాగి, స్వయంగా అటవీశాఖ సిబ్బంది మీద దాడులకు దిగడమేనా సనాతన ధర్మం. ఈ ఏడాది మే 18న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం అద్దేపల్లిపేటలో కోదండరామాలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు. కల్కి, బలరాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి విగ్రహాలను ధ్వంసం చేసి పక్కన పడేశారు. నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు, దాని మీద ఎలాంచి చర్యలు లేవు. ఈ ఏడాది నవంబరు 11న కాశీబుగ్గలో కార్తీక ఏకాదశి నాడు భక్తులు భారీగా వస్తారని తెలిసినా.. కనీస పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిమంది భక్తులు దర్శనానికి రావడంతో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. గుడికి వెళ్తే తిరిగిప్రాణాలతో వస్తామో? రామో? అన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అలాగనే పక్కనే ఉన్న శ్రీకూర్మంలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల... నక్షిత్ర తాబేళ్లు చనిపోతే కనీసం పోస్టుమార్టమ్ కూడా నిర్వహించకుండా ఈవో కార్యాలయం వెనుక వాటిని తగలబెట్టారు. ఇవన్నీ మీ పరిపాలనకు మచ్చుతునకలు.రామతీర్థంలో శ్రీరాముడి తల నరికిన వ్యక్తికి ప్రభుత్వ నిధుల నుంచి రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇచ్చారా? లేదా? ఈ రకమైన కార్యక్రమాలు చేస్తుంది. 2024–25 లో హిందూ ధర్మాన్ని కూటమి ప్రభుత్వం ఎంతటి దుస్థితికి దిగజార్చిందనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. తిరుపతిలో తొక్కిసలాటలో గతేడాది 6గురు చనిపోయారు. దానికి కారణమైన అధికారులను మరలా అదే స్ధానంలో నియమించారు. రెండు రోజుల క్రితం 24, 25 తేదీల్లో మరలా తొక్కిసలాట జరిగింది. మీకు అనుకూలంగా పని చేసే అధికారులు తప్పు చేసినా వారి మీద చర్యలు ఉండవన్నది స్పష్టమవుతోంది.సదావర్తి భూములను వేద పండితుల పోషణ కోసం ఇచ్చారు. అని అన్యాక్రాంతం కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం కాపాడింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో భక్తుల కానుకులు వేసిన హుండీలకు కూడా భద్రత లేదు. అహోబిలంలో రూ.20 లక్షలు భక్తులు వేసిన కానుకలని స్థానిక ఎమ్మెల్యే మనుషులు కైంకర్యం చేస్తే.. కనీసం కేసు కూడా పెట్టలేదు. దేవాలయాల్లో పెరిగిన రాజకీయ జోక్యానికి ఇదే నిదర్శనం. ఆలయాల్లో చొరబడి రాజకీయజోక్యంతో నాశనం చేస్తున్నారు.వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామిని చిన్నతిరుపతిగా పేరు గాంచింది. 19–11–2025న హుండీ లెక్కింపుల్లో వాసంశెట్టి శ్రీనివాసరావు... మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఫారసుతో వచ్చి.. డబ్బులు దొంగతనం చేస్తే కేసు పైలు చేశారు. దీని మీద కూటమి నేతలు నోరు మెదపరు. ఇవన్నీ ఈ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలు.ఇవీ కూటమి ప్రభుత్వ ఘనతలు:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేవు. వారి భద్రతకు చర్యలు తీసుకోకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల ప్రాణాలను గాల్లో వదిలేసింది. రాష్ట్రంలో వివిధ ఆలయాల నిర్వహణ కోసం, వేదపండితులు పోషణ కోసం దేవాలయాలకు భూములిస్తారు. అయితే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక జీవో ప్రకారం ఆలయాల భూములను తమకు తూచినట్లు, టెండర్లు లేకుండానే తమకు నచ్చిన వారికి కట్టబెట్టే విధంగా జీవో జారీ చేసింది. ఇది ఏ మేరకు ధర్మం? వైఎస్ జగన్ హయాంలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని దోచిపెట్టే పని చేస్తోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవస్థానం అయిన.. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో.. 70 వేల మంది భక్తులున్న ఆలయంలో 3 నుంచి 4 గంటల పాటు కరెంటు సరఫరా నిలిపివేసారంటే ఈ ప్రభుత్వ అసమర్థత ఏంటో అర్ధం అవుతుంది. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? దేవాదాయ, ధర్మాదాయ మరియు విద్యుత్ శాఖలకు మధ్య ఉన్న సమన్వయలోపానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వ అసమర్థ పాలనకు తార్కాణం. అనంతపురం సింగనమలలో పుట్ పాత్ మీద సిరి రమణ అనే ఒక అర్చకుడు ఆందోళనకు దిగాడు. 150 ఏళ్లుగా వంశపారపర్యంగా ఆలయ అర్చకత్వం చేస్తుంటే.. వారిని గుడి నుంచి గెంటేస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కలెక్టర్ కు అర్జీ ఇచ్చినా పట్టించుకోకపోవడం అత్యంత అమానుషం.ద్వారకా తిరుమలలో సైతం ప్రభుత్వ అసమర్థ నిర్వహణ వల్లే గోవులు చనిపోతే.. దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. కూటమి పాలన వచ్చిన తర్వాత విశాఖపట్నం వేదికగా పెద్ద మొత్తంలో గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతుంది. హిందూ సమాజానికి జరుగుతున్న అతిపెద్ద ద్రోహం ఇది. బాపట్ల ఎమ్మెల్యే సన్నిహితుడు గోడౌన్ లో పట్టుబడినా చర్యలు శూన్యం. తూతూ మంత్రంగా ఇద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కర్నూలులో లే అవుట్ కి అడ్డంగా ఉందని అలయ గోడ కూల్చి వేసిన ఘటన చోటు చేసుకుంది.ఇంకా టీడీపీ ఎమ్యెల్యే ఒకరు బహిరంగంగా భగవద్గీతను అవమానించారు. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో ఆలయానికి చెందిన 28 ఎకరాలను 22–ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించమని హైకోర్టు ఆదేశిస్తే, మొత్తం 1036 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం జిల్లా రిజిస్టార్కు లేఖ రాసింది. అంటే కోర్టు ఆదేశాన్ని చూపి, మొత్తం భూమిపై కన్నేసి.. అలా ఆలయ ఆస్తుల రిజిస్టర్లో ఇనాం, ఎస్టేట్ భూములని చూపి, దాన్ని స్వాహా చేయడానికి కుట్ర చేశారు. ఆ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1000 కోట్లు.వైఎస్ జగన్ హయాంలో దేవాదాయశాఖలో సంస్కరణలు:వైఎస్ జగన్ హయాంలో ఆలయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. తిరుమలలో శ్రీవాణి పథకం ద్వారా భక్తులు దర్శనాలు చేసుకుంటే.. దానిపైనా విమర్శలు చేసి ఆనేక ఆరోపణలు చేశారు. ఆ పథకాన్ని ఎన్నికల ముందు రద్దు చేస్తామని ప్రకటించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్నే కొనసాగిస్తున్నారు. అంటే వీరు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలనే తేలింది. మరోవైపు చంద్రబాబు హయాంలో గతంలో విజయవాడలో కూలగొట్టిన ఆలయాలన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తిరిగి నిర్మించారు. అసలైన హిందూ పరిరక్షకులు ఎవరన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్
సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్ తగిలింది. పున్నమి ఘాట్లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్లోని మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు..మా హద్దులు వేసుకొని మా భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు. -
కొనసాగుతున్న కక్ష సాధింపు
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ కథా నాయకుడిగా నటించిన పుష్ప–2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడానికి ఆ హాలు నిర్వాహకులే కారణమని హైదరాబాద్ పోలీసులు తేల్చినా, అల్లు అర్జున్ను కేసులో ఏ11గా కొనసాగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ఏడాది డిసెంబర్ 4న చోటుచేసుకున్న ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేవతి మృతికి సంతాపం తెలిపారు. రేవతి భర్తకు ఆరి్థక సహాయం చేసి.. శ్రీతేజ చికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చారు. ప్రజల్లో క్రేజ్ ఉన్న సినీ నటుడు సంధ్య థియేటర్కు వస్తున్న నేపథ్యంలో భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. వారు ముందుగానే తగిన భద్రత కలి్పంచి ఉంటే తొక్కిసలాటకు తావుండేదే కాదు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్షీట్ దాఖలు చేయడం సబబు కాదని, ఇది కక్ష పూరితమని సినీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసిన చిక్కడపల్లి పోలీసులు రెండు రోజుల క్రితం నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారిస్తూ మేనేజ్మెంట్తోపాటు మేనేజర్పైనా అభియోగాలు మోపారు. అల్లు అర్జున్, ఆయన బృందం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 118 (1) రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల జాబితాలో మొత్తం 23 మంది ఉండగా.. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. ఆయనతోపాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపైనా చార్జిషిట్ దాఖలైంది. ఈ కేసులో అల్లు అర్జున్ను పోలీసులు గత ఏడాది డిసెంబర్ 13న అరెస్టు చేశారు. కింది కోర్టు రిమాండ్ విధించగా, అదే రోజు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలకు సంబంధించిన లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆయన ఆ రోజు రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచి్చంది. అక్కడొక న్యాయం.. ఇక్కడొక న్యాయం.. అల్లు అర్జున్ను ఏ–11గా చేర్చుతూ పోలీసులు చార్జిషిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని మేధావులు, సామాజిక వేత్తలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశి్నస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ, ఆయనపై చార్జ్షీట్ దాఖలు చేయడం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు చెబుతున్నారు. ‘ఆంధప్రదేశ్లో 2015 జూలై 14న రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను నాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ సమయంలో తన ప్రచార కండూతితో ఒకేసారి భక్తులను ఘాట్లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారు. 2022 డిసెంబర్ 28న టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు కందుకూరులో ఇరుకు సందుల్లో నిర్వహించిన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించారు. 2023 జనవరి 1న గుంటూరులో చంద్రబాబు పాల్గొన్న సంక్రాంతి కానుక పంపిణీ సభలోనూ తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారు. ఇలా పలు ఘటనల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం చనిపోవడానికి చంద్రబాబే బాధ్యుడని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి బాబుపై ఎన్ని కేసులు నమోదు చేయాలి? ఎన్ని చార్జిషిట్లు నమోదు చేయాలి?’ అని మేధావులు ప్రశ్నింస్తున్నారు. తెలంగాణలోని రేవంతరెడ్డి సర్కార్ తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసు నమోదు చేసిందని స్పష్టం చేస్తున్నారు. రెండు పక్క పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అంటూ విస్తుపోతున్నారు. -
రఘురామను రఫ్ఫాడిస్తున్న ఐపీఎస్
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిపోవడం అంటే ఇదే మరి.. రాష్ట్ర.. జాతీయ రాజకీయాల గురించి.. చిత్రవిచిత్రమైన హావ భావాలతో మిమిక్రీ చేస్తూ ఎదుటివాళ్లను అవహేళన చేయడమే తన ఘనతగా చెప్పుకుంటూ వస్తున్నా ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఒక పోలీస్ అధికారి నోటికి చిక్కారు.గతంలో తనను ఇబ్బంది పెట్టారంటూ అప్పటి సీఐడీ చీఫ్.. డీజీపీ పీవీ సునీల్ కుమార్ను టార్గెట్ చేసిన రఘురామకృష్ణం రాజు సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆనాడు తన విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలంటూ రఘురామ పోస్టులు చేయడమే కాకుండా ప్రకటనలు కూడా చేస్తున్నారు. దీనిపై సునీల్ దీటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సునీల్ కుమార్ రఫ్ఫాడిస్తున్నారు.రఘురామ పాత చరిత్రను తవ్వుతూ సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగించారు. ఇదే తరుణంలో రఘురామ గతంలో బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సునీల్ కుమార్ చేతిలో అస్త్రాలుగా మారాయి.. దీనిపై అయన ఏమని పోస్ట్ చేసారంటే..‘‘కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’.. మూడు బ్యాంక్ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారు.. దీనిపై ఆయనపై సీబీఐ ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), నేరపూరిత కుట్రతోపాటు 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సుప్రీం కోర్టు ఆర్ఆర్ఆర్ని, ఆయన కుటుంబసభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధాని గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యుటీ స్పీకర్ హోదా లో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే ఆది ఆయనకి కాదు రాష్ట్రం మొత్తానికి తలవంపులు. అమరావతి బ్రాండ్ దెబ్బ తింటుంది. పెట్టుబడి పెట్టేవాళ్ళు వెనక్కి పోతారు. ఇలాంటి గజదొంగను, చీటర్ని ఇంత పెద్ద పదవిలో ఎలా ఉంచారు అనే ప్రశ్న రాదా?..ఈ కేసు దర్యాప్తు ముగిసి, కోర్టులో విచారణ పూర్తి అయ్యి రఘురామకృష్ణ రాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవి అయినా ఇవ్వండి. అభ్యంతరం లేదు. ఉప సభాపతి హోదాలో రఘురామకృష్ణ రాజు గారు అరెస్ట్ అయితే అది రాష్ట్రానికే అవమానం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ అయితే ఆయన వరకే అది పరిమితం అవుతుంది. మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తుననా.. మీరు ప్రజల పక్షాన ఉండాలి. ఒక వ్యక్తి వైపు కాదు.. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట పౌరుడిగా నా బాధ్యత. 420 రఘురామ కృష్ణ రాజు గారి మీద ఇంకా అనేక అభియోగాలు ఉన్నాయి. ఆ రిపోర్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిల్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతాయి. అందుకోసం నేను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్లు వేస్తాను. ఈ కేసులో 420 రఘురామకృష్ణ రాజు బయటపడటం జరగదు..అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పైగా దర్యాప్తు చేస్తున్నది సీబీఐ. ఒక 420 కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ఇమేజ్ను ఫణంగా పెట్టవద్దు. నేను చెప్పిన విషయాలు అసత్యం అయితే నా మీద చర్య తీసుకోండి. నేను సిద్ధం. నిజం కాబట్టి తక్షణం 420 రఘురామకృష్ణ రాజు గారిని అన్ని పదవుల నుండి తొలగించాలి. అమరావతి బ్రాండ్ ఇమేజ్ కోసం అమరావతి రైతులు 420 రఘురామకృష్ణ రాజు ని అన్ని పదవుల నుండి తొలగించేలా ఉద్యమం చేయాలి. జై అమరావతి.. జై స్వర్ణాంధ్రప్రదేశ్… జై భీమ్' అంటూ సునీల్ ఎదురుదాడి కొనసాగించారు.తనను సస్పెండ్ చేయడం న్యాయమైతే కోట్లకు బ్యాంకులను ముంచిన రాజును కూడా సస్పెండ్ చేయాలనీ.. ఇదే చేస్తే ఒక శాసన సభ డీప్యూటీ స్పీకర్ సస్పెన్షన్ అనేది రాష్ట్ర పరువుకు సంబంధించిన అంశం అని.. ఆయనను సస్పెండ్ చేస్తే దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు పోతుందని అవహేళన చేసారు. ఇదిలా ఉండగా సునీల్కు అంబేద్కర్ యువజన సంఘాలు.. దళిత సంఘాలు సైతం మద్దతు పలుకుతుండగా అటు రఘురామ మాత్రం కూటమి ప్రభుత్వంలో ఒంటరి అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం వాళ్ళు కానీ.. జనసేనావాళ్లు కానీ.. కనీసం బీజేపీ వాళ్ల కానీ ఒక్క ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టు పెట్టలేదు. దీంతో సునీల్ కుమార్ నేరుగా రఘురామను టార్గెట్ చేసి ఆయన్ను, అయన కుటుంబాన్ని బ్యాంకుల దొంగగా సంభోదిస్తూ పరువు తీస్తున్నారు. దీనికి ఎదురు సమాధానం ఇవ్వలేక రఘురామ సైలెంట్ అయ్యారు.-సిమ్మాదిరప్పన్న -
భారతీయులను వెనక్కి పంపేస్తున్నాయ్..
సాక్షి, అమరావతి: సరైన పత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లిన అనేక మంది భారతీయులను పలు దేశాలు తిరిగి వెనక్కి పంపుతున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా 24,600 మంది భారతీయులు ఇలా వెనక్కి వచ్చారు. భారతీయులను వెనక్కి పంపిన దేశాల్లో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. ఒక్క సౌదీ అరేబియానే 11,000 మంది భారతీయులను సరైన పత్రాలు లేకపోవడం, వీసా గడువు తీరినా ఆ దేశంలో ఉండడం, కార్మిక చట్టాలు ఉల్లంఘించడం వంటి కారణాలతో వెనక్కి పంపేసింది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను బయటకు పంపుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది అమెరికా నుంచి 3,800 మంది ఇలా వెనక్కి వచ్చేయగా అందులో ఒక్క వాషింగ్టన్ నుంచే 3,414 మంది, హోస్టన్ నుంచి 234 మంది ఉన్నట్లు కేంద్ర విదేశాంగమంత్రి తాజాగా రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారే అత్యధికం.. విదేశాలకు భవన నిర్మాణ పనులు చేయడానికి వెళ్తున్నవారిలో అత్యధికమంది ఏజెంట్ల చేతిలో మోసపోయినవారే. మయన్మార్ నుంచి 1,591, మలేíÙయా నుంచి 1,485, యూఏఈ నుంచి 1,469, బహ్రెయిన్ నుంచి 769 మంది వెనక్కి వచ్చారు. సరైన పత్రాలు లేకుండా ఆయా దేశాల్లోకి అడుగు పెట్టారంటూ వెనక్కి పంపించేశాయి. కేవలం ఉపాధి కోసం వెళ్లిన వారే కాకుండా విద్యార్థులు కూడా మోసపోయిన వారి జాబితాలో ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారిలో అత్యధికంగా 170 మందిని బ్రిటన్ వెనక్కి పంపింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా 114 మందిని, రష్యా 82, అమెరికా 45 మంది విద్యార్థులను వెనక్కి పంపాయి. -
మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరమా?
డాబా గార్డెన్స్: ‘‘ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్లముందే విశాఖ స్టీల్ప్లాంట్ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవాడు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని అన్నారు. ప్రశ్నిoచే గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మార్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడదని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్ఎస్ఎస్ అని అన్నారు. శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్రాజ్ తీవ్రంగా స్పందించారు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. -
న్యాయానికి గంతలు కట్టొచ్చేమో.. న్యాయమూర్తులకు కాదు
సాక్షి, అమరావతి: నివాస భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. తరువాత వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా, అది నివాస భవనమేనంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక కమిషనర్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు ఇది. న్యాయానికి గంతలు కట్టొచ్చేమో గానీ, న్యాయమూర్తులకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను పశి్చమ గోదావరి జిల్లా, భీమవరం అప్పటి మునిసిపల్ కమిషనర్కు రూ.2.50 లక్షలను ఖర్చుల కింద విధించింది. ఈ ఖర్చులను సొంత జేబు నుంచి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక నివాస భవనం కోసం అనుమతి తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన ఆ భవన యజమానులు– మణి మంజరి, నరసింహారావుకి సైతం రూ.2.50 లక్షలు ఖర్చులు విధించింది. సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల ఖర్చులను ఈ మేరకు భారీగా పెంచింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) వద్ద జమ చేయాలని ఆదేశించింది. అనంతరం ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మూగ, అంధుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఇటీవల ఒక అప్పీల్పై తీర్పును వెలువరించింది. కాగా, వాణిజ్య భవనం నిర్మించిన ప్రాంతం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా అధికారికంగా మారడం, తమ భవనానికి యజమానులు వాణిజ్య అనుమతులు పొందడం వంటి కారణాల నేపథ్యంలో భవన అనుమతులను రద్దు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. -
ఎరువు.. ధరల దరువు
సాక్షి, అమరావతి: ఎరువుల ధరలు మోతమోగిస్తున్నాయి. అదునుకు యూరియా అందక అగచాట్లు పడుతున్న అన్నదాతలకు మిశ్రమ (కాంప్లెక్స్) ఎరువుల ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలి పోటులా పరిణవిుంచింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు యూరియా, డీఏపీ ఎరువులు దొరకడం లేదు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్న అన్నదాతలకు తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం పెరగడం భారంగా మారింది. గతేడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు పెరిగాయి. చైనా ఆంక్షల ఫలితంగా సూక్ష్మసేద్యంలో విరివిగా వినియోగించే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ (ప్రత్యేక ఎరువుల) ధరలు 25నుంచి 50 శాతం మేర పెరిగాయి. 2023–24లో 50 కిలోల బస్తా రూ.1,250–1,450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల ధరలు ప్రస్తుతం రూ.1,450 నుంచి రూ.1,950కు పెరిగాయి. రబీ సీజన్లో రూ.250 కోట్ల భారంసాధారణంగా రబీ సీజన్లో యూరియా, డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. యూరియా మినహా ఎన్పీకే ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ పథకం కింద ఆరేళ్లకోసారి రాయితీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది. కంపెనీలు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు రాయితీ పెంచితే ఆ భారం రైతులపై పడదు. కానీ.. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు పెంచకపోవడంతో కంపెనీలు పెంచే భారం పూర్తిగా రైతులపై పడుతోంది. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిపదార్థాలపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని ఇటీవలే 5 శాతానికి తగ్గించింది. ఆ మేరకు ఉత్పత్తి వ్యయం తగ్గింది. కానీ.. జీఎస్టీ ఫలాలను జేబుల్లో వేసుకుంటున్న కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడిసరకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఏటా వీటి ధరలను పెంచేస్తుండటం రైతులకు పెనుభారంగా మారుతోంది. గతేడాది కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తాకు రూ.100–150 మేర పెరిగాయి. తాజాగా కంపెనీలు ఆ ధరలను మరోసారి పెంచేశాయి. ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్లోనే ఎరువుల ధరల పెంపు భారం దాదాపు రూ.250 కోట్లకు పైగా రైతులపై పడుతుందని చెబుతున్నారు.ప్రత్యేక ఎరువులూ భారమేసూక్ష్మ సేద్యంలో ఉపయోగించే సూక్ష్మ (డ్రిప్) ఎరువులకు గడ్డుకాలం దాపురించింది. సూక్ష్మ సేద్యానికి ప్రధానంగా మోనో అమ్మోనియం ఫాస్పేట్ (ఎంఏపీ), మోనో పొటాషియం ఫాస్పేట్ (ఎంకేపీ), కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, మైక్రో న్యూట్రియెంట్స్ వంటివి వినియోగిస్తారు. వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్గా పేర్కొనే వీటిని ప్రత్యేక ఎరువులని పిలుస్తారు. దేశీయంగా వీటి వినియోగం 2.5 లక్షల టన్నులు. వీటిలో 60–65 శాతం రబీలోనే వినియోగిస్తుంటారు. వీటిలో 80 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి అవుతాయి. ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో కంపెనీలు వీటి ధరలను 25 నుంచి 50 శాతం వరకు పెంచాయి. ప్రధానంగా కిలోకు ఎంఏపీ, ఎంకేపీ ఎరువుల ధరలు రూ.60–80, ఫె–ఈడీడీహెచ్ఏ (ఐరన్ చెలేట్) వంటి సూక్ష్మ ఎరువుల ధరలు రూ.220 నుంచి రూ.280కి, జెడ్ఎన్–ఏడీటీఏ అనే జింక్ ఎరువుల ధరలు రూ.130–170 మేర పెరిగాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల భారం మోయలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.రైతుల ఆందోళనదాచేపల్లి: యూరియా కోసం గంటల తరబడి పడిగాపులుపడ్డ రైతులకు అవి దక్కకపోవటంతో శనివారం ఆందోళనకు దిగారు. పల్నాడు జిల్లా నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో సిబ్బంది కూపన్లు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాతో పాటు రూ.266 విలువచేసే నానో యూరియా డబ్బా కూడా తీసుకోవాలని సిబ్బంది మెలిక పెట్టారు. నానో యూరియా డబ్బా తీసుకునేందుకు రైతులు అంగీకరించలేదు. దీంతో సిబ్బంది రైతులకు చెప్పాపెట్టకుండా తాళాలు వేసి వెళ్లిపోయారు. రైతులు మండల వ్యవసాయ శాఖాధికారి కంచర్ల వెంకటేష్కి జరిగిన విషయాన్ని వివరించారు. ఆయన సిబ్బందితో మాట్లాడి యూరియా బస్తాలు రైతులకు ఇవ్వాలని సూచించినా సిబ్బంది యార్డుకు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. చివరకు.. ఏఓ సమక్షంలో యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. -
హక్కులు రావడమే వారికి శాపం
సాక్షి, అమరావతి: దశాబ్దాల పాటు సాగిన ఆంక్షల చెర నుంచి గత ప్రభుత్వంలో విముక్తి పొందిన అసైన్డ్ పేద రైతుల భూములపై చంద్రబాబు సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. 13.59 లక్షల ఎకరాలపై చట్టబద్ధంగా హక్కులు కల్పించడాన్ని నేరంగా చిత్రీకరిస్తూ ఏడాదిన్నర నుంచి వాటిని నిషేధిత జాబితా 22ఏలో చేర్చి ఇబ్బందిపెడుతోంది. తన హయాంలో భూములకు సంబంధించి ఒక్క సంస్కరణ కూడా చేయకుండా వాటన్నిటినీ వివాదాల్లో ముంచిన చంద్రబాబు... వైఎస్ జగన్ హయాంలో జరిగిన సంస్కరణ కారణంగా లబ్ధి పొందిన 20 లక్షల మంది అసైన్డ్ భూముల రైతులను అష్టకష్టాలు పెడుతున్నారు. తమ హక్కులను అనుభవించనివ్వాలని రైతులు వేడుకుంటున్నా చంద్రబాబు కనికరించడం లేదు. వారిని కుట్రదారులుగా చిత్రీకరిస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి నడుంబిగించి అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసింది. దశాబ్దాల పాటు భూములపై ఏ హక్కులు లేకుండా కేవలం సాగుకే పరిమితమైన పేద రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తమకు హక్కులు ఇవ్వాలని ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇతర పేద రైతులు ఎన్నో ఏళ్లుగా కోరినా, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి మేలు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధ్యయనం చేసింది. అనంతరం రాష్ట్ర రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు (ఫ్రీహోల్డ్) ఇచ్చింది. దీంతో 27.40 లక్షల ఎకరాలకు చెందిన అసైన్డ్ రైతులకు సంపూర్ణ హక్కులు దక్కాయి. వారు ప్రైవేటు భూముల తరహాలో తమ భూములకు హక్కుదారులు అయ్యారు. 2024లో ఎన్నికలు జరిగే సమయానికి 13.59 లక్షల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చేసి దాదాపు 20 లక్షల మంది రైతులను యజమానులను చేసింది. కొందరు అమ్ముకోవడం తప్పా? హక్కులు వచ్చిన రైతుల్లో కొందరు భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో అమ్ముకున్నారు. దీన్ని కూటమి ప్రభుత్వం వివాదంగా మార్చింది. వాస్తవానికి ఇలా క్రయవిక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు సంబంధించిన భూములు మాత్రమే. మిగిలినవన్నీ అసైనీల చేతుల్లోనే ఉన్నాయి. కానీ, రైతులకు మేలు చేసే ఈ సంస్కరణను చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతూ ఈ భూములన్నీ అక్రమమని... వాటిని 22ఏ జాబితాలో పెట్టింది. దీంతో రిజి్రస్టేషన్లు జరగడం లేదు. సంబంధిత రైతులు రుణాలు కూడా తీసుకోలేకపోతున్నారు. 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలినా... కూటమి ప్రభుత్వ విచారణలోనే 10 లక్షల ఎకరాలు సక్రమమని తేలింది. ఏడాదిన్నరగా ఫ్రీహోల్డ్ భూములపై విచారణ చేయిస్తూనే ఉంది. రెండుసార్లు వెరిఫికేషన్ చేసి, అధికారుల కమిటీలతో విచారణ జరిపించారు. ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రుల సంఘం అరడజనుసార్లు సమావేశమైనా ఏమీ తేల్చలేదు. ఫ్రీహోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడమే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వాస్తవానికి రెవెన్యూ శాఖ విచారణలో సుమారు 10 లక్షల ఎకరాలు సక్రమంగా ఫ్రీహోల్డ్ అయినట్లు తేలింది. మిగతా 4 లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పినా అవి ఏమిటనేది కచ్చితంగా తేల్చలేకపోయింది. కేవలం రాజకీయ కారణాలతోనే కొన్ని జిల్లాల్లో ఫ్రీహోల్డ్ భూములపై వివాదాలు సృష్టించారు. ఎక్కడైనా అధికారులు, భూ మాఫియాకు చెందినవారి వల్ల పొరపాట్లు జరిగితే సరిదిద్దాల్సింది పోయి అన్నింటినీ వివాదాస్పదంగా చూపుతూ చంద్రబాబు సర్కారు రైతుల కడుపు కొడుతోంది. రాజధానిలో అసైన్డ్ రైతుల నుంచి భూములు కొల్లగొట్టి వారికి రావాల్సిన ప్లాట్లను దర్జాగా దోచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా అసైన్డ్ రైతుల భూములను కూడా కొట్టేసే ప్రయత్నాలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడ్డగోలుగా వక్రీకరించి 22ఏ జాబితాలో పెట్టారుఅసైన్డ్ భూముల చట్టానికి సవరణ ద్వారా జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనిని వక్రీకరించి 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు టీడీపీ మంత్రులు, నేతలు అడ్డగోలుగా వాదించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రీ హోల్డ్ అయిన 13 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలకు మాత్రమేనని టీడీపీ ప్రభుత్వమే నిర్ధారించింది. ఇంకా ఎక్కడైనా ఉల్లంఘనలుంటే విచారణ జరిపి మిగిలిన భూములపై ఆంక్షలు ఎత్తివేయాలి. కానీ, ఆ పని చేయడంలేదు. వైఎస్ జగన్ హయాంలో యాజమాన్య హక్కులు రావడమే వారికి శాపంగా మారింది. ఫ్రీహోల్డ్ భూముల రిజి్రస్టేషన్లకు అనుమతి ఇస్తే అది చేసింది వైఎస్ జగన్ కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దానిపై నిత్యం బురద జల్లుతూనే ఉంది. దీంతో లక్షలాది మంది రైతులు లబోదిబోమంటున్నారు. -
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సామాజిక బాధ్యతను గాలికొదిలేసింది. కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వకపోగా, ఉన్న పింఛన్లలో నెల నెలా కోత పెడుతోంది.. నోటీసులతో బెంబేలెత్తిస్తూ అర్హులైన లబ్దిదారులను కుదిస్తోంది.. పేదరికంలో మగ్గిపోతూ.. నడవలేని దుస్థితిలో.. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్కు చేరుకుని ‘కనికరించండయ్యా.. మా దీనస్థితిని చూడండయ్యా.. పింఛన్ ఇప్పించండయ్యా..’ అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లా సర్వోన్నతాధికారులైన కలెక్టర్లు అభాగ్యుల వినతి పత్రం తీసుకోవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోతున్నారు.. ‘ఇది సర్కారు పెద్దల నిర్ణయం.. మా చేతిలో ఏమీ లేదు’ అని చెప్పలేక పోతున్నారు.. వెరసి అభాగ్యులు ప్రతి వారం కాళ్లరిగేలా తిరుగుతున్నారు.జగన్ సీఎం అయ్యే నాటికి పింఛన్లు 39 లక్షలువైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లు 66,34,372ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు : 61,24,605బాబు ప్రభుత్వంలో కోత : 5,09,767రూపాయికి, అర్ధ రూపాయికి కార్పొరేట్లకు భూములు కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు పేదల పింఛన్ ‘ఆశ’పై మాత్రం నీళ్లు చల్లుతూనే ఉంది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత దారుణంగా వ్యవహరిస్తుండటం బహుశా దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా ఉండి ఉండదు. పైకి మాత్రం వాట్సాప్ గవర్నెన్స్ అంటూ గొప్పలకు కొదవ లేదు.. ఇలా వాట్సాప్లో మెసేజ్ చేస్తే అలా సమస్య పరిష్కరించేస్తామంటూ ఊదరగొడుతోంది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఊరూరా కన్నీటి గాధలే కనిపించాయి. నాడు పింఛన్ వచ్చింది.. నేడు ఏం పాపం చేశాను?శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన గడే తేజకు రెండు కాళ్లు కదలవు. మాటలు సరిగా రావు. వైద్యులు 98 శాతం వైకల్యం ఉందని ధ్రువపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్ వచ్చేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం.. ఉన్న పింఛన్ను సైతం తొలగించింది. ఎందుకు తొలగించారో చెప్పే వారు లేరు. ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. నేను ఏం పాపం చేశాను? ఎందుకు నా పింఛన్ ఆపేశారని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి నెట్వర్క్: రోజులు గడుస్తున్నాయి.. వయసు పెరుగుతోంది.. 60.. 61.. 62.. కానీ ప్రభుత్వం నుంచి పింఛన్ రాలేదు. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ అందిస్తాం అని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నీటి మూటలే అని తేటతెల్లమైంది.. పోనీ, దివ్యాంగులనైనా కనికరిస్తున్నారా.. అంటే అదీ లేదు.. ఒంటరి మహిళల ఊసే లేదు.. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే పింఛన్ తీసుకుంటున్న వారు ఎవరైనా చనిపోతేనే.. ఆ స్థానంలో తిరిగి మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా చేశారు. సచివాలయంలో అడిగితే వాళ్లకు ఏ సమాచారం లేదని చెబుతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేయాలో తెలియడం లేదు. దానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారో అంతకంటే తెలియదు. ఊళ్లలో వృద్ధులు మాత్రమే కాదు కదల్లేని దివ్యాంగులు సైతం పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పినంత సులువుగా చంద్రబాబు పని చేయడంలేదని, పూట గడవక అల్లాడిపోతున్నా ఆదుకోవడం లేదంటూ వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో.. ప్రతి ఊళ్లోనూ పింఛన్ గాధలు చూస్తుంటే కంట నీరొస్తోంది. పింఛన్లలో కోతలే కోతలుఇటు కొత్త పింఛన్ ఇవ్వకపోగా గతంలో వైఎస్ జగన్ హయాంలో పెన్షన్లు అందుకున్న లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి దూరం చేసింది. సూపర్ సిక్స్ పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. తర్వాత తన నిజ స్వరూపం చూపుతున్నారు. రకరకాల కారణాలతో పెన్షన్ల సంఖ్యను కుదిస్తూ వస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే నాటికి 39 లక్షలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. 2024 మార్చిలో ఎన్నికల నాటికి వైఎస్ జగన్ ప్రభుత్వం 66,34,372 మందికి పింఛన్లు ఇచ్చేది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 27లక్షలకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కారు పింఛన్లను 61,24,605కే పరిమితం చేసింది. అంటే ఏకంగా 5,09,767 పెన్షన్లను నిర్ధాక్షిణ్యంగా కత్తిరించింది. కొత్తగా ఒక్కరికీ పింఛన్ ఇవ్వకపోగా, విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు.. చేస్తున్నారు. రీ–వెరిఫికేషన్ పేరిట వారికి నరక యాతన చూపిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ పింఛన్ అందేది. అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, మంజూరు చేసేది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరు చేసింది. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రకరకాల వెరిఫికేషన్ల పేరిట వీరి సంఖ్యను నెల నెలా తగ్గిస్తోంది. రీ–వెరిఫికేషన్ అంటూ వారిని సదరం పేరిట మళ్లీ మళ్లీ ఆస్పత్రులకు తిప్పుతోంది. తొలగించిన వారితో పాటు రెండు మూడు లక్షల మంది కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ఊరూరా ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు. మంచానికే పరిమితమైనా అందని పింఛన్కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడికి చెందిన ఇతని పేరు కాకర అబ్బులు. వయసు 58 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం జామాయిల్ చెట్టు నరుకుతుండగా చెట్టు మీద పడటంతో మెడ విరిగిపోయింది. మెడకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటుండగా, నడుం నొప్పి ప్రారంభమైంది. నడుము దెబ్బతిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ మంచానికే పరిమితమయ్యాడు. ‘నా కుమారుడు శాంతి ప్రసాద్ 10వ తరగతితో చదువు ఆపేసి కూలి పనులకు వెళుతున్నాడు. నాకు సదరం సర్టిఫికెట్ మంజూరైనా పింఛన్ మంజూరు కాలేదు.’ అని అబ్బులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కడుపు కొట్టడమే.. ఇతని పేరు శ్రీనివాసులు. శ్రీ సత్యసాయి జిల్లా పేరూరుకు చెందిన ఇతనికి 2010లో జరిగిన ప్రమాదంలో వెన్నెముక చితికిపోయింది. అప్పటి నుంచి మంచం, వీల్ చైర్కే పరిమితం. ఎటూ కదల్లేడు. గత 15 సంవత్సరాల్లో వైద్య ఖర్చుల కోసం తన పది ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాడు. 90 శాతం వైకల్యం ఉందని వైద్యులు సర్టిఫికెట్ జారీ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇతనికి రూ.6 వేల పింఛన్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం రీ–వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ శాతాన్ని 77కు తగ్గించేసింది. దీంతో పూర్తి వైకల్యం కలిగిన బాధితులకు వచ్చే రూ.15 వేల పింఛన్కు అర్హత లేకుండా పోయింది. ఈనెల 22న కలెక్టరేట్లో కలెక్టర్కు తన గోడు విన్నవించుకున్నాడు.19 నెలలుగా ఎదురుచూపులు ఈమె పేరు అబ్బోల్ల లక్ష్మీదేవి. శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం చెరువు వాండ్లపల్లి గ్రామం. ఈమె రెండేళ్ల కిందట గ్రామంలో కూలి పనులకు వెళ్లి వేరుశనక్కాయలు ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కుడి చేయి మిషన్లో ఇరుక్కొని కట్ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత సదరం సర్టిఫికెట్ తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైంది. అన్ని అర్హతలున్నా పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఆన్లైన్లో పెన్షన్కు సంబంధించిన సైట్ ఓపెన్ కాలేదని అధికారులు వెనక్కి పంపిస్తున్నారని వాపోతోంది.నా గోడు పట్టించుకునే వారేరీ? శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొగిడియా పుట్టుగకు చెందిన బొగిడియా లక్ష్మి కూలి పని చేస్తుండగా ఏడాదిన్నర క్రితం ప్రమాదవశాత్తు కుడి కాలు కోల్పోయింది. ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని, తనకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతోంది. కొబ్బరి తోటల్లోకి వెళ్లి ఇదివరకట్లా పనులు చేయలేక పోతోంది. పూరింట్లో ఉంటున్న ఈమె.. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి అగచాట్లు పడుతోంది. తనకు 84 శాతం దివ్యాంగురాలిగా గుర్తింపు సర్టిఫికెట్ ఇచి్చనా.. ఈ ప్రభుత్వం తనకు ఎందుకు పింఛన్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విలపిస్తోంది. అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వడం లేదు విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన సత్యం, సీతమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. సెంటు భూమి కూడా లేదు. దివ్యాంగుడైన లక్ష్మణ అనే కుమారుడు ఉన్నాడు. అంతు చిక్కని వ్యాధితో పక్షవాతానికి గురికావడంతో అతని రెండు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మంచానికే పరిమితం అయ్యాడు. ఆ వృద్ధులు బతకడమే కష్టం అనుకుంటే వారికి బరువుగా మారాడు. లక్ష్మణకు 2024లో సదరం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఆ తర్వాత పింఛన్కు దరఖాస్తు చేశారు. ఎదురు చూపులే తప్ప ఫలితం లేదు. తామెంత కాలం బతికి ఉంటామో తెలియదని, తమ తదనాంతరం తమ కొడుకు పరిస్థితి ఏమిటని వారు విలపిస్తున్నారు. వెన్నుపూస దెబ్బతిన్నా.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు పితానివారిపాలెనికి చెందిన నాగవరపు శ్రీనివాసరావుకు వెన్నుపూస దెబ్బతింది. కాళ్లు పని చేయడం లేదు. మంచానికే పరిమితమయ్యాడు. 81 శాతం దివ్యాంగత్వం ఉందని సదరం సరిఫ్టికెట్ ఇచ్చారు. పింఛన్కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. శ్రీనివాసరావును తీసుకుని ఆయన భార్య సత్యవతి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును సైతం కలిశారు. అయినా ఫించన్ మంజూరు కాలేదు. ఒక్క అడుగేయలేదన్నా కనికరం లేదు తిరుపతి జిల్లా పాకల మండలం రమణయ్యగారిపల్లెకి చెందిన హేమలత, రమణయ్యకు ఇద్దరు పిల్లలు. పెద్ద బిడ్డ హని్వత (6) మానసిక వైకల్యంతో మంచానికే పరిమితం. అడుగు తీసి అడుగు వేయలేదు. అత్యంత పేద కుటుంబం. సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులకు వెళుతుంటారు. పింఛన్ డబ్బులు వస్తే బిడ్డ వైద్య ఖర్చులకు సాయంగా ఉంటుందని ఏడాదిగా పింఛన్ కోసం తిరుగుతూనే ఉన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తాము మొరపెట్టుకున్నా.. పింఛన్ దరఖాస్తుకు అనుమతులు రాలేదని చెబుతున్నారు.రెండేళ్ల నుంచి తిరుగుతున్నా... అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురానికి చెందిన రావి సత్యవతి భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్ మంజూరు చేయాలని సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘జగన్ బాబు ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గ్రామంలో మాలాంటోళ్లకు పింఛన్లు ఇచ్చేవోళ్లు, నాఖర్మేటో భర్త పోయి ఏ ఆసరా లేకుండా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు పింఛన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను. పింఛన్ రావాలంటే నేను కూడా పోవాలేమో. చంద్రబాబు వచ్చేక కొత్తగా ఒక్కరికీ పింఛన్ ఇవ్వలేదంట’ అని వాపోతోంది. ఈమెకు అర్హత లేదా?పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన జయశ్రీ పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. పూర్తిగా మంచానికే పరిమితం. ఆమెతో పాటు.. ఒకరు కచి్చతంగా తోడు ఉండాల్సిందే. నెలవారీ మందులకే రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు సామాజిక పింఛను అందిస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జయశ్రీకి మాత్రం కేవలం రూ.6 వేలు అందిస్తోంది. తమ బిడ్డ పరిస్థితిని పరిశీలించి పింఛన్ మొత్తాన్ని పెంచాలని తల్లిదండ్రులు రమణమ్మ, వెంకటరావు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. గత సోమవారం కూడా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంత తిరిగినా పట్టించుకోవడంలేదు‘మేడం.. మా నాన్న మహబూబ్బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్బాషా గత మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది.తోడ్పాటు కోసం ఎదురుచూపు బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పెరికల శకుంతల ఏడాదిన్నర క్రితం ఉన్న పళంగా పక్షవాతం బారిన పడింది. కాలకృత్యాలు సైతం మంచంలోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి. పక్షవాతం రోగులకు ఇచ్చే పింఛన్ రూ.15 వేలకు నోచుకోలేదు. సదరం క్యాంపుల చుట్టూ తిరిగి తిరిగి ఎట్టకేలకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం తెచ్చుకున్నా పింఛన్ అందడం లేదు. డైపర్లు, నెలవారి మందుల కోసం నెలకు రూ.8 వేలు ఖర్చు చేస్తున్న ఆ కుటుంబానికి ప్రభుత్వ తోడ్పాటు అందడం లేదు. నా కాలు చూడండయ్యా.. ఇతని పేరు గంటస్వామి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. మధుమేహంతో రెండేళ్ల క్రితం కాలు తీసేశారు. చేతి వేలు కూడా తీసేశారు. పని చేసుకోలేడు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా, దాని ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పూట గడవడానికి ఒక్కోసారి అడుక్కోవాల్సి వస్తోంది. ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 2024లో సదరం ధ్రువపత్రం తెచ్చుకున్నాను. 75 శాతం వికలాంగత్వం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛన్ కోసం వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని చెప్తున్నారు. నాలాంటి వికలాంగుల కోసం అనుమతులు వచ్చే వరకు వేచి ఉంటే నా బతుకు ఏమైపోవాలి? నా కాలు వైపు ఓసారి చూడండయ్యా’ అని వేడుకుంటున్నాడు. ఎన్నిమార్లు వినతులివ్వాలి? ఈమె పేరు కె.నళిని. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు గ్రామం. భర్త, ముగ్గురు పిల్లలతో నిశ్చింతగా సాగుతున్న ఈమె జీవితంలోకి కష్టం ఒక్కసారిగా వచ్చిపడింది. గ్రానైట్ క్వారీలో పని చేస్తూ కుటుంబ పోషణ భారం చూసుకునే ఈమె భర్త అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం ఆమెపై పడింది. పెద్దగా ఆస్తులు లేవు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకోవడంతో తాపీ పనుల్లో కూలీగా చేరింది. వితంతు పింఛను కోసం ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పింఛన్ మంజూరు కాలేదని కన్నీటిపర్యంతమవుతోంది. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఈమె పేరు వంతాల రాధిక. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పనసపుట్టు గ్రామం. భర్త జోగేశ్వరరావు 2025 మార్చి 22న అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు ఆడ పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. తిండి గింజల కోసం వ్యవసాయమే ఆధారం. వితంతు పింఛన్ సౌకర్యం కల్పించాలని 10 నెలల నుంచి గ్రామ సచివాలయం, డుంబ్రిగుడ మండల పరిషత్ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కనికరించలేదు. దరఖాస్తే తీసుకోవడం లేదు ఇతని పేరు గద్దల రామకృష్ణ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు. వ్యవసాయ కూలీ. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కూలి పనికి వెళ్లి మెట్లపై నుంచి కిందపడిపోయాడు. వెన్నెముక విరిగిపోయింది. రెండుసార్లు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. వీల్ చైర్కు పరిమితమయ్యాడు. 87 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళితే గ్రామ సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకోకుండానే వెనక్కు పంపారు. గ్రామ సచివాలయంలో అడిగితే ఆన్లైన్లో సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా అదే సమాధానం వస్తోందని బావురుమంటున్నాడు. వైకల్యం కనిపించడం లేదేమో! నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తులకు చెందిన ఇట్టే భూపాల్కు ప్రమాదవశాత్తు ఏడాదిన్నర క్రితం కుడికాలు పోయింది. ఒంటి కాలితో అవçస్థలు పడుతున్నాడు. ఏదైనా అత్యవసర పని నిమిత్తం కొద్ది దూరం వెళ్లాల్సి వస్తే కర్రల సాయంతో నడుస్తున్నాడు. తనకు పింఛన్ మంజూరు చేయాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి ఆ గ్రామానికి వెళ్లగా ఆయన వద్దకు వెళ్లి వికలాంగత్వ ధ్రువపత్రం, పోగొట్టుకున్న కాలిని చూపించి తనకు పింఛన్కు అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదని విలపించాడు. -
‘కూటమి సర్కార్ పబ్లిసిటీ మీద బతుకుతోంది’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్కు వస్తున్న జనాదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారని.. ఆయన దిక్కులేని స్థితిలోకి పడిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అంటే రౌడీలుగా ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రాష్ట్రంలో జనం తీవ్రంగా వ్యతిరేకించారన్నారు.‘‘జగన్ పుట్టినరోజు వేడుకలను ఈసారి చాలా గొప్పగా జరిగాయి. వీటిని చూసి చంద్రబాబు అసలు తట్టుకోలేకపోయారు. దీంతో చంద్రబాబుకు ఊపిరి సలపటం లేదు. అంతలోనే రాజధానికి భూమి ఇచ్చిన రైతు మృతి చెందారు. వీటన్నిటినీ డైవర్షన్ చేసేందుకు కొత్త డ్రామా ఎత్తుకున్నారు. హోంమంత్రి అనిత జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్నారు...చంద్రబాబు పుట్టినరోజు వేడుకలకు అనేక పొట్టేళ్ల తలలు నరికారు. బాలకృష్ణ సినిమా ఫ్లెక్సీకి పొట్టేళ్ల తల కాయలతో దండలు వేశారు. మరి మమ్మల్ని ప్రశ్నించే హోంమంత్రి అనిత.. చంద్రబాబు, బాలకృష్ణను ప్రశ్నించగలరా?. రప్పారప్పా అనే పదం పోస్టర్ వేశారని మా వారిపై కేసులు పెడుతున్నారు. ఆ డైలాగ్ తప్పు అయితే మరి సెన్సార్ బోర్డ్ ఎలా అంగీకరించింది?. హోంమంత్రి అనితకి అధికారం వలన ఇవేమీ కనపడటం లేదు. కుప్పంలో ఒక మహిళ తనపై లైంగికదాడి చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం పనితీరు..బల్క్ డ్రగ్ పార్కు విషయంలో అనిత ఎన్నికలకు ముందు ఒకమాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఒక రైతు గుండె పగిలి చనిపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?. జాకీలు ఎత్తే మీడియా ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తే జనం సహించరు. పోలీసులను ఇంత దుర్మార్గంగా వాడుతున్న ప్రభుత్వం ఇదే. పబ్లిసిటీ మీద బతుకుతున్న ప్రభుత్వం ఇది’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
‘అన్ని గుర్తు పెట్టుకుంటాం.. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోయారని.. జంతుబలి అంటూ నానాయాగీ చేశారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన జంతుబలి కనపడలేదా?. చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలి కనపడలేదా?’’ అంటూ నిలదీశారు.‘‘మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రతిదీ మేము గుర్తు పెట్టుకుంటాం. అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం.. గుర్తు పెట్టుకోండి. హోంమంత్రి అనిత అసమర్థ మంత్రి. పోలీసు వ్యవస్థను దేశంలోనే 36వ స్థానానికి తీసుకెళ్లారు. అదీ హోంమంత్రి పనితీరు. మమ్మల్ని దూషించే ముందు పోలీసు శాఖను సరి చేయండి. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టటం కాదు’’ అని వరుదు కళ్యాణి హితవు పలికారు.‘‘మీకు దమ్ముంటే మీ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోండి. మహిళను వేధించిన మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ని అరెస్టు చేయండి. రప్పారప్పా అనే సినిమా డైలాగ్ కూడా వినలేక పోతున్నారు. మరి బాలకృష్ణ సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయో చూడండి. టీడీపీ సోషల్ మీడియా సైకోల్లాగా వ్యవహరిస్తోంది. గీతాంజలి అనే తెనాలి యువతి ఆత్మహత్య చేసుకునే వరకు టీడీపీ సోషల్ మీడియా చేసింది. కదిరి ఘటనలోని అజయ్ దేవ మా కార్యకర్త కాదని తెలియగానే హోంమంత్రి అనిత పడుతున్న పాట్లు మాకు అర్థం అయింది. జగన్ని తిట్టటానికే అనిత పదవిలో ఉన్నారు..చంద్రబాబు తన తల్లి, చెల్లెలకు ఏ మాత్రం ఆస్తి ఇచ్చారో అనిత తెలుసుకుంటే మంచిది. హైదరాబాదులో రాజభవనం కట్టి కనీసం తల్లి, చెల్లెల్ని పిలవని వ్యక్తి చంద్రబాబు. హోంమంత్రి అనిత ఆ విషయాల గురించి మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మంచిది. ఎమర్జెన్సీ కాల్ చేస్తే పోలీసులు స్పందిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వమే ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పెట్టే అక్రమ కేసులకు మావాళ్లు భయపడరు’’ అని వరుదు కల్యాణి తేల్చి చెప్పారు. -
ఈనాడు సంపాదకీయంపై YSRCP ఎస్సీ సెల్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: ఈనాడు సంపాదకీయంపై వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ రోత రాతలు రాసిన ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఈనాడు పత్రికను బహిష్కరిస్తున్నట్టు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కార్యకర్తలు.. ఈనాడు ప్రతులను తగులపెట్టి నిరసన తెలిపారు.టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్దమనిషి ముసుగు వేసుకున్న నకిలీ నాయకుడంటూ ధ్వజమెత్తారు. ఆయన చెప్పేది ఒకటి, చేసేదిమరొకటి.. చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా కుట్రలు, కుతంత్రాలే. ప్రజల కష్టాలను వదిలేసి చంద్రబాబుకు భజన చేయటంలో ఎల్లోమీడియా తరించిపోతోంది’’ అంటూ టీజేఆర్ నిప్పులు చెరిగారు.‘‘అమ్మవారికి బలి ఇవ్వటం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. జగన్కు కొందరు అభిమానులు రక్తంతో తర్పణం చేయటం తప్పని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు పుట్టినరోజు నాడు జరిగిన జంతుబలిని ఏం అంటారు?. బాలకృష్ణ ఫ్లెక్సీకి మేకలను చంపి దండగా వేశారు. మరి దీన్ని జీవహింసగా ఎందుకు మాట్లాడటం లేదు?. జగన్ ఏనాడూ హత్యా రాజకీయాలు ఏనాడూ చేయలేదు. ప్రజలను ప్రేమిస్తూ వారికోసం ఎన్నో మేళ్లు చేసిన వ్యక్తి జగన్.. అందుకే అన్ని వర్గాల ప్రజలూ జగన్ని ప్రేమిస్తారు..ఇది తట్టుకోలేక ఎల్లోమీడియా, చంద్రబాబు జగన్పై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే కొన్ని తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చని ఎల్లోమీడియా చూస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దన్నందుకు ఈనాడు పత్రిక విషం కక్కింది. ఈనాడు పత్రిక చంద్రబాబు జేబుసంస్థ. జగన్ పై నిత్యం విషం కక్కుతున్న ఈనాడును బహిష్కరిస్తున్నాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక అనైతిక చర్యలకు పాల్పడుతోంది. అందుకే ఈనాడును ఎవరూ చదవద్దు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ వెనుక జరిగిన స్కాంలపై అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తాం. తప్పులు తేలితే కచ్చితంగా చర్యలకు దిగుతాం’’ అంటూ టీజేఆర్ సుధాకర్బాబు హెచ్చరించారు. -
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
సాక్షి, గుంటూరు: మందడంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి నిరసన సెగ తగిలింది. నిన్న గ్రామసభలో రైతు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన పెమ్మసానిని.. మీరు ఎందుకొచ్చారంటూ రైతు కుటుంబం నిలదీసింది. మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ వల్లే రామారావు చనిపోయాడని ఆరోపించిన రైతు రామారావు కుటుంబ సభ్యులు.. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. ‘మీ సానుభూతి మాకు అక్కర్లేదు’’ అంటూ రైతు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ జరిగింది..రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో నిన్న(శుక్రవారం డిసెంబర్ 26) సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ..‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు.ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
సిరుల ట్యూనా.. 'దళారులకేనా'?
సాక్షి, విశాఖపట్నం: వలకు చిక్కితే సిరులు కురిపిస్తుంది.. తింటే పుష్కలంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది.. ఎగుమతి చేస్తున్నామంటే చాలు, కొనుగోలు చేసేందుకు విదేశాలు క్యూ కడతాయి. అలాంటి అపారమైన మత్స్య సంపద తూర్పు తీరానికి సొంతం. ఆరోగ్య ప్రయోజనాలు, ఎగుమతి డిమాండ్ పరంగా అంతా సానుకూలంగా ఉన్నా.. సిరులు కురిపించే విషయంలో మాత్రం మత్స్యకారులకు అన్యాయమే జరుగుతోంది, వారి శ్రమ దోపిడీకి గురవుతోంది. వందల కిలోమీటర్ల దూరం వెళ్లి, గంటల తరబడి వేచి చూస్తే గానీ చిక్కని ట్యూనా చేపలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో దళారులకే లబ్ధి చేకూరుతోంది. జాతీయ మత్స్య పరిశోధన సంస్థ(ఎఫ్ఎస్ఐ) సర్వే ప్రకారం.. విశాఖ, కాకినాడ నుంచే ట్యూనా అత్యధికంగా ఎగుమతి అవుతున్నా, గంగపుత్రులకు మాత్రం ఆశించిన లాభం చేకూరడం లేదు. అపారమైన సంపద ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ ఇన్చార్జి సి.ధనుంజయరావు నేతృత్వంలో శాస్త్రవేత్త జి.వి.ఎ.ప్రసాద్ ట్యూనా సంపదపై సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించారు. 2024 అక్టోబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు విశాఖ ఫిషింగ్ హార్బర్, పెదజాలారిపేట, పూడిమడక, కాకినాడ కేంద్రాలుగా లభ్యమైన సముద్ర ఉత్పత్తులపై సర్వే చేసిన సమయంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. విదేశీయులకు అత్యంత ఇష్టమైన, డిమాండ్ ఉన్న ట్యూనా చేపలు ఎక్కువ శాతం ఇక్కడే లభ్యమవుతున్నట్లు తేలింది. తూర్పు ఎగువ తీరంలో ట్యూనా చేపల దిగుబడి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. విశాఖపట్నం, కాకినాడ తీరాల్లో మత్స్యకారులు జరిపే వేటలో 50 నుంచి 60 రకాల చేపలు లభ్యమైతే.. వాటిల్లో ట్యూనాల వాటా 50 శాతానికి పైగా ఉంటోందంటే.. ఇక్కడ వీటి దిగుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎల్లో ఫిన్ ట్యూనా(పసుపురెక్కల సూర), బిగ్ ఐ ట్యూనా(పెద్దకన్ను సూర), స్కిప్జాక్ ట్యూనా (నామాల సూర) తదితర రకాలు విశాఖ ఫిషింగ్ హార్బర్కు రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు వస్తున్నాయి. కాకినాడ తీరంలోనూ 100 టన్నుల వరకు లభ్యత ఉన్నట్లు ఎఫ్ఎస్ఐ శాస్త్రవేత్త ప్రసాద్ సర్వేలో స్పష్టమైంది. శ్రమకు తగిన ధర ఎక్కడ? ఇంత కష్టపడి రోజుల తరబడి సముద్రంలో వేటాడి వస్తే.. ట్యూనా విషయంలో మాత్రం మత్స్యకారులకు ఆశించిన రాబడి రావడం లేదు. స్థానిక ప్రజలు ట్యూనాను తినేందుకు అంతగా ఆసక్తి చూపించరు. దీంతో లోకల్ మార్కెట్లో గిరాకీ ఉండదు. ఇక చేసేది లేక.. దళారులు ఎంత ధర ఇస్తామంటే అంత ధరకు అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా ఇక్కడ ట్యూనా మార్కెట్పై దళారులే పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మత్స్యకారులకు కిలోకు రూ.120 నుంచి గరిష్టంగా రూ.180 వరకూ మాత్రమే ముట్టజెబుతున్నారు. ఇక వేట నిషేధ సమయంలో పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు చిన్న పడవలపై వందల కిలోమీటర్లు వెళ్లి ట్యూనా తీసుకొస్తుంటే.. దళారులు మాత్రం అన్ సీజన్ అంటూ కిలోకి రూ.90 నుంచి రూ.100 మాత్రమే చేతుల్లో పెడుతున్నారని వారు వాపోతున్నారు. 1000 మీటర్ల లోతు వరకు వేట విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి ప్రతి రోజూ 300 బోట్ల వరకు ట్యూనా వేట కోసం బయలుదేరుతుంటాయి. తీరం నుంచి 70 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించిన తర్వాత, 700 నుంచి 1000 మీటర్ల లోతులో ట్యూనా సంపద విస్తృతంగా ఉంది. కాకినాడ, విశాఖకు చెందిన మత్స్యకారులు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, శ్రీలంక సముద్ర జలాల వరకూ వెళ్లి వేటను సాగిస్తుంటారు. వేట కోసం సుమారు 90 బాస్కెట్లను సముద్రంలో విడిచిపెడతారు. ఒక్కో బాస్కెట్లో 6 హుక్స్(గాలాలు) ఉంటాయి. 4 గంటల పాటు హుక్స్ని నీటిలో ఉంచి, తర్వాత ఒక్కో బాస్కెట్ని బయటికి తీసి ట్యూనాలను పట్టుకొని తిరిగి వస్తుంటారు. ఇంజిన్ బోట్లతో పాటు సంప్రదాయ మరపడవలపై వెళ్లి మరీ ఈ వేట సాగిస్తుంటారు. ట్యూనా తర్వాత ఎక్కువగా కొమ్ముకోనాం చేపలు ఇక్కడి మత్స్యకారులకు చిక్కుతున్నాయి. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ట్యూనా చేపలు హార్బర్కు ఎక్కువగా వస్తున్నాయి. అయితే కష్టానికి సరిపడా ధర అందడం లేదు. ఇక్కడ మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తే మత్స్యకారులంతా లాభపడతారు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడు నేరుగా ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అమెరికా, జపాన్, యూరప్, దక్షిణ ఆసియా దేశాల్లో ట్యూనాల వినియోగం అధికంగా ఉంది. అక్కడకు ఎగుమతి చేస్తే మంచి ధర లభిస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. –సూరాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, వైశాఖి మరపడవల సంఘంకొన్ని సందర్భాల్లో ట్యూనాయే దిక్కు వేట విరామ సమయంలో చిన్న పడవలు వేసుకొని వెళ్తున్నాం. అప్పుడు ట్యూనా చేపలే మాకు దిక్కవుతున్నాయి. కానీ.. ఇంత కష్టపడి తీసుకొస్తున్నా ఆశించిన ధర రావడం లేదు. ఎంత చెబితే అంతకు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. అందుకే తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – మేరుగు ఎల్లాజీ, మత్స్యకారుడు, మంగమారిపేట విదేశాల్లో విపరీతమైన డిమాండ్ దేశీయ మార్కెట్లో అయితే ఎక్కువగా విశాఖ నుంచి కేరళకు ట్యూనా ఎగుమతి జరుగుతోంది. శుద్ధి చేసిన ట్యూనాలు అమెరికా, థాయ్లాండ్, హాంకాంగ్, మలేసియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు అధిక సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయి. ఈ చేపల్లో ముళ్లు తక్కువగా ఉంటాయి. అధికశాతం ప్రొటీన్లు, ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ పెరుగుతోంది. కేరళలో ప్రాసెస్ చేసిన తర్వాత.. కిలో రూ.350 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. కానీ.. శ్రమకోర్చి చేపలు పట్టిన మత్స్యకారుడు మాత్రం దోపిడీకి గురవుతున్నాడు. -
గజగజ వణికిస్తున్న చలి
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. గతానికి భిన్నంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా రాష్ట్రంలో శీతాకాలం ఓ మోస్తరుగా ఉండేది. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగూడలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పెదబయలు, పాడేరు, చింతపల్లి, వై.రామవరం, హుకుంపేట మండలాల్లో గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్నిచోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 2021 నుంచి 2024 వరకు ఎల్నినో ప్రభావం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చలికాలంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది పరిస్థితి మారింది. లానినా ప్రభావంతోనే.. ఈ మార్పులకు ప్రధానంగా లానినా ప్రభావమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుంచి వీచే అతి శీతల గాలులు నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనికితోడు హిమాలయాల్లో ఈ ఏడాది భారీగా కురుస్తున్న మంచు వల్ల అక్కడ ఏర్పడిన శీతల తరంగాలు ఒడిశా మీదుగా మన రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. ఈసారి పొడి వాతావరణం ఉండడం వల్ల భూమి త్వరగా చల్లబడి రాత్రివేళల్లో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. వాతావరణ అధ్యయనాల ప్రకారం భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పెరగడం వల్ల కేవలం ఎండలే కాకుండా శీతాకాలంలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది. వాతావరణంలోని జెట్ స్ట్రీమ్స్ బలహీనపడడం వల్ల ధృవ ప్రాంతాల్లో ఉండాల్సిన చల్లని గాలులు దక్షిణాది వైపు మళ్లుతున్నాయి. అందుకే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చలి పెరిగింది. భవిష్యత్తులోనూ ఇలాంటి చలి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. -
కూటమి నేతల ‘బరి’తెగింపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి భీమవరం: కత్తులు దూసే కోళ్లు... దానివెనుక జూద క్రీడలు.. చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు... వేలల్లో సందర్శకులు..! పెద్దమొత్తంలో చేతులు మారనున్న నగదు..! ఇదీ ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయం మాటున అధికార కూటమి నేతల ‘బరి’తెగింపు. కార్పొరేట్ హంగులతో భారీ ప్రాంగణాల్లో బరులు ఏర్పాటు చేస్తూ కోడి పందేలు, జూదం నిర్వహించేందుకు వీరంతా సిద్ధమవుతున్నారు. కోడి పందేలపై నిషేధం ఉన్నా పండుగ ముసుగులో 20 రోజుల ముందే బరులకు బేరాలు పెట్టి రేట్లు ఖరారు చేశారు. వీవీఐపీల కోసం ఏసీల వంటి హైటెక్ సదుపాయాలూ కల్పిస్తున్నారు. సాధారణంగా కోడి పందేలు, జూదం సాయంత్రం చీకటి పడే వరకే జరుగుతాయి. ఈసారి ఏకంగా మూడు రోజులు రేయింబవళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సులుసంక్రాంతికి మూడు వారాలు మాత్రమే ఉండడంతో కోడిపందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో సన్నాహాలు మొదలయ్యాయి. కోడిపందేలు చూసేందుకు వచ్చినవారి జేబులు ఖాళీ చేయించడంలో గుండాట, పేకాట, కోతాట, జూదం నిర్వహణలో ఆరితేరినవారిదే ప్రధాన పాత్ర. దీంతో బరుల కోసం కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు. బరి ప్రత్యేకత, జనం రద్దీని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.కోటిపైగా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. భీమవరం చుట్టుపక్కల రూ.కోటి పైనే పలుకుతుండగా, ఇతరచోట్ల రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇస్తామని ముందుకొస్తున్నారు. భీమవరం దగ్గర పెద్ద బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు అడ్వాన్స్లు చెల్లించినట్లు తెలిసింది. జూదాలతోనే జనం జేబులు గుల్లకోడి పందేలతో పోలిస్తే బరుల వద్ద జరిగే జూదాలే నిర్వాహకులకు ఆదాయ వనరు. పెద్ద బరిలో రోజుకు 20–25 పందేలు మాత్రమే జరుగుతాయి. ఒక్కోదానికి రూ.25 వేల వరకు వసూలు చేస్తే మూడు రోజుల్లో వచ్చే మొత్తం రూ.20 లక్షలు. చిన్న బరుల్లో రూ.5 లక్షలలోపు ఉంటుంది. రెండు, మూడు ఎకరాలలో టెంట్లు, పందెం బరి, గ్యాలరీలు, కుర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు తదితరాలతో పెద్ద బరికి రూ.40 లక్షలు, చిన్న, మధ్యస్థాయి వాటికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. పోలీసు పోస్టుకు గిరాకీ» గన్నవరం నియోజకవర్గంలో పెద్దఎత్తున బరులు, జూద క్రీడలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఓ పోలీసు సర్కిల్ అధికారి పోస్టుకు గిరాకీ నెలకొంది. మూడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు ఉన్నత స్థాయిలో భారీగా ముడుపులు తీసుకుని, అనుకూలమైన వారికి పోస్టింగ్ వేయించుకున్నట్లు టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల మాటున చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా నేతలు, సంబంధిత వర్గాలకు భారీగా మామూళ్లు ముట్టజెప్పాలి.వారికి పంపే కోజాలు (పందెం పుంజులు), బౌన్సర్లు, సిబ్బంది జీతాలు, అతిథులకు భోజనాలు తదితర రూపాల్లో బరిని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.కోటి పైనే అవుతుంది. జూదాలు, అశ్లీల నృత్యాలు, మద్యం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టనున్నారు.మద్యం, పేకాట శిబిరాలకు తలుపులు బార్లాసంక్రాంతికి ముందు మద్యం, పేకాట శిబిరాలకు చంద్రబాబు ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. దీంతో పెద్దఎత్తున కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు నెలకొల్పేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఎంట్రీ ఫీజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ఏ ఇబ్బందీ రాదని బరుల నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. జూదరుల కోసం హోటల్ రూమ్లను బుక్ చేస్తున్నారు. పండుగ మూడు రోజుల్లో రూ.వంద కోట్లు చేతులు మారనున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా క్యాసినో నిపుణులను దించుతున్నారు. ‘అందర్–బాహర్, తీన్పత్తి, బ్లాక్ జాక్, నంబరింగ్, బకారత్’తో పాటు కోత ముక్క, స్టైక్ తదితర జూద క్రీడలకు బేరాలు మాట్లాడారు. ఈ ఆటల్లో నిపుణులైన నార్త్, గోవా, నేపాల్ డీలర్లతో బరుల నిర్వాహకులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి మహిళలను రప్పించేందుకూ అధికార పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.రూ.కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు» ఉమ్మడి కృష్ణాలో ఒక్కో నియోజకవర్గంలో పదిపైగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. స్థాయిని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇవ్వాలి. ఇలా కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు ఇవ్వనున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డల్లో టీడీపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు దండుకోనున్నారు.» 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విజయవాడ, పరిసర ప్రాంతాలైన రామవరప్పాడు, ఎనికేపాడుల్లో సంక్రాంతి సంబరాల పేరుతో బరులు ఏర్పాటు చేస్తున్నారు.» పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులో క్యాసినో ఆడించేందుకు ప్రజాప్రతినిధితో రూ.70 లక్షలకు ఒప్పందం కుదిరింది. క్యాసినో ఆడించడంలో దిట్టగా పేరొందిన వ్యక్తితో పాటు, గంజాయి కేసులో నిందితుడికి ఈ బరిని అప్పజెప్పారు.» నున్న ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో హైటెక్ బరిలో పెద్దఎత్తున క్యాసినో ఆడించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఆగిరిపల్లిలో పేకాట ఆడించడంలో కృష్ణా జిల్లా వారే కీలక పాత్ర పోషించడం గమనార్హం.» పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పరిసరాల్లో జరిగే కోడి పందేలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు వస్తుంటారు. బరుల వద్ద గుండాట, పేకాట, కోతాట తదితర జూద క్రీడలు పెద్దఎత్తున జరుగుతాయి. జిల్లాలో వందపైనే బరులు రానున్న నేపథ్యంలో గుండాట, పేకాట, కోతాట, మద్యం బెల్టు షాప్లు నెలకొల్పేందుకు బేరాలు సాగుతున్నాయి. బరిని బట్టి రూ.కోటి పైనే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం.భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండి, తాడేరు రోడ్డుతో పాటు ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లులో పెద్ద బరులు ఏర్పాటు కానున్నాయి. చాలాచోట్ల టీడీపీ–జనసేన నేతలు సంయుక్తంగా, కొన్నిచోట్ల వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు. -
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
‘స్మార్ట్’గా రూ.20 కోట్ల దోపిడీ
సాక్షి, అమరావతి : సామాన్యులు సైతం ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే ఎక్కడ తక్కువకు దొరుకుతుందా? అని ఆలోచిస్తారు. ఆన్లైన్, ఆఫ్లైన్లలో ధరలను పోల్చి చూస్తారు..! కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తక్కువ ధరకు లభ్యమయ్యే చాన్స్ ఉన్నా విస్మరించింది..! అధిక ధర చెల్లింపుతో దోపిడీకి పాల్పడింది..! ప్రజాధనం లూటీ చేసింది..! చివరకు చార్జర్లలోనూ కక్కుర్తి పడింది...! ఇదంతా అంగన్వాడీ వర్కర్లకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అందించిన స్మార్ట్ఫోన్ల కొనుగోలులో జరిగిన తతంగం. కీలక నేతలు ఈ అవినీతి కథ నడిపారని తెలుస్తోంది. 58,204 మొబైల్ ఫోన్లను అధిక ధరకు కొని రూ.20 కోట్లకు పైగా స్వాహా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ‘హలో...’ అంటూ చంద్రబాబు సర్కారులో ‘స్మార్ట్ దోపిడీ’ సాగింది ఇలా..!టెండర్లలోనే నిబంధనలకు పాతరఅంగన్వాడీ సిబ్బందికి స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా అక్టోబర్లో టెండర్లు పిలిచారు. వాస్తవానికి కనీసం మూడు ఏజెన్సీలు బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా ఒకే సిండికేట్కు చెందిన రెండు ఏజెన్సీలు బిడ్ వేశాయి. వీటిలో ఒకదానికి టెండర్ కట్టబెట్టారు. తద్వారా మొదటే నిబంధనలకు పాతరేశారు. నవంబర్లో హైదరాబాద్లోని హల్లో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఫోన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆన్లైన్ వద్దు.. అధిక ధరే ముద్దు4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమోరీ సామర్థ్యం ఉన్న 58,204 శాంసంగ్ స్మార్ట్ ఫోన్లను ఒక్కోటి రూ.13,398 చొప్పున కొనుగోలు చేసేందుకు రూ.77.98 కోట్లకు పైగా చెల్లించారు. చిత్రం ఏమంటే, శాంసంగ్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ ఫోన్ ధర ఆ సంస్థ వెబ్సైట్లో రూ.9,899గా ఉంది. ఇదే రేటుకు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేసి ఉంటే రూ.61.10 కోట్లు అయ్యేది. ఇక అమెజాన్లో అయితే శుక్రవారం ఆఫర్ ధర రూ.8,499, ఫ్లిప్కార్ట్లో రూ.9,380గా ఉంది. ఈ లెక్కన 58,204 ఫోన్ల కొనుగోలుకు రూ.58 కోట్లు వ్యయం అవుతుంది. పెద్దసంఖ్యలో కావాల్సినప్పుడు నేరుగా కంపెనీని సంప్రదిస్తే... రూ.10 వేల కంటే తక్కువకే లభించే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ నిపుణుడు ఒకరు పేర్కొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆన్లైన్ ధర కంటే అధిక మొత్తానికి కొనుగోలు చేసింది. రూ.20 కోట్ల ప్రజాధనాన్ని కాజేసింది.చార్జర్లలోనూ చేతివాటంమొబైల్ ఫోన్ల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ చార్జర్ ఇవ్వకుండా డబ్బులు మిగుల్చుకునే ప్రయత్నం చేసింది. ఫోన్తో పాటు చార్జర్ ఇవ్వాలని వర్క్ ఆర్డర్లో స్పష్టంగా ఉంది. కానీ, కాంట్రాక్టు సంస్థ ఎగ్గొట్టాలని చూసింది. అధికారులు గట్టిగా మందలించడంతో చార్జర్ ఇచ్చింది. కానీ, ఇక్కడా కక్కుర్తే. శాంసంగ్ కంపెనీ చార్జర్ రూ.1,699 కాగా ఆన్లైన్లో రూ.850కు కూడా వస్తుంది. కనీసం శాంసంగ్ చార్జర్ కాకపోయినా మరో మంచి కంపెనీది కూడా ఇవ్వలేదు. మార్కెట్లో రూ.400 కంటే తక్కువకు దొరికే థర్డ్పార్టీ చార్జర్ ఇచ్చింది. అవి హీటెక్కి ఎప్పుడు పేలిపోతాయో అన్నట్లున్నాయని అంగన్వాడీలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన ఫోన్లు తమ ప్రాణాల మీదకు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు. కాగా, స్క్రీన్ గార్డును మీరే వేయించుకోండని కాంట్రాక్టు సంస్థ చెప్పగా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏజెన్సీ నిర్వాహకులు వేయకతప్పలేదు.అంగన్వాడీ.. కొనుగోలు ఏదైనా దోపిడీ!» చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే అంగన్వాడీ కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వంలోని కీలక నేతలు తమ అవినీతికి కేంద్రంగా మార్చేశారు. కేంద్రాలకు వస్తువుల కొనుగోలులో జరిగిన అక్రమాలే దీనికి అద్దంపడుతున్నాయి.» సాక్షం అంగన్వాడీ మిషన్–2లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.వంద కోట్లలో రూ.25 కోట్లతో నిరుడు 9,664 అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీల కొనుగోలు చేశారు. ఇందులో లోపాయికారీ ఒప్పందాలకు పాల్పడ్డారు. నిబంధనలు ఉల్లంఘించారు. చాలా టీవీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికీ సద్వినియోగం కావడం లేదు.» అంగన్వాడీ చిన్నారుల ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్లలోనూ బాబు సర్కారు చేతివాటం ప్రదర్శించింది. 257 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 55,746 సెంటర్లకు ఈ కిట్ల కొనుగోలులో డీల్ కుదిరిందనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రూ.7.31 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్ను నామినేషన్పై కేరళకు చెందిన కండోమ్స్ తదితర వస్తువుల తయారీ కంపెనీకి అప్పగించారు. చిత్రం ఏమంటే ఈ కిట్లు ఇంకా అంగన్వాడీలకు చేరలేదు. -
గుండె పగిలిన రాజధాని రైతు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ, సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు పదేపదే చేస్తున్న బలవంతపు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది! గతంలోనే భూ సమీకరణ కింద రెండు ఎకరాల భూమి ఇచ్చిన రాజధాని రైతు దొండపాడు రామారావు(68) ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తుండటంతో తీవ్రంగా కలత చెందాడు. తాను ఇచ్చిన రెండెకరాల పొలానికి బదులుగా.. వాగులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాటు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయిన రామారావు.. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి మృతి చెందాడు. రాజధాని ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న రైతులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు సర్కారు నిరంకుశ వైఖరి, బలవంతపు భూ సేకరణపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేదిక దిగి కుప్పకూలిన రైతన్న.. రాజధానిలో ఎన్–8 రోడ్డు నిర్మాణంలో భాగంగా తుళ్లూరు మండలం మందడం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధిత రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణతో పాటు స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్కుమార్, సీఆర్డీఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండగా.. గ్రామానికి చెందిన రైతు దొండపాటి రామారావు స్పందిస్తూ.. ‘మమ్మల్ని ముంచేశారు. అప్పుడు భూసమీకరణలో రెండెకరాలు పొలం ఇస్తే.. మాకు ఇవ్వాల్సిన ప్లాట్లు వాగులో ఇచ్చారు. ఇప్పుడు మాకున్న ఇంటి స్థలం కూడా తీసుకుంటున్నారు. గతంలో నేను రాజధాని భూ సమీకరణ కోసం రెండెకరాల భూమి ఇస్తే అందుకు బదులుగా ప్లాట్లు వాగులో ఇచ్చారు. అక్కడకు వెళ్లి మేం ఎలా నివాసం ఉండాలి..?’ అంటూ ఆక్రోశించారు. ఈ ప్రభుత్వం తమను ముంచేసిందని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారందరికీ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒకేచోట స్థలాలివ్వాలని కోరారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే.. హైదరాబాద్లో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా.. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో వేదిక నుంచి వెనుతిరిగిన రైతు దొండపాటి రామారావు రెండడుగులు వేయగానే ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలారు. సభలో ఉన్న స్థానికులు, రైతులు వెంటనే ఆయన్ను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇళ్లిచ్చి.. మేం బొచ్చెలు పట్టుకుని బజార్ల వెంబడి పడి ఏడవడం ఏంటి? రోడ్డు కోసం మీరు ఇళ్లు తీసుకునే లెక్కనైతే తీసుకోండి.. మాకు ఎక్కడిస్తారంటే.. సీడ్ యాక్సిస్ రోడ్డు వెంబడి స్థలాలు ఇవ్వండి. పొలాలు ఇచ్చాం.. సింగపూర్ వాళ్లకు ఇచ్చిన దాంట్లో రెండు ఎకరాలు తీసుకొచ్చి వాగులో కొట్టారు.. లాటరీ అని.. ఎవరికి చెప్పుకోవాలి..? ఇచ్చిన చోట ఇంత లోతు (ఛాతీ చూపిస్తూ) నీళ్లు పడ్డాయి. ఈ ఇళ్లు ఇచ్చి.. మేం బొచ్చెలు పట్టుకుని బజార్ల వెంబడి పడి ఏడవడమేంటి? అడుక్కోలేం కదా...! సింగపూర్ వాళ్లకు ఇచ్చిన సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవతల ఊళ్లో వాళ్లందరికి కలిపి ఒకేచోట స్థలాలు ఇవ్వండి... ఎవరికి వాళ్లకు ఇచ్చారనుకో.. హైదరాబాద్లో మాదిరి గొంతు కోసుకున్నారుగా.. అలా కోసుకుంటారు (పీక కోసుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు). ఆ తరువాత రామారావు హఠాత్తుగా కుప్పకూలిపోయారు. – మందడం సభలో రైతు రామారావు ఆక్రందన ఇదీ..మారిన అలైన్మెంట్.. రాజధాని అమరావతిలో ఎన్–8 రహదారి నిర్మాణంలో భాగంగా మొదటి అలైన్మెంట్ ప్రకారం 117 మంది ఇళ్లు కోల్పోతుండగా గ్రామంలో పురాతన ఆలయాలు తొలగించకుండా సవరించారు. దీని ప్రకారం రెండోసారి 160 మంది వరకు రైతులు ఇళ్లు కోల్పోతున్నారు. వీరందరికీ పరిహారం, ఇతర విషయాలు చర్చించేందుకు నిర్వహించిన గ్రామసభలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థలాలిచ్చిన చోట వరద నీరు.. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో సుమారు 70 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే కావడంగమనార్హం. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వాగులు, చెరువు భూముల్లో ప్లాట్లు కేటాయించింది. భారీ వర్షాలు పడితే ఆ స్థలాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలబడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంలో భూములివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతికి భూసమీకరణ కింద భూములు ఇవ్వని రైతులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధిస్తోందని ఆక్రోశిస్తున్నారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఇదే అంశాన్ని తెగేసి చెబుతున్నారని పేర్కొంటున్నారు. ఈ ఒత్తిళ్లకు తాళలేక గత 19 నెలల్లో 542.24 ఎకరాల భూమిని భూసమీకరణ కింద సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ)కు రైతులు అప్పగించేశారు. మిగతా భూమి కోసం గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వాగు, చెరువు భూముల్లో రైతులకు ప్లాట్లు.. రాజధానికి భూములిచ్చిన రైతులకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు సీఆర్డీఏ ఇవ్వాలి. ఆ ప్లాట్లను భూసమీకరణ కింద తీసుకున్న భూములలోనే ఇవ్వాలి. చెరువు భూముల్లో ఇవ్వకూడదు. కానీ.. పిచ్చుకలపాలెం చెరువు భూమిలో 78 మందికి, తుళ్లూరు చెరువు భూమిలో 65 మందికి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం బట్టి చూస్తే.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకూ చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడిచిందన్నది స్పష్టమవుతోంది. ఆ ప్లాట్లలో ఇళ్లను నిర్మించుకుంటే.. చట్టప్రకారం భవిష్యత్లో వాటిని కూల్చేయడం ఖాయమని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. చెరువును మాయం చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడతామని పిచ్చుకలపాలెం, తుళ్లూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష ఎకరాల దిశగా..! రాజధాని ముసుగులో బలవంతంగా భూములను గుంజుకుంటున్న చంద్రబాబు సర్కారు లక్ష ఎకరాలను గుప్పిట పట్టేందుకు బరి తెగిస్తోందని అన్నదాతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చిన అన్నదాతలను దారుణంగా వంచించి పొట్టనబెట్టుకుంటోందని మండిపడుతున్నారు. గతంలోనే టీడీపీ హయాంలో అమరావతి కోసం 50 వేల ఎకరాలకుపైగా సేకరించగా.. అది చాలదంటూ ఇప్పుడు విడతలవారీగా మరో 50 వేల ఎకరాలను తీసుకునేందుకు సన్నద్ధం కావడం.. 29 గ్రామాలకే పరిమితమైతే అమరావతి ఓ చిన్న మునిసిపాలిటీగా మిగిలిపోతుందని బెదిరింపులకు దిగడం.. సారవంతమైన పొలాలే కాదు.. ఇళ్లను కూడా లాక్కోవడం.. దాదాపు ఏడేళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు తమకిచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రాజధాని రైతన్నలు రగిలిపోతున్నారు. ఒకపక్క ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో రైతుల నుంచి కారుచౌకగా భూములు కాజేసే కుట్రలకు తెరతీయడం.. ఇళ్లను సైతం రోడ్డు నిర్మాణం పేరుతో సేకరిస్తుండటం.. మరోపక్క గతంలో భూములిచ్చిన అన్నదాతలకు వాగులు వంకల్లో నీట మునిగే ప్రాంతాల్లో రిటర్న్బుల్ ప్లాట్లు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మి భూములిస్తే రోడ్డు పాలు..! గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల పరిధిలోని 217 చదరపు కిలోమీటర్లు (53,749.49 ఎకరాలు) ప్రాంతాన్ని ప్రభుత్వం 2015లో రాజధానిగా ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన ప్రాంతంలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగతా 37,941.58 ఎకరాలు రైతులది. భూ సమీకరణ కింద 34,396.87 ఎకరాలను అప్పట్లోనే సమీకరించింది. మిగతాది సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అప్పట్లో అంగీకరించలేదు. 2024లో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ భూమిని సేకరించడానికి పావులు కదుపుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆ భూమిని సమీకరణ కింద ఇస్తే సరి.. లేదంటే బలవంతపు భూసేకరణ చేసేందుకు గత అక్టోబర్ 3న కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మందడం, ఉండవల్లి, పెనుమాక, యర్రబాలెం, నిడమర్రు, కురగల్లు, బేతపూడి, నవులూరు గ్రామాల్లో సమీకరణ కింద భూములు ఇవ్వని రైతులతో మంత్రి నారాయణ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీకరణ కింద భూములు ఇవ్వకుంటే.. భూసేకరణ చట్టం–2013 కింద సేకరిస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పటికే సమీకరణ కింద వేల ఎకరాల భూములు ఇచ్చామని, దీనికి బదులుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని నమ్మబలికి నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాల్లో ప్లాట్లు అంటగట్టారంటూ రైతులు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు తాము నివాసం ఉంటున్న ఇళ్లను కూడా తీసుకుంటే రోడ్డున పడతామని ఆక్రోశిస్తున్నారు. -
నిబంధనలు కాల‘రాశారు’
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. శతాబ్ది వేడుకల వేళ ఏయూ ఘనకీర్తి అభాసుపాలవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన దూరవిద్య కేంద్రంలో ప్రస్తుతం పారదర్శకత కొరవడింది. పరీక్షపత్రాల ముద్రణ, పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు నిబంధనలను కాలరాస్తున్నారు. ఫలితంగా అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏడాదికి రెండు సార్లు దూరవిద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, వాటిని సవ్యంగా నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఐఐటీ నుంచి తీసుకొచ్చిన వ్యక్తిని వైస్ చాన్సలర్గా నియమించామని గొప్పలు పోయిన చంద్రబాబు సర్కారు విద్యా ప్రమాణాలను దారుణంగా దిగజారుస్తోంది. పరీక్షలు ఎందుకు రద్దు చేయలేదు? ఏయూ దూరవిద్యలో భాగంగా ఈ ఏడాది మార్చి–ఏప్రిల్లో ఒకసారి పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో పరీక్షలు పెట్టగా కొత్తవలసలోని వాగ్దేవి కళాశాలలో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగింది. దీంతో ఆ కళాశాల సెంటర్ను మూసివేసి పక్కన ఉన్న ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చారు. అయితే, వాగ్దేవి సెంటర్లో జరిగిన పరీక్షలను రద్దు చేయకుండా ఇప్పుడు తాపీగా మూల్యాంకనం జరిపి ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధపడడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాలకు ఏయూ అధికారులు లొంగిపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం చేసేవారికి ఆ పేపర్ ఏ సెంటర్ నుంచి వచి్చంది? ఎవరు రాశారు అనే వివరాలు లేకుండా కోడింగ్, డీకోడింగ్ పద్ధతిలో చేపడతారు. అలాంటిది నిబంధనలకు విరుద్ధంగా మాస్ కాపీయింగ్ చేసిన సెంటర్లోని పరీక్ష పత్రాలను ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయిస్తుండటంతో అవి ఏ సెంటర్లోనివో, అక్కడి రాసిన విద్యార్థులు ఎవరో సమాచారం బహిరంగ రహస్యంగా మారిపోయిందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటప్పుడు ఆ ఫలితాల పారదర్శకతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జవాబు పత్రాల మూల్యాంకనం దూరవిద్యలోని ప్యానల్ నామినేట్ చేసిన వ్యక్తులు మాత్రమే చేయాలి. ఈ లిస్టును వీసీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇక్కడ సైకాలజీ పేపర్లను ప్రైవేటు కళాశాలలకు చెందిన లెక్చర్లతో గుట్టుచప్పుడు కాకుండా మూల్యాంకనం చేయిస్తుండటం గమనార్హం. ఇక్కడే, కనీస నియమాలను పాటించకుండా దూరవిద్య డైరెక్టర్ ఇష్టారీతిన వ్యవహరిస్తుండటంతో వర్సిటీ ఖ్యాతి దిగజారిపోతోంది. మార్చిన పరీక్ష కేంద్రంలోనూ కాపీయింగ్! ఇదిలా ఉంటే వాగ్దేవి పరీక్ష కేంద్రం నుంచి ప్రగతి కళాశాలకు పరీక్ష కేంద్రాన్ని మార్చినా మాస్ కాపీయింగ్ ఆగట్లేదు. నవంబర్ నుంచి జరుగుతున్న దూరవిద్య పరీక్షల్లోనూ మరోసారి మాస్ కాపీయింగ్ కలకలం సృష్టించింది. ఏయూ దూరవిద్య కేంద్రంలో సుమారు 1400 మందికిపైగా పరీక్ష రాసే వసతి అందుబాటులో ఉంది. ఒకప్పుడు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి దూరవిద్య పరీక్షలు ఏయూ కేంద్రంలోనే పారదర్శకంగా జరిగేవి. అలాంటి కేంద్రాన్ని పట్టించుకోని అధికారులు ప్రైవేటు కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
వెండి వెలుగులు
సాక్షి, అమరావతి : మరో నాలుగు రోజుల్లో ముగియనున్న 2025 సిల్వర్నామ సంవత్సరంగా రికార్డులకు ఎక్కనుంది. మార్కెట్లో వెండి ధరలు పరుగులు తీస్తూ బంగారం తళుకులు వెలవెలబోయేలా ఆకాశాన్నంటుతున్నాయి. నూతన గరిష్ట స్థాయిలకు చేరుకోవడమే కాకుండా ఒక్క ఏడాదిలోనే ఏకంగా 154 శాతం పైగా వృద్ధి చెందిందంటే ఏ స్పీడ్తో పరుగులు తీసిందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది డిసెంబర్ 26న కేజీ వెండి రూ.91,600గా ఉంటే అదిప్పుడు ఏకంగా రూ.2,36,350ని తాకి రికార్డులు సృష్టించింది. అక్టోబర్ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర 45.43 డాలర్లుగా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి 72.70 డాలర్లకు అంటే రెండు నెలల్లో 69 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి 72.70 డాలర్లు తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన ఏడాదికాలంలో పది గ్రాముల బంగారం ధర రూ.77,730 నుంచి 79.10 శాతం పెరిగి రూ.1,39,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరినా ఏడాదిలో వెండి పరుగుతో పోలిస్తే వెనుకపడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లైతే ఈ ఏడాది కాలంలో కేవలం 10 శాతం రాబడులను మాత్రమే అందించాయి.న్యూ ఏజ్ టెక్నాలజీ వల్లే భారీ పెరుగుదల పారిశ్రామికంగా ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, సోలార్ విద్యుత్, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, రక్షణ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వెండిని వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న సిల్వర్లో 60 శాతం పారిశ్రామిక అవసరాలకే వినియోగిస్తారంటే వెండి ఎంత కీలకపాత్ర పోషిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2024లో సుమారు రెండు కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ, సెమీ కండక్టర్స్ వంటి రంగాలు వేగంగా వృద్ధి చెందుతుండడంతో సిల్వర్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉత్పత్తి కంటే పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుండటం వెండి ర్యాలీకి ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యుద్ధ భయాలు, అమెరికా టారిఫ్ బెదిరింపులతో పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్ వంటి కీలక లోహాల్లోకి తరలిస్తుండటంతో అన్నీ రికార్డు స్థాయి ధరలకు చేరుకున్నాయని, ఒడిదుడుకులు అధికంగా ఉండే వెండి మరింత ఎక్కువగా పెరిగిందంటున్నారు. దీనికితోడు మన దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో 8 శాతంపైగా పతనం కావడం మరింత కలిసొచ్చిందంటున్నారు. ఇంకా పెరిగితే రిస్కే ఎక్కువ ఇతర మెటల్స్తో పోలిస్తే వెండి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే వేగంగా పతనమవుతుందని గత అనుభవాలు స్పష్టం చేస్తుండటంతో ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం – వెండి ధరల మధ్య ఉండే తేడాని గోల్డ్ సిల్వర్ రేషియోగా లెక్కిస్తారు. 2025లో 107గా ఉన్న గోల్డ్ సిల్వర్ రేషియో నిష్పత్తి వెండి పరుగుతో అది 64కి పడిపోయింది. 2016, 2021లో కూడా ఈ నిష్పత్తి ఈ స్థాయికి చేరినప్పుడు వెండి ధరలు బాగా పతనమైన విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. కేజీ వెండి ధర రానున్న రోజుల్లో రూ.2.50 లక్షల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పది గ్రాముల బంగారం రూ.1.65 లక్షలకు చేరుకోవచ్చని... ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ధరల్లో కొంత సర్దుబాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టకొని బంగారం, వెండిలో ఒకేసారిగా కాకుండా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా వీరు సూచిస్తున్నారు.కరెక్షన్కు అవకాశం కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు మరికొంత పెరిగినా దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు అంతకంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వెండి ఎంత వేగంగా పెరిగిందో పతనం కూడా అంతే వేగంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాంకేతికంగా చూస్తే రికార్డు స్థాయికి చేరిన సిల్వర్లో లాభాల స్వీకరణకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026లో వెండి ధరలు పెరిగే అవకాశాలున్నా మధ్యలో ఒక భారీ కరెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. – సతీష్ కంతేటి, డైరెక్టర్, జెన్ సెక్యూరిటీస్ -
అమరావతి రైతుల్ని మళ్లీ మోసం చేస్తున్న బాబు సర్కార్
సాక్షి, గుంటూరు: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు (డైమండ్ బాబు) మండిపడ్డారు. ఆ ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించడంపై డైమండ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్-8 రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువులో ప్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనలో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మోసంపై ప్రశ్నిస్తే... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వైయస్సార్సీపీపై నిందలు వేయడాన్ని తప్పుపట్టారు. రైతులకు మద్దతుగా వారి తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం..రాజధాని కోసం ప్రభుత్వానికి పొలం ఇస్తే.. అందుకు బదులుగా ఇంత ఎత్తు మునిగిపోయే చోట ప్లాట్ ఇచ్చారని రైతు రామారావు మీతో చెప్పుకున్నాడు. అయినా అతని ఆవేదన ప్రభుత్వానికి కనిపించడం లేదు. మా ఇల్లు అభివృద్ది కోసమని తీసుకుని ఎక్కడో ఫ్లాట్ ఇస్తే హైదరాబాద్ తరహాలో దొంగలు వచ్చి మా పీకలు కోసే పరిస్ధితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేస్తోందో ఇదే నిదర్శనం. వారికి ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తుంది వేరొకటి అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతోంది.రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మా పై ప్రచారం చేస్తున్నారు. రైతుల నుంచి పట్టా భూములు తీసుకుని చెరువు భూముల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రైతులకు చెరువుల్లో ప్లాట్లు ఇస్తే రేపు చట్టబద్దంగా చెల్లుతుందా ?, రైతు మీ మీద నమ్మకంతో తమ భూములిస్తే ప్లాట్లు చెరువుల్లో ఇస్తారా ? దొండపాటు, పిచ్చుకలపాలెంలో చెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ రైతులు మనోవేదనతో బాధలో ఉన్నారు. తీవ్ర మనోవేదనలో అమరావతి రైతులు28 వేల మంది రైతులు వాళ్ల పొలాలు ఇస్తే అందులో ఎకరం ఉన్న రైతులు 19,970 మంది ఉన్నారు. ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న వాళ్లు 4,214 మంది, రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వాళ్లు 3,200 మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులు 829 మంది ఉన్నారు. ఈ లెక్కన ఎకరం, రెండెకరాలు ఉన్న 23 -25 వేల మంది రైతులు మీ అభివృద్ధి మాటలు నమ్మి పొలాలు ఇస్తే వాళ్లకు 29 గ్రామాల్లో చెరువులు, వాగులు పూడ్చేసి అక్కడ ప్లాట్లు ఇస్తున్నారు. రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చెరువుల్లో ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా?, ఈ బాధలన్నీ వాళ్లకూ తెలుసు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ చనిపోయిన రైతు దొండపాటి రామారావు మరణం.రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటంచెరువుల్లో రైతులకు ప్లాట్లు ఇచ్చిన మాట నిజం కాదా?, చెరువును పూడ్చిన చోట ప్లాట్ ఇస్తున్నామని రైతులకు చెప్పారా ?.అది మోసం కాదా ?. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చారా ?. ఇప్పటికైనా బ్యాంకు రుణాలకు పనికొచ్చే పట్టా భూములు ఇవ్వాలి, వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ప్లాట్లు ఇచ్చిన తర్వాతే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ముందుకు రావాలి. చెరువుల్లోనే ప్లాట్లు ఇస్తాం, ఉంటే ఉండండి, పోతే పోవాలని అంటే ఆ రైతుల తరపున వైఎస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులు ఇచ్చిన పొలాలపై శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు వారికి న్యాయం చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేశారు. -
మంత్రి నారాయణే ముంచేశాడు.. ప్రాణాలొదిలిన రైతు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు సర్కార్.. రైతుల పాలిట శాపంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి రైతు గుండెకోతను మిగిల్చింది. మందడం గ్రామసభలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రైతు రామారావు.. తమను నారాయణే ముంచేశాడంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కుప్పకూలిన రైతు.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఇళ్లు తీసుకుంటానంటే తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వండి. అమరావతికి మా పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్లకు ఇచ్చినదాంట్లోంచి మాకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లు ఇచ్చారు. నారాయణ ఆర్డర్ అన్నారు. నారాయణ ఇవ్వమంటేనేగా వాళ్లు ఇచ్చింది..?. ఇంత లోతు నీళ్లు పడ్డాయి’’ అంటూ రైతు ఆవేదన చెందారు.అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. ఎమ్మెల్యే సర్ధి చెప్పబోయినా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు రామారావు మృతిచెందారు. -
‘తిరుమలలో భక్తుల భద్రతను గాలికొదిలేశారు’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీపై కూటమి సర్కార్ బురద జల్లడమే పనిపెట్టుకుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఉందా? అంటూ ప్రశ్నించారు. కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట టీటీడీ బోర్డు, ప్రభుత్వం నిర్లక్ష్యమే. భక్తుల భద్రతను గాలికి వదిలేశారు. వరస సెలవులతో భక్తులు ఎక్కువగా వస్తారనే ఇంగితజ్ఞానం లేదా?. ఎన్ని ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా.. జాగ్రత్తలు తీసుకోరా..?. తిరుమల రావాలంటేనే భక్తులు భయపడేలా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో పాలన చేస్తోంది టీటీడీ బోర్డు కాదు.. టీడీపీ పార్టీ. పొలిటికల్ డైవర్షన్స్ కోసం టీటీడీని వాడుకోవటం సిగ్గుచేటు’’ అంటూ వెల్లంపల్లి ధ్వజమెత్తారు.‘‘దయచేసి వెంకటేశ్వర స్వామికి రాజకీయాలు ముడిపెట్టకండి. సనాతన ధర్మం మాట్లాడే పవన్ వీటి గురించి పట్టించుకోరా?. ఇంకెన్నాళ్లు గత ప్రభుత్వం అంటూ బురదజల్లుతారు?. భక్తుల రద్దీ దృష్ట్యా చర్యలు తీసుకోలేని బోర్డు ఉండీ ఏం ఉపయోగం..?. భక్తులకు రక్షణ ఇవ్వలేని బోర్డు అవసరమా..?. మీకు చేతకాకపోతే తప్పుకోండి’’ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. -
నోటిఫికేషన్కు మనసొప్పట్లే!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులు భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచి్చన నోటిఫికేషన్లను సైతం పూర్తి చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రూప్–1, 2 పోస్టులతో పాటు డీవైఈవో, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏడాదిన్నర కాలంగా ఏపీపీఎస్సీ ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు.దీంతో ఇంజినీరింగ్ చదివిన వేలమంది అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ నీటి సరఫరా–శానిటేషన్, రోడ్లు భవనాలు, వాటర్ రిసోర్స్ శాఖల్లో దాదాపు 1,125 ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పనులు ముందుకుసాగడం లేదని, వెంటేనే నియామకాలు చేయాల్సిందిగా పలు శాఖలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా స్పందిచకపోవడం గమనార్హం. ఖాళీలను పదోన్నతులతో నింపేందుకే ఆసక్తి చూపుతున్నారు గానీ కొత్త నోటిఫికేషన్లకు మాత్రం అంగీకరించడం లేదు. మొత్తం 1,125 పోస్టులు ప్రస్తుతం ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 88 ఏఈఈ, 33 ఏఈ (డిప్లొమా అర్హత), గ్రామీణ నీటి సరఫరా–పారిశుధ్య విభాగంలో 95 ఏఈఈ, 71 ఏఈ, రోడ్లు భవనాల శాఖలో 187 ఏఈఈ, 74 ఏఈ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో 211 ఏఈఈ, 366 ఏఈ.. మొత్తం 1,125 పోస్టులున్నాయి. 2021, 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లలో మిగిలిన (క్యారీ ఫార్వర్డ్) పోస్టులు మరో 9 ఉన్నాయి. కేవలం నాలుగు శాఖల్లోనే 1,125 పోస్టుల ఫైల్ ఏపీపీఎస్సీ వద్ద ఉంది. నిబంధనల ప్రకారం ఆయా శాఖల్లోని ఖాళీలలో 70 శాతం పదోన్నతులతో, 30 శాతం నేరుగా భర్తీ చేయాలి.నేరుగా చేపట్టాల్సిన నియామకాలనూ పదోన్నతులతో నింపేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏఈ ఉద్యోగాలకు డిప్లొమా ఇంజినీరింగ్ అభ్యర్థులు, ఏఈఈ పోస్టులకు బీటెక్, బీఈ చదివినవారు ఎదురుచూస్తున్నారు. తమ ఆశలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని వీరంతా వాపోతున్నారు. అన్ని అర్హతలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వయో పరిమితి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పీపీపీ ద్వారానే సంపద సృష్టి
సాక్షి, అమరావతి: హైదరాబాద్ను హైటెక్ సిటీతో అభివృద్ధి చేసినట్టే.. అమరావతిని క్వాంటం వ్యాలీతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి స్మృతి వనంలో 14 అడుగుల ఏబీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృది్ధకి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తుంటే.. ఏమీ తెలియని కొందరు నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా పీపీపీ మోడల్ కరెక్ట్ అనే విషయాన్ని 30 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టిన వాళ్లను జైలులో పెడతామంటున్నారని.. అభివృద్ధి చేసే వాళ్లను, జైలులో పెట్టేవాళ్లను ఏవిధంగా చూడాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదన్నారు.అపరదేశ భక్తుడు వాజ్పేయి: చౌహన్సభకు హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అపర దేశభక్తుడని కొనియాడారు. పార్టీలు వస్తాయి, పోతాయి గానీ దేశభక్తి అన్న భావన ప్రతి వ్యక్తిలో ప్రధానంగా ఉండాలని చెప్పిన నేత వాజ్పేయి అన్నారు. వాజ్పేయి తొలిసారి ప్రధాని అయిన సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించాలని చెప్పినా విలువలకే కట్టుబడి నిలబడ్డారని చెప్పారు. వాజ్పేయి వేసిన పునాదుల కారణంగానే దేశం, ఏపీ ముందుకు సాగుతున్నాయన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే శ్రవణ్కుమార్ మాట్లాడారు. వాజ్పేయిపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను, కవర్ను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు అవిష్కరించారు. పునర్విభజన చట్టం కింద కేంద్ర అగ్రి వర్సిటీ నెలకొల్పండిఏపీలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రికి చంద్రబాబు వినతి పత్రం అందించారు. ఏపీ పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 13లో పేర్కొన్న మేరకు రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్ సమర్పించినట్టు చెప్పారు. సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలని, ఏపీని సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించాలనే తదితర అంశాలను వినతిపత్రంలో చేర్చారు. -
బచావత్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా.. ‘గోదావరి–కావేరి’ అనుసంధానం
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్డబ్ల్యూడీఏ) రూపొందించిన డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక) బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉందని సాగునీటి రంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య 1978 ఆగస్టు 7న కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు.. ఇచ్చంపల్లి బాహుళార్ధక సాధక ప్రాజెక్టు చేపట్టి, దాని నుంచి 85 టీఎంసీలకు మించకుండా గోదావరి నీళ్లను వినియోగించుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జస్టిస్ బచావత్ నేతృత్వంలోని గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కానీ.. అక్కడి నుంచి 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి మళ్లించేలా ఎన్డబ్ల్యూడీఏ డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను 2021 మార్చిలో రూపొందించింది.ఆ నీళ్లు కూడా ఉమ్మడి మధ్యప్రదేశ్ నేటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఇంద్రావతి సబ్ బేసిన్లో కేటాయించి, ఇప్పటికీ వాడుకోనివేనని చెబుతోంది. అయితే, తమ కోటా నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, వాటిని కావేరికి మళ్లించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఛత్తీస్గఢ్ సర్కార్ పదే పదే స్పష్టం చేస్తోంది. అయినా ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టేలా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించి, అవగాహన ఒప్పందంపై సంతకం చేయించడానికి ఎన్డబ్ల్యూడీఏ నాలుగున్నరేళ్లుగా సంప్రదింపుల జరుపుతోంది. ఇప్పటికీ ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి రాకపోవడం గమనార్హం. ఈనెల 23న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కూడా ఇదే అంశంపై నిర్వహించిన సమావేశంలో తమ కోటా నీటిని వాడుకోవడానికి అనుమతించబోమని ఛత్తీస్గఢ్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనం.ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదన ఇదీ..ఇచ్చంపల్లి వద్ద గోదావరిపై 87 మీటర్ల గరిష్ఠ నీటి మట్టంతో బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 148 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా కావేరికి తరలించేలా గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఎన్డబ్యూడీఏ ప్రతిపాదించింది. ఇందులో ఆవిరి ప్రవాహ నష్టాలు పోను తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 15.90, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీని వల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చునని పేర్కొంది. ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ఈ అనుసంధాన ప్రాజెక్టును చేపట్టడానికి అంగీకారం తెలపాలని గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్ పరిధిలోని తొమ్మిది రాష్ట్రాలు, పుదుచ్చేరితో ఎన్డబ్ల్యూడీఏ ఆరు దఫాలు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది. ఈ 148 టీఎంసీలు ఇంద్రావతి సబ్ బేసిన్లో ఛత్తీస్గఢ్కు కేటాయించి వాడుకోనివేనని పేర్కొంది. రానున్న రోజుల్లో హిమాలయ, ద్వీపకల్ప నదుల అనుసంధానంలో భాగంగా గంగ–మహానదుల అనుసంధానం చేపడతామని, మహానది–గోదావరి అనుసంధానం చేపడతామని, గంగ నుంచి గోదావరికి జలాలను తరలిస్తామని, అప్పుడు ఛత్తీస్గఢ్ తన కోటా నీటిని వాడుకోవచ్చని పేర్కొంది. కానీ దీనికి ఛత్తీస్గఢ్ ససేమిరా అంటోంది.ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనే..గోదావరిపై ఇచ్చంపల్లి బహుళార్ధ సాధక బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 78.10, మహారాష్ట్ర 10.50, మధ్యప్రదేశ్ 11.40 శాతం చొప్పున భరించాలి. ఇచ్చంపల్లి బ్యారేజీ విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేసే విద్యుత్లో మహారాష్ట్రకు 35 శాతం, మధ్యప్రదేశ్కు 28 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 27 శాతం చొప్పున పంపిణీ చేసుకోవాలి. వాటికి అదనంగా మహారాష్ట్ర 3, మధ్యప్రదేశ్ 4, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరో 5 టీఎంసీలను వినియోగించుకోవచ్చు. అంతకు మించి నీటిని వాడుకోకూడదని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ మేరకు గోదావరి ట్రిబ్యునల్ అవార్డు జారీ చేసింది. ఇప్పుడు ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన మేరకు ఇచ్చంపల్లి నుంచి 148 టీఎంసీలు తరలిస్తే గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించినట్లేనని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
దేవుడా.. ఏమిటీ పరీక్ష?
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యంతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. గత ఏడాది వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో చోటుచేసుకున్న దుర్ఘటన నుంచి పాఠాలు నేర్చుకోలేదు. అందుకు అలిపిరి వద్ద గురువారం దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాటే నిదర్శనం. వారాంతపు సెలవులు రావడంతో గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకదారిలో తిరుమలకు చేరుకునే భక్తులు.. శ్రీవారి దివ్యదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు చేరుకున్నారు. పరిమితికి మించి భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది క్యూలైన్ కౌంటర్ ప్రధాన గేటు సకాలంలో తెరవక పోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా క్యూలైన్ గేటు తెరవడం, అదే సమయంలో భక్తులకు తగిన సూచనలు చేసే వారు లేకపోవడంతో టోకెన్ కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. క్యూలైన్లలో అరుపులు, కేకలతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఏమి జరుగుతుందోనని భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భక్తులు తమ పిల్లలు, కుటుంబ సభ్యుల కోసం ఇనుప కంచెపైకి ఎక్కిమరీ అరుపులు, కేకలు వేయడం, మరికొందరు కంచెను ఎక్కి టోకెన్ల కోసం పరుగులు తీయడం, భక్తులను నిలువరించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవటం వంటి పరిస్థితుల్లో కొందరికి గాయాలయ్యాయి. టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం టీటీడీ తీరుపై భక్తులు మండిపడ్డారు. గురువారం తెల్లవారు జాము నుంచి టోకెన్ల కోసం తిండి తిప్పలు మాని క్యూలో వేచి ఉంటే.. మధ్యాహ్నం 12.30 గంటలకే టోకెన్ల జారీ ప్రక్రియ అయిపోయిందంటూ ప్రకటించడం... పైగా క్యూలైన్లలో అరుపులు, కేకలు, తోపులాటలు చోటుచేసుకోవడంపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పండుగలకు ముందు సెలవులు వస్తాయని, ఆ సమయంలోనే భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారని అధికారులకు ముందే తెలుసు. అయినా టీటీడీ అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవడాన్ని భక్తులు తప్పుపట్టారు. అంతా గందరగోళం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో సాధారణ భక్తులకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి 15 వేల స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డి) టోకెన్లు జారీ చేస్తారు. అదే విధంగా కాలినడకన శ్రీవారిమెట్టు, అలిపిరి మెట్టు వైపు వెళ్లే భక్తులకు వేర్వేరు కౌంటర్ల ద్వారా రోజుకు 5 వేల చొప్పున 10 వేల దివ్యదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి రోజు 25 వేల టోకెన్ల జారీ జరుగుతోంది. కాగా వారాంతపు సెలవులు రావడంతో అత్యధిక సంఖ్యలో దాదాపు 50 వేల మంది భక్తులు అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు చేరుకోవడం, టోకెన్ల కోసం శ్రమించడంలో గందరగోళం చోటుచేసుకుంది. దాదాపు 25 వేల మంది భక్తులు టోకెన్లు పొందలేక వెనుతిరగాల్సిన పరిస్థితి చోటుచేసుకుంది. టోకెన్ల జారీ విధాన మార్పుతోనే సమస్య శ్రీవారి మెట్టు నడక మార్గంలోనే గతంలో దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేవారు. అయితే గత కొంత కాలంగా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లోనే అదనంగా కౌంటర్ను ఏర్పాటు చేశారు. గురువారం కౌంటర్ వద్ద గందరగోళ పరిస్ధితి ఏర్పడటానికి అది కూడా ఒక కారణం అని భక్తులు విమర్శిస్తున్నారు. టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయిన వెంటనే మైకు ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చి ఉంటే పరిస్థితి సజావుగా సాగేదని చెబుతున్నారు. దివ్యదర్శనం టోకెన్లు లభించని వేలాది మంది భక్తులు ‘గోవిందా నీవే దిక్కు.. నీదర్శనమే మాకు మొక్కు’ అంటూ తిరుగు పయనమవడం కనిపించింది. తగిన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ సుబ్బరాయుడు వారాంతపు సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి రావడం వల్ల తోపులాట చోటుచేసుకుందని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో తొక్కిసలాట అంటూ వచి్చన వార్తల్లో వాస్తవం లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లోని శ్రీవారి మెట్టు నడకదారి దివ్యదర్శన టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొదట ఎస్ఎస్డీ టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారన్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మున్ముందు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎందుకొచ్చావ్.. సాక్షి ఫొటోగ్రాఫర్ సెల్ఫోన్ లాక్కున్న ఏవీఎస్వో తోపులాటకు సంబంధించి మీడియా కవరేజి చేస్తున్న సాక్షి ఫొటోగ్రాఫర్ కేతారి క్రిష్ణమోహన్పై అక్కడే ఉన్న ఏవీఎస్వో రమేష్ కృష్ణ దౌర్జన్యం చేశారు. ఆయనను అడ్డుకుని సెల్ఫోన్ లాక్కున్నారు. ‘ఎందుకొచ్చావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవీఎస్వో వ్యవహార శైలి తీవ్ర కలకలం రేపింది. ‘కింద స్థాయిలో అధికారులు మీడియాకు సహకరించాలి’’ అని ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికి పొంతన కుదరడంలేదంటూ పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ యంత్రాంగం విఫలం..అడ్డదారుల్లో వచ్చే వారికి టోకెన్ పొందే అవకాశాన్ని కల్పించారు. ఉదయం నుంచి క్యూలైన్లో ఏమీ తినకుండా.. పిల్లలకు కూడా పెట్టకుండా ఇబ్బందులు పడ్డాం. సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ యంత్రాంగం విఫలం అయ్యింది. – మాధురి, భక్తురాలు (బెంగళూరు) ఏ రోజూ ఇంత దారుణంగా లేదుగోవిందమాల ధరించి వేంకటేశ్వరస్వామి దర్శనార్థం 13వ సారి 20 మంది మాలధారులతో కలిసి వచ్చాను. తీరా కౌంటర్ వద్దకు సమీపించగానే టోకెన్లు లేవని చెప్పడం తీవ్ర నిరాశ కలిగించింది. ఏ రో జూ ఇంత దారుణంగా లేదు. –రఘురామయ్య, భక్తులు (నాయుడుపేట) నిర్వహణ తీరు దారుణం..ఉదయం నుంచీ క్యూలైన్లో వేచివున్నా.. టోకెన్లు లభించకపోగా.. సెక్యూరిటీ సిబ్బందితో చేదు అనుభవం ఎదురైంది. నేను డాక్టర్నని చెప్పినా.. సెక్యూరిటీ సిబ్బంది ఎటువంటి గౌరవం లేకుండా నాతోపాటు మా అమ్మను తోసేశారు. నిర్వహణ తీరు దారుణంగా ఉంది. – తల్లితో డాక్టర్ వెంకటేశ్, భక్తుడు (హైదరాబాద్) ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు.. కౌంటర్ వద్దకు చేరుకునే సరికే టోకెన్లు అయిపోయాయని చెప్పారు. తీవ్ర నిరాశ ఎదురైంది. పైగా తీవ్ర తోపులాటలో కిందపడిన నా పిల్లలకు గాయాలయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. – విజయలక్ష్మి, భక్తురాలు (బళ్లారి) -
కృష్ణా డెల్టాకు పెనుముప్పు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కాజా, తరకటూరుతో పాటు 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వి (షెల్) చమురు (ఆయిల్), గ్యాస్ (సహజ వాయువు) వెలికితీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని, సాగు నీరే కాదు, తాగడానికి గుక్కెడు మంచి నీళ్లూ దొరకవని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చమురు, గ్యాస్ను వెలికితీసేందుకు బావులను అత్యంత లోతుకు తవ్వుతారు. భారీఎత్తున నీటిని తోడడంతో భూగర్భ జలాలు అడుగంటుతాయి. గ్యాస్, చమురు వెలికితీత (ఫ్రాకింగ్) సమయంలో వెలువడే వ్యర్థ జలాల్లో అణుధార్మిక పదార్థాలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. భారీగా వెలువడే వ్యర్థ జలాలను తరలించడం అసాధ్యమని... వాటిని వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతాయన్నారు. ఫ్రాకింగ్ వ్యర్థాలపై విస్తృతంగా అధ్యయనం చేసి నోబెల్ శాంతి బహుమతి పొందిన డాక్టర్ల సంస్థ ఫిజీషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (పీఎస్సార్) నివేదికను వారు ఉటంకించారు. అణు ధార్మిక పదార్థాలు ఉండే ఫ్రాకింగ్ జలాల ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్రంగా ఉంటుందని ఎత్తిచూపారు. షెల్ గ్యాస్, చమురు వెలికితీత వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలు ఉన్నాయని గుర్తుచేశారు. శాస్త్రీయ ఆధారాలను విస్మరించి... సమగ్ర పరిశీలన లేకుండా వేదాంత సంస్థకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. తక్షణమే ఈ ఎన్వోసీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఎస్సార్ సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.బాబూరావు, డాక్టర్ కె.వెంకటరెడ్డి, డాక్టర్ డి.రాంబాబు, డాక్టర్ అహ్మద్ఖాన్, డాక్టర్ పీజీ రావు, డాక్టర్ ఎం.బాపూజీతో పాటు, మరో 24 మంది శాస్త్రవేత్తలు బుధవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు.లేఖలోని ముఖ్యాంశాలు..1. వేదాంత కంపెనీకి షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీతకు కేంద్రం లీజు ఇచ్చింది. ఆ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో పుట్టి పెరిగిన మేము... ప్రపంచవ్యాప్తంగా షెల్ బావులు సృష్టించిన పర్యావరణ విధ్వంసం, ఆరోగ్య నష్టాల గురించి తెలిసి, ఆందోళన చెందాం. స్థానిక ప్రజలకు ఎదురయ్యే ముప్పును వివరించే ప్రయత్నం చేశాం. మీడియా సంస్థలు మా వాదనలకు వేదిక కల్పించినా, రాష్ట్ర పీసీబీ సహకరించలేదు. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నివేదికపై మేం లేవనెత్తిన ప్రశ్నలకు వేదాంతతో సమాధానాలు ఇప్పించలేదు. నిజానికి వేదాంతకు షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతలో అనుభవం లేదు. అంతేకాదు, భారత ప్రభుత్వానికి షెల్ గ్యాస్, ఆయిల్ ఫ్రాకింగ్పై స్పష్టమైన పర్యావరణ, భద్రతా నియమ నిబంధనలు కూడా లేవు. 2. ఫ్రాకింగ్ చేయడానికి కోట్ల లీటర్ల నీరు అవసరం. అందులో వందల సంఖ్యలో హానికర రసాయనాలు కలుపుతారు. వ్యాపార రహస్యాల పేరుతో వాటిని ప్రజలకు వెల్లడించరు. బావుల నుంచి వచ్చే వ్యర్థ జలాల్లో అణుధార్మికత (రేడియో యాక్టివిటీ) ఉంటుంది. అంత నీరు ఈ ప్రాంతంలో దొరకదు. భూగర్భ జలాలను తోడేస్తే వ్యవసాయం కుప్పకూలుతుంది. తాగునీరు కూడా లభించదు. ఫ్రాకింగ్ వ్యర్థ జలాలను శుద్ధి చేయలేం. మరి ఎక్కడకు వదులుతారు? 3. ఫ్రాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై పీఎస్సార్ అనేక నివేదికలు విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలున్నా అన్నీ పక్కనపెట్టి, శాస్త్రీయ ఆధారాలను విస్మరించి, సమగ్ర పరిశీలన లేకుండా ఎన్వోసీ ఇవ్వడం ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇంత అధిక జనాభా సాంద్రత ఉన్న, తాగునీటి కొరత ఉన్న ప్రాంతంలో ఫ్రాకింగ్కు అనుమతించడం ప్రాణాంతకం.4. భారత ప్రభుత్వం గతంలో ఓఎన్జీసీ సంస్థకు ఫ్రాకింగ్కు అనుమతులు ఇచి్చంది. కొన్నేళ్ల పరిశోధన, ప్రయోగాల తర్వాత దేశంలో షెల్ నిర్మాణాలు వాణిజ్యపరంగా అనుకూలం కావని తేల్చి ఓఎన్జీసీ స్వయంగా వదిలేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థ లాభాల కోసం ప్రజల ప్రాణాలు, నీరు, భూమిని తాకట్టు పెట్టే ప్రయత్నాన్ని తక్షణమే నిలిపివేయాలి. శతాబ్ద కాలంగా వ్యవసాయం, తాగు నీటి మీద ఆధారపడిన ఈ ప్రాంతాన్ని ఫ్రాకింగ్ నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థను కోరుతున్నాం. -
మీ కులం.. మతం ఏమిటి?
ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సమస్తం తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు బాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సేకరించనుంది. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.సాక్షి, అమరావతి: ఏకీకృత కుటుంబ సర్వే ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల్లో పౌరుల వ్యక్తిగత సమాచారం సమస్తం గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఆధార్ కార్డుల్లో పౌరుల సమగ్ర సమాచారం ఉన్నప్పటికీ ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరా తీయడం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో రాజకీయంగా వినియోగించుకోవాలనే దుర్బుద్ధితోనే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారనే సందేహాలు ముసురుకుంటున్నాయి. పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు ట్రాకింగ్..!ఏకీకృత కుటుంబం సర్వే పేరుతో పౌరుల వ్యక్తిగత సమాచాన్ని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సర్వే ద్వారా ఇంటింటికి వెళ్లి 25 రకాల అంశాలకు సంబంధించి పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేకరించనున్నారు. వివిధ పథకాలు, పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతో దీన్ని పోల్చనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకీకృత కుటుంబ సర్వే ఆధారంగా ‘స్మార్ట్ ఫ్యామిలీ’ కార్డు జారీ చేయనున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, కుల ధృవీకరణ, ఇతర పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ కార్డు ద్వారా ట్రాకింగ్ చేయనున్నారు. డేటా లేక్లో నిక్షిప్తం ఏకీకృత కుటుంబ సర్వే ద్వారా కులం, మతం, పంట అమ్మకం ద్వారా ఎంత వచ్చింది? తదితర వివరాలతో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. వివిధ వర్గాల నుంచి ఇలా తీసుకున్న వ్యక్తిగత సమాచారాన్ని రియల్టైమ్ గవర్నెన్స్ డేటా లేక్లో నిక్షిప్తం చేయనున్నారు. సర్వే ప్రశ్నావళి చూస్తుంటే కచ్చితంగా ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.ఇప్పటికే ఆధార్తో పాటు రేషన్ కార్డుల్లో పౌరుల సమాచారం ఉండగా కొత్తగా ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలను సేకరించాల్సిన అవసరం ఏముందని పేర్కొంటున్నాయి. కొత్తగా రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు క్యూఆర్ కోడ్తో ఫ్యామిలీ కార్డు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సర్వే ద్వారా సమాచారం సేకరించాక కుటుంబాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఐదు వర్గాలుగా విభజించనున్నారు. -
కేంద్ర నిధులపై బాబు సర్కారు పెత్తనం 'గ్రామాలకు గ్రహణం'
సాక్షి, అమరావతి: గ్రామ స్వరాజ్యానికి చంద్రబాబు సర్కారు గ్రహణం పట్టిస్తోంది! పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను అడ్డుకుని దొడ్డిదారిన మళ్లించే కుతంత్రానికి తెర తీసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు విడుదలైన రూ.వందల కోట్ల నిధులను ఆయా స్థానిక సంస్థలు అక్కడ అవసరాలకు ఖర్చు పెట్టనివ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు కేంద్ర నిధులు ఇవ్వకుండా తొక్కిపెడుతున్న బాబు సర్కారు తాజాగా మరో అడుగు ముందుకేసి వాటిని తాము చెప్పిన పనులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించడం ద్వారా గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచింది. బాబు సర్కారు కర్ర పెత్తనం..! 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతగా రూ.1,026 కోట్ల నిధులను ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల ప్రకారం గరిష్టంగా కేంద్రం నుంచి నిధులు విడుదలైన పది రోజుల్లో వాటిని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఖాతాల్లో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి మూడు నెలలకు పైగా ఇతర అవసరాలకు వాడుకుంది. తప్పనిసరి పరిస్థితి కావడంతో ఎట్టకేలకు డిసెంబరు 18న ఆ నిధులను విడుదల చేసినా మరో మెలిక పెట్టింది. ఈ నిధులకు సంబంధించి తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఖర్చు చేయవద్దని ఎంపీడీవోలను ఆదేశించింది. వాటిని తాము చెప్పిన ప్రకారమే వినియోగించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇలా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై చంద్రబాబు సర్కారు కర్ర పెత్తనం చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులను అడ్డుకుని గ్రామీణ స్వరాజ్యానికి తూట్లు పొడుస్తోంది. గ్రామ పంచాయతీల పీక నులుముతూ చంద్రబాబు సర్కారు నిరంకుశంగా వ్యవహరించడం పట్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ తాజాగా జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలియచేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలే.. – నిధుల వినియోగంపై సర్క్యులర్ యోచనలో సర్కారు ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం మరో మూడు నెలలో ముగియనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2 కల్లా సర్పంచుల కాలం పూర్తవుతుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా ఇచ్చిన రూ.1,026 కోట్లతో పాటు రానున్న మార్చి నెలాఖరులోగా రెండో విడతగా మరో రూ.1,000 కోట్లు కేంద్రం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు నిధులు రావాల్సి ఉంది. ఇలా దాదాపు రూ.రెండు వేల కోట్లకుపైగా కేంద్రం నిధులిస్తున్నప్పటికీ బాబు సర్కారు స్థానిక సంస్థలకు అందకుండా అడ్డుపడుతోంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా కాకుండా తాము చెప్పిన ప్రకారం వాడాలని ఆంక్షలు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కేంద్రమిచ్చిన 15వ ఆర్థిక నిధులను సర్పంచులు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల అవసరాలకు అనుగుణంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచించే పనులకే ఖర్చు పెట్టేలా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఓ సర్క్యులర్ జారీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కరుణించినా.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు సర్కారు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం ఇస్తున్న నిధులను తొక్కిపెడుతూ తీవ్ర జాప్యం చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను కేంద్రం గతేడాది సెపె్టంబరులో రూ.988.76 కోట్లు విడుదల చేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో ఆయా స్థానిక సంస్థల ఖాతాలకు చేరాయి. ఇక గతేడాదికి సంబంధించి రెండో విడతగా రూ.1,121 కోట్లను 2024 డిసెంబరులో కేంద్రం విడుదల చేస్తే.. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ ఏడాది సెపె్టంబరులో వాటికి మోక్షం లభించింది. ⇒ 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా రూ.998 కోట్ల కేంద్ర నిధులు 2024 మార్చి నెలాఖరులో విడుదలయ్యాయి. అయితే అప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమలులోకి రావడంతో అప్పటి అధికారులు ఆ నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వం జూన్ 12వ తేదీనే బాధ్యతలు చేపట్టినప్పటికీ 2024 ఆగస్టు దాకా ఆ నిధులను ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడం గమనార్హం. జగన్ హయాంలో..సర్పంచుల ఆధ్వర్యంలోనే చెల్లింపులు15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ప్రత్యేకించి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వైఎస్సార్ సీపీ హయాంలో అడుగులు ముందుకు పడ్డాయి. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలోని స్థానిక సంస్థల ప్రభుత్వాలు వారి పరిధిలో స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేసుకునే కొత్త విధానం గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల తీర్మానాల ప్రకారం చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ట్రెజరీ ఆంక్షలు లేకుండా, ఆ నిధులను ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకు ముందు టీడీపీ హయాంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులపై నియంత్రణను సీఎఫ్ఎంఎస్ పరిధిలో ఉంచడంతో గ్రామ పంచాయతీలు మొక్కుబడి కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. కళ్ల ముందు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ వద్ద బిల్లులు పాస్ కాకుండా అడ్డంకులు సృష్టించడంతో గ్రామీణ స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ఇది .. బ్లాక్ మెయిల్ చేయడమే! రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయడం దారుణం. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్థానిక సంస్థలు ఆ నిధులు వినియోగించకూడదని ఆదేశించడం గ్రామ స్వరాజ్య స్ఫూర్తికి వ్యతిరేకం. విజయనగరం జడ్పీ సీఈవో ఈమేరకు సర్క్యులర్ జారీ చేయడం అంటే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బ్లాక్ మెయిల్ చేయడమే. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటి? స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రజా ప్రతినిధులు, ప్రజలతో కలసి ఉద్యమానికి సమాయత్తం అవుతాం. –వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు ఉపసంహరించుకోకుంటే ఉద్యమమే.. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆక్షేపణీయం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను వినియోగించుకోనివ్వకుండా అడ్డుపడుతూ సర్క్యులర్ జారీ చేయడం శోచనీయం. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 15 ఆర్థిక సంఘం నిధులను ఖర్చు పెట్టకూడదని పంచాయతీరాజ్ కమిషనర్ ఆంక్షలు విధించడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సిన సర్చార్జీ, స్టాంప్ డ్యూటీ నిధులు ఇవ్వడం లేదు. మినరల్ సెస్ రూపంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. సీనరేజ్ నిధులను కూడా ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతూ వస్తోంది. సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం కూడా చెల్లించకుండా వారిని అగౌరవ పరుస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులపై సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమించక తప్పదు. –మామిడి అప్పలనాయుడు, లోకల్ గవర్నమెంట్ చాంబర్ జాతీయ అధ్యక్షుడు. -
రఘురామకృష్ణరాజుతో కాస్త జాగ్రత్త
సాక్షి, అమరావతి: సీబీఐతో 420 ముద్ర వేయించుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వంటి వ్యక్తులతో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన కనకమేడల రవీంద్రకుమార్ కాస్త జాగ్రత్తగా ఉండాలని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలోని తన ఖాతాలో బుధవారం ఆయన ఓ పోస్టు పెట్టారు.కనకమేడల రవీంద్ర కుమార్తో గతంలో తీసుకున్న ఫొటోను ప్రస్తుతం రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని సునీల్కుమార్ ప్రస్తావించారు. మనీలాండరింగ్ ఆరోపణల్లో ఈడీతో నేరం నిరూపితమైన రఘురామకృష్ణరాజు ఆ ఫొటోను ఎలా దుర్వియోగం చేయగలరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు. ఆయన్ని కనమేడల రవీంద్రకుమార్ తన కార్యాలయం పొలిమేరల వరకు కూడా రానివ్వకూడదని సూచించారు. రఘురామకృష్ణరాజు అరాచకాలను గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పీవీ సునీల్ కుమార్ (PV Sunil KUmar) ఎండగడుతున్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆయన త్వరలోనే జైలుకు వెళతారని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులను రూ. 2 వేల కోట్ల మేర మోసం చేసిన వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని సునీల్ కుమార్ చెప్పారు.కనకమేడల రవీంద్ర కుమార్ గారు భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. వీరు గతం లో రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. న్యాయ కోవిదుల్లో కనకమేడల ఒకరు. ఆయన న్యాయ శాస్త్ర పరిజ్ఞానం అపారం అని చెబుతారు. ఒక తెలుగు వ్యక్తి జాతీయ స్థాయి లో ఈ పదవి చేపట్టటం మనకి గర్వ కారణం సార్…… pic.twitter.com/BhxvlZ4I16— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) December 24, 2025 చదవండి: బ్యాంకులకు రఘురామకృష్ణరాజు టోకరా -
జీతాల్లో కోతలు.. జీవితాలతో ఆటలు
మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్యసేవలు అందిస్తూ అండగా నిలుస్తున్న ఆపద్బాంధవులకు కష్టమొచ్చింది. గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపే ఉద్యోగులకు ఆపదొచ్చింది. పల్లె సంజీవని 104 అంబులెన్స్ ఉద్యోగులతో నిర్వహణా సంస్థ చెలగాటమాడుతోంది. అరకొర సిబ్బంది..రోజుకు పది గంటలకు పైగా విధులు..అదనపు పని ఒత్తిడి. కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు.. మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం. ఇదేమని అడిగిన వారిపై లేనిపోని నిందలేసి వేటు వేస్తోంది. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒంగోలు టౌన్: ప్రకాశం జిల్లాలో 729 గ్రామాలకు గాను ‘104’ వాహనాలు కేవలం 47 మాత్రమే ఉన్నాయి. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) ఉంటారు. మొత్తం మీద 94 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 88 మంది మాత్రమే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ 104 కాంట్రాక్ట్ చేపట్టింది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం ఉద్యోగులలో 10 శాతం బఫర్ సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు బఫర్ ఉద్యోగులను నియమించలేదు. అదనపు పనిభారంతో సతమతం... సరిపడా సిబ్బంది లేకపోయినప్పటికీ భవ్య యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపిస్తోంది. ఒక ఉద్యోగి చేత ఇద్దరు ఉద్యోగుల పనిని చేయించుకుంటోందని మండిపడుతున్నారు. రెండు వాహనాలకు ఒక డ్రైవర్కు డ్యూటీ వేయడం, ఒక డీఈఓతో రెండు వాహనాల డేటా ఎంట్రీ చేయిస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంటోంది. రోగులకు సేవలందించడంతో పాటుగా ప్రతి రోజూ వివిధ రికార్డులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరు రకాల రికార్డులు పూర్తి చేయడమే కాకుండా ఎంఓ యాప్ను కూడా ఆన్లైన్ చేయాలి. దీనికితోడు ఇటీవల భవ్య యాప్ తీసుకొచ్చి దానిని కూడా ఆన్లైన్ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో 104 ఉద్యోగులకు అసలు పనికంటే కొసరు పనే ఎక్కువైపోయిందని వాపోతున్నారు. సెలవులివ్వకుండా హక్కులు హరి... కొంతమంది ఉద్యోగులకు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఉన్నారు. భార్య, బిడ్డల బాధ్యతలు చూడాల్సి ఉంటుంది. స్వయంగా అనారోగ్యం పాలవుతుంటారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా 104 ఉద్యోగులకు యాజమాన్యం సెలవులు ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల సమయంలో కూడా సెలవులివ్వకుండా వేధింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సెలవు పెట్టినప్పటికీ ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. సెలవు రోజు వేతనం మాత్రం కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల హక్కులు సరే మానవ హక్కులను కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తోందని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతంలో రూ.500 కోత... గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరించిన అరవిందో ఇచ్చిన జీతాల కంటే ప్రస్తుతం భవ్య యాజమాన్యం తక్కువ జీతాలు చెల్లిస్తోంది. ఇస్తున్న అరకొర జీతాల్లో నుంచి ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలకు రూ.500 కోత విధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు కోత విధిస్తున్నారో, ఎవరు విధిస్తున్నారో సమాధానం చెప్పేవారే లేకుండా పోవడంతో 104 ఉద్యోగులు దిక్కులు చూస్తున్నారు. ఏడు నెలలుగా ఉద్యోగులకు పే స్లిప్పులు ఇవ్వకుండా యాజమాన్యం దాగుడుమూతలు ఆడుతోంది. గతంలో ఇచ్చినట్లుగానే భవ్య యాజమాన్యం కూడా జీతాలు ఇస్తుందని అధికారులు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయిందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనల ప్రకారం ఈఎస్ఐ, పీఎఫ్లో యాజమాన్యం వాటా చెల్లించాల్సి ఉంది. కానీ 104 ఉద్యోగుల నుంచి కంపెనీ వాటా, ఉద్యోగి వాటా రెండూ వసూలు చేస్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అసలు ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు అభద్రతకు గురవుతున్నారు. ప్రశ్నిస్తే వేటే... భవ్య యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలన్నిటినీ యథేచ్చగా ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులకు కనీసం సెలవులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని, చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దతలకాయల మద్దతుతో రెచ్చి పోతున్న యాజమాన్యం వైఖరిని ప్రశ్నించడం నేరమవుతోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. యాజమాన్యం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అధికారిని కలవడానికి ప్రయత్నించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీద వేధింపులకు దిగినట్టు సమాచారం. సదరు నాయకుడు డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సెలవులో ఉన్నప్పుడు తనిఖీ పేరుతో వెళ్లిన అధికారి చేసిన హంగామా చూసి ఉద్యోగుల విస్తుపోయారు. 104 వాహనంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద వేటు వేయడంపై 104 ఉద్యోగుల యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలి భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని రకాలుగానూ దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా ప్రతినెలా రూ.500 కోత విధించడం దారుణం. అసలే అరకొర జీతాలతో ఉద్యోగులు కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు పెంచడానికి బదులు కోతలు విధించడం దుర్మార్గం. ఉద్యోగుల పే స్లిప్పులను ఇవ్వక పోవడం నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ తరహా వేధింపులను యాజమాన్యం ఆపాలి. లేకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తాం. – అబ్బూరి శ్రీనివాసరావు, ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహిళా ఉద్యోగుల హక్కులను కాపాడాలి జిల్లాలోని ఏడుగురు మహిళా ఉద్యోగులు 104లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ మహిళలకు ప్రత్యేక సెలవులు ఇస్తారు. కానీ 104లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఎలాంటి సెలవులు ఇవ్వకపోవడం విచారకరం. ఒకవేళ సెలవు పెట్టినా ఇంటి వద్ద నుంచి పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. మహిళా సాధికారిత గురించి చెబుతున్న ప్రభుత్వం 104లో పనిచేస్తున్న మహిళల ప్రాథమిక హక్కులను కాపాడాలి. – మాకం లక్ష్మి, డేటా ఎంట్రీ ఆపరేటర్ -
బ్లాక్ స్పాట్స్.. డేంజర్ బెల్స్
రోడ్డెక్కితే సురక్షితంగా గమ్యం చేరతామా? లేదా? అనేది ఇప్పుడు రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్న. కారణం.. రహదారుల అస్తవ్యస్త నిర్మాణం, పొంచి ఉన్న ప్రమాద ప్రాంతాలే. దీంతో రాష్ట్రంలోని రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాటిల్లో ఎక్కువ ప్రమాదాలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదు.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. గుంతలమయంగా, ప్రమాదకర మలుపులతో ఉన్న రోడ్లపై వాహనం నడపడమంటే సర్కస్ ఫీట్లు చేసినట్లే. గమ్యం చేరేవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా సరే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న బ్లాక్ స్పాట్లపై మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. బ్లాక్ స్పాట్లే వాహనదారుల ప్రాణాలకు స్పాట్పెడుతున్నాయని పోలీసు శాఖ ఇటీవల సమర్పించిన నివేదిక స్పష్టం చేసింది. ఆ నివేదికలోని ప్రధాన అంశాలు..787 బ్లాక్ స్పాట్లురాష్ట్రంలో రహదారులపై అత్యధికంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లు 787 ఉన్నాయి. రోడ్ల నిర్మాణంలో డిజైన్ లోపం, ప్రమాదకర మలుపులు, రోడ్లు నిర్వహణ లోపం, గుంతలమయంగా ఉండటంతో ఆ ప్రదేశాల్లో తరచూ రోడ్లు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.అత్యధికంగా బ్లాక్ స్పాట్లు ఉన్న జిల్లాల్లో తిరుపతి (100), ఎన్టీఆర్ (76), కృష్ణా (56), కాకినాడ (43), విశాఖ(40) జిల్లాలు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం 787 బ్లాక్ స్పాట్లు రాష్ట్రంలో 76 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్నాయి. వాటిలో 44 పోలీస్స్టేషన్లు ఏలూరు, విశాఖ, అన్నమయ్య, కాకినాడ, కృష్ణా, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. ఏమిటీ బ్లాక్ స్పాట్?భారతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఏదైనా రహదారి 5 కి.మీ. పరిధిలో గడిచిన మూడేళ్లలో అత్యంత దారుణ ప్రమాదాలు 5 జరిగి దానిలో 10 మందికిపైగా మరణించినా లేదా తీవ్రంగా గాయపడినా దానిని ‘బ్లాక్స్పాట్’గా గుర్తిస్తారు.వామ్మో! రోడ్డు ప్రమాదాలుబ్లాక్ స్పాట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్లు ప్రమాదాలు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 30నాటికే ఏకంగా 18,837 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 8,237 ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 8,466 మంది దుర్మరణం చెందారు. 10,600 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది కంటే మొత్తం రోడ్డు ప్రమాదాలు 2.2% పెరగగా... వాటిలో ప్రాణాలను బలిగొన్న తీవ్రమైన ప్రమాదాలు 4.6% పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృతులు 4.6% పెరగ్గా తీవ్రంగా గాయపడినవారి సంఖ్య 0.4% పెరిగింది. » అత్యధికంగా 45% ద్విచక్ర వాహనాలే ప్రమాదానికి గురయ్యాయి. » 44% ప్రమాదాలు జాతీయ రహదారులపై, 22% రాష్ట్ర రహదారులపై సంభవించాయి. » జాతీయ, రాష్ట్ర రహదారులుకాని రోడ్లపై 34% ప్రమాదాలకు కేంద్రమయ్యాయి.» మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలోనే అత్యధికంగా 39% ప్రమాదాలు సంభవించాయి.» తిరుపతి, విశాఖ, ఎన్టీఆర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కలిపి 29% రోడ్డు ప్రమాదాలు జరిగాయి.రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన టాప్ 5 పోలీస్ స్టేషన్ల పరిధి » నల్లపాడు (గుంటూరు జిల్లా)» చంద్రగిరి (తిరుపతి జిల్లా)» ఒంగోలు తాలుకా (ప్రకాశం జిల్లా)» దేవరాపల్లి (తూర్పు గోదావరి జిల్లా)» రాజానగరం (తూర్పు గోదావరి జిల్లా) -
వైఎస్ జగన్ సర్కారు విద్యుత్ సంస్కరణలతో.. రూ.5,253 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన వినూత్న విధానాలవల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కి ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం చాలావరకూ తప్పింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తాజాగా రూ.134.08 కోట్లను ట్రూడౌన్ చేయడానికి అనుమతివ్వడంతో జగన్ హయాంలో జరిగిన రూ.5,252.93 కోట్ల ఖర్చుల పొదుపు అంశం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. నాడు మిగులు ఇలా.. 2019–20 నుంచి 2023–24 వరకూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) రూ.1,400 కోట్ల ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూడౌన్ చేశాయి. 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశాయి. అంటే.. వాటి రెవెన్యూ గ్యాప్ను భర్తీచేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. అదే విధంగా 2019–20 నుంచి 2023–24 మధ్య 4వ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు రూ.1,059.76 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో 247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్సీ తాజాగా తేల్చింది. అంటే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.19 కోట్లు మిగిలాయి. ఈ మొత్తాన్ని డిస్కంలకు ఏపీ ట్రాన్స్కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలావరకూ సర్దుబాటు చేయగా మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్సీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ లెక్కన గత ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలపై రూ.5,252.93 కోట్ల ట్రూఅప్ భారం తగ్గింది. అదే విధంగా.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలుచేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూడౌన్ చేసి వినియోగదారులకు గత ప్రభుత్వంలో డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు ట్రూడౌన్ రూపంలో మొత్తంగా రూ.5,448.93 కోట్లు ప్రయోజనం చేకూరింది. -
పసుపు పోస్టింగులు
సాక్షి, అమరావతి: ఓ నిరుపేద వృద్ధురాలికి పింఛను ఇవ్వడానికి చేతులు రావు.. ఓ వికలాంగుడికి పింఛను మంజూరు చేయడానికి మనసొప్పదు.. పేద విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బులుండవు.. రైతుకు మేలు చేసే ఆలోచనే ఉండదు.. కానీ, తన ప్రచారం కోసం.. తన కుమారుడి రాజకీయ లబ్ధి కోసం ఉన్నవీ లేనివీ కల్పించి పొగడ్తలతో ముంచెత్తడం, ప్రత్యర్థులపై గోబెల్స్ ప్రచారం చేయడం కోసం నెలనెలా వేలాది రూపాయలు చెల్లిస్తూ పార్టీ వారికి రకరకాల పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం చంద్రబాబు. సోషల్, డిజిటల్ మీడియా పేరుతో వందల మందిని నియమించారు. చేసే పని చంద్రబాబును, ఆయన కుమారుడిని కీర్తించి, ప్రత్యర్థులపై రాళ్లేయడమే అయినా, వారికి చెల్లించేదంతా ఖజానా నుంచే. అంటే ప్రజాధనమే. ఇక కన్సల్టెంట్ల పేరుతో తన వారిని ఇబ్బడిముబ్బడిగా నియమించేస్తూ వారికీ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా, యువ నిపుణులు, కన్సల్టెంట్ల పేరుతో చంద్రబాబు తన పార్టీకి చెందిన వారికి ఖజానా నుంచి భారీ వేతనాలతో పోస్టులు కట్టబెడుతున్నారు. నెల నెలా రూ.కోట్లలో చెల్లింపులు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలా వందల మందిని నియమించారు. తాజాగా సోషల్ మీడియా పేరుతో ఇద్దరు ప్రచార కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్టు విధానంలో నియామకానికి ఈ నెల 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నెలకు రూ.75 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మంత్రుల పేషీల్లో 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్లు.. మొత్తం 48 పోస్టులను సృష్టించి, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశారు. తొలుత ఏడాది పాటు అంటూ ఆదేశాలు జారీ చేసి, ఇటీవల మంత్రులు ఎంతవరకు ఉంటే అంతవరకు వీరు కొనసాగుతారని చంద్రబాబు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ప్రచారం కోసం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భారీ వేతనాలతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో 85 మందిని నియమించారు. తాజాగా వారిని మరో రెండేళ్ల పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరిలో 58 మందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో సోషల్ మీడియా ప్రత్యేక ఆఫీసర్కు నెలకు రూ.1.20 లక్షలు, 12 మంది కంటెంట్ డెవలపర్స్కు నెలకు రూ.75 వేల చొప్పున, 30 మంది సోషల్ మీడియా ఎనలిస్ట్లకు నెలకు రూ.30 వేల చొప్పున, 15 మంది డిజిటల్ ప్రచారకులకు నెలకు రూ, 25 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో నియమితులైన మరో 27 మందిలో డిజిటల్ డైరెక్టర్కు నెలకు రూ.1.75 లక్షల వేతనం చెల్లిస్తారు. క్రియేటివ్ కన్సల్టెంట్కు నెలకు రూ.1 లక్ష చొప్పున, మిగతా వారికి నెలకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రచార కార్యక్రమానికి ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్కు రూ.100 కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే రూ. 74 కోట్లు ఖర్చు చేసేశారు. మరోపక్క పీ–4 పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున యువ నిపుణులంటూ 175 మంది టీడీపీ వారికి ఖజానా నుంచి భారీగా డబ్బు ముట్టజెపుతున్నారు. వీరికి ఏడాదికి రూ.12.60 కోట్లు చొప్పున నాలుగేళ్ల పాటు రూ.50.40 కోట్లు ప్రజాధనం చెల్లిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీలో 71 మంది కన్సల్టెంట్లకు లక్షల్లో వేతనాలు ఇస్తూ నియమించారు. అలాగే రాష్ట్ర ఆదాయం పెంచే పేరుతో 11 మంది కన్సల్టెంట్లను నియమించి, రూ.3.28 కోట్లు చెల్లిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి బోర్డులో ఆరుగురు కన్సల్టెంట్లను రూ.3.66 కోట్లతో నియమించారు. మంత్రుల పేషీల్లో, డిజిటల్ కార్పొరేషన్లో, మిగతా చోట్ల నియమితులైన వారంతా టీడీపీకి చెందిన వారే. టీడీపీ ప్రచార దళమే. -
వక్ఫ్ భూములు చేజారుతున్నాయ్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూములు చేజారుతున్నాయి. ఈ ఏడాది మే నెలలో ప్రత్తిపాడు మండలం కొత్తమల్లాయపాలెం 232–1 సర్వే నంబరులోని 226.78 ఎకరాలు, 232–2 సర్వే నంబరులోని 7 ఎకరాలు మొత్తం 233.18 ఎకరాలను ఇండ్రస్టియల్ పార్కు కోసం తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మంత్రి లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం చినకాకానిలో అంజుమన్–ఎ–ఇస్లామియాకు చెందిన 71.57 ఎకరాలను కూడా కేటాయించేందుకు పావులు కదులుతున్నాయి. లోకేశ్ పేషీ నుంచి గతంలో వచ్చిన లేఖ మేరకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు. భూ సేకరణ చట్టం–2013 కింద 71.57 ఎకరాల వక్ఫ్ భూమి ప్రభుత్వం కోరుతోందని ఆదివారం ప్రాథమిక ప్రకటన ఇచ్చారు. దీనిపై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే వక్ఫ్ సీఈవోగా పనిచేసిన ప్రభుత్వ అధికారితో పాటు తెనాలి సబ్ కలెక్టర్, గుంటూరు వక్ఫ్ ఇన్స్పెక్టర్–ఆడిటర్తో పాటు పలువురు అధికారులు చినకాకాని భూములను పరిశీలించారు. » ప్రత్తిపాడు నియోజకవర్గంలో 233 ఎకరాల వక్ఫ్ భూమిని ఐటీ పార్కుకు కేటాయించారు. గుంటూరు జిల్లాలో భూసేకరణకు సహకరించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కలెక్టర్ను కోరడంతో భూసేకరణ అధికారిగా గుంటూరు ఆర్డీవోను నియమించారు. ఆయన సర్వే చేయించి పాటు పాతమల్లాయ్యపాలెంలో 209.86 ఎకరాలు, ప్రత్తిపాడులో 105.86 ఎకరాల పట్టా భూములు తీసుకునేందుకు ప్రాథమిక అంచనాలను పంపారు. అందులో ఉన్న 233.18 ఎకరాలు గుంటూరులో ఔరంగజేబు కాలంలో నిర్మించిన పెద్దమసీద్కు చెందిన వక్ఫ్ భూమి. ఇక్కడ ఎకరం ధర రూ.2 కోట్లపైనే ఉంది. ఈ భూమిని తీసుకోవాలంటే పెద్ద మసీదు ముతవల్లీ కమిటీ తీర్మానం చేసి వక్ఫ్ బోర్డుకు పంపించాలి. తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదించి ఆమోదం తీసుకుంటారు. » మలేసియా కంపెనీ ప్రతినిధులు నవంబర్ 4న వచ్చి చూశారు. ఇక్కడ నెవర్ సెండాయ్ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు ఫ్యాబ్రికేషన్ సమీకృత శిక్షణ సంస్థను స్థాపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు స్థలాలు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత మసీదు, అంజుమన్ సంస్థలకు చెందినవి కావడం గమనార్హం. రాష్ట్ర వక్ఫ్ పాలకవర్గ సభ్యులుగా, మైనారిటీ శాసన వ్యవహారాల కమిటీ చైర్మన్గా, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడైన ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ ఉన్నారు. ఆయన అండతోనే ఈ భూమిని కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మేం రోడ్డున పడతాం 90 ఏళ్లుగా మా తాతల నుంచి కౌలు చేస్తున్నాం. దీనిపై ఆధారపడి పలువురు రైతులు బతుకుతున్నారు. 72 ఎకరాలలో 55 మంది రైతులు కౌలుకు తీసుకోగా, మరికొందరు సబ్లీజుతో పంటలు పండిస్తున్నారు. మాకు ఈ స్థలం ఇచ్చి నప్పుడు పెద్ద చెరువు. దాన్ని పూడ్చి బోర్లు వేసి, కరెంట్ కనెక్షన్ తీసుకుని పంటలు సాగు చేశాం. ఇప్పుడు ఉన్నపళంగా ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పంటలు వేసుకున్నామని చెబుతున్నా వినడం లేదు. – పాలడుగు రవికుమార్, రైతు -
కాసులతో బేరం.. పదోన్నతులు ఘోరం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యాశాఖలో మరో అక్రమ బాగోతం బయటపడింది. ఇంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీల్లో డబ్బులిచ్చిన వారికి పట్టణాల్లో పోస్టింగ్లు కట్టబెట్టిన అధికారులు.. బోర్డు ఆదేశాలు లేకుండానే డబ్బులు తీసుకుని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు. తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేనివారికి, జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయీ బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాను సైతం పట్టించుకోకుండా అత్యంత జూనియర్లకు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యా అధికారులు (డీఐఈవో)గాను, ప్రాంతీయ తనిఖీ అధికారులు (ఆర్ఐవో)గాను పూర్తి అదనపు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన తప్పులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరిదిద్దలేదని, తమ అభ్యర్థనలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని అర్హతగలిగిన సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది క్రితమే జాబితా విడుదల గతేడాది డిసెంబర్లో జూనియర్ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్గా ఉన్న 340 మందితో సీనియారిటీ జాబితా విడుదల చేశారు. డీఐఈవో, ఆర్ఐవో పోస్టుల్లో ఏర్పడే ఖాళీల్లో సీనియారిటీ ప్రకారం వీరినే నియమించాల్సి ఉంది. అయితే, మొత్తం ప్రిన్సిపాల్స్ జాబితాలో 1 నుంచి 62 వరకు ఉన్న వారితో నియామకాలు సక్రమంగానే చేపట్టారు. 63 నుంచి 340 వరకు సీనియారిటీని పట్టించుకోలేదు. ఏపీపీఎస్సీ ద్వారా జేఎల్స్గా నియమితులైన వారిని కాదని, స్కూల్ అసిస్టెంట్లు నుంచి జేఎల్స్గా వచ్చిన వారు, జాబితాలో జూనియర్ స్థాయి వారిని ఆర్ఐవో, డీవీఈవోలుగా నియమించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్కు పదోన్నతి కల్పిస్తే సీనియర్ అసిస్టెంట్ అవుతారు. తర్వాత సెక్షన్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పిస్తారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్గా పదోన్నతి ఇవ్వడం అసాధ్యం. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటర్మీడియెట్ విద్యామండలిలో దీనిని సుసాధ్యం చేశారు. విద్యావ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలను కాదని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జూనియర్ లెక్చరర్లకు జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లుగా (డీవీఈవో) పదోన్నతులు కల్పించారు. ఇంటర్ విద్యా మండలిలో జూనియర్ లెక్చరర్లను సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పిస్తారు. ప్రిన్సిపాల్స్ సీనియారిటీ ఆధారంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు(డీవీఈవో)గా పదోన్నతి ఇస్తారు. కానీ, కొందరు ప్రిన్సిపాల్స్కు పదోన్నతి, సీనియారిటీతో సంబంధం లేకుండా జీవో 283లోని లోపాలను అడ్డుపెట్టుకుని నేరుగా డీవీఈవో పదోన్నతులు ఇచ్చారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీనియర్ ప్రిన్సిపాల్స్కు అన్యాయం సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్(జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్(ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపాల్ అయ్యుండాలి. కానీ. అవేం పట్టించుకోలేదు. జీవో 283లో డెప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపాల్స్కు ఉద్దేశించిన ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అంశాన్ని జేఎల్స్గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొత్త భాష్యం చెప్పి పదోన్నతులు కల్పించారు. ఈ అంశం తప్పుగా జరిగిందని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ముగియకుండానే తాజాగా డీఐఈవో, ఆర్ఐవోలుగా జూనియర్లను నియమించడంపై గొడవ మొదలైంది. ఇప్పటికే ఏడు జిల్లాల్లో ఈ తరహా నియామకాలు జరగ్గా.. ఇదే తరహాలో మరికొందరికి అవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనివెనుక పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన తప్పులపై డైరెక్టరేట్కు ఫిర్యాదు చేస్తే పరిగణనలోకి తీసుకుని సరిదిద్దాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడంపై అనుమానాలకు బలం చేకూరుస్తోంది. -
ఊరు చేరని యూరియా! మళ్లీ ‘కట్ట’ కట..
పల్నాడు జిల్లా జమ్మలమడక గ్రామంలో టీడీపీ నాయకులు సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు యత్నిస్తుండగా అన్నదాతలు అడ్డుకుని ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతపల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం 240 యూరియా బస్తాలొచ్చాయి. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 50 మంది రైతులకు వంద బస్తాలు పంపిణీ చేయగా.. మిగిలిన 140 బస్తాలను స్థానిక టీడీపీ నేతలు దారి మళ్లించారు.సాక్షి, అమరావతి: ఖరీఫ్లో కట్ట యూరియా కూడా దొరకక అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. పొలం పనులు వదిలేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరుగులు తీశారు. ఒకపక్క సీజన్లో పెట్టుబడి సాయం అందక.. ఉచిత పంటల బీమాకు దూరమై.. ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోయి.. దిగుబడులు దిగజారి.. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు దక్కక.. మరోపక్క కనీసం ఎరువులు కూడా సమకూర్చలేని చంద్రబాబు సర్కారు అసమర్థతతో నిలువు దోపిడీకి గురయ్యారు. ఇంత జరిగినా ఈ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవడం.. కనీసం ఈ సీజన్లో అయినా తగిన ప్రణాళికతో యూరియా పంపిణీ చేయాలన్న ఆలోచన లేకుండా పోవడం రైతన్నలను కలవరపరుస్తోంది. ప్రస్తుతం రబీలో కూడా యూరియా కష్టాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో కట్ట యూరియా బ్లాకులో రూ.350 నుంచి రూ.500 పెట్టి కొనాల్సిన అగత్యం దాపురించిందని రైతులు వాపోతున్నారు. పైగా యూరియా ఇవ్వాలంటే.. నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు బలవంతంగా అంటగడుతున్నారు. సరిహద్దు జిల్లాలకు చెందిన రైతులైతే రవాణా చార్జీలు పెట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లి యూరియా కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. సొసైటీలకు చేరే అరకొర నిల్వలను అధికార టీడీపీ నేతలు దొడ్డిదారిన పక్కదారి పట్టిస్తున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీ సీజన్లో యూరియా కష్టాలపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు ఇదీ..! వరి, జొన్న, మొక్కజొన్నకే ఎక్కువగా.. రబీ సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడిచింది. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం 51.75 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 25.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. డిసెంబర్ 23 నాటికి వరి 5.60 లక్షల ఎకరాల్లో సాగవగా, శనగ 6.67 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 4 లక్షల ఎకరాలు, మినుము 3.77 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి, జొన్న, మొక్కజొన్న పంటలకే యూరియా ఎక్కువగా అవసరం. ఈ సీజన్లో వరికి ఎకరాకు 125 కేజీలు, మొక్కజొన్నకు 200 కేజీలు, జొన్నకు 80 కేజీల చొప్పున యూరియా అవసరం. మూడు నాలుగు దఫాల్లో దీన్ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. సీజన్ ఆరంభం నుంచి యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. రబీ సీజన్కు 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం 5.83 లక్షల టన్నులు అందుబాటులో ఉంచగా, ఇప్పటికే 3.93 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు మొదటి విడతగా యూరియా వేయాల్సి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. ఈ సీజన్లోనూ యూరియా కోసం రైతులకు తప్పని పాట్లు టోకెన్లతో తిప్పలుఖరీఫ్లో మాదిరిగా రబీలో కూడా యూరియా దొరకకపోవడం రైతన్నలను కుంగదీస్తోంది. సొసైటీలు, రైతు సేవా కేంద్రాలకు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు ఖాళీ అయిపోతుందో అంతుబట్టని దుస్థితి నెలకొంది. కట్ట యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. స్టాక్ వచ్చిందని తెలియగానే పెద్ద ఎత్తున రైతులు సొసైటీలకు చేరుకోవడంతో సీరియల్ నంబర్లతో టోకెన్లు ఇచ్చి పంపించేస్తున్నారు. చెప్పిన సమయానికి వెళ్లినా సరే ఇంకా రాలేదు.. రేపు, మాపు అంటూ తిప్పించుకుంటున్నారు. దారి మళ్లిస్తున్న టీడీపీ నేతలునంద్యాల జిల్లా పాములపాడులో వారం క్రితం రెండు లారీల యూరియా వచ్చింది. ఒక్కో రైతుకు రెండు బస్తాలిచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు యూరియా రాలేదు. దీంతో అదునుకు యూరియా దొరక్క రైతులు బ్లాకులో కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద బస్తా రూ.350 నుంచి రూ.500 చొప్పున కొంటున్నారు. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులు, నానో యూరియాను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. యూరియాతో సహా ఎరువుల్లో సింహభాగం ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లను కాదని ప్రైవేటు వ్యాపారుల వద్దకే చేరుకుంటున్నాయి. బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. ఏపీలో యూరియా పెద్దఎత్తున దారి మళ్లుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గతంలో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడటం, అధికార పార్టీ నేతల అండదండలతో యూరియా దారి మళ్లుతోంది. సారా, బీర్ల తయారీతో పాటు పెయింట్, వారి్న‹Ù, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా, కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీలో యూరియాను విచ్చలవిడిగా వాడుతున్నారు.పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలి స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ కోరారు. జేసీలు, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులతో బుధవారం ఆయన మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అధిక వినియోగం, పంట కాలానికి మొత్తంగా ఒకేసారి కొనుగోలు చేయటం, అవసరానికి మించి ముందుగా కొని నిల్వ చేసుకోవడం వంటి విషయాల పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులతో సాగు ద్వారా యూరియా వినియోగం తగ్గించేలా చూడాలన్నారు. పక్కదారి పడుతున్న యూరియాపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో యూరియా అధిక ధరలకు అమ్మటం మొక్కుబడి తనిఖీలు వంటి అంశాలపై వార్తలు వస్తున్నాయన్నారు. ఎకరానికి 10 బస్తాలు నష్టపోయా.. వరి కోశాక నెల క్రితం మూడు ఎకరాలు జొన్న సాగు చేశా. ప్రస్తుతం 15 బస్తాలు యూరియా అవసరం. అడిగితే రేపు మాపు అంటున్నారు. ఖరీఫ్లో సక్రమంగా యూరియా వేయకపోవడంతో ఎకరానికి దాదాపు 10 బస్తాలు దిగుబడి తగ్గిపోయింది. రబీలో కూడా యూరియా అందకపోతే జొన్న దిగుబడి తగ్గుతుంది. – తాడికొండ శ్రీనుబాబు, కుచ్చెళ్ల్లపాడు, వేమూరు మండలం, బాపట్ల జిల్లాపలుకుబడి ఉన్న వారికే.. 10 ఎకరాల్లో మొక్కజొన్న వేశా. మండలంలో నాలుగు సొసైటీలు ఉన్నాయి. ఏ సొసైటీకి వెళ్లినా రేపు రావాలంటున్నారు. మాలాంటి వాళ్లు క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరకడం లేదు. మార్కెట్లో కట్ట రూ.450–500కు అమ్ముతున్నారు. ఖరీఫ్లోనూ ఇలాగే ఇబ్బంది పడ్డాం. – తాడిబోయిన శ్రీనివాసరావు, కంఠంరాజు కొండూరు, గుంటూరు జిల్లాఏడాది మొత్తం అవస్థలే.. యూరియా బస్తా రూ.260.50కు అమ్మాల్సి ఉండగా మార్కెట్లో రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఆర్బీకేల్లో ఎలాగూ ఉండడం లేదు. సొసైటీల్లో కూడా లేదంటున్నారు. బ్లాక్లో అమ్మేవాళ్లకు మాత్రం ఎక్కడ నుంచి వస్తుందో తెలియడం లేదు. యూరియా కోసం ఏడాదంతా ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. – పగడాల నరేష్, కె.ఒడ్డిపల్లి, తిరుపతి జిల్లా రైతుకు ఏమిటీ దుస్థితి! నేను 4 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేస్తున్నా. 20 బస్తాల యూరియా అవసరం. పట్టాదారు పాస్ పుస్తకంపై బస్తాకు మించి ఇవ్వడం లేదు. బ్లాక్లో బస్తా రూ.500–600 వరకు అమ్ముతున్నారు. రైతులకు సరిపడినంత యూరియా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా, లేకున్నా ఒకటే. –బూటు అప్పారావు, బాతువ, జి.సిగడాం మండలం, శ్రీకాకుళంరెండు బస్తాలిస్తే ఏం చేయాలి? నేను 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. 25 బస్తాల యూరియా అవసరం. రెండు బస్తాలిస్తే ఎలా సరిపోతుంది? బహిరంగ మార్కెట్లో కొందామంటే రూ.350 నుంచి రూ.500 వరకు చెబుతున్నారు. తమిళనాడు వెళ్లి కొనుక్కోవాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం రూ.10 వేలు దాకా అదనంగా పెరిగింది. – రామ్రమేష్, ముడిపల్లి, నగరి మండలం. తిరుపతి జిల్లా అంతా బ్లాక్ మార్కెట్కే..సీజన్లో సాగయ్యే పంటలను బట్టి 5.5–6 లక్షల టన్నులకు మించి యూరియా అవసరం ఉండదు. 9.38 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నట్లు చూపిస్తున్నారు. ఇప్పటికే 3.93 లక్షల టన్నుల అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. యూరియా పెద్దఎత్తున బ్లాక్ మార్కెట్కు వెళ్తోంది. పంటల వారీగా డిమాండ్, అమ్మకాల వివరాలను ప్రకటించాలి. –ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ -
మెడికల్ కాలేజీల భూములు ప్రైవేటుకే.. చంద్రబాబు ఆఫర్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలేజీల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకే అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీలకు సరైన సంఖ్యలో బిడ్డర్లు ముందుకు రాకపోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిడ్డర్లు ముందుకు రాకపోవడంతో, ప్రైవేటు సంస్థలకే నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రాజెక్టులు ఆర్థికంగా సాధ్యసాధ్యాల పరంగా ముందుకు సాగేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని సీఎం ఆదేశించారు. మెడికల్ కాలేజీల భూములను ప్రైవేటు సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ఇప్పటికే వచ్చిన సింగిల్ బిడ్కే టెండర్ను అప్పగించాలని ..మిగిలిన కాలేజీలకు మాత్రం మళ్లీ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. మరిన్ని ప్రైవేటు సంస్థలను పోటీకి ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. -
బ్యాంకులకు రఘురామ టోకరా
సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు చేసిన మోసాలపై దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా కృష్ణరాజు గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి, దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో మరోసారి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ చేసిన మోసాలు చర్చనీయాంశంగా మారాయి. మోసాల చిట్టా బారెడు.. » ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు. » థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయిపెట్టారు. » పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్ భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చాయి. » తనఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. » 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్్కలను స్వాధీనం చేసుకున్నాయి. సంస్థకు చైర్మన్గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య, కుమార్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి.దివాళా ప్రక్రియ షురూ.. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించాయి. ఇండ్ భారత్ థర్మల్ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి. అయితే కంపెనీ తనఖా చేసిన ఆస్తుల విలువ కేవలం రూ. 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి.. దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్సీఎల్టీ దివాళా ప్రక్రియకు అనుమతించింది.ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రంగంలోకి ఈడీ ఇండ్ – భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్ – భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కళ్)కు తరలించేశారు. ఈ వ్యవహారం మొత్తం ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) దృష్టిలో పడింది. దాంతో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫెమా అధికారులు.. మారిషస్ కంపెనీ నుండి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్ భారత్ సన్ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించారు. అలాగే మరుసటి రోజే ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. -
శ్రీలంకకు రూ. 4 వేల కోట్ల ఆర్థిక సాయం
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.‘‘శ్రీలంక పునర్నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. పునర్నిర్మాణం కోసం నిధుల వినియోగం తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్నిర్మాణం, రైల్వే ట్రాక్లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది. -
క్రీస్తు బోధనలు అనుసరణీయం
సాక్షి, అమరావతి: పొరుగువారిని ప్రేమించడం, సహాయం చేయడం, కరుణ, దయ, క్షమ గుణాలను కలిగి ఉండాలన్న ఏసుక్రీస్తు బోధనలు అందరూ అనుసరించాలని వక్తలు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పార్థనలు చేసిన అనంతరం మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, లేళ్ళ అప్పిరెడ్డితోపాటు కొమ్మూరి కనకారావు తదితరులు కేక్ కట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉన్నారని చెప్పారు. అందువల్లే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో ఆరి్థక వనరులు సహకరించపోయినా, కరోనా వంటి పెనువిపత్తు వచి్చనా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. నందిగం సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు 18 నెలల అధ్వాన పాలన చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఇవాళ వైఎస్ జగన్ అధికారంలో ఉంటే బాగుండేదని చర్చించుకుంటోందని తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏసుక్రీస్తు జననానికి విశేష ప్రాముఖ్యత ఉందన్నారు. మానవసేవ చేయడమే దేవునికి సేవ చేయడంగా భావించి క్రైస్తవ మిషనరీలు మన దేశంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయని వివరించారు. మొండితోక అరుణ్కుమార్, అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఎ.నారాయణమూర్తి, నత్తా యోనారాజు, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, బూదాల శ్రీను, ముదిగొండ ప్రకాశ్, దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎం.మనోహర్రెడ్డి, మల్లవరపు సంధ్యారాణి, కాలే పుల్లారావు, బేతంపూడి రాజేంద్ర, నూతక్కి జోషి, పాస్టర్లు షారోన్, ఎబినేజర్, అబ్రహాం, జె.యెషయ్య పాల్గొన్నారు. -
టీడీపీ–జనసేన దుష్ప్రచారం ఆర్బీఐ నివేదికతో బట్టబయలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య పారిశ్రామిక ప్రగతి, తయారీ రంగంలో వృద్ధిపై స్థూల విలువ జోడింపు (జీవీఏ– గ్రాస్ వ్యాల్యూ యాడెడ్)తో ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ నెలలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ విష ప్రచారాన్ని ఎండగట్టారు. ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను జత చేస్తూ.. ‘సత్యమేవ జయతే’ హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు.ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘‘టీడీపీ, జనసేన పార్టీల నేతలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనిగట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారంటూ విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి జరగలేదంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంటే తయారీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం పని తీరు దయనీయంగా ఉండేది.కానీ.. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. తయారీ, పరిశ్రమల రంగంలో స్థూల విలువను జోడిస్తూ ఆర్బీఐ ఈ నెల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. తయారీ రంగం వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. పారిశ్రామికాభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్.. దేశ వ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. ఇప్పుడు చెప్పండి.. 2019–24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? సమర్థవంతమైన నాయకత్వం వల్ల ఇంతకుముందెన్నడూ చూడని ఆర్థిక పురోగతిని చూశామా? -
బాబు స్కామ్ల రోత.. కేసుల మూత 'కేసులు కంచికి'!
నిధులు కొల్లగొట్టారు.. నిగ్గు తేల్చిన ఈడీ.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులను షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించింది. డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. సాక్షి, అమరావతి: బరితెగించి అవినీతికి పాల్పడటంలోనే కాదు.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆ అవినీతి కేసులను అడ్డగోలుగా మూసివేయడంలోనూ చంద్రబాబు తన ‘స్కిల్’ ప్రదర్శిస్తున్నారు! నాడు ఆధారాలున్నాయన్న సీఐడీ వాదనతో ఏకీభవించి న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధిస్తే.. నేడు అసలు ఆధారాలే లేవంటూ కోర్టు కళ్లకు గంతలు కట్టేందుకు తెగబడుతున్నారు! 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా చంద్రబాబే కుట్రదారు, లబ్ధిదారుగా సాగిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసుకు అర్ధ్ధంతరంగా తెరదించేందుకు టీడీపీ కూటమి సర్కారు కుతంత్రానికి సిద్ధపడింది. ఇప్పటికే చంద్రబాబుపై ఫైబర్ నెట్, మద్యం కేసులను అడ్డగోలుగా మూసివేసిన ప్రభుత్వం.. తాజాగా స్కిల్ స్కామ్ కేసుకు గురి పెట్టింది. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’.. పేరిట ఆ కేసును క్లోజ్ చేసేందుకు పక్కాగా పన్నాగం పన్నింది. తానే దొంగా.. తానే పోలీసూ!!తాను ప్రధాన నిందితుడిగా ఉన్న అవినీతి కేసులను ఏడాది క్రితం ముఖ్యమంత్రి హోదాలో సమీక్షించినప్పుడే చంద్రబాబు ఈ కుతంత్రానికి తెరతీశారు. ఆ బాధ్యతను తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించారు. అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్తోపాటు యావత్ పోలీసు, న్యాయ శాఖలను లూథ్రా గుప్పిట్లో పెట్టారు. ఆ కేసుల్లో చార్జ్షీట్లను అటకెక్కించారు. న్యాయస్థానాల్లో విచారణకు సహాయ నిరాకరణ చేశారు. చంద్రబాబు సాగించిన మద్యం దోపిడీపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్నెట్ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ కార్పొరేషన్ పూర్వ ఎండీ మధుసూదన్రెడ్డి, అసైన్డ్ భూదోపిడీపై న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇలా అందరినీ బెదిరించి లొంగదీసుకున్నారు. దీంతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్కు తెచ్చింది. ఈ పన్నాగానికి పదును పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం ‘స్కిల్’ కుంభకోణం అడ్డగోలుగా మూసివేత కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. స్కిల్ కుంభకోణంలో ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించిన తీరు ఇదీ.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కానే కాదు... బాబే ‘స్కిల్’ క్రిమినల్..! స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్రస్తుతం సీఐడీ అధికారులు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ అనే పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పొరపాటుగా అభిప్రాయపడ్డాం...! కానీ అసలు అవినీతే లేదు..! అని సీఐడీ పచ్చ పాట పాడుతోంది. వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరిట చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అప్పట్లోనే సీఐడీ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పూర్తి ఆధారాలతో సహా నిగ్గు తేల్చడం గమనార్హం.రూ.370 కోట్ల నుంచి రూ.3,300 కోట్లకు పెంచేసి..సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. అయితే చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్థిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించలేదు. ఇక అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శి సునీత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసింది. ఈ కుంభకోణానికి రాచబాట పరుస్తూ మొత్తం 13 నోట్ ఫైళ్లలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు కూడా చేశారు. డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలోనూ షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లో కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఆ కుంభకోణం బయటపడింది. కేంద్ర జీఎస్టీ అధికారులు సమాచారం ఇచ్చినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు విచారణ చేయకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు అవినీతి వెలుగులోకి వచ్చింది. సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో ఆ అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేలింది.సీమెన్స్ కంపెనీ ముసుగులో...2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ కనికట్టు చేశారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్టెక్ ఎంపీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీవో జారీ చేశారు. అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టేందుకు కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు మభ్యపుచ్చారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్తో తమకు ఏమాత్రం సంబంధం లేదని పేర్కొంటూ సిట్కు సీమెన్స్ కంపెనీ పంపిన ఈ–మెయిల్ అవినీతిని నిర్ధారించిన కాగ్..రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్( కాగ్) సైతం చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది.కాగితాలపై ప్రాజెక్టు చూపించి...జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని చంద్రబాబు కొల్లగొట్టారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి, సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందంటూ బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని చంద్రబాబు ప్యాలస్కు తరలించారు. ఈ అవినీతి నెట్వర్క్ను సీఐడీ పక్కా ఆధారాలతో ఛేదించింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ చార్జ్షీట్ కూడా నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసి 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసింది. సీఐడీ అధికారుల రిమాండ్ నివేదికతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం ఆరోగ్య సమస్యలు సాకుగా చూపడంతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతేగానీ చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు.అవినీతి సొమ్ము.. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకే!స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నిధులను టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల ద్వారానే బదిలీ చేసినట్లు కూడా ఆనాడు సీఐడీ నిగ్గు తేల్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం తమ బ్యాంకు ఖాతాల్లో భారీస్థాయిలో నోట్లను మార్పిడి చేయడం గమనార్హం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీలలో టీడీపీకి బ్యాంకు ఖాతాలున్నాయి. ఆ బ్యాంకు ఖాతాలను సీఐడీ అధికారులు విశ్లేషించడంతో అసలు విషయం బయటపడింది. 2016–18లో ఆ ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం పెద్ద నోట్లను డిపాజిట్ చేయాలంటే కేవైసీ నిబంధనలు పాటించాలి. రాజకీయ పార్టీల ఎన్నికల బాండ్లకు సంబంధించి అయితే రూ.20 వేలకు మించిన డిపాజిట్లపై కేవైసీ నిబంధలను పాటించడం తప్పనిసరి. డిపాజిట్ చేసినవారి పేరు, పాన్ నంబరు, ఫోన్ నంబరు, ఐడీ ప్రూఫ్ మొదలైన వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ టీడీపీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఏకంగా రూ.77.37 కోట్ల విలువైన రద్దు అయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసినా సరే... కేవైసీ నిబంధనలను పాటించలేదు. అసలు ఎవరు ఆ నోట్లను ఇచ్చారో ఆ వివరాలు ఏవీ బ్యాంకులకు సమర్పించనేలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం స్కిల్ స్కామ్కు పాల్పడటం గమనార్హం. అంటే స్కిల్ స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు స్పష్టమవుతోంది. సీఐడీ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా నివేదించింది. అయినా సరే ఆధారాల్లేవు..! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్..! అంటూ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో సీఐడీ వితండవాదం చేస్తుండటం విస్మయపరుస్తోంది.‘స్కిల్’ స్కామ్ కేసు మూసివేతకు పక్కా పన్నాగం..‘స్కిల్’ స్కామ్ మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకోసం టీడీపీ ప్రధాన కార్యాలయం స్క్రిప్ట్ను సీఐడీ వల్లె వేస్తోంది. ఆ కేసులో ఆధారాలు లేవని.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా ముద్రవేసింది. ‘ఆ కేసును ఇక క్లోజ్ చేయాలని భావిస్తున్నాం.. మీ అభిప్రాయాన్ని వారం రోజుల్లో చెప్పండి..’ అంటూ అప్పటి ఏపీఎస్ఎస్డీసీ కార్పొరేషన్ ఎండీ బంగార్రాజుకు సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంటే అప్పటికే బంగార్రాజును తమదైన శైలిలో బెదిరించి దారికి తెచ్చుకున్నట్లు స్పష్టమైంది. సీఐడీ నోటీసులు ఇవ్వడమే తరువాయి.. ఆ కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇస్తారన్నది సుస్పష్టం. మరి ఇదంతా టీడీపీ పెద్దల స్క్రిప్టే కదా!! స్కిల్ స్కాం కేసును ముసివేస్తామని అప్పటి ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజుకు ప్రస్తుతం సీఐడీ పంపిన నోటీసులు ఫిర్యాదుదారు బంగార్రాజు కాదు... చైర్మన్ అజయ్ రెడ్డిచంద్రబాబు అవినీతి కేసును అడ్డగోలుగా మూసివేయాలన్న ఆతృతలో సీఐడీ అసలు వాస్తవాలను విస్మరిస్తోంది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ప్రాజెక్టు ముసుగులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆనాడు ఫిర్యాదు చేసింది ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు కాదు. అప్పుడు చైర్మన్గా ఉన్న కె.అజయ్రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. మరి ఆ కేసును మూసివేయాలని ప్రస్తుతం సీఐడీ భావిస్తే... అందుకు నోటీసులు జారీ చేయాల్సింది కూడా ఆయనకే కదా!! సీఐడీ అధికారులు అందుకు విరుద్ధంగా అప్పటి ఎండీ బంగార్రాజుకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎందుకంటే ఆయన్ను బెదిరించి... బెంబేలెత్తించి ఇప్పటికే తమ దారికి తెచ్చుకున్నారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడం.. ఆయన సమ్మతించడం.. అంతా పక్కా పన్నాగంతో కేసు క్లోజర్ కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల కుట్ర. చంద్రబాబు స్కిల్ స్కాంపై ఫిర్యాదు చేసింది అప్పటి ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్ రెడ్డి అని పేర్కొన్న కాపీ -
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..
సాక్షి టెన్త్ క్లాస్ ప్రత్యేకం.. అతి త్వరలో..మీ స్టడీ టేబుల్పై సాక్షి టెన్త్క్లాస్ స్పెషల్స్..పదో తరగతి పరీక్షల్లో మీ సక్సెస్కు సులువైన మార్గం..ఏం చదవాలి... ఎలా చదవాలి..మంచి మార్కులు ఎలా సాధించాలి..మీకు ఒక క్లాస్ రూం టీచర్లా..టాప్ మార్కుల సాధనకు మార్గం చూపే నేస్తంలా..సాక్షి టెన్త్క్లాస్ స్పెషల్స్ ఉంటాయి..ప్రతి రోజూ సాక్షిలో సబ్జెక్ట్ నిపుణులు అందించే స్టడీ మెటీరియల్..మరి ఇంకెందుకు ఆలస్యం..!నేడే మీ కాపీని సాక్షి ఏజెంట్ వద్ద రిజర్వు చేసుకోండి -
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా కల్పిత కథనాలు.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరువు నష్టం దావా కేసులో ఈనాడు, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సహా పలు మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన కథనాలు తొలగించాలని, రూ.10 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ విచారణ జరిపారు.ఇక నుంచి లడ్డు వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ వివాదంలో ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, మరో వైపు కల్పిత కథనాలు రాస్తూ వై.వీ సుబ్బారెడ్డి పరువు, ప్రతిష్టలకు ఎల్లో మీడియా భంగం కలిగించింది. ఇక నుంచి లడ్డూ వివాదంలో రాసే కథనాలకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. -
ఇది అసలు నిజం.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన అబద్ధాల దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బట్టబయలు చేశారు. టీడీపీ, జనసేన అసత్య ప్రచారాన్ని మరోసారి ఆయన ఎండగట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కూటమి సర్కార్ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని వైఎస్ జగన్ బయటపెట్టారు. ఆర్బీఐ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు వేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయి?. ఆర్బీఐ గణాంకాలు చూస్తే వైఎస్సార్సీపీ పనితీరు ఏంటో తెలుస్తుంది...2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో ఏపీ దక్షిణ భారత్లో నెం.1. యావత్ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2019-24 మధ్య ఏపీ పారిశ్రామిక రంగంలో పురోగతి. దక్షిణ భారత్లో నెం.1, యావత్ దేశంలో 8వ స్థానం. మరి దీన్ని బ్రాండ్ ఏపీ నాశనం అంటారా?. లేక సమర్థవంతమైన నాయకత్వం ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటారా? సత్యమేవ జయతే‘‘ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱 TDP and JSP, before and after forming Government persistently made the following allegations-Brand AP was destroyed owing to YSRCP Government-Investors abandoned AP owing to YSRCP Government-No industrial growth was witnessed during… pic.twitter.com/KvB40DJWGL— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెమి క్రిస్మస్ వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమి క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసిన మాజీ మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, కొమ్మూరి కనకారావు, ఏ. నారాయణమూర్తి, పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు. అనంతరం కార్యకర్తలనుద్దేశంచి పార్టీ నేతలు మాట్లాడారు.తానేటి వనిత మాట్లాడుతూ.. పేదలను ప్రేమించడంతో పాటు వారికి సహాయం చేయాలన్న ప్రభువు క్రీస్తు సిద్ధాంతాలను కలిగిన నాయకుడు వైఎస్ జగన్ అని మాజీ మంత్రి తానేటి వనిత అన్నారు. పేదల పట్ల ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టే.. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థిక వనరులు సహకరించకపోయినా, కరోనా వంటి విపత్తులోనూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు.అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రిస్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండగ. క్రీస్తు జననానికి మానవాళిలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవాళ 2025లో ఉన్నామంటే.. దాని కొలమానం క్రీస్తు శకం అని అంటాం. అంటే ఆయన ఉద్భవించిన నాటి నుంచి నేటికి 2500 సంవత్సరాలు కింద లెక్క. ఆ విధంగా మానవాళి తమ రోజులు లెక్కించుకోవడానికి గుర్తించబడిన.. క్రీస్తు జననం అంటే ఎంత పవిత్రమైనదో, గొప్పదో తెలుసుకోవచ్చు.మన దేశం లౌకిక వాద దేశం. ఇక్కడ సర్వమతాలు సహజీవనం చేస్తున్న దేశం. ఎవరైనా పరమతాన్ని గౌరవిస్తే.. అప్పుడే మన మతాన్ని గౌరవించగలుగుతాం. అన్ని మతాలు సహజీవనం చేస్తున్న చక్కని దేశం మనది. గుంటూరుకు సంబంధించి చాలా కాలం క్రితమే క్రిస్టియానిటీ మొదట విద్యాలయాలు, వైద్యాలయాలను తీసుకొచ్చింది. మానవ సేవ చేయడమే దైవ సేవ చేయడంగా భావించిన క్రిస్టియానిటీ అనేక కార్యక్రమాలు చేసింది. వైఎస్సార్సీపీ తరపున రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఏసు ప్రభువు భౌతికంగా మన మధ్య లేకపోయినా... సమాజానికి సంబంధించి ఆయన బోధనలు, ఆశయాలు మనందరి హృదయాల్లో చిరస్ధాయిగా ఉంటాయి. తోటివారిని ప్రేమించడం, మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం, అవసరమైన చోట్ల త్యాగాలకు సిద్ధం కావడం ఇలా బైబిల్ లో అంశాలన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. మనిషి ప్రతి మాటలో మానవత్వం, ప్రేమ ఉండాలి, ప్రతి పనిలో సాయం చేసే గుణం ఉండాలి. ఈ లక్షణాలన్నింటినీ సమాజంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మన ప్రియతమ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ నేతృత్వంలో మనందరం సమాజంలో అన్ని మతాలను గౌరవిస్తూ.. అన్ని మతాల మధ్య సమతుల్యత పాటిస్తూ మందుకు సాగాలని, ఆ ప్రభువు ఏసుక్రీస్తు చెప్పినట్లు కోరుకుంటున్నాను -
పవన్ కల్యాణ్ భయం అదే: అంబటి
సాక్షి, తాడేపల్లి: పవన్ ప్రసంగాలు పరిశీలిస్తే విచిత్రంగా ఉందని.. ఓపెనింగ్లో ఓవరాక్షన్ చేస్తారు.. ఇంటర్వెల్లో ఇరిటేషన్ అవుతారు.. కన్ క్లూజన్లో కన్ఫ్యూజ్ అవుతారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకీ అర్థం కాదని.. వినేవాళ్లకు అంతకన్నా అర్ధం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.‘‘వైఎస్సార్సీపీ పార్టీని, పార్టీ నాయకత్వంపై తీవ్రమైన పదజాలం వాడుతున్నారు. ఎందుకు పవన్ అంతలా ఊగిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తుంది. పవన్ మిమ్మల్ని ఎవరైనా వైఎస్సార్సీపీ వాళ్లు ఏమైనా అన్నారా.. అంటే చెప్పండి. మిమ్మల్ని తిట్టింది తెలంగాణ వాళ్లు.. వైఎస్సార్సీపీ వాళ్లు కాదు. ఎందుకు వైఎస్సార్సీపీపై తీవ్రమైన పదజాలంతో ఊగిపోతున్నారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు.‘‘కూటమి అసమర్థత వల్ల అనేకమైన ఇష్యూలు వచ్చాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. భవిష్యత్లో లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీలను తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ స్కామ్. కోటి మందికి పైగా ప్రజలు కోటి సంతకాలు చేశారు. మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల్లో స్కామ్ జరుగుతుంది..ఈ స్కామ్లో ఎవరైనా చేరితే.. చంద్రబాబు, లోకేష్కు కిక్ బ్యాగ్లు ఇస్తే చట్టం ముందు శిక్షిస్తామని చెప్పాం. విచారణ క్రమంలో లోపల కూడా వేస్తామని చెప్పాం. స్కామ్ ఉందని మేం చెబుతున్నాం. మమ్మల్నే లోపల వేస్తారా.. మీ సంగతి తేలుస్తామని పవన్ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మాట్లాడకుండా పవన్తో మాట్లాడిస్తున్నాడు. ఎందుకు మీకంత భయం?. 15 ఏళ్లు కలిసే ఉంటామని చెబుతున్నావ్.. కలిసుంటే మంచిదేగా వద్దని ఎవరు చెప్పారు?. 15 ఏళ్లు అగ్రిమెంట్ రాసే పార్టీ దేశంలో ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ తప్ప. 15 ఏళ్లు కలిసి ఉండేది రాష్ట్రానికి మంచి చేయడానికి కాదు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని మీకు భయం..ఏమీ లేకపోయినా మద్యం స్కామ్ పేరుతో ఎంతమందిని లోపలేశారు. విచారణల పేరుతో లడ్డూ వ్యవహారంలో మీరు చేస్తున్నది ఏంటి?. మెడికల్ కాలేజీల స్కామ్లో పవన్కు వాటా ఉంది కాబట్టే ఊగిపోతున్నాడు. ప్రజలు మెచ్చిన రోజున వైఎస్సార్సీపీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. అవినీతి, లంచాలకు తావులేకుండా పాలన ఉండాలన్నారు. డబ్బులు లేనిదే లోకేష్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారా?. సీజ్ ద షిప్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అమ్మకం ఆగిందా పవన్ సమాధానం చెప్పాలి..కాకినాడ పోర్టు నుంచి బియ్యం బ్రహ్మాండంగా వెళ్లిపోతోంది. మధ్యవర్తులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బియ్యం డబ్బుల్లో మీకు వస్తుందిగా. చక్కగా డబ్బు తీసుకుని సర్దుకుంటున్నారుగా. మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా మీరు చంద్రబాబుకు కాపు కాయండి మాకేం అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఓడినా .. గెలిచినా జగన్ సింగిల్గానే వస్తారు. పదవుల కోసం ఎవరి వద్దా దేహీ అని మేం అడుక్కోం. పవన్ మాట్లాడితే బంధు ప్రీతి లేదు.. అవినీతి సహించను అంటారు. మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకు?...కులతత్వానికి వ్యతిరేకమంటారు. జనసేనలో రెండు మంత్రి పదవులు ఓసీలకే ఎలా ఇచ్చారు?. బీసీలు, ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా?. పవన్ కళ్యాణ్ సోదరుడే ఎమ్మెల్సీ అవ్వాలా?. క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి ఇస్తామని చంద్రబాబు రాసిచ్చాడు. చంద్రబాబు ఈ మాట చెప్పి ఏడాదైంది.. ఏమైంది మంత్రి పదవి. దేహీ అని పదవులు అడుక్కునే మీరు మమ్మల్ని దూషించడమా?. ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారని డీఎస్పీ జయసూర్య పై ఫిర్యాదు చేశావ్ ఏమైంది?..నీ ఫిర్యాదు ఎవరైనా పట్టించుకున్నారా...ఆ డీఎస్పీపై చర్యలు తీసుకున్నారా?. రోమాలు తీస్తాం.. అరచేతిలో గీతలు చెరిపేస్తాం లాంటి పిచ్చిమాటలను పవన్ మానుకోవాలి. నా ఇష్టం నేను చేస్తాను అంటే కచ్చితంగా అనుభవిస్తారు. మాట్లాడితే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధం అంటాడు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి మీకు చేతనైతే వాటిపై పోరాడండి. చంద్రబాబు, లోకేష్ అవినీతిలో వాటా లేదని పవన్ ప్రమాణం చేయగలరా?. పవన్ జలధారపై ప్రమాణం చేసి చెప్పండి... నేను క్షమాపణ చెబుతా. జనసేన పార్టీ కార్యాలయం క్రమంగా పెరిగిపోతోంది. పార్టీ కార్యాలయం కోసం 20 ఎకరాలు కొన్నారు. మీ సినిమాలన్నీ ప్లాపులవుతుంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది..చంద్రబాబు, లోకేష్ నెలకు ఇంత అని లెక్కగట్టి పవన్ కు ఇస్తున్నారు. పవన్ వాళ్ల దగ్గర మేస్తున్నాడు. మాపై కూస్తున్నాడు. మీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ ప్రొఫెసర్ను కొట్టాడు అది రౌడీయిజం కాదా? మాట్లాడితే పీకుతాం పీకుతాం అని మాట్లాడుతున్నారు. పవన్ ఏంటీ ఈ పీకుడు లాంగ్వేజ్. నువ్వు మాత్రం చంద్రబాబు, లోకేష్ దగ్గర కమిషన్లను స్ట్రాపెట్టి మరీ పీకేస్తున్నావ్. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరిని ఏం పీకలేరు...ఏపీలో అనేక స్కామ్లు జరుగుతున్నాయి. అన్ని స్కాములపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టప్రకారం లోపలేస్తాం. అన్ని స్కాముల పై విచారణ జరుగుతుంది. మీ రెడ్ బుక్ను మా కుక్క కూడా లెక్కచేయదు. రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది మీరే. మీరు తెచ్చిన రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరూ బలయ్యే పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి. రెడ్ బుక్ సంప్రదాయాన్ని సమాజానికి ఎక్కిస్తున్నారు. పిల్లకాకి లోకేష్కు ఏం తెలుసు ఉండేలు దెబ్బ. ముందుంది మొసళ్ల పండుగ’’ అంటూ అంబటి రాంబాబు హెచ్చరించారు. -
‘పవన్ అంటే.. ఓవరాక్షన్.. ఇరిటేషన్.. కన్ఫ్యూజన్’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని.. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైఎస్సార్సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడు పోతిన మహేష్ మండిపడ్డారు.మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాణ్ సమయం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైఎస్సార్సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్లు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్లో ఓవరాక్షన్, ఇంటర్వెల్లో ఇరిటేషన్, క్లైమాక్స్లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. సింగపూర్లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్కి ఆత్మాభిమానం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు.పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాణ్కు సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..పాలన చేతకాక వైఎస్సార్సీపీని తిడుతున్నాడు.. వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైఎస్సార్సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా?. చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైఎస్సార్సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. -
పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలోని భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసానిస్తూ.. ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.వైఎస్ జగన్ను కడప నూతన మేయర్ పాకా సురేష్ కలిశారు. నూతన మేయర్ను వైఎస్ జగన్ అభినందించారు. వైఎస్ జగన్ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా కలిశారు.కాగా, రేపు(బుధవారం, డిసెంబర్ 24) ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం(డిసెంబర్ 25) ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం(2026–27)లో దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్ల పెంపు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) దరఖాస్తులు ఆహ్వానించింది. అనుమతుల కోసం ఈ నెల 29 నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్ఎంసీ కార్యదర్శి డాక్టర్ ఎల్.రాఘవ్ సోమవారం అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్, డీఎంఈలకు లేఖ రాశారు. వచ్చే నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలని లేఖలో స్పష్టం చేశారు. ఎన్ఎంసీ అధికారిక వెబ్పోర్టల్ ద్వారా వచ్చిన ఆన్లైన్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.దేశంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, అదనపు సీట్ల పెంపుపై 2023లో ఎన్ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)– మినిమమ్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్(ఎంఎస్ఆర్) మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తి ప్రాతిపదికన అనుమతులు లభిస్తాయి. అదేవిధంగా కళాశాలల్లో గరిష్టంగా 150 సీట్లు దాటకూడదని అప్పట్లో షరతు విధించారు. ఈ నిబంధనలను 2026–27 విద్యా సంవత్సరానికి నిలుపుదల చేసినట్టు ఎన్ఎంసీ స్పష్టం చేసింది.వచ్చే ఏడాది లేనట్టేమాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్కు కట్టబెడుతోంది. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఇప్పటికే అన్ని కళాశాలల్లో తరగతులు ప్రారంభమై ఉండాలి. అయితే, చంద్రబాబు నిర్ణయాలతో తరగతులు ప్రారంభం కాలేదు. 2026–27 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 28తో కళాశాలలు ప్రారంభించేందుకు దరఖాస్తు గడువు ముగియనుంది.ఇదిలా ఉండగా తొలి దశలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని వైద్య కళాశాలలకు వైద్య శాఖ టెండర్లు పిలిచింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దరఖాస్తుల గడువు ముగిసే నాటికి టెండర్ ప్రక్రియ ముగిసే అవకాశం లేదు. ఈ లెక్కన వచ్చే విద్యా సంవత్సరం కూడా వైద్య కళాశాలలు అందుబాటులోకి రావు. ఇప్పటికే చంద్రబాబు చేసిన కుట్రలతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1,750 కలిపి మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. -
వైఎస్సార్సీపీలో చేరికలకు కూటమి అడ్డంకులు
సాక్షి, విశాఖపట్నం: పోలీసులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీపై చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తోంది. సోమవారం విశాఖలోని సిరిపురం సమీపంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకుంది. చేరికల కార్యక్రమం నిర్వహణకు వీఎంఆర్డీఏకు వైఎస్సార్సీపీ రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకుంది. ఈ కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు, పార్టీ నేతలు వుడా చిల్డ్రన్స్ థియేటర్ వద్దకు చేరుకోగా.. దీన్ని చూసి ఓర్వలేకపోయిన కూటమి నేతలు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు, చిల్డ్రన్స్ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించారు.దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చి్రల్డన్ థియేటర్ గేటు వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు తదితరులు నిరసన తెలిపారు. అనంతరం గేటు వద్ద నగర ప్రముఖుడు ధర్మాన ఆనంద్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన 1,400 మంది కార్యకర్తలకు కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. -
జననేత అభిమానులపై అక్కసు
సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు మరోమారు తన అల్పబుద్ధిని చాటుకుంది. వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును వేడుకగా చేశారనే అక్కసు, అసూయతో అక్రమ కేసులు పెట్టింది. అడ్డగోలుగా అరెస్టులకు తెగబడింది. పోలీసులను పావులుగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా అరాచకం సృష్టించింది. ⇒ శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. ఆదివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించడాన్ని ఓర్వలేని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, మండల నాయకులు.. జగన్ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు హుకుం జారీ చేయడంతో 12 మందిపై కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు గంగుల సు«దీర్రెడ్డి, మామిళ్లపల్లి అమరనాథరెడ్డిపైనా అక్రమ కేసులు బనాయించారు. వీరిలో ఏడుగురిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసరలో వైఎస్ జగన్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడాన్ని ఓర్వలేని టీడీపీ నేతలు పోలీసులను రెచ్చగొట్టి తమ పార్టీ ఫ్లెక్సీని వైఎస్సార్సీపీ కార్యకర్తలు చింపి వేశారనే నెపంతో కర్ల ఆనందరాÐవుపై కేసు నమోదు చేయించారు. ఉప సర్పంచి చలమల ప్రభాకర్, వార్డు సభ్యుడు అచ్చారావునీ అదుపులోకి తీసుకుని తెల్లవార్లూ స్టేషన్లోనే ఉంచారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వాస్పత్రిలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతో పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. ⇒ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిపినందుకు పోలీసులు వైఎస్సార్సీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్కు పిలిచి బెదిరించారు. వీర్నమలకు చెందిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. అన్నదానంలో మాంసాహారం వడ్డించారని, ఇందుకోసం జీవహింసకు పాల్పడ్డారని కేసు నమోదు చేయడం గమనార్హం. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బొమ్మగానిపల్లిలో పోలీసులు అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బొమ్మగానిపల్లి సర్పంచ్ పాటిల్ ఆదినారాయణరెడ్డితో పాటు రంగస్వామి, దొనతిమ్మ, నాగార్జున, ప్రసాద్ శీనులను అక్రమంగా అరెస్టు చేశారు. స్టేషన్కు తరలించే సమయంలో మార్గంమధ్యలో పోలీసులు వాహనాలు ఆపి సర్పంచ్ ఆదినారాయణరెడ్డిపై చేయిచేసుకోవడంతోపాటు, వైఎస్సార్సీపీ నాయకులనూ తీవ్రంగా కొట్టారు. వీరికోసం సోమవారం పోలీస్ స్టేషన్కు వచ్చిన పలువురు ప్రజాప్రతినిధులపైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వంద మందికి పైగా స్పెషల్ ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ నేతలు లేకుండా చెదరగొట్టారు. -
సీబీఐ అదుపులో డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు, కుమార్తె
బెంగళూరు (బనశంకరి)/చిత్తూరు అర్బన్: రియల్టర్ అనుమానాస్పద మృతి, నకిలీ స్టాంప్ పేపర్లతో తప్పుడు వీలునామా సృష్టించిన కేసులో చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ దంపతుల కుమారుడు డీకే శ్రీనివాస్, కుమార్తె కల్పజను సీబీఐ అధికారులు సోమవారం బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన రియలర్ట్ కె.రఘునాథ్ 2019 మే నెలలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు.తన భర్త మరణం వెనుక డీకే శ్రీనివాస్, అతని కుటుంబసభ్యులు ఉన్నారంటూ రఘునాథ్ భార్య మంజుల బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. న్యాయస్థానం 2022లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కల్పజ, శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. అలాగే అప్పట్లో హెచ్ఏఎల్ సీఐగా ఉన్న డీఎస్పీ మోహన్ను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. -
ఇవిగో సాక్ష్యాలు.. రోడ్డెక్కితే బాదుడు నిజమే
సాక్షి, అమరావతి: ‘‘రోడ్డెక్కితే బాదుడే’’ అనేది ముమ్మాటికీ నిజమని తేలింది..! ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని స్పష్టమైంది..! రహదారుల–భవనాల శాఖ వివరణే దీనికి నిదర్శనంగా నిలిచింది...! హైబ్రిడ్ యాన్యుటీ (హెచ్టీ) పద్ధతిలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో ప్రజల జేబులను గుల్లచేసేలా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన నిర్వాకాన్ని ఎండగడుతూ రోడ్డెక్కితే బాదుడే శీర్షికన ఆదివారం ‘సాక్షి’ కథనం ఇచి్చంది. దీనికి ఆర్అండ్బీ శాఖ వివరణ ఇచి్చంది. దీనికిముందు జరిగిన తతంగం చూస్తే, గత నెల 26న సీఎం చంద్రబాబు నిర్వహించిన ఆర్అండ్బీ శాఖ సమీక్షలో ఏడాదికి పెట్రోల్, డీజిల్పై రూపాయి సెస్ ద్వారా రూ.732 కోట్లు, గనులు, ఖనిజాలపై 10 శాతం సెస్తో రూ.441 కోట్లు, మోటారు వాహనాల పన్నుపై 10 శాతం సెస్తో రూ.350 కోట్లు ఆదాయం వస్తుందని ప్రజంటేషన్ ఇచ్చారు. దీంతో రహదారి అభివృద్ధి కార్పొరేషన్... ఆరి్థక సంస్థల నుంచి అప్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. ⇒ ఇక హైబ్రిడ్ యాన్యుటీలో కేంద్రం విధి విధానాల ప్రకారం టెండర్లు పిలుస్తామని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం లేదని, రెండు లేన్ల రహదారులు కాదని ఆర్అండ్బీ శాఖ పేర్కొంది. కానీ, 2 లేన్లలోనే మూడు దశల్లో 1,500 కిలోమీటర్ల రోడ్లను హెచ్టీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి రూ.15,326 కోట్లు వ్యయం అవుతుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. అంటే, కిలోమీటర్కు రూ.10 కోట్లు కాదా? ⇒ మరోవైపు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని శాఖ వివరణ ఇచ్చింది. కానీ, సీఎం సమీక్షలో వారు ఇచ్చిన ప్రజంటేషన్లోని ప్రతిపాదనలే దీనికిఇ సాక్ష్యంగా నిలిచాయి. 1,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టడానికి భూ సేకరణ, మౌలిక వసతులు (యుటిలిటీస్)కు రూ.4 వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుందని పేర్కొన్నారు. హెచ్టీ విధానంలో 40 శాతం ప్రభుత్వం, 60 శాతం డెవలపర్ వ్యయం చేస్తారని రహదారులు–భవనాల శాఖ వివరణ ఇచి్చంది. ‘సాక్షి’ కూడా ఇదే చెప్పింది. ⇒ 16 ఏళ్లలో ఆరు నెలలకోసారి డెవలపర్కు అసలు, వడ్డీ చెల్లిస్తారని సాక్షి పేర్కొంటే 15 ఏళ్లు అని ఆర్అండ్బీ శాఖ వివరించింది. మొత్తం వ్యయం ప్రజల నుంచే గుంజడం అవాస్తవమని తెలిపింది. కానీ, సెస్ల కింద ఏటా రూ.1,636 కోట్లు, టోల్ వసూలుతో రూ.375 కోట్లు వస్తుందని సీఎం సమీక్షలో పేర్కొన్నారు. ఈ లెక్కన 15 ఏళ్లలో రూ.24,540 కోట్లు, రూ.5,625 కోట్లు వసూలవడం వాస్తవం కాదా? ఈ రెండూ కలిపి రాష్ట్ర ప్రజలపై మొత్తం భారం రూ.30,165 కోట్లు కావడం లేదా? ఇక సెస్లను 16 ఏళ్లుగా సాక్షి పేర్కొంది. కానీ ఒకసారి సెస్ వేశాక అది ఎన్నేళ్లైనా కొనసాగుతుంది అనడంలో సందేహం లేదు. చంద్రబాబు మార్క్ బాదుడు ఏడు రోడ్లు అభివృద్ధి చేసి టోల్ వసూలుకు నిర్ణయం కన్సల్టెంట్కు డీపీఆర్ రూపకల్పన బాధ్యతలు సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం హైవేలపైనే టోల్ వసూలు చేస్తే... చంద్రబాబు సర్కార్ మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని రెండు వరసల రోడ్లపై కూడా టోల్ బాదాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలి దశలో ప్రస్తుతం రెండు వరుసల్లో ఉన్న ఏడు రోడ్లను అభివృద్ధి చేసిన తర్వాత టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది. ఆ ఏడు రోడ్లకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పన బాధ్యతలను కన్సల్టెంట్కు అప్పగించాలని నిర్ణయించింది.470 కిలో మీటర్ల మేర ఏడు రోడ్లను రెండు వరసల్లో పటిష్టం చేసేందుకు గుర్తించారు. భూ సేకరణ అవసరం లేకుండా వాటిని 470 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు రూ.936 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. తర్వాత ఆ రహదారులపై టోల్ వసూలు ద్వారా ఏడాదికి రూ.96.03 కోట్లు రాబడి వస్తుందని, దాని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మిగతా రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. -
రూ.350 కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు
మామిడి రైతులంటే ఎందుకింత చులకన? మామిడి రైతుల పట్ల బాబు ప్రభుత్వానికి చులకన భావం తగదు. కష్టాన్ని నమ్ముకుని చెమటోడ్చి పంటలు పండించే అన్నదాతలను పట్టించుకోకపోవడం దారుణం. మామిడి రైతులకు పరిశ్రమలు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పించకపోవడం ఎంతవరకు సబబు? వెంటనే నగదును చెల్లించేలా చర్యలు చేపట్టాలి. – మునిరత్నంనాయుడు, మామిడి రైతుచిత్తూరు కలెక్టరేట్: ‘‘ఆశించిన స్థాయిలో పంట చేతికొస్తే గిట్టుబాటు ధర లేకుండా చేశారు. తోతాపురి కిలోకు ఫ్యాక్టరీలు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున మొత్తం రూ.12 చెల్లిస్తామని మాటిచ్చాయి. 4.30 లక్షల టన్నుల పంటను ఫ్యాక్టరీలకు పంటను తోలి ఏడు నెలలవుతోంది. ఇంకా బకాయిలు చెల్లించలేదు. నాయకులకు చెప్పినా, ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయిలు అడుగుతుంటే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి గొడవలు పెట్టుకునేలా చేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం చంద్రబాబూ?’’ అని మామిడి రైతులు మండిపడ్డారు. వెంటనే బకాయిలు చెల్లించాలంటూ రైతు సంఘం నాయకులు, రైతులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు.మిన్నంటేలా నినాదాలు చేశారు. సమస్య చెప్పుకొనేందుకు ధర్నా చేస్తుంటే పోలీసులు అడ్డుకునేందుకు ప్రయతి్నంచడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మైక్ పెట్టకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం రైతులు మాట్లాడుతూ... మళ్లీ మామిడి సీజన్కు పెట్టుబడుల సమయం వచ్చిందని, పరిశ్రమలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడు నెలలుగా ఇవ్వకపోవడం దుర్మార్గంగా అభివరి్ణంచారు. కిలోకు రూ.8 ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారని గుర్తుచేశారు. ఇప్పటికి ఆరుసార్లు కలెక్టర్కు వినతిపత్రాలు సమరి్పంచామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని 40 మామిడి ఫ్యాక్టరీలకు కొమ్ముకాస్తూ 40 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం రోడ్డున పడేసిందని రైతులు నిప్పులు చెరిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యాలు కచ్చితంగా కిలోకు రూ.8 ఇస్తాయని చిత్తూరు కలెక్టర్ ఉత్తర్వులిచ్చారని, అవి అమలుకు నోచుకోనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశి్నంచారు. 40 ఫ్యాక్టరీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయా? అని నిలదీశారు. తమను మోసగిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న రైతులు.. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు పలు ప్రాంతాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా మామిడి రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునీశ్వరరెడ్డి, మురళీ, ఉపాధ్యక్షులు హేమలత, నాయకులు రామానాయుడు రైతులతో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. పరిశ్రమల వద్ద నిల్వ ఉన్న మామిడి పల్ప్ను టీటీడీ, విద్యార్థులు మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సూచించారు. రైతులను మోసగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధర్నా అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ గాం«దీకి వినతిపత్రం అందజేశారు.సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నాం ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.8 నగదు చెల్లించేందుకు సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నామని రైతులు తెలిపారు. ఆలోపు డబ్బు వేయకపోతే గ్రామాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తామని హెచ్చరించారు. ‘‘మామిడి పంటను నమ్ముకున్న మేము దారుణ స్థితిలో ఉన్నాం. పంటను అమ్ముకోలేక, అమ్మిన పంటను డబ్బు చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నాం. ఈ ఏడాది గిట్టుబాటు ధర పొందలేకపోయాం. ఫ్యాక్టరీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అజమాయిషీ చేయడం లేదు?రూ.350 కోట్లకు పైగా ఉన్న ఫ్యాక్టరీల బకాయిలపై ఎందుకు నోరు మెదపడం లేదు. పంటను తోలాక 15 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాలి. దానిని పాటించకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారు’’ అని వాపోయారు.నగదు ఎందుకివ్వరు..? ఫ్యాక్టరీ యజమానులు నగదును ఎందుకు చెల్లించరు? ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో ఫ్యాక్టరీల యజమానులు డబ్బు వేయలేదు. మరి ఇంకెప్పుడు ఇస్తారు...? మొదట్లో ఒక మాట మామిడి పంట ఫ్యాక్టరీలకు తోలిన తర్వాత మరో మాట చెప్పి మోసగించడం దారుణం. ఏటా ఇదే తంతు. పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కలెక్టర్ చొరవ తీసుకోవాలి. – త్యాగరాజులురెడ్డి, మామిడి రైతు నెలలు గడుస్తున్నా స్పందించరా? కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారంరైతులకు ఫ్యాక్టరీ యజమానులు కిలోకు రూ.8 ఇచ్చి తీరాల్సిందే. తక్కువైతే సహించేది లేదు. నెలలు గడుస్తున్నా నగదు ఇవ్వకపోవడంతో ఆందోళన చేపడుతున్నాం. సంక్రాంతిలోగా బకాయిలు చెల్లించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తాం. – మురళి, మామిడి రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఊరుకునేది లేదు రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. మాకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా రూ.8 చొప్పున ఇవ్వాలి. ర్యాంపులలో అతి తక్కువగా రేట్లు ఇచ్చారు. వాటన్నింటినీ పరిశీలించి రూ.8 చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. జిల్లాలోని 40 ఫ్యాక్టరీల యజమానులు నగదు చెల్లించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. – ఉమాపతినాయుడు, మామిడి రైతు -
పేరుకుపోతున్న అర్జీలు.. పేరుకే సదస్సులు రెవె‘న్యూసెన్స్’!
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బత్తులవారిపాలెంలో నివసించే చిమటా మార్క్కు సర్వే నెంబర్ 351/9 లో 1.26 ఎకరాలు, 314/6 లో 22 సెంట్లు కలిపి మొత్తం 1.48 ఎకరాల పొలం ఉంది. డాక్యుమెంట్లు అన్నీ ఆయన పేరుతోనే ఉన్నా తటవర్తి సాయి, పందరబోయిన శ్రీను అనే వ్యక్తులు ఆ సర్వే నంబర్లలో 1.22 ఎకరాలను ఆక్రమించుకున్నారు. మార్క్ను భూమిలోకి రానివ్వడం లేదు. తన భూమిని ఆక్రమించారని.. సమస్య పరిష్కరించాలని డాక్యుమెంట్లు చేత పట్టుకుని మార్క్ ఏడాదిన్నరగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించామంటూ రసీదు చేతిలో పెట్టడం మినహా సమస్య పరిష్కరించే నాథుడే లేడని మార్క్ వాపోతున్నాడు.సాక్షి ప్రతినిధి, కర్నూలు: తప్పుడు పేర్లతో ఆన్లైన్లో రికార్డులు మాయం చేయడం.. పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం.. భూ కొలతల్లో తిమ్మిని బమ్మిని చేయడం.. భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోకపోవడం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. తమ గోడు పట్టించుకునే దిక్కులేక లక్షలాది మంది సతమతమవుతున్నా చంద్రబాబు సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. చలానాలు కట్టినా.. స్వయంగా న్యాయస్థానాలు ఆదేశించినా.. భూములు సర్వే చేసే దిక్కులేక అల్లాడుతున్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే వినతుల్లో సింహభాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. ఈ నెల 15న చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్కు 293 అర్జీలు వస్తే రెవెన్యూ సమస్యలే 204 ఉన్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుతున్న ఫిర్యాదుల్లో 70–80 శాతం రెవెన్యూ సమస్యలే కావడం గమనార్హం. ప్రభుత్వ ఉదాశీనత, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై ‘సాక్షి’ బృందాలు ఈ నెల 15న సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ను ఆసాంతం పరిశీలించాయి. మొత్తంగా ఆయా జిల్లాల్లో ఒక్క రోజులో ఎన్ని సమస్యలు వచ్చాయి..? వాటిలో రెవెన్యూ సమస్యలు ఎన్ని..? అని ఆరా తీశాయి. ఆ తర్వాత మంగళ, బుధవారాల్లో పీజీఆర్ఎస్కు హాజరైన కొందరు బాధితుల గ్రామాలకు వెళ్లి సమస్య మూలాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడాయి. వెళ్లిన ప్రతి చోటా సమస్యల పరిష్కారంలో లెక్కలేనితనం, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం, అవినీతి స్పష్టంగా కనిపించాయి. ఒక్క రోజులో పరిష్కరించగలిగే చిన్న సమస్యలను సైతం నెలల తరబడి పట్టించుకోకపోవడం లేదని తేటతెల్లమైంది. చలానాలు కూడా కట్టించుకుని సర్వేలు చేయడం లేదంటే నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకుందో కళ్లకు కడుతోంది. గత ప్రభుత్వం పరిష్కరించినా.. మళ్లీ అసైన్ ఉచ్చు ఏళ్ల తరబడి పొలాలు సాగు చేసుకుంటున్నా 22–ఏ నిషేధిత జాబితాలో అసైన్డ్ భూములు ఉండటంతో బ్యాంకు రుణాలు అందక, అవసరాలకు భూములు విక్రయించుకోలేక సుదీర్ఘకాలంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్యలను గుర్తిస్తూ, 20 ఏళ్లుగా లబ్ధిదారుల అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 22–ఏ జాబితా నుంచి తొలగించి వైఎస్సార్సీపీ హయాంలో రైతులకు హక్కులు కల్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పేద రైతులు ఎంతో సంతోషపడ్డారు. కానీ 2024లో చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఫ్రీహోల్డ్ అయిన భూములను తిరిగి 22–ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రుణాల నుంచి క్రయవిక్రయాల వరకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాదారు పుస్తకాలు ఎక్కడ? గత ప్రభుత్వంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనే సాకుతో వాటిని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా ప్రభుత్వ ఎంబ్లమ్తో పాసు పుస్తకాలను ఇస్తామని ప్రకటించింది. ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పాసు పుస్తకాల జాడలేదు. పాత పాస్ పుస్తకాలు రద్దు కావడం, కొత్తవి ఇవ్వకపోవడంతో రైతులు రుణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాసు పుస్తకాలు ఇవ్వాలని పీజీఆర్ఎస్కు పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. మొక్కుబడిగా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు భూముల సంబంధిత సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం జనవరిలో 10 రోజులు గ్రామ సభలు నిర్వహించింది. అనంతరం మరో 15 రోజులు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం సదస్సులు నిర్వహించింది. కర్నూలు సహా పలు జిల్లాల్లో ఈ సభల్లో ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదు. రికార్డుల్లో మాత్రం సమస్యలు పరిష్కారమైనట్లు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. దీంతో రెవెన్యూ సదస్సులకు వచ్చిన వారు తిరిగి పీజీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత అధ్వానంగా జరిగాయో స్పష్టమవుతోంది. మ్యుటేషన్లు బంద్.. రీ సర్వేలో మిగులు భూముల మ్యుటేషన్లను చంద్రబాబు ప్రభుత్వం కఠినతరం చేసింది. ఆ భూముల్లో అనుభవదారులున్నా, వాటిని వారి వారసులకు మ్యుటేషన్ చేయడం లేదు. దాదాపు ఏడాదిన్నరగా రైతులు వాటి కోసం పడిగాపులు కాస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో చుక్కల భూములపై హక్కులు ఇచ్చారు. అయితే ఆధారాలు చూపలేని కొందరు రైతులకు సంబంధించిన భూములు పెండింగ్లో ఉన్నాయి. ఆ రైతులంతా తమ భూములను డాటెడ్ జాబితా నుంచి తొలగించాలని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకుంటున్నా ఆలకించడం లేదు. రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలను తొలగించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీని కోసం గ్రామాల్లో రైతుల నుంచి లంచాలు వసూలు చేస్తూ టీడీపీ నాయకులు సెటిల్మెంట్లు చేస్తున్నారు. వీటిపై కూడా పీజీఆర్ఎస్కు అర్జీలు భారీగా వస్తున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లిలో ఇంజా లక్ష్మీరెడ్డికి వారసత్వంగా వచ్చిన 65 ఎకరాల ఉమ్మడి పొలం ఉంది. నలుగురు అన్నదమ్ములు కావడంతో లక్ష్మీరెడ్డి వాటాగా నాలుగో వంతు రావాలి. సజ్జలదిన్నె గ్రామంలో సర్వే నెంబర్లు 44, 602, 581, 612, 467–డి, 270–ఎం, 270–ఓ, 33, 390–బిలో తొమ్మిది ఎకరాల పొలం వివాదంలో ఉంది. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి పోలీసు భద్రతతో సర్వే చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. సర్వే కోసం బాధితుడు చలానా కట్టినా వీఆర్వో సర్వే చేయించడం లేదు. ‘మేం చేయించం.. నీకు దిక్కున్న చోట చెప్పుకో..’ అని బెదిరిస్తున్నాడు. లక్ష్మీరెడ్డి ఇప్పటివరకు 31 సార్లు అర్జీలు ఇచ్చినా భూమిని సర్వే చేయడం లేదు. రెవెన్యూ వ్యవహారాలు ఇంత అధ్వాన్నంగా ఉంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన వాపోతున్నారు. విచారిస్తూనే ఉన్నారు...! ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేమవరంలో ముప్పరాజు పాపయ్య పేరుతో 11.93 ఎకరాల భూమి ఉండగా ఆయన ఇద్దరు కుమారులు, పెద్దకోడలు కూడా చనిపోయారు. చిన్న కోడలు శేషమ్మ మాత్రమే మిగిలి ఉంది. ఈ భూమిని ఒంగోలుకు చెందిన రియల్టర్ మారం వెంకటేశ్వరరెడ్డి తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. శేషమ్మ భూమిని కొట్టేయాలని యత్నిస్తున్నాడు. దీంతో శేషమ్మ రెవెన్యూ అధికారులను సంప్రదించగా ఈ వివాదాన్ని ఎంతకీ తేల్చడం లేదు. ఈ భూమిపై హక్కుదారులెవరో విచారణ చేస్తున్నామని తహసీల్దార్ చెబుతున్నారు.ఎన్ని సమస్యలో..!⇒ మదనపల్లెవాసి మురళీకి కురబలకోట సర్వే నెంబర్ 1913/2ఎలో 3.39, 1913/3లో 1.50 ఎకరాలు భూమి ఉంది. 1958లో మురళి తాత దువ్వూరి రామన్న పేరుతో ఉన్న భూమి ఆయన మృతి తర్వాత 1994లో వారసత్వంగా మురళి పేరుతో రికార్డుల్లోకి ఎక్కింది. దీనికి పక్కనే ఉన్న మరో యజమాని మురళి భూమిని ఆక్రమించాడు. సర్వే చేసి తన భూమికి హద్దులు తేల్చాలని రెండేళ్లుగా మురళి సబ్ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ⇒ చిత్తూరు రూరల్ దిగువమాసాపల్లికి చెందిన తులసికి సర్వే నెంబర్ 183లో ఇంటి స్థలం ఇచ్చారు. ఆమె స్థలాన్ని రెవెన్యూ అధికారులు మరొకరికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. తన స్థలం మరొకరికి ఎలా ఇస్తారని బాధితురాలు ప్రతి వారం తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఉపయోగం లేకపోవడంతో పీజీఆర్ఎస్ను ఆశ్రయించింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు.⇒ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కుందేరు వాసి షేక్ ఆదాం షరీఫ్ ఇంటి స్థలం, ఇల్లు తొలగించి 2015లో రైవస్ కాలువపై వంతెన నిర్మించారు. ఆయనకు నష్ట పరిహారం చెల్లిస్తామని స్థలం తీసుకున్నారు. పీజీఆర్ఎస్తో పాటు మంగళగిరిలో ప్రజా దర్బార్కు వెళ్లినా షరీఫ్కు పరిహారం దక్కలేదు. ⇒ కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం వాసి విజయభాస్కరరావుకు 3 ఎకరాల పొలం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చుక్కల భూముల జాబితాలోకి చేర్చడంతో బ్యాంకు రుణాలు తీసుకోలేక ఇబ్బందులు పడ్డాడు. అనంతరం జగన్ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ వాటికి చుక్క పెట్టింది. కళ్లెదుట మూడు ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఎందుకూ ఉపయోగ పడటం లేదని, నిషేధ జాబితా నుంచి తొలగించాలని బాధితుడు మొర పెట్టుకుంటున్నాడు.⇒ శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రం వాసి ప్రభాకర్కు సర్వే నంబర్ 201–7లో వారసత్వంగా సంక్రమించిన 27 సెంట్ల స్థలం ఉంది. ఉపాధి కోసం ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్లో ఉండటంతో ప్రభాకర్ సమీప బంధువు ఆ భూమిని తన పేరుతో ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు. అక్కడ సెంటు రూ.6 లక్షలు వరకు ఉంది. రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి రూ.1.62 కోట్ల ఆస్తిని కబ్జా చేశారు. తన భూమిని ఇవ్వాలని ఏడాదిన్నరగా ప్రభాకర్ రికార్డులతో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ఈ నెల 15న శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి గానూ ఇటీవల తిరుపతి కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు భారీగా హాజరైన ప్రజలు ఐవీఆర్ఎస్ కాల్స్, ఆడిట్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిసాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ ఎన్నికల హామీలను అమలు చేయకుండా మోసం చేసిన సీఎం చంద్రబాబు కనీసం ప్రజల ఆర్థికేతర సమస్యలకు పరిష్కారం చూపడంలోనూ దారుణంగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సులోనే ఈ విషయం వెల్లడైంది. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. పరిష్కరించామని చెబుతున్న సమస్యలపై ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఈ డొల్లతనం బయటపడింది. అల్లూరి జిల్లాలో అత్యధికం.. విజ్ఞాపనల పరిష్కారంపై ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆర్టీజీఎస్ ద్వారా సర్వే చేయగా 43 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిష్కరించినట్లు చెబుతున్న వినతులపై ఆడిట్ నిర్వహించడంతోపాటు అర్జీదారులకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి అభిప్రాయం కోరగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 80% మంది, చిత్తూరు జిల్లాలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 62, అన్నమయ్య జిల్లాలో 60, అనంతపురం జిల్లాలో58, ఎన్టీఆర్ జిల్లాలో 53, బాపట్ల జిల్లాలో 50% మంది ప్రజలు విజ్ఞాపనల పరిష్కారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ల సదస్సుల్లో సీఎం సమక్షంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నుంచి అసంతృప్తి స్థాయి మూడునెలల్లో భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ఇక రెవెన్యూ శాఖలో పరిష్కరించినట్లు చెబుతున్న అంకెలన్నీ తప్పేనని కలెక్టర్ల సదస్సుల్లోనే ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం విషయంలో లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదని కలెక్టర్ల సదస్సులో తేలడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. పట్టా ఇచ్చారు.. భూమి ఎక్కడ? నా భర్త సింహాచలం కల్లుగీత కార్మీకుడు. కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయారు. ప్రభుత్వం సర్వే నెంబర్ 23పీలో నాకు 0.80 ఎకరాల భూమి ఇచ్చింది. పట్టాదారుపాసు పుస్తకం ఇచ్చారు. అడంగల్లో కూడా నా పేరు ఉంది. ఆ భూమి ఎక్కడ ఉందో చూపించి హద్దులు తేల్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా. కలెక్టరేట్లో కూడా అర్జీలు ఇస్తున్నా నా సమస్య తీరడం లేదు. – అప్పమ్మ, ఏవో అగ్రహారం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లాఊరికి దూరంగా బతుకుతున్నా నాకు మా గ్రామంలోని సర్వే నెంబర్ 203లో 16 సెంట్ల స్థలం ఉంది. అందులో ఇల్లు కూడా ఉంది. ఈ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి నన్ను రానివ్వడం లేదు. నాలుగు నెలల క్రితం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి చేసి చంపాలని చూశారు. అప్పటి నుంచి ఊరికి దూరంగా బతుకుతున్నా. గ్రామసభలో చెప్పినా ఫలితం లేదు. నా పేరుతోనే స్థలం డాక్యుమెంట్లు ఉన్నా ఏమిటీ అన్యాయం? అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – వారి పెద్దిరెడ్డి, ఏట్రవారిపాలెం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లాకలెక్టర్కు చెప్పినా.. మా నాన్న మంగలి నారాయణ పేరుతో సర్వే నంబర్ 893లో 1.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏడాది క్రితం నుంచి ఈ పొలం తమదంటూ 892 సర్వే నంబర్లో ఉంటున్న జగదీష్ గొడవ పడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్లో మేం సాగు చేసిన పంటను దౌర్జన్యంగా తొలగించాడు. పొలం సర్వే చేసి సమస్య పరిష్కరించాలని ఏడాదిగా తహసీల్దార్, ఆర్డీవోతో పాటు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్నా ఫలితం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. – మంగలి తిరుపతయ్య, బేతంచెర్ల, నంద్యాల జిల్లా -
కలెక్టరేట్లోనే కరెంట్ కట్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఒకప్పుడు కొవ్వొత్తుల వెలుగుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేస్తే.. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి సెల్ఫోన్ వెలుగుల్లో పనులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ ఇందుకు వేదికైంది. జేసీ మయూర్ అశోక్ ప్రజల నుంచి వినతులు తీసుకుంటుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సిబ్బంది సెల్ఫోన్లలోని టార్చ్లైట్స్ ఆన్ చేయగా.. ఆ వెలుతురులోనే జేసీ వినతులు స్వీకరించారు. ఆ సమయంలో గ్రీవెన్స్లో ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యామ్బాబు ఉండటం కొసమెరుపు.రబీలోనూ తప్పని యూరియా కష్టాలుఖరీఫ్లోనే కాదు రబీలోనూ రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వం రైతన్నకు శాపంగా మారింది. ఆర్ఎస్కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. మరోపక్క అధికారులు యూరియా కొరత లేదని గొప్పలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడులోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద సోమవారం యూరియా విక్రయిస్తున్నారన్న సమాచారంతో 500 మంది రైతులు గుమిగూడారు. గంటల తరబడి నిరీక్షించారు. తీరా ఒక్క బస్తాకూడా విక్రయించకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. – గుర్ల -
26న కొత్త ‘ఉపాధి’ చట్టంపై ప్రత్యేక గ్రామసభలు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసి కొత్తగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ పేరుతో చేపట్టే కార్యక్రమంపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు 26న అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు.మార్పులతో కూడిన కొత్త ఉపాధి చట్టానికి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర గ్రామీణాభిృద్ధి శాఖ అధికారులు రాష్ట్రాల ప్రతినిధులకు కొత్త చట్టంలోని ప్రధాన ప్రతిపాదనలను గురించి వివరించారు. ప్రతి కుటుంబానికి ఏటా ప్రస్తుతం వంద పనిదినాలకు మాత్రమే అవకాశం ఉండగా, కొత్త చట్టంలో ఏడాదికి 125 పనిదినాలకు అవకాశం ఉన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త ఉపాధిహామీ పథకంపై 26న రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. -
‘పచ్చ’గా.. యథేచ్ఛగా ‘అశోక’ వనంలో పేకాట
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు: తెలుగు తమ్ముళ్ళు పేకాట డాన్లుగా మారిపోయారు. పచ్చని మామిడి తోటల మధ్య రిక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూద శిబిరం నిర్వహణకు తెరతీశారు. స్థానికుల నిరసనలు, ఇతరత్ర అంశాలను లెక్కచేయకుండా లోకేశ్ బాబు టీమ్ అంటూ హడావుడి చేశారు. స్థానిక మంత్రి నుంచి లోకేశ్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. పోలీసుల దాడులు, కేసులు ఉండవని చెప్పడంతోపాటు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి పేకాట నిర్వహిస్తామంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్న క్లబ్పై ఆదివారం సాయంత్రం పోలీసులు మెరుపుదాడి చేశారు. కట్ చేస్తే.. 4 జిల్లాలకు చెందిన 281 మంది జూదరులు అరెస్టయ్యారు.130 కార్లు, 40 బైక్లను సీజ్ చేసిన పోలీసులు చివరికి రూ.32 లక్షలు నగదును మాత్రమే గుర్తించినట్టు ప్రకటించారు. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులో 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బై కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ కిలారు అప్పారావు అధ్యక్షుడిగా ఏర్పాటైంది. 2011 నుంచి 2018 వరకు రిక్రియేషన్ ముసుగులో అడపాదడపా పేకాట శిబిరాలు నిర్వహించారు. 2019 ప్రారంభంలో రెండు మూడు సార్లు పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో క్లబ్ను మూసివేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో రిట్ పిటిషన్ 18807/2019 నంబర్తో పేకాటకు అనుమతించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఉత్తర్వులను సాకుగా చూపి భారీ జూద శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు.అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూదశిబిరం ప్రారంభం కాకుండా ఉక్కుపాదం మోపింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్లబ్ ప్రారంభించడానికి భారీ లాబీయింగ్కు తెర తీశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న కాట్రగడ్డ అశోక్ కుమార్ రింగ్ లీడర్గా మారి పేకాట క్లబ్ను ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలో ఆగిరిపల్లి యువకులు నిరసనలు, ఆందోళనలు చేయడంతో నిలిచిపోయింది. మళ్ళీ వారం రోజుల వ్యవధిలో నవంబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి మొదలుకొని స్థానిక పోలీసుల వరకు అందరితో మాట్లాడేసి అందరినీ చక్కబెట్టామని చెప్పి పేకాట ప్రారంభించారు. జూదరులు క్లబ్కు రావడానికి వీలుగా క్లబ్ వద్ద హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలు సహా క్లబ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుంచి జూదరులకు ప్రత్యేకంగా సమాచారమిచ్చి క్లబ్కు వచ్చేలా ఏర్పాటు చేసి దాదాపు 55 రోజులకుపైగా నిర్వహిస్తున్నారు. రూ.10 వేల నుంచి లక్ష వరకు వారాంతాల్లో వీటితో పాటు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 26 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగదు స్వీకరించి కాయిన్స్ ఇవ్వడానికి వీలుగా ఏడు డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేసి రోజూ కోట్లలో పేకాట నిర్వహిస్తున్నారు. దీనికి గాను స్థానిక ఎస్ఐ నుంచి మంత్రి వరకు నెలవారీ ముడుపులు చెల్లిస్తున్నామని క్లబ్లో బహిరంగంగా చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేసి సొసైటీ అధ్యక్షుడు కిలారు అప్పారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాట్రగడ్డ అశోక్కుమార్తోపాటు 281 మంది జూదరులను అరెస్టుచేశారు. లోకేశ్ సన్నిహితుడిగా ప్రచారంవిజయవాడ నగరానికి చెందిన కాట్రగడ్డ అశోక్కుమార్ టీడీపీలో క్రియాశీలక నాయకుడు. మంత్రి లోకేశ్ సొంత మనిషినంటూ ఆగిరిపల్లిలో విస్తృత ప్రచారం చేసుకున్నాడు. గతంలో యువగళం పాదయాత్రలో కూడా పాల్గొన్నాడు. అరెస్టు నేపథ్యంలో 15 రోజుల్లో మళ్ళీ క్లబ్ ప్రారంభిస్తానని, అందరికీ తన సంగతి తెలుసునంటూ పోలీసుల వద్ద మాట్లాడినట్టు సమాచారం. ఆదివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించి రూ.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల పూర్తి వివరాలు అన్నీ క్లబ్లోనే పూర్తి చేసి సోమవారం రాత్రి కోర్టుకు హాజరుపరిచారు.జూదరుల తరఫున ఆందోళనజూదరులపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అక్కడ ఉన్న సామగ్రిని స్వాధీనం చేసుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మ్యాంగో బే క్లబ్ వద్దకు వచ్చి ఐదు బస్సుల్లో జూదరులను నూజివీడు కోర్టుకు తరలించారు. కాగా, అంతకముందు 24 గంటలు గడిచినా మ్యాంగో బే క్లబ్లో పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరచకపోవడంపై జూదరుల తరఫున కొందరు రోడ్డుపై ఆందోళనకు దిగారు. -
ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు
సాక్షి, గుంటూరు: ఏపీలో మరో ఐపీఎస్ అధికారిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు పంపించింది. గుంటూరు అర్బన్ ఎస్పీగా ఉన్న సమయంలో లోకేష్ను కించపరిచేలా ట్వీట్ పెట్టారంటూ నోటీసులు ఇచ్చింది. రేపు(డిసెంబర్ 23, మంగళవారం) మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరుకావాలని అమ్మిరెడ్డికి శాసనమండలి ప్రివిలేజెస్ కమిటీ నోటీసులు పంపింది.13 మందిపై అక్రమ కేసులుశ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో రెడ్బుక్ పాలన కొనసాగుతోంది. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలొ వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేసుకున్న 13 మందిపై కేసులు నమోదు చేశారు. 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు. 8 మంది వైఎస్సార్సీపీ నేతలకు ధర్మవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇలా..
సాక్షి, తాడేపల్లి: రేపటి(డిసెంబర్ 23 మంగళవారం) నుంచి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. రేపు(మంగళవారం) పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు.ఎల్లుండి(బుధవారం) ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనలకు హాజరుకానున్నారు. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహించనున్నారు. 25న ఉదయం 8.30 గంటలకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరు కానున్నారు.23.12.2025(మంగళవారం) షెడ్యూల్:సాయంత్రం 4 గంటలకు పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.24.12.2025(బుధవారం) షెడ్యూల్:ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకుని ప్రేయర్ హాల్లో జరిగే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్ళి భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడ నివాసంలో బస చేస్తారు25.12.2025(గురువారం) షెడ్యూల్:ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు, ఆ తర్వాత 10.30 గంటలకు పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
కూటమి పాలనలో డ్రగ్స్ డెన్గా ఏపీ: వంగవీటి నరేంద్ర
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ డెన్గా కూటమి సర్కార్ మార్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు.


