Amaravati
-
సిలబస్ ‘ప్రశ్నా’ర్థకం?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యాప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికితోడు పరీక్షల వ్యవస్థను సర్కారు అపహాస్యం చేస్తోంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల (ఎస్ఎస్సీ–2026) నిర్వహణలో తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా, బయట సిలబస్ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లిష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదమేర్పడింది. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆరు మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి, బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ.. గతేడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు టెన్త్ పరీక్షల కోసం ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటినే బట్టీ పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ సెట్టింగ్లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి.. 35 శాతం మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థీ రాసేలా, మరో 15 శాతం కష్టతరంగా, మిగిలిన 50 శాతం మధ్యస్తంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ, ఈ ఏడాది ఎవరికీ అర్థంగాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ఇంగ్లిష్లో పేపర్లో ఇచ్చిన తప్పు ప్రశ్నలివీ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలప్రశ్నపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూప్రింట్కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఇంగ్లిష్ పేపర్ను పరిశీలిస్తే.. » జంబుల్డ్ సెంటెన్స్ (ప్రశ్న నం.17)లో సాధారణంగా ఒక స్టోరీ లేదా ఒక ఘటనను ఇచ్చి, అందులోని కొన్ని పదాలను అటు ఇటుగా మార్చి (జంబుల్), ఆర్డర్లో పెట్టమని అడుగుతారు. కానీ ఈసారి పేపర్లో ఒక స్టోరీని పూర్తిగా ‘రివర్స్’లో వెనుక నుంచి ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఐదు మార్కులు కోల్పోయారు. » ఎడిటింగ్ (ప్రశ్న నం.22): ఇది బ్లూ ప్రింట్ ప్రకారం ఇచ్చిన పాసేజ్లో ఎడిట్ చేయాల్సిన సెంటెన్స్ను ‘అండర్ లైన్’ చేయాలి. గతంలో జరిగిన పరీక్షల్లో ఇచ్చిన పాసేజ్లో నాలుగు వర్డ్స్ను అండర్లైన్ చేసి ఇచ్చారు. కానీ పబ్లిక్ పరీక్షలో మాత్రం ఒకే పాసేజ్ ఇచ్చి ఎక్కడ ఎడిట్ చేయాలో అండర్లైన్ చేయలేదు. 4 మార్కులు కోల్పోయారు. » అడ్వైస్ (ప్రశ్న నం.26): సెంటెన్స్లో ఇచ్చిన ‘నౌన్’ను ఉద్దేశించి అడ్వైస్ ఇస్తారు. కానీ, ఈసారి పరీక్షలో నౌన్కు కాకుండా నౌన్ తండ్రికి అడ్వైస్ ఇవ్వమని అడిగారు. అంటే విద్యార్థులకు బోధించని, సిలబస్లో లేని ప్రశ్నను ఇవ్వడంతో 2 మార్కులు కోల్పోయారు. » ఆపోజిట్ వర్డ్స్ (ప్రశ్న నం.28): ఇది పూర్తిగా సిలబస్లో లేనిది, బ్లూప్రింట్కు సంబంధం లేనిది ఇచ్చారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న కావడం గమనార్హం. ఫిజికల్ సైన్స్లోనూ అదే తీరు ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ సిలబస్లో లేని ప్రశ్నలే ఇచ్చారు. వారి ఐక్యూ స్థాయిని అంచనా వేసేవిగా మార్చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్లో విద్యార్థులు కచ్చితంగా ఏరోజు ఏ ప్రశ్నలు చదవాలో సిలబస్ ఇచ్చా రు. కానీ ఆ జాబితాలోని మోడల్స్కు, వెయిటేజీకి విరుద్ధంగా ప్రశ్నలు సైతం సందిగ్ధంగా, అసాధారణ రీతిలో ఇవ్వడంతో విద్యార్థులు సరిగా రాయలేకపోయారు. ముఖ్యంగా 8, 11, 14(1), 14(4), 3వ ప్రశ్నలు అసాధారణ రీతిలో ఇవ్వడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వీటికి ఆరు మార్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది. -
ప్రభుత్వ విధానాలపై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో కూటమి ప్రభుత్వం విభజించు – పాలించు అనే విధానం అనుసరిస్తుండడంతో రిజిస్టర్డ్ సంఘాలు ఒక్కటయ్యాయి. ఉపాధ్యాయ సమస్యలపై ఉమ్మడిగా పోరు సాగించేందుకు నిర్ణయించాయి. ఇప్పటికే గుర్తింపు సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పడి పోరుబాట ప్రారంభించగా, ఇకపై రిజిస్టర్డ్ సంఘాలు సైతం ఐక్యంగా ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు. మొత్తం 30 సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు సీవీ ప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంఘాలు ఏకమై సమస్యల పరిష్కారం కోసం జతకట్టడం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. గతేడాది ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రభుత్వం కేవలం గుర్తింపు సంఘాలతోనే చర్చలు జరపడం, రిజిస్టర్డ్ సంఘాలను పిలవకపోవడాన్ని ఐక్యవేదిక ఖండిస్తున్నట్టు వెల్లడించారు. విద్యారంగం, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం, పీఆర్సీ, ఐఆర్, డీఏ, పాత బకాయిలు, ఇతర ఆరి్థకపరమైన డిమాండ్ల సాధన కోసం త్వరలో ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. రూసో రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక సమావేశంలో భాగంగా రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ (రూసో)ను ఏర్పాటు చేసి రాష్ట్ర కమిటీని ప్రకటించారు. చైర్మన్గా సీవీ ప్రసాద్ (ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.శ్రీనివాసరావు(పీఎంటీఎఫ్), కోశాధికారిగా ఎం.మీరయ్య(ఏపీ పీజీటీఏ), కో–చైర్పర్సన్లుగా ఎస్.రాజేశ్వరి (మహిళా ఉపాధ్యాయ సంఘం), ఆర్.సుధాకర్ రెడ్డి (ఎస్టీయూడీ), అన్నం శ్రీనివాస్ (పూలే టీచర్స్ ఫెడరేషన్), ఖాజా రహమతుల్లా (ఆర్టీఏ), ఎం.అమర్నాథ్ (ఏటీఏ), కె.పూర్ణచంద్రనాయక్ (ఏపీ టీడబ్ల్యూటీఏ), శ్రీనివాసులు (పీఎస్ హెచ్ఎంఏ), డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా డి.పెంచలయ్య (మహాజన టీచర్స్ అసోసియేషన్), గణేష్ (దివ్యాంగుల టీచర్స్ అసోసియేషన్), లక్ష్మణ్ (ఏపీ జీటీడబ్ల్యూఏ ఎస్సీఆర్టీఏ), పారయ్య (టీఆర్ఈఐటీఎల్ఏ), సు«దీర్ (ఏపీపీడీఏ), వెంకట సుబ్బయ్య (స్పెషల్ ఎడ్యుకేటర్స్ అసోసియేషన్), మహిళా కార్యదర్శులుగా గంగాభవానీ (వోజీవీటీ)తో పాటు 20 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. టీఎన్యూఎస్ ఏపీ రాష్ట్ర నాయకుడు కృష్ణ మోహన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
రాజధాని నిర్మాణం ఒక్క రోజులో అయ్యేది కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, స్పోర్ట్ సిటీ వంటి వేర్వేరు ప్రాజెక్టులు నిర్మితమవుతూనే ఉంటాయన్నారు. అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్, మోనిటైజేషన్ ప్రాజెక్టు అని పదే పదే చెబుతున్నామని తెలిపారు. రాజధానిలో భూమి విలువలు పెరుగుతాయని, దీనిపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని అన్నారు. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల అత్యంత సారవంతమైన, ఖరీదైన భూములను ఇచ్చారని చెప్పారు. దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతేనని చెప్పారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. పార్లమెంటు శాశ్వత రాజధాని అని చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్లాన్ ఏ, ప్లాన్ బీ చేస్తామని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని అవుతుందన్నారు. ప్రస్తుతం రాజధానిలో రూ.56 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2028 నాటికల్లా రాజధానిలో ప్రధానమైన పనులన్నీ కొలిక్కి వస్తాయన్నారు. పశి్చమాసియాలో యుద్ధం వల్ల ధరలు పెరుగుతాయని తెలిపారు. -
మూడో రోజు కొనసాగిన నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె మూడో రోజైన శుక్రవారం నాడూ కొనసాగింది. ఆస్పత్రుల యాజమాన్యాలు సేవలు పూర్తిగా నిలిపివేసి నిరసన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఆస్పత్రులు సేవలు బంద్ చేయడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తోంది. తొలి రోజు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ)తో మొక్కుబడిగా చర్చలు చేపట్టిన ప్రభుత్వం తర్వాత చేతులు దులిపేసుకుంది. చర్చలు జరిపిన రోజే సమ్మె ఆపబోమని, కొనసాగిస్తామని ఆశ తేల్చి చెప్పినా, మరోమారు వారితో చర్చలు జరపడానికి ప్రభుత్వం కనీస చొరవ చూపకపోవడం గమనార్హం.ఓవైపు ఆరోగ్య శ్రీ సేవలు ఆగిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ప్రైవేట్, పార్టీ, ఇతర కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, కేరళ ఎన్నికల ప్రచారంలో వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ బిజీగా గడిపేస్తున్నారు. 1.40 కోట్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన పథకానికి సంబంధించిన సేవలు నిలిచిపోతే కనీసం పట్టించుకునే నాథుడు కూడా లేకుండా పోయారని రోగులు మండిపడుతున్నారు. -
పరస్పర ప్రేమ, క్షమాభావాన్ని ఆచరణలో పెట్టాలి
సాక్షి, అమరావతి: క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగానికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే పవిత్ర దినం సందర్భంగా ప్రతి ఒక్కరూ కాసేపు ఆలోచించి, మనలో మనం చూసుకుని, మన విలువలను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు. మనలను మనం ప్రేమించినట్టే ఇతరులనూ ప్రేమించాలి అనే యేసుక్రీస్తు బోధనే సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. -
ముందు భూమి తీసుకో.. డబ్బు ఉన్నప్పుడు కట్టు
సాక్షి, అమరావతి: విలువైన భూమి కేటాయించిన తర్వాత సకాలంలో మొత్తం నగదు కట్టకపోయినా ఉన్నప్పుడు కట్టుకునే అవకాశాన్ని ఏపీఐఐసీ కల్పించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం భూమి కేటాయించిన తర్వాత 60 రోజుల్లోగా నిర్దేశిత మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి. ఆ నిబంధనను సడలిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజులు దాటిన తర్వాత 9 శాతం వడ్డీతో ఎప్పుడైనా డబ్బు చెల్లించే వెసులుబాటు కల్పించింది. అంటే 61వ రోజు నుంచి ఎప్పుడు చెల్లిస్తారో అన్ని రోజులకు 9 శాతం వడ్డీ చెల్లించడంతోపాటు 3 శాతం అదనంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలైతే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సడలింపు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవడానికి అనుమతిస్తామని, 2020 నిబంధనల ప్రకారం కేటాయించిన భూములకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పటికే విశాఖలో భూములు కేటాయించిన బెంగళూరుకు చెందిన సత్వా రియల్ ఎస్టేట్ కంపెనీకి రూ.1500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని రూ.45 కోట్లకే కేటాయిస్తే సకాలంలో డబ్బులు చెల్లించలేదు. మంత్రివర్గంలో మరోసారి అనుమతి తీసుకొని డబ్బులు చెల్లించింది. ఇదే విధంగా ప్రీమియర్ ఎక్స్పో్లజివ్ సంస్థ కూడా సకాలంలో డబ్బులు చెల్లించలేక గడువు అడిగింది. ఇలా ఈ మధ్యకాలంలో చంద్రబాబు సర్కారు కారు చౌకగా భూములు కేటాయించిన పలు సంస్థలు నిర్దేశిత సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఆ నిబంధనలనే సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మహానగరాలతో పోటీపడేలా 'మావిగన్'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నాడు విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అండ్ కో విష ప్రచారం చేయడంతో అది అమలు కాలేదు. దీంతో ప్లాన్ బీ కింద మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) 110 కిమీల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ వైఎస్ జగన్ చేసిన అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రెండు రైల్వే జంక్షన్లతో అన్ని మౌలికవసతులూ ఉన్న ఈ ప్రాంతానికి రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందే సత్తా ఉందని మేధావి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటువంటి మౌలిక వసతులూ లేని 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఎకరానికి రూ.రెండు కోట్లు చొప్పున రూ.రెండు లక్షల కోట్లు కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్ కోసం వ్యయం చేయడం కంటే అందులో పది శాతం వ్యయంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోటీ పడేలా ఈ ట్రైసిటీ అభివృద్ధి చెందుతుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రాంతాలు నగరాలుగా వేగంగా ఏవిధంగా ఎదిగాయో ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు.ప్లాన్–ఏపై విష ప్రచారంతో ప్లాన్–బీవైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని ప్రాంతం ఎలా ఉండాలన్న దానిపై సమగ్ర అధ్యయనం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచపటంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని తలంచారు. మౌలికసదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతి కంటే వేగంగా తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయి రాజధానిని రూపుదిద్దాలని భావించారు. అదే సమయంలో అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మూడు రాజధానుల ప్రణాళిక రూపొందించారు. ఈ నిర్ణయంపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కుతంత్రంతో తీవ్ర దుష్ప్రచారం చేశారు. ఎన్నికల్లో కుటిలత్వంతో గెలిచి మళ్లీ తన స్వలాభం, కేవలం 29 గ్రామాల పరిధిలో కొందరి ప్రయోజనాల కోసం అమరావతి రాగం అందుకుని మళ్లీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను మోసం చేసే మహాపాతకానికి పూనుకున్నారు. దీంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్లాన్–బీగా అన్ని వసతులతో ఇప్పటికే అభివృద్ధి చెందిన మూడు నగరాల సమాహారంతో అత్యంత వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ ‘మావిగన్’ ప్రతిపాదన చేశారు. ఇది సరైన సమయోచిత నిర్ణయమని ఆర్థికవేత్తలు స్వాగతిస్తున్నారు. వేగంగా పోర్టు సిటీలు అభివృద్ధిదేశంతో పాటు అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందిన నగరాల్లో పోర్టులే కీలకపాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో చెన్నై, కోల్కతా, ముంబై నగరాలు పోర్టుల ద్వారా వేగంగా అభివృద్ధి చెందిన విషయాన్ని ఆర్థికవేత్తలు గుర్తు చేస్తున్నారు. చైనాలో పోర్టు వలన షెన్జెన్ నగరం వేగంగా కీలక గ్రోత్ ఇంజిన్గా ఏ విధంగా ఎదిగిందో ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా పోర్టు ఉన్న విశాఖ నగరం కీలక ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ఇప్పుడు మావిగన్ను రాజధాని కారిడార్గా ప్రకటిస్తే అంతకంటే వేగంగా వృద్ధి చెందే సత్తా ఈ ప్రాంతానికి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి మచిలీపట్నం వద్ద రూ.5,155.77 కోట్లతో పోర్టు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో పారిశ్రామికనగరానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తున్నారు.ఇతర మౌలిక వసతులకు కొదవలేదుఇటు గలగల పారే కృష్ణా నదితోపాటు అటు పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటికే ఈ ప్రాంతం జలసిరులతో తులతూగుతోంది. విజయవాడలోని ఎన్టీటీపీఎస్, పోలవరంలోని 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా రాజధానికి కావాల్సినంత విద్యుత్ లభ్యత రానుంది. అదే ఎటువంటి మౌలిక వసతులూ లేని అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే ఏకంగా రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. మావిగన్ కారిడార్కు అందులో పదిశాతం ఖర్చు చేస్తే చాలు.. పదేళ్లలోనే అంతర్జాతీయ మహారాజధానిగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తున్నారు. నాలుగు కార్పొరేషన్లు– 60 లక్షల జనాభామావిగన్ నమూనాలో ఏకంగా నాలుగు కార్పొరేషన్లు , రెండు మున్సిపాల్టీలు ఉండటమే కాకుండా 60 లక్షలకుపైగా జనాభా ఉండటం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో 110 కిలోమీటర్ల మేర రెండు ఆరులైన్ల జాతీయ రహదారులు, విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, గుంటూరులోనూ రైల్వే జంక్షన్, అలాగే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం బాగా కలిసొచ్చే అంశమని, అన్ని ప్రాంతాలకు రైల్వే, రోడ్డు ఎయిర్ కనెక్టివిటీ ఉండడం వల్ల అదనంగా ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. మావిగన్తో అందరికీ మేలురాజధాని అభివృద్ధి విషయంలో ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అద్భుతంగా ఉంటుంది. ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రజలకు మంచి జరుగుతుంది. రాజధానిలో కొందరే భూములు కొనటం, అమ్మడం ద్వారా పేదలకు మేలు కానీ, ఉపాధి కానీ ఉండదు. – మునీర్ అహ్మద్ షేక్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్, గన్నవరం అత్యంత వాస్తవిక ఆలోచనమావిగన్ అనేది అత్యంత వాస్తవిక ఆలోచన. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక ఆచరణాత్మక పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మచిలీపట్నం – విజయవాడ– గుంటూరు మధ్య రాజధాని ఆలోచన అత్యద్భుతం. ఈ మూడు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తే.. కేవలం సీఎం చంద్రబాబు చెబుతున్న దాంట్లో కేవలం పది శాతం పెట్టుబడితో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ శంకరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్, అనంతపురం -
‘అప్పు’డే తెల్లారింది!
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల అమలు క్యాలెండర్ను పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏటా అప్పుల క్యాలెండర్ల విడుదలలో మాత్రం దూసుకుపోతోంది. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో క్రమం తప్పకుండా అప్పుల క్యాలెండర్ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఆర్థిక ఏడాది (2026–27)లో తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) చేయనున్న బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను విడుదల చేసింది. తొలి త్రైమాసికంలో చంద్రబాబు సర్కారు రూ.27,000 కోట్ల అప్పులు చేయాలని నిర్ణయించుకుంది. అంటే నెలకు రూ.9000 కోట్లు చొప్పున అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూటమి సర్కారు చేసే బడ్జెట్ అప్పుల క్యాలెండర్ను ఆర్బీఐ విడుదల చేసింది. సూపర్ సిక్స్, ఇతర హామీల ఊసేదీ? ఆర్బీఐ చేత అప్పుల క్యాలెండర్ను ప్రకటింపజేస్తున్న చంద్రబాబు సర్కారు సూపర్ సిక్స్తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఇతర హామీలు, పథకాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్ను మాత్రం ప్రకటించడం లేదు. ఎడాపెడా అప్పులు చేస్తున్నప్పటికీ.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలను ఏమాత్రం అమలు చేయడం లేదు. కొత్త ఆర్థిక ఏడాదిలో వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. 12 ఏళ్ల కాల వ్యవధిలో రూ.2,200 కోట్లు, 25 ఏళ్ల కాల వ్యవధిలో తీర్చేలా మరో రూ.2,200 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ నోటిఫై చేసింది. 2026–27 తొలి త్రైమాసికంలో అప్పుల క్యాలెండర్ ఇలా తేదీ అప్పు మొత్తం (రూ.కోట్లలో) ఏప్రిల్ 7 4,400 ఏప్రిల్ 21 4,600 మే 5 4,400 మే 19 4,600 జూన్ 2 4,400 జూన్ 16 4,600 మూడు నెలల్లో అప్పు రూ.27,000 కోట్లు బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు యూనియన్ బ్యాంక్ నుంచి టర్మ్ రుణం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక సీఎస్ విజయానంద్ దీంతో ఏపీపీఎఫ్సీఎల్ అప్పు రూ.13,610 కోట్లు సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట మరో రూ.2 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) నుంచి ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) రూ.2,000 కోట్ల టర్మ్ రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. రుణ వాయిదాలను సకాలంలో తీర్చేందుకు వీలుగా లెటర్ ఆఫ్ కంఫర్ట్ను కూడా జారీ చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుణ వ్యవధి మొత్తం కాలానికి ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. రుణ సంస్థకు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ప్రభుత్వ గ్యారంటీ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే యూబీఐతో పాటు వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి ఏపీపీఎఫ్సీఎల్ రూ.11,610 కోట్లు అప్పులు చేసింది. ఇప్పుడు చేసే రూ.2,000 కోట్లతో ఏపీపీఎఫ్సీఎల్ మొత్తం అప్పు రూ.13,610 కోట్లకు చేరనుంది. -
మెడికల్ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెర తీశారు. మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!రంగంలోకి ఆ ముగ్గురు..పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మెడికల్ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్ వేశారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.న్యాయ వివాదాలు..2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇచ్చారు.5న జనరల్బాడీ సమావేశం.. రూ.250 కోట్ల కార్పస్ ఫండ్పై ముఖ్యనేత కన్నుఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. -
‘వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’
తాడేపల్లి : తిరుమల పవిత్రత రోజురోజుకీ దెబ్బతింటోందని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీఆర్ నాయుడిని తొలగించాలంటూ 4న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఈ రోజు(శుక్రవారం, ఏప్రిల్ 3వ తేదీ) వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. రాజధానిపై మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది..‘రాజధాని అంశానికి సంబంధించి మా పార్టీకి స్పష్టమైన వైఖరి ఉంది. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు గ్రోత్ కారిడార్గా మెగా సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాన్-బీ ద్వారా తక్కువ ఖర్చుతో రియల్ క్యాపిటల్ సాధ్యం. అమరావతి అప్పులు రాష్ట్రంపై భారంగా మారుతున్నాయి. వైఎస్ జగన్ ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లాలి’ అని సజ్జల సూచించారు.ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి..ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సజ్జల. బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని, కొత్త ఓటర్ల నమోదు జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ‘ పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు పూర్తవుతోంది. 18 లక్షల క్రియాశీల సభ్యత్వం మా లక్ష్యం. ఇప్పటికే 13 లక్షల సభ్యుల డేటా అందింది. త్వరలో వారందరికీ ఐడీ కార్డులను పంపిణీ చేస్తాం. సోషల్ మీడియా ద్వారా గ్రామస్థాయిలో క్యాంపెయినింగ్ పెంచాలి’ అని పేర్కొన్నారు. -
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
అమరావతి టైం లైన్పై చేతులెత్తేసిన చంద్రబాబు
సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్లైన్పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. -
ఉప రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు
ఢిల్లీ: ఉప రాష్ట్రపతిని వైఎస్సార్సీపీ ఎంపీలు కలిశారు. సీపీ రాధాకృష్ణన్ను వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. నిన్న( ఏప్రిల్ 2, గురువారం) అమరావతి బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీకి తక్కువ సమయం కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు.పార్లమెంట్లో తమ గొంతు నొక్కడంపై ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడుగురు సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీకి ఐదు నిమిషాలు కేటాయించగా.. ఇద్దరు సభ్యులు ఉన్న టీడీపీకి ఏకంగా 20 నిమిషాల సమయం కేటాయించడం పట్ల వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. -
న్యాయం అడిగిన అబలపై నడిరోడ్డుపై దాడి
సాక్షి,అమరావతి/రైల్వే కోడూరు/ఓబులవారిపల్లె /విశాఖపట్నం: తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై స్థానిక జనసేన పార్టీ వర్గీయులు గురువారం పట్టణంలో నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. రైల్వే కోడూరుకు చెందిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర అనుచరులతో కలిసి ఈ దాష్టీకానికి తెగబడ్డారు. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. అయినా తాను భయపడేది లేదని న్యాయం కోసం పోరాడతానని బాధితురాలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. అసలేం జరిగిందంటే.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు గురువారం సాయంత్రం తన అనుచరుడితో కలసి ఇంట్లో అవసరాల కోసం రైల్వేకోడూరు గాంధీ విగ్రహం సమీపంలో ఉండగా అదే సమయంలో అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర వాహనాలు అక్కడకి వచ్చాయి. శ్రీధర్ వచ్చాడని భావించిన ఆమె కారులోకి తొంగి చూసే యత్నం చేశారు. అది గమనించిన తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు ఆమెపైనా, అనుచరుడిపైనా రోడ్డుపైనే ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కులం పేరుతో దూషిస్తూ పిడిగుద్దులు కురిపించారు. విచక్షణారహితంగా రక్తమొచ్చేలా కొట్టారు. తీవ్రగాయాలైనప్పటికీ బాధితురాలు రోడ్డుపై బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆమె రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్కు చేరుకుని తాతంశెట్టి నాగేంద్ర, జనసేన చోటా నేతలపై ఫిర్యాదు చేశారు. బాబు ఏం చేస్తున్నారు? : వరుదు కళ్యాణి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన నేతల దాడిని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఖండించారు. ఓ మహిళకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గురువారం విశాఖ పెదవాల్తేరులోని తన క్యాంప్ కార్యాలయంలో కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మహిళా హోంమంత్రి అనితకు ఈ దాడులు కనపడవా.. అని ప్రశ్నించారు. నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవపై చర్యలు తీసుకోండిఅంతకు ముందు అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని అతని బాధితురాలు గురువారం రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ అధికార కార్యక్రమాల్లో పాల్గొనవద్దని పవన్ కళ్యాణ్ ఆదేశించినా అరవ పాల్గొంటున్నారని, ఇది పవన్ను అవమానించడమేనని పేర్కొన్నారు. దాడి అనంతరం బాధితురాలు మాట్లాడుతూ బాబుకు ఆకలేస్తుందంటే వాడికేమైనా తీసుకెళ్దామని టోల్గేట్ వద్దకు అనుచరుడితో కలిసి వెళ్లానని, తాతంశెట్టి, ఆయన అనుచరులు దాడి చేశారని వివరించారు. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. -
సెలవులకు ముందు అరెస్ట్ పరిపాటిగా మారింది
సాక్షి, అమరావతి/టాస్క్ ఫోర్స్: తిరుపతిలో కలకలం రేపిన వైఎస్సార్సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్టు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులను సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ, ఈ విధానాన్ని ‘‘హైడ్ అండ్ సీక్’’ ఆటతో పోలి్చంది. ఇది ఒక్క కేసుకు పరిమితం కాకుండా అనేక కేసుల్లో జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు తేదీని దాచిపెట్టి నిన్ననే అరెస్టు చేశాం.. అంటారా? అంటూ తంబిరెడ్డి అరెస్ట్ విషయంలో ప్రశి్నంచింది. ఇది వ్యక్తిగత హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే.. కేసులు పెట్టి అరెస్ట్లు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పోలీసులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు, 60 ఏళ్ళ వృద్ధుడు తంబి రెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి , జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం.. ఆయన అరెస్ట్పై పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తంబిరెడ్డి విడుదల.. పోలీసులకే మంచిది ‘తంబిరెడ్డిని విడుదల చేయాలని లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడం లేదు. మౌఖికంగా ఈ విషయాన్ని చెబుతున్నాం. తంబిరెడ్డిని విడుదల చేయడం పోలీసులకే మంచిది. ఏం జరిగిందన్న దానిపై చాలా స్పష్టత ఉంది. ఇలాంటి విషయాల్లో మొండిగా వెళితే ఇబ్బంది పడేది పోలీసులే. పిటిషనర్ వాదనలు తన తండ్రి తంబిరెడ్డిని గత నెల 31న గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లారని , ఇప్పటి వరకు ఆయన జాడ తెలియలేదని, ఆయనను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నితిన్ రెడ్డి హైకోర్టులో అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటేష్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ, ‘పోలీసులు తంబిరెడ్డి ని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై తాము తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. హైకోర్టులో తాము ఈ పిటిషన్ దాఖలు చేసిన తరువాత గుంటూరు అరండల్ పేట పోలీసులు ఫోన్ చేసి తంబి రెడ్డిని సోషల్ మీడియాలో పోస్టులపై అరెస్ట్ చేశామని పిటిషనర్ నితిన్ రెడ్డికి చెప్పారు. సోషల్ మీడియా కేసుల్లో 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షే ఉన్నప్పటికీ, పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు’ అని వివరించారు. వివరాలను తెలపడానికి సమయం ఇవ్వాలని పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి.విష్ణుతేజ చేసిన విజ్ఞప్తి మేరకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశించినా మారని పోలీసుల తీరు తంబిరెడ్డి అరెస్టును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టి, విడుదల చేయాలని చెప్పినా.. గుంటూరు పోలీసుల తీరు మారలేదు. గురువారం రాత్రి గుంటూరు జిల్లా జడ్జి ముందు ఆయనను హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కేసు వివరాలను పరిశీలించి, రిమాండ్ను తిరస్కరించారు. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తన వద్దకు నిందితుడిని తీసుకురావడం పట్ల సదరు న్యాయమూర్తి పోలీసులను మందలించినట్టు సమాచారం. -
ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదని 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమైంది. సీఆర్డీఏ అధికారులు తనకున్న కాస్త భూమిని లాక్కుని జీవిత చరమాంకంలో అధోగతి పాల్జేస్తున్నారని గోడువెళ్లబోసుకుంది. మతిస్థిమితం లేని మనుమరాలితో అష్టకష్టాలు పడుతుంటే.. తన భూమిని వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని వాపోయింది. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను వెళ్లబోసుకుంది. శేషగిరమ్మ దీనగాథను పరికిస్తే..చంద్రబాబు భూ దాహం 90 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డున పడేస్తే.. బలవంతపు భూదోపిడీ ఆమె భర్తను మృత్యు ఒడిలోకి నెట్టేసింది. నెల్లూరి శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తమకున్న ఐదు సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. 2015లో సీఆర్డీఏ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని.. భూమికి భూమి ఇచ్చి, ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరి రావు (100ఏళ్లు)తో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు.రెండేళ్ల తర్వాత శేషగిరమ్మ బ్యాంకు ఖాతాలో అత్యంత హీనంగా రూ.2,500 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త శేషగిరిరావు తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమకు కౌలు వద్దని, భూమిని వెనక్కి ఇవ్వాలని సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగి అలిసిపోయాడు. కేన్సర్తో బాధపడుతున్న అతడు మృతి చెందారు. కొంతకాలానికే కుమార్తె సైతం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. అప్పటినుంచి మతిస్థిమితం లేని 40 ఏళ్ల మనుమరాలితో బిక్కబిక్కుమంటూ శేషగిరమ్మ ఒంటరి జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ దుర్నీతిపై కోర్టుకు వెళ్లిన వృద్ధురాలు తన భూమి తిరిగి ఇప్పించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసూ్తనే తనకు సాయం చేయాలని వైఎస్ జగన్ను కలుసుకుని గోడు వెళ్లబోసుకుంది. గతేడాది అక్టోబర్లో తన స్థలంలోని ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా.. ఫైర్ అధికారులు సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి, ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్నారైలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని.. తన భూమి తిరిగి వస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువలు కలిగిన వృద్ధురాలి నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని, వైఎస్సార్సీపీ తరఫున పూర్తిగా అండగా నిలుస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఏపీ నూతన బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించండి∙ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు వైఎస్ జగన్ సూచన∙కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని వైఎస్ జగన్ అభినందించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి, నూతన బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి(హైకోర్టు), రోళ్ల మాధవి(హైకోర్టు), కొవ్వూరి వెంకట్రావిురెడ్డి(హైకోర్టు), ఆలూరు రామిరెడ్డి(అనంతపురం), వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి(గుంటూరు), కృష్ణారెడ్డి బి.వి (ఏలూరు) పాల్గొన్నారు. -
అమరావతి బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది. లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు... బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్లో జేడీయూ నితీశ్కుమార్కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
ఎల్ఓసీ పేరుతో సజ్జల భార్గవ్రెడ్డిని ఎందుకు వేధిస్తున్నారు?
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం పూర్వ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై హైకోర్టు నిప్పులు చెరిగింది. ఎల్ఓసీ పేరుతో పిటిషనర్ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించింది. కేసుల పేరుతో పౌరులను అనవసరంగా వేధింపులకు గురి చేస్తుంటే కోర్టులు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేసింది. బాధితులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు అన్న విషయాలతో సంబంధం లేకుండా తాము ప్రాథమిక హక్కులను కాపాడుతామని స్పష్టం చేసింది. ధిక్కార స్వరాలను సహించేదే లేదు.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ అదనపు డీజీ, పలు జిల్లాల ఎస్పీల ప్రోద్బలంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు జారీ చేసిన ఎల్ఓసీని చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్రెడ్డి గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు, ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న డీజీపీ, సీఐడీ సహా పలు జిల్లాల ఎస్పీలను కౌంటర్లు దాఖలు చేయాలని గత నెల 18వ తేదీన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్.. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ ఎస్పీ మినహా మరెవరూ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఓసీ కోరింది ఎవరు? ఎందుకు కోరారు? ఏ కేసులో కోరారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తే, ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయకుండా ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఆక్షేపించారు. డీజీపీనే కౌంటర్ వేయనప్పుడు.. ఎస్పీలు ఎలా వేస్తారు? అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారంటూ జస్టిస్ దేవానంద్ మండిపడ్డారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు వెనుకాడటం లేదన్నారు. డీజీపీనే కౌంటర్ వేయలేదని, అలాంటప్పుడు ఎస్పీలు కౌంటర్లు వేస్తారని ఎలా ఆశించగలమని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీజీపీతో సహా అందరినీ కోర్టుకు పిలిస్తేనే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయన్నారు. సీఐడీ ఎస్పీ ప్రతివాదిగా ఉంటే, సీఐడీ ఇన్స్పెక్టర్ కౌంటర్లు దాఖలు చేయడాన్ని సైతం న్యాయమూర్తి తీవ్రంగా తప్పుపట్టారు. భార్గవ్రెడ్డికి ఎల్ఓసీ జారీ చేసిన వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను, రాష్ట్ర డీజీపీ, సీఐడీ ఎస్పీ, విజయవాడ, పల్నాడు, వైఎస్సార్ కడప, తూర్పు గోదావరి, శ్రీసత్యసాయి, గుంటూరు, అన్నమయ్య, ఏలూరు, బాపట్ల జిల్లాల ఎస్పీలను ఆదేశిస్తూ.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. తదుపరి విచారణకు కౌంటర్లు దాఖలు చేయకుంటే, డీజీపీతో సహా ఎస్పీలందరూ కోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతూ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. పరస్పర విరుద్ధ వైఖరులపై అసంతృప్తి విచారణ సమయంలో భార్గవ్రెడ్డి తరఫు న్యాయవాది యల్లారెడ్డి స్పందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు చేశారన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్లో భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను తాము కోరలేదని పేర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, అలా అయితే ఎవరు కోరితే ఎల్ఓసీ జారీ చేశారని ఇమ్మిగ్రేషన్ అధికారుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయను ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరితేనే భార్గవ్రెడ్డిపై ఎల్ఓసీ జారీ చేశామని అదనపు సొలిసిటర్ జనరల్ సమాధానం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిన్నింటినీ కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచుతామని చెప్పారు. అయితే ఎల్ఓసీ జారీ చేయాలని తామెవ్వరినీ కోరలేదని ఎస్పీ తరఫు న్యాయవాది, అలాగే సీఐడీ అదనపు డీజీ తరఫు న్యాయవాది పాణిని సోమయాజి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరస్పర విరుద్ధ వైఖరులపై జస్టిస్ దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు ఇలాంటి నాటకాలు ఆడతారనే అందరి కౌంటర్లకు ఆదేశించామని పేర్కొన్నారు. అధికారుల ధిక్కార స్వరానికి ముగింపు పలికే సమయం వచి్చందన్న న్యాయమూర్తి, తద్వారా న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడుతామని స్పష్టం చేశారు. -
అందరి నోట 'మావిగన్ మాటే'
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు(మావిగన్) ఆలోచన రాష్ట్రమంతా చర్చకు దారితీసింది. ఇది అత్యంత వాస్తవికమైన ఆలోచన అని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఒక ఆచరణాత్మకమైన పద్ధతిలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతోనే.. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను నాడు రాజధానిగా ప్రతిపాదించానని చాలా స్పష్టంగా, అరమరికలు లేకుండా వైఎస్ జగన్ వివరించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ను రాజధాని ప్రాంతంగా ప్రకటించి.. చంద్రబాబు చెబుతున్న దానిలో కేవలం పది శాతం పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేస్తే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లను తలదన్నే రీతిలో స్వల్పకాలంలోనే మహానగరంగా అభివృద్ధి చెంది.. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదన ఆచరణాత్మకమైనదని, రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి భారం లేనిదంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. రాజధాని సంగతి దేవుడెరుగు.. 12 ఏళ్లలో కనీసం రోడ్లయినా వేయలేని పరిస్థితులలో రోడ్లు, కరెంటు, నీటివసతి, డ్రైనేజీ లకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయడమంటే సాధ్యమయ్యే పనేనా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 12 ఏళ్లుగా కనీసం రోడ్లు వేయలేకపోవడం, ప్లాట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ జరిగే పనేనా అని జనం చర్చించుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 12 ఏళ్లవుతున్నా ఇప్పటికీ రోడ్లు కూడా లేవు. మరో 20 ఏళ్లలో కూడా పూర్తి చేసే పరిస్థితులు లేవు. జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలను కలుపుతూ హైవే ఉంది. ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. కనుక రాజధాని కోసం రూ. 2 లక్షల కోట్ల అప్పులు చేయనక్కరలేదని ఆర్థికవేత్తలంటున్నారు. అందులో 10శాతం చాలు ఈ ప్రాంతాన్ని మహానగరంలా అభివృద్ధి చేయడానికి అని వారు పేర్కొంటున్నారు. అందువల్ల జగన్ ప్రస్తావించిన ప్లాన్ బీ మంచిదే కదా అని ఆర్థికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవడం లేదని, కేంద్రం నుంచి వచ్చేది అప్పులు, వడ్డీలకే చాలడం లేదని చంద్రబాబే చెబుతున్న నేపథ్యంలో రాజధానికి రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఎప్పటికి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలు చేయడమంటే భ్రమల్లో ముంచడమే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంక్షేమం ఆగిపోయి ప్రజలు విలవిల్లాడుతున్నారు..సూ్కళ్లు, హాస్పిటల్స్ను పట్టించుకునే నాథుడే లేడు. పథకాలన్నీ ఆగిపోయాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణసాధ్యం కాని ఆలోచనలు చేయడం సబబేనా! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది బూటకమే..రాజధాని అమరావతికి తొలి విడత రైతుల నుంచి సమీకరించిన భూమి.. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తం 53,748 ఎకరాలని.. వాటిలో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దానితో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచే సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వచ్చారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వల్లె వేస్తున్నారు. ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవని.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో రైతుల నుంచి 44,676.64 ఎకరాలతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మరో 50 వేల ఎకరాలు సమీకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే 20,494.57 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన, తేవాలని నిర్ణయించిన అప్పులే రూ.47,387 కోట్లు. రాజధానిలో నివాస స్థలం చదరపు గజం రూ.50 వేల చొప్పున పలుకుతోందని సీఆర్డీఏ చెబుతోంది. కానీ.. రాజధాని ప్రధాన ప్రాంతం(కోర్ కేపిటల్ ఏరియా)లో అంటే రాజధాని నడిబొడ్డున.. వెలగపూడిలో సచివాలయం సమీపంలో సర్వే నెంబరు 111, 112, 113, 122, 150, 152, 239లలోని 5.16 ఎకరాలను(25 వేల చదరపు గజాలు) కంచర్ల సాంబశివరావు, కంచర్ల శాంతికిరణ్, కంచర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసి 2025, ఏప్రిల్ 2న మంగళగిరి సబ్ రిజిష్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులోనే నివాసం నిర్మిస్తున్నారు. ఈలెక్కన గజం ధర రూ.7,500 చొప్పున కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంటే ఎకరం ధర రూ.3.63 కోట్లే. దీన్ని బట్టి చూస్తే.. లక్ష ఎకరాల్లో రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఖర్చు చేసే రూ.2 లక్షల కోట్లను వడ్డీతో కలిసి చెల్లించాలంటే ఎన్ని వేల ఎకరాలను విక్రయించాల్సి ఉంటుంది..మహానగరంగా అభివృద్ధి చెందడానికి అన్ని విధాలా అనుకూలం..మచిలీపట్నం వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం నౌకాశ్రయం(పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడ ఆరు వరుసల జాతీయ రహదారి.. విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారి ఉంది. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విజయవాడ చుట్టుపక్కల 20 లక్షలు.. గుంటూరు చుట్టుపక్కల 10 లక్షలు.. మచిలీపట్నం చుట్టుపక్కల 3 నుంచి 4 లక్షల మంది ప్రజలు ఇప్పటికే నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా నదీ జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం. ఇది ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి అత్యంత అనుకూలమైన ప్రాంతమని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పడటం ఖాయమంటున్నారు. చెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని, వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్కు ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున పదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.. (చంద్రబాబు సమీకరించిన భూముల్లో సదుపాయాల కోసం అంచనా వేసిన రూ. 2 లక్షల కోట్లలో ఇది కేవలం 10శాతమే) ఆ పదేళ్లలోనే మహానగరంగా మారుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే ఏళ్ల తరబడి వేచిచూడక్కరలేకుండా.. ఈ ఫలాలు తమకు తక్షణం అందుతాయని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు పేర్కొంటున్నారు.స్కామ్ల కోసం భ్రమలు కల్పిస్తారా?రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణాల కాంట్రాక్టు విలువను పరిశీలిస్తే చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకూ చెల్లిస్తున్నారు. పైగా ఇసుక ఉచితం. కూతవేటు దూరంలో పుష్కలంగా ఇసుక దొరుకుతుంది. కానీ.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇసుక కొనుగోలు చేసి.. జీఎస్టీ వంటి పన్నులు చెల్లిస్తూ ఫైవ్ స్టార్ సదుపాయాలతో.. ఇటాలియన్ మార్బుల్స్తో చదరపు అడుగు కేవలం రూ.4,500కే నిర్మిస్తున్నారని ఇంజినీర్లు గుర్తు చేస్తున్నారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ఆరు వరసల జాతీయ రహదారి కిమీకు సగటున రూ.20 కోట్లకు నిర్మిస్తుంటే.. అమరావతిలో అదే రోడ్లకు రూ.53 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో అమరావతి నిర్మాణం సమీప భవిష్యత్తులో ఆచరణ సాధ్యం కాదని తెలిసినా.. ప్రజలకు భ్రమలు కల్పిస్తూ.. స్కామ్ల కోసం అమరావతికి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధి చెందడానికే వందేళ్ల సమయం పడుతుందని చంద్రబాబు సర్కారే చెప్పడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తుండటం గమనార్హం.మావిగన్ ప్రతిపాదన ఓ అద్భుతంరాష్ట్ర రాజధాని ప్రాంతం, దాని అభివృద్ధి విషయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన సూచన అద్భుతం. రాష్ట్ర రాజధాని ప్రాంతం అభివృద్ధిపై కీలక ప్రభావం చూపుతుంది. కనీస వనరులు లేని ప్రాంతంలో వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి రాజధాని అభివృద్ధి చేయటం సాధ్యం కాని పని. అదే మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాన్ని ప్రత్యామ్నాయ రాజధాని ప్రాంతంగా ఆలోచిస్తే జాతీయ రహదారికి రెండు వైపులా విస్తరించి ఉన్న ప్రాంతాలు సమృద్ధిగా అభివృద్ధి సాధిస్తాయి. రియల్ వ్యాపారం పుంజుకుంటుంది. పోర్టు ద్వారా నిత్యం వస్తు రవాణా సాగుతుంది. ఈప్రాంతానికి తగిన ప్రాధాన్యం దక్కుతుంది. – నర్రా రమేష్బాబు, రియల్ వ్యాపారి, కంకిపాడు, కృష్ణాజిల్లాతీర ప్రాంత రాజధానులే మహానగరాలుగా ఎదిగాయిసముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న రాజధాని నగరాలే మెట్రో నగరాలుగా అభివద్ధి చెందాయి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన విధంగా పలు జాతీయ రహదారుల కలయికతో ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ మావిగన్ రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మచిలీపట్నంలో ఉన్న నౌకాశ్రయం, విజయవాడ విమానాశ్రయం జాతీయ రహదారులు ఈ ప్రాంతం పెద్ద నగరాలతో పోటీపడేలా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. జగన్ ముందుచూపుతో ప్రకటించిన ఈ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోకుండా సానుకూలంగా స్పందించి అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. – బందెల డేవిడ్ థామస్ నోబుల్, రైల్వే సలహా మండలి సభ్యుడు, మచిలీటప్నంమావిగన్తో సమన్యాయంరాజధాని లేని రాష్ట్రానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ సమన్యాయం చేస్తుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా ఉన్న గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలను కలుపుతూ రాజధానిగా ప్రకటించడం వలన ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా, అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం లేకుండా పరిపాలన సాగించవచ్చు. రాష్ట్రానికి మధ్య ప్రాంతం కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. – జి.శాంతమూర్తి, ఇంటిలెక్చు్యవల్ ఫోరం వ్యవస్థాపకుడు, గుంటూరురాష్ట్రానికి సరైన రాజధాని మావిగన్మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ జాతీయ రహదారితో పాటు అన్ని రకాల మౌలిక వసతులు ఉండటంతో అన్ని ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రాజధానికి భూములు ఇచ్చి, తీవ్ర నిర్వేదంతో ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చడంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం దురదృష్టకరం. ప్రతిపాదిత మావిగన్ను రాజధానిగా విస్తరించేందుకు లక్షల కోట్ల నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆగ్జిలరీ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు -
ఆరోగ్యశ్రీ క్షో‘బిల్లు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు రెండో రోజూ స్తంభించాయి. చంద్రబాబు సర్కారు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి నిరసన తెలిపాయి. ఉచిత వైద్య సేవలు అందించడం లేదని రోగులను ఆస్పత్రుల నుంచి వెనక్కు పంపేశాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని, ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే గానీ ఉచిత సేవలు పునరుద్ధరించలేమని ఆస్పత్రుల ముందు యజమానులు పోస్టర్లు ప్రదర్శించారు. ఆస్పత్రుల మూకుమ్మడి సమ్మె నేపథ్యంలో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల రోగ పీడితులు తీవ్ర అవస్థలు పడ్డారు. మొక్కుబడి చర్చలతో సరినెట్వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి సమ్మెకు పిలవడంతో తొలి రోజు హడావుడిగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్(ఆశ) ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు కేవలం మొక్కుబడిగా నిర్వహించినవేనని రుజువైంది. సమ్మెను వెంటనే విరమింపజేసి, ప్రజలు అవస్థలు పడకుండా సేవలు పునరుద్ధరించేలా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ‘రూ. మూడు వేల కోట్ల బకాయిల్లో రూ.వెయ్యి కోట్లు రెండు వారాల్లో విడుదల చేస్తాం. ఈ అరకొర నిధుల విడుదలపైనా వచ్చే సోమవారం స్పష్టత ఇస్తాం.’ అంటూ ప్రభుత్వం బీద అరుపులు పలికింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం చేతిలో పలు సందర్భాల్లో మోసపోయిన నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు నిధుల విడుదలపై స్పష్టత వచ్చాకే సమ్మె విరమిస్తామని తెగేసి చెప్పారు. యథావిధిగా రెండో రోజు సమ్మె కొనసాగించారు. ఈ క్రమంలో ఆస్పత్రుల మొర ఆలకించి పెండింగ్ నిధులు విడుదల చేసి, సేవలు పునరుద్ధరించేలా కనీసం చంద్రబాబు సర్కార్ చొరవ చూపలేదు. మురిగిపోయిన దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులు2025–26 ఆర్థిక సంవత్సరం మంగళవారంతో ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చెల్లింపుల కోసం దాదాపు రూ. వెయ్యి కోట్ల బిల్లులను గతంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారం ముందు ప్రభుత్వానికి ఆశ సమ్మె నోటీసు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సీఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్న రూ.వెయ్యి కోట్ల బిల్లులను చెల్లించి ఉంటే ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావు. సమ్మె నోటీసు ఇచ్చి సేవలు ఆపేస్తామని హెచ్చరించినా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.వెయ్యి కోట్ల నిధులు ముగిపోయినట్టేనని వెల్లడవుతోంది. -
రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, రికార్డు స్థాయిలో మద్యం వినియోగం జరుగుతోంది. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.గత ఏడాదిలో బీర్ వినియోగం 70.29 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ. 31,237 కోట్లకు చేరాయి. మొత్తంగా ప్రభుత్వం 414 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. గతంలో 362 లక్షల కేసులు ఉండగా, ఇప్పుడు 414 లక్షలకు పెరిగింది.బీర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి, మొత్తం 232 లక్షల కేసుల బీర్ను ప్రజలు వినియోగించారు.ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
వైఎస్ జగన్ను కలిసిన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు
తాడేపల్లి: నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఎన్నికపై వైఎస్ జగన్ నాయకత్వం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదుల సంక్షేమం, న్యాయ వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.వైఎస్ జగన్ నూతనంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని, న్యాయ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించడంలో బార్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. -
వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా వైఎస్ జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు.కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
సాక్షి, తాడేపల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశం ఇచ్చారు. ‘‘మానవాళి కోసం జీసస్ మహాత్యాగం చేశారు. కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు.. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టాలు....మనుషులపై ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, నిస్వార్థ జీవనం.. ఇవన్నీ తన జీవితం, బోధనల ద్వారా ఈ లోకానికి జీసస్ ఇచ్చిన సందేశాలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Christ’s crucifixion stands as the ultimate example of love, compassion, and sacrifice. On this Good Friday, let us pause to reflect, look within, and renew our values, guided by His simple yet profound teaching: to love one another as we love ourselves.#GoodFriday— YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2026వైఎస్ జగన్ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలువైఎస్ జగన్ను క్రైస్తవ మత పెద్దలు కలిశారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా జగన్కు ఆశీర్వాదాలు ఇచ్చారు. మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుని ఆశీస్సులు ఉండాలంటూ ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు, బొల్లవరపు జాన్ వెస్లీ, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ సెల్ ప్రెసిడెంట్, ఆర్చ్ బిషప్ ఎన్జెఎస్డి రాజు -ఇండియన్ క్రిస్టియన్ మిషన్, బిషప్ సంజీవరావు - బైబిల్ మిషన్, బిషప్ సైమన్ సీజర్ - మెట్రోపాలిటన్ చర్చెస్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
‘అసెంబ్లీలో చంద్రబాబు తుగ్లక్ తీర్మానం చేశారు’
హైదరాబాద్: అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో తుగ్లక్ తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతిభ్రమించే అమరావతి రాజధాని బిల్లును శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టారని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 2వ తేదీ) హైదరాబాద్లోని ప్రెస్క్లబ్ నుంచి మీడియాతో మాట్లాడారు ఎస్వీ సతీష్రెడ్డి. ‘అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు. అమరావతి, పోలవరం పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు. అమరావతిపై మండలిలో చంద్రబాబు ఎందుకు తీర్మానం పెట్టలేదో చెప్పాలి. అమరావతిపై చంద్రబాబు ఎందుకు హైప్ చూపిస్తున్నారో చెప్పాలి. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. లక్ష ఎకరాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది.అమరావతిలో సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగులు ఏం అవసరం ఉంది. తెలంగాణ సచివాలయం కట్టడానికి రూ. 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కమీషన్ల కోసమే చంద్రబాబు అమరావతిలో పనులు చేయిస్తున్నారు. అమరావతి, పోలవరంను చంద్రబాబు, లోకేష్ ఏటీఎంల వాడుతున్నారని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 11 సంవత్సరాల్లో అమరావతి నుంచి ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలి. చంద్రబాబుకు దమ్ము ధైర్మం ఉంటే ఆల్ పార్టీ సమావేశం పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు..అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అక్కడ జరుగుతున్న దోపిడీ, అవినీతికే తాము వ్యతిరేకమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు సతీష్రెడ్డి. ‘చంద్రబాబు పిలుస్తున్న టెండర్లలో పారదర్శకత లేదు. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తే చూస్తూ ఊరుకోం. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు నివాసం ఉండటం లేదో చెప్పాలి?, అమరావతిలో చంద్రబాబు చేసే దోపిడీకి వైఎస్సార్సీపీ సపోర్ట్ చేయదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన మావిగన్(MAVIGUN)పై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. -
‘వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్రెడ్డి వివరించారు.‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు...వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది...అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్రెడ్డి దుయ్యబట్టారు. -
రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన
సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రస్తావించింది. రాజ్యసభ జీరో అవర్లో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. 33 ఏళ్ల సర్వీస్కే కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రత ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా ఉద్యోగులు నాలుగేళ్ల ముందుగానే సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారని సుభాష్ చంద్రబోస్ వివరించారు.‘‘ఇప్పటికే పే రివిజన్ కమిషన్ బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టారు. డీఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేలకోట్ల రూపాయలు చెల్లించడం లేదు. పెన్షన్ సెటిల్మెంట్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లపాటు వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అలవికాని సర్వే టార్గెట్లు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు’’ అని సుభాష్ చంద్రబోస్ తెలిపారు.‘‘గత వైఎస్సార్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 కు పెంచాం. పీఆర్సీని అమలు చేశాం. డీఏ పెంచి బకాయిలను క్లియర్ చేశాం. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అన్ని రకాల సహకారం అందించాం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్స్ అమలయేలా చర్యలు తీసుకోవాలి’’ అని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. -
ఆగిన ‘ఆరోగ్యశ్రీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీ ఆర్వైద్యసేవలు)పథకం కింద ఉచిత వైద్య సేవలను పూర్తిగా నిలిపివేశాయి. చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. ఆరోగ్యశ్రీ కార్డులతో ఉచిత చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లిన రోగులకు డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని యాజమాన్యాలు తేల్చి చెప్పేస్తున్నాయి. దీంతో తొలి రోజే నిరుపేద, మధ్య తరగతి అనారోగ్య బాధితులు తీవ్ర అవస్థలు పడ్డారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో గాయపడిన, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు చేసేదేమీ లేక డబ్బులు కట్టి ఆస్పత్రుల్లో చేరారు. గత్యంతరం లేకనే... ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో గత్యంతరం లేకనే సమ్మె చేస్తున్నామని యాజమాన్యాలు ఆస్పత్రుల ముందు పోస్టర్లను ఏర్పాటు చేశాయి. ఆస్పత్రులు దివాళా తీయకుండా..రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి.ఇంకా మోసపోలేం... ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో బుధవారం ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ఆశా) ప్రతినిధులతో మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ భేటీ అయ్యారు. సమ్మె విరమించి సేవలు పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వం తరఫున సౌరభ్గౌర్ చేసిన ప్రతిపాదనను ఆశా ప్రతినిధులు తిరస్కరించారు. దీంతో ‘రెండు వారాల్లో రూ.వెయ్యి కోట్లు, అనంతరం మూడు నెలల్లో మరో రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తాం. కొత్త బీమా విధానం అమలును వాయిదా వేసి, ప్యాకేజీ ధరలు, ఇతర అంశాలపై ‘ఆశా’ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సౌరభ్ గౌర్ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ‘ఇప్పటికే ఈ ప్రభుత్వం అనేక హామీలిచ్చి దగా చేసింది. చాలాసార్లు మోసపోయాం. ఇక మోసపోలేం..’ అని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది. గతేడాది సమ్మె చేసినప్పుడు డిసెంబర్లోగా బకాయిలన్నీ తీర్చేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వంపై నిప్పులు చెరిగినట్టు సమాచారం. ‘ఆశా’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘అధికారురులు నోటి మాటల ద్వారా ఇచ్చిన హామీలను నమ్మి సమ్మె విరమించబోం. ప్రభుత్వం గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కావాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ప్రభుత్వ ప్రతిపాదనలపై బుధవారం రాత్రి ఆశా సర్వసభ్య సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ప్రతిపానలపై విముఖ వ్యక్తం చేస్తూ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. రూ.1,000 కోట్లు బిల్లులు విడుదల చేసే వరకు సమ్మె కొనసాగించాలని తీర్మానించారు. -
భ్రమలు కల్పిస్తూ.. రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నావ్
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ (MAVIGUN) అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా? ⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు. ⇒ కేవలం జగన్ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!⇒ వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్ 2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?⇒ కేపిటల్గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్అండ్టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్సీసీ. ఇప్పుడూ వాళ్లే.⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఎస్ఎఫ్టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్ఎఫ్టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్ఎఫ్టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్ఎఫ్టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్ను దాటేశాం.. కేసీఆర్ నంబర్కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి. -
బాబు హయాంలో లక్షన్నర మంది విద్యార్థుల డ్రాపౌట్లు..!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుందని కేంద్రం వెల్లడించింది. చంద్రబాబు సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో లక్షన్నర విద్యార్థులు డ్రాపౌట్లు అయినట్ల తెలిపింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమాధానం ఇచ్చారు.ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని.. 12 తరగతి వరుకు విద్యార్థుల గణాంకాలు కేంద్రం వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 36,43,083 విద్యార్థులు కాగా.. 2025-26 విద్యా సంవత్సరంలో 34,93,449కి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఏడాది వ్యవధిలో 1,49,634 విద్యార్థులు స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు.గవర్నమెంట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తొలగించడం, సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు, విద్యావ్యవస్థను సరిగా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు గుడ్ బై చెబుతున్నారు. -
లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
అమరావతిపై లోక్సభలో ఎంపీ ధర్మేంద్ర కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని లోక్సభలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ అన్నారు. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ధరేంద్ర.. బిహార్ను మోసం చేసినట్టు ఏపీని మోసం చేయకండి అంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తే నిధుల కోసం కేంద్రం ముందు సాగిలపడక్కర్లేదంటూ వ్యాఖ్యానించారు.ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు: ఎంపీ అర్వింద్ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరింది. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదు’’ అంటూ ఆయన ప్రశ్నించారు. -
చంద్రబాబుకు ఆచరణాత్మక ధోరణి లేదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (ఏప్రిల్ 1) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అవినీతిని ఆయన ఎండగట్టారు. తాము అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్గా మారిందని ఆరోపించారు. చంద్రబాబు కేవలం తన స్కాముల కోసం భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబులో ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికాలిటీ అనేది కనిపించదని.. అది ఉండి ఉంటే, ఇప్పటికే రాజధాని అనేది పూర్తయ్యేదన్నారు. రాజధానిలో చంద్రబాబు దోపిడీ మొత్తం బయటకు వస్తుందని, ప్రతి పనిలో ఎంత మెక్కిందీ కూడా బహిర్గతం అవుతుందన్నారు. వైఎస్ జగన్ మీడియా సమావేశంలోని హైలైట్స్ ఇవే..ప్రశ్నించకూడదట, అడగకూడదట..అసెంబ్లీ, హైకోర్టు భవనాల్లోనూ చంద్రబాబు హైలెవల్ కరప్షన్అమరావతిలో రోడ్లైనా, మురుగునీటి కాల్వలైనా, సీవరేజీ ప్లాంట్లైనా.. కొండవాటి వరద మళ్లింపు పనైనా ఇలా ఏది చూసినా అవినీతేకేవలం సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్లకోసమే రూ.401 కోట్లు పెడుతున్నారుఫ్లైఓవర్ కోసమే కిలోమీటర్కు రూ.170 కోట్లు పెడుతున్నారుమా హయాంలో విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కి.మీ.రూ.35 కోట్లు పెట్టారుమిగిలిపోయిన సిక్స్ లేన్ రోడ్డుకు అమరావతిలో రూ.53 కోట్లు పెడుతున్నారునేషనల్ హైవేల్లో సిక్స్ లేన్ కోసం సగటు ఖర్చు రూ.20 కోట్లు మాత్రమేఈ దోపిడీని మనం ప్రశ్నించకూడదట, అడగకూడదట అడిగితే ఎదురుదాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడుఅమరావతికి వ్యతిరేకం అని ఎదురుదాడి చేస్తున్నారు ఇక మంచి ఎలా జరుగుతుంది? చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మోసాలుగా మిగిలిపోయాయి ఇక చంద్రబాబు లక్ష ఎకరాల అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎప్పుడు పెట్టగలుగుతాడు?ప్రజలకు ప్రభుత్వం తప్పనిసరిగా, బాధ్యతగా చేయాల్సిన మంచి ఎలా జరుగుతుంది? ఉద్యోగస్తులకు రూ.36 వేల కోట్ల బకాయిలు ఉన్నాయిఅమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది2018 లో ఏ పనులు, ఎవరు చేశారో.. 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులుఅమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారుఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారుల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపుసీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు.. అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు మా పథకాలన్నీ ఆగిపోయాయి..స్కాముల కోసం అమరావతి మీద చంద్రబాబు అప్పులుఅప్పులు తెచ్చి కుమ్మరించడం వల్ల దాని ప్రభావం ఇప్పటికే స్టార్ట్ అయ్యిందినాడు-నేడు ఆగిపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన ఆగిపోయాయిఆరోగ్య శ్రీ ఆగిపోయింది, వ్యవసాయం దెబ్బతిందిమెడికల్ కాలేజీలు ఆగిపోయాయి, మా పథకాలన్నీ ఆగిపోయాయిరాష్ట్రానికి అవసరమైన ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఆగిపోయాయి వైఎస్సార్సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదుచంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా ౩ ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారువైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదుప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు బిల్డప్50 వేల ఎకరాల్లో వరల్డ్లోనే బెస్ట్ క్యాపిటల్ అన్నారుఇప్పుడు మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?ఎక్కడా లేని విధంగా కాస్ట్ పేర్ స్క్వేర్ ఫీట్ పెరిగిందిఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఎందుకు పెరిగింది?వీటికి అసెంబ్లీలో చంద్రబాబు సమాధానం చెప్పాడా?కేవలం జగన్ను, వైఎస్సార్సీపీ దుమ్మెత్తి పోయడానికి అసెంబ్లీని వాడుకున్నారుచట్టసభలో భాగమైన కౌన్సిల్ను పిలవలేదుచంద్రబాబు అవినీతి బాగోతాన్ని కౌన్సిల్లో బయటపెడతారని పిలవలేదుఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవుఆ చట్టాలను చట్టసభలు సవరించగలవు.. ఇది వాస్తవంప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నారుఅవినీతి నుంచి డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలుఎన్ని దశాబ్దాలు పడుతుంది?భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కు లేదుఇందులో రోడ్లు, కరెంటు, వాటర్, డ్రైనేజీ కల్పనకే ఖర్చు రూ.లక్ష కోట్లుఇప్పుడు సడన్గా మరో 50 వేల ఎకరాలు ఎందుకు పెంచారు?సడన్గా మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు?దీనివల్ల అదనంగా మరో రూ.లక్ష కోట్లు పెరిగిందిమరి ఈ డబ్బు పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇది..రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదన్నారుస్వయంగా మంత్రి పార్థసారథి ఈ విషయం చెప్పారుఅమరావతిపై శాసనసభలో తీర్మానం చేశారురాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే తీర్మానంరాజధాని పేరిట పట్టపగలు దోపిడీ: అసెంబ్లీలో చంద్రబాబు చేసిన డ్రామా ఇదిరాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదుసీట్స్ ఆఫ్ గవర్నెన్స్ మాత్రమే ఉందిఈ వాస్తవాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దులక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత?నిజంగా అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా?రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?అమరావతిలో రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందిచంద్రబాబు లెక్కలే ఈ వివరాలు చెబుతున్నాయిఆ లెక్కన లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలిరూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?ఈ రూ.2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి2019 ముందు మాస్టర్ప్లాన్ ఎందుకు మార్చుతున్నారుఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారుఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు?రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లుఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదుఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయిఏడేళ్లు సీఎంగా ఉండి అమరావతిలో చంద్రబాబు చేసిందేంటి?భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?అమరావతిపై వాస్తవాలు తెలియాలిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టంశాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామారాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదుచంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతిఅమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి -
హిందూమహిళ వారసత్వ ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు
సాక్షి, అమరావతి: హిందూమహిళకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మహిళ సంతానం లేకుండా చనిపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని చెప్పింది. తన సోదరి శ్రీవిరిత మరణం నేపథ్యంలో ఆమెకు వారసత్వంగా తమ నాయనమ్మ నుంచి సంక్రమించిన భూమి తాలూకు రెవెన్యూ రికార్డుల్లో తన పేరును నమోదు చేయాలని కోరుతూ దేవిక మానస దాఖలు చేసిన అప్పీల్ను అనుమతిస్తూ రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమరి్థంచింది. ఆర్డీవో ఉత్తర్వులను రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టింది. జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను రద్దుచేసింది. రికార్డుల్లో దేవిక మానస పేరు చేర్చాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఇటీవల తీర్పు చెప్పారు. మనుమరాళ్లకు ఆస్తి ఇచ్చిన నాయనమ్మ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ తన మనుమరాలు (కుమారుడు దత్తాత్రేయ కుమార్తె) శ్రీవిరితకు 1.50 ఎకరాల భూమిని 2002లో గిఫ్ట్డీడ్ కింద ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో శ్రీవిరిత పేరు మీద మార్పులు చేశారు. 2005లో శ్రీవిరిత మరణించడంతో ఆ గిఫ్ట్డీడ్ను వెంకాయమ్మ 2007లో రద్దుచేశారు. ఆ భూమిని 2011లో మరో మనుమరాలు దేవిక మానసకు గిఫ్ట్డీడ్ ద్వారా ఇచ్చిన వెంకాయమ్మ 2012లో కన్నుమూశారు. అనంతరం ఆ 1.50 ఎకరాల భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో తనపేరు చేర్చాలని దేవిక మానస తహసీల్దార్ను కోరారు. దీనికి శ్రీవిరిత భర్త బదిరెడ్డి నాగవీరవెంకట శ్రీరామదొర అభ్యంతరం తెలిపారు.ఆ భూమి తన భార్యదని, దానిపై తనకే హక్కులున్నాయని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్ ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సవాలు చేస్తూ దేవిక మానస రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ (ఆర్డీవో)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ఆర్డీవో.. తహసీల్దార్ ఉత్తర్వులను తప్పుబట్టి, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయాలని 2017లో ఆదేశించారు. దీనిపై శ్రీరామదొర జాయింట్ కలెక్టర్ (జేసీ) ముందు రివిజన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన జేసీ 2017లో ఆర్డీవో జారీచేసిన ఉత్తర్వులను తప్పుబట్టారు. ఒకసారి గిఫ్ట్డీడ్ ఇచ్చిన తరువాత దాన్ని రద్దుచేయడానికి వీల్లేదని, సివిల్ కోర్టు ద్వారా మాత్రమే ఆ డీడ్ను రద్దుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
దుర్గగుడి సిబ్బంది మాయాజాలం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అమ్మలగన్న అమ్మ.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరిట రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువుల్ని ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు.ఈ వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితోపాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహా మండపం ఆరో అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్కు నివేదిక అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 20 రోజులకు ఒకసారి లెక్కింపు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో 20 రోజులకొకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలలో నగదుతో పాటు భక్తులు బంగారు, వెండి వస్తువులను కానుకగా సమరి్పస్తుంటారు. వీటిలో గ్రాము బరువు గల మంగళ సూత్రాలు, నాణేలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరుచేసి దేవస్థానం లాకర్లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్గోల్డ్ ఆభరణాలను సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు. గోల్డ్ను రోల్డ్గోల్డ్లో కలిపేసి సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాలు, నాణేలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులెవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను రోల్డ్గోల్డ్ వస్తువుల్లో కలిపివేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరుపై అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్గోల్డ్ వస్తువులలో బంగారు ఆభరణాలు, వస్తువులను వేయడంతో పక్కా ఆధారాలతో ఆ ఉద్యోగిని పట్టుకున్నారు.ఈ వ్యవహారం బయటకు రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాల్లో డైమండ్స్, విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగులగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం. మట్టీ మాయమవుతోంది ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్గోల్డ్ వస్తువులను మహా మండపం దిగువన ఆలయ సిబ్బంది, పోలీసు, సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే.. రోల్డ్గోల్డ్ వస్తువులను దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధిచేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్గోల్డ్ ముసుగులో అసలైన బంగారు వస్తువుల్ని కూడా దగ్ధం చేసి.. మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్రైజర్పై చర్యలు దుర్గగుడి గోల్డ్ అప్రైజర్ డి.షమ్మీపై చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలికంగా తొలగించినట్లు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వంగా కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ]సీసీ కెమెరాలు, అధికారులు ఉన్నా..దుర్గగుడిలో కానుకల లెక్కింపును 50కి పైగా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. లెక్కింపు జరుగుతున్నంత సేపు ఆలయ ముఖ్య అధికారులు, సిబ్బంది అక్కడే ఉన్నా చాకచక్యంగా బంగారు వస్తువులను రోల్డ్గోల్డ్ పేరిట బయటకు తరలించడం వెనుక ఆలయ అధికారుల పాత్ర, భద్రతా సిబ్బంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘గుంజు’కొని డబ్బులు ఎగ్గొట్టారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అరకొర ధరకు మామిడిని కొన్న చెర్లోపల్లి గుజ్జు ఫ్యాక్టరీ ఏడాది అవుతున్నా.. డబ్బులు ఇవ్వకపోవడంపై కర్షకులు కదంతొక్కారు. బకాయి బిల్లులు తక్షణం చెల్లించాలని నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరుజిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు మంగళవారం తరలివచ్చి ఫ్యాక్టరీని చుట్టిముట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి వంటావార్పు చేపట్టారు. బిల్లులు చెల్లించే వరకు కదిలేది లేదంటూ భీషి్మంచారు. అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టామని.. వడ్డీలు పెరుగుతున్నా ఫ్యాక్టరీ యాజమాన్యం కనికరించడం లేదని, చెల్లింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని బిల్లులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. రూ.3 కోట్ల బకాయిలు ఏడాది క్రితం చిత్తూరుతో పాటు తవణంపల్లి, బంగారుపాళ్యం, యాదమరి, ఐరాల తదితర మండలాల నుంచి రైతులు వేలాది టన్నుల మామిడి పంటను ఫ్యాక్టరీకి తరలించారు. కానీ ఇప్పటికీ వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సుమారు రూ.3 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఆగస్టు నుంచి పోరాడుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటికే 90 శాతం మామిడి గుజ్జును విదేశాలకు ఎగుమతి చేసిందని, అయినా తమకు రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని రైతులు విమర్శించారు. గుజ్జును తరలించే కంటైనర్ల అడ్డగింత ఫ్యాక్టరీ నుంచి గుజ్జును తరలించేందుకు వచ్చిన మూడు కంటైనర్లను రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా మరో రెండు కంటైనర్లను వెంబడిస్తూ నిరసనను మరింత ఉధృతం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు యతి్నంచారు. డబ్బులు చేతికి అందే వరకు కదలబోమని రైతులు భీషి్మంచడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. దీంతో రైతులు అక్కడే వంటావార్పు చేపట్టి దీక్షను కొనసాగిస్తున్నారు. పిల్లలు, మహిళలు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు సర్కారుకు పట్టదా? ‘రైతు సమస్యలను పట్టించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది’ అంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఫ్యాక్టరీ చెల్లింపులు చేయలేదని, దీనిపై తాము ఆగస్టు నుంచి ఆందోళనలు చేస్తున్నా బాబు సర్కారుకు పట్టడం లేదని విమర్శించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు ఏ ఒక్కరూ మామిడి రైతు సమస్యలపై నోరెత్తకపోవడంపై మండిపడ్డారు.ఎన్నాళ్లు తిరగాలి ?నేను ఫ్యాక్టరీకి 50 టన్నుల కాయలు పంపించాను. రూ.3 లక్షల వరకు బిల్లులు రావాలి. ఎన్నాళ్లని తిరిగేది..?. ఇది చాలా దారుణం. మా కష్టాలను కూడా పట్టించుకోవాలి. బిల్లులు ఇచ్చేంత వరకు దీక్షను కొనసాగిస్తాం. – శరత్బాబు, తెల్లగుండ్లపల్లి, యాదమరి మండలం బిల్లులు ఇవ్వకుంటే కదలం బిల్లులు అడిగితే అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా నెట్టుకొచ్చారు. ఇప్పుడు గుజ్జు మొత్తం ఖాళీ చేసేశారు. 90శాతం గుజ్జు మొత్తం ఎత్తికెళ్లిపోయారు. మా డబ్బులు ఇవ్వకుండానే గుజ్జు తరలిస్తే ఎలా? బిల్లులు ఇవ్వకుండా మేము గేటు తీయం. దీక్ష వదలం. బిల్లులు ఇవ్వకుంటే దీక్షను ఇంకా ఉధృతం చేస్తాం. – జనార్దన్, తవణంపల్లి మండలం -
బతుకులతో బాబు చధరంగం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మోసాలపై మొక్కజొన్న రైతులు కన్నెర్రచేశారు. బూటకపు మాటలు నమ్మి మోసపోయామంటూ రోడ్డెక్కారు. తమ బతుకులతో చంద్రబాబు చదరంగమాడుతున్నారంటూ మండిపడ్డారు. కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్చేశారు. విజయవాడలోని ఏపీ మార్క్ఫెడ్ కార్యాలయాన్ని మంగళవారం మొక్కజొన్న రైతులు ముట్టడించారు. కార్యాలయం ఎదుటే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పొగాకు వేయొద్దన్నారని.. మొక్కజొన్న వేశామని తీరా పంట చేతికొచ్చే సమయానికి ధర లేదని, కొనేవారూ లేక తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల పేరిట కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు పంటను కొనాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా రైతులను మభ్యపెట్టే యత్నం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాబు అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కడం లేదని వాపోయారు మొక్కజొన్న రైతులు క్వింటాకు రూ.800 నుంచి రూ.1000 చొప్పున ఎకరాకు రూ.25 నుంచి రూ.30వేల వరకు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.కృష్ణయ్య మాట్లాడుతూ బాబు పాలనలో ఉల్లి మొదలు టమాటా వరకు రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.చంద్రబాబు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి రైతులు నిండా మునిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ధరల స్థిరీకరణ నిధి ఉన్నట్టా? లేనట్టా అని ప్రశ్నించారు. కనీసం రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర దక్కని పంటలను కొనాలని డిమాండ్ చేశారు. దళారుల మాటున కూటమి నేతలే రైతులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ప్రభాకర్ రెడ్డి, ఏపీæ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, పలు జిల్లాల రైతు సంఘం నేతలు పాల్గొన్నారు. అనంతరం మార్క్ఫెడ్ జీఎంకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.రూ.1.25 లక్షలు నష్టపోతున్నా ఐదెకరాల్లో మినుము, ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మినుము దిగుబడి రావాల్సి ఉండగా, 3 క్వింటాళ్లకు మించి రాలేదు. మొక్కజొన్న మాత్రం 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచి్చంది. మినుము మద్దతు ధర రూ.8,575 కాగా, మార్కెట్లో రూ.7వేలకు మించి కొనేవారు లేరు. క్వింటాకు రూ.1600కుపైగా నష్టపోయాను. మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్లో రూ.1500–రూ.1700 మధ్య పలుకుతోంది. దీంతో ఐదెకరాలకు రూ.1.25 లక్షలు నష్టపోతున్నా. – ఎ.రాజశేఖర్, లింగాల, నంద్యాల జిల్లాపెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు ఐదెకరాల్లో మొక్కజొన్న వేశా. ఎకరాకు రూ.50వేలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 30–35 క్వింటాళ్ల మధ్య దిగుబడులొచ్చాయి. మార్కెట్లో క్వింటా రూ.1600 నుంచి రూ.1700 మధ్య కొంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. – మద్దిరెడ్డి వెంకటరెడ్డి, అనుమల్లంక, గంపలగూడెం, ఎన్టీఆర్ జిల్లా -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు సోమవారం సాయంత్రం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో విజయవాడ బస్టాండ్ సమీపానికి చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ టెరి్మనల్స్ వద్ద మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే మంటలు బస్సులోకి వ్యాపించి పొగ దట్టంగా కమ్మేసింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేశారు. సమీపంలోనే ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, బస్సులో మంటలు చేలరేగుతుండగా... హైదరాబాద్కు చెందిన ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లి తెచ్చుకోవడంతో అంతా ఆందోళన చెందారు. -
ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరితెగింపు
సాక్షి, టాస్క్ ఫోర్స్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం బరితెగించి ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడమేగాక లోపల తలుపులు వేసుకుని గంటలపాటు హంగామా చేశారు. తాను సిఫార్సు చేసిన వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వాలంటూ నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా ఎస్పీని బెదిరించడంతోపాటు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. చివరికి పోలీసులు తలుపులు బద్దలుగొట్టి ఎమ్మెల్యేని బయటకు తీసుకొచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ వచ్చారు. ఎస్పీ బి.కృష్ణారావును కలిసి జిల్లా పోలీసు కార్యాలయ న్యాయ సలహాదారుడి నియామకంపై మాట్లాడారు. ఈ పోస్టుకు న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ను సిఫారసు చేస్తూ ఎనిమిది నెలల కిందట తాను లెటర్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని ఎస్పీని ప్రశి్నంచినట్టు తెలిసింది. సిఫారసు లెటర్ను ఉన్నతాధికారులకు పంపామని, వారే ఈ నియామకాలు చేపడతారని ఎస్పీ చెప్పినట్టు సమాచారం.తనకు ఇప్పుడే నియామక ఉత్తర్వులు కావాలంటూ ఎస్పీపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఒకదశలో ఎస్పీని బెదిరిస్తూ ఎమ్మెల్యే గట్టిగా అరవడంతో కార్యాలయ సిబ్బంది ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు. నేనేంటో ఈ రోజు నీకు చూపిస్తా.. అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తుండటంతో ఎస్పీ అసహనంతో బయటకు వెళ్లిపోయారు. ఎస్పీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఎస్పీ బయటకు వెళ్లడంతో చాంబర్లోనే ఉండిపోయిన ఎమ్మెల్యే తనకు ఎస్పీ క్షమాపణలు చెప్పే వరకు బయటకు రానంటూ తలుపులు వేసుకున్నారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కార్యాలయ అధికారులపై చిందులు తొక్కారు. తలుపు గడియ తీయకుండా గంటల కొద్దీ చాంబర్లోనే ఉండిపోయారు. తరువాత కార్యాలయానికి వచి్చన ఎస్పీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే స్పందించ లేదు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫోన్లో ఎమ్మెల్యేతో మాట్లాడారు. టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జాన్సైదా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అరవిందబాబును బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఐజీతో మాట్లాడేందుకూ నిరాకరణ ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బైఠాయించారన్న సమాచారం అందటంతో రాత్రి ఏడుగంటల సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అక్కడికి చేరుకున్నారు. అప్పటి వరకు ఎస్పీ చాంబర్లో ఉన్న ఎమ్మెల్యే.. ఐజీ రాకతో బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకున్నట్టు తెలిసింది. కనీసం ఐజీతో మాట్లాడేందుకు కూడా ఎమ్మెల్యే నిరాకరించారు. గంటల కొద్దీ వేచిచూసిన ఐజీ.. సమస్య పరిష్కరిస్తానని స్థానిక టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులకు హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకి ఫోన్లో చెప్పారు.తాను సిఫారసు చేసిన వ్యక్తికి నియామక ఉత్తర్వులు ఇస్తేనే బయటకు వస్తానని ఎమ్మెల్యే భీషి్మంచారు. దీంతో పోలీసులు ఎస్పీ చాంబర్ తలుపులను, బాత్రూమ్ తలుపులను బద్దలుగొట్టి ఎమ్మెల్యే చదలవాడను బయటకు తీసుకొచ్చారు. తరువాత ఆయనతో ఐజీ త్రిపాఠి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చర్చించారు. బుధవారం సాయంత్రానికి సంబంధిత నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు అందజేస్తానని ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 10 గంటల సమయంలో అరవిందబాబు ఇంటికి వెళ్లిపోయారు. గతంలోనూ ఇంతే.. అధికారులను బెదిరించడం ఎమ్మెల్యే చదలవాడకు ఇదే మొదటిసారి కాదు. నరసరావుపేట లిక్కర్ డిపోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి తెలుగుదేశం కార్యకర్తలకు ఉద్యోగాలివ్వాలంటూ 2025 మార్చి 7వ తేదీన రాష్ట్ర ఎక్సైజ్ కమిషనరేట్లో బైఠాయించారు. అప్పట్లో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లో ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మళ్లీ అదేపంథాలో బైఠాయించారు. ఒక ఐపీఎస్ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి విధులకు ఆటంకం కలిగించడంపై పోలీసు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అయితే విధులు నిర్వర్తించలేమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసేందుకు ఐపీఎస్ సంఘాలు సిద్ధమైనట్టు సమాచారం. -
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
అమరావతి నాటకం.. చట్టబద్ధత బూటకం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్లతో చెలరేగిపోయారు.కేంద్రానికి సంబంధం లేకపోయినా..రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.భవిష్యత్లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు. ‘డబ్బుల్’ ధమాకా..రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రంరాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో గూండా రాజ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసుల అండతో పాలకులు గూండా రాజ్యం నడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ గూండాల దాడులను దీటుగా ఎదుర్కొందామని, వైఎస్సార్సీపీ కేడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలం రామాపురానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నం గురించి వైఎస్ జగన్కు వివరించారు.అలాగే చర్లగుడిపాడు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన బీసీ సామాజికవర్గానికి(పద్మశాలి) చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావును ఫిబ్రవరిలో టీడీపీ గూండాలు హత్య చేశారని వారి కుటుంబసభ్యులు వాపోయారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వైఎస్ జగన్ స్పందిస్తూ.. వైఎస్సార్సీపీ కేడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.టీడీపీ గూండాల దాడులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు. పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. వ్యవస్థలను దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, ఆకూరి వెంకటరెడ్డి, కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, వేముల చలమయ్య, జంజనం తిరుపతి రావు, సైదయ్య, చెన్నారెడ్డి, షేక్ ఇమాం వలీ తదితరులున్నారు.భగవాన్ మహావీర్కు జగన్ ఘన నివాళిసాక్షి, అమరావతి: భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి, ఏఎస్ఆర్ జేఎస్టీ సెక్రటరీ కుందన్ గాం«దీ, కరస్పాండెంట్ ప్రవీణ్ ఫౌలాముతా, ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. మహావీర్ మార్గం సదా ఆచరణీయం.. ‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం.. అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్. ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. మంగళవారం జైనుల ఆధ్యాతి్మక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
ఈసీ తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యం పాలవుతోందని, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తన స్వతంత్రతను, నిజాయితీని కోల్పోయి అవినీతిమయంగా మారిందని ప్రముఖ సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీఎన్ శేషన్ లాంటి అధికారుల ఆధ్వర్యంలో అత్యంత నిష్పక్షపాతంగా నడిచిన ఈసీ.. నేడు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మంగళవారం ‘భారత్ జోడో అభియాన్’ ఆధ్వర్యంలో ‘ఎన్నికల సమగ్రతకు సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల పారదర్శకతకు అత్యంత కీలకమైన ఫామ్ 17సీ విషయంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆ డేటాను వెబ్సైట్లో ఉంచడానికి ఈసీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. పైగా, ఈ ఫారం–17సీకి, ఓట్ల లెక్కింపు తర్వాత ఇచ్చే ఫారం–20కి మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయని, ఓటరు జాబితాల సవరణలో ఈసీ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని ఆరోపించారు. ఓటరు జాబితాలో పేరు నమోదుకు కేవలం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని, కానీ ఈసీ ఉద్దేశపూర్వకంగా ప్రజలను వేధిస్తోందని ఆయన విమర్శించారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై ప్రజల్లో 90 శాతం అపనమ్మకం ఉందని సర్వేలు చెబుతున్నాయని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. ‘ఈవీఎం బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లను కంట్రోల్ యూనిట్తో అనుసంధానం చేసే సాఫ్ట్వేర్ను ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లోడ్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్లో ఏముందో ఎవరికీ తెలియ దు. అందులో మాలీషియస్ (హానికరమైన) కోడ్ ఉంటే పరిస్థితి ఏంటి? దీన్ని టైమ్ బేస్డ్గా కూడా సెట్ చేస్తున్నారు. మాక్ పోలింగ్ సమయంలో, ఉదయం 10 గంటల వరకు యంత్రం పక్కాగా పని చేస్తుంది. ఆ తర్వాత ఏ బటన్ నొక్కినా ఓటు మాత్రం వాళ్లు సెట్ చేసిన పార్టీకే వెళ్లేలా మ్యానిప్యులేట్ చేస్తున్నారు. వీవీప్యాట్ల లెక్కింపుపై ఈసీ చెబుతున్న సాకులు విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం శోచనీయం. దేశంలో న్యాయవ్యవస్థ పరిస్థితి కూడా దయనీయంగా మారింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఇంకా పలువురి వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.అంధ్రప్రదేశ్ ఫలితాలు అత్యంత సందేహాస్పదంమే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దీన్ని బట్టి గంటకు సగటున 6.8 శాతం పోలింగ్ జరిగినట్లు అర్థమవుతుంది. పోలింగ్ శాతం రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు గంటల వ్యవధిలో పోలింగ్ శాతం పెరుగుదల కేవలం 0.08 శాతం మాత్రమే. కానీ.. అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ శాతం 76.50 శాతానికి పెరిగింది. అంటే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11:45 గంటల వరకూ పోలింగ్ శాతం 8.38 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగినట్లు ఏపీ సీఈవో ప్రకటించారు. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 80.66 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే.. మే 13న రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు కేవలం 2.15 గంటల్లో 4.16 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 3.33 కోట్లు. ఇందులో 4.16 శాతం అంటే 17,19,482 ఓట్లు కేవలం 2.15 గంటల వ్యవధిలో పోలైనట్ల స్పష్టమవుతోంది. ఈ ఓట్లు మొత్తం 3,500 పోలింగ్ బూత్లలో పోలయ్యాయి. ఒక్కో బూత్లో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. 2.15 గంటలు అంటే 135 నిముషాల్లో 491 ఓట్లు.. అంటే ఒక నిముషానికి ముగ్గురు ఓటు వేశారు. అంటే ఒక వోటరు వోటు వేయడానికి తీసుకున్న సమయం 20 సెకన్లు. శాసనసభ అభ్యర్థికి ఒక కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీ ప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకన్లు.. లోక్సభ అభ్యర్థికి మరో కంపార్ట్మెంట్లో ఓటు వేశాక వీవీ ప్యాట్ రావడానికి 7 సెకన్లు మొత్తం 14 సెకన్లు సమయం పడుతుంది. అంటే.. మిగతా 6 సెకన్లలో ఓటరు గుర్తింపు కార్డు చూపడం, దాన్ని పోలింగ్ అధికారి తనిఖీ చేయడం, ఓటరు జాబితాలో ఆయన పేరు టిక్ చేయడం, సంతకం లేదా వేలిముద్ర తీసుకోవడం, ఓటరు చేతి వేలిపై ఇంక్ పెట్టడం ఇలా 6 సెకన్లలో రెండు ఓట్లు వేయడం సాధ్యమమ్యే పనేనా? పైగా మే 13న రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే నమోదైన తుది పోలింగ్ శాతం ప్రకటించడానికి ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టిడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మే 13 పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన శాతం నుంచి మే 17న ప్రకటించిన తుది శాతం వరకు మొత్తం 12.62 శాతం పెరుగుదల ప్రకారం చూస్తే అర్థరాత్రి అదనంగా 51,83,249 ఓట్లు నమోదయ్యాయి. ఈ సంఖ్యను రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు పంచితే, ఒక్కో నియోజకవర్గానికి సగటున 29,618 అదనపు ఓట్లు వస్తాయి. ఈ పెరుగుదల అన్ని చోట్ల సమానంగా ఉండే అవకాశం లేదు. ఈ పెరుగుదల కొన్ని లకి‡్ష్యత నియోజకవర్గాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే జరిగి ఉంటే, అది కొంత మంది అభ్యర్థులు లేదా పార్టీలకు భారీ విజయాన్ని ఇవ్వగలదు, మరికొంత మందిని పూర్తిగా ఓడించగలదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీర్పు తీవ్ర అనుమానాస్పదంగా మారింది.– డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రముఖ ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తఈవీఎంలపై అనుమానాలు తీర్చాల్సిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై ప్రజలు, రాజకీయ పార్టీల్లో తలెత్తుతున్న అనుమానాలను ఏమాత్రం తీసిపారేయలేం. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ఈసీపై ఉంది. పోలైన వీవీప్యాట్ స్లిప్పులను కచ్చితంగా వంద శాతం లెక్కించాలి. దీనిపై ఈసీ చెబుతున్న సాకులు సరికాదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ కోసం ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ (కొలీజియం)లో ప్రధాని, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత ఉంటే అది 2ః1 నిష్పత్తిలో అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతుంది. అందువల్ల సీజేఐ కచ్చితంగా ఉండి తీరాలి. జమిలి ఎన్నికల విధానం ఆచరణలో ఎండమావి లాంటిదే.– ఎస్.వై ఖురేషీ, భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ఏపీ తరహాలోనే ఒడిశాలోనూ సందేహాలు2024లో జరిగిన సాధారణ ఎన్నికల తీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలే ఒడిశాలో కూడా పలు అనుమానాలను రేకితిస్తోంది. మొదట ప్రాథమికంగా ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతం మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. తొలుత 62.02 శాతం పోలింగ్ నమోదయ్యిందని ప్రకటించగా ఆ తర్వాత ఏకంగా 12.48 శాతం పెంచేశారు. అంటే 42 లక్షల అదనపు ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల జాబితా, ఈవీఎం, అర్థరాత్రి ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా సమాధానం చెప్పాలి. – సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ మహాపాత్రశాశ్వతంగా అధికారంలో ఉండేలా డీలిమిటేషన్ గతంలో ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిగేవి. ప్రస్తుతం ఎన్నికల అక్రమాలను ఎలా ఆపాలన్న దానిపై చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుంది. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. అధికార పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ఎన్నికల చర్యలున్నాయి. నియోజకవర్గాల్లో అనుకూలతలను బట్టి ఓట్లను కలపడం (ప్యాకింగ్), ఓట్లను విడగొట్టడం (క్రాకింగ్), వివిధ ప్రాంతాల్లోని అనుకూల ఓట్లను కట్టగట్టడం (స్టాకింగ్) వంటి పనులు చేస్తున్నారు.– యోగేంద్ర యాదవ్, భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ -
ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్ టీచర్ల సేవలు రద్దు
సాక్షి, అమరావతి: ఏపీ మోడల్ స్కూళ్లలో కాంట్రాక్టు ప్రాతిపదికపై పనిచేస్తోన్న ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)లు, కంప్యూటర్ టీచర్ల సేవలను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో పనిచేస్తోన్న వారి సేవలను మే1 నుంచి రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన పలు అంశాలపై మాట్లాడనున్నారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.40 కోట్లకుపైగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఆపద్బాంధవి అయిన ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్లు తిరక్కుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు మూడోసారి సమ్మె బాట పట్టాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పడింది. రోజు రోజుకూ పేరుకుపోతున్న బకాయిలతో ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతోందని కొద్ది నెలలుగా ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో బకాయిలు తీర్చకపోతే ఏప్రిల్ 1వ తేదీ (బుధవారం) నుంచి సేవలు నిలిపేసి, సమ్మెలోకి వెళతామని వారం కిందటే ‘ఆశ’ అల్టిమేటం జారీ చేసింది. వారితో చర్చలు జరిపి, సేవలు నిలవకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. వెరసి పేద, మధ్య తరగతి ప్రజల ఉచిత వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తాయి. దగా చేసిన ప్రభుత్వం2024లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేయడం మొదలెట్టారు. ఈ పథకాన్ని రూపుమాపే ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేంద్రం అమలు చేసే పీఎంజేఏవై పథకాన్ని వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని లాంటి వారి ద్వారా ప్రకటనలు చేయిస్తూ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా నిలిపివేశారు. మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విలాసాలు, యోగా డే వంటి ఈవెంట్స్ కోసం మాత్రం రూ.వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. బిల్లులు రాకపోవడంతో ఆస్పత్రులు నిర్వహించలేకపోతున్నామని గతేడాది యజమానులు రోడ్లెక్కారు. దేశ, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రైవేట్ వైద్యులు ధర్నా చౌక్లో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం.. బకాయిలన్నింటినీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని నమ్మబలికింది. ఆశ ప్రతినిధులతో చర్చల అనంతరం ఓటీఎస్పై వైద్య శాఖ మంత్రి సైతం ప్రకటనలు చేశారు. డిసెంబర్లోపు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఆ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం దగా చేసింది. బకాయిలు చెల్లించకుండానే బీమా విధానం అమలుకు వైద్య శాఖ టెండర్లు కూడా పిలిచింది. ఈ నేపథ్యంలో బకాయిలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆస్పత్రుల యాజమాన్యాలు సిద్ధం అయ్యాయి. దీనావస్థలో పేదలు⇒ చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అత్యధిక శాతం అనధికారికంగా ఆరోగ్యశ్రీ సేవలను ఎత్తేశాయి. జబ్బు బారినపడిన పేదలు చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు వెళితే ఉచిత వైద్య సేవలు అందించలేమని చెప్పేస్తున్నాయి. దీంతో సొంతంగా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవడానికి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ⇒ 2014–19 మధ్య కూడా నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పట్లో చంద్రబాబు అటకెక్కించారు. 2019లో టీడీపీ దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయి పెట్టారు.⇒ అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాబు పెట్టిన బకాయిలను చెల్లించింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్ జగన్ ఊపిరిలూదారు. రూ.25 లక్షల వరకు వైద్య సేవల పరిమితితో పథకాన్ని బలోపేతం చేసి, 325 ప్రొసీజర్లను పథకం పరిధిలోకి తెచ్చారు. శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంతి సమయంలో వారికి ఇల్లు గడిచేలా రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.ఐదు వేల చొప్పున ఆరోగ్య ఆసరా సాయం అందించారు. ఈ సాయాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా ఎత్తేయడంతో పాటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. -
‘ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటేయడం ఎలా సాధ్యం?’
ఢిల్లీ: ఏపీ-2024 ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏపీలో 3,500 పోలింగ్ బూత్ల్లో తెల్లవారుజామున రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి? అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్సిట్యూషన్ క్లబ్లో ‘ఎన్నికల సమగత్రకు సవాళ్లు’ అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్. ఈ మేరకు ఏపీ ఎన్నికల్లో అర్థరాత్రి పోలింగ్ పెరగడంపై ఆధారాలతో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘ఏపీ-2024 ఎన్నికల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరగడంలో మతలబు ఏంటి?, 3,500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఓటింగ్ జరగడం వెనుక అనుమానాలున్నాయి. రాత్రి గం. 11. 45ని నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ ప్రతి నిమిషానికి ముగ్గురు ఓటు వేయడం ఎలా సాధ్యం. ఇది ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తోంది’ అని తన ప్రజెంటేషన్లో పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు సేవలను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ప్రకటించింది. ఆషా ప్రతినిధుల ప్రకారం.. చంద్రబాబు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు ఆసుపత్రులకు చెల్లించలేదు. బకాయిలు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.చంద్రబాబు సీఎం అయ్యాక రెండోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలను ప్రభుత్వం మోసం చేసిందని వారు ఆరోపించారు. గతంలో సమ్మె చేసినప్పుడు ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని హామీ ఇచ్చినా, మార్చి 31 వచ్చినా బకాయిలు చెల్లించలేదని ఆషా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన గురజాల నియోజకవర్గ నేతలు
తాడేపల్లి : తమపై టీడీపీ గూండాలు చేసిన హత్యాయత్నంకు సంబంధించి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు. టీడీపీ గూండాలు చేసిన దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. జగన్ను కలిసిన వారిలో రామాపురం, చర్లగుడిపాడు గ్రామాల వైఎస్సార్సీపీ స్థానిక నేతలు ఉన్నారు. చర్లగుడిపాడులో బీసీ వర్గానికి చెందిన కాకుమాను భావనా రిషి, భువనగిరి శ్రీనివాసరావు అనే ఇద్దరు పార్టీ కార్యకర్తలను హతమార్చారు టీడీపీ గూండాలు. తమ వారి హత్యలతో తామంతా రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబ సభ్యులు. బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ ఓదార్చారు. న్యాయపరమైన సహాయం అందిస్తామని, కుటుంబాలకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ల్నాడులో గూండారాజ్యం నడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవటాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహవీర్ జయంతి (మహావీర్ జన్మకల్యాణక్) ఘనంగా నిర్వహించారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.‘‘అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి, జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మనోజ్ కొఠారి, కుందన్ గాంధీ (సెక్రటరీ, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ ఫౌలాముతా (కరస్పాండెంట్, ఎస్ఎస్ఆర్ జేఎస్టీ), ప్రవీణ్ కుమార్ జైన్, మనోజ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచ మహా వ్రతాలను ప్రజలకు బోధిస్తూ నైతిక జీవనానికి మార్గం చూపిన మహనీయుడు మహావీర్ . ఆ మహర్షి చూపిన మార్గం సదా ఆచరణీయం. నేడు జైనుల ఆధ్యాత్మిక గురువు మహావీర్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.#MahavirJayanti pic.twitter.com/2Z5deOnCA1— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2026 -
‘తోలు వలిచేస్తా.. లం..కొ..’
పిఠాపురం/సాక్షి, అమరావతి: ఓ దళిత శానిటరీ ఉద్యోగిపై కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోనులో తిట్ల దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వలిచేస్తానంటూ వారి్నంగ్ ఇచ్చారు. రాయడానికి వీలు లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వివరాలివీ.. పిఠాపురంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక వాలీబాల్ కోర్టులో మట్టిని తొలగించలేదంటూ స్థానిక నాయకుడొకరు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఫిర్యాదు చేశారు.పిఠాపురం రథాలపేట సచివాలయ పరిధిలో పని చేస్తున్న సు«దీర్ అనే దళిత శానిటరీ ఉద్యోగితో కమిషనర్ వద్ద నుంచే ఆ నాయకుడు ఫోనులో మాట్లాడారు. తమ ఇంటి ఎదురుగా వాలీబాల్ కోర్టులో మట్టి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఆ పనిని శానిటరీ ఇన్స్పెక్టర్ చూస్తున్నారని, ఆయనకు చెప్పి చేస్తానని బాధిత ఉద్యోగి సు«దీర్ చెబుతూండగానే ‘సార్ మాట్లాడతారు’ అంటూ ఆ నాయకుడు కమిషనర్కు ఫోన్ ఇచ్చారు. ఫోన్ అందుకున్న కమిషనర్... ‘ఏం చెప్పాలి శానిటరీ ఇన్స్పెక్టర్ నీకు? వార్డులో నుంచి డబ్బులు తీసుకు రమ్మని చెప్పాలా? లేదంటే ఎగ... ఎల్లండిరా అని చెప్పాలా? ఇప్పటి వరకూ మీరంతా కలిసి చేసిన దందాగిరీ చాలదంటరా వెధవా? మండపేటను నాశనం చేసి వచ్చావు. మళ్లా ఈ దరిద్రాన్ని కూడా నాశనం చేస్తావా? ల..ట్ నాయాలా.. అతను చెప్తే నేను చెప్పినట్టే అని మస్తర్లకు వచి్చనప్పుడు చెప్పాను. అందరితో నేను మొ... గు... వాలంటే నా నోరు కూడా నొప్పేస్తది కదా. మీయమ్మ లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది కదా.. మీ ఊరు ఎలా ఉంది? మీ ఊరు ర్యాంకింగ్కి ఎలుతుంది. నా ఊరు వెళ్లలేదు పెంట తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా లం..కొ.. మండపేట నుంచి నువ్వు పనికిరావనే కదా వాడు గెంటేశాడు రంగారావు. అవునా? కాదా? మరి! ఇక్కడ రాజకీయాలు దెం..న్నావా ల..ట్ నాయాలా! ఒక గంటలో అది క్లీన్ కాలేదనుకో.. తోలు వలిచేస్తాను’ అంటూ తీవ్ర పదజాలం, బూతులతో దుర్భాషలాడారు. పిఠాపురం మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి శానిటేషన్ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన మున్సిపల్ కమిషనర్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీ, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే బాషా, జనరల్ సెక్రటరీ జాన్, వైస్ ప్రెసిడెంట్ కన్నారావు డిమాండ్ చేశారు. -
నెల రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ఇవ్వండి
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమరి్పంచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) హైకోర్టు నెల రోజుల గడువునిచి్చంది. నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటుతోపాటు 2018 గ్రూప్–1లో ఉత్తీర్ణత సాధించిన అధికారులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ‘నాన్ ఫోకల్’ అమలు తీరుపై అసహనం కాగా, 2018 గ్రూప్–1లో ఉద్యోగం సాధించి డీఎస్పీలు, ఆర్డీవోలు తదితర హోదాల్లో కొనసాగుతున్న వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న తమ ఆదేశాల అమలు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కొందరు డీఎస్పీలకు సీఐడీలో పోస్టింగులు ఇచ్చారని, వారే ఇకపై ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను తీసుకెళుతుంటారంది. ఎవరిపై ఆరోపణలు ఉన్నాయో వారినే సీఐడీలోకి తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదని ఆక్షేపించింది. చేతకాకపోతే చెప్పండి: సిట్పై అసంతృప్తి కాగా సిట్ పంపిన జవాబు పత్రాలన్నింటిని పరిశీలించడం తమకు సాధ్యం కాదని తెలిపిన హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్, 167 పత్రాలు మాత్రమే ఉంచుకుని మిగతావి తిరిగి పంపిందని అంతకుముందు సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను సిట్ అమలు చేయాలని లేదా సాధ్యం కాదని చెబితే, తాము ప్రత్యామ్నాయంగా మరో దర్యాప్తు సంస్థకు ఈ బాధ్యతలను అప్పజెబుతామని స్పష్టం చేసింది. అనంతరం సిట్ అధిపతితో మాట్లాడిన సోమయాజీ, దర్యాప్తును తామే కొనసాగిస్తామని ఆయన తెలిపినట్లు ధర్మాసనానికి నివేదించారు. -
‘ఎమ్మెల్యేకు రూ.10 లక్షలు లంచం ఇచ్చా’
ఆదోని అర్బన్: ‘ఓపెన్గా చెబుతున్నా.. నేను బిల్డింగ్ కట్టేందుకు ఆదోని కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు ఇచ్చాను. అది కూడా భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి పచ్చి బట్టలతో నెత్తిన పెట్టుకుని ఆయా సన్నిధిల్లో, ఎక్కడ చెప్పమంటే అక్కడ చెబుతా’ అని టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు.కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఎమ్మిగనూరు రోడ్డులోని ట్రెండ్స్ సమీపంలో సౌదీ రవూఫ్ భవన నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని నిర్మాణాన్ని అడ్డుకోవడంతో సౌదీ రవూఫ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తన భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూసేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేశారని, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి రెండు దఫాలుగా రూ.10 లక్షలు, మధ్యవర్తికి రూ.లక్ష ఇచ్చానని పేర్కొన్నారు. -
డబ్బులు డిమాండ్తోనే దారుణ హత్య
గాజువాక: రిలేషన్షిప్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తూ వేధిస్తుండడంవల్లే మౌనికను నిందితుడు చింతాడ రవీంద్ర హత్యచేసినట్లు సౌత్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ ఎ. పార్థసారధి వెల్లడించారు. విశాఖలో ఆదివారం తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర (29) విశాఖలోని ఇండియన్ నేవీలోని ఐఎన్ఎస్ డేగాలో పెట్టీ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ పాత గాజువాక ఎలీ్వనగర్లోని కీర్తి ఎన్క్లేవ్లో ఉంటున్నాడు.రవీంద్రకు విజయనగరం జిల్లాకు చెందిన శ్రీలక్ష్మీతో ఏడాది క్రితమే వివాహమైంది. మరోవైపు.. తాటిచెట్లపాలెంలోని సంజీవయ్య కాలనీ–1కు చెందిన పోలిపల్లి మౌనిక (31) ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఈవెంట్ల నిర్వహణకు వెళ్తుంది. ఆమె తండ్రి వేణుగోపాల్ ప్రైవేట్ ఉద్యోగి. మౌనిక, రవీంద్ర మధ్య మింగిల్ డేటింగ్ యాప్ ద్వారా 2021లో పరిచయం ఏర్పడింది. ఇది రిలేషన్షిప్కు దారితీసింది.పెళ్లి తరువాత కూడా నిందితుడు మౌనికతో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. రవీంద్రకు పెళ్లైన విషయం తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యా యి. ఈ నేపథ్యంలో.. డబ్బు కోసం రిలేషన్షిప్ విషయాన్ని నిందితుడి భార్యకు చెబుతానంటూ మౌనిక వేధించడం మొదలుపెట్టింది. మౌనికకు రవీంద్ర నగదు ఇస్తున్నా ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇద్దరికీ సంబంధించిన వీడియోలను రవీంద్ర భార్య శ్రీలక్ష్మి కి షేర్ చేయడంతోపాటు ఇంకా రకరకాలుగా ఒత్తిడి పెంచింది. దీంతో మౌనికను హత్యచేయాలని రవీంద్ర నిర్ణయించుకున్నాడు. పక్కా ప్లాన్తో పాశవిక హత్య.. ఈ నేపథ్యంలో.. భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను అడ్డు తొలగించుకునేందుకు రవీంద్ర స్కెచ్ వేశాడు. ఇన్స్టామార్ట్ ద్వారా కత్తి కొనుగోలు చేశాడు. స్థానికంగా కొన్ని కవర్లు కొన్నాడు. ఇక ఆదివారం మధ్యాహ్నం మౌనికను తన ఇంటికి పిలిచాడు. 12.30 గంటల సమయంలో ముక్కు, నోరు మూసి ఆమెను హత్యచేశాడు. ఆ తరువాత ఆమె తల, చేతులు, కాళ్లు ముక్కలు ముక్కలుగా కోశాడు. రక్తపు మరకలు లేకుండా శరీర భాగాలను బాత్రూమ్లో శుభ్రంగా కడిగి కవర్లో ప్యాక్ చేశాడు. తల, చేతి భాగాలను ఒక గోనె సంచిలో, ఇతర భాగాలను క్లాత్ సూట్కేసులోను పెట్టాడు.కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు. అనంతరం అడవివరం రోడ్లోని ధారపాలెం వద్ద నిర్జన ప్రదేశానికి కారులో వెళ్లి తల, చేతి భాగాలను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్చేసి మౌనికను హత్యచేసినట్లు చెప్పాడు. అతని సూచన మేరకు పోలీస్స్టేషన్కు వెళ్లి రవీంద్ర లొంగిపోయాడు. తల, చేతి భాగాలను కాల్చేసిన స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లి శాంపిల్స్ సేకరించారు. కవర్లో పెట్టి ఇంట్లో ఫ్రిజ్లో ఉంచిన శరీర భాగాలను కేజీహెచ్కు తరలించారు. -
దేవుడి భూములను దోచి పెడతారా?.. ధ్వజమెత్తిన బీజేపీ
సాక్షి, అమరావతి: దేవాలయాల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూటమిలో మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే తూర్పారపట్టింది. ప్రస్తుతం దేవాలయాల భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయంటూ బీజేపీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రైవేటు వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి అనే పేరుతో దేవాలయాలకు చెందిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములను సరైన దర్యాప్తు, సర్వే చేయకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం.ఇది హిందూ సమాజానికి, ఆలయాల రక్షణకు తీవ్ర ప్రమాదకరం. ఈ చర్యలతో ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి’ అని స్పష్టం చేసింది. 33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా తప్పు అని చెప్పింది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టింది. ఆలయాల భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచి పెట్టాలి అనే ధోరణి హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోందని, ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేమని పేర్కొంది.ఇది అత్యంత ప్రమాదకరంహిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు. అభివృద్ధి పేరుతో హిందూ ఆలయ భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు. ఈ భూములు ఆలయాలకే చెందాలి. ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం.ఆలయాల భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది’ అని పేర్కొంది. ఈ భూములపై నిష్పక్షపాత, పూర్తి స్థాయి సర్వే చేసి, ప్రైవేటు సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములను, ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలని, అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న దేవదాయ శాఖ భూములను దీర్ఘకాలిక లీజులివ్వడం కాకుండా స్వల్పకాలిక లీజులకు ఇవ్వాలని చెప్పింది.గుళ్ల ద్వారా భారీ ఆదాయమొస్తున్నాపండుగలు జరిపేది ఇలాగేనా? దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని బీజేపీ తెలిపింది. ఆలయాల ఆదాయం నుంచి ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ తీసుకుంటుందని గుర్తు చేసింది. దేవాలయాల ఆదాయం పూర్తిగా అవే ఆలయాల అభివృద్ధికి వినియోగించేలా చట్టపరమైన హామీ ఇవ్వాలని, ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కలెక్టరేట్లలో వినతిపత్రాలు హిందూ దేవాలయ భూముల రక్షణ – ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై సోమవారం బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతిపత్రాలు సమరి్పంచినట్లు బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. ‘ఇది వినతిపత్రం కాదు.. హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది’ అని పేర్కొంది. -
వేతనాలు పెంచకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
సాక్షి, అమరావతి: అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈమేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను అసోసియేషన్ అధ్యక్షురాలు జి.బేబీరాణి, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా అంగన్వాడీల వేతనాలు పెంపు కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. గ్రాట్యూటీ జీవో ఇచ్చినా నేటికీ గైడ్లైన్స్ రూపొందించలేదన్నారు. మట్టిఖర్చుల జీవో కూడా అమలుకు నోచుకోవడంలేదన్నారు.మార్చి 2న వేలాది మంది అంగన్వాడీలు విజయవాడలో చేపట్టిన నిరసనను పోలీసుల ప్రోద్భలంతో అణిచివేశారని, లైట్లు ఆపేసి, టెంట్లు పీకేసి వందలాది మంది మహిళలను ఈడ్చుకుంటూ జీపుల్లో తీసుకెళ్లారన్నారు. ఈ నిరసన సమయంలో కూడా మంత్రులు అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారని, ఇప్పటికైనా ఇచి్చన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పంపిణీ పేరుతో చంద్రబాబు మరో క్రెడిట్ దోపిడీకి పాల్పడ్డారని, నాయుడుపేట సభలో ఆయన చెప్పిన అబద్ధాలే అందుకు నిదర్శనమని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి విమర్శించారు. గతంలో ఇళ్ల పంపిణీ పేరుతో పేదలపై భారం మోపిన చరిత్ర చంద్రబాబుది అయితే.. వారికి రూ.12 వేల కోట్ల రాయితీలు కల్పించి ఇళ్లు నిర్మించి ఇచ్చిన చరిత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డిదని ఆయన గుర్తుచేశారు. అయినా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేస్తున్నారని మండిపడ్డారు.నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారని, నాయుడుపేటలో చంద్రబాబు ఉపన్యాసం వినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపించకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎవరు మంచి పని చేసినా దానిని తన ఖాతాలో వేసుకోవడం, తప్పు జరిగితే అధికారులు, ప్రతిపక్షాల మీద నెట్టేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. కాకాణి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు.. తిరుపతి జిల్లాలో 15,659 ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు రాష్ట్రంలో 5.5 లక్షల ఇళ్లు నిర్మించామని చెబుతున్న చంద్రబాబు 2014–19 మధ్య ఎన్ని స్థలాలిచ్చారు? ఎన్ని ఇళ్లు కట్టించారో చెప్పాలి. 21 నెలల్లో 5.5 లక్షల ఇళ్లు కట్టించామంటూ పచ్చి అబద్ధం చెప్పారు. గతంలో మా ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు ఫినిషింగ్ టచ్ ఇచ్చాక పంపిణీ చేయకుండా ఆగిపోయిన వాటిని ఇవాళ పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 21.75 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే 9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. రెండు లక్షల ఇళ్లు ముగింపు దశలో ఉండగా మరో 11 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని నిరూపించేందుకు మేం సిద్ధం. 2019–24 మధ్య నిరుపేదలకు దాదాపు రూ.32 వేల కోట్ల విలువైన 72 వేల ఎకరాల భూముల్ని పేదలకు పంచిపెట్టిన చరిత్ర వైఎస్ జగన్దే. టిడ్కో ఇళ్లు ఇచ్చిందీ వైఎస్ జగనే.. 2024 ఫిబ్రవరిలో 1.25 లక్షల టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చాం. వాటికి రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి కేవలం ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన చరిత్ర జగన్దే. అలా 1,43,600 ఇళ్లను అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీన్ని చంద్రబాబు కాదని చెప్పగలరా? ఇంకా 365 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.25 వేల చెల్లింపుతో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అలాగే, 430 ఎస్ఎఫ్టీ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 74,312 మందికి ఒక్కొక్కరికి కేవలం రూ.50 వేల చెల్లింపుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో మొత్తం 25 లేఅవుట్లలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం రాజధానిలో పేదలు ఉండకూడదంటూ ఆర్–5 జోన్లో మొత్తం 50,793 ఇళ్ల పట్టాలను రద్దుచేసింది.టిడ్కో ఇళ్లలో చంద్రబాబు అవినీతి.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లలో జరిగింది అవినీతి మాత్రమే. ముడుపులిచ్చిన కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. అలాగే, లబ్ధిదారులపై విపరీతంగా భారం మోపారు. ఇలా టిడ్కో ఇళ్ల మీద రూ.8,929 కోట్ల అవినీతికి పాల్పడిన విషయం వాస్తవమా కాదా చంద్రబాబు చెప్పాలి. -
టిడ్కో ఇళ్లల్లోనూ కీర్తి చోరుడు.. బాబు ‘హోం’కరింపులు
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. సోమవారం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై ‘2019–20 సంవత్సరంలో నిర్మించిన ఇళ్లు’ అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5.50 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గతేడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించిందని బాబు చెప్పడం విని విస్తుపోయారు.రెండో విడతలో భాగంగా నాయుడుపేట మండలం, పుదూరు నుంచి లక్ష టిడ్కో ఇళ్లతోపాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు గొప్పలుపోవడంపై నివ్వెరబోయారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్టు చెప్పుకోవడం చూస్తుంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ‘కట్టు’కథల కనికట్టు 2015–16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్టగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017–18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,818 పూర్తిచేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు.అయినప్పటికీ మంజూరైన ఇళ్లల్లో ఐదు శాతం కూడా నిర్మాణం పూర్తిచేయనేలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరకొరగా నిర్మించిన ఇళ్లను హడావుడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20 వేల ఇళ్లు మాత్రమే అందులోనూ 60 శాతం పనులే చేశారు. జగన్ ప్రభుత్వంలోనే 1,77,546 ఇళ్లు పూర్తి 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరు శాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు లక్ష ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80 శాతం పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలా లేదు. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.ఆ 1.5 లక్షల ఇళ్లు గత ప్రభుత్వంలో నిర్మించినవే రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17 వేలకుపైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం. కాగా, ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలూ పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. జగన్ హయాంలో పూర్తయితే బాబు షో వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021–22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అభాసుపాలైంది.అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దు్రష్పచారానికి తెరలేపింది. ఈ 2.5 లక్షల ఇళ్లలో లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు నేటికీ ఒక్క గజం స్థలం పేదలకు ఇవ్వలేదు. -
‘టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ’
తాడేపల్లి. తమ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగులేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత మేరుగు నాగార్జున. చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మేరుగు నాగార్జున. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని, వాస్తవాలను గుర్తించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున హితవు చెప్పారు.ప్రెస్మీట్లో మేరుగు నాగార్జున ఇంకా ఏమన్నారంటే..:ప్రజలు వాస్తవాలు చెబుతున్నా పట్టని బాబు సీఎం చంద్రబాబు ఆలోచనలు దారుణంగా ఉన్నాయి. ప్రజలకు ఏమీ తెలియదన్నట్లుగా ఆయన పాలన సాగిస్తున్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెబుతున్నారు. కానీ ప్రజలే బయటకు వచ్చి, తమకు గత ప్రభుత్వంలోనే పట్టాలు ఇచ్చారని చూపుతున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదు. క్రెడిట్ చోరీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్గా మారినట్లు కనిపిస్తోంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21 నెలల్లో 5,50,314 ఇళ్లు నిర్మించామని, ఈరోజు 2,50,893 ఇళ్లకు గృహ ప్రవేశం చేశామని చెబుతున్నారు. కానీ 2014–2019 మధ్య గానీ, 2024 నుంచి ఇప్పటి వరకు గానీ ఒక నిరుపేద కుటుంబానికి ఒక్క ఇల్లు కట్టించి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? వారి కోసం కనీసం గజం భూమి అయినా చంద్రబాబు కొన్నారా? గత ప్రభుత్వంలో జగన్గారు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి, 21.75 లక్షల ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, వాటిలో 9.02 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. పేదల ఇళ్ల కోసం 17,005 వైయస్సార్ జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు ఒక ఊరు మాదిరిగా ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. ఆ కాలనీల పేరు మార్చి, ఇప్పుడు వాటినే తామే ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.అదీ గత ప్రభుత్వ చిత్తశుద్ధిరాష్ట్రంలో సొంత ఇల్లు లేకుండా ఒక్క కుటుంబం కూడా ఉండకూడదన్న లక్ష్యంతో, గత ప్రభుత్వం వ్యవహరించింది. పేదలందరికీ పక్కా ఇల్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా రూ.31,832 కోట్ల విలువైన 71,811 ఎకరాలను సేకరించి, అందులో 25,374 ఎకరాలను కొనుగోలు చేసి దాదాపు రూ.11,343 కోట్లు ఖర్చు చేశారు. గత ప్రభుత్వంలో కాలనీలు మాత్రమే కాదుం ఊర్లకు ఊర్లే నిర్మించారు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి. దివంగత మహానేత వైయస్సార్గారి వారసుడిగా జగన్ నిరుపేదలకు గూడు కల్పించిన విధానం అది.ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లుగత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో జంగిల్ క్లియరెన్స్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మంచినీటి సౌకర్యాల కోసం మాత్రమే దాదాపు రూ.32,900 కోట్లు ఖర్చు చేశారు. నాడు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ సుమారు రూ.75 వేల కోట్లు ఉంటుంది. ఇక లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని చోట్ల దాదాపు రూ.20 లక్షలు. అవేవీ చేయని కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. ఎకరికో పుట్టిన బిడ్డను మా బిడ్డగా చెప్పుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. టిడ్కో ఇళ్లన్నీ తామే నిర్మించామని చెప్పుకోవడం దారుణం.గత ప్రభుత్వంలో 1.24 లక్షల టిడ్కో ఇళ్లు పంపిణీటిడ్కో ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వంలో దాదాపు 35 పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని 66 ప్రాంతాల్లో లక్షకు పైగా ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు. సాలూరు, విజయనగరం, చిత్తూరు వంటి పట్టణాల్లో కూడా టిడ్కో ఇళ్లు పంపిణీ చేశాం. మొత్తంగా 1,24,680 ఇళ్లు అన్ని వసతులతో జీ+3 విధానంలో నిర్మించి ఇచ్చాం.గతంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి క్రెడిట్ చోరీఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు రంగులు వేసి కూటమి ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వంలో ఉన్నవారు కొత్త కార్యక్రమాలు చేపట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ వైఎస్ జగన్ గారు చేసిన మేలును మీరు క్రెడిట్గా తీసుకోవడం అన్యాయం. అందుకే ప్రజలే ఈ రోజు బయటకు వచ్చి మీ మాయను, భూంరాంగ్ వ్యవహారాలను బట్టబయలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడం, ఇళ్లు నిర్మించడం, టిడ్కో ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేయడం..ఈ చరిత్ర మొత్తం గత ప్రభుత్వానిది. ఆ ఘనత అంతా జగన్కే దక్కుతుంది.ఒక్క ఇంటి పట్టా ఇవ్వకుండా మసిపూసి మారేడుకాయ చేసిన చరిత్ర చంద్రబాబుగారిది. అందుకే ఇకనైనా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, తమ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని మేరుగు నాగార్జున హెచ్చరించారు. -
ఆరోగ్య బీమాలో కమీషన్ల స్కామ్
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ బీమా కార్యక్రమాల అమలులో అక్రమాలకు తెగబడుతోంది. బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పాతరేస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య బీమా పథకంలో కీలక ప్రజాప్రతినిధి, ఉన్నతాధికారి కమీషన్లు దండుకునేలా అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా హౌసింగ్ బోర్డు ఆమోదం లేకుండానే ఓ బ్రోకింగ్ ఏజెన్సీని గుట్టుచప్పుడు కాకుండా ఎంపానెల్ చేసుకున్నట్టు సమాచారం. ఇదే క్రమంలో మరో ఏజెన్సీని సైతం ఎంపానెల్ చేయడానికి ప్రయత్నాలు సాగుతుండగా ఈ అడ్డగోలు వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అస్మదీయ ఏజెన్సీకి అడ్డగోలు కేటాయింపుహౌసింగ్ కార్పొరేషన్ సుమారు 1,700 కుటుంబాలు, 4 వేల మందికిపైగా వ్యక్తుల ఆరోగ్య బీమా కోసం ఏటా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చేస్తుంటుంది. 2025–26 హెల్త్ పాలసీ గడువు వచ్చే నెలలో ముగియనుంది. దీంతో 2026–27 పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కమీషన్లు పొందడానికి అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీల ద్వారా పావులు కదుపుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది. 2021 నుంచి ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచేది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) విధానంలో ముందుకొచ్చిన బ్రోకింగ్ ఏజెన్సీలను వడపోసి అనుభవం ఉన్న రెండు ఏజెన్సీలను గుర్తించేవారు. అనంతరం బోర్డు అనుమతించిన ఓ సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంపికకు సాంకేతిక షరతులు రూపొందించేవారు. ఈ విధానానికి పూర్తి విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఓ బ్రోకింగ్ ఏజెన్సీని ఎంపానెల్ చేయడమే కాకుండా సదరు సంస్థలో పనిచేసే ఉన్నతాధికారికి సన్నిహితుడైన వ్యక్తికి ఉద్యోగులు, వారి కుటుంబాల వైద్య సేవల వినియోగం డేటాను ఇచ్చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాన్ని సదరు వ్యక్తే ఇన్సూరెన్స్ కంపెనీ వర్గాలతో పంచుకున్నాడని వెల్లడైంది. -
దిగజారిన వేరుశనగ ధర
సాక్షి, అమరావతి: వేరుశనగ పంట చేతికొచ్చేవేళ పతనమైన ధరలను చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతుల్లేవనే సాకుతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేరుశనగ ప్ర«ధానంగా ఖరీఫ్ పంట. ఖరీఫ్లో దాదాపు 10 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది రబీ సీజన్లో 2.27 లక్షల ఎకరాల్లో రైతులు సాగుచేశారు. ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరాకు 25–30 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15–20 క్వింటాళ్లకు మించటంలేదు. ఓ వైపు దిగుబడి తగ్గి ఆవేదన చెందుతున్న రైతులకు పతనమైన ధరలు అశనిపాతంగా మారాయి. క్వింటా వేరుశనగకు కనీస మద్దతు ధర రూ.7,263 కాగా వ్యాపారులు రైతుల వద్ద రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్య కొంటున్నారు. 45 రోజుల కిందట రూ.5,500 వరకు కొన్న వ్యాపారులు, దళారులు ఇప్పుడు బస్తాకు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు తగ్గించేశారు. దీంతో రైతులకు ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. నాణ్యత లేదనే వంకలతో కోతలుకాయల నాణ్యత బాగున్నా వ్యాపారుల వద్ద కమీషన్ల కోసం దళారులు నాణ్యత అంతంత మాత్రమే అంటూ రైతులను బెదరగొడుతున్నారు. డిమాండ్ ఉన్న సమయంలో నాణ్యత పట్టింపులేని దళారులు, వ్యాపారులు ప్రస్తుతం నాణ్యత, పర్సంటేజీల పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. వ్యాపారులు, దళారులు కళ్లాల వద్దకు రాశుల్లో వందగ్రాముల కాయలు తీసుకుని విత్తనాలు తీస్తారు. ఆ విత్తనాలను తూకం వేసి నాణ్యత పర్సంటేజ్ నిర్ధారించి ధర నిర్ణయిస్తారు. కాయలు నాణ్యతగా ఉన్నప్పటికీ ఏదో ఒక వంక చెప్పి ధరలో కోత పెడుతున్నారు.పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల రీత్యా వ్యాపారులు, దళారులు చెప్పిన ధరకే అమ్ముకోక తప్పడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు లేవని మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొంటున్నారు.నిమ్మకు నీరెత్తినట్టుగా సర్కారు తీరు రాష్ట్రంలో వేరుశనగ రైతులు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కనీసం కొనుగోలు కేంద్రాలు తెరవాలన్న ఆలోచన కూడా చేయడం లేదు. పంటలకు మార్కెట్లో ధరల్లేనప్పుడల్లా ప్రభుత్వం కేంద్రానికి లేఖలతో కాలయాపన చేస్తోంది. ఇప్పటికైనా నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వేరుశనగను కనీస మద్దతు ధరకు కొనాలి.– పి.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతుల సంఘం -
ఇదేంది సామీ.. సర్కారే ‘రియల్’ దందా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా దోచి పెడుతోంది. పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కనీసం ఆతిథ్య రంగంలో అనుభవం లేని సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ భూములు కొల్లగొడుతోంది. పర్యాటక విధానం 2024–29 పేరిట ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కోరినంత భూమిని.. అడిగిన రేటుకు మారు మాట్లాడకుండా కట్టబెడుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అత్యంత ఖరీదైన ప్రభుత్వ, పర్యాటక భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ‘తిరుపతి వన్’ ప్రాజెక్టు కోసం తిరుపతి రూరల్ మండలంలోని దామినీడులో ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా విలువైన 22 ఎకరాల భూమిని కారు చౌకగా కేటాయించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది.కారుచౌకగా కట్టబెట్టేలా స్కెచ్పర్యాటక ప్రాజెక్టుల పేరుతో నచ్చినోళ్లకు నచ్చిన చోట విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చంద్రబాబు సర్కార్ ధారాదత్తం చేస్తోంది. ఇప్పటి వరకు 99 ఏళ్లకు లీజు పేరుతో శాశ్వతంగా భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న సర్కార్.. తాజాగా మరో అడుగు ముందుకేసి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు (ఎస్ఆర్వో) ప్రకారం రేటుకట్టి.. ఆ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల పాదాక్రాంతం చేస్తోంది. ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించిన 22 ఎకరాల భూమి విలువ రూ.వెయ్యి కోట్లు పైమాటే. వాస్తవానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రభుత్వ భూములు ఎక్కడా లేవు. ఈ క్రమంలో తిరుపతి రూరల్ మండలం దామినీడులో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూములకు అత్యంత డిమాండ్ నెలకొంది. అలాంటి చోట ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.50 కోట్ల వరకు ఉంటే చంద్రబాబు మాత్రం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో రేటుకు అమ్మేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు భూములు కేటాయించడంతో పాటు పలు రాయితీలు కల్పిస్తూ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రైవేటు సంస్థ కోరితే.. భూమి అమ్మేస్తారా?దివ్యశ్రీ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ సిటీ బిల్డర్స్–డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాయి. ఈ సంస్థలు.. భవనాలు నిర్మించి అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకోవడం, క్రయవిక్రయాలు చేయడం తప్ప ఆతిథ్య రంగంలో హోటళ్ల నిర్వహణ, హాస్పటాలిటీలో ఎటువంటి అనుభవం లేదని తెలుస్తోంది. అలాంటి ఈ సంస్థలు ‘తిరుపతి వన్’ ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కల్చరల్, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) డెస్టినేషన్ సెంటర్ను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.1,226.32 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పిస్తామని ఇందుకు 22 ఎకరాల భూమి ఇవ్వాలని కోరాయి. ఈ భూమిని లీజుగా కాకుండా శాశ్వతంగా విక్రయించాలని కోరగా, అందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. పెట్టుబడిదారు అభ్యర్థన మేరకు ప్రభుత్వం సబ్ రిజిస్టర్ విలువ ప్రకారం అప్పనంగా భూములు కట్టబెట్టడంపై ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వన్ ప్రాజెక్టులో భాగంగా ఏడు ఎకరాల్లో ఎంఐసీఈ కాంప్లెక్స్, మరో ఏడు ఎకరాల్లో 300 గదుల వెల్నెస్ జోన్, 250 గదులతో టైమ్ షేర్ సదుపాయం, 4 ఎకరాల్లో రెండు హోటళ్లతో హాస్పటాలిటీ జోన్ (5స్టార్ 200 గదులు, 3 స్టార్ 150 గదులు), 2 ఎకరాల్లో మల్టీప్లెక్స్ జోన్, 2 ఎకరాల్లో కల్చరల్ థీమ్ పార్కు నిర్మిస్తామని చెబుతోంది.రూ.300–400 కోట్ల ప్రోత్సాహకాలు⇒ చంద్రబాబు సర్కార్ తిరుపతి వన్ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని కారు చౌకగా ఇవ్వడమే కాకుండా అనేక ప్రోత్సాహకాల కింద రూ.వందల కోట్లు తిరిగి చెల్లించనుంది. కేపిటల్ సబ్సిడీ కింద రూ.40 కోట్లు ప్రభుత్వమే సంస్థకు ముట్టజెప్పుతోంది. దీంతో పాటు 15 ఏళ్ల పాటు ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, భూమి కొనుగోలు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ రీయింబర్స్, ఐదేళ్లు పరిశ్రమ రేట్లకే విద్యుత్, ఐదేళ్లు విద్యుత్ సుంకం రీయింబర్స్.. ఇలా ప్రోత్సాహకాలన్నీ కలిపి ఏకంగా రూ.300–400 కోట్ల వరకు లబ్ధి చేకూరుస్తోంది. ⇒ వాస్తవంగా ఈ ప్రోత్సాహక మొత్తాన్ని చూస్తే ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎస్ఆర్వో విలువ ప్రకారం విక్రయించే భూమి రేటు కంటే అధికంగా ఉండటం గమనార్హం. రూ.1,226.32 కోట్ల ప్రాజెక్టుకు ఏకంగా రూ.వెయ్యి కోట్ల భూమి ఇవ్వడమే కాకుండా రూ.300–400 కోట్లు విలువైన ప్రోత్సాహకాలతో కలుపుకుని రూ.1,300–1,400 కోట్లు లబ్ధి చేకూరుస్తోంది.⇒ పైగా పెట్టుబడిదారులకు ఆస్తి భరోసా కల్పించడం ద్వారా ఫ్రీ హోల్డ్ ప్రాతిపదికన భూమిని కేటాయించడంతో వాళ్లకు దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ను పొందడానికి, అంతర్జాతీయ హాస్పిటాలిటీ, వెల్నెస్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో సహా ప్రపంచ వ్యాప్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి వీలు కలుగుతుందని ఉచిత సలహా ఇస్తోంది. రేపో మాపో అధికారిక సర్వే నిర్వహించి 22 ఎకరాల భూమిని తిరుపతి వన్ ప్రాజెక్టు కోసం అప్పగిస్తామని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎందుకు వేలం వేయలేదు?రాష్ట్రంలో ఎక్కడైనా సరే విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విషయంలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. పొరుగునే ఉన్న తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో వేలం నిర్వహించి, ఎక్కువ రేటు ఇచ్చే సంస్థలకు ఆయా ప్రభుత్వాలు భూములను అప్పగిస్తున్నాయి. తద్వారా పోటీ పెరిగి మంచి ధర వస్తుంది. తిరుపతి లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరంలో హోటళ్లకు గానీ, భక్తులకు సంబంధించిన వసతుల కోసం గానీ.. ఏ ప్రాజెక్టుల కోసమైనా సరే ఇచ్చే భూములకు వేలం నిర్వహిస్తే మంచి ధర వస్తుందనే విషయం తెలిసీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా, కారుచౌకగా భూములు కట్టబెట్టడం వెనుక అవినీతి, బినామీ బాగోతం దాగి ఉందని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. -
మూలపేట పోర్టు ఘనత జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఆవిర్భావ సభలో... అంతులేని అబద్ధాలు
సాక్షి, అమరావతి : కళ్లార్పకుండా అలవోకగా అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రజలను నిరంతరం వంచించడంలో నిష్ణాతుడైన చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ సభలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతూ, వాటినే నిజాలనుకునేలా ప్రజలను భ్రమలో ఉంచేందుకు ఆదివారం నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి వేదికగా చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేయకుండానే వాటిని సూపర్హిట్ చేసేశామని ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రయత్నించారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలుచేయకుండానే అమలుచేసి చూపించామని గొప్పలు చెప్పుకోవడం ఆయన అసత్యాలకు పరాకాష్ట. అలాగే.. » మహాశక్తి పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500.. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యోగాల కల్పన లేకపోతే రూ.3 వేల నిరుద్యోగ భృతి ఊసేలేకుండానే 21 నెలల పాలన పూర్తిచేశారు. అయినా నిస్సిగ్గుగా వాటి ఊసేలేకుండా వాటిని అమలుచేసేసినట్లు ప్రకటించుకున్నారు. » అన్నదాత పథకం కింద ఏడాదికి ప్రతి రైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి అరకొరగా కొంత విదిల్చి దాన్ని అమలుచేసినట్లు డబ్బా కొట్టుకున్నారు. » దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలను కంటితుడుపుగా ఏదో చేశామన్నట్లు చేసి వాటిని కూడా చేసేసినట్లు బిల్డప్ ఇచ్చారు. » సూపర్సిక్స్తో కలిపి 143 హామీలిచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలుచేయకుండానే సూపర్హిట్ చేశామని చెప్పుకున్నారు.» జాబులు లేకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకోవడాన్ని బట్టి తాను ఏది చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్మడం తప్ప మరో మార్గంలేదని చాటుకున్నారు.రాజధాని రైతులపై కపట ప్రేమ.. మరోవైపు.. రాజధాని రైతులను అన్ని విధాలా దెబ్బతీసి ఇప్పుడు వారి త్యాగాలు వృ«థా కావని చెబుతూ.. ఇంకా వారిని మోసంచేస్తూ.. ఇకపై కూడా మోసంచేస్తూనే ఉంటానని చెప్పకనే చెప్పడం గమనార్హం. పుష్కరకాలం క్రితం భూసమీకరణకు 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఇవ్వకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. వారికింకా ప్లాట్లు ఇవ్వకుండా, ఆ ప్లాట్లకు సంబంధించిన లేఅవుట్ల గురించి పట్టించుకోకుండా మళ్లీ రెండు, మూడు విడతల్లో భూములు తీసుకుంటామని ప్రకటించి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. భూములిచ్చిన రైతులను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాల భూములను కట్టబెడుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. ఒకవైపు ఇప్పటికీ వారి భూములను బలవంతంగా లాక్కుంటూ.. పైకి వారు స్వచ్ఛందంగా ఇస్తున్నారనే మాయమాటలతో రైతులను వంచించేందుకు యత్నించడంపై రైతులు రగిలిపోతున్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి...పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి.. ఆయన్నుంచి సీఎం పదవిని, తెలుగుదేశం పార్టీని లాక్కున్న విషయాన్ని మరచిపోయి 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలోనూ ఎప్పటిలానే ఆయన్ను అవతార పురుషుడిగా కీర్తించారు. తాను చేసిన దారుణమైన మోసాన్ని భరించలేక ఎన్టీఆర్ మానసిక క్షోభతో చనిపోయిన విషయాన్ని కూడా మరిపిస్తూ పార్టీ మొత్తాన్ని తన కబంధ హస్తాల్లోకి తీసుకుని ఇప్పుడాయన గొప్పవాడంటూ చేస్తున్న ప్రసంగాలు, ఆడుతున్న డ్రామాలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తున్నాయి. చనిపోయిన ఎన్టీఆర్ ఆత్మను కూడా వదలకుండా చంద్రబాబు ఆయన్ను వేధిస్తున్నారని ఎన్టీఆర్ నిజమైన అభిమానులు బాధపడుతున్నారు. వైఎస్ జగన్పై మళ్లీ విషం.. మరోవైపు.. వైఎస్ జగన్పై ఎప్పటిమాదిరిగానే ఈ సభలోనూ చంద్రబాబు విషం కక్కారు. 2019–24లో ఇష్టం వచి్చనట్లు చెప్పిన అబద్ధాలు, విష ప్రచారాలు, దొంగ వ్యవహారాలనే వీడియో చేసి ప్రదర్శించారు. అలాగే, సొంత కుటుంబసభ్యుల వేధింపులతో టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుంటే జగన్వల్లే ఆయన చనిపోయాడని చూపించి ప్రజలను అదేపనిగా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. ఇలా ఆవిర్భావ సభ ఆసాంతం ప్రజలను వంచించే అబద్ధాలు, ఎన్టీఆర్కు దొంగ నమస్కారాలు, తనకు సంబంధంలేని వాటిని తన గొప్పలుగా చెప్పుకుని సొంత డబ్బా కొట్టుకున్నారు. -
పునర్విభజనలో 50 శాతం సీట్లుపెరుగుతాయి
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలుచేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ హామీలను అమలుచేయలేరని అనుకున్నారని.. కానీ, తాను చేసి చూపించానని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని, ఇప్పటికే 6.25 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 21 నెలల్లో కొత్తగా ఐదు లక్షల మంది పారిశ్రామికవేత్తలను తయారుచేశామన్నారు. ఒకే రాష్ట్రం–ఒకే రాజధాని తమ విధానమని.. త్వరలో అమరావతి రాజధానిపై కేంద్రం చట్టం చేస్తుందన్నారు. అమరావతి దేవతల రాజధాని కావడంవల్లే కొందరికి నచ్చలేదని విమర్శించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణ పనులు పూర్తవుతాయని, అప్పుడు ప్రధాని మోదీని తీసుకొచ్చి ప్రారంబోత్సవం చేస్తామన్నారు. నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలి పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోవాలని, లేకపోతే వారికి పార్టీలో స్థానం ఉండదని.. భవిష్యత్తులో బాగా చేసిన వారు ప్రజాప్రతినిధులు అవుతారని ఆయన చెప్పారు. త్వరలో నియోజకవర్గాల పునరి్వభజనతో 50 శాతం సీట్లు పెరుగుతున్నాయన్నారు. సీట్లు పెరిగితే కొత్తవారికి పదవులు లభిస్తాయన్నారు. పదవుల్లో మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. -
చంద్రబాబుది రాజకీయం కాదు.. బ్రోకరిజం
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించి, ఇప్పుడు ఆవిర్భావ వేడుకల పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. హైదరాబాద్లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్న చంద్రబాబు క్రెడిట్ చోర్ అని దుయ్యబట్టారు. టీడీపీ, ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా తుంగలోకి తొక్కి, ఆయన పెట్టిన పార్టీని లాక్కున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువలు లేవన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని క్రమశిక్షణ లేని పార్టీగా, నైతిక విలువలు లేని పార్టీగా మార్చింది చంద్రబాబేనని లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచిన సందర్భంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపించిన దుర్మార్గ చరిత్ర చంద్రబాబుది అని గుర్తు చేశారు. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించవద్దని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. జగన్ సంక్షేమ, అభివృద్ధి పాలనతో చంద్రబాబు ఎక్కడా, ఏ విషయంలోనూ సరితూగరని స్పష్టం చేశారు. చంద్రబాబుకు వేడుకలు చేసే అర్హత లేదు.. కామపిశాచుల్లా మహిళల జీవితాలతో ఆడుకుంటున్న టీడీపీ నేతలను ఒక్కరినైనా సస్పెండ్ చేశారా అని లక్ష్మీపార్వతి నిలదీశారు. పొత్తుల కోసం అంటకాగిన పార్టీగా టీడీపీని మార్చేసిన చంద్రబాబుకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించే అర్హత లేదన్నారు. అధికారం కోసం చంద్రబాబు చేయని నీచపు పనులు లేవని, బాబు జీవితమంతా అబద్ధాలతోనే బతుకీడుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేసేది రాజకీయం కాదని, బ్రోకరిజం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, ఎల్లో మీడియా వల్ల రాష్ట్రంలో ఎవరికీ ప్రయోజనం లేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో పిచ్చోడి చేతిలో రాయిలా ప్రభుత్వ పనితీరు మారిందని దుయ్యబట్టారు. చంద్రబాబును తాను మనిషిగా కూడా గుర్తించటం లేదని, జీవిత చరమాంకంలో ఉన్న బాబు ఇకనైనా మారాలని హితవు పలికారు. -
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: అమరావతిపై ఇప్పటికే ప్రజల్ని నిండా ముంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. అమరావతి చట్టబద్ధత పేరుతో పెద్ద డ్రామా నడిపించిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘రెండోదశలో మరో 50వేల ఎకరాలు తీసుకునేందుకే తీర్మానం పేరిట అసెంబ్లీలో డ్రామా ఆడారు. అసెంబ్లీలో ఆరుగంటల పాటు కూటమి నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్ధత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవ సరం లేదా?. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను, అమరావతి రైతులను మోసగించటానికి, మభ్యపెట్టడానికే చంద్రబాబు ఈ డ్రామాలు, నాటకాలు’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అమరావతి రాజధాని అని చెప్పేందుకు ఒక్క అధికారిక పత్రం లేదని చంద్రబాబు ప్రభుత్వమే కేంద్రానికి చెప్పింది. ఈ విషయం ఈనాడు పత్రికే రాసింది. (ఈ సందర్భంగా ఈనాడు ప్రతిని పేర్ని నాని చదివి వినిపించారు) అందుకే హడావిడిగా కేబినెట్, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టారు. నిజంగానే అమరావతికి చట్ట బద్ధత కల్పించాలంటే శాసనమండలి అవసరం లేదా? మండలిని ఎందుకు సమావేశ పరచలేదు? ఒక చట్టం కావాలంటే శాసన వ్యవస్థలో భాగమైన మండలి అనుమతి అక్కర్లేదా? ఉభయ సభలు ఆమోదం తెలపకుండా చట్టం ఎలా అవుతుంది? వాస్తుకోసమే అమరావతిని ఎంపిక చేసుకున్నానని చంద్రబాబు చెప్పారు. మరి అలాంటప్పుడు రెండో దశ విస్తరణలో వాస్తు వ్యతిరేక దిశలో ఎందుకు వెళ్తున్నారు? ఇది అరిష్టంకాదా? అమరావతి ఆలోచనను చంద్రబాబు చేసినప్పుడే ఓటుకు కోట్లు కేసులో చిక్కుకున్నారు. ఈ ప్రశ్నలంటికీ చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు కాబట్టే విజయవాడలో బస్సులో పడుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ఉండడానికి ఇళ్లు, హోటళ్లు ఉన్నాయి, కాని బస్సులో పడుకున్నారంటే అదికూడా ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన డ్రామానే. బస్సులో పడుకునే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని చెప్తున్నారు, అది నిజమే, ఎందుకంటే మిగతావాళ్లు వాస్తవానికి దగ్గరగా ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉండేది, డ్రామా చేసేది చంద్రబాబు మాత్రమేనని పేర్ని నాని దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...సెల్ఫ్ ఫైనాన్స్ కాదు. మొత్తం అప్పులకుప్ప..అమరావతిలో 29,966 మంది రైతుల వద్ద నుంచి 34,400 ఎకరాలు సేకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా? కానీ, వాస్తవాలు ఏమిటి? 2014–2019 మధ్యలో రూ.5,335 కోట్లు అప్పు తెచ్చారు. హడ్కో నుంచి రూ.1,275 కోట్లు తెచ్చారు. దానికి అసలు, వడ్డీ కలిపి ఏటా రూ.106 కోట్లు చెల్లించాలి. అమరావతి పేరుతో ముంబై వెళ్లి గంట కొట్టి రూ.2 వేల కోట్ల అప్పు తెచ్చారు. పదేళ్లకు బాండ్లు తాకట్టు పెట్టి ఆ అప్పు తీసుకున్నారు. దానికి ఏటా అసలు, వడ్డీ కలిపి రూ.886 కోట్లు చెల్లించాలి. ఆరు బ్యాంకుల నుంచి రూ.2,060 కోట్లు అప్పులు ఇచ్చాయి. దానికి అసలు, వడ్డీ కింద ఏటా రూ.124 కోట్లు 14 ఏళ్ల పాటు చెల్లించాలి. మొత్తం రూ.5,335 కోట్లు 2014–2019 మధ్య అప్పులు చేశారు. ఇంకా 2024–25లో అమరావతి పేరుతో మీరు చేసిన అప్పులు చూస్తే.. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు, నాబ్ఫిడ్ నుంచి రూ.7,500 కోట్లు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.8,887 కోట్లు.. అన్నీ కలిపి మొత్తం రూ.47,387 కోట్లు మంజూరు చేసుకుని, అందులో రూ.13 వేల కోట్లు డ్రా చేసుకున్నారు. ఈ రెండేళ్లలో ఆ డబ్బులో రూ.5,500 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారు. రూ.2,500 కోట్లు బిల్లులు చెల్లించారు. రూ.960 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు. అలాంటి మీరు డైవర్షన్ గురించి, మితిమీరిన అప్పుల గురించి జగన్ని విమర్శిస్తారా? అమరావతి పేరుతో రైతులను ముంచింది, రాష్ట్ర ప్రజలను అప్పుల్లోకి నెట్టింది, మెడకు అప్పుల గుదిబండ వేసింది చంద్రబాబు కాదా?రాజధానికి భూములు కొనేస్తే వేల కోట్ల ఆదా...రైతుల్ని ఏడిపించి ఇలా పూలింగ్ చేసే బదులు ఉండవల్లి నుంచి రోడ్డు వేసుకుని కృష్ణాయపాలెం దాటాక రాజధాని పెట్టుకుంటే ఈ 15 వేల ఎకరాలు, ఎకరం కోటి చొప్పున∙కొన్నా రూ.15 వేల కోట్లు ఖర్చవుతాయి. ప్రభుత్వానికి 7500 ఎకరాలు మిగులుతుంది. ఈరోజుకీ రూ.21 వేల కోట్లు చెట్లు పీకడానికో, పునాదులకో ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా రూ.13 వేల కోట్లు 20 నెలల్లో డ్రా చేసి ఖర్చు పెట్టారు. పెన్షన్లు, కౌలు కింద కూడా కలుపుకుంటే మొత్తం రూ.21 వేల కోట్లవుతోంది. దానికి బదులు రూ.15 వేల కోట్లు తెచ్చి పొలాలు కొనేస్తే, 7500 ఎకరాలు మిగిలేది, మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని నిర్మాణం పూరయ్యేది.అమరావతికి న్యాయం చేసింది జగన్...అమరావతికి వాస్తవంగా న్యాయం చేసింది మాజీ సీఎం జగనే. పశ్చిమ బైపాస్ను తీసుకొచ్చి దారీ తెన్నూ లేకుండా ఉన్న అమరావతికి గుంటూరు, విజయవాడతో లింక్ చేసింది ఆయనే కదా. చంద్రబాబు, పవన్కళ్యాణ్కు అమరావతిలో ఇప్పటికీ సొంత ఇళ్లు లేవు. మూడు ముక్కలాట ఆడారని విమర్శలు చేస్తున్న వారు అమరావతి విలువలు పెంచేస్తే సాధారణ ప్రజలు ఇక్కడికి ఎలా వస్తారు? జన జీవనం లేని రాజధానిగా అమరావతి మిగిలిపోవాలా? పేద వాళ్లకు అమరావతిలో జగన్ ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అడ్డుకుని రద్దు చేశారు. అమరావతిలో పట్టుమని వెయ్యి మంది వచ్చే ఆఫీసు ఒక్కటైనా కడుతున్నారా? బ్యాంకులు ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది ఎంత మందో తెలియదా? అమరావతిలో 5 శాతం కంటే తక్కువ నిధులు ఖర్చు పెట్టారు. దీన్ని పూర్తిగా నిర్మించాలంటే రాష్ట్రం అప్పుల పాలవ్వాలా? రాష్ట్ర విభజన కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ తీర్మానం పెడితే జగన్ ఎక్కడున్నారో తెలియదంటున్న చంద్రబాబుకు.. ఆరోజు ప్లకార్డులతో ఆయన నిరసన తెలియచేసిన విషయం తెలియదా?, (అంటూ ప్రెస్మీట్లో ఆ ఫోటో చూపారు) చివరకు, అమరావతిలో జరిగిన అగ్నిప్రమాదాలనూ మాపైకి నెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో కాపలాదారే కాల్చాడని పోలీసులే చెప్పారు. అయినా సరే చంద్రబాబు బురదజల్లుతున్నాడు. 80 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నీచంగా ఆలోచిస్తున్నాడు.ఈ తీర్మానాలు కూడా చేసి పంపండి..ఎలాగో అమరావతిపై రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్లో సవరిస్తున్నారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా తీర్మానం చేయాలి. కనీసం కేబినెట్ తీర్మానం చేసి పంపినా సరిపోతుంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు గనుల్ని కేటాయించాలని కేబినెట్ తీర్మానం చేసి పంపాలి. కేంద్రం కట్టాల్సిన దుగ్గరాజపట్నం స్ధానంలో కట్టుకున్న రామాయపట్నం పోర్టుకు ఖర్చుపెట్టిన నిధుల్ని రీయింబర్స్ చేయమని కేంద్రాన్ని అడగండి. కేంద్రం వద్ద మీ పరపతి కేవలం మీ కేసుల కోసమే కాదు వీటి కోసం కూడా వాడండి. మొత్తం మీద ఇవన్నీ కలిపి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. -
బలవంతపు ‘ఇంటర్’ క్లాసులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యా సంవత్సరం ఎటువంటి ప్రణాళికా లేకుండా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదేరోజు రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కేవలం నెల కూడా గడవకుండానే.. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని స్థాయిల తరగతులు అదే తేదీన ప్రారంభమవుతాయి. కానీ ఇంటర్మీడియెట్ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మండు వేసవిలో ప్రారంభమవుతున్నాయి. మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపీఈ–2026) జరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తరగతులు నిర్వహించడం, అదీ 100 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో జూనియర్ లెక్చరర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి 801 ఉన్నాయి. హైసూ్కల్ ప్లస్లు 502, ప్రైవేట్ కాలేజీలు 181 ఉన్నాయి. 2025–26 నుంచి నేర్వని పాఠాలు తొలిసారి 2025–26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించారు. ఒక పక్క జవాబు పత్రాల మూల్యాంకనం జరగడం.. ఇంకోపక్క అడ్మిషన్లతో లెక్చరర్లు తలమునకలై ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా క్లాసులు కూడా చెప్పాలని ఆదేశించారు. లెక్చరర్లు ఎంత ప్రయత్నించినా విద్యార్థుల హాజరు మాత్రం 10 శాతం దాటలేదు. ఈ ఏడాది గతేడాది చేసిన ప్రయత్నం విఫలమవడంతో 2026–27 విద్యా సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్ తరగతులను రద్దు చేసి జూన్ 12న రెగ్యులర్ విద్యా సంవత్సరంతో ప్రారంభించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి కార్యాలయం పట్టించుకోలేదని తెలిసింది. అయోమయం.. గందరగోళంఇంటర్ విద్యలో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టి 2025–26 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాదికి అమలు చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. అయితే, సిలబస్ ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా బోధించాలో ఇప్పటి వరకు లెక్చరర్లకు శిక్షణ ఇవ్వలేదు. రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్తో పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకీ రాలేదు. ఒకటో తేదీనే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో స్టూడెంట్ కిట్లు అందే పరిస్థితి లేదు. ఇప్పటి దాకా ఏ జిల్లాకూ పుస్తకాలు చేరలేదు. ఏప్రిల్ 14 వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అందువల్ల ఆ కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించరు. ఈ ఏడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 5,31,275 మంది విద్యార్థులకు గాను 5,21,266 మంది పరీక్షలు రాశారు. వీరంతా రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తారు. అయితే, వీరిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో.. ఎంత మంది సప్లిమెంటరీకి సిద్ధమవుతారో తెలియని పరిస్థితి. మరోపక్క ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచే తరగతులు ఏమిటనేది పెద్ద ప్రశ్న. -
బాబు కుట్రలో భాగమే.. కార్టూన్ బరితెగింపు
సాక్షి, అమరావతి: విలువల వలువలు ఏనాడో విడిచేసిన ఈనాడు పత్రిక.. చంద్రబాబు ప్రయోజనం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి సిద్ధమని మరోమారు రుజువు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడానికి తహతహలాడే ఎల్లో మీడియా.. రాజధాని ముసుగులో మరోమారు దిగజారింది. రాజధాని అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం అనే దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేసే రీతిలో ఓ దిగజారుడు కార్టూన్ను ఈనాడు పత్రిక శనివారం ప్రచురించింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తన మార్కు పాత్రికేయ కుతంత్రానికి తెగబడింది. ఆనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం కోసం అనేక దిగజారుడు కార్టూన్లను ప్రచురించిన ఈనాడు పత్రిక అలాంటి దిగజారుడు కార్టూన్తో శనివారం పసుపు విషాన్ని పత్రికలో చిమ్మింది. ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్ చూసి ఆ పత్రిక పాఠకులే కాదు తెలుగు పాఠకులంతా ఛీత్కరించినట్లు రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన నిరసనలే నిదర్శనం. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. రాజధాని కట్టలేకే కార్టూన్ కుట్రలు రాజధాని నిర్మాణంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మరోసారి దుష్ప్రచార కుట్రకు తెగబడింది. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం అనే అవాస్తవాన్ని పదే పదే ప్రచారం చేయాలన్న కుతంత్రంలో భాగంగానే ఈనాడు ఈ కార్టూన్ను ప్రచురించింది. దురుద్దేశపూరితంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కార్టూన్ ప్రచురించింది. వైఎస్ జగన్గానీ వైఎస్సార్సీపీ గానీ రాజధానిగా అమరావతిని ఏనాడూ వ్యతిరేకించనే లేదు. మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే తమ ధ్యేయమని విస్పష్టంగా చెప్పారు. అయినా సరే చంద్రబాబు రాజకీయ కుట్రకు కొమ్ముకాసేందుకే 2019–24 వరకు ఈనాడు పత్రికతోపాటు పచ్చ మీడియా అంతా గగ్గోలు పెట్టి దుష్ప్రచారం సాగించింది. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రాజధానిగా అమరావతిని వైఎస్సార్సీపీ వ్యతిరేకించలేదు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణం చేయాలనే డిమాండ్ చేస్తోంది. కానీ దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా సరే రాజధాని అమరావతి నిర్మాణంలో ఎటువంటి కదలికా లేదు. రూ.20వేల కోట్లకుపైగా అప్పులు చేసినా సరే రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో బరితెగించి అవినీతికి పాల్పడుతోంది. టీడీపీ దోపిడీకి అమరావతి కామధేనువుగా మారిందన్నది స్పష్టమవుతోంది. అరచేతిలో వైకుంఠం చూపించేందుకే అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటూ ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ఉంచుతోంది. రాజధాని నిర్మాణానికి 30ఏళ్లు పడుతుందని చెబుతోంది. రాజధాని నిర్మాణానికి ఏకంగా వందేళ్లు పడుతుందని ఏకంగా బ్రిజేష్ కుమార్ కమిటీకి చంద్రబాబు ప్రభుత్వం నివేదించడం గమనార్హం. అంటే మాస్టర్ప్లాన్లో పేర్కొన్నట్టుగా రాజధాని అమరావతి నిర్మాణం తమ తరం కాదని చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది. ఇదే సమయంలో అమరావతి పేరిట రెండో దశ, మూడో దశ భూసేకరణ పేరుతో చేస్తున్న హడావుడితో అమరావతి ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ‘అమరావతిపై అసెంబ్లీ తీర్మానం’పేరిట కొత్త నాటకానికి తెరతీసింది. అదే అదనుగా ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో సిండికేట్ ఈ దుష్ప్రచారానికి తెగబడింది. ఎన్టీఆర్పైనా దిగజారుడు కార్టూన్లు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్రలో భాగస్వామి అయిన ఈనాడు పత్రిక ఆనాడు కూడా ఇలాంటి దిగజారుడు కార్టూన్లనే ప్రచురించింది. ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్టీ రామారావు వ్యక్తిత్వాన్ని హననం చేసేలా రోజూ కార్టూన్లు ప్రచురించింది. ‘ఆయనకు తెలివి లేదు... రోజూ గంటకు మించి ఆలోచించ లేరు... ఒంటిపై బట్టలు కూడా సరిగా వేసుకోలేరు’ అనే రీతిలో దిగజారుడు కార్టూన్లు ప్రచురించడం గమనార్హం. ఎన్టీ రామారావు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఆయన భార్య లక్ష్మీ పార్వతిపై కూడా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్లు పాత్రికేయ ప్రమాణాలను అథఃపాతాళానికి దిగజార్చాయి. ఆ దంపతులు ఇద్దర్నీ కించపరుస్తూ ప్రతి రోజు కార్టూన్లు ప్రచురించి ప్రజల్లో వారిపై వ్యతిరేకత తీసుకువచ్చే దుష్ప్రచార కుట్రను బరితెగించి సాగించింది. కార్టూన్లలో ముఖ్యమంత్రిని ఏకంగా అర్ధనగ్నంగా చూపిస్తూ ఈనాడు పత్రిక తన కుట్రను పతాకస్థాయికి తీసుకువెళ్లింది. ఆ విధంగా చంద్రబాబు, ఈనాడు రామోజీరావు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కేవలం 9 నెలల్లోనే భారీ కుట్రకు తెగబడ్డారు. అనంతరం 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు. అడ్డదారిలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆనాటి కుట్రకు సహకరించిన ఈనాడు రామోజీరావుకు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. ఎన్టీరామారావు ప్రభుత్వం విధించిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించింది. తద్వారా రామోజీ ఫిల్మ్సిటీ వ్యాపార ప్రయోజనాలకు సహకరించింది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ అసైన్డ్ భూముల ఆక్రమణ తదితర అక్రమాలకు అడ్డే లేకుండాపోయింది. ఆనాడు ఎన్టీరామారావు వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ కార్టూన్లు వేసిన నాటి ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్కు చంద్రబాబు ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవిని ఇవ్వడం గమనార్హం. పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు వైఎస్ జగన్కు వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఈనాడు పత్రిక ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈనాడు పత్రిక కార్టూన్ ప్రచురించడంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈనాడు ప్రచురించిన కార్టూన్పై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈనాడు పత్రికపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. -
రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం
నెల్లూరు రూరల్: రైతులను మిల్లర్లు, దళారులు నిలువునా దోచుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వరి కోతలకు ముందు పుట్టి ధాన్యం (845 కేజీలు) ధర రూ.22 వేలు ఉందని అధికారులు చెబితే.. ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకే కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ధాన్యం ధరల పతనం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ పార్టీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు శివుని నర్సింహారెడ్డి, ఇతర నాయకులు, రైతులతో కలిసి శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాకాణి మాట్లాడుతూ.. మిల్లర్లు చేస్తున్న దోపిడీలో అధికారులు, మంత్రులు, పాలకులు వాటాలు పంచుకుంటున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులను ఆదుకుంటామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో రైతులు దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లాలో రబీ సీజన్లో 20 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుంటే.. కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే ధాన్యం కొనాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు టార్గెట్ ఇవ్వడం చూస్తే.. రైతులను ఏ విధంగా మోసం చేస్తోందో అర్థమవుతోందన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 2.5 శాతం మాత్రమే ధాన్యం కొంటున్నారని, మిగిలిన 97. 5 శాతం దళారులు, మిల్లర్లు దోచుకుపోతున్నారన్నారు. తేమ పేరిట 90 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు నిబంధనల ప్రకారం 17 శాతం కంటే ఒక శాతం అధికంగా తేమ ఉంటే క్వింటాల్కు ఒక కేజీ లెక్కన తరుగు కింద అదనంగా తీసుకోవాల్సి ఉండగా.. పుట్టికి 90 కేజీల అదనపు తరుగు తీసుకుంటున్నారని కాకాణి ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరమైన గన్నీ బ్యాగులు అందజేసి, అన్ని సదుపాయాలు కల్పించామని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచామని చెప్పారు. చంద్రబాబు రూ.500 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. వైఎస్ జగన్ హయాంలో పుట్టి ధాన్యానికి రూ.24 వేలు ధర వస్తే.. అది జగన్మోహన్రెడ్డి గొప్పతనం కాదని, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ధరలు పెరిగాయని టీడీపీ నేతలు, పచ్చమీడియా దు్రష్పచారం చేశాయన్నారు. ఈ రోజు ధరలు పడిపోతుంటే ఇరాన్ యుద్ధం వల్ల అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం తక్షణమే అధికారులు స్పందించి, మద్దతు ధర అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. -
2028 నాటికి అమరావతి పూర్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మాదిరి ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని.. యుమునా నది పవిత్ర జలాలను, పార్లమెంట్లోని పవిత్ర మట్టిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. అమరావతి స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్–5(2)ను సవరిస్తూ కొత్తగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చడంతో పాటు సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ సీఎం చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు జవాబిస్తూ.. అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరని, అంగుళం కూడా కదిలించే పరిస్థితి రాదన్నారు. ‘ఏపీకి ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దృఢత్వం వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం’ అని తెలిపారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.అమరావతిలో ఆదాయం సృష్టిస్తాం‘నాలుగోసారి సీఎం అయ్యా. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే. ఆ రోజు సైబరాబాద్ను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశా. ఈ రోజు అమరావతిని అలా చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కు ఏపీ దేహం అయితే అమరావతి గుండె. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకునేలా తయారు చేసే బాధ్యత మనందరిది. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. ఇక్కడ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇక్కడి ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి తెస్తాం. దేశంలో ఇప్పుడున్న నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి భవిష్యత్ నగరం. వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలో, దేశంలో ఎన్ని లేటెస్టు టెక్నాలజీలు ఉన్నాయో అవన్నీ తెస్తాం. రాష్ట్రాన్ని విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. మూడు మెగా సిటీలు అభివృద్ధి చేస్తాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తాం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో తెలియదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు’ అని చంద్రబాబు అన్నారు. కేంద్రహోంశాఖకు తీర్మానం కాపీ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం కాపీని అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనివారం సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎస్కు పంపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల విభాగం (ఐ అండ్ పీఆర్) ఒక ప్రకటన విడుదల చేసింది. -
తప్పతాగిన వ్యక్తిలా నోరు పారేసుకున్న అచ్చెన్నాయుడు
సాక్షి, అమరావతి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ తప్పతాగిన వ్యక్తిలా రెచ్చిపోయారు. సభలో లేని వారిని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు అసభ్య పదజాలంతో దూషించారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సభకు రాకుండా బయట బ్రోకర్లతో మాట్లాడిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు శనివారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అడ్డగోలుగా విభజించిన ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయకత్వం అవసరమని 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్కళ్యాణ్ బేషరతుగా టీడీపీకి మద్దతిచ్చారని, ఆయన మద్దతుతోనే నాడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అయితే 2019లో ప్రజలు తప్పు చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ పోయినా, దానికి మించిన రాజ«దాని నిరి్మంచుకోవచ్చంటూ ఒక శిల్పిలా చంద్రబాబు కష్టపడి పని చేస్తుంటే.. వైఎస్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. ఇలా అనకూడదంటూనే పత్రికల్లో రాయలేని పదజాలంతో వైఎస్ జగన్ను దూషిస్తూ నోరు పారేసుకున్నారు. నాడు మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో ప్రవేశ పెట్టినప్పుడు గ్యాలరీలో కూర్చున్న నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అన్న మాటలు విని.. తన చేతిలో గన్ ఉంటే అందర్నీ కాల్చేయాలనిపించిందని వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు శాసన మండలి ఎందుకు పెట్టడంలేదని అడుగుతున్నారు. బుద్ది, జ్ఞానం ఉందా? తీర్మానం శాసనసభలో చేస్తారు. మండలిలో చేయరు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మండలిలోకి వెళ్తే అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులు ఏదో ఒక సందర్భంలో మళ్లీ అధికారంలోకి వస్తారు. అందుకే రాజధానిని మార్చకుండా చట్టబద్ధం చేస్తున్నాం. ఎవరు వచి్చనా అమరావతిని మార్చడానికి వీల్లేని విధంగా పటిష్ట విధానం తీసుకొస్తున్నాం. తొలుత రాజధాని విజయవాడ–గుంటూరు మధ్యలో ఉంటుందని చెప్పాం. తర్వాత అమరావతి అనుకున్నాం. ఈ పేరు లేదు కాబట్టి ఈ ఇబ్బందులు. అందుకే ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం’అని చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడిన కొన్ని మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. -
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
సాక్షి, అమరావతి: రాజధానిలో రైతుల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. వాటి నుంచి తప్పించుకునేందుకు మరోసారి సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఎన్నెన్నో సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రానికి పాల్పడుతోంది. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాదాపు రెండేళ్ల తర్వాత రాజధానికి చట్టబద్ధత అంశం గుర్తుకొచ్చినట్లు నటిస్తోంది. ప్రజా సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించేలా అమరావతికి చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మేధావులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. శాసన మండలిని హాజరు పరచకుండా అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. ‘రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై చర్చ జరగాలి.. ఇప్పటిదాకా ఎలా దోచుకున్నారో, ఎలా దోచుకోబోతున్నారో చర్చ జరగాలి.. ఏ రైతుకు ఎక్కడ ఏ ప్లాటు ఇచ్చారో చర్చ జరగాలి.. ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేయడంపై చర్చ జరగాలి.. సమస్యల పరిష్కారం కోసం రాజధాని రైతులు సీఆర్డీఏ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటంపై చర్చ జరగాలి.. ఏడేళ్లు మీరే అధికారంలో ఉన్నా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వక పోవడంపై చర్చ జరగాలి.. రెండవ, మూడవ విడత భూ సేకరణ యత్నాలపై చర్చ జరగాలి.. రాజధాని పేరుతో ఎంత అప్పు చేశారో.. భవిష్యత్తులో ఇంకా ఎంత అప్పు తెస్తారో చర్చ జరగాలి.. ఆ అప్పుల్లోంచి ఎంత దోచుకున్నారో.. దోచుకోబోతున్నారో కూడా చర్చ జరగాలి.. సూపర్ సిక్స్ హామీలపై, కాంట్రాక్టుల్లో కమీషన్లపైనా చర్చ జరగాలి.. రైతులు, విద్యార్థి, ఉద్యోగ వర్గాల సమస్యలపై చర్చ జరగాలి’ అని ప్రజలు, మేధావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని సమస్యలను గాలికొదిలేసి ఒక్క జగన్ను తిట్టడానికే అసెంబ్లీ సమావేశమా? అని నిలదీస్తున్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం తన వైఫల్యం నుంచి తప్పించుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మండిపడుతున్నారు. ఇది చట్ట ధిక్కరణేఅమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తీర్మానం చట్టాన్ని ధిక్కరిస్తున్నట్లుగా ఉందని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు చట్టాలు, రాజ్యాంగం గురించి గొప్పగా చెబుతూనే వాటికి తిలోదకాలు ఇచ్చేలా తీర్మానం చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థలో శాసనసభ, శాసన మండలి భాగంగా ఉంటే, కేవలం శాసనసభలో మాత్రమే ఈ తీర్మానం ఎలా చేస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కరువైంది. సాధారణంగా ఈ రెండు సభలు ఎప్పుడూ సమాంతరంగా జరుగుతాయి. ప్రత్యేక సెషన్ పేరుతో కేవలం అసెంబ్లీని మాత్రమే నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. ఒక సభలో మెజారిటీ ఉండి, రెండవ సభలో లేనప్పుడు.. రెండవ సభను కావాలనే హాజరు పరచకపోవడం చట్టసభల సమగ్రతను దెబ్బ తీయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక అంశానికి పూర్తి స్థాయి చట్టబద్ధత రావాలంటే.. అది బిల్లు రూపంలో ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. తీర్మానం అయినా ఉభయ సభలు చేస్తేనే దానికి నైతికత ఉంటుంది. కేవలం ఒక సభ మాత్రమే తీర్మానం చేస్తే, అది ఆ సభలోని అధికార పార్టీ రాజకీయ తీర్మానంగానే మిగిలి పోతుందనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు ఇప్పుడు అమరావతి చట్టబద్ధత కోసం అంటూ చేసిన తీర్మానం రాజకీయ తీర్మానంగానే మిగిలిపోయింది. శాసన మండలిని బైపాస్ చేస్తూ చేసిన ఈ తీర్మానం ఒక రాజకీయ గిమ్మిక్కే తప్ప అందరి ఆమోదంతో చేసింది ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.అమరావతి కుంభకోణాలు బయట పడతాయని భయం రాజధాని అమరావతి ముసుగులో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అవినీతిని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నిస్తారనే భయంతోనే చంద్రబాబు శనివారం కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించలేదని స్పష్టమవుతోంది. రాజధాని ముసుగులో 2014–19లోనే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి, వేల ఎకరాల భూములను తను, తన బినామీల గుప్పిట్లో పెట్టుకున్నారు. కాంట్రాక్టుల ముసుగులో అప్పట్లోనే వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరిగేలా హంగామా చేయడం, నిర్మాణాల పేరుతో రెట్టింపు అంచనాలతో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఇందుకోసం భారీగా అప్పులు తెస్తున్న ఉదంతాలన్నీ చర్చకు వస్తాయనే కౌన్సిల్ సమావేశం జరపకుండా కేవలం అసెంబ్లీ సమావేశం మాత్రమే పెట్టి తీర్మానం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్పై బురదజల్లడానికి పోటాపోటీ ఈ తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చ ఆద్యంతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగానే సాగింది. ఆయనపై బురదజల్లి లబ్ధి పొందడానికి చంద్రబాబు, లోకేశ్ ప్రయత్నించగా.. వారిని బుట్టలో వేసుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడి జగన్పై తిట్ల వర్షం కురిపించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరీ బరితెగించి జగన్పై నోరు పారేసుకోవడం చూసి అధికార పార్టీ నాయకులే ఆశ్చర్యపోయారు. 2019 ఎన్నికల్లో జగన్కు ఓట్లేసి ప్రజలు తప్పు చేశారంటూ ప్రజాభిప్రాయాన్ని సైతం గౌరవించకుండా వారినీ ఆడిపోసుకోవడం చూస్తే అధికార గర్వం అచ్చెన్నాయుడి తలకు ఏ స్థాయిలో ఎక్కిందో అర్థమవుతోందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభలో ఆయన ఇంత అడ్డగోలు భాష మాట్లాడడం వెనుక మంత్రి పదవిని రక్షించుకునే ఆరాటం ఉందని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఆయన మంత్రి పదవి ఊడిపోయేలా ఉండడంతో ఎలాగైనా లోకేశ్ను ప్రసన్నం చేసుకునేందుకు జగన్పై చెలరేగిపోయినట్లు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టామన్న వసంత, యార్లగడ్డవంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, రెడ్డప్పగారి మాధవిరెడ్డి తదితరులు జగన్ను తిట్టడానికి పోటీ పడ్డారు. వసంత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు తమ ప్రసంగాల ద్వారా చాటారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా వాదన వినిపించామని నిస్సిగ్గుగా వారిద్దరూ సభలో చెప్పుకోవడం విశేషం. అప్పట్లో తాను అమెరికా వెళ్లినప్పుడు కూడా అమరావతిని స్వాగతిస్తూ పచ్చ పత్రికకు ప్రకటన ఇచ్చినట్లు యార్లగడ్డ సభలో చూపించారు. సభలో ఆద్యంతం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్, ఇతర నేతలంతా వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం అన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదన్న విషయాన్ని దాచిపెట్టి, కేవలం ఆయనపై అభాండాలు మోపుతూ.. విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒకరి భుజాలు ఒకరు తడుముకుని బల్లలు చరుచుకున్నారు. స్పీకర్ స్థానంలో తటస్థంగా ఉండాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ ప్రసంగం చేసి సభ ఔన్నత్యాన్ని మరోసారి దెబ్బతీశారు. ఆ 11 మంది ఈసారి కూడా సభకు రాలేదని వైఎస్సార్సీపీపై రాజకీయ విమర్శ చేశారు. పనిలో పనిగా చంద్రబాబును పొగుడుతూ స్వామి భక్తిని చాటుకున్నారు.రాజధాని రైతులను మాయ చేసేందుకే..తమ భూములు తీసుకుని 12 ఏళ్లు దాటినా, ఇంత వరకు ప్లాట్లు ఇవ్వకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం వందల ఎకరాలు కట్టబెడుతుండడంపై రాజధాని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో తీసుకున్న భూముల సంగతి ఇంకా తేల్చకుండానే ఇప్పుడు రెండవ విడత భూ సమీకరణ చేస్తుండడం, మూడవ విడతకు సిద్ధమవుతుండడంపై రాజధాని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. గ్రామ సభల్లో రైతుల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి చట్టబద్ధత అంటూ రాజధాని రైతులను మాయ చేసేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని ఉన్నత స్థాయి ఉద్యోగ వర్గాల సమాచారం. మరోవైపు ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల్లోనూ అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని మభ్య పెట్టేందుకు, వారి దృష్టి మళ్లించేందుకు చట్టబద్ధ తీర్మానం పేరుతో చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ఇట్టే తెలుస్తోంది. -
సమాచారాన్ని సరిపోల్చుకోకుండా నివేదికలు వద్దు
సాక్షి, అమరావతి: న్యాయాధికారుల పనితీరు, సమర్థత, నిజాయితీ తదితరాల మదింపునకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికల (ఏసీఆర్) తయారీ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. న్యాయాధికారులపై ఏసీఆర్ల రూపకల్పన విషయంలో కేవలం జిల్లా ప్రధాన జడ్జిలు ఇచ్చే సమాచారానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల్లో కూడా సమాచారాన్ని తెప్పించుకుని, రెండింటినీ సరిచూసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాల నమోదు సందర్భంలో అత్యంత జాగరూకత అవసరమని, ఈ నమోదు ఏకపక్షంగా ఉండకూడదని ఉద్ఘాటించింది. ‘పలు కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సహచరులు, కక్షిదారులు న్యాయాధికారుల నిజాయితీపై ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నచ్చని తీర్పునిచ్చారన్న కారణంతో న్యాయవాదులు, కక్షిదారులు నిజాయితీపరులైన న్యాయాధికారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఫిర్యాదులపై విచారణ విషయంతో పాటు నిజాయితీపరులైన న్యాయాధికారులను రక్షించే విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు సమతుల్యత పాటిస్తున్నారు’ అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే తనకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలో పేర్కొన్న ప్రతికూల అభిప్రాయాలను తొలగించాలన్న తన వినతిని తిరస్కరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ను సవాలు చేస్తూ విజయబాబు అనే న్యాయాధికారి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. విజయబాబు నిజాయితీ సందేహాస్పదమా? కాదా? అన్న విషయంపై న్యాయమూర్తులతో కూడిన రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తాము తమ నిర్ణయాన్ని చెప్పలేమంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందన్రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. న్యాయాధికారి వ్యాజ్యం వివరాలు.. జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్.విజయబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల పనిచేశారు. ఆయనకు సంబంధించిన 2009 వార్షిక నివేదికలో ప్రతికూల అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే ఏ ప్రాతిపదికన తన ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలు పొందుపరిచారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్)కు వినతి పత్రం ఇచ్చారు. దీంతో రిజి్రస్టార్ ఏసీఆర్ తయారీ విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందుంచిన ఆధారాలను విజయబాబుకు అందచేశారు. నల్గొండ జిల్లాలో పనిచేసే సమయంలో అప్పటి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో పాటు అప్పటికి పెండింగ్లో ఉన్న రెండు శాఖాపరమైన విచారణలను ఆధారంగా చేసుకుని ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు విజయబాబు గుర్తించారు. అటు తరువాత విజయబాబుపై ఉన్న ఆ రెండు శాఖాపరమైన విచారణలను హైకోర్టు 2012లో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విజయబాబు 2009 ఏసీఆర్లో పొందుపరిచిన ప్రతికూల అభిప్రాయాలను పునః సమీక్షించాలని కోరారు. ఈ అభ్యర్థనను రిజిస్ట్రార్ (విజిలెన్స్) 2013లో తిరస్కరించారు. దీంతో ఆయన అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయబాబు తరఫున న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, విజయబాబుపై ఉన్న విచారణలను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. -
‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా’
సాక్షి, తాడేపల్లి: అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ల పేరుతో చంద్రబాబు జనం సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోంది. అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు 21 వేల కోట్లు ఖర్చు చేశారు. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్ చేశారు.‘‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా చేశారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదు. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా?. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయి. అమరావతిపై వైఎస్ జగన్కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారు. రాజధానిలో పేదలు లేకుంటే ఎలా అభివృద్ధి జరుగుతోంది. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలి. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
వక్ఫ్ బోర్డులో ఇదో రకం దోపిడీ!
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. వక్ఫ్ భూముల అన్యాక్రాంతం, ఇష్టానుసారంగా సిబ్బంది నియామకం వంటి అవకతవకలకు నెలవుగా మారిన ఏపీ వక్ఫ్బోర్డులో తాజాగా స్టేషనరీ బిల్లుల పేరిట దోపిడీ బాగోతం వెలుగుచూసింది. అడ్డగోలుగా బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని సమాచారం. వక్ఫ్బోర్డు పరిధిలోని వక్ఫ్ సర్వే కమిషనర్ కార్యాలయంలో సాధారణంగా స్టేషనరీ ఖర్చు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలకు మించదు. ఇటీవల ఆ బిల్లులు రూ.లక్షలు దాటుతుండటంతో సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది డిసెంబర్ 11 నుంచి ఈ ఏడాది జనవరి 20వ తేదీ వరకు కేవలం 40 రోజుల వ్యవధిలోనే స్టేషనరీ ఖర్చు పేరుతో రూ.30,76,558 బిల్లులు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతేడాది డిసెంబర్ 11న ఏపీటీఎస్ పేరుతో స్టేషనరీ బిల్లు రూ.3,16,111 పెట్టారు. డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 21 వరకు ఒక్క షణ్ముఖం ఏజెన్సీ పేరుతోనే మొత్తం 14 బిల్లులు పెట్టడం గమనార్హం. ఆ మొత్తం రూ.23,73,247 స్టేషనరీ ఖర్చుగా చూపించారు. జనవరి 19, 20 తేదీల్లో శ్రీ గాయత్రి ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.3,87,200కు మరో రెండు బిల్లులు పెట్టారు. వక్ఫ్ సర్వే కమిషనర్గా షిరీన్బేగం బదిలీ అయ్యాక, ఆ పోస్టులో ఝాన్సీలక్ష్మి ని ఇన్చార్జిగా నియమించిన తర్వాతే స్టేషనరీ బిల్లుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్టేషనరీ బిల్లుల రూపంలో రూ.లక్షలు దురి్వనియోగం చేస్తున్న వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. -
ఆటిజంకు 'స్టెమ్ సెల్ థెరపీ' నిషిద్ధం
సాక్షి, అమరావతి: ఆటిజం బాధిత చిన్నారులకు స్టెమ్ సెల్ థెరపీ (మూల కణ చికిత్స) పేరిట కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. పిల్లలకు నయమైతే చాలన్న తల్లిదండ్రుల బాధను ఆసరాగా చేసుకుని రూ.లక్షల్లో గుంజుతున్నాయి. కానీ ఆటిజానికి ఈ చికిత్స సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తేల్చిచెప్పింది. ఆటిజంకు ఈ చికిత్స నిషిద్ధమని స్పష్టం చేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో కేవలం క్లినికల్ ట్రయల్స్లో భాగంగా మాత్రమే ఈ చికిత్సను వినియోగించవచ్చని తెలిపింది. ఇందుకు రోగుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని ఆదేశించింది. ఈ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిన ఎన్ఎంసీ.. తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు మేరకు ఆటిజానికి స్టెమ్ సెల్ చికిత్స చేయడం చట్టవిరుద్ధమని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. 32 రకాల వ్యాధులకు మాత్రమే.. స్టెమ్ సెల్ థెరపీని కేంద్ర ఆరోగ్య శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అనుమతించిన 32 రకాల వ్యాధులకు మాత్రమే ఉపయోగించాలి. పెద్దల్లో లుకేమియా, మైలోఫైబ్రోసిస్, మల్టిపుల్ మైలోమా, తీవ్ర రక్తహీనత, అప్లాస్టిక్ అనీమియా సహా 18 వ్యాధులకు మాత్రమే స్టెమ్ సెల్ చికిత్సను ఐసీఎంఆర్ ఆమోదించింది. అదేవిధంగా పిల్లల్లో లుకేమియా, తలసీమియా, వారసత్వంగా వచ్చే ఎముక మజ్జ వైఫల్య వ్యాధులు, ఈవింగ్స్ సార్కోమా, న్యూరోబ్లాస్టోమా సహా 14 రకాల వ్యాధులకు మాత్రమే ప్రామాణిక చికిత్సగా దీనిని ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తోంది. రూ.లక్షల్లో దోపిడీ.. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు స్టెమ్ సెల్ థెరపీతో ఆటిజం నయం అవుతుందంటూ విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఒక సిట్టింగ్కు రూ.3 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తాన్నే తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు ప్యాకేజ్లు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇలా రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా స్టెమ్ సెల్ థెరపీ పేరిట దోపిడీ సాగుతుంటే వైద్య, ఆరోగ్య శాఖ కనీసం పట్టించుకోవడం లేదంటూ చిన్నారుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
రైల్వే, ఎన్హెచ్ఏఐ ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాల నివారణకు కేంద్ర రైల్వేశాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) శాఖలు ప్రత్యేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ కార్యాచరణను రూపొందించాయి. రైల్వే ట్రాక్లపై లోపాలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించగా... జాతీయ రహదారులపై 30 రకాల లోపాలను గుర్తించి సరిచేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) సన్నద్ధమవుతోంది. ఆ మేరకు ఆ రెండు శాఖల కార్యాచరణ ఇలా ఉంది.. పట్టాలు తప్పకముందే అప్రమత్తం చేసే సీబీఎం రైలు బోగీలు పట్టాలు తప్పకుండా ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ ఏఐ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘కండీషన్ బేస్డ్ మానిటరింగ్(సీబీఎం) సిస్టం’ పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. దక్షిణ కొరియాకు చెందిన గ్లోబిజ్ ఈ ఏఐ పరిజ్ఞానాన్ని రూపొందించింది. ముందుగా హైస్పీడ్ రైళ్లలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. అనంతరం దశల వారీగా ఇతర రైళ్లలో కూడా ప్రవేశపెట్టనుంది. ఏఐ ఆధారిత సెన్సార్లను రైళ్లలో ఏర్పాటు చేస్తారు. రైలు చక్రాలు, బోగీలు, తలుపులు, ఎలెక్ట్రికల్ సిస్టంలలో ఏర్పాటు చేస్తారు. రైలు ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లు, రైలు మెకానికల్ బిహేవియర్ను ఈ సెన్సార్లు రికార్డు చేస్తాయి. రైలులోనే పొందుపరిచే ఎడ్జ్ సర్వర్లు వాటిని వెనువెంటనే విశ్లేషిస్తాయి. రైలు పట్టాలపై ఎక్కడైనా లోపాలు ఉంటే రైలు వైబ్రేషన్లు, మెకానికల్ బిహేవియర్లో వ్యత్యాసం తెలుస్తుంది. అంటే కొంత దూరంలో ఎక్కడో ట్రాక్పై లోపాలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దాంతో వెంటనే లోకో పైలట్ ట్రైన్ వేగాన్ని తగ్గించడంతోపాటు అవసరమైతే నిలిపివేస్తారు. అనంతరం రైల్వే సాంకేతిక బృందాలు ట్రాక్ వెంబడి పరిశీలించి లోపాలను సరిచేస్తాయి. తద్వారా ముందుగానే అప్రమత్తమై రైలు పట్టాలు తప్పడం వంటి ప్రమాదాలను నివారించవచ్చు. అందుకోసం రూపొందించిన సీబీఎం విధానాన్ని దేశంలో అన్ని రైళ్లలో దశల వారీగా ప్రవేశపెట్టాలన్నదే లక్ష్యమని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి.జాతీయ రహదారులపై డాష్కామ్ చెక్జాతీయ రహదారులపై గుంతలతోపాటు ఇతర లోపాలు గుర్తించేందుకు ‘డాష్కామ్ అనలిటిక్స్ సర్విసెస్’ పేరిట ఎన్హెచ్ఏఐ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. అందుకోసం అత్యధిక రిజల్యూషన్ ఉన్న స్మార్ట్ కెమెరా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జాతీయ రహదారులపై రూట్ పెట్రోలింగ్ వాహనాలు(ఆర్పీవీ)లకు ఈ స్మార్ట్ కెమెరాలను అమరుస్తారు. పెట్రోలింగ్ చేస్తుంటే ఆటోమేటిగ్గా రహదారులను స్కాన్ చేస్తూ ఫొటోలు తీస్తాయి. 30 రకాల అంశాలను ఈ ఫొటోల ద్వారా గుర్తించవచ్చు. రహదారులపై చిన్న పగుళ్లు, గుంతలు, బారియర్లు లేకపోవడం, రాంగ్రూట్లో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు రోడ్లను కట్ చేయడం వంటివాటి ఫొటోలు నేరుగా ‘సెంట్రల్ డేటా లేక్’పేరుతో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతాయి. ఆ ఫొటోల ద్వారా గుర్తించిన లోపాలను ఎన్హెచ్ఏఐ అధికారులు సరిదిద్దుతారు. జీపీఎస్ విధానం ద్వారా లోపాలు ఉన్న ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించి మరమ్మతులు చేపడతారు. ఎన్హెచ్ఏఐ దేశంలో 40వేల కి.మీ. జాతీయ రహదారులను ఐదు జోన్లుగా విభజించి డ్యాష్కామ్ సిస్టం పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా జాతీయ రహదారులపై ప్రమాదాలను తగ్గించాలన్నది ఎన్హెచ్ఏఐ లక్ష్యం. -
కోకోపై ‘సిండికేట్’ పడగ!
సాక్షి, అమరావతి: ఏలూరు వద్ద కోకో సిటీని ఏర్పాటు చేస్తున్నాం..ఆయిల్ పామ్ రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తాం..నూనె వెలికితీత నిష్పత్తి(ఓఈఆర్) ఫార్మూలా ప్రకారం ఏటా ఆయిల్ పామ్ తాజా గెలల ధరల నిర్ణయిస్తున్న మాదిరిగానే కోకో ధరల నిర్ణాయక విధానం తీసుకొస్తాం’ అని ఇటీవలే ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో చంద్రబాబుప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ క్షేత్ర స్థాయిలో సిండికేట్గా మారిన ముఠా.. రైతులను దోపిడీ చేస్తుంటే ఇదే ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోందంటూ కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు కొమ్ముకాస్తూ తమని పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో సాగవుతుంది. ప్రధానంగా కొబ్బరి, ఆయిల్ పామ్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు. ఏటా సగటున 12వేల టన్నుల గింజల దిగుబడి వస్తుంది. ఇందులో 80 శాతం గింజల్ని క్యాడ్బరీ సేకరిస్తుండగా, మిగిలిన గింజలను నెస్లే, క్యాంప్కో, లోటస్ తదితర కంపెనీలు సేకరిస్తున్నాయి. కోకో పంటకు నవంబర్ నుంచి జూన్ వరకు సీజన్. జూలై నుంచి అక్టోబర్ వరకు అన్ సీజన్. దిగుబడిలో రెండొంతులు సీజన్లోనూ, ఒక వంతు అన్ సీజన్లోనూ చేతికొస్తుంది. గతంలో సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా గింజలన్నింటినీ ఒకే రీతిలో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కంపెనీలు కొనుగోలు చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సిండికేట్ మాయాజాలంతో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు.. దిగజారిన దిగుబడులు గతేడాది అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.750 ధర పలుకుతున్న సమయంలో స్థానికంగా కంపెనీలు సిండికేట్గా మారి కిలో రూ.350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేయగా, ప్రభుత్వం కిలోకి రూ.50 ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మే 23న జీవో జారీ చేయగా, అప్పటికే రైతులు తమ వద్దనున్న పంటను అయినకాడికి తెగనమ్ముకోవడంతో ఎకరాకు రూ.40 వేల వరకు నష్టపోయారు. ఇక నుంచి కంపెనీలు కిలోకు రూ.500 తక్కువ కాకుండా కొనుగోలు చేస్తాయని ప్రచారం జరగడంతో లీజులు అమాంతం పెంచేశారు. అప్పటి వరకు ఎకరాకు రూ.1.20 లక్షలు వసూలు చేస్తుండగా, ఈ ఏడాది రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెంచేశారు. మరొక పక్క పెరిగిన ఎరువులు ధరలు, కూలీ ఖర్చులు కోకో రైతులకు పెను భారంగా మారాయి. పొటాష్ 50 కేజీల బస్తా రూ.1,600 నుంచి రూ.1,950కు పెరిగింది. కూలీ ఖర్చులు మగవాళ్లకు రూ.450 నుంచి రూ.520కి, ఆడవాళ్లకు రూ.200 నుంచి రూ.280కి పెరిగాయి. ఇలా ఎకరాకు రూ.45వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడులు పెరిగాయి. మరోపక్క తేనె మంచు, ఇతర తెగుళ్ల ప్రభావంతో దిగుబడులు అనూహ్యంగా పడిపోయాయి. గతేడాది ఎకరాకు 4క్వింటాళ్లు రాగా, ఈఏడాది 2.5 క్వింటాళ్లు రావడం గగనమైపోయింది. సరిగ్గా ఇదే సమయంలో కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి అంతర్జాతీయ ధరలను బూచిగా చూపి అడ్డగోలుగా ధరలను తగ్గించేస్తూ వచ్చారు. 2023–24 సీజన్లో కిలో కోకో గింజలకు రూ.1,050 ధర లభించగా, గతేడాది ప్రీమియం గింజలకు రూ.350 నుంచి రూ.450, అన్సీజన్ గింజలకు కిలో రూ.200–250కు మించి కొన్న దాఖలాలు లేవు. ఫలితంగా ఎకరాకు రూ.40 వేలవరకు నష్టపోయారు. కాగా ఈ ఏడాది అంత కంటే దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీమియం గింజలకు సైతం ఈ ఏడాది వ్యాపారులు కిలోకు రూ.280 చెల్లిస్తుండగా, కంపెనీలు రూ.300కు మించి చెల్లించడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక ఓ వైపు, కంపెనీల మాయాజాలంతో మరొక వైపు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కనీసం ఎకరాకు రూ.45వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోయే పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. కోకో గింజల ధరల పాలసీ ఏది? కంపెనీలు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నాయి. సీజన్, అన్ సీజన్ అనే తేడా లేకుండా వారు చెప్పిందే ధర.. ఇచి్చందే పైకం అన్నట్టుగా వీరి దందా సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలతో సంబంధం లేకుండా ధరలను తగ్గించి దోపిడీకి పాల్పడుతున్నారు. గతేడాది వీరి దోపిడీకారణంగా కోకో రైతులు రూ.500 కోట్ల మేర నష్టపోయారు. కోకో కాంక్లేవ్æలో చేసిన ప్రకటన మేరకు తక్షణమే కోకో గింజల ధరల పాలసీని ప్రకటించాలి. కోకో గింజలకు మద్దతు ధర ప్రకటించి కంపెనీలు ఆ ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కోకో రైతుల సంఘంఈ రైతు పేరు అవర్ని అనిల్కుమార్. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన ఈయన 150 ఎకరాలు కౌలుకు తీసుకుని కోకో సాగు చేస్తున్నారు. గతేడాది ఎకరాకు రూ.1.20 లక్షలు కౌలుకు ఇస్తే. ఈ ఏడాది రూ.1.75 లక్షలకు పెంచేశారు. కొన్ని చోట్ల రూ.2 లక్షలు కూడా డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడి ఎకరాకు రూ.45 వేలకు పైగా అవుతోంది. గతేడాది ఎకరాకు 4 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 2.5 క్వింటాళ్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రైవేటు వ్యాపారులు కిలోకు రూ.280 చెల్లిస్తుంటే స్థానిక మాండలేజ్ కంపెనీ రూ.300 ఇస్తోంది. గతేడాది మాదిరిగానే ఈఏడాది కూడా ఎకరాకు రూ.60వేల వరకు నష్టపోతున్నామంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కోకో రైతులను ఆదుకోకపోతే తీవ్ర నష్టాలను చవి చూస్తామని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు శాసన సభ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: శాసన సభ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. విభజన చట్టంలోని సెక్షన్–5లో ‘ఏపీ రాజధానిగా అమరావతి’ అనే పదాన్ని చేర్చాలని కోరనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని అభ్యర్థించనున్నారు. ఇదిలా ఉండగా శాసన సభను సమావేశపరచి శాసన మండలిని సమావేశపరచక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వంటింట్లో 'వార్'!
సాక్షి, అమరావతి: ధరల నియంత్రణలో చంద్రబాబు సర్కార్ వైఫల్యం సామాన్యుడి వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరలు అంతకంతకూ భగ్గుమంటూ జనం నడ్డి విరుస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే దిక్కులు చూస్తోంది. గత 22 నెలలుగా నూనె రేట్లు కాక రేపుతున్నాయి. ప్రతి నెలా భారీగా పెరగడమేగానీ స్వల్పంగా కూడా దిగొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతుండగా గ్యాస్ సంక్షోభం పేదల జీవనాన్ని మరింత దిగజార్చింది. చంద్రబాబు సర్కారు పీఠం ఎక్కిన తర్వాత గ్యాస్ రేట్లు రెండు సార్లు పెరగడంతో జనంపై ఏకంగా రూ.110 భారం పడింది. గ్యాస్ కోసం 10–15 రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో మండుటెండల్లో వినియోగదారులు ఏజెన్సీలకు క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు వరదలు, అకాల వర్షాలు, కరువు దెబ్బకు పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. మార్కెట్లో చూస్తే నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రోజువారీ పనులు లేక.. చేతిలో చిల్లి గవ్వలేక.. భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలతో పేదలు విలవిల్లాడుతుంటే చంద్రబాబు సర్కారు వేడుక చూస్తోంది. 60 శాతానికిపైగా పెరిగిన నూనెల ధరలు.. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఏపీలో వంట నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి. గత 22 నెలలుగా పామాయిల్, సన్ఫ్లవర్, వేరుశనగ నూనె రేట్లు పైకి ఎగబాకుతూనే ఉన్నాయి. పది రోజుల క్రితం సన్ఫ్లవర్, పామాయిల్ రేట్లు లీటరుకు రూ.15–25 వరకు పెరిగాయి. గతంలో ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెరిగిన నూనె రేట్లు.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితుల్లోనూ ఆకాశాన్ని తాకుతుండటం గృహిణులను కన్నీళ్లు పెట్టిస్తోంది. 2024 ఏప్రిల్లో లీటర్ వేరుశనగ నూనె రూ.167.87 కాగా ఇప్పుడు రూ.210–22 ఉంది. గతంలో పామాయిల్ రూ.89–91 ఉంటే ఇప్పుడు రూ.131–140 ఉంది. సన్ఫ్లవర్ గతంలో రూ.112 ఉంటే ఇప్పుడు రూ.180–190కి కొనుగోలు చేయాల్సిన దుస్థితి. పామాయిల్ ఏకంగా 60 శాతం, సన్ఫ్లవర్ 63–70 శాతం, వేరుశనగ నూనెపై 70 శాతం రేట్లు పెరిగాయి. వీటితోపాటు ఆవనూనె, సోయా, వనస్పతి రేట్లు కూడా దిగి రావట్లేదు. ఫలితంగా మధ్య తరగతి కుటుంబాలు వంటలను కుదించుకుంటున్న పరిస్థితి. గ్యాస్ కొరతకు తోడు నూనె రేట్లకు భయపడి ఒంటి పూట వంటలు వండుకోవడం గమనార్హం. ఉడకని పప్పులు.. తగ్గని రేట్లు.. వంట నూనెలకు తోడు పప్పు దినుసుల రేట్లు పేదింటి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి. జాతీయ సగటుతో పోల్చినా, తెలంగాణతో చూసినా ఏపీలోనే రేట్లు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కిలో కందిపప్పు రూ.120–150, గోధుమ పిండి రూ.71–100, మినçప్పప్పు రూ.146–150 పైగా పలుకుతోంది. పెసలు సైతం కిలో రూ.160, వేరుశనగ గుళ్లు రూ.188–200, శనగపప్పు రూ.128కి తగ్గట్లేదు. నిత్యం కూరలు, తాలింపుల్లో తప్పనిసరిగా వినియోగించే దినుసుల్లో ఎండు మిర్చి రూ.200–390, పసుపు రూ.380, వెల్లుల్లి రూ.219–250, అల్లం రూ.109–150, కారం రూ.500(ప్రీమియం), సాధారణం రూ.200కిపైగా, ఇంగువ 100 గ్రాములు రూ.200 వరకు ఉంది. పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేదు గానీ మార్కెట్లో కొనుగోలుదారులు కూరగాయలను ముట్టుకుంటే మండుతున్నాయి. టమాటా రైతుకి కిలో రూ.3 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో రూ.20–25 చొప్పున వినియోగదారులు కొనాల్సి వస్తోంది. అరటి సైతం రైతుకు కిలో రూ.5 మాత్రమే దక్కుతుంటే బయట డజను రూ.100 పలుకుతోంది. వేసవిలో పండ్లలో అధికంగా తీసుకునే కర్బూజా రైతుల నుంచి కిలో రూ.3–4 చొప్పున కొంటుంటే బయట కాయ ఏకంగా రూ.20–30 ఉంటోంది.చివరికి కరివేపాకు సైతం కిలో రూ.180 పలుకుతోంది. పచ్చి మిర్చి రూ.79, క్యాప్సికం రూ.75, కూరమామిడి రూ.100కు తక్కువ లేదు. ఇవన్నీ పండించిన రైతులకు పదో పరకో దక్కుతుంటే పచ్చ సిండికేట్ మార్కెట్లో వినియోగదారుల జేబులను గుల్ల చేస్తోంది. బియ్యం.. బాబోయ్! అన్నపూర్ణగా పిలుచుకునే ఆంధ్రప్రదేశ్లో బియ్యం రేట్ల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. వరి పండించే రైతులకు 75 కిలోల బస్తాకు రూ.1,100–1,500 మాత్రమే దక్కుతుంటే మార్కెట్లో వినియోగదారుడు 26 కిలోల బస్తా రూ.1,600 పెట్టి కొనాల్సి వస్తోంది. పది రోజుల క్రితంతో పోలిస్తే బస్తాకు రూ.300 దాకా రేట్లు పెంచారు. బాస్మతి బియ్యం సైతం కిలో రూ.80 నుంచి రూ.110–150కి పెరిగాయి. దావత్ బియ్యం అయితే కిలో రూ.230కిపైగా ఉంది. వాస్తవానికి గత నెలలోనే మిల్లర్లు, బియ్యం సిండికేట్ సన్నరకాల బియ్యంపై రేట్లు పెంచారు. క్వింటాకు ఏకంగా రూ.400పైనే బాదారు. హోల్సేల్ నుంచి మార్కెట్లోకి వచ్చే సరికి కర్నూలు సోనా 26 కిలోల బస్తా రకాన్ని బట్టి రూ.1,599, రూ.1699కిపైగా ఉంటోంది. ఇష్టానుసారం బియ్యం రేట్లను పెంచేస్తుంటే చంద్రబాబు సర్కార్ కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. కోడి మాంసం కిలో రూ.420 రాష్ట్రంలో పౌల్ట్రీ రంగంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు పుణ్యమా అంటూ గుడ్డు రేటు భారీగా పతనమై పౌల్ట్రీ రైతులను ముంచేసింది. మరోవైపు కోడి మాంసం రేటు రూ.400–420కి ఎగబాకి వినియోగదారులకు షాకిచ్చింది. చివరికి కోడి మాంసాన్ని ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్ కవర్లు, పెళ్లిళ్లలో వేసే విస్తరులు, గ్లాసుల రేట్లకు కూడా రెక్కలు రావడం చంద్రబాబు సర్కార్ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. కర్రీ పాయింట్లో కూరల ధరలు రూ.5–10 వరకు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వంట చేసుకోలేక.. బయట కొనుక్కొని తినలేక సగటు జీవి నిత్యం నరకం అనుభవించాల్సి వస్తోంది.రేషన్లో కందిపప్పు కట్.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాల రేట్లు అమాంతం పెరుగుతుంటే.. పేదలకు ఇచ్చే రేషన్ మాత్రం కుంచించుకుపోతోంది. జాతీయ ఆహార భద్రత చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తూ రేషన్ వ్యవస్థను దిగజార్చింది. గత ప్రభుత్వంలో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని ఎండీయూ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సమర్థంగా అందిస్తే చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా ఆ వ్యవస్థనే రద్దు చేసింది. బియ్యం నాణ్యతకు తిలోదకాలిచ్చి అక్రమ రవాణాకు గేట్లు తెరిచింది. ఫలితంగా పేదలు తినాల్సిన బియ్యం వారి ఇళ్లకు చేరకుండా దొడ్డిదారిన పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. ఇక మార్కెట్లో కందిపప్పు రేటు అందనంత ఎత్తులో ఉంటే చౌక దుకాణాల ద్వారా ఇవ్వకుండా మంగళం పాడేసింది. గోధుమ పిండిని సైతం అర్ధంతరంగా నిలిపివేసింది. కిలో రూ.20 చొప్పున జిల్లా కేంద్రాల్లో పంపిణీ చేస్తామని ప్రకటించి చేతులు ఎత్తేసింది.పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన రాగులు, జొన్నల పంపిణీని సైతం గాడి తప్పించింది. సబ్సిడీపై ఇచ్చే నూనెలను సైతం ఎత్తేసింది. ఎన్నికల ప్రచారంలో రేషన్ దుకాణాల ద్వారా ఏకంగా 18 రకాల నిత్యావసరాలను ఇస్తామని నమ్మబలికి దారుణంగా మోసం చేసింది. రేషన్లో కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం, అరకొర పంచదార మినహా చంద్రబాబు సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదు. గ్యాస్ కోసం క్యూ కట్టి..ప్రజలకు బూటకపు కబుర్లు చెప్పి మోసం చేయడంలో తాను దిట్ట అని చంద్రబాబు రుజువు చేసుకున్నారు. ఒకవైపు గ్యాస్ సంక్షోభం ముంచుకొస్తుంటే ఏపీలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని ప్రకటనలు గుప్పించి చేతులు దులుపుకొన్నారు. కూటమి సర్కారు వచ్చాక వంట గ్యాస్ రూ.110 పెరిగింది. కమర్షియల్ గ్యాస్పై తాజాగా రూ.115 చొప్పున పెంచడంతో పాటు ఆంక్షలు విధించడంతో హోటల్ రంగం కుదేలైంది. వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ విషయంలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు గ్యాస్ బుకింగ్ వ్యవధిగా నిర్ణయించారు. అయితే పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు బుకింగ్ కోసం ప్రయత్నిస్తే 35 రోజుల తర్వాతే బుకింగ్లు చేసుకోవాలని మెసేజ్లు వస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్న 10–15 రోజుల తర్వాత కూడా ఏజెన్సీలు డెలివరీ చేయలేకపోతున్నాయి. సాధారణ రోజుల్లో వచ్చే స్టాకు కంటే ఇప్పుడు 20 శాతం తగ్గించి ఇస్తుండటం, పెండింగ్ డెలివరీలు పెరిగిపోవడంతో ఏజెన్సీలు చేతులు ఎత్తేస్తున్నాయి. ఇదే అదనుగా చంద్రబాబు అనుకూల ఏజెన్సీలు దొడ్డిదారిన గ్యాస్ను బ్లాక్మార్కెట్కు తరలిస్తూ దండుకుంటున్నాయి. సామాన్య ప్రజలు మాత్రం సిలిండర్లతో మండుటెండలో క్యూలలో నిల్చోవాల్సిన దుస్థితి దాపురించింది. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించారు. వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, మల్లాది విష్ణు, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
నెల్లూరు: టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్
సాక్షి, నెల్లూరు జిల్లా: చిల్లకూరు మండలం టీడీపీ నాయకుల రాసలీలల వీడియో వైరల్గా మారింది. తమ్మినపట్టణం కోదండ రామస్వామి ఛైర్మన్ సతీష్ యాదవ్ కామలీలలు వెలుగులోకి వచ్చాయి. ఓ మహిళతో గెస్ట్ హౌస్లో ముగ్గురు టీడీపీ నేతలు కలిసి గానా బజానా దృశ్యాలు కలకలం రేపుతున్నాయి.బొల్లవోలు టీడీపీ నాయకుడు దువ్వూరు వినయ్ బట్టలు విప్పి నాగినీ డ్యాన్స్ వైరల్గా మారింది. టీడీపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ఆలయ ఛైర్మన్లు అసభ్యకరమైన నృత్యాలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.కాగా, అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపోయి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం ఇటీవల కలకలం రేపాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి.నెల్లూరు చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా. -
ఆదర్శప్రాయుడు శ్రీరాముడు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైవెస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి.. వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ… pic.twitter.com/4Geg4WYd5i— YS Jagan Mohan Reddy (@ysjagan) March 27, 2026 -
అనిశ్చితి వేళ విశాఖకు క్రూడాయిల్, ఎల్పీజీ షిప్లు
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అనిశ్చితి, ఎర్రసముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రంగంలో ఆందోళన నెలకొన్న తరుణంలో విశాఖపట్నం పోర్టుకు భారీ ఇంధన నౌకలు చేరుకోవడం సానుకూల పరిణామంగా మారింది. నగరంలోని రిఫైనరీలకు, పరిశ్రమలకు, సామాన్య ప్రజల గృహ అవసరాలకు అవసరమైన ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు ఇప్పుడు పుష్కలంగా అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా ఈ నెల 20న గుజరాత్ తీరం నుంచి బయలుదేరిన రెండు కీలక స్వదేశీ ఫ్లాగ్ వెసెల్స్ విశాఖ తీరానికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి.ఖతార్లోని మెసయ్యద్ పోర్టు నుంచి బయలుదేరి గుజరాత్లోని వాడినార్ పోర్టులో లోడింగ్ పూర్తి చేసుకున్న బీడబ్ల్యూ బిర్చ్ అనే భారీ ఎల్పీజీ ట్యాంకర్ విశాఖ వచ్చింది. సుమారు 58,123 టన్నుల సామర్థ్యం గల ఈ నౌక ప్రస్తుతం 11.6 మీటర్ల పూర్తిస్థాయి లోడుతో పోర్టుకు చేరుకుంది. సౌత్ ఏసియా ఎల్పీజీ కావెర్న్ లేదా హెచ్పీసీఎల్ టెరి్మనల్ వద్ద అన్లోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. అదేవిధంగా రష్యా నుంచి గుజరాత్లోని ముంద్రా పోర్టు మీదుగా బయలుదేరిన ఎంటీ పేట్రియాట్ ఆయిల్ ట్యాంకర్ కూడా విశాఖ పోర్టులోకి ప్రవేశించింది.ఈ నౌకలో సుమారు 46,001 టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు (ప్రధానంగా హై – స్పీడ్ డీజిల్) ఉన్నట్లు సమాచారం. ఈ వెసెల్ విశాఖలోని అవుటర్ హార్బర్ ఆయిల్ టెరి్మనల్ వద్ద బెర్తింగ్ చేయనున్నారు. ఇక్కడ నుంచి పైప్లైన్ ద్వారా హెచ్పీసీఎల్ లేదా ఐఓసీఎల్ రిఫైనరీ టెరి్మనల్స్కు తరలించనున్నారు. వీటిరాకతో విశాఖతోపాటు ఇతర జిల్లాలకు కొంత కాలంపాటు వంటగ్యాస్, ఇంధన సమస్యలు తలెత్తబోవని భావిస్తున్నారు.న్యూ మంగళూరు పోర్టుకు ఎల్పీజీ నౌకయశ్వంతపుర: ఎల్పీజీతో కూడిన నౌక అపోలో ఓషీన్ గురువారం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరుకొంది. 16 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఇందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దానిని అన్లోడ్ చేసి జిల్లాలకు పంపిస్తారు. -
ఏప్రిల్ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో నిలిపేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) గురువారం ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో సేవలు కొనసాగించడం తలకు మించిన భారంగా మారిందని నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు తేల్చిచెప్పారు. ఒకటో తేదీలోగా బకాయిలు చెల్లించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సేవలు కొనసాగించబోమని అల్టీమేటం ఇచ్చారు.చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు అనధికారికంగా బోర్డులు తిప్పేసిన దుస్థితి ఏర్పడింది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రుల మెట్లెక్కే పేదలను అటు నుంచి అటే వెనక్కు పంపేసే దయనీయ పరిస్థితులు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో సేవలు నిలిపేస్తున్నట్లు ఆశ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వన్టైమ్ సెటిల్మెంట్ అని చెప్పి మొండిచెయ్యి 2024లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులు పలు దఫాలుగా సమ్మెలోకి వెళ్లాయి. గతేడాది అయితే ఎప్పుడూ లేని విధంగా ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్లెక్కి నిరసనలు, ఆందోళనలు చేశారు. విజయవాడ ధర్నాచౌక్లో ధర్నాకు సైతం దిగారు. అప్పట్లో వారితో చర్చలు జరిపి బకాయిలున్నింటినీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని ప్రభుత్వం నమ్మించింది. దీంతో యజమానులు సమ్మె విరమించారు. ఆ తర్వాత వారికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్నాం, బకాయిలు తీర్చేస్తామని కాలయాపన చేసింది. బకాయిలపై స్పందించని ప్రభుత్వం.. మరోవైపు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరీ్వర్యం చేసి, బీమా విధానం అమలుకు ప్రభుత్వం పూనుకుంది. బీమా కంపెనీ ఎంపికకు టెండరు కూడా పిలవడంతో తమ బకాయిల సంగతి తేల్చాలని, బీమాలో ప్రొసీజర్ల రేట్లు పెంచాలని హైకోర్టును సైతం యజమానులు ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వంపై యజమానులు బకాయిలు చెల్లించాలని కోర్టును ఆశ్రయించడం ఇదే తొలిసారి. కోర్టు ఆదేశాల మేరకు వైద్యశాఖ అధికారులు ఇటీవల ఆశ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బకాయిల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పా టు, ప్రొసీజర్ రేట్లు పెంచాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఆస్పత్రుల యజమానులు వెల్లడించారు. -
జంగిల్రాజ్గా మారిన రాష్ట్రం! : వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక జంగిల్ రాజ్గా మారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి, అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు. ఒక 17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలిక రాష్ట్రంలో కుప్పకూలిపోయిన వ్యవస్థకు బలైపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి, ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో స్పష్టంగా వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది’ అని పేర్కొన్నారు. -
ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా రేపు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, అమరావతి: రేపు అధికారంలోకి ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చుతారేమోననే జాగ్రత్తలో భాగంగానే శనివారం అసెంబ్లీలో ఏపీ రాజధాని అమరావతిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారథి చెప్పారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను మంత్రి పార్ధసారథి మీడియాకు వెల్లడించారు. తీర్మానం అవసరం లేనప్పటికీ మా జాగ్రత్త కోసం తీర్మానం చేస్తున్నామని మంత్రి చెప్పారు. రేపు ఎవరైనా అధికారంలోకి వచ్చి రాజకీయ, ప్రాంతీయ కారణాలతో రాజధాని అమరావతిని మార్చకుండా ఉండేందుకే ఏపీ శాశ్వత రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. 2025 మేలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ రాజధాని అమరావతిగా నెంబర్ 148 తీర్మానం చేసి కేంద్రానికి పంపామని మంత్రి చెప్పారు. అయినప్పటికీ భవిష్యత్లో ఎవరైనా వచ్చి రాజధాని అమరావతిని మార్చాలనే ఆలోచన చేయకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5లో సవరణలు చేయాలని, సెక్షన్–5లోని ఉప సెక్షన్ (2)లో ఏపీ రాజధాని అమరావతిగా చేర్చాలని, అలాగే రాజధాని ప్రాంతం ఏపీసీఆర్డీఏగా చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. రైతులను నమ్మించి రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయడం కోసమే తీర్మానం చేస్తున్నారా అనే ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ రాజధాని అమరావతి అని హైకోర్టు చెప్పిందని రైతులు నమ్మారన్నారు. రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ఎప్పుడైనా చేసే అవకాశం సీఆర్డీఏ చట్టంలో ఉందని మంత్రి చెప్పారు. రాజధాని విషయంలో చట్టం ఉంది కదా మళ్లీ తీర్మానం ఎందుకని ప్రశ్నించగా శాశ్వతంగా ఏపీ రాజధాని అమరావతి ఉండాలనే ఉద్దేశంతోనూ, ఎవరు అధికారంలోకి వచ్చినా మార్చడానికి వీల్లేకుండా ఉండేందుకే అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించామన్నారు. శాసన మండలిలో తరువాత తీర్మానం చేస్తారేమోనని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. రాజధానిలో కాంట్రాక్టు సంస్ధల పైపులు అగ్ని ప్రమాదాలకు గురికావడంపై విచారణ జరుగుతోందన్నారు. ఎల్ అండ్ టీ వంటి పెద్ద సంస్ధలు ఇన్సూరెన్స్ కోసం ఇలాంటి పనులు చేస్తాయనుకోవడం లేదని మంత్రి చెప్పారు. పైపులు అగ్నికి ఆహుతి అవ్వాలంటే తగలపెడితే గానీ కావని మంత్రి చెప్పారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న మరిన్ని నిర్ణయాలు ఇలా..⇒ నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనెపల్లెలో ప్రభుత్వ భూమి రెండు ఎకరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం 33 సంవత్సరాల లీజు పద్దతిలో ఎకరాకు సంవత్సరానికి రూ.1000లు లీజు చొప్పున నంద్యాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి ఇచ్చేందుకు ఆమోదం. ⇒ గుంటూరు జిల్లా నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ భవనాల నిర్మాణాలకు 60 మీటర్ల ఎత్తు వరకు ఆమోదం.⇒ హైకోర్టు సూచన మేరకు 96 కొత్త కోర్టులు ఏర్పాటునకు, ఆ కోర్టులకు అవసరమైన 1730 పోస్టులు సృష్టించడానికి ఆమోదం.⇒ వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత ఇస్తూ వారికి 15 శాతం క్వారీలు రిజర్వ్ చేసేందుకు, సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇచ్చేందుకు ఆమోదం. ⇒ మున్సిపాలిటీల్లో పేరుకు పోయిన ఆస్తి పన్నుపై వడ్డీలో 50 శాతం మాఫీకి ఆమోదం. పన్ను బకాయి మొత్తంతో పాటు 50 శాతం వడ్డీ ఒకే సారి చెల్లిస్తే మిగతా 50 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుంది. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో 76 సంస్థలు వసూళ్లలో వెనుకబడ్డాయి. సుమారు రూ. 2,409 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో, టాక్స్ కట్టేవారికి భారం తగ్గించి వసూళ్లు పెంచుకోవడానికి ఈ నిర్ణయం.⇒ ప్రస్తుతం దీపం–2 పథకం కింద ఎల్పిజి కనెక్షన్ ఉన్న లబ్ధిదారులు పైప్ గ్యాస్కు (పీఎన్జీకి) మారితే వారికి ఏడాదికి మూడు సిలిండర్లకు ఇస్తున్న సబ్సిడీ రూ.2,400లు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసేందుకు ఆమోదం. ⇒ రాష్ట్రంలో ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణ, రిజిస్ట్రేషన్ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ (రెగ్యులేషన్ అండ్ కంట్రోల్) రూల్స్, 2026’ ముసాయిదా నోటిఫికేషన్ జారీకి ఆమోదం. ఈ నిబంధనల ద్వారా అన్ని కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. విద్యార్దులపై విద్యాపరమైన ఒత్తిడిని తగ్గించి, ఆందోళనలు, ఆత్మహత్యలను నివారించడానికి కౌన్సెలింగ్ సేవలు, మానసిక ఆరోగ్య మద్దతును ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.⇒ అలాగే సంస్థలు నాణ్యమైన బోధనతో పాటు కనీస మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి. ⇒ అమరావతిలో చేపట్టే పనులకు సూపర్ విజన్ చార్జీలను ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 2.5 శాతం తగ్గించేందుకు ఆమోదం. ⇒ శ్రీ సత్య సాయి జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ను సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి రూ.169.80 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–1 ప్యాకేజీ 36 ఏలో మిగిలిన పనులకు 606.03 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు భూమి, కాలనీల పునరావాసం కల్పించేందుకు మొత్తం 4520.52 ఎకరాల భూ సేకరణకు ఎకరాకు రూ.12,50,000లు పరిహారం చొప్పున రూ.565.06 కోట్లకు ఆమోదం. ⇒ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్కు అప్పగించిన ’పోలవరం లిఫ్ట్ స్కీమ్’ పనిని కొనసాగించడానికి ఆమోదం. ⇒ పలు విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు ఆమోదం. -
మామూళ్ల మత్తు.. ప్రాణాలు చిత్తు
సాక్షి, అమరావతి: మరో ఘోర బస్సు ప్రమాదంతో రాష్ట్రం ఉలిక్కిపడుతూ నిద్ర లేచింది. గురువారం తెల్లవారకుండానే 14 మంది ప్రయాణికుల బతుకులు తెల్లారిపోయాయి. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. రవాణా శాఖ కేంద్రంగా రాష్ట్రంలో అవినీతి సిండికేట్ మరోసారి ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. ఇవి కేవలం రోడ్డు ప్రమాదంతో సంభవించిన దుర్మరణాలు కావు... బరి తెగించి అవినీతి దందా సాగిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాకు వత్తాసు పలుకుతున్న ‘రవాణా’ సిండికేట్ చేసిన హత్యలు! రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా ఉన్న ఈ సిండికేట్ ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఏటా వసూలు చేస్తున్న మొత్తం దాదాపు రూ.80 కోట్లు...! ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలకు, నిబంధనలకు విరుద్ధంగా సర్వీసుల నిర్వహణకు ఆ సిండికేట్ వత్తాసు పలుకుతోంది. ఫలితం... తరచూ రోడ్డు ప్రమాదాలు... ప్రయాణికుల దుర్మరణాలు రాష్ట్రంలో సర్వ సాధారణంగా మారిపోయాయి. మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం. అవి దుర్మరణాలు కావు.. రవాణా శాఖలో పచ్చ సిండికేట్ చేసిన హత్యలు...!!స్టీరింగ్ పని చేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్...!మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు (రిజిస్ట్రేషన్ నంబరు ఏఆర్ 20 డి 0487)కు ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంది. రవాణా శాఖే ఆ మేరకు ఎఫ్సీ జారీ చేసింది. ఆ బస్సుకు 2027 జనవరి 8 వరకు పర్మిట్ కూడా ఉంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలిగిరి వెళుతుండగా ఆ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ సక్రమంగా పని చేయకపోవడంతోనే ప్రమాదం సంభవించింది. స్టీరింగ్ స్టక్ అయిపోవడం (బిగుసుకుపోవడం)తో బస్సు హఠాత్తుగా నెమ్మదించి కదలకపోవడంతో టిప్పర్ను ఢీ కొట్టింది. ప్రమాదానికి గంట ముందు కూడా ఆ బస్సు స్టీరింగ్ బిగుసుకుపోయింది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్ను అప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతు చేసి బయలు దేరారు. కానీ గంటలోనే రాయవరం చేరుకునేసరికి స్టీరింగ్ మరోసారి బిగుసుకుపోయి బస్సు హఠాత్తుగా కదల్లేదు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న టిప్పర్ లారీని వేగంగా వచ్చి బస్సు ఢీకొట్టింది. ఆయిల్ ట్యాంకర్ను నేరుగా ఢీ కొట్టడంతో వెంటనే బస్సుకు మంటలు అంటుకుని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి ప్రధాన కారణం బస్సు స్టీరింగ్ బిగుసుకుపోవడమే. నడిపేందుకు అత్యంత ప్రధానమైన స్టీరింగే సక్రమంగా పని చేయని బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ కావడం నివ్వెరపరుస్తోంది. అంటే కనీసం బస్సులను పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఈ ఉదంతం వెల్లడిస్తోంది. 14 మందిని బలిగొన్న ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన దోషి రవాణా శాఖేనని స్పష్టమవుతోంది. ఏటా రూ.80 కోట్ల మామూళ్ల దందా– రవాణా సిండికేట్కు కీలక నేత రింగ్ మాస్టర్రాయలసీమకు చెందిన ప్రభుత్వ కీలక నేత రింగ్ మాస్టర్గా రవాణా శాఖలో పచ్చ సిండికేట్ దోపిడీ సాగిస్తోంది. భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అక్రమాలకు వత్తాసు పలుకుతోంది. రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఒక్కో స్లీపర్ బస్సుకు దాదాపు 30 బెర్త్లు, హైబ్రీడ్ మోడల్ బస్సుల్లో 20 బెర్త్ల చొప్పున ఉంటాయి. ఇక సాధారణ బస్సుల్లో దాదాపు 50 సీట్ల చొప్పున ఉంటాయి. మొత్తం మీద దాదాపు 75 వేల మంది కెపాటిసీతో రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు బస్సు సర్వీసులను నిర్వహిన్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ నిబంధనలను పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నాయి. అందుకు వత్తాసు పలుకుతున్న రవాణా శాఖ మాఫియాకు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నాయి. రవాణా శాఖ వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం... ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కో బస్సు సర్వీసులో రోజుకు ఒక సీటు టికెట్ మొత్తం ఈ సిండికేట్కు కమీషన్గా ఇస్తున్నారు. ఆ ప్రకారం 2,200 బస్సుల్లో రోజుకు 2,200 టికెట్ల మొత్తాన్ని రవాణా శాఖ సిండికేట్కు కమీషన్గా చెల్లిస్తున్నారు. ఒక టికెట్ మొత్తం సగటున రూ.వెయ్యి అనుకుంటే రోజుకు రూ.22 లక్షలు కమీషన్గా ముట్టజెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.6.60 కోట్లు... ఏడాదికి దాదాపు రూ.80 కోట్లు రవాణా శాఖ సిండికేట్ వసూలు చేస్తోంది. అంత భారీ మొత్తం లంచాలుగా చెల్లిస్తుండటంతోనే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోంది. బస్సుల నిర్వహణలో కనీస నిబంధనలను పాటించడం లేదు. దాంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ప్రయాణికులు దుర్మరణం పాలవుతున్నారు. అవి ఎలా అంటే...⇒ రాష్ట్రంలో 2,200 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో 90 శాతం కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు క్యారియర్లుగా రిజిస్ట్రేషన్ చేయించి నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్లుగా నిర్వహిస్తున్నారు. మార్కాపురం వద్ద ప్రమాదానికి గురైన బస్సు కూడా అరుణాచల్ప్రదేశ్లో కాంట్రాక్టు క్యారియర్గా రిజిస్ట్రేషన్ చేసి నిబంధనలకు విరుద్ధంగా జగిత్యాల నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలిగిరి వరకు స్టేజ్ క్యారియర్గా నిర్వహిస్తుండటం గమనార్హం.⇒ బస్సుల బాడీల తయారీలో నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా స్లీపర్ బస్సుల విషయంలో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఆ బస్సులకు ఫిట్నెస్ సక్రమంగా ఉండటమే లేదు.⇒ టికెట్ల ధరలు భారీగా పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. సంక్రాంతి, దసరా సీజన్లో టికెట్ ధరను మూడు నాలుగు రెట్లు పెంచి మరీ దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా నిర్దేశిత టికెట్ ధరలు ఉండవు.ఏటీఎస్ కేంద్రాలూ అంతే...వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ల (ఏటీఎస్) నిర్వాహకులు రవాణా శాఖ సిండికేట్కు భారీగా మామూళ్లు ముట్టజెబుతున్నారు. దాంతో ఆ ఏటీఎస్ సెంటర్లు ఎలా పని చేస్తున్నాయన్నది రవాణా శాఖ పట్టించుకోవడమే లేదు. ఇక కీలక నేత అండ ఉండటంతో ఏటీఎస్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అడిగినంత డబ్బులు ఇస్తే చాలు ప్రైవేట్ వాహనాలను కనీసం పరీక్షించకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం బస్సు స్టీరింగ్, బ్రేకులు, ఇంజన్, బాడీ, హెడ్లైట్లు, వెనుకవైపు లైట్లు, ఆయిల్ సిస్టం, టైర్లు... ఇలా అన్నీ నిశితంగా పరీక్షించాలి. అందుకోసం ఏటీఎస్లో కంప్యూటరైజ్డ్ విధానంలో క్షుణ్ణంగా పరీక్షించి... తగిన ప్రమాణాల మేరకు ఉంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలి. కానీ 50 శాతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాణాలను పాటించడ లేదు. ఏటీఎస్ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఫీజులు చెల్లిస్తే చాలు... ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేస్తున్నారు. అందులో రవాణా సిండికేట్కు వాటాలిస్తున్నారు. ఈ అవినీతి బాగోతంతో ప్రయాణికులు తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నా సరే స్టీరింగ్ పని చేయక ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదమే అందుకు తాజా తార్కాణం.రెండు రోజులు హడావుడి..గతేడాది అక్టోబరులో కర్నూలు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది దుర్మరణం చెందారు. ఆ వెంటనే రాష్ట్రంలో రవాణా శాఖ అధికారులు హడావుడి చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పేరుతో కొన్నాళ్లు కనికట్లు చేశారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా.. ప్రభుత్వ కీలక నేతను ఆశ్రయించడంతో వెంటనే తనిఖీలు నిలిచిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ఆ విషయాన్ని పక్కనపెట్టేశారు. ఆ ఫలితమే... మార్కాపురం జిల్లాలో తాజాగా బస్సు ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఫిట్నెస్ను సక్రమంగా పరీక్షించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బాబు సర్కారు మళ్లీ అప్పు.. నేడు మరో రూ.3,400 కోట్లు
సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది. మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3,900 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ శుక్రవారం మరో రూ.3,400 కోట్లు అప్పు చేస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,400 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది. ప్రభుత్వం 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 18 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,400 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం చేయనున్న అప్పులను ఆర్బీఐ ఈ నెల 24వ తేదీనే నోటిఫై చేసింది. అయితే ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ను నోటిఫై చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీ చేయనున్న అప్పులను కూడా ఆర్బీఐ బుధవారం రాత్రి నోటిఫై చేసింది. కాగా, నేడు(శుక్రవారం) చేయనున్న రూ.3,400 కోట్ల అప్పుతో కలిపితే... చంద్రబాబు ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,40,621 కోట్లకు చేరనుంది. అంటే.. సగటున నెలకు రూ.15,482.77 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు అప్పు చేసింది. -
చంద్రబాబు ప్రభుత్వానికి పతనం తప్పదు
పులివెందుల/రూరల్: ప్రజా వ్యతిరేక విధానాలను వీడకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వివిధ పార్టీలతో కూడిన అఖిలపక్షం హెచ్చరించింది. పులివెందుల సహా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను త్వరలో పూర్తిచేసి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ రంగంలో ప్రారంభించాలని డిమాండ్ చేసింది. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను అఖిలపక్ష బృందం గురువారం సందర్శించింది. కళాశాలలో అత్యాధునికంగా నిర్మించిన అవుట్ పేషెంట్ (ఓపీ), ఇన్పేషెంట్(ఐపీ) విభాగాలను పరిశీలించింది. పులివెందుల మెడికల్ కాలేజీకి వచ్చిన 50 సీట్లను టీడీపీ కూటమి ప్రభుత్వం వెనక్కి పంపడంపై అఖిలపక్షం మండిపడింది. కాలేజీలోని అత్యాధునిక పరికరాలు వేరే ప్రాంతాలకు తరలించడంతోపాటు గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోపాటు భారీగా సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడమేంటని ప్రశ్నించింది.అన్ని వసతులు ఉన్నా నేడు సాధారణ ఆస్పత్రిలా పులివెందుల మెడికల్ కాలేజీని మార్చేయడమేంటని నిలదీసింది. రోగులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అఖిలపక్ష బృందం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసన వ్యక్తం చేసింది. పీపీపీ విధానాన్ని రద్దుచేసి వైద్య కళాశాలల్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసింది. అఖిలపక్ష బృందంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, సీపీఎం నేత కె.ప్రభాకర్రెడ్డి, సామాజిక ఉద్యమనేత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కె.నారాయణ, బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు బీసీ రమణ, విద్యార్థి, యువజన, పౌరసంస్థల కన్వినర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ వసుంధరతదితరులు ఉన్నారు. ప్రభుత్వ మొండివైఖరి తగదు ఈ సందర్భంగా అఖిలపక్ష బృందంలోని ప్రతినిధులు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు తెచ్చి.. అందులో 7 కళాశాలలను ప్రారంభించిందన్నారు. మిగిలిన 10 కళాశాలలు నిర్మాణంలో ఉండగా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, పౌర సంస్థలు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పజెబితే రిజర్వేషన్లు అమలు కావని, పేద విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. పేద రోగులకు ఉచిత వైద్యం అందదన్నారు. ప్రభుత్వం వైద్య రంగంలో పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. దాదాపు రూ.150 కోట్ల విలువ చేసే 50 ఎకరాల భూమిని, రూ.412 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ధోరణిని విడనాడాలన్నారు. 2024–25 సంవత్సరంలోనే కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వద్దనడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధిక ఫీజులు కట్టలేక వందలాది సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ కారణంగానే పీపీపీ టెండర్లలో ఎవరూ పాల్గొనడం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలన్నారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఈవెంట్ల పేరిట వేలాది కోట్ల రూపాయలను మంచినీళ్లప్రాయంగా దుబారా చేస్తున్నారన్నారు. అందులో ఏ కొంచెం ఖర్చుపెట్టినా నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పూర్తవుతాయని, లక్షలాదిమంది పేద రోగులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతులు తెచ్చారు. వాటిలో 7 కళాశాలలను ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న 10 కళాశాలలను టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించాలనుకోవడం దురదృష్టకరం. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే వైఎస్సార్సీపీ తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తాం. – ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్సార్ కడప జిల్లాపై టీడీపీకి కక్ష వైఎస్సార్ కడప జిల్లా అన్నా, పులివెందుల నియోజకవర్గమన్నా తెలుగుదేశం పార్టీకి కక్ష ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పులివెందులలోనూ కళాశాల అభివృద్ధి జరగలేదు. పిడుగురాళ్ల, పులివెందుల మెడికల్ కళాశాలలను వెంటనే ప్రారంభించాలి. – తులసిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు 50 సీట్లు వెనక్కిచ్చిన బాబువైఎస్సార్సీపీ హయాంలో పులివెందులలో సుమారు 50 ఎకరాలలో రూ.500 కోట్లతో ప్రభుత్వ మెడి కల్ కళాశాల నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వాటిని రద్దుచేసి వెనక్కి పంపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,500 సీట్లు ప్రైవేటీకరణైతే విద్యార్థులు భవిష్యతేం కావాలి. – గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేట్కు ఇస్తే ఒప్పుకోం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కార్పొరేట్కు ఇస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. – డాక్టర్ వసుంధర, సామాజికవేత్త -
పోలీసు శాఖ పనితీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ పనితీరుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏపీలో నో పోలీస్, నో పోలీస్, నో పోలీస్ అంటూ ధ్వజమెత్తారు వైఎస్ జగన్. కేవలం కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారని, సహాయం కోసం ఎవరైనా పోలీస్ సాయం కోరినప్పుడు మాత్రం పోలీసులే కనిపించడం లేదన్నారు. ఈ మేరకు హలో ఇండియా ఒకసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. జంగిల్ రాజ్గా మారిపోయింది..‘ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జంగిల్ రాజ్గా మారిపోయింది. కాగితాలపై మాత్రమే పోలీసులు కనిపిస్తున్నారు. కానీ గిరిజనులు, మహిళలు, పేదలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు, వారు సహాయంకోసం అర్థిస్తున్నప్పుడు పోలీసులు కనిపించడంలేదు. మరోవైపు నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ నంబర్లు కూడా స్పందించడం లేదు. ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ అధికారంలో ఉన్నవారు ప్రజల భద్రతను గాలికి వదిలేసి..అవినీతి, రాజకీయ ప్రయోజనాలు, ప్రచార స్టంట్లపై దృష్టి పెడుతున్నారు’ అని మండిపడ్డారు.17 ఏళ్ల బాలిక బలైపోయింది..‘17 ఏళ్ల నిరుపేద గిరిజన బాలిక బలయిపోయింది. చదువులు చెప్తామని ఆమెను తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. మార్చి 22న శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆమె కుటుంబానికి మాటలు చెప్పి..ట్యూషన్ చెప్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత మార్చి 23న విశాఖపట్నంలో ఆమెపై పలు మార్లు లైంగిక దాడి జరిగినట్లు మీడియా కథనాల్లో వచ్చింది. మార్చి 24న, ఆ బాలిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రుల ఇంటికి డోర్ డెలివరీ చేశారు. ఇది కేవలం క్రూరత్వం మాత్రమే కాదు, వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తోంది. ఈ ఘటనను మూసివేసేందుకు, తీవ్రత తగ్గించి చూపించేందుకు బాధిత కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలిసినా పోలీసులు సరిగా స్పందించలేదు. హడావిడిగా శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించి, అంత్యక్రియలు జరిపించేశారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యా లేదు, ఎటువంటి అరెస్టు లేదు’ అని పోలీసులను తీరును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ జగన్మరో భయానక వైఫల్యం.. ‘ఈరోజు మార్కాపురంలో జరిగిన బస్సు అగ్నిప్రమాదం ఘటన ప్రభుత్వ యంత్రాంగంలో మరో భయానక వైఫల్యాన్ని బయటపెట్టింది. అనేకసార్లు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ 100 కు కాల్ చేసినా స్పందన లేదు. 108 అంబులెన్స్ కూడా స్పందించలేదు. మా గోడు ఎవరూ వినిపించుకోలేదంటూ బాధితులు చెప్తున్నారు. సమయానికి సహాయం అందక 14 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో పీఆర్ స్టంట్స్ తప్ప పరిపాలన చేయటం లేదని మరోసారి తేలిపోయింది. “రెడ్ బుక్” పాలనలో పోలీసులు అచేతనంగా మారిపోయారు. రక్షణ లేక ప్రజలు బాధలు పడుతున్నారు. రాష్ట్రంలోని ఉన్న వాస్తవిక పరిస్థితి ఇదే’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.Hello India…𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲! 𝗡𝗼 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!Andhra Pradesh has become a 𝗷𝘂𝗻𝗴𝗹𝗲 𝗿𝗮𝗷 where police exist only on paper, vanishing when tribals, women, and the poor cry for help. Emergency lines go silent,… pic.twitter.com/RCgzxNLjUM— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2026 -
వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని పేర్కొన్నారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి మంచి జరగాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
విశ్వ వేదికపై మన విద్యాసంస్థలు
సాక్షి, అమరావతి: భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రపంచంలో టాప్ కోర్సులుగా గుర్తింపు లభించింది. బుధవారం ప్రకటించిన తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలోని టాప్ –50 సంస్థల్లో స్థానం సంపాదించుకున్నాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్స్కు పేరుగాంచిన లండన్కు చెందిన క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్, సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 16వ వార్షిక ఎడిషన్ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో 1,900 విశ్వవిద్యాలయాలు అందిస్తున్న 21 వేలకు పైగా అకడమిక్ ప్రోగ్రామ్స్, 55 విభాగాలు ఐదు విస్తృత అధ్యాపక ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు. ఇందులో భారతదేశం నుంచి 27 సబ్జెక్టులు టాప్–50లో నిలిచాయి. ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ప్రపంచ వ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్, మార్కెటింగ్ రెండు కోర్సుల్లోనూ 21వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ఓ విద్యా సంస్థ మార్కెటింగ్ సబ్జెక్టులో గ్లోబల్ ర్యాంకింగ్ సాధించడం ఇదే తొలిసారి. టాప్–50లో ఐఐటీ ఢిల్లీ, బోంబే ఈ సంవత్సరం దేశంలోని విద్యా సంస్థలు టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా మన నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ఘనతను చాటాయి. దేశంలోని టాప్ కోర్సులు అందించే సంస్థల్లో ఢిల్లీ–ఐఐటీ అత్యధికంగా 6 కోర్సులతో టాప్–50లో ముందుంది. ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్ ఇంజినీరింగ్లో 36వ స్థానం, మెకానికల్, ఏరోనాటికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్లో 44వ స్థానం, సైన్స్ అండ్ టెక్నాలజీలో 45, కెమికల్ ఇంజినీరింగ్లో 48 స్థానంలో నిలిచాయి. మద్రాస్ ఐఐటీ పెట్రోలియం ఇంజినీరింగ్లో 29 ర్యాంకు సాధించగా, మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్లో ఐఐటీ ఖరగ్పూర్ 22వ ర్యాంకు, ఐఐటీ బోంబే 36వ ర్యాంకులు సాధించాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల్లేవ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి. బయట కొనుగోలు చేసే పరిస్థితి వారికి రాకూడదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇది తూచా తప్పకుండా పాటించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. డ్రగ్ స్టోర్స్లో 700 రకాలకు పైగా మందులకు గాను 300 నుంచి 450 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా రోగులపై మోయలేనంత ఆరి్థక భారం పడుతోంది. రాష్ట్రంలో చిన్నా, పెద్ద అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి రాజ్యమేలుతోంది. సీఎంగా చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్నిచోట్లా నిర్దేశించిన మేరకు మందులు, సర్జికల్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడీ సమస్య మరింత తీవ్రమైంది. మందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్ ఇవ్వాలని వైద్యశాఖ కోరితే అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విదల్చలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ మార్చినెల ముగుస్తున్నా ఆస్పత్రులకు చేరలేదు. ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కనీసం దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం పేదలు మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.కనికరంలేని సర్కారు.. రాష్ట్రవ్యాప్తంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండరీ హెల్త్, డీఎంఈ తదితర ఆస్పత్రుల్లో మందుల కోసం ఏటా రూ.700 కోట్ల మేర బడ్జెట్ అవసరమవుతుంది. 2025–26 సంవత్సరానికి రూ.600 కోట్ల మేర మాత్రమే కేటాయించారు. ఈ అరకొర బడ్జెట్ డిసెంబరు నాటికే ఖర్చయిపోయింది. దీంతో అత్యంత కీలకమైన డీఎంఈ పరిధిలోని టెరిషరీ కేర్ ఆస్పత్రులకు జనవరి నుంచి మందుల కొనుగోళ్లకు బడ్జెట్లేని హీన పరిస్థితి. ఈ క్రమంలో.. మందులు, మెడికల్ ఆక్సిజన్ కొనుగోలుకు అదనంగా రూ.112 కోట్ల బడ్జెట్ కావాలంటూ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైల్ను ప్రభుత్వం వివిధ కొర్రీలతో తిప్పి పంపినట్లు తెలిసింది. ఈ కొర్రీలకు బదులిస్తూ వైద్యశాఖ రెండోసారి ఫైల్ను పంపగా, నిధులు మంజూరు చేయకుండానే ప్రభుత్వం గత నెలలో ఫైల్ను మళ్లీ వెనక్కి పంపడంతో వైద్యారోగ్య శాఖాధికారులు తలలు పట్టుకున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల బడ్జెట్ను సర్దుబాటు చేసుకున్నారు. పేదల ఆరోగ్యంపట్ల కనికరం లేకుండా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ఆ ప్రభావం నాలుగో క్వార్టర్ మందుల సరఫరాపై పడింది. ఫిబ్రవరి నెలలో పీఓ.. సాధారణంగా.. ప్రభుత్వాస్పత్రులకు నాలుగు క్వార్టర్లుగా ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) మందులు, సర్జికల్స్ సరఫరా చేస్తుంది. ప్రతి క్వార్టర్ ప్రారంభానికి ముందు నెలలోనే సరఫరా సంస్థకు పర్చేజ్ ఆర్డర్ (పీఓ) ఇస్తుంటారు. ఈ క్రమంలో.. ప్రస్తుత నాలుగో క్వార్టర్ పీఓలు గతేడాది డిసెంబరులో ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం అదనపు బడ్జెట్ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. చివరికి.. ఫిబ్రవరి నెలాఖరులో ఎంఎస్ఐడీసీ పీఓలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పటివరకు నాలుగో క్వార్టర్ మందులు, సర్జికల్స్ను సరఫరా సంస్థలు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీసీ)లకు పంపలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్స్లో 700 రకాలకు పైగా మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. 300 నుంచి 450 రకాల మేర మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సీడీఎస్లలోనే మందుల నిల్వలు లేవు.కిడ్నీ రోగుల తీవ్ర అవస్థలుప్రభుత్వం మందులు, సర్జికల్స్ సరఫరా చేయకపోవడంతో వైద్యులు సూచించిన మందులను బయట కొనుగోలు చేసుకోవాలంటూ సిబ్బంది రోగులకు చీటీలు రాసిస్తున్నారు. మరోవైపు.. కిడ్నీ రోగులకు ప్రాణాధారమైన కంటిన్యూయస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్ (సీఏపీడీ) బ్యాగుల సరఫరా కొన్నినెలలుగా ఎంఎస్ఐడీసీ నుంచి పూర్తిగా నిలిచిపోయింది. డయాలసిస్లో రక్తంలోని వ్యర్థాలను వడగట్టేందుకు ఈ బ్యాగ్లు ఉపయోగపడతాయి. ఇంతటి కీలకమైన సీఏపీడీ బ్యాగులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాలని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.500కు పైగా విలువచేసే ఈ బ్యాగులు నిత్యం కొనాలంటే రూ.వేలల్లో ఖర్చుచేయాల్సి వస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సహా, వివిధ జిల్లాల్లోని సెకండరీ హెల్త్, పీహెచ్సీల్లో బీపీ, షుగర్ మందులకు కొరత ఏర్పడింది. చివరికి.. దగ్గు, జలుబు, జ్వరం సిరప్లకు కూడా దిక్కులేదు. -
భర్తతో ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు
సాక్షి, అమరావతి: మేజర్ అయిన యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అది అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను రోజూ వారి కూలీ అయిన ఆనందబాబు అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని ధర్మాసనం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడారు. ఆనందబాబును ప్రేమించానని, ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు. తనను ఆనందబాబు నిర్బంధించలేదని తెలిపారు.ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావని ధర్మాసనం ప్రశ్నించగా తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అయితే తమ కుమార్తెతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లయిన ఆమె తల్లిదండ్రులు కోరగా ధర్మాసనం అందుకు అనుమతినిచ్చింది. అర్థగంట పాటు కోర్టుహాలు బయట కుమార్తెతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం కూడా ఆమె తాను ఆనందబాబుతోనే కలిసి ఉంటానని కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం తల్లిదండ్రుల పిటిషన్కు విచారణార్హత లేదని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బిల్లులివ్వండి బాబూ!
సాక్షి, అమరావతి: చేసిన పనులకు బిల్లులు చెల్లించని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) తీరుకు నిరసనగా కాంట్రాక్టర్లు విజయవాడలోని చీఫ్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేశారు. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడంతోపాటు వాళ్లు చేసిన పనులకు ఎప్పుటికప్పుడే బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లకు మాత్రం నెలల తరబడి చెల్లింపులు నిలిపివేయడం దుర్మార్గమంటూ నల్ల రిబ్బన్లు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వ పనుల కోసం తమ సొంత ఆస్తులు కుదవ పెట్టి తెచ్చిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, గత్యంతరం లేక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నామని కాంట్రాక్టర్లు పేర్కొన్నారు. ‘చిన్న కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి.. పెండింగ్ బిల్లుల్ని మార్చి నెలాఖరులోగా చెల్లించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగంలో జరిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలో రూ.707 కోట్లు విడుదల చేసి.. ఆ మొత్తాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సులతో సహా కార్పొరేట్ సంస్థలకు రూ.562 కోట్లు చెల్లించారని చెప్పారు. వందలాది మంది చిన్న కాంట్రాక్టర్లకు రూ.850 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా మొత్తం బకాయిల్లో కేవలం పది శాతం రూ.85.88 కోట్లు విడుదల చేశారంటూ దుయ్యబట్టారు. 20 రోజుల క్రితం పెట్టిన బిల్లులకు కూడా కార్పొరేట్ సంస్థలకు చెల్లింపులు పూర్తయ్యాయని, తమకు మాత్రం 16 నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు సాయంత్రం వరకు ఈఎన్సీ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించారు. ఈఎన్సీ గాయత్రిదేవిని కలిసి వినతిపత్రం అందజేయగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్తో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేరు శ్రీనివాస ప్రసాద్, ఉపాధ్యక్షుడు సమావేశమై తమ సమస్యలు వివరించారు. మార్చి 31లోగా వీలైనన్ని బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడతామని శశిభూషణ్కుమార్ హామీ ఇచ్చారు. -
Andhra Pradesh: 28న శాసనసభ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ ఈ నెల 28న ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేరుతో బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. 28వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. దానిని కేంద్రానికి పంపించి.. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా గుర్తించాలని కోరనున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే.. దానిపై తప్పనిసరిగా కేంద్రం స్పందిస్తుందనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శాసనసభలో మాత్రమే తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. మండలిలో వైఎస్సార్సీపీకి మెజారిటీ ఉండడం.. ఆ పార్టీ సభ్యులు రాజధాని రైతుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో కేవలం శాసనసభను మాత్రమే సమావేశపరచి.. తీర్మానం చేయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు కేబినెట్ సమావేశంసీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
దేశవ్యాప్తంగా బెజవాడ ‘ఉగ్ర’ లింకులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/విజయవాడ లీగల్: బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలుపెట్టారు. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు.. తీవ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేస్తున్న కేసులో బుధవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు హైదరాబాద్కు చెందిన మహిళ కాగా, మరొకరు బీదర్కు చెందిన యువకుడు ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేయగా.. మరో 8 మంది ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు విజయవాడ పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించామని.. 7 రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు చేశామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా 15 మంది గుర్తింపు తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న బృందంలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో మొత్తం 15 మంది క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. 13 మందిపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం విజయవాడకు చెందిన రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. వారినుంచి సీజ్ చేసిన సెల్ఫోన్ల ఆధారంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. మరో ఇద్దరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. 7 రాష్ట్రాల్లో ఇటువంటి వారి ఉనికిని ఇప్పటికే గుర్తించి వారిని పట్టుకునే బాధ్యతలను విజయవాడ నగరంలోని వేర్వేరు పోలీస్స్టేషన్ల సీఐలకు అప్పగించారు. మొత్తం 9 బృందాలు ఆయా రాష్ట్రాలకు చేరుకుని నిందితుల నివాసం ఉండే స్థానిక పోలీస్స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే హైదరాబాద్ చంచల్గూడ ప్రాంతానికి చెందిన సయిదా బేగం(38)తో పాటు కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం(38)ని మంగళవారం రాత్రి నగర పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చి బుధవారం చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులిద్దరికీ న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని జైలుకు తరలించారు. హ్యాండ్లర్లపైనా గురి బిహార్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు చెందిన యువకులు తీవ్రవాద భావాల్ని వ్యాప్తి చేస్తున్న గ్రూప్లో సభ్యులుగా ఉన్నట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించింది. దిల్ఖాష్ (బిహార్), లక్కీ అహమ్మద్ (ఢిల్లీ), అస్మానుల్లా ఖాన్ (బిహార్), జిషణ్ (రాజస్థాన్), మీరా ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్), షారుక్ఖాన్ (మహారాష్ట్ర), షేక్ ఫీజర్ రెహమాన్ (మహారాష్ట్ర)లను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు విదే శాల్లో ఉండే అల్ హకీమ్ షుకూర్ (హ్యాండ్లర్), ఇతర హ్యాండ్లర్ల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ప్రార్థనా మందిరాల్లో జరిగే సమావేశాలకు హాజరయ్యారా అనే దిశగా పోలీసులు విచారణ చేప ట్టారు. నిందితులతో సన్నిహితంగా ఉంటున్న వారి వివరాలను గోప్యంగా సేకరించినట్టు తెలు స్తోంది. స్థానికంగా ఉండే యువకులతో మొ హ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మొహ్మద్ డానిష్ మతపరమైన సమావేశాలకు హాజరై అక్కడ యువకులను ఏమైనా ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశారా అనే దిశగా పోలీసులు విచారణ సాగుతోంది. తోడు కోసమై ఉగ్రవాద ముఠా వలలో..సైదా బేగంకు ప్రేమ పేరుతో వల వేసిన ఐసిస్ సానుభూతిపరులు సోషల్ మీడియా ఐడీలు తీసుకుని దుర్వినియోగం సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): హైదరాబాద్లోని చంచల్గూడకు చెందిన వితంతు మహిళ సయీదా బేగం (38) తోడు కోసం పాకులాడుతూ ఉగ్రవాద సానుభూతిపరుల ఉచ్చులో చిక్కింది. ఈమె సోషల్ మీడియా ఐడీలు సంగ్రహించిన ఉత్తరప్రదేశ్, బిహార్ వాసులిద్దరు ఐసిస్తో పాటు అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) భావజాల వ్యాప్తి కోసం వినియోగించారు. ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు మంగళవారం గుట్టురట్టు చేసిన అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ కేసులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చంచల్గూడకు చెందిన సయీదా బేగం భర్త ఇమ్రాన్ఖాన్ నాలుగేళ్ల క్రితం చనిపోయారు. అప్పటినుంచి ఇళ్లల్లో పనిచేస్తూ తన కుమారుడిని (7) పోషించుకుంటోంది. సోషల్ మీడి యాలో యాక్టివ్గా ఉండే సయీదా బేగం తోడుగా ఉండే వ్యక్తి కోసం సామాజికమాధ్యమాల్లో అన్వేషిస్తోంది. దీనిని ఉగ్రవాద సానుభూతిపరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈమెతో చాటింగ్స్ చేస్తూ, ఆసక్తి ఉన్నట్టు నటిస్తూ తమ లక్ష్యాలను సాధించడానికి యత్నించారు. దీనిలోభాగంగా నిషేధిత ఉగ్రవా ద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు ఉత్తరప్రదేశ్కు చెందిన హరీష్ అలీ, బిహార్కు చెందిన షాద్మన్ దిల్ఖుష్ సయిదాబేగం ఐడీలతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. యూపీ ఏటీఎస్ అధికారులు ఈనెల 15న హరీష్ అలీని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే దిల్ఖుష్, సయీదాబేగంను అరెస్టు చేసిన పోలీసులు తొలుత ఈమెను ఐసిస్ సానుభూతిపరురాలిగా అనుమానించారు. అయితే విచారణలో దిల్ఖుష్, సయీదా వెల్లడించిన వివరాల ఆధారంగా అభియోగ పత్రాలు దాఖలు సమయంలో కేసు నుంచి సయీదా పేరు తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. -
క్రెడిట్ చోరీ కాదు.. క్రెడిట్ దోపిడీ: వైఎస్ జగన్
నియోజకవర్గాల పెంపు గుడ్ న్యూస్. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు గణనీయంగా పెరుగుతాయి. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుంది. ఉత్సాహం, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తాం. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఈ పెద్దమనిషి కిరోసిన్ ఇస్తానంటున్నాడు. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు. అసలు కిరోసిన్ స్టవ్లు ఎక్కడున్నాయి? చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 అయితే రూ.1,400కు కూడా అడిగే వాడు లేడు. కోకో, అరటి, శనగ, టమాటా.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి అగమ్యగోచరం. -వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చంద్రబాబు క్రెడిట్ చోరీ కాకుండా, ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని.. ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని చెప్పారు. తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోనూ రూ.4,800 కోట్ల పెట్టుబడికి అవగాహన కుదుర్చుకుందని వెల్లడించారు. అలా తాము తెచ్చిన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తూ అంతా తన ఘనతేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎత్తి చూపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్ధల పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్కుమార్ను తీసుకొచ్చామని.. ఆయన మంచి డాక్టర్ అన్నారు. రాక్షస రాజ్యంలో ఉన్నాం కాబట్టి, చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చి, ఐదేళ్ల పోరాటానికి సిద్ధమయ్యారని.. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. కోటలు దాటుతున్న బాబు మాటలు⇒ ‘చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడీ అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడీ గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడీకి కనీసం హద్దు ఉండాలి. ఆదిత్య మిట్టల్ను 2022లో నేను దావోస్లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లో ఆ పెట్టుబడి పెట్టారు. ⇒ ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్ని వారు కొనుగోలు చేసి, రూ.1,000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి. అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను. దాంతో అధికారులు కాకినాడ సెజ్లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ.. ఒక జూమ్ కాల్తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ⇒ అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం. ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలతో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1,000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టులు పని చేయడం లేదు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశానికి హాజరైన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ శ్రేణులు పోర్టుల్లో పనుల నిలిపివేత⇒ నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం. మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్కు పేరు రాకూడదని పనులు ఆపారు. ⇒ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.అంతా దగా.. పచ్చి మోసం⇒ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు.. ఆ తర్వాత ఏం చేస్తున్నాడన్నది అందరికీ తెలుసు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ⇒ ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు చేయడం లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు.. ఉన్న పలావు పోయింది. దీని గురించి ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం⇒ గుడ్న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి. నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత కల్పించాం.⇒ 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరగడం వల్ల కార్యకర్తలు లీడర్లుగా ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారందరికీ జగన్ న్యాయం చేస్తాడు. ఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువగా ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది.⇒ జగన్ 2.0లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు. ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. చంద్రబాబు చేసే రెడ్బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చింది. ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.⇒ ఈ సమావేశంలో బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.అంతా దోచుకో.. పంచుకో.. తినుకో..⇒ మన హయాంలో ఆ ఐదేళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు. మరి నాడు జగన్ ఎలా చేశాడు.. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు.. అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.⇒ చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదంటే.. ఇప్పుడంతా దోచుకో.. పంచుకో.. తినుకో.. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినావీులు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడీ. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది.⇒ ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు. మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్ను రూ.2.49కే ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.⇒ అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లోనే చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్ స్టార్ లెవెల్లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. భూములనైతే శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.పరిపాలన లేదు.. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి⇒ చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యా దీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్వర్క్ ఆస్పత్రుల పథకం కింద వైద్యం చేయడం లేదు.⇒ నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి. విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది. పూర్తి స్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. -
హాజరు లేకున్నా.. బిల్లులు చెల్లింపు
సాక్షి, అమరావతి: అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ పెద్దలు రెచ్చిపోతున్నారు. కల్లబొల్లి మాటలతో పెద్ద మొత్తంలో కమీషన్లు కొల్లగొట్టడమే ధ్యేయంగా ఏకంగా కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టి కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెడుతున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ సేవల కోసం కుదర్చుకున్న ఒప్పందాలను అతిక్రమించి అధ్వాన్నమైన సేవలు అందిస్తున్న ఏజెన్సీలకు అక్రమంగా రూ.కోట్ల బిల్లులు చెల్లించేస్తున్నారు. సెక్యూరిటీ సంస్థలకు నెలకు రూ.8 కోట్లకుపైగా, శానిటేషన్కు రూ.14 కోట్లపైనే ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చెల్లింపుల్లో నిబంధనలకు అధికారులు పాతరేశారు. కేవలం వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్గౌర్ మౌఖిక ఆదేశాలతో నిబంధనలు సడలించి అక్రమ చెల్లింపులు చేసేశారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపునకు అద్దం పడుతోంది. తక్కువ హాజరుకు పూర్తి బిల్లులు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ సేవల నిర్వహణ కోసం కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. సీఎం బంధువు సంస్థతోపాటు, కీలక నేతకు కోరినంత కమీషన్ ఇచ్చేలా ఎంవోయూ కుదుర్చుకున్న ఏజెన్సీలకే అప్పట్లో కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఏజెన్సీల ఎంపికలోనే కాకుండా, వారికి బిల్లుల చెల్లింపుల్లోను ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని బహిర్గతం అయింది. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నిబంధనల్లో రెండు రకాల ఏజెన్సీల సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరు 95 శాతం, ఆపైన ఉంటేనే నెలవారీ వంద శాతం చెల్లింపులకు అర్హత ఉంటుంది. హాజరు శాతం కంటే తక్కువ ఉంటే.. తగ్గిన హాజరు ఆధారంగా చెల్లింపుల్లో కోత పెట్టాలి. ఉదాహరణకు 75 శాతం హాజరు ఉంటే బిల్లులు 75 శాతం మాత్రమే చెల్లించాలి. గతేడాది జూన్లో సెక్యూరిటీ, అక్టోబర్లో శానిటేషన్ ఏజెన్సీలు సేవలు ప్రారంభించాయి. అన్ని ఏజెన్సీల సిబ్బంది హాజరు ఇప్పటి వరకూ వంద శాతం చెల్లింపులకు అనుగుణంగా 95 శాతం నమోదు కాలేదు. దీంతో తమకు రావాల్సిన బిల్లుల్లో భారీగా కోతలు పడతాయని భావించిన ఏజెన్సీలు ఎఫ్ఆర్ఎస్ నిబంధన నుంచి సడలించాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో బిల్లుల్లో భారీ కోతలు పడితే తమకు వచ్చే కమీషన్లలోనూ కోతలు విధిస్తారని నేతలు భావించారో ఏమో కాంట్రాక్ట్ నిబంధనలకు సమాధి కట్టేశారు. ఏజెన్సీలకు హాజరు శాతంతో పనిలేకుండా గతేడాది డిసెంబర్ వరకూ చెల్లింపులు చేసేయాలంటూ గతేడాది నవంబర్ 12 డీఎంఈ అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో సౌరభ్గౌర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఆ మీటింగ్ మినిట్స్ ఆధారంగా జూన్ నుంచి నవంబర్ వరకూ సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థలకు ప్రభుత్వం చెల్లింపులు కూడా చేసేసింది. బరితెగింపునకు పరాకాష్ట వాస్తవానికి సెక్యూరిటీ, శానిటేషన్ సేవలు మ్యాన్పవర్తో ముడిపడిన అంశం. ఇవేమీ భవన, ఇతర ప్రాజెక్ట్ల నిర్మాణం వంటి సేవలు కాదు. మిషనరీ, నిపుణులైన అధికారులు, కారి్మకులను ఇతర ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆస్పత్రుల్లో అప్పటి వరకూ పాత ఏజెన్సీలో పనిచేసిన సిబ్బందే మెజారిటీ శాతం కాంట్రాక్ట్ మారిన అనంతరం కొత్త ఏజెన్సీకి మారిపోతారు. ఈ క్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్ కోసం ప్రభుత్వం జీవో ద్వారా ఇచ్చిన పాలసీలో ఎక్కడా కొత్త కాంట్రాక్ట్ సంస్థలకు కొద్ది నెలల పాటు నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలని ఎక్కడా పేర్కొనలేదు. అంటే సదరు సంస్థలు సేవలు ప్రారంభించిన రోజు నుంచే ఎఫ్ఆర్ఎస్ ఇతర నిబంధనలు అమలులోకి వస్తాయన్నమాట. ఇదిలా ఉంటే కాంట్రాక్ట్ సంస్థలు కోరుతున్నాయని నోటి మాటపై నిబంధనలు మినహాయింపు ఇవ్వడం కాంట్రాక్ట్ నిబంధనలను వంద శాతం అతిక్రమించడమే అవుతుంది. సాధారణంగా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన అంశాల్లో మార్పులు ఏమైనా చేయాల్సి వస్తే తిరిగి ప్రభుత్వం జీవో/అధికారిక సర్క్యులర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కాంట్రాక్టర్లకు ఆర్థికంగా మేలు చేస్తూ మీటింగ్ మినిట్స్ రూపంలో ఆదేశాలు ఇవ్వడం, దీన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా నిధులు చెల్లింపులు చేయడం ద్వారా భారీ కుంభకోణానికి ప్రభుత్వం తెరలేపింది. సీఎం బంధువు సంస్థకు 61 శాతం హాజరే ప్రభుత్వం నిధులను దోచిపెట్టడం కోసం తెచ్చిన సడలింపులతో ఏకంగా 61 శాతం ఎఫ్ఆర్ఎస్ హాజరుతో అట్టడుగు స్థాయిలో ఉన్న సీఎం బంధువు సంస్థ పద్మావతికి భారీ మేలు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ జోన్–3(రాయలసీమ) జిల్లాల్లోని డీఎంఈ ఆస్పత్రుల్లో శానిటేషన్ సేవల్లో ఉంది. గతేడాది నవంబర్ నెలలో 1,800 మంది మేర సిబ్బంది ఎన్రోల్ అయినప్పటికీ హాజరు మాత్రం 61 శాతమే నమోదైంది. ఇంత ఘోరమైన పనితీరు కనబరిచిన పద్మావతి సంస్థకు హాజరు సడలింపు ద్వారా ప్రభుత్వం భారీ మేలు చేసిపెట్టినట్టు వెల్లడవుతోంది. సెక్యూరిటీ, శానిటేషన్ సంస్థల పనితీరుకు ఆస్పత్రుల్లో ఇచ్చే స్కోర్ ఆధారంగా ప్రభుత్వం నవంబర్ వరకూ బిల్లు చెల్లించినట్లు కలరింగ్ ఇస్తున్నారు. దీనికోసం ఏజెన్సీల నిర్వాహకులు సూపరింటెండెంట్స్, ఇతర అధికారులను మేనేజ్ చేసుకుని భారీ స్కోర్ పొందినట్టు తెలుస్తోంది. స్కోర్ల జారీ అంశంలో జరిగిన స్కామ్ కూడా ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేతో బట్టబయలైంది. -
2026–27 ఏడాదికి టారిఫ్ ఆర్డర్ విడుదల
సాక్షి, అమరావతి: 2026– 27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు(ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవిన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్), 2024–25కు సంబంధించిన ట్రూ అప్, ట్రూ డౌన్ ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి గతేడాది నవంబర్లో సమర్పించాయి. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో డిస్కంల ఖర్చులు, ఆదాయాలను లెక్కించి, ఈ ఏడాదికి జరిగే అంచనాలను రూపొందించారు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ ఏడాది జనవరిలో బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఆ సందర్భంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలపై రూ.20,135.50 కోట్ల భారం వేసినందున కొత్తగా మళ్లీ భారాలు వేయవద్దని, డిస్కంలు చూపిస్తున్న లోటును ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రజలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏఆర్ఆర్ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి కర్నూలులో విడుదల చేశారు. రూ.1717.60 కోట్లు తగ్గించిన ఏపీఈఆర్సీ » డిస్కంలు ఏపీఈఆర్సీకి సమర్పించిన ఆర్థిక లోటు లెక్కలను ఏపీఈఆర్సీ యధాతథంగా ఆమోదించలేదు. దక్షిణ డిస్కంలో నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ సరఫరా వ్యయం రూ.23,314.92 కోట్లుగా చెబితే, దానిని రూ.23,853.78 కోట్లుగా ఏపీఈఆర్సీ లెక్కించింది. అందులో రూ.14,544.98 కోట్లు ప్రస్తుత ధరల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తే సమకూరుతుంది. అలాగే టారిఫ్ యేతర రాబడి మరో రూ.1838.31 కోట్లు వస్తుంది. దీనికి సబ్ స్టేషన్లు, గ్రిడ్ సపోర్ట్ చార్జీల రూపంలో వచ్చే మరో రూ.189.65 కోట్లు ఆదాయంతో కలిపితే మొత్తం రూ.16,572.94 ఆదాయం వస్తుంది. డీబీటీ సర్దుబాట్లు రూ.271.14 కోట్లు కూడా కలిపితే లోటు రూ.7,551.98 కోట్లు ఉంటుంది. దీనిని చార్జీల ద్వారా వసూలు చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ ప్రతిపాదించింది. » అదే విధంగా మధ్య డిస్కంకు వచ్చే ఏడాది ఖర్చు రూ.14,446.93 కోట్లు అవుతుందని డిస్కం చెబితే అంతలేదంటూ రూ.13,664.66 కోట్లకు ఏపీఈఆర్సీ తగ్గించింది. ప్రస్తుత టారిఫ్ ప్రకారం అయితే రూ.10,515.79 కోట్లు ఆదాయం వస్తుందని, ఇంకా రూ.4465.20 కోట్ల ఏపీసీపీడీసీఎల్కు లోటు ఉంటుందని తేల్చింది. ఇక తూర్పు డిస్కం లోటు రూ.21,639.84 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ఇందులో ప్రస్తుత రేట్ల ప్రకారం రూ.17,813.15 కోట్లు ఆదాయం వస్తుందని, అది పోగా రూ.3773.40 కోట్లు లోటు ఉంటుందని వివరించింది. ఈ ఒక్క డిస్కం ప్రతిపాదనల్లోనే రూ.1399 కోట్లను ఏపీఈఆర్సీ తగ్గించింది. » ఈ లెక్కన మొత్తం రూ.17,508.17 కోట్ల ఆదాయ లోటును డిస్కంలు ఏఆర్ఆర్ నివేదికలో చూపించగా, దానిని రూ.15,790.57 కోట్లుగా ఏపీఈఆర్సీ తేల్చింది. అంటే రూ.1717.60 కోట్లను తిరస్కరించింది. మిగిలిన లోటును భరిస్తామని ప్రభుత్వం లేఖ ఇచ్చినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాయితీ ఆలస్యమైతే వడ్డీ తీసుకోండి » ప్రభుత్వం సకాలంలో రాయితీ సొమ్మును ఇవ్వకపోతే దానిపై వడ్డీని వసూలు చేసుకునే హక్కు డిస్కంలకు ఉందని, ఆ మేరకు వడ్డీ తీసుకోవచ్చని ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. » అలాగే సబ్సిడీ బకాయిలు, ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లులను ఈ ఏడాదిలోనే 100 శాతం వసూలు చేయాలని చెప్పింది. » డిస్కంలు ప్రతిపాదించిన టైమ్ ఆఫ్ డేలో మార్పులకు మాత్రం ఆమోదం లభించలేదు. » పలు సర్వీసుల బిల్లింగ్ విధానంలో మార్పులు చేయాలని డిస్కంలు అడిగినా ఏపీఈఆర్సీ అంగీకరించలేదు. » గ్రీన్ పవర్ కేటగిరీ రద్దు ప్రతిపాదన కూడా తిరస్కరణకు గురయ్యింది. చిన్న పరిశ్రమలకు (కాటేజ్ ఇండస్ట్రీలు) లోడ్ పరిమితి 10 హెచ్పీ నుంచి 20హెచ్పీకి పెంచింది. » సౌర పరికరాల తయారీ పరిశ్రమకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్పింది. » వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లను కమర్షియల్ నుంచి ఇండస్ట్రియల్ కేటగిరీకి మార్చింది. » జాతీయ రహదారుల స్ట్రీట్ లైటింగ్ సర్వీసులను వేరే కేటగిరిలోకి తీసుకువచ్చింది » పౌల్ట్రీ ఫార్మ్లలో అంతర్గత పౌల్ట్రీ గ్రాసం తయారీ కేంద్రం (ఫీడ్ మిక్సింగ్ యూనిట్)లకు యూనిట్ రూ.5.85 టారిఫ్తో ప్రత్యేక సబ్ మీటర్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. » డిస్కంలు బకాయిలు తగ్గించుకోవాలని, విద్యుత్ ప్రమాదాలను తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించింది. » ప్రజలు ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి గమనిస్తే వెంటనే ఫొటోతీసి విద్యుత్ శాఖకు పంపే విధంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు వెబ్సైట్, వాట్సప్ ద్వారా ఏర్పాట్లు అందుబాటులోకి తేవాలని కమిషన్ ఆదేశించింది. -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, తాడేపల్లి: మహిళా రిజర్వేషన్ చట్టానికి వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. 2029 ఎన్నికల నుంచి ఈ చట్టాన్ని అమలు చేయటాన్ని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. మహిళా రిజర్వేషన్ అమలు మంచి నిర్ణయం అంటూ ఆయన ట్వీట్ చేశారు. మహిళల సాధికారతకు మా పార్టీ ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. స్థానిక సంస్థల్లో ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘నామినేటెడ్ పదవుల్లో కూడా మహిళలకు 50 శాతం అవకాశం కల్పించాం. నామినేషన్ ద్వారా ఇచ్చే పనులు, కాంట్రాక్టుల్లో కూడా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేశాం. అసెంబ్లీ, లోక్సభలో 33% మహిళా ప్రాతినిధ్యం కల్పిస్తూ కేంద్రం చట్టం చేయటాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగాలనేది మా పార్టీ ఆకాంక్ష’’ అంటూ వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.The YSR Congress Party wholeheartedly supports the proposed amendments to the Women's Reservation Act, 2023, enabling its implementation in 2029. Our party has always placed utmost emphasis on the empowerment of women. We have already led the way by implementing 50% reservation…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 25, 2026 -
‘పచ్చ పత్రికల కథనాలే బదిలీలకు ప్రామాణికమా?’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన అంటే పచ్చపత్రికల కట్టుకథలే అన్నట్టు వ్యవహరిస్తూ... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. గురువారం.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టారు.రాష్ట్రంలో నిఘా వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి. ఒక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నెల్లూరు వెళ్లకపోయినా, ఆయన ఐఏఎస్ అధికారులతో సమావేశం అయ్యారని ఎల్లో మీడియాలో వచ్చిన అబద్ధపు వార్తను పట్టుకుని నీలకంఠారెడ్డి లాంటి అధికారులను బదిలీ చేయడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల కంటే ఇంటి చాడీలకే ఈ ప్రభుత్వం విలువనిస్తోందని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే...బాబు హయాంలో ప్రతి గడపకీ కక్ష రాజకీయమే..వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి గడపకీ రేషన్ డోర్ డెలివరీ చేస్తే.. కూటమి నేతలు మాత్రం ప్రతి గడపకీ కక్షా రాజకీయాలు పరిచయం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబులో తడబాటు కనిపిస్తోంది. 151 పైగా ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉన్నా.. కుమారుడు లోకేష్, భాగస్వామి పవన్ కళ్యాణ్, లేదా అధికారులు వెన్నుపోటు పొడుస్తారని భయపడున్నట్టున్నారు. మీ పాలన దినదినగండం నూరేళ్లు ఆయుష్షు అన్నట్టు సాగుతోంది.జరగని మీటింగ్పై బాబు ఉలికిపాటు..రాష్ట్రంలో నేను నిప్పులాంటి నాయకుడ్ని అని చెప్పుకునే చంద్రబాబు... ఇవాళ నిఘా వ్యవస్థలను కూడా నమ్మకుండా తడబాటు పడుతూ తప్పుడు అడుగులు వేస్తున్నారు. నెల్లూరులో ఓ మాజీ అధికారి కుటుంబంలో వివాహం జరుగుతుంటే అక్కడికి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి వస్తే... ఆయన్ను నీలకంఠారెడ్డి కలిసారని, కొంతమంది ఐఏఎస్ లతో జవహర్ రెడ్డి మీటింగ్ పెట్టారని ఓ ఎల్లో మీడియా పత్రికలో కట్టుకథను వండి వార్చితే.. దాన్ని ఆధారంగా చేసుకుని నీలకంఠా రెడ్డి ని ఎలా బదిలీ చేస్తారు? ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు?అసలు జవహర్ రెడ్డి నెల్లూరే వెళ్లనప్పుడు ఐఏఎస్ లతో ఎలా సమావేశం నిర్వహిస్తారు? ప్రభుత్వం ఎందుకు అంతలా ఉలిక్కిపడుతోంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థకు విలువ లేకుండా ఇంటి చాడీలకు ఎందుకు విలువనిస్తున్నారు? పీఎస్ ఆర్ ఆంజనేయలు, పీవీ సునీల్ కుమార్, జాషువా, విశాల్ గున్నీ, కాంతిరాణా టాటా, సంజయ్, నాయక్ వంటి అధికారులు చేసిన పాపం ఏంటి?గత ప్రభుత్వంలో పనిచేస్తే వారి మీద ఈ విధంగా దాడి చేస్తారా? మీ ఇంటి దగ్గర చదువుకుని ఉద్యోగాలు చేయడం లేదు కదా? వాళ్ల తల్లిదండ్రుల రక్తం కష్టంతో ఉన్నత చదువులు చదువుకుని దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్లను మీ రాజకీయ వేధింపులకి బలి చేయడం ఎంత వరకు సమంజసం? వైఎస్ జగన్ హయాంలో హుందాతనం..వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ హయాంలో పనిచేసిన వ్యక్తులను పదవుల్లో కొనసాగించామే తప్ప కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడలేదు. ప్రవీణ్ ప్రకాష్, గిరిధర్, కృష్ణబాబు, ప్రద్యుమ్న, సతీష్ చంద్ర వంటి మీ దగ్గరపనిచేసిన అధికార్లకు కూడా మా ప్రభుత్వ హయాంలో అత్యున్నత మైన బాధ్యతలు అప్పజెప్పి కంటిన్యూ చేశాం. మంచి శాఖల్లో పోస్టింగులిచ్చి.. వారి సేవలను దేశానికి ఉపయోగపడేలా మేం చర్యలు తీసుకుంటే.. మీరు ఒట్టి మాటలు, టిష్యూ పేపర్లలాంటి మీ కరపత్రికల్లో వండి వార్చిన కథనాలను ఆధారాలుగా చేసుకుని జీవోలు మార్చుతున్న వైనం చూస్తుంటే చంద్రబాబు చేస్తున్నది పాలనే కాదన్న విషయం సుష్పష్టంగా అర్థం అవుతోంది.గతంలో తన పాలనలో అవినీతి చక్రవర్తి అని ముద్రవేసుకున్న చంద్రబాబు ఈ దఫా పాలనలో అడుగడుగునా అభద్రతాభావం కనిపిస్తోంది. హోదాలతో సంబంధం లేకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఎస్బీ నుంచి డీఐజీ వరకూ అదే విధంగా ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రతివారినీ కేసులతో వేధిస్తున్నారు. ఇదేనా పరిపాలన? ఇవన్నీ చంద్రబాబు పాలనా వైఫల్యానికి, చేతగానితనానికి అద్దం పడుతున్నాయి.అనుభవం ఉన్న అధికారులను అణగద్రొక్కుతూ, అడుగులుకు మడుగులు ఒత్తుతున్న అధికారులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. అవినీతి అధికారులకా గత చంద్రబాబు ప్రభుత్వంలో విచారణ ఎదుర్కొన్న అధికారులు మరలా ఇవాళ పెత్తనం చలాయిస్తున్నారు. గతంలో బాబు పాలనలో జరిగిన స్కాముల్లో ఆ అవినీతి అధికారులంతా పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్నవాళ్లే.బాబు పాలనలో కక్ష సాధింపులు..ఇవాళ చంద్రబాబు తనమీదున్న కేసులను ఎలాగూ కొట్టేయించుకుంటున్నాడు. తాను చేస్తున్న అవినీతి అంతా అధికారులతో చేయిస్తున్నాడు. పాలన పూర్తిగా గాలికొదిలేశాడు. బ్యూరోక్రసీని బలిపశువును చేసి... అందులో అధికారులను సమిధిలుగా మార్చుతున్నాడు. చివరకు పక్కరాష్ట్రానికి వెళ్లి పనిచేస్తున్న అధికారుల మీద కూడా కక్షకా ద్వేషాలు చూపిస్తున్నాడు. రాముడు లేని రాజ్యంలో కోతులే రాజ్యంలా.. అధికార ప్రభుత్వంలో తమ కులంలో ఉన్న కొంతమంది అధికారులే పెత్తందారులగా చలామణీ అవుతున్నారు. నీలకంఠారెడ్డిని బదిలీ చేయడానికి ప్రభుత్వం చూపిస్తున్న కారణం, జరిగిన సంఘటన రెండూ సంబంధం లేని ఘటనలే.పుడ్ సేఫ్టీ అధికారి ముసుగులో పూర్ణచంద్రరావు అనే వ్యక్తి తాను చేసిన అతి ప్రవర్తనను నీలకంఠారెడ్డి ఖండించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నేపథ్యంలో.. పూర్ణచంద్ర రావు వెనుకున్న లోకేష్, తన సామాజికవర్గం చెందిన వాడు కావడంతోనే... నీలకంఠా రెడ్డిపై జులుం ప్రదర్శించారని చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ, సీఎం చంద్రబాబులు సకల విఫల శాఖా మంత్రులగా రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ.. అధోగతి పాల్జేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘పచ్చ’డైపోతున్నాం!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కబంధహస్తాల్లో జనసేన నలిగిపోతోందని.. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారని, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, పనులూ కావడం లేదని పార్టీ అధ్యక్షుడు పనవ్ కళ్యాణ్ ఎదుట జనసేన ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్కళ్యాణ్ మంగళవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడంతోపాటు నాయకుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో జనసేన గెలిచిన నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందని పవన్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పినట్లు సమాచారం. మరోవైపు సీఎంఓలో తమ నియోజకవర్గం నుంచి వచ్చే వినతులు తొందరగా పరిష్కారానికి నోచుకోవడం లేదని, అదే సహచర టీడీపీ ఎమ్మెల్యేలకు వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించినట్టు సమాచారం. జనసేనతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వాఫీసుల్లో స్థానిక టీడీపీ నేతలు చెప్పే పనులు వేగంగా జరుగుతాయని చెప్పినట్టు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ ఇకపై నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తన కార్యాలయానికే నేరుగా వినతులు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. పునర్విభజనపై పార్టీ వ్యూహానికి కమిటీ.. నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్) అంశంలో పార్టీ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది. యువతే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం కొనసాగాలని వివరించినట్టు సమాచారం. -
హామీల ఎగవేత అప్పుల మోత
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చేసిన సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. సంపద సృష్టించకపోగా ఉన్న సంపదనే ఆవిరి చేస్తూ తాజాగా మంగళవారం 7.88 శాతం వడ్డీతో మరో రూ.3,900 కోట్లు బడ్జెట్ అప్పులు చేశారు. దీంతో ఈ ఆర్థిక ఏడాది ఏకంగా రూ.1.04 లక్షల కోట్ల బడ్జెట్ అప్పులతో చరిత్ర సృష్టించారు. తాజా అప్పుతో 22 నెలల పాలనలో చంద్రబాబు బడ్జెట్లో చేసిన అప్పులు ఏకంగా రూ.1,86,164 కోట్లకు చేరాయి.వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు మరో రూ.1,51,057 కోట్లకు ఎగబాకాయి. దీంతో బాబు పాలనలో మొత్తం అప్పులు రూ.3,37,221 కోట్లకు చేరాయి. దొరికిన చోటల్లా ఎడాపెడా అప్పులు చేయడమే నిత్య కృత్యంగా టీడీపీ కూటమి సర్కారు పాలన సాగుతోందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా కొత్తగా ప్రభుత్వ రంగంలో ఆస్తులు సృష్టించేందుకు పైసా వ్యయం చేయడం లేదు. -
మాజీ సీఎం జగన్తో పిన్నెల్లి భేటీ
సాక్షి, అమరావతి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో మంగళవారం భేటీ అయ్యారు. అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న ఆయన ఇటీవల బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. తనపైన, తన సోదరుడిపైన టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, మాచర్ల నియోజకవర్గంలో, పల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా జగన్కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ ఆయనకు భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని, పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగన్ అభయమిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పిన్నెల్లి కుమారుడు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. -
అల్లరి వేళల అప్రమత్తం
రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫేట్ మారుస్తున్న ఫీట్స్.. దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్ సర్వే సారాంశం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది.తేలికపాటి ఆహారం మంచిది...వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్సీ, రంగంపేట మండుటెండల్లోనే ఆటలువిద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రవి కిరణాలతో ప్రమాదంఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు.ఆటలలో అజాగ్రత్త వద్దువిద్యార్థులు స్మార్ట్ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి. మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. -
ఇంటర్ కొత్త సిలబస్ కార్పొ‘రేట్’కు కాసుల పంట
సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు తమ ఆ«దీనంలో ఉన్న సంస్థలకు పలురకాలుగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేట్ సంస్థకు మేలు చేకూరుస్తూ, కోట్లాది రూపాయల విలువైన ముద్రణ టెండర్ను కట్టబెట్టడం వింతగా మారింది. ఇందుకోసం తెలుగు అకాడమీని సైతం బలి పశువును చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం రూ.10 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న వీజీఎస్ ముద్రణా సంస్థ కోసం టెండర్ నిబంధనలు మార్చి ఇంటర్మీడియెట్ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు అప్పగించారని, ఇందుకోసం విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచే ప్రక్రియ నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలే జరిగిందంటే..! 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ సిలబస్ మారింది. తొలుత మొదటి సంవత్సరం సిలబస్ను మార్చారు. 2026–27లో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రవేశపెట్టారు. కొత్త పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమీ ద్వారా రూ.19 కోట్ల కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలు టెండర్లు ద్వారా పొందాయి. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకుండానే సిలబస్ సాఫ్ట్ కాపీలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం గమనార్హం. దీని వెనుక వీజీఎస్ ముద్రణా సంస్థ ఉన్నట్టు గుర్తించిన తెలుగు అకాడమీ సదరు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిబంధనలకు పాతర.. గత ప్రభుత్వంలో పుస్తకాల ముదణ్రను ఐదు నుంచి ఆరు సంస్థలకు అప్పగించేవారు. ఇందుకోసం సంస్థల చరిత్ర, పనితీరుతో పాటు వాటిపై ఉన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునే కాంట్రాక్టు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకతకు పూర్తిగా తిలోదకాలిచ్చి అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్ సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలనే మార్చినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా 2026–27 ఇంటర్మీడియెట్ రెండో ఏడాదిలో కొత్త సిలబస్తో రూ.19 కోట్లకు పుస్తకాల ముద్రణను వీజీఎస్కు 70 శాతం, విక్రమ్కు 30 శాతం కాంట్రాక్టును వారం రోజుల క్రితం అప్పగించింది. తెలుగు అకాడమీ సిద్ధం చేసిన సిలబస్ సాఫ్ట్ కాపీలను ఆయా సంస్థలకు అందించారు. రెండు రోజుల్లోనే ఫిజిక్స్, గణితం, మరికొన్ని సబ్జెక్టుల పుస్తకాల సాఫ్ట్ కాపీలు వాటా్సప్లలో హల్చల్ చేశాయి. అప్పటికే అవి పలు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలకు చేరిపోయాయి. తెలుగు అకాడమీ చరిత్రలో కాపీరైట్ పుస్తకాల కాపీలు ముద్రణకు ముందే కార్పొరేట్ సంస్థలకు వెళ్లిపోవడం దురదృష్టకరం. సాఫ్ట్కాపీలు అందించిన సదరు సంస్థలకు రూ.10 కోట్లు లబ్ధి చేకూరినట్టు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు బుట్టదాఖలు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన ముద్రణ సంస్థలు మెటీరియల్ను ఇతరులకు విక్రయించడం లేదా ఇవ్వడం, చేరవేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ముద్రణ కాంట్రాక్టును దక్కించుకుని, మరోపక్క ముద్రణకు ఇచ్చిన సిలబస్ సాఫ్ట్ కాపీలను కార్పొరేట్ విద్యాసంస్థలకు అమ్ముకున్నారు. ఇంటర్ పుస్తకాల ముద్రణ దక్కించుకున్న వీజీఎస్ సంస్థ గతంలో కూడా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీఈఆర్టీ సిలబస్ను ప్రైవేటు స్కూళ్లకు అమ్ముకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ ముద్రణా సంస్థపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, ఆ కంపెనీకి మేలు చేసేందుకు ఏకంగా నిబంధనలే మార్చారు. దీంతో ఆయా సంస్థలు కాంట్రాక్టు దక్కించుకోవడంతో పాటు కాసుల వేటలో పడ్డాయి. -
శాసనసభ స్థానాలు 263కి పెంపు!
సాక్షి, అమరావతి: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం లైన్ క్లియర్ చేయడంతో శాసనసభ, లోక్సభ స్థానాల రూపురేఖలు సమూలంగా మారిపోతాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో లోక్సభ, 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన గంపగుత్తగా 50 శాతం స్థానాలను పెంచడం.. 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో కలిపి) చేస్తూ రూపొందించిన మార్గదర్శకాలతో కూడిన బిల్లుపై బుధవారం కేంద్ర కేబినెట్ చర్చించనుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించాక బిల్లును ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక.. పెరిగే నియోజకవర్గాలతోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 262 లేదా 263కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 86 లేదా 87 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఇక లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరగనున్నాయి. అందులో మహిళలకు 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు రిజర్వేషన్ చేయనున్నారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో సమూల మార్పు..ప్రస్తుతం రాష్ట్రంలో 29 శాసనసభ స్థానాలను ఎస్సీలకు, ఏడు శాసనభ స్థానాలకు ఎస్టీలకు రిజర్వు చేశారు. నాలుగు లోక్సభ స్థానాలు (చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం) ఎస్సీలకు, ఒక లోక్సభ స్థానం(అరకు) ఎస్టీలకు రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు శాసనసభ, లోక్సభ స్థానాలు పెరగనున్నాయి. రాష్ట్రంలో ఎస్సీల జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ఎస్టీల జనాభా గరిష్టంగా ఉండే లోక్సభ, శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు రిజర్వు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాల పరిధిలోనూ ఏడు చొప్పున శాసనసభ స్థానాల ఉన్నాయి. కానీ.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ఒక్కో రీతిలో శాసనసభ స్థానాల ఉండనున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. లోక్సభ నియోజకవర్గాల స్వరూపం సమగ్రంగా మారిపోనుంది. ఇక శాసనసభ స్థానాల స్వరూపం కూడా సమగ్రంగా మారనుంది.పెరగనున్న మంత్రివర్గం కోటా:శాసనసభ స్థానాల్లో 15 శాతం లోపు సభ్యులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ప్రస్తుతం శాసనసభలో 175 స్థానాలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం సభ్యుల సంఖ్య సీఎంతో కలిపి 26కి మించకూడదు. నియోజకవర్గాల పునర్విభజనతో శాసనసభ స్థానాల సంఖ్య 262 లేదా 263కు పెరగనుంది. ఆ మేరకు మంత్రివర్గం కోటా కూడా 26 నుంచి 39కి పెరగనుంది. -
ఎంబీబీఎస్ ‘ఫీ’టముడి
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు వైద్య విద్య మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేట్ వైద్య కళాశాలలే కాకుండా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతి కాలేజీలోనూ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఐదేళ్ల ఫీజులను బలవంతంగా వసూలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) నిబంధనలను తుంగలో తొక్కి మరీ ధార్మిక సంస్థ కర్కశంగా వ్యవహరించడంపై విద్యార్థు లు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఐదో టర్మ్ ఫీజు కట్టడానికి గడువు విధించి, ఆలోపు చెల్లించకపోతే రోజువారీ పెనాల్టీ విధిస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. హెల్త్ వర్సిటీ తీర్మానమూ బేఖాతర్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు విద్యార్థులు ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల్లో నడిచే వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని గత ప్రభుత్వం జీవో–146ను విడుదల చేసింది. నాలుగున్నరేళ్ల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఇటీవల హెల్త్ వర్సిటీ కార్యవర్గమూ తీర్మానించింది. అయినా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని ఈ నెల 14న పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా ఆదేశాలు జారీ చేశారు. ఐదో టర్మ్(ఏడాది)ఫీజు చెల్లించడానికి బుధవారం(మార్చి 25) చివరి గడువు విధించారు. ఇదేమి అన్యాయమని తల్లిదండ్రులు ప్రశ్నించినా ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని కళాశాల అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. కోర్టు ఉత్తర్వులున్నా.. వైద్య కళాశాలలు నాలుగున్నరేళ్లకే ఎంబీబీఎస్ ఫీజు వసూలు చేయాలని కోర్టులు సైతం ఇప్పటికే పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులనూ పద్మావతితో పాటు, రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే చివరి ఏడాది పూర్తి ఫీజు చెల్లించాలని షరతు పెడుతున్నాయి. అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నా.. చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కళాశాలలను నియంత్రించాల్సిన హెల్త్ వర్సిటీ చోద్యం చూస్తోంది. -
ఇక మంటలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గతం కంటె ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ప్రధానంగా వచ్చే ఐదు రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మరోవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి 28వ తేదీ వరకూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27, 28 తేదీల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.‘ఎల్నినో’నే కారణంఈ వాతావరణ మార్పులకు ఎల్నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ వల్ల ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి పంట కోత సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ ప్రజా పోరాటం
సాక్షి, అనంతపురం/అమరావతి: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమకు కల్పతరువుగా మారిన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) కింద అననుమతులను పునరుద్ధరించింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలోని మరిన్ని ప్రాంతాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. 2031 వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల గొంతుకగా వైఎస్సార్సీపీ చేసిన పోరాటం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని ప్రజలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. దీనిని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ ప్రయతి్నస్తున్నారంటూ మండిపడుతున్నారు. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఏటా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు వెచ్చిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. 2025 ఏప్రిల్ 21న కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకపోవడంతో ఆర్డీటీ విదేశీ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. దీంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆ సంస్థ పథకాలు అందక వారంతా నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. పేదలు పడుతున్న కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా పోరాటాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యతలను మాజీ ఎంపీ తలారి రంగయ్యకు అప్పగించగా.. ఆయన పార్టీ నేతలు, ప్రజలతో కలిసి ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనల కార్యక్రమాలు చేపట్టారు. లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానమంత్రికి విజ్ఞప్తులు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవడంతోపాటు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై స్పందించిన కేంద్రం ఎట్టకేలకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన టీడీపీ నాయకులు ఒక్కరోజు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. వైఎస్ జగన్ అభినందనలు ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్చేసి అభినందించారు.వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతోనే విజయం 1969 నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఆర్డీటీ అని, అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పోరాటం చేపట్టి విజయం సాధించామని మాజీ ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల మద్దతుతో విజయం సాధించాం.10 నెలల నిరంతర పోరాట ఫలితంగా కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. దీని ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించింది. ఉద్యమానికి అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన ప్రజా సంఘాలకు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దారుణం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం కూటమి నేతలు చేసిందేమీ లేదు’ అని స్పష్టం చేశారు. -
దేశద్రోహం కేసులో ముగ్గురు అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు)/విజయవాడలీగల్: ఆన్లైన్ రాడికలైజేషన్, చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయవాడ నగరానికి చెందిన ముగ్గురిని దేశద్రోహం కేసులో అరెస్టు చేసినట్లు ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సర్వశ్రేష్ట త్రిపాఠి చెప్పారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. నిందితులు మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సొహైల్ సామాజిక మాధ్యమాల్లో సంఘటిత గ్రూపులను నిర్వహిస్తూ, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ను వ్యవస్థీకృతంగా ప్రచారం చేస్తున్నట్లు, సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులను ఆకర్షించడం, నియమించుకునే యత్నాలు చేస్తున్నట్లు బయటపడిందని పేర్కొన్నారు. వారు దేశం వెలుపల ఉన్న కొంత మంది వ్యక్తులతోనూ సంబంధాలు కలిగి ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో నిందితులను అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించామని వివరించారు. మొబైల్ ఫోన్లు, అనుమానాస్పద వస్తువులతోసహా పలు ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని త్రిపాఠి వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్పటేల్, ఏసీపీ లతాకుమారి, ఏడీసీపీ జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గన్లు ఇస్తే యుద్ధం చేయాలనిపిస్తోంది! అనంతరం నిందితులను చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరచడంతో న్యాయమూర్తి బి.రాధారాణి వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో నిందితులు ‘పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్పై జరుగుతున్న యుద్ధం మమ్మల్ని కలచివేశాయి.. గన్లు, మారణాయుధాలు ఇస్తే అక్కడకు వెళ్లి యుద్ధం చేయాలనిపిస్తోంది’’ అని చెప్పారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులోనూ పేర్కొన్నట్లు సమాచారం. -
నేడు అద్దంకి నియోజకవర్గ నాయకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. -
కార్లకు రుణమాఫీ చేయండి
సాక్షి, అమరావతి: ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా ఇచ్చిన ‘థాంక్యూ సీఎం సార్’ కార్లపై ఉన్న రుణాలను మాఫీ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) కార్యాలయం వద్ద లబ్దిదారులు ధర్నా చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ లబ్దిదారులు మంగళవారం ధర్నా అనంతరం తమకు రుణమాఫీ చేయాలని కోరుతూ ఎండీ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థిక, అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక, అభివృద్ధి సంస్థ(ఎన్ఎస్కేఎఫ్డీసీ) ఆర్థిక సహకారంతో 2016 నుంచి 2019 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ‘థాంక్యూ సీఎం సార్’ అంటూ కార్లు అందించిందన్నారు. వాటిని స్థానిక అధికారులకు అద్దెకు పెట్టుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. వాస్తవానికి ఆ కార్లను అధికారులకు అద్దెకు పెట్టుకోలేదని, ఆ తర్వాత కిరాయిలు కూడా లేక అప్పులు చేసి మరీ కిస్తీలు చెల్లించామని వాపోయారు. కిస్తీల కోసం అధికారుల వేధింపులు పెరిగాయని వాపోయారు. ఏప్రిల్ నెలాఖరులోగా బకాయిలు చెల్లించకపోతే కార్లు సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు రూ.వేల కోట్లు ప్రయోజనాలు కల్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఇచి్చన కార్లకు రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరారు. -
ఉద్యోగుల పాలిట రు‘బాబు పాలన’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది. ఛీత్కారాలు, వేధింపులు, పనిభారంతోపాటు దాడులు, దాష్టీకాలకు బలవుతున్నారు. తాజాగా తిరుపతిలో సచివాలయ ఉద్యోగిపై జరిగిన దాడే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులను నియమించారు. వారిని ప్రభుత్వ పథకాల అమలులో భాగస్వాములను చేశారు. ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించేలా రోజూ స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దీంతో సచివాలయ ఉద్యోగులకు సమాజంలో గౌరవప్రతిష్టలు పెరిగాయి. ఆ ఐదేళ్లు పైరవీలు, పక్షపాతం, అవినీతికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించడంతో ఉద్యోగులకు ప్రజల్లో మర్యాద పెరిగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక స్పందన రద్దుతోపాటు సర్కారు విధానాల వల్ల ప్రజల నుంచి సచివాలయ ఉద్యోగులు ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. అధికారపార్టీ నేతల వేధింపులకు బలవుతున్నారు. సర్వేలు, పన్ను టార్గెట్లతో ప్రజల్లో ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం తరచూ సర్వేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెంచింది. దీంతో ఇంటింటి సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లాల్సి వస్తోంది. అడిగిన సమాచారమే మళ్లీ మళ్లీ అడగాల్సి వస్తోంది. దీంతో ప్రజల్లో ఉద్యోగులపై చులకన భావం పెరగడంతోపాటు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. తాజాగా పన్నుల వసూళ్లు టార్గెట్లు పెట్టి మరీ సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి పెంచడంతోపాటు వసూళ్లు చేయకపోతే సంజాయిషీలు, చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. బలవంతపు వసూళ్లకు పురిగొల్పింంది. తమపై ఉన్న ఒత్తిడితో ఉద్యోగులు పదేపదే ఇంటింటికీ వెళ్లి పన్నులు అడుగుతుండడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. తిరుపతి నగరంలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడికి ఇదే కారణమని చెబుతున్నారు. సర్కారు విధానాల వల్ల ఉద్యోగులు వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంబద్ధ ప్రశ్నలతో చికాకు.. సర్వేల పేరుతో ప్రభుత్వం రూపొందించే అసంబద్ధ ప్రశ్నలు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనికితోడు ప్రతిసారీ ఓటీపీలు అడుగుతుండడంతో ఇళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహానికి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు బలవుతున్నారు.కుక్కల లెక్కలకూ వాళ్లే.. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కల లెక్కలూ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తోంది. మరుగుదొడ్ల వద్ద విధులూ కేటాయిస్తోంది. ఇప్పుడు పన్ను వసూళ్ల లక్ష్యాలు విధించి వంద శాతం వసూలు చేయాల్సిందేనని రుబాబు చేస్తోంది. దీంతో పని ఒత్తిడి ఎక్కువై ఉద్యోగులు మరణిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో దాడులు, దాష్టీకాలకు గురవుతున్నారు. దీనికి సర్కారు విధానాలే కారణం. తిరుపతిలో వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఒత్తిడి, ప్రజల వ్యతిరేకతతో.. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత మధ్య సచివాలయ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తిరుపతిలో విధి నిర్వహణలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నాగార్జునపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని చట్ట ప్రకారం శిక్షించాలి. – ఎం.డి.జానిపాషా, బి.అంకమ్మరావు, గ్రామ/వార్డు సచివాలయం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు.. మరోవైపు యథేచ్ఛగా ప్రజాధనం దుర్వినియోగం! రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు నిర్వాకాలకు ఇది మరో నిదర్శనం! సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్ రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్లోని లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.1,472.50 కోట్ల భారం పడింది. రాజధానిలో 220 కేవీ, 400 కేవీ విద్యుత్ లైన్లను విస్మరించి మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారాయని.. వాటిని మార్చాల్సిందేనని సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. ఆ మేరకు ఆ పనులను ప్యాకేజీల కింద విడగొట్టి.. వాటిని 8.98, 8.99 శాతం అధిక ధరలకు ముఖ్యనేతకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారని 2016లో సీఎం చంద్రబాబు మన ఇంజనీర్లను అవహేళన చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి.. సింగపూర్ సంస్థ రూపొందించిన మాస్టర్ప్లాన్ లోపాల వల్ల ఖజానాపై పడిన భారీ భారం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.తప్పుబట్టిన ‘కాగ్’..217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించే పనులను నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ సంస్థ సుర్బానా–జురాంగ్కు 2016లో నామినేషన్పై చంద్రబాబు సర్కార్ అప్పగించడాన్ని కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పుబట్టింది.. మాస్టర్ ప్లాన్ను రూపొందించిన ఆ సంస్థకు రూ.20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ.. రాజధాని ప్రాంతంలో గతంలో 38 కి.మీ.ల పొడవున వేసిన 400 కేవీ విద్యుత్ లైన్, 55 కిమీల పొడవున వేసిన 220 కేవీ లైన్లు నిర్మాణాలకు అడ్డంకిగా మారాయి. ఇది మాస్టర్ ప్లాన్లో లోపాలను బహిర్గతం చేసింది. దాంతో ఆ విద్యుత్ లైన్లను మార్చే పనులకు గతేడాది సీఆర్డీఏ టెండర్లు పిలిచింది.నిబంధనలు తుంగలో తొక్కి..రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకు 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ(ఈహెచ్వీ) లైన్ అండర్ గ్రౌండ్లో ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధానిలో ఏపీ ట్రాన్స్కో 18 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ(డైరెక్ట్ కరెంట్) లైన్స్లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ లైన్ను మార్చే పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్కు రూ.1,082.44 కోట్లకు కట్టబెట్టింది. అంతేకాదు.. కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి 400 కేవీ లైన్ను మార్చే పనులను రూ.390.06 కోట్లకు అప్పగించింది. కాగా టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.114.68 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరింది. ఈ పనులను కాంట్రాక్టర్కు అప్పగిస్తూ గతేడాది మార్చి 19న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.రూ.10,319.11 కోట్లు ప్రయోజనమంటూ వితండవాదన..విద్యుత్ లైన్లను మార్చే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 కేవీ లైన్ను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, 400 కేవీ లైన్ను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని.. ప్రస్తుతం ఎకరం మార్కెట్ విలువ రూ.20 కోట్లు పలుకుతోందని.. దీనివల్ల మొత్తం రూ.10,319.11 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఆ ప్రతిపాదనల్లో సీఆర్డీఏ పేర్కొంది. కానీ.. రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. విద్యుత్ లైన్లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సీఆర్డీఏ పంపిందన్నది స్పష్టమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరువు జిల్లా అనంతపురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రెస్మీట్లో అనంతపురం జిల్లా నేతలు ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం: వెంకట్రామిరెడ్డికరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవలు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన కళ్యాణదుర్గం నుంచి పోరాటం మొదలు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాదయాత్రకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, సహకరించిన ప్రజా సంఘాలు, జిల్లా ప్రజలకు అనంత వెంకట్రామిరెడ్డి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. క్రెడిట్ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ వారికి అలవాటైందని చర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నది కూటమి నేతలు మరచిపోయారు. ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చాంవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాలని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం విడ్డూరం. ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సాకె శైలజనాథ్ స్పష్టం చేశారు.వైఎస్ జగన్ ఆశీస్సులు..ప్రజల మద్దతుతో విజయం: తలారి రంగయ్యరూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ ఆశీస్సులతో పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించాం. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్లో పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని తలారి రంగయ్య పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
రేపు అద్దంకి నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: రేపు(మార్చి 25, బుధవారం) అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ కానున్నారు. ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. రేపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. -
వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది: సాకే శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించిందని.. ఆర్డీటీ సేవలకు కేంద్రం ఓకే చెప్పిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనన్నారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ శైలజానాథ్ మండిపడ్డారు.‘‘వారి క్రెడిట్ చోరీని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆర్డీటీని కాపాడుకోవటానికి మేము చాలా పోరాటాలు చేశాం. టీడీపీ నేతలు ఎక్కడైనా ఒక్క పోరాటమైనా చేశారా?. ఆర్డీటీకి 21 ఏప్రిల్ 2025న కేంద్ర ప్రభుత్వం నిధులను ఆపేసింది. ఆ టైంలో అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. కల్యాణదుర్గం ఇన్ఛార్జ్ తలారి రంగయ్య అమిత్షాని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు. పోస్టు కార్డుల ఉద్యమం నుండి పార్లమెంటులో నిరసన వరకు చాలా పోరాటాలు చేశాం. మా పోరాట ఫలితాన్ని టీడీపీ నేతలు కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు’’ అంటూ శైలజానాథ్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తాడేç³ల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ భవిష్యత్ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించారు. జిల్లాల స్థాయిలో టాస్్కఫోర్స్ ఏర్పాటు చేసుకుని కార్యాచరణ చేపట్టాలని, వచ్చే రెండు మూడు నెలలు ప్రతి వారం పది రోజులకు ఒకసారి జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని, విద్యారి్థ, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలని, అల్మట్టి ఎత్తుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై జిల్లాల్లో సమావేశాలు నిర్వహించుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని సమావేశం తీర్మానించింది. రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్యతను మాజీ మంత్రి సాకే శైలజానాథ్కు అప్పగించారు. సమావేశంలో పార్టీ నాయకులు సాకే శైలజానాథ్, ఎస్వీ సతీష్రెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డి, కాటసాని రామ్భూపాల్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మలసాని మనోహర్రెడ్డి, జిన్నూరి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలపై బుసకొడుతున్న ‘కాల్’నాగు!
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కాల్ లిస్టు’ రాజకీయం కలకలం రేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిఘా పెట్టిన విషయం బహిర్గతం కావడం హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కూటమి ఎమ్మెల్యేల మధ్చ చిచ్చురేపింది. విజయవాడ నగరంలోని బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టును కొద్దిరోజుల క్రితం ఎంపీ సేకరించిన విషయం బయటపడింది. టీడీపీలో కీలక నేతగా ఉండి.. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఆ ఎమ్మెల్యే తరఫున నియోజకవర్గ వ్యవహారాలను ఆ ప్రధాన అనుచరుడే పర్యవేక్షిస్తున్నారు.ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది తక్కువ కావడంతో ఆయన ప్రధాన అనుచరుడే నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయన కీలకంగా మారడంతో ఆయన కాల్ లిస్టును చూసి ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారనే విషయాలను ఎంపీ కేశినేని చిన్ని తెలుసుకుంటున్న విషయం బయటపడింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన వర్గీయులు ఇప్పటికే ఎంపీని నిలదీసినట్టు సమాచారం. ఎంపీ కోసం ఈ లిస్టును సేకరించిన వ్యక్తులతోనూ గొడవకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తిరువూరు వివాదం నేపథ్యంలోనే.. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో ఎంపీకి ఉన్న వివాదమే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది. కొలికపూడికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ కేశినేని అనుమానిస్తున్నట్టు చెబుతున్నారు. అందులో టీడీపీతో కలిసి ఉండే బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమనే అనుమానం ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన తరఫున నియోజకవర్గ వ్యవహారాలు నడిపే వ్యక్తి కాల్ లిస్టును సేకరించినట్టు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కాల్ లిస్టును కూడా ఎంపీకి సంబంధించిన వ్యక్తులు సేకరించినట్టు తెలుస్తోంది. నందిగామ, విజయవాడలోని మరో ఎమ్మెల్యే కాల్ లిస్టులు కూడా సేకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోకేశ్ చెబితేనే చేశామంటున్న ఎంపీ వర్గీయులు ఇదిలావుండగా ఎంపీ వర్గీయులు మాత్రం లోకేశ్ చెప్పడం వల్లే తాము ఎమ్మెల్యేల కాల్ లిస్టులు సేకరించి వారు ఎవరితో టచ్లో ఉన్నారో తెలుసుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేలు మాత్రం ఇంటెలిజెన్స్ సహా అన్ని వ్యవస్థలను వదిలేసి ఎంపీకి ఇలాంటి పనిని లోకేశ్ ఎందుకు అప్పగిస్తారని ప్రశి్నస్తున్నారు.అంతా ఎంపీ పెత్తనమే.. రగులుతున్న ఎమ్మెల్యేలువిజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని మంత్రి లోకేశ్ ఎంపీ కేశినేనికి అప్పగించి ఆయన ద్వారానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల వ్యవహారాల్లో ఎంపీ కేశినేని చిన్ని తలదూరుస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, పదవులు సహా ఏ పనైనా తన కనుసన్నల్లోనే జరగాలని పట్టుబడుతున్నారు. తిరువూరులో అయితే ఎమ్మెల్యే అధికారాలను కత్తిరించేసి మొత్తం తానే ఎమ్మెల్యే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.నందిగామ నియోజకవర్గంలోనూ ఎంపీ జోక్యం ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఉండటంతోపాటు తనకు అనుమానం ఉన్న మరికొందరి కదలికలు, ఎవరితో టచ్లో ఉన్నారో తెలుçÜుకునేందుకు వారి కాల్ లిస్టులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో టీడీపీలో కలకలం రేగింది. ఇంత జరిగినా పార్టీ పెద్దలు ఎంపీకి వత్తాసు పలుకుతుండటాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా
తాడికొండ: రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, రైతు కూలీలు సోమవారం తుళ్లూరు మండలం రాయపూడిలో ధర్నా చేశారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు, పెన్షన్లను మరో పదేళ్ల పాటు పొడిగించాలని, పేదలకు ఇచ్చే పెన్షన్ను రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సీఐటీయూ, రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై.నేతాజీ, ఎం.రవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగ ద్రోహి బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు మండిపడ్డారు. విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం సర్కారు తీరుపై గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన సీహెచ్వోలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీహెచ్వోలు మాట్లాడుతూ రాత్రిపూట ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు పేరిట ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలు అన్నింటినీ వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ భద్రత కోసం వెంటనే కమిటీని వేయాలని, ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సౌకర్యాన్ని తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్చేశారు.అద్దె భవనాల్లో కొనసాగుతున్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అడ్వాన్స్ రెంట్ చెల్లించాలని కోరారు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. సీహెచ్వోల ధర్మ పోరాటానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎ.వి. నాగేశ్వరరావు, ఐద్వా నేత రమాదేవి సంఘీభావం తెలిపారు. అనంతరం నాగేశ్వరావు మాట్లాడుతూ సీహెచ్వోల పట్ల ప్రభుత్వం అమానవీయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఈ సర్కారు ఉద్యోగ ద్రోహి అని అభివర్ణించారు.రాత్రి ఎనిమిది గంటలకు హాజరు వేయాలని ప్రభుత్వమే కార్మీక చట్టాలను అతిక్రమించడం తగదన్నారు. రమాదేవి మాట్లాడుతూ రాత్రి హాజరుతో ముడిపెట్టి ఇన్సెంటివ్స్లో కోతలు పెట్టి చిరుద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సీహెచ్వోల ఉద్యోగ క్రమబద్ధికరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీహెచ్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రియాంక మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ప్రేమ్, సంయుక్త కార్యదర్శి సుధాకర్, కోశాధికారి సిద్దు పాల్గొన్నారు. -
‘మూల్యం’ చెల్లించుకోవాల్సిందే!
సాక్షి, అమరావతి: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఉపాధ్యాయులకు సంకటంగా మారింది. మూల్యాంకనంలో జరిగే పొరపాట్లకు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై ఇప్పటికే విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలు గురువుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. స్పాట్ వాల్యుయేషన్, రీ–కౌంటింగ్ లేదా రీ–వెరిఫికేషన్ ప్రక్రియల్లో సిబ్బంది నిర్లక్ష్యం కనిపించినా, మార్కుల్లో వ్యత్యాసం వచ్చినా లేదా ఉల్లంఘన జరిగినట్టు తేలినా శిక్షలు ఉంటాయని సర్కారు హెచ్చరించడంపై సర్వత్రావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత తగ్గితే సబ్జెక్టు టీచర్లపై చర్యలు తీసుకుంటామని ఇటీవల సర్కారు హెచ్చరించగా, తాజాగా మూల్యాంకన శిక్షలు ప్రకటించడంతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. మార్కుల్లో తేడాను బట్టి భారీ జరిమానాలు ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్షలు (ఎస్ఎస్సీ–2026) జరుగుతున్నాయి. ఏప్రిల్ 2తో పరీక్షలు ముగుస్తాయి. 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో మార్కుల్లో తేడా గుర్తిస్తే నగదు జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూల్యాంకనంలో ఒక సబ్జెక్టు ఫెయిల్ అని ప్రకటించి, తర్వాత జరిగే తనిఖీల్లో పాస్ అయినట్టు గుర్తిస్తే మార్కుల తేడాను అనుసరించి జరిమానాలు విధించనున్నట్టు ప్రకటించింది.1 నుంచి 5 మార్కులు తేడా వస్తే రూ.4 వేలు, 6 నుంచి 10 మార్కులకు రూ.4,500, 11 నుంచి 20 మార్కులకు రూ.5వేలు, 21 నుంచి 30 మార్కులకు రూ.5,500, 31 ఆపైన మార్కులు తేడా ఉంటే రూ.6 వేలు చొప్పున చీఫ్ ఎగ్జామినర్కు, అసిస్టెంట్ ఎగ్జామినర్కు ఆవే మార్కుల తేడాకు రూ.2 వేలు, రూ.2,500, రూ.3 వేలు, రూ.3,500, రూ.4 వేలు చొప్పున, స్పెషల్ అసిస్టెంట్లకు రూ.1,500, రూ.2 వేలు, రూ.2,500, రూ.3 వేలు, రూ.3,500 చొప్పున జరిమానాలు విధిస్తారు. దీంతోపాటు ఉపాధ్యాయుల బదిలీల్లో వీరికి సర్విస్ పాయింట్లు 0, 0, 0.5, 1, 2 పాయింట్లు తగ్గిస్తారు. అలాగే, వార్షిక ఇంక్రిమెంట్ కూడా నిలిపివేస్తామని సర్కారు ప్రకటించడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్విస్ పాయింట్లు కోత.. పాస్ టు పాస్, ఫెయిల్ టు ఫెయిల్ చూపించిన సందర్భంలో మార్కుల తేడాలు గుర్తించినా సరే జరిమానాలు విధిస్తారు. ఈ విధానంలో 1 నుంచి 5 మార్కులు తేడా ఉంటే ఎలాంటి జరిమానా ఉండదు. కానీ 6 నుంచి 10 మార్కులు తేడా వస్తే రూ.2 వేలు, 11 నుంచి 20 మార్కుల తేడాకు రూ.2,500, 21 నుంచి 30 మార్కుల తేడాకు రూ.3వేలు, 31 ఆపైన మార్కులు వరకు తేడా ఉంటే రూ.3,500 చీఫ్ ఎగ్జామినర్కు విధిస్తారు, అలాగే, అసిస్టెంట్ ఎగ్జామినర్కు 0, రూ.1,000, రూ.1,500, రూ.2 వేలు, రూ.2,500 చొప్పున, స్పెషల్ అసిస్టెంట్లకు 0, రూ.500, రూ.1,000, రూ.1,500, రూ.2వేలు చొప్పున జరిమానా విధిస్తారు.అలాగే, బదిలీల్లో వీరికి సర్విస్ పాయింట్లలో కూడా కోత పెడతారు. చివరిగా వార్షిక ఇంక్రిమెంట్ కూడా నిలిపివేస్తామని ఆదేశాల్లో విద్యాశాఖ స్పష్టం చేసింది.. దీంతో మూల్యాంకనం విధులకు వెళ్లడానికి ఉపాధ్యాయులు వెనకడుగు వేస్తున్నారు. దీనికంటే స్కూళ్లల్లోనే పాఠాలు చెప్పుకోవడం ఉత్తమమని వాపోతున్నారు. స్పాట్ విధానంలో సంస్కరణలు అవసరమేగాని, సంస్కరణల పేరుతో ఒత్తిడికి గురి చేయడం ఏంటని ప్రశి్నస్తున్నారు. -
వెలుగుల నిధులపై కమ్ముకున్న చీకట్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఏర్పాటు చేసిన విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ)లో చీకట్లు కమ్ముకున్నాయి. ఈ సొసైటీలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సభ్యులు దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ మోసం మొత్తం విలువ దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.ఏళ్ల తరబడి జీతాల నుంచి పొదుపు చేసి సొసైటీలో డిపాజిట్ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలనే ఆశతో పెట్టుబడులు పెట్టిన వారు ఇలా వందలాది మంది సభ్యులు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు. సభ్యులకు ఇవ్వాల్సిన అప్పులు రూ.35 కోట్లు కాగా, వాయిదా దాటిన అప్పులపై వడ్డీ రూ.10 కోట్లు ఉంది. అంతేకాకుండా సంఘం రూ.6 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో సొసైటీ నిర్వాహకులను నమ్మినందుకు నిండా మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. అయితే సభ్యులు ఎవరూ కంగారు పడవద్దని, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని లేదా ఆస్తులు అమ్మి డిపాజిట్లు వెనక్కు ఇస్తామంటూ సొసైటీ నిర్వాహకులు వారికి సర్ది చెబుతున్నారు. పాతికేళ్లుగా ఆధిపత్యం.. గత పాతికేళ్లుగా ఒకే వ్యక్తి ఆధిపత్యంలో సొసైటీ నడిచిందని, అదే ఇప్పుడు కుంభకోణానికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవస్థపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగినట్లు సభ్యులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సొసైటీ కార్యకలాపాల్లో లోపాలు బయటపడుతున్నాయి. నిధుల గోల్మాల్పై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, సభ్యుల నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, సొసైటీ డబ్బుతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు సభ్యుల భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టినట్లు వారి విచారణలో తేలినట్లు తెలుస్తోంది.ప్రాథమిక విచారణలో రూ.6 కోట్లు నకిలీ పేర్లతో రుణాల మంజూరు, రూ.1.30 కోట్లు డిపాజిటర్లకు తెలియకుండా విత్డ్రా చేయడం, రూ.76 కోట్లు నాన్–మెంబర్ల నుంచి అక్రమ డిపాజిట్లు, సరైన పత్రాలు లేకుండా మరిన్ని లోన్ విత్డ్రాలు వంటివి వెలుగులోకి వచి్చనట్లు సమాచారం. అయితే దీనంతటికీ సహకార శాఖలోని పలువురు అధికారులు సహకారం అందించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల మళ్లింపు..అక్రమాల తీరుసహకార శాఖ డివిజనల్ ఆఫీసర్ (డీసీఓ) పి.కిరణ్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సంఘం అధ్యక్షుడే స్వయంగా 78 మంది సభ్యుల పేరుతో, వారికి తెలియకుండానే రూ.6.11 కోట్ల రుణాలను తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ. 17.47 కోట్లకు చేరింది.45 మంది డిపాజిటర్లకు తెలియకుండానే వారి ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ. 1.58 కోట్ల అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు. సభ్యులుకాని బయటి వ్యక్తుల నుంచి సుమారు రూ.67.71 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇది మొత్తం డిపాజిట్లలో 89 శాతం కావడం గమనార్హం. ఆడిట్ నివేదికల్లోనూ భారీగా మార్పులు చేసి, రూ.6.86 కోట్ల మేర తగ్గించి చూపినట్లు తేలింది రంగంలోకి సహకార శాఖ.. ఆస్తుల జప్తునిధుల రికవరీ కోసం సహకార శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సెక్షన్ 51, ఏపీసీఎస్ చట్టం 1964 ప్రకారం సమగ్ర విచారణకు ఆదేశాలిచ్చింది. 2017 నుంచి ఇప్పటివరకు పాలక మండలిలో ఉన్న 14 మంది సభ్యులను బాధ్యులుగా గుర్తించింది. వారి ఆస్తులను సెక్షన్ 41(బి) కింద జప్తు (అటాచ్) చేయాలని, వారు ఆ ఆస్తులను విక్రయించకుండా నిరోధించాలని విద్యుత్ శాఖ అధికారులకు సహకార శాఖ అధికారులు లేఖ రాశారు. అంతేకాదు, ఈ 14 మంది సభ్యులపై ఏపీసీఎస్ చట్టం 1964 లోని సెక్షన్ 41(బి) కింద చర్యలు తీసుకోవాలని డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ఆదేశించారు. అలాగే నకిలీ రుణాల ద్వారా డ్రా చేసిన రూ. 17.47 కోట్లు, ఇతర దుర్వీ నియోగమైన నిధులను వీరి నుండే రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు.ఎన్నో ఏళ్లుగా ఉండి ఇలా చేస్తారా ? సంఘం పాలకమండలి ప్రధాన బాధ్యులు విద్యుత్ సంస్థలో ముఖ్యమైన ట్రేడ్ యూనియన్లకు నాయకులుగా ఉండి ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎన్నో ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున మరింత సమర్థవంతంగా, సభ్యులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించాల్సింది పోయి సొసైటీ డబ్బులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించటం దారుణం.’ – ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సి.హెచ్.శ్రీనివాస్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఎనీ్టఆర్ జిల్లా -
మత్తు మందు వికటించి.. 14 నెలలుగా కోమాలోనే..
పుట్టపర్తి అర్బన్: ఆపరేషన్ చేయడానికి ఓ మహిళకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వగా, అది వికటించి ఆమె కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి 14 నెలలుగా కోమాలోనే ఉన్నారు. ఇందుకు కారణమైన నర్సింగ్ హోం నిర్వాహకులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విన్నవించేందుకు అంబులెన్స్లో రోగిని తీసుకుని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లికి చెందిన రైతు బావిగడ్డ హరిప్రసాద్ భార్య జ్యోతి(39)కి 14 నెలల కిందట కడుపునొప్పి రావడంతో ధర్మవరంలోని ఓ నర్సింగ్ హోంకు తీసుకెళ్లారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసి గర్భసంచి తొలగించాలని వైద్యులు సూచించారు. దీంతో గత ఏడాది జనవరిలో అదే నర్సింగ్ హోంలో చేరారు. ఆమెకు ఆపరేషన్ చేయడానికి సిద్ధమైన వైద్యులు మత్తు ఇంజక్షన్ చేయగా, కోమాలోకి వెళ్లింది. వెంటనే ఆమెను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూలోకి మార్చి వైద్యం అందించారు.అక్కడ కొద్దిరోజులు చికిత్స అందించినా కోలుకోకపోవడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఏడాదిపాటు ఉంచి సుమారు రూ.కోటి ఖర్చు చేసి వైద్యం అందించినా జ్యోతి కోమా నుంచి బయటకు రాలేదు. ఇటీవల జ్యోతిని ఇంటికి తీసుకొచ్చి మంచంపైనే ఉంచి సపర్యలు చేస్తున్నారు. విచారణ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోని అధికారులు తమకు న్యాయం చేయాలని జ్యోతి కుటుంబ సభ్యులు పలుమార్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ ఫైరోజాబేగం, డ్రిస్టిక్ట్ కో–ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) డాక్టర్ మధుసూదన్కు ఫిర్యాదు చేశారు. దీంతో పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, వైద్యాధికారులతో విచారణ కమిటీ వేశారు. వారు స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన కుటుంబ సభ్యులు సోమవారం అంబులెన్స్లో పేషెంట్ జ్యోతిని పుట్టపర్తిలోని కలెక్టరేట్కు తీసుకొచ్చారు.ప్రజాసమస్యల పరిష్కార వేదిక హాలు బయట అంబులెన్స్లో జ్యోతిని ఉంచి కలెక్టర్ను కలిసేందుకు ప్రయతి్నంచగా, ఆర్డీవో సువర్ణ, డీసీహెచ్ఎస్ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్వో కృష్ణానాయక్ వచ్చి వారితో మాట్లాడారు. ‘మీరు మాకు న్యాయం చేయడంలేదు. ఆస్పత్రి వైపు మాట్లాడుతున్నారు..’ అని అధికారులను జ్యోతి భర్త నిలదీశారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ తమకు న్యాయం జరగకపోతే సీఎం ఇంటి వద్ద నిరాహార దీక్ష చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం జ్యోతిని తీసుకుని వెళ్లిపోయారు. -
రైతు నోటమాట లేదు
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి.. నాణ్యతను బట్టి కిలో టమాటా రూ.30 నుంచి రూ.60 పలుకుతోంది. టమాటా సాస్ ధర కిలో రూ.120 పైమాటే. కానీ.. వాటిని పండించే రైతులకు కిలోకు రూపాయి నుంచి రూ.3 మాత్రమే దక్కుతోంది. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని సాగుచేస్తే కనీసం కూలీ ఖర్చులు కూడా మిగలడం లేదు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది.ధర లేక దిగాలురాష్ట్రంలో 1.55 లక్షల ఎకరాల్లో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరులో 85 వేలు, అనంతపురంలో 48 వేలు, కర్నూలులో 8 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో 17 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. ఎకరాకు 14 టన్నుల చొప్పున ఏటా రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. రాయలసీమలోని 3 జిల్లాల నుంచే 20.36 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. నిత్యం చిత్తూరు మార్కెట్కు 300–400 టన్నులు, అనంతపురం మార్కెట్కు 80–100 టన్నులు, కర్నూలు మార్కెట్కు 80–150 టన్నుల చొప్పున వస్తుంటాయి.చిత్తూరు జిల్లా ప్యాపిలి మార్కెట్లో కిలోకు సగటున రూ.1.40 నుంచి రూ.3 దక్కుతుంటే.. ఉరవకొండ మార్కెట్లో కిలో రూ.2–3కు మించి లభించడం లేదు. అనంతపురం జిల్లా కక్కలపల్లి మార్కెట్లో కిలోకు రూ.3–7, పలమనేరు మార్కెట్లో కిలోకు రూ.3–7, మదనపల్లి మార్కెట్లో కిలోకు రూ.7 వరకు దక్కుతోందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే రైతులకు పదోవంతు కూడా దక్కడం లేదు.గతేడాది కిలో రూ.8కి కొంటామని గతేడాది కూడా ఇదే రీతిలో కిలో రూపాయికి కూడా కొనేవారు లేక టమాటా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అప్పట్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయిస్తామని ప్రకటించి చేతులెత్తేసింది. ఇదిగో కొంటాం.. అదిగో కొంటామని కాలయాపన చేసింది. చివరకు ఎప్పుడు కొంటారని రైతులు నిలదీస్తే ‘నో ప్రాఫిట్.. నో లాస్’ పద్ధతిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామే తప్ప.. కిలో రూ.8కు కొనేందుకు డబ్బులు లేవని మార్కెటింగ్ శాఖ చేతులెత్తేసింది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. టమాటా రైతుల దుస్థితిపై కనీసం స్పందించకుండా ఈ టమాటా థర్డ్ క్వాలిటీ అంటూ అధికారులు మాట దాటవేస్తున్నారు.ఐదేళ్లపాటు టమాటా రైతుకు అండగా..గత వైఎస్ జగన్ ప్రభుత్వం టమాటా రైతులకు అన్నివిధాలా అండగా నిలిచింది. మార్కెట్లో ధరలేని ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి మద్దతు ధరకు కొనుగోలు చేసేది. డిమాండ్కు తగిన సరఫరా లేక మార్కెట్లో ధరలు చుక్కలనంటుతున్నప్పుడు కూడా ఇదే రీతిలో మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల నుంచి గరిష్టంగా కిలో రూ.107కు కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కిలో రూ.50కే సరఫరా చేసింది. ఇలా రైతులకు అండగా నిలవడంతోపాటు ఇటు వినియోగదారులపై భారం పడకుండా చేసింది. గడచిన ఐదేళ్లలో రికార్డు స్థాయిలో రూ.18.02 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి 8,459.56 టన్నుల టమాటాను మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచింది.కిలోకు రూ.2 ఇస్తున్నారురెండెకరాల్లో టమాటా వేశాను. ఎకరాకు రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. రోజు విడిచి రోజు 2 నెలలుగా మార్కెట్కి రోజుకు టన్ను టమాటా తీసుకొస్తున్నా. కేజీ రూ.3 కంటే తక్కువే పలుకుతోంది. ఈ రోజు కిలోకు రూ.2 ఇస్తున్నారు. గతేడాది ఇలాగే ధరలేక నష్టపోయాం. ఈసారి కూడా ధర లేక నష్టపోతున్నాం. ఉరవకొండ మార్కెట్కు వచ్చే రైతులందరిదీ ఇదే పరిస్థితి. – ఎ.రామాంజనేయులు, షేక్షానిపల్లి, అనంతపురం -
Andhra Pradesh: మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల పిడుగులతో వర్షాలు పడతాయని పేర్కొంది.మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది -
ప్రాజెక్టులు అప్పగించకుండా ఎలా అదుపు చేయాలి?
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించకుండా.. నీటి వినియోగాన్ని అదుపు చేయాలని పరస్పరం తమకు ఫిర్యాదు చేస్తే ఎలా అదుపు చేయగలమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలను కృష్ణా బోర్డు ప్రశ్నించింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 తుది తీర్పు వెలువడే వరకూ ఇరు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు ఈ నెల 20న లేఖ రాసింది.ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ.. వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ వాడుకున్నందున, అదనంగా నీటిని వాడుకోకుండా నియంత్రించాలంటూ తెలంగాణ ఈఎన్సీ ఇటీవల కృష్ణా బోర్డుకు లేఖలు రాశారు. తెలంగాణ కూడా కోటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి అదనపు నీటిని వాడుకోకుండా నియంత్రించాలని ఏపీ ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.దీనిపై కృష్ణా బోర్డు స్పందిస్తూ కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా మహారాష్ట్రకు 560, కర్ణాటకకు 700, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలను కేటాయించారని ఇరు రాష్ట్రాలకు గుర్తు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపింది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కు అప్పగించిందని గుర్తు చేసింది. నీటి పంపిణీపై కృష్ణా బోర్డు విచారణ చేస్తోందని పేర్కొంది. తాత్కాలికంగా శ్రీశైలంను ఏపీ, సాగర్ను తెలంగాణ నిర్వహించాలి కేడబ్ల్యూడీటీ–2 తీర్పు వెలువడే వరకూ కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవడానికి 2015 జూన్ 18, 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని కృష్ణా బోర్డు వివరించింది. రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం 2021 జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, దానిపై తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో అది అమల్లోకి రాలేదని పేర్కొంది.గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఏపీ, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్రం పేర్కొందని వెల్లడించింది. ప్రాజెక్టులు తమకు అప్పగించని నేపథ్యంలో.. నీటి వినియోగాన్ని అదుపు చేసే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–2 తుది తీర్పు అమల్లోకి వచి్చ.. నీటి వాటాలు తేలే వరకూ రెండు రాష్ట్రాలు సమన్వయంతో నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు సూచించింది. -
25న పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి
సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఈ నెల 25న (బుధవారం) కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు వస్తున్నారు. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్(జలాశయం), కుడి, ఎడమ కాలువ పనులతోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పనకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. నిర్వాసితులతో సమావేశమవుతారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా ప్రాజెక్టు పనుల్లో నాణ్యత, నిర్వాసితులకు పునరావాసం కల్పనలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, సీడబ్ల్యూసీ సభ్యులు యోగేష్ పైథంకర్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, అధికారుల సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి వారు నివేదిక ఇవ్వనున్నారు. -
ఏపీలో వంట గ్యాస్ సంక్షోభం
ఉత్తరాంధ్రలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నెలకు 17 వేలకుపైగా సిలిండర్లు డెలివరీ చేసేది. నిత్యం 650కిపైగా బుకింగ్లు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటి వరకు 10 వేల సిలిండర్లు మాత్రమే డెలివరీ చేసింది. పెండింగ్లో ఇంకా 7 వేల బుకింగ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంపెనీ నుంచి వచ్చే స్టాక్ ఇప్పుడు తగ్గిపోయింది. మరోవైపు ఆందోళనతో బుకింగ్లు డబుల్ అవుతున్నాయి.దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. సిలిండర్ బుక్ చేసి 10–15 రోజులవుతున్నా డెలివరీ ఇవ్వలేదని, ఎప్పుడిస్తారని వినియోగదారులు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని సదరు ఏజెన్సీ డీలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్రంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్లందరిదీ ఇదే పరిస్థితి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట గ్యాస్ సంక్షోభం ముదురుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొంగ జపం చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు పది రోజులైనా సిలిండర్లు డెలివరీ చేయలేక ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నా, ప్రభుత్వం మాత్రం అబ్బే.. అంత సమస్య లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్యాస్ కొరతతో హోటళ్లు, హాస్టళ్లు మూతపడేలా చేసింది. ముఖ్యంగా వాణిజ్య గ్యాస్ బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టడంలో ఘోరంగా విఫలమైన సర్కార్.. ప్రత్యామ్నాయం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.వాస్తవానికి గృహ వినియోగ గ్యాస్ బుకింగ్లకు తగ్గట్టు సరఫరా జరగడం లేదు. ఏపీలో 1.61 కోట్ల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా, గతంలో నెలకు సగటున 70 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ అయ్యేవి. అంటే రోజుకు 2.5 లక్షలకుపైగా సిలిండర్లు డెలివరీ ఇస్తుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.80 లక్షలకు పడిపోయింది. మొత్తంగా 60 శాతం కొరత! ఏపీలో గృహ వినియోగ అవసరాల కోసం రోజుకు 4 వేల టన్నుల గ్యాస్ నిల్వలు అవసరం. ప్రస్తుతం ఏపీలో 14 వేల టన్నుల నిల్వ ఉందని, నాలుగు రోజులకు సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు ఏజెన్సీలకు సరఫరా చేసే గ్యాస్లో 15–20 శాతం తగ్గుదల ఉంటోంది. ఫలితంగా 40 శాతం వరకు డెలివరీలు పెండింగ్లో ఉంటున్నాయి. మొత్తంగా క్షేత్ర స్థాయిలో 60 శాతం గ్యాస్ కొరత ఉంటే, ప్రభుత్వం మాత్రం కాకి లెక్కలు చూపిస్తూ ప్రజలను మభ్య పెడుతోంది.2025 మార్చిలో ఏజెన్సీలకు సరఫరా చేసిన గ్యాస్కు.. ఈ నెలలో గ్యాస్ స్టాక్లో తీవ్రమైన తగ్గుదల ఉందని డీలర్లు వాపోతున్నారు. పైగా ఉగాది, రంజాన్ సెలవులు రావడంతోపాటు ఆదివారం సెలవును సాకుగా చూపించి, రాష్ట్రంలోని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ కారణంగా వారం రోజుల డెలివరీలను 10 రోజులైనా చేయలేకపోతోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ ఆదివారం సెలవు తీసుకోని ప్లాంట్లు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదన్నది అతిపెద్ద ప్రశ్న. ఇంకో వైపు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా తగ్గించి, వాటిని పట్టణ ప్రాంతాలకు మళ్లిస్తోంది. అయినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లోనూ సమయానికి వినియోగదారులకు గ్యాస్ అందట్లేదు. ప్రజలే భారం మోయాలా? సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని, తాజాగా గ్యాస్ సమస్యలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. అక్కడి హోటళ్లు మూత పడలేదు. వినియోగదారులు ఏజెన్సీల ఎదుట క్యూ కట్టలేదు. కానీ, బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్లో మాత్రం గ్యాస్ కోసం ప్రజానీకం అల్లాడుతోంది. ఆహార, వాణిజ్య రంగం కుదేలయ్యే పరిస్థితికి వచ్చింది.ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఉచిత సలహాలు మినహా పేదలకు ఒరగబెట్టింది ఏదీ కనిపించట్లేదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గ్యాస్ కొరత లేదంటూనే రాష్ట్ర వ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశాలు జారీ చేస్తుండటం చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగాన్ని ప్రోత్సహించాలంటూ పేదల నెత్తిపై భారం మోపే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఒక మధ్య తరగతి కుటుంబం సగటున 14.2 కిలోల సిలిండర్ను నెలన్నరకుపైగా వినియోగిస్తుంది.అంటే, రూ.937 వెచ్చిస్తే దాదాపు 45 రోజులకుపైగా గ్యాస్పై వంట చేసుకోవచ్చు. కానీ, పీఎన్జీ తీసుకుంటే రూ.వేలల్లో కనెక్షన్ ఫీజు ముందుగా కట్టడంతోపాటు నెలకు రూ.1000కిపైగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే, సాధారణ సిలిండర్ కంటే పీఎన్జీ కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఉచిత సలహా ఇస్తుండటం ఆరి్థక వేత్తలను కలవరపెడుతోంది. ‘కిరోసిన్’ లీకులతో కాలక్షేపం చంద్రబాబు సర్కార్ గ్యాస్ కొరత లేదంటూనే పేదలకు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ పంపిణీ చేస్తామని లీకులు ఇచ్చింది. తొలుత ఏజెన్సీ ఏరియాల్లో రేషన్ డీలర్ల ద్వారా కిరోసిన్ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. తీరా చూస్తే ఏపీలో అందుబాటులో ఉన్న కిరోసిన్ నిల్వ కేవలం 2,700 కిలో లీటర్లు మాత్రమే. వాస్తవానికి 1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి లీటరు చొప్పున కిరోసిన్ ఇవ్వాలంటే సుమారు 14,800 కిలో లీటర్లు అవసరం.కానీ, 18 శాతం కూడా పంపిణీకి సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రకటనలు గుప్పించింది. కిరోసిన్ ఫ్రీ స్టేట్గా మారిన ఏపీని చంద్రబాబు మళ్లీ కిరోసిన్ ఆధారిత రాష్ట్రంగా మార్చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో 20కి పైగా కిరోసిన్ ఫ్రీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. గ్యాస్ కొరతతో ఏ రాష్ట్రం కూడా కిరోసిన్ వినియోగంపై ఆలోచన చేయట్లేదు. కానీ, ఒక్క ఏపీలో మాత్రమే కిరోసిన్ పంపిణీ మళ్లీ పునఃప్రారంభించాలని చూడటం స్థానికంగా దిగజారిన జీవన ప్రమాణాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకవేళ సర్కారు కిరోసిన్ పంపిణీ చేసినా ప్రజలు కిరోసిన్ స్టవ్ల కోసం దుకాణాలకు పరుగుపెట్టాలి. ఆ మేరకు కిరోసిన్ స్టవ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయా? రాష్ట్రంలో ఇదీ పరిస్థితి ⇒ సింగిల్ సిలిండర్ ఉన్న వారు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ⇒ వాణిజ్య గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపి వేయడంతో పది రోజులుగా వ్యాపారాలు చతికిలపడ్డాయి. ⇒ బ్లాక్ మార్కెట్ దందాకు గేట్లు తెరుచుకున్నాయి. రూ.2 వేలు ఉండే ఒక్కో సిలిండర్ను రూ.4 వేల నుంచి రూ.4500 వెచ్చించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ⇒ చిరు హోటల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. రూ.వేలు పెట్టి సిలిండర్లు కొనలేక, హోటళ్లను మూసేస్తున్నారు. టీ దుకాణాల్లో ‘స్పెషల్ టీ’ల అమ్మకాలు ఆపేశారు. ⇒ ప్రభుత్వం చాలా చోట్ల హాస్టళ్లకు కూడా సిలిండర్లను సరఫరా చేయించలేకపోతోంది. ⇒ స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లకు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ కొనగలిగే స్తోమత ఉంటుంది. కానీ, 25 వేల మంది చిరు వ్యాపారులు ఆ భారాన్ని మోయలేక కొందరు దుకాణాలు మూసేయగా, మరికొందరు ప్రత్యామ్నాయ పొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రైవేటు హాస్టళ్లు, స్కూళ్లు ఉగాది, రంజాన్ సెలవులను సాకుగా చూపించి విద్యార్థులను ఇళ్లకు పంపించేశాయి.స్టాక్ మేరకు పంపిణీ చేస్తున్నాంమా ఏజెన్సీల్లో స్టాక్ ఉన్నంత మేరకు వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేస్తున్నాం. ఫస్ట్ బుకింగ్.. ఫస్ట్ ప్రయార్టీ ప్రకారం చేస్తున్నాం. గృహ వినియోగదారులు ఎవరి సిలిండర్లను వారే వాడుకోవాలి. వాణిజ్య సిలిండర్లు తొలుత పట్టణాల్లో 30 శాతం మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. – కె.శ్రీనాథ్రెడ్డి, ఏపీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పునర్విభజనకు లైన్క్లియర్
సాక్షి, అమరావతి: దేశంలో లోక్సభ, శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం మార్గం సుగమం చేసింది. నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. దేశంలో లోక్సభతోపాటు 28 రాష్ట్రాలలో శాసనసభ స్థానాలను గంపగుత్తగా 50 శాతం పెంచాలని నిర్ణయించింది.. అందులో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేయనుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే సార్వత్రిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. పునర్విభజన తర్వాత దేశంలో లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. ఇందులో మహిళలకు 33 శాతం అంటే 270 స్థానాలను రిజర్వేషన్ చేయనున్నారు.జనాభా గణనతోనే ఆలస్యం..దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా గణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. షెడ్యూలు ప్రకారం జనాభా గణన 2021లో జరగాలి. అయితే కరోనా ప్రతికూల పరిస్థితుల వల్ల అప్పట్లో జనాభా గణన చేపట్టలేదు. అప్పట్లో నిర్వహించాల్సిన జనాభా గణనను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ మొదటి విడత.. రెండో విడత 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. అయితే 2027 జనాభా గణన లెక్కలు తేలేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.ఎస్సీ, ఎస్టీలకు..దేశంలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు లోక్సభ సీట్లు 84 ఉన్నాయి. ఎస్టీ వర్గాలకు సంబంధించి రిజర్వుడు లోక్సభ స్థానాలు 47 ఉన్నాయి. నియోజక వర్గాల పునర్విభజనతో సీట్ల పెంపు నేపథ్యంలో అదే దామాషాలో వారి సీట్లు పెరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లు గరిష్టంగా ఉన్న చోట ఆయా వర్గాలకే సీట్లు కేటాయించనున్నారు. ఈ సామాజిక వర్గాలకు అసెంబ్లీ స్థానాలు కూడా అదే నిష్పత్తిలో పెరగనున్నాయి.ఇది ఐదోసారి... దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నియోజకవర్గాల పునర్విభజనను గతంలో నాలుగు సార్లు (1952, 1963, 1973, 2002–2008) కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ఐదోది కావడం గమనార్హం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును 2023లో పార్లమెంటు ఆమోదించింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ (ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో కలిపి) 128వ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దేశంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ, శాసనసభ స్థానాలను గంపగుత్తగా 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఆ మేరకు లోక్సభ, శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే బిల్లును పార్లమెంటు రెండింట మూడొంతుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ప్రస్తుత సమావేశాల్లోగానీ లేదా వర్షాకాల సమావేశాలు లేదంటే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఏపీలో ఎంపీ సీట్లు పెంపు ఇలా..రాష్ట్రంలో ప్రస్తుతం లోక్సభ స్థానాలు 25 ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 50 శాతం అంటే 12.5 స్థానాలు పెరగాలి.. కానీ 50 శాతం స్థానాలు పెంచేటప్పుడు 12.4 స్థానాలు వస్తే.. దాన్ని 12గానే పరిగణించి స్థానాలు పెంచుతారు. అదే 12.6 స్థానాలు వస్తే.. దాన్ని 13 స్థానాలుగా పరిగణించి పెంచుతారు. ఈ నేపథ్యంలో ఏపీలో 12.5 స్థానాలు వస్తే లాటరీ వేస్తారు. ఆ లాటరీలో రాష్ట్రానికి అనుకూలంగా ఫలితం వస్తే 13 స్థానాలు.. ప్రతికూలంగా వస్తే 12 స్థానాలనే పెంచుతారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విజన తర్వాత రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతాయి. ఇందులో 33 శాతం అంటే 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ చేస్తారు.అసెంబ్లీ స్థానాలు పెరిగేది ఇలా..ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 175 శాసనసభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కు పెరుగుతాయి. అందులో 33 శాతం... అంటే 86 లేదా 87 స్థానాలను మహిళలకు రిజర్వేషన్ చేస్తారు. రాష్ట్రంలో ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో సగటున 1.60 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. -
‘ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే’
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించడాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. లోక్సభలో పైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దన్నారు. ‘ కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. కానీ వాస్తవానికి పోలవరం ఒరిజినల్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం పోలవరం నిర్మించాలి. పోలవరం నిల్వ సామర్థ్యాన్ని 190 టీఎంసీల నుంచి 120 కి తగ్గించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే. ఆంధ్రప్రదేశ్ అప్పు రెండేళ్లలో 3 లక్షల 36,000 కోట్ల రూపాయలు దాటింది. ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఏపీలో అత్యధిక 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ సగటు 5.2 ఉంటే ఏపీ ది అత్యధికంగా 8 శాతం ఉంది. మహిళల్లో నిరుద్యోగ రేటు 10% గా ఉంది. వైఎస్ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల పట్టాలు ఇచ్చి .. ఇల్లు మంజూరు చేశారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో 14 లక్షల 20 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2024 నుంచి 26 మధ్య టిడిపి ప్రభుత్వం రూ. 1165 కోట్ల రూపాయలను ఇల్ల నిర్మాణానికి వినియోగించకుండా వదిలేసింది. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందిచాలామంది ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటకీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాలు పక్కన పెట్టి పోలవరం కోసం పనిచేసేందుకు ముందుకు వస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. కొత్త స్టీల్ ప్లాంట్ కు సంబరాలు చేస్తున్న ప్రభుత్వం.... ఉన్న స్టీల్ ప్లాంట్ను ఎందుకు చంపుతుంది?, విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలి. చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బకాయిలకు చిన్న వ్యాపారులను శిక్షించొద్దు. ఎంఎస్ఎమ్ఈలకు జీఎస్టీ ఇన్కమ్ టాక్స్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
ఏఐ.. ప్రాణదీపికై
సాక్షి, అమరావతి: దేశంలో రైల్వే మార్గాలపై ఏనుగులు, ఇతర వన్యప్రాణులను ప్రమాదాల బారి నుంచి కాపాడేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని రైల్వే మార్గాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఏనుగులతో పాటు ఇతర వన్యప్రాణులూ మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్లకు సమీపంలో వాటి ఉనికిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా గుర్తిస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డి్రస్టిబ్యూటెడ్ అకౌస్టిక్ సెన్సింగ్ (డీఏఎస్)తో రైల్వే ట్రాక్లపై వీటి ఉనికిని గుర్తించే ఏఐ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. ట్రాక్ సమీపంలోకి ఏనుగులు, ఇతర వన్యప్రాణులు వస్తే ఈ వ్యవస్థ వాటి కదలికలను లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందికి హెచ్చరిక జారీ చేస్తోంది. దీంతో సకాలంలో నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే 141 రూట్ కిలోమీటర్లలో అమలు.. ప్రస్తుతం ఈ ఏఐ ఆధారిత వ్యవస్థను రైల్వేలోని 141 రూట్ కిలోమీటర్ల మేరకు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, ఈ వ్యవస్థను మరో 981 రూట్ కిలో మీటర్లలో విస్తరించేందుకు టెండర్లను ఆహా్వనించినట్లు తెలిపింది. వన్యప్రాణుల మరణాలపై 127 రైల్వే మార్గాల్లో 3,452.4 కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించింది. దీని ద్వారా ఏనుగుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 110 రైల్వే మార్గాలను, పులుల సంచార ప్రాంతాల్లో సున్నితమైన 17 రైల్వే మార్గాలను గుర్తించింది. తక్షణం నష్ట నివారణకు 14 రాష్ట్రాల్లో 77 రైల్వే మార్గాల్లో 1,965.2 కిలో మీటర్ల మేర పలు నిర్మాణాలను చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.రైల్వే ప్రమాదాల బారి నుంచి వన్య ప్రాణులను కాపాడేందుకు 503 లెవెల్ క్రాసింగ్లు, ర్యాంపుల నిర్మాణం, 72 చోట్ల వంతెనల విస్తరణ, మార్పు, 39 చోట్ల కంచె, బారికేడింగ్, కందకాల నిర్మాణం, నాలుగు నిష్క్రమణ ర్యాంపులు, 65 కొత్త అండర్ పాస్లు, 22 ఓవర్పాస్ల నిర్మాణాలను చేపడుతున్నట్లు వివరించింది. రైలు ప్రమాదాల్లో 2020–21 నుంచి 2024–25 వరకు 79 ఏనుగులు మృత్యువాత పడినట్లు తెలిపింది. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, కేరళ, ఒడిశా ,త్రిపుర, ఉత్తరాఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మృతి చెందుతున్నట్లు పేర్కొంది. -
టీడీపీ నేతల రాసలీలలు
సాక్షి టాస్క్ ఫోర్స్: అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నా రు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపో యి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నా రు. ఈ క్రమంలో అధికార పారీ్టకి చెందిన ఓ శాసనసభ్యుడి రాసలీలలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలోని హోటల్లో ఏకాంతంగా గడిపి వివాదంలో ఇరుక్కున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎవరా ఎమ్మెల్యే.. అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ ఎమ్యెల్యే తరచూ ఆమెతో నల్లమల ఫారెస్ట్కు సమీపంలో ఉండే ఆ ఊళ్లోని హోటల్కు వచి్చవెళ్తున్నట్లు ప్రత్యర్థులు పసిగట్టి నిఘా పెట్టారు.ఇటీవల ఓ రోజు రాత్రి ఆ హోటల్లో ఆ ఎమ్మెల్యే ఆ మహిళతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను కాపాడాలనే ఉద్దేశంతో హోటల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేయించారు. చీకట్లో ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగక.. ఆ ఎమ్మెల్యే, ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా హోటల్లోని సీసీ ఫుటేజీ తొలగించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే ఆ హోటల్కు ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయంలోని సీసీ ఫుటేజీను కూడా మాయం చేయించినట్లు పోలీస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ హోటల్లో ఏమీ జరగకపోతే అంత హడావుడిగా సీసీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సదరు ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరిందని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. నెల్లూరులో కీలక టీడీపీ నేత బాగోతమిది నెల్లూరు చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో ఆదివారం నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అ««ధ్యక్షుడు కూడా. పోలీసుల దాడుల్లో 17 మంది విటులు, 14 మంది మహిళలు పట్టుబడ్డారు.వీరిలో రాధాకృష్ణ సైతం ఉండడంతో వారందరినీ తీసుకొచ్చి పోలీస్స్టేషన్లో కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు ఆయన పేరును తొలగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సదరు టీడీపీ నేత ఆస్పత్రిలో చూపించుకోవడానికి వచి్చ, సాయి గ్రాండ్ లాడ్జి వద్ద ఉండగా తాము తీసుకొచ్చామని.. విషయం తెలుసుకుని వదిలేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. -
ఓటరు జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభమవుతోందని, అత్యంత కీలకమైన దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఆ పార్టీ రాష్ట్ర కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఆదివారం ఆయన వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర, పారదర్శక ఓటరు జాబితాల రూపకల్పన కోసం ఎస్ఐఆర్ అంటూ తమిళనాడులో ఏకంగా కోటి 40 లక్షల ఓట్లు, పశ్చిమబెంగాల్, బిహార్లో 40–50 లక్షల వరకు ఓట్లు తీసేశారని తెలుస్తోందన్నారు.ఎస్ఐఆర్ రాక ముందు కూడా మన రాష్ట్రంలో లక్షల ఓట్లు తీసేశారని.. 2019లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గట్టిగా పోరాడితే కొంత వరకు తగ్గారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్ఐఆర్కు అందరూ సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో సమావేశాలు పెట్టుకుని చర్చించాలన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఏర్పాటు చేసుకుని, ప్రతి బూత్కు కచ్చితంగా క్రియాశీలకంగా ఉన్న వారిని ఎంపిక చేయాలని సూచించారు. మన ఓట్లు తీయించే ప్రయత్నం చేసేందుకు అవకాశం ఉన్నందున.. ఓటర్లను గుర్తించడం, మ్యాపింగ్ చేసుకోవడం వెంటనే జరగాలన్నారు. బీఎల్ఓల ద్వారా మనకు తెలియకుండానే ఫామ్ 6, 7 తెచ్చి పెడతారని.. సాంకేతికంగా అవగాహన పెంచుకోవాలన్నారు. కమిటీల్లో వీలైనంత ఎక్కువ మందిని చేర్చాలి ‘కమిటీల నియామకం వేగంగా పూర్తయింది. ఈ కమిటీల్లో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలన్నది వైఎస్ జగన్ ఆలోచన. క్రియాశీలకంగా ఉన్న చోట, బలం ఉన్న చోట వీలైనంత ఎక్కువ మందిని తీసుకోవాలి. అప్పుడే మనం బలంగా తయారవుతాం. పార్లమెంటు పరిశీలకులు క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వం తయారు చేయడానికి ఇది దోహదం చేస్తుంది. సెంట్రల్ ఆఫీసుకు, మీకు సమన్వయం చేస్తూ సెక్రటరీలు పని చేస్తారు. 12 లక్షలకు పైగా డిజిటలైజేషన్ లక్ష్యంగా పెట్టుకున్నాం. పార్టీ కార్యక్రమాల్లో క్షేత్ర స్థాయిలో అందరూ క్రియాశీలకంగా పాల్గొనాలి’ అని సజ్జల సూచించారు. -
22ఏ నిషేధిత జాబితా నుంచి 51,603 ఎకరాల తొలగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఆధీనంలో ఉన్న 51,603.46 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టం–1908 సెక్షన్ 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆ భూములను పూర్తిగా ఏపీఐఐసీ పేరు మీదకు మార్చడానికి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ స్వాధీనంలో 70,000 ఎకరాలు ఉన్నప్పటికీ, పరిహారం చెల్లించిన 51,603.46 ఎకరాలకు సంబంధించి ఇంకా రెవెన్యూ, వెబ్ల్యాండ్ రికార్డుల్లో మ్యుటేషన్ జరగలేదని పేర్కొన్నారు. దీనివల్ల వివిధ సంస్థలతో ఏపీఐఐసీ అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతుందని, ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి తక్షణమే ఏపీఐఐసీ పేరు మీదకు బదలాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలోఅత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 11,862.11 ఎకరాలు ఉండగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 10,403.92 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 4,172.18 ఎకరాల భూములు ఉన్నాయి. అతి తక్కువగా పొలవరం జిల్లాలో 19.61 ఎకరాలు ఉన్నాయి. చదవండి: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకే రూ.401.54 కోట్లు! -
నేడు సీహెచ్వోల మహా ధర్నా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ, తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లు సోమవారం విజయవాడలో రాష్ట్రస్థాయి మహా ధర్నాకు దిగబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వారంతా పలుమార్లు నిరసనలు తెలిపారు. గతేడాది ఏకంగా 40 రోజుల పాటు విధులు బహిష్కరించి సమ్మె కూడా చేశారు.అయినా తీరు మార్చుకోని ప్రభుత్వం.. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వైద్య సేవలు అందిస్తున్న సీహెచ్వోలను రాత్రి 8 గంటలకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) హాజరు వేయాలంటూ వేధిస్తోంది. వారికి ఇవ్వాల్సిన నెలవారీ ఇన్సెంటివ్ రూ.5 వేలకు.. రాత్రి 8 గంటల హాజరుతో ముడిపెట్టింది. దీనిపై సీహెచ్వోలు గత కొన్నిరోజులుగా ఆందోళన తెలియజేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నేషనల్ హెల్త్ మిషన్ మార్గదర్శకాల్లో కూడా రాత్రి 8 గంటలకు హాజరు వంటి ప్రస్తావనే లేదని వారు మండిపడుతున్నారు. తమ పని సమయాన్ని, విధులను వెంటనే క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యమైన డిమాండ్లు.. ⇒ అసాధారణమైన పనిభారం నుంచి విముక్తి కల్పించాలి. ప్రస్తుతం అమలు చేస్తున్న న్యూ మేట్రిక్స్ విధానాన్ని రద్దు చేసి.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నెలవారీ రూ.15 వేల ఇన్సెంటివ్ విధానం అమలు చేయాలి. ⇒ అద్దె భవనాల్లో ఉన్న విలేజ్ క్లినిక్స్కు మూడు నెలల అద్దె అడ్వాన్స్ చెల్లించాలి. ⇒ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్వోల సర్వీస్ను క్రమబద్ధీకరించాలి. పెరిగిన జీవన వ్యయాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ⇒ గతేడాది చేపట్టిన 40 రోజుల సమ్మె కాలాన్ని పనిదినాలుగా పరిగణించి.. వేతనాలు, ఇన్సెంటివ్స్ వెంటనే విడుదల చేయాలి. ⇒ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వెయిటింగ్ హాల్, టెలిమెడిసిన్, డే కేర్ రూమ్స్ తదితర సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి. -
పోరుబాటలో అంగన్వాడీలు
సాక్షి, అమరావతి: వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓ.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఏడాది నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదన్నారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు.ఆ సమయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్చలకు పిలిచి సీఎంతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తామని చెప్పి ఇంత వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే జీతాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదని లేదని.. డిమాండ్స్ సాధనకు మరోసారి పోరుబాట పడతామని సుబ్బరావమ్మ స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.నాగశేషు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, కోశాధికారి బి.లక్షి్మదేవి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర కమిటీ తీర్మానంలో ఆమోదించిన డిమాండ్లు ఇవే..⇒ నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలి ⇒ హెల్పర్ ప్రమోషన్ గైడ్లైన్స్ జీఓ 5కు సవరణ చేయాలి.⇒ మేలో ప్రీ స్కూల్ పిల్లలకు నెల మొత్తం టేక్ హౌస్ రేషన్ (టీహెచ్ఆర్) ఇచ్చి అంగన్వాడీలకు సెలవులు ఇవ్వాలి⇒ గ్రాట్యుటీకి నిర్ధిష్టమైన గైడ్లైన్స్ ఇచ్చి అమలు చేయాలి -
అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు దుబారా వ్యయానికి హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణ పనులు మరో నిదర్శంగా నిలుస్తున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీటీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులను రూ.556 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఇక ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు రూ.424.34 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లకు.. అసెంబ్లీ నిర్మాణ పనులు రూ.724.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థలకు సీఆర్డీఏ అప్పగించింది.. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే.. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు, అసెంబ్లీ నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు చేరుకుంది.దీంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి రూ.10,244.07, హైకోర్టు భవనానికి రూ.7,286.03కి పెరిగింది. గతంలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం రూ.19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.తాజాగా రూ.556 కోట్లు..హైకోర్టు భవనాన్ని ఏజీసీ ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ను రూపొందించింది. ఈ భవన పనులను రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతులతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ కోట్ చేసి టెండర్ దక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో పేర్కొన్నారు. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్న మాట. తాజాగా.. ఈ భవనం పనులకు రూ.556 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో హైకోర్టు భవన నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు చేరుకుంది. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,244.07అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చ.అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థే రూపొందించింది. ఈ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.4.48 శాతం అధిక ధరకు అంటే.. రూ.617.33 కోట్లకు ఎల్అండ్టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. తాజాగా.. ఈ పనులకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లన్నమాట. అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07కు చేరుకుంది.అసలే అప్పులు.. ఆపై దుబారా..ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వ రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృథానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండటం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది.కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో ఫైవ్స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తోనూ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించదని గుర్తు చేస్తున్నారు.అలాంటిది రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయం ఎక్కడా లేనట్లు చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తుండడం చూస్తుంటే నీకింత.. నాకింత అన్నట్లుగా దోచుకోవడానికేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
డిజైన్లకే రూ.401.54 కోట్లు!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు.. భవనాల డిజైన్ల (ఆకృతులు) ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్ధలు కొడుతోందని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయటాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం (అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్) డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్కు చెందిన ‘మకీ’ అసోసియేట్స్ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ టెండర్ను రద్దు చేసిన సమయంలో మకీ ఛైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారీ ఒప్పందాలే ఉంటాయని పుమిహికో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను తీవ్రంగా దెబ్బ తీశాయని పేర్కొంటున్నారు.డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి..రాజధానిలో నేలపాడు వద్ద 1,575 ఎకరాల్లో ‘ఏజీసీ’ని ప్రభుత్వం నిర్మిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్వోడీ) కోసం 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్తులతో మరో టవర్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఈ ప్రాంగణంలో నిర్మిస్తోంది. ఈ ఏడు భవనాలతోపాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్లకు 2016లో చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్కు చెందిన ‘మకీ’ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారని మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కారు మళ్లీ టెండర్లు పిలిచింది. లండన్కు చెందిన ఫోస్టర్ పార్టనర్స్తో కలసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్గా ఏర్పడి రూ.67,86,44,683కు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్లను ప్రదర్శిస్తూ.. రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్(జేవీ) సంస్థ రూపొందించిన డిజైన్లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు గతేడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా రూ.136,90,74,000కు హఫీజ్ కాంట్రాక్టర్కు అప్పగించింది. ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జిలతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.59,90,00,000కు హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది.లోపాయికారీ ఒప్పందం కాకపోతే మరేమిటి?సచివాలయం, హెచ్వోడీ కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న ఐదు టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్ది ఆర్కిటెక్చరల్ సేవలు అందించే పనులను 2017 మే 2న చంద్రబాబు సర్కార్ నిర్వహించిన టెండర్లలో రూ.112,58,69,400కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. కానీ.. అప్పట్లో ఐదు టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో కూడా రూ.136,88,40,800కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పనులు దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టి లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నది స్పష్టమవుతోందని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఏజీసీలో భవనాల నిర్మాణం డిజైన్ల తయారీ పనులనే రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించడం గమనార్హం. ఆర్కిటెక్ట్స్ అందరూ ఫోర్బ్స్ మ్యాగజైన్లా భావించే ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్ 2017 ఏప్రిల్లో ప్రచురించిన సంచికలో మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో రాసిన వ్యాసంలో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.. రాజధాని డిజైన్ల తయారీలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి దుబారా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు. చదవండి: దళిత యువతిపై పెట్రేగిన పోలీసులు -
ఐదేళ్లకుపైగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలి
శృంగవరపుకోట: కోర్టుల్లో ఐదేళ్లకుపైబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు చెప్పారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో రూ.8.5 కోట్లతో నిరి్మంచనున్న సింగిల్ కోర్టు కాంప్లెక్స్ భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్.కోట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మాట్లాడుతూ ఎస్.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్ చేశారని, మరో పాతికేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్టుగా కోర్టు భవనాల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు బెంచ్–బార్ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన మంచి తీర్పులు వస్తాయన్నారు. కొన్ని సివిల్ తగాదాలు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నట్టు గమనించామని, జ్యుడీషియల్ వ్యవస్థపై కోర్టులకు వెళ్తే తరాలు మారినా న్యాయం జరగదని, ఫలితం రాదన్న అపవాదు ఉందని, దాన్ని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. మెగా లోక్ అదాలత్లో తొలి విడతలో 3 లక్షలు, రెండవ విడతలో 3 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ కృషితో నిధులు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసుల జడ్జిమెంట్ సరిగా లేకుంటే మళ్లీ కేసులు పడే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఎస్.కోట కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ క్రెడిట్ని తన ఖాతాలో వేశారని పేర్కొన్నారు. తనకు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మంచి స్నేహితుడు, మార్గదర్శకులు అని చెప్పారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత, గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ రాంసుందర్రెడ్డి, విజయనగరం ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బల్క్ డ్రగ్ పార్కుకు ‘ఉక్కు’తాడు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. ఈ పార్కు కోసం గత ప్రభుత్వం సేకరించిన 2,000 ఎకరాల్లో 783.74 ఎకరాలు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్కు కేటాయించడం ద్వారా ప్రాజెక్టును వివాదాల సుడిగుండంలోకి నెట్టేశారు. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న భూమిపూజ చేయనున్నారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్ పార్కును బాబు సర్కారు నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం వివాద రహితంగా భూసేకరణ పూర్తిచేసినా..! ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి కేటాయించిన భూమికి బదులుగా బల్్కడ్రగ్ పార్కుకు 790 ఎకరాలు భూమిని మత్స్యకార గ్రామాల్లో బాబు సర్కారు కేటాయించినా.. అక్కడ మత్స్యకారులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బల్క్ డ్రగ్ పార్కు ప్రశ్నార్థకంగా మారింది. తొలుత నక్కపల్లి వద్ద బల్్కడ్రగ్ పార్కును అనకాపల్లి, నక్కపల్లి మండలాలకు చెందిన రాజయపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజు పేట, చందనాడ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ భూమిని రాజయపేట, డీఎల్పురం, వేంపాడు, బుచిరాజుపేట, చందనాడ, పెద్దతీర్నాలా సీహెచ్ లక్ష్మీపురం, ఉపమాక, ఎన్నర్సాపురం, గుడివాడ గ్రామాల పరిధిలోకి మార్చారు. గత ప్రభుత్వం వివాద రహితంగా భూ సేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియనూ పూర్తి చేసింది. ఈ లోగా ఎన్నికలు రావడంతో నిర్మాణ పనుల ప్రారంభం ఆగింది. ఈ ఏడాది మార్చి నాటికి బల్్కడ్రగ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఒక తట్టెడు మట్టి ఎత్తకపోగా చంద్రబాబు సర్కారు మొత్తం ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందాలంటే ఈ ప్రాజెక్టును ఈ నెలలోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూసేకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఈ గడువును మరో ఏడాది అంటే వచ్చేఏడాది మార్చి వరకు పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. మిట్టల్ కోసం విశాఖ ఉక్కు ప్రయోజనాలూ తాకట్టు మిట్టల్ స్టీల్పై ఉన్న విపరీతమైన ప్రేమతో విశాఖ స్టీల్ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారు. విశాఖ ఉక్కుపై తన అక్కసును పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ముగింపు సమావేశంలో విశాఖ స్టీల్పై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. విశాఖ స్టీల్ కారి్మకులను పనిదొంగలని అభివరి్ణంచారు. పనిచేయకుండా కూర్చొబెట్టి జీతాలు ఇవ్వాలా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గనుల గురించి ఏనాడూ కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పించని చంద్రబాబు ప్రైవేటు సంస్థ అయిన మిట్టల్ స్టీల్ కోసం నేరుగా ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మిట్టల్ స్టీల్కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించుకున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా జరగనంత స్పీడ్గా అనుమతులన్నీ మంజూరు చేయించి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచి్చనట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబిచ్చారు. అంతేకాదు మిట్టల్ స్టీల్ కోసం కాకినాడ గేట్వే పోర్టు అభివృద్ధినీ పణంగా పెట్టి అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద సముద్రపు ఒడ్డు నుంచి 2.9 కిలోమీటర్లలోపు క్యాపిటివ్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి బాబు సర్కారు అనుమతించింది. ఒక్క మిట్టల్ స్టీల్ కోసం బల్్కడ్రగ్ పార్కు, కాకినాడ గేట్వే పోర్టులను పణంగా పెట్టడమే కాకుండా అనుమతుల దగ్గర నుంచి గనుల కేటాయింపు వరకు ప్రత్యేక దృష్టి సారించిన దాంట్లో పదో శాతం శ్రద్ద విశాఖ స్టీల్పై పెట్టి ఉంటే విశాఖ స్టీల్ ఇప్పటికే స్వయం ప్రతిపత్తి సంస్థగా ఎదిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. -
హైబ్రీడ్ వంట..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత, దాని ధరల పెరుగుదల కారణంగా వంట విధానంలో పెనుమార్పు కనిపిస్తోంది. ఇంతకాలం గ్యాస్కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉపయోగించిన ఇండక్షన్ స్టవ్లు ఇప్పుడు గ్యాస్తో సమానంగా వంటగదిలో స్థానం సంపాదిస్తున్నాయి. దీంతో ‘హైబ్రిడ్ వంట’ (గ్యాస్, ఇండక్షన్) అనే కొత్త ధోరణి వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం గృహాల్లో వాడే గ్యాస్ సిలిండర్ ధర బ్లాక్ మార్కెట్లో రూ.2 వేలు దాటడంతో పాటు, సాధారణ సరఫరాకు 10 రోజులపైనే పడుతోంది. దీంతో ప్రజలు వంటకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనం ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్లుతున్నారు. ఫలితంగా వీటికి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరాల్లో పెరిగిన అమ్మకాలు..విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఇండక్షన్ స్టవ్ అమ్మకాలు 50 శాతం వరకు పెరిగాయని అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు పట్టణాల్లో ప్రతి 10 ఇళ్లకుగాను కనీసం మూడు ఇళ్లల్లో ఇండక్షన్ స్టవ్ ఉందంటే ఆతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 15 శాతం ఇళ్లల్లో ఈ స్టవ్ల వినియోగం ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో వీటికి డిమాండ్ పెరగడంతో ఇప్పుడివి చాలాచోట్ల అందుబాటులో ఉండటంలేదు. ఈ–కామర్స్ సైట్లలోనూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ప్రజలు ఎక్కడ ఇండక్షన్ స్టవ్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఇకపై చాలా ఇళ్లల్లో గ్యాస్తో పాటు సమానంగా ఇండక్షన్ స్టవ్ని కూడా ఉపయోగించడం (హైబ్రీడ్ వంట) సాధారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఖర్చు తక్కువే, కానీ..ఇండక్షన్ స్టవ్ సాధారణంగా 1.5 నుంచి 2 కిలోవాట్ల విద్యుత్ వినియోగిస్తుంది. రోజుకు రెండు గంటలు వాడితే మూడు యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే.. నెలకు సుమారు 90 యూనిట్లు. ఈ లెక్కన రూ.500–600 వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే, ఇది గ్యాస్ ఖర్చుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. వంట కూడా త్వరగా అవుతుంది. పైగా గ్యాస్తో పోలిస్తే సురక్షితం.ఇబ్బందులూ ఉన్నాయి..అయితే, ఈ ఇండక్షన్ స్టవ్లవల్ల కొన్ని సమస్యలూ ఉన్నాయి. అవి..» కరెంట్ లేకపోతే పనిచేయదు..» ప్రత్యేక పాత్రలు అవసరం. వీటికోసం రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు ఖర్చవుతుంది..» గ్రామాల్లో వోల్టేజ్ సమస్యవల్ల ఇండక్షన్ స్టవ్లు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది..» అదీగాక.. ఇవి చిన్న కుటుంబాలకు సరిపోవచ్చుగానీ పెద్ద కుటుంబాల్లో వీటితో కష్టం..» అయినా గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఇండక్షన్ స్టవ్ సరైన ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపిస్తోంది. మొత్తం మీద గ్యాస్ కొరతతో ప్రారంభమైన ఈ మార్పు ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారుతోంది. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది.


