కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి | YSRCP Chief YS Jagan Nwe Year Wishes To Telugu People | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి

Dec 31 2025 7:41 PM | Updated on Jan 1 2026 9:59 AM

YSRCP Chief YS Jagan Nwe Year Wishes To Telugu People

సాక్షి, తాడేపల్లి: తెలుగు ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో ప్రజలకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం.. ప్రతీ ఒక్కరి జీవితాలలో ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి నింపే సంవత్సరం కావాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు వెలుగుతో, నవ్వులతో నిండిన ఏడాది గడపాలని కోరుకుంటున్నా’’ అంటూ ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారాయన. 

అంతకు ముందు న్యూఇయర్‌ సందేశాన్ని విడుదల చేసిన ఆయన.. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని,  ఈ ఏడాది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. అందరు ఆరోగ్యంగా ఉండాలని.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆకాక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement