మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌పరమా? | Comments by film actor Prakash Raj on medical colleges | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీలు ప్రైవేట్‌పరమా?

Dec 28 2025 5:37 AM | Updated on Dec 28 2025 5:37 AM

Comments by film actor Prakash Raj on medical colleges

ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు 

పీపీపీ పేరిట కట్టబెట్టడం ఏపీ ప్రజలకు నష్టం

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలు  

కళ్లముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వ్యాపారం 

ప్రజలు ఎవరిని బలపరచాలో నేర్చుకోవాలి 

సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ వ్యాఖ్యలు 

నటుడు శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వెల్లడి

డాబా గార్డెన్స్‌: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభు­త్వా­న్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్ల­ముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవా­డు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రా­జ్‌ తీ­వ్రం­గా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు. 

ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్‌ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడా­రు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయా­యని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాలకులు ప్రజ­లు, కార్మికుల ఓపిక­ను పరీక్షిస్తున్నారని అన్నా­రు. ప్రశ్నిoచే గొంతు నొ­క్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మా­ర్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడ­దని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు. 

వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్‌లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్‌ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అని అన్నారు.  

శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం 
సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకా­ష్‌­రాజ్‌ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హో­టల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్త­గా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నా­రు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్‌రాజ్‌ తీవ్రంగా స్పందించా­రు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement