breaking news
teamindia
-
టీమిండియాకు గుడ్ న్యూస్.. కెప్టెన్ సాబ్ ఫుల్ ఫిట్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ గుడ్న్యూస్ అందింది. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న సూర్యకుమార్ తన ఫిట్నెస్ పరీక్షను క్లియర్ చేశాడు. ఈ విషయాన్ని సూర్య అభిమానులతో పంచుకున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్, ముంబై టీ20 లీగ్ తర్వాత సూర్యకుమార్ తన స్పోర్ట్స్ హెర్నియా గాయానికి జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.అనంతరం భారత్కు తిరిగొచ్చిన ఈ ముంబైకర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు సూర్యకుమార్ దూరం కానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ టీమిండియా బంగ్లా టూర్ వాయిదా పడడంతో ఈ నెల ఆరంభంలో సూర్యకుమార్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) చేరాడు. ఈ నెల ఆరంభం నుంచి అక్కడే ఉన్న సూర్య తన ఫిట్నెస్ను తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాడు. "కుడివైపు పొత్తికడుపు దిగువన స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స తర్వాత నేను పూర్తిగా కోలుకున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో సూర్య భాయ్ పేర్కొన్నాడు. కాగా ఆసియాకప్ కోసం భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశముంది. అనంతరం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు. ఇక ఈ ఖండంతార టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మ -
గిల్కు వారిద్దరి సపోర్ట్ కావాలి.. లేదంటే కష్టమే: సురేష్ రైనా
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో వీరిద్దరూ భారత జెర్సీలో కన్పించనున్నారు. అయితే ఈ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లిలు ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్డే వరల్డ్కప్-2027 కోసం వారిద్దరూ స్ధానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసే యోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో రో-కో వన్డే భవిష్యత్తుపై టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్, కోహ్లి సేవలు భారత జట్టుకు కచ్చితంగా అవసరమని రైనా అభిప్రాయపడ్డాడు."ప్రస్తుత భారత వన్డే జట్టులో నంబర్ 1, నంబర్ 3లో సరైన ఆటగాళ్లు లేరు. ప్రత్యేకంగా ఛేజింగ్లో ఆయా స్ధానాల్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు కావాలి. కాబట్టి ఎంతో అనుభవం ఉన్న రోహిత్, విరాట్ భారత జట్టులో కొనసాగాలి. వారిద్దరి తమ సేవలను టీమిండియాకు మరి కొన్నాళ్లపాటు అందించాలి. ఇక శుబ్మన్ గిల్ ఇంగ్లండ్ పర్యటనలో అద్బుతంగా రాణించాడు.వన్డే జట్టును కూడా నడిపించగలడు. కానీ గిల్కు విరాట్, రోహిత్ లాంటి ఆటగాళ్లు అవసరం. వారిద్దరూ వరల్డ్కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ గెలిచిన జట్లలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరూ లెజెండరీ కెప్టెన్లు. కచ్చితంగా వారిద్దరూ భారత డ్రెస్సింగ్ రూమ్లో భాగం కావాలి" అని టెలికాం ఆసియా స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. కాగా భవిష్యత్తులో వన్డేల్లో కూడా భారత జట్టు పగ్గాలను గిల్కు అప్పగించే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: అప్పటిలా కాదు.. అన్నీ మారిపోయాయి.. కోహ్లితో మాట్లాడాలంటే..: భువీ -
నేను కోచింగ్ ఇచ్చిన అత్యుత్తమ ఆటగాడు అతడే: రవి శాస్త్రి
విరాట్ కోహ్లి.. కెప్టెన్గా, ఆటగాడిగా తన పేరును భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. కెప్టెన్గా ఐసీసీ టైటిల్ను సాధించికపోయినప్పటికి భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు.అతడి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారత జట్టును ఐదేళ్ల పాటు నంబర్ 1 జట్టుగా కోహ్లి నిలిపాడు. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి అద్బుతాలు చేశాడు. తాజాగా కోహ్లితో తన ప్రయణాన్ని గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కింగ్ కోహ్లిపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు."నేను కోచ్గా పనిచేసిన అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉంటాడు. అతడొక అద్బుతమైన బ్యాటర్, లీడర్. భారత జట్టును రెడ్ బాల్ ఫార్మాట్లో నంబర్ వన్గా ఐదేళ్ల పాటు నిలిపాడు. ఆ ఐదేళ్లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి సేనా దేశాల్లో టీమిండియా చిరస్మరణీయ విజయాలను అందుకుంది.అంతేకాకుండా అదే సమయంలో విరాట్ ఫార్మాట్తో సంబంధం లేకుండా విదేశాల్లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్లు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాక కోహ్లిని భారత జట్టు సారథిగా ఎంపిక చేయాలని నేను సూచించాను. బ్యాటర్గా అతడికి ఉన్న స్కిల్స్, గేమ్ పట్ల మక్కువ, ఆధిపత్యం చెలాయించే నైజం, కష్టపడి ఆడడం వంటి ఎన్నో లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా 2017 నుంచి 2021 వరకూ ఈ వరల్డ్ కప్ విన్నర్ భారత జట్టుకు హెడ్కోచ్గా సేవలందించాడు. ఇక కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్కు కోహ్లి వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. తన టెస్టు కెరీర్ను 9230 పరుగులతో ఈ ఢిల్లీ బాయ్ ముగించాడు.చదవండి: PAK vs WI: 'ఇకనైనా దేశం కోసం ఆడండి'.. పాక్ జట్టుపై షోయబ్ అక్తర్ ఫైర్ -
'రోహిత్ కెప్టెన్ కాకపోయింటే ఎప్పుడో పక్కన పెట్టేవారు'
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టుకు అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ తన పేలవ ఫామ్ కారణంగా తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగాడు.కానీహెడ్ కోచ్ గౌతం గంభీర్ కావాలనే అతడిని జట్టు నుంచి తప్పించాడని రూమర్స్ వినిపించాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్, ఈ సిరీస్లో బ్రాడ్కాస్టర్ బృందంలో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ టెస్టు క్రికెట్లో ఇబ్బంది పడుతున్నప్పటికి రోహిత్కు బ్రాడ్కాస్టర్లు మద్దతుగా నిలిచారని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే అతడు ఎప్పుడో జట్టులో చోటు కోల్పోయే వాడని పఠాన్ అన్నారు."వైట్-బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడు. కానీ టెస్టు క్రికెట్లో మాత్రం క్రమంగా ఫామ్లో స్థిరత్వం లోపించింది. ముఖ్యంగా గతేడాది అతడు సగటు చాలా పేలవంగా ఉంది. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే ఎప్పుడో టెస్టు జట్టులో తన స్ధానాన్ని కోల్పోయేవాడు.రోహిత్ శర్మకు మేము అవసరానికి మించి మద్దతు ఇచ్చామని చాలా మంది విమర్శించారు. మీరు ఒకరిని ఇంటర్వ్యూకి ఆహ్వానించి వారితో తప్పుగా ప్రవర్తిస్తారా? వారు ఎటువంటి స్థితిలో ఉన్న మనం గౌరవంగా వ్యవహరించాలి. మేము కూడా ఆదే చేశాము.ఎందుకంటే అతడు మా అతిథి. అతడికి మేము సపోర్ట్గా నిలుస్తూనే, తన ఫామ్ను మెరుగుపరుచుకోవాలని మేము సూచించాము. కానీ అతడు అప్పటికే తుది జట్టులో చోటుకు అనర్హుడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ పేర్కొన్నాడు.కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికి షాకిచ్చాడు. 38 ఏళ్ల హిట్మ్యాన్ తన కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. రోహిత్ స్ధానంలో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.చదవండి: సచిన్కు కాబోయో కోడలు సానియా ఆస్తి ఎంతో తెలుసా? -
'టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్గా అతడే సరైనోడు'
భారత పురుషుల క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డేల్లో రోహిత్ శర్మ, టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, టెస్టుల్లో శుబ్మన్ గిల్ టీమిండియా సారథిలుగా ఉన్నారు. రోహిత్ శర్మ టీ20, టెస్టుల నుంచి రిటైర్ కావడంతో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్ల విధానంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శుబ్మన్ గిల్ను ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు."ప్రస్తుతం శుబ్మన్ గిల్ను చూస్తుంటే 2017లో విరాట్ కోహ్లిలా కన్పిస్తున్నాడు. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని హయంలో విరాట్ బాగా రాటు దేలాడు. ఆ తర్వాత అతడి వారుసుడిగా కోహ్లి భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇప్పుడు గిల్ కూడా విరాట్ లాగే రోహిత్ సారథ్యంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. టెస్ట్ కెప్టెన్గా గిల్ను నియమించి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన ముందుచూపును చాటుకున్నాడు. టీ20 ఫార్మాట్కు కూడా గిల్ సరిపోతాడు. 2026 టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్కు బదులుగా ఎవరు కెప్టెన్సీ తీసుకుంటారనే దానిపై బీసీసీఐ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలి.ఇతర దేశాలు మాదిరిగా భారత్లో స్ప్లిట్ కెప్టెన్సీ దీర్ఘకాలంలో పనిచేయదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్న ఒక ఆటగాడు ఒక ఫార్మాట్కు కెప్టెన్గా ఉన్నప్పుడు, మిగిలిన ఫార్మాట్లకు కూడా అతనే నాయకత్వం వహించాలి. గిల్ బ్యాటర్గా కూడా రాణించాడు.అంతేకాకుండా ఐపీఎల్లో కూడా అతడు సారథ్యం వహించాడు" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాంధీ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్గా గిల్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: Asia Cup 2025: సంజూ శాంసన్కు నో ఛాన్స్..? ఆర్సీబీ స్టార్కు చోటు? -
ఐదు నెలలగా ఆటకు దూరం.. అయినా బాబర్ను వెనక్కి నెట్టిన రోహిత్
ఓ వైపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సందిగ్ధం కొనసాగుతుండగా.. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మాత్రం హిట్మ్యాన్ తన స్ధానాన్ని మెరుగుపరుచుకున్నాడు. గత ఐదు నెలలగా 50 ఓవర్ల క్రికెట్కు రోహిత్ దూరంగా ఉన్నప్పటికి తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్ధానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో దారుణంగా విఫలమైన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 5 రేటింగ్ పాయింట్లు కోల్పోయి మూడో ర్యాంక్కు పడిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 756 రేటింగ్ పాయింట్లతో బాబర్ ర్యాంక్ను ఆక్రమించాడు.బాబర్ ఖాతాలో ప్రస్తుతం 751 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ అగ్రస్ధానంలో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ 784 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు. నాలుగో స్ధానంలో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లి నిలిచాడు.రోహిత్ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత తరపున ఆడాడు. తన అద్బుతమైన నాయకత్వంతో భారత్కు ఏడో ఐసీసీ టైటిల్ను అందించాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ ఐదు మ్యాచ్లు ఆడి 180 పరుగులు చేశాడు.భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ నాలుగో స్ధానంలో నిలిచాడు. కానీ టీమిండియా టాప్-ఆర్డర్ బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్-రేట్ను మాత్రం శర్మనే కలిగి ఉన్నాడు. ఈ ఏడాది నవంబర్లో రోహిత్ను తిరిగి భారత జెర్సీలో చూసే అవకాశముంది.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో రోహిత్తో పాటు విరాట్ కోహ్లి కూడా ఆడనున్నాడు. ఈ సిరీస్ తర్వాత రోకో ద్వయం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వన్డే ప్రపంచకప్-2027ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరి స్దానంలో యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు సెలక్టర్లు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోహిత్ శర్మ స్ధానంలో వన్డే కెప్టెన్గా గిల్ను నియమించాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ వారుసుడిగా భారత టెస్టు జట్టు పగ్గాలను చేపట్టిన గిల్.. తన తొలి సిరీస్లోనే ఆకట్టుకున్నాడు. గిల్ సారథ్యంలోని భారత జట్దు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది.చదవండి: బాబర్ ఆజం వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్.. ఆ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్గా.. -
కొత్త కారు కొన్న రోహిత్ శర్మ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గ్యారేజ్లో మరో కొత్త కారు వచ్చి చేరింది. రోహిత్ ఎరుపు రంగు లాంబోర్గిని ఉరుస్ కారును కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ లగ్జరీ కారు ముంబైలోని రోహిత్ ఇంటికి డెలివరీ అయింది.కాగా హిట్మ్యాన్ గతంలో కూడా నీలం రంగు లాంబోర్గిని ఉరుస్ కారు ఉండేది. అయితే ఆ కారును డ్రీమ్11 కాంటెస్ట్ విజేతకు అందజేయడంతో.. ఇప్పుడు కొత్త లాంబోర్గిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ కాస్ట్లీ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో అతడి కారు నంబర్ 3015ను అభిమానులు డీకోడ్ చేశారు. '3015' అనే సంఖ్య హిట్మ్యాన్ ఇద్దరు పిల్లల పుట్టినరోజులను సూచిస్తుంది. డిసెంబర్ 30 రోహిత్ కుమార్తె సమీరా బర్త్డే కాగా.. నవంబర్ 15 హిట్మ్యాన్ కొడుకు అహాన్ పుట్టిన రోజు.అంతేకాకుండా మొత్తం అంకెల్ను కలిపితే రోహిత్ జెర్సీ నంబర్ 45 వస్తోంది. రోహిత్ పాత కారుకు 264 నెంబర్ ఉండేది. ఆ నెంబర్ .. వన్డేల్లో రోహిత్ చేసిన అత్యధిక స్కోర్న్ సూచిస్తోంది. కాగా కొత్త ఉరుస్ ఎస్ఈ కారు ధర రూ. 4.57 కోట్లగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇక టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో రోహిత్ను అభిమానులు భారత జెర్సీలో చూసే అవకాశముంది.చదవండి: Mohammed Shami: ‘సెలక్టర్లు అతడిని తప్పించలేదు.. తనే తప్పుకొన్నాడు’ -
సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ..
సర్ఫరాజ్ ఖాన్.. భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాటర్లలో ఒకడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించి భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్లోనే ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత న్యూజిలాండ్పై అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.అయితే ఆ సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్ల్లో ముంబైకర్ విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్కు ఎంపికైనప్పటికి ఒక్క మ్యాచ్లో కూడా అతడికి ఆడే అవకాశం లభించలేదు. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు సర్ఫరాజ్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అంతకంటే ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన సిరీస్లో భారత-ఎ జట్టు తరపున సత్తాచాటాడు. మళ్లీ ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్తో జరగనున్న టెస్టు సిరీస్కు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ ఉవ్విళ్లూరుతున్నాడు.ఈ క్రమంలో ముంబైలో జరుగుతున్న కంగా క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిడ్డే రిపోర్ట్ ప్రకారం.. ఈ లీగ్లో పార్కోఫియర్ క్రికెటర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.తాజాగా ఇస్లాం జింఖానాతో జరిగిన డివిజన్ -ఎ మ్యాచ్లో సర్ఫరాజ్తన బ్యాట్ను ఝూళిపించాడు. ఈ భారత క్రికెటర్ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 43 బంతుల్లో 61 పరుగులు చేశాడు. కాగా డాక్టర్ హెచ్.డి. కాంగ్రా క్రికెట్ లీగ్ ముంబైలో ప్రతీ ఏడాది ఆగస్టులో జరుగుతోంది. ఈ లీగ్లో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆడారు.చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు' -
'అతడొక టాలెంటెడ్ ప్లేయర్.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు'
'అతడి బ్యాటింగ్ను చూస్తుంటే సచిన్, సెహ్వాగ్లు గుర్తొస్తున్నారు. అతడు తన టెక్నిక్తో బ్రియాన్ లారాను తలపించాడు' పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత అప్పటి భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నోటి నుంచి వచ్చిన మాటలవి.కానీ రవిశాస్త్రి నమ్మకాన్ని పృథ్వీ షా ఏ మాత్రం నిలబెట్టుకులేకపోయాడు. తన కెరీర్ను అద్బుతంగా ఆరంభిచిన ఈ ముంబై క్రికెటర్.. క్రమంగా ఫిట్నెస్, ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమయ్యాడు. తన ఏడేళ్ల కెరీర్లో భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.అంతర్జాతీయ క్రికెట్ విషయాన్ని పక్కన పెడితే ప్రొఫెషనల్ క్రికెట్కే అతడు 8 నెలలగా దూరంగా ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్లో పృథ్వీషా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్లు సూపర్ స్టార్లగా ఎదిగితే.. ఈ ముంబైకర్ మాత్రం అధ:పాతాళానికి దిగజారిపోయాడు. రాబోయే రంజీ సీజన్కు ముందు ముంబై క్రికెట్ ఆసోషియేషన్తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఇక తాజాగా పృథ్వీ షా కెరీర్ పతనంపై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా కెరీర్ ఇలా అవ్వడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని ఆయన అన్నారు."పృథ్వీ షా తన 10 సంవత్సరాల వయస్సు నుంచి నాకు తెలుసు. అతడు చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. అయితే కెరీర్ను విజయవంతంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. పృథ్వీ విషయంలో ఏమి జరిగిందో నాకు అయితే స్పష్టంగా తెలియదు.కానీ ఇప్పటికీ అతడు టాలెంటెడ్ క్రికెటరే. . దురదృష్టవశాత్తు తప్పుడు మార్గంలో వెళ్లి తన క్రికెట్ కెరీర్ను నాశనం చేసుకున్నాడు. పృథ్వీ షా లాంటి బ్యాటర్లు భారత క్రికెట్లో ఇప్పుడూ చాలా మంది ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ,ఆయుష్ మాత్రే యువ సంచలనాలు ఈ కోవకు చెందిన వారే. వీరు కచ్చింగా ఫ్యూచర్ స్టార్లగా ఎదుగుతారు. భారత క్రికెట్ ప్రస్తుతం టాప్లో ఉందని" గౌరవ్ మంగళాని పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడ్ పేర్కొన్నాడు.చదవండి: మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా? -
మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా?
క్రికెట్ మైదానంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనలలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఒకటి. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచ్చిన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హ్యూస్.. మూడు రోజుల తర్వాత అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే ఓ భారత క్రికెటర్ కూడా మైదానంలో బంతి తగిలి ప్రాణాలు విడిచారన్న విషయం మీకు తెలుసా? భారత ప్లేయర్ రమన్ లాంబా సైతం మైదానంలో క్రికెట్ ఆడుతూ మరణించాడు.లాంబాకు ఏమైంది?ఫిబ్రవరి 23, 1998న భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 38 ఏళ్ల వయస్సులో టీమిండియా కీలక ఆటగాడు రామన్ లాంబా ప్రాణాలు విడిచారు. 1998లో బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్ యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.అప్పటిలో చాలా మంది భారత క్రికెటర్లు బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్లో ఆడేవారు. ఈ క్రమంలో ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్లో అబహానీ క్రిరా చక్రకు ప్రాతినిధ్యం వహించిన లాంబా.. మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అకాల మరణం చెందారు. రామన్ లాంబా సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా.. ప్రత్యర్ధి జట్టు బ్యాటర్ మెహ్రబ్ హుస్సేన్ భారీ షాట్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి బలంగా సిల్లీ పాయింట్లో ఉన్న లాంబాకు తాకి వికెట్ కీపర్ వైపు వెళ్లింది. అయితే బంతి తాకిన వెంటనే గాయం అంత తీవ్రమైనదిగా అన్పించలేదు. అతడు ఫీల్డ్లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ అంతరంగా గాయం కావడంతో అతడు కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. వెంటనే అతడిని ఫీల్డ్ నుంచి బయటకు తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న అస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పలు పరీక్షలు తర్వాత బంతి తలకు బలంగా తాకడంతో మెదడులో తీవ్రమైన రక్తస్రావం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. అస్పత్రిలో చేరిన మూడు రోజుల తర్వాత లాంబా తుది శ్వాస విడిచారు. లాంబా భారత తరుపున 4 టెస్టులు, 32 వన్డేలు ఆడారు. మొత్తంగా ఆయన పేరిట 885 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి.దేశవాళీ క్రికెట్లో అదుర్స్..ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లాంబాకు అద్బుతమైన రికార్డు ఉంది. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో జన్మించిన రమన్ లాంబా 1996-97 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా 87 మ్యాచ్లాడి 53.91 యావరేజితో 6362 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: Asia Cup 2025: భారత స్టార్ ప్లేయర్కు ఊహించని షాక్.. శుబ్మన్ గిల్కు ప్రమోషన్..! -
భారత స్టార్ ప్లేయర్కు షాక్.. శుబ్మన్ గిల్కు ప్రమోషన్..!
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి యూఈఏ వేదికగా ప్రారంభం కానుంది. 8 జట్లు పాల్గోనే ఈ మెగా టోర్నీకి యూఏఈలోని దుబాయ్, అబుదాబిలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై కసరత్తలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ ఫిట్..?గత నెలలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నీ ఆరంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధించనున్నాడు. దీంతో ఈ ఏడాది ఆసియాకప్లో భారత జట్టుకు సూర్యనే సారథ్యం వహించనున్నాడు. అయితే ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టును అద్భుతంగా నడిపించిన టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్కు ప్రమోషన్ ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్దమైనట్లు సమాచారం. గిల్ను భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్గా నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్లో సూర్యకు డిప్యూటీగా గిల్ వ్యవహరించే సూచనలు కన్నిస్తున్నాయి.అక్షర్కు షాక్..?కాగా ప్రస్తుతం భారత టీ20 జట్టు కెప్టెన్గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఉన్నాడు. రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకొన్న తర్వాత సూర్య కెప్టెన్గా, అక్షర్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఏడాది తిరగక ముందే అక్షర్పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైంది. గిల్ను ఆల్ఫార్మాట్ కెప్టెన్గా చేసేందుకు బీసీసీఐ యోచిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గిల్ ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ శర్మ డిప్యూటీగా ఉన్నాడు. ఒకవేళ హిట్మ్యాన్ వన్డేల నుంచి తప్పుకొంటే 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఈ పంజాబీ బ్యాటర్ భారత జట్టును నడిపించే అవకాశముంది. కాగా గిల్ చివరగా భారత తరపున టీ20ల్లో గతేడాది శ్రీలంకపై ఆడాడు. కానీ ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపాడు. ఐపీఎల్-2025 సీజన్లో 650 పరుగులతో గుజరాత్ తరపున లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.చదవండి: మహేశ్ బాబు మరదలితో సచిన్ ప్రేమ?!.. టెండుల్కర్ ఏమన్నాడంటే.. -
ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే: సౌరవ్ గంగూలీ
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు పాల్గోనే ఈ టోర్నీ దుబాయ్, అబుదాబి వేదికలగా జరగనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం తమ ఆస్తశాస్త్రాలను ఆయా జట్లు సిద్దం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అఫ్గానిస్తాన్, బంగ్లా క్రికెట్ బోర్డులు తమ ప్రిలిమిరీ జట్లను సైతం ప్రకటించాయి. బీసీసీఐ కూడా భారత జట్టు ఆగస్టు మూడో వారంలో ప్రకటించనుంది. కాగా భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్తో టీ20 సిరీస్ తర్వాత పొట్టి ఫార్మాట్లో ఆడడం ఇదే తొలిసారి. దాదాపు ఎనిమిది నెలల తర్వాత టీ20 సిరీస్ ఆడుతున్నప్పటికి సూర్య అండ్ కోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియాకప్ విజేతగా టీమిండియా నిలుస్తుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జోస్యం చెప్పాడు.భారత క్రికెట్ జట్టుకు టీ20 ఫార్మాట్లో సుదీర్ఘమైన విరామం లభించింది. ఐపీఎల్ తర్వాత ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇప్పుడు ఆసియాకప్ టీ20 టోర్నీలో పాల్గోనున్నారు. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది.మెన్ ఇన్ బ్లూ రెడ్ బాల్ క్రికెట్లోనే కాదు వైట్బాల్ క్రికెట్లో కూడా చాలా బలంగా ఉన్నారు. కాబట్టి భారత్ టైటిల్ దక్కించుకుంటుందని భావిస్తున్నారు. దుబాయ్ లాంటి మంచి పిచ్లపై భారత్ను ఓడించడం చాలా కష్టం అని గంగూలీ పీటీఐతో పేర్కొన్నాడు. కాగా భారత్ తమ ఆసియాకప్ ప్రయాణాన్ని సెప్టెంబర్ 10న హాంకాంగ్ మ్యాచ్తో ప్రారంభించనుంది.చదవండి: SA vs AUS: చెలరేగిన హాజిల్వుడ్, డేవిడ్.. సౌతాఫ్రికాపై ఆసీస్ ఘన విజయం -
'రోహిత్ ఒక మంచి స్పిన్నర్ అవుతాడనుకున్నా.. కానీ ఒక రోజు'
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్తో విరుచుకుపడడం అందరికి తెలిసిందే. కానీ హిట్మ్యాన్కు బంతితో కూడా మ్యాజిక్ చేసే సత్తా ఉంది. ఐపీఎల్లో అతడి పేరిట ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. ఐపీఎల్-2009 సీజన్లో డక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడిన రోహిత్..ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించాడు. అయితే రోహిత్ శర్మ ఆఫ్ స్పిన్నర్ నుంచి పూర్తి స్ధాయి బ్యాటర్గా మారడంలో అతడి చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ది కీలక పాత్ర. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో రోహిత్ క్రికెట్ జర్నీ గురించి దినేష్ లాడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు."రోహిత్ శర్మను నేను తొలిసారి ఒక బౌలర్గా చూశాను. అప్పుడు అతడి వయస్సు దాదాపు 13 సంవత్సరాలు. ఆ సమయంలో రోహిత్ మా స్కూల్ టీమ్తో మ్యాచ్ ఆడాడు. అప్పుడే అతడిలో అద్బుతమైన టాలెంట్ ఉందని గుర్తించాను. దీంతో రోహిత్ను మా స్కూల్లో చేర్పంచమని అతడి మామతో చెప్పాను.ఆ తర్వాత రోహిత్ మా స్కూల్లో 1999లో చేరాడు. అతడికి బౌలింగ్ నేర్పించడం మొదలు పెట్టాను. అప్పటికి ఇంకా రోహిత్ ఏళ్లు లోపే ఉన్నుందన అండర్-14, అండర్-16 టోర్నీలో ఆడేందుకు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక మంచి ఆఫ్ స్పిన్నర్ అవుతాడనుకున్నా.కానీ ఒక రోజు నేను రోహిత్ బ్యాటింగ్ అద్బుతంగా చేస్తుండడం నేను చూశాను. బంతి పడేటప్పుడు అతడు తన బ్యాట్ను తీసుకురావడం నేను గమనించాను. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి నీవు బ్యాటింగ్ కూడా చేయగలవా అని అడిగాను. అందుకు అతడు చేస్తాను సార్ అని సమాధానం చెప్పాడు.ఆ తర్వాత అతడి నెట్ ప్రాక్టీస్లో ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశమిచ్చాను. అంతకుముందు అతడికి ఒక్కసారి కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే అవకాశమివ్వలేదు. అది నా తప్పు. లేదంటే అప్పుడు బ్యాటింగ్ గురుంచి నాకు తెలిసిండేంది.ఆ తర్వాత ఒక మ్యాచ్లో ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి 40 పరుగులు చేశాడు. రోహిత్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికి దురదృష్టవశాత్తూ మేము మ్యాచ్ ఓడిపోయాము. హారిస్ షీల్డ్ తర్వాత అండర్-14 ప్రాక్టీస్ ప్రారంభమైనప్పుడు నేను రోహిత్కు నెట్స్లో రెండు లేదా స్థానంలో బ్యాటింగ్ ఇవ్వడం ప్రారంభించాను.అతడికి బ్యాటింగ్లో చాలా మంచి ప్రతిభ ఉందని అన్పించింది. దీంతో అతడికి బౌలింగ్ బదులుగా బ్యాటింగ్పై ఎక్కువగా దృష్టిపెట్టమని చెప్పాను. రోహిత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిని కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు అతడు పూర్తిస్ధాయి బ్యాటర్గా ఉన్నాడని" ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్ కాస్ట్లో లాడ్ పేర్కొన్నాడు.చదవండి: 'సిరాజ్ ఒక పోరాట యోధుడు'.. హైదరాబాదీపై పాక్ దిగ్గజం ప్రశంసలు -
ఆసియాకప్-2025కు శుబ్మన్ గిల్ దూరం!?
ఆసియాకప్-2025కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో నెల రోజుల్లో యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా తొలి మ్యాచ్లో హాంకాంగ్, అఫ్గానిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ ఆసియా సింహాల పోరు కోసం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ ప్రాథిమిక జట్లను ప్రకటించాయి.బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా వచ్చే వారం భారత జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే ఈ టోర్నీ కోసం భారత జట్టులో టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ను చేర్చాలా వద్దా అని సెలక్టర్లు తర్జబర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్తో జరగనున్న టెస్ట్ సిరీస్ను దృష్టిలో ఉంచుకుని గిల్కు విశ్రాంతి ఇవ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఆసియాకప్ ముగిసిన నాలుగు రోజులకే భారత్-వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆసియాకప్నకు గిల్కు విశ్రాంతి ఇచ్చి టీ20 వరల్డ్ కప్-2026లో అతడిని ఆడించాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్ తమ కథనంలో పేర్కొంది.కాగా గిల్ వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీ-2025లో ఆడనున్నాడు. నార్త్జోన్ కెప్టెన్గా శుబ్మన్ వ్యవహరించనున్నాడు. కాగా గిల్ ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శనంగా పరంగా ఆకట్టుకున్నాడు.ఐదు మ్యాచ్లలో 75.40 సగటుతో 754 పరుగులు చేసి గిల్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇక ఆసియాకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న దుబాయ్ వేదికగా యూఏఈతో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్తో మెన్ ఇన్ బ్లూ అమీతుమీ తెల్చుకోనుంది.చదవండి: శుబ్మన్ గిల్ జెర్సీ కోసం పోటీ.. ఎన్ని లక్షలకు అమ్ముడుపోయిందంటే? -
అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్లో ఆడాల్సిందే: గంగూలీ
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టంతా ఆసియాకప్-2025పై పడింది. ఆసియాకప్నకు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? ఐపీఎల్లో రాణించిన ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారా? అన్న చర్చలు క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం జరుగుతున్నాయి.ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆగస్టు మూడో వారంలో ప్రకటించే అవకాశముంది. ఈ క్రమంలో భారత సెలక్టర్లకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక సూచన చేశాడు.ముఖేష్కు ఛాన్స్ ఇవ్వాల్సిందే?బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ను ఆసియాకప్నకు ఎంపిక చేయాలని దాదా సలహాఇచ్చాడు. కాగా ముఖేష్ కుమార్ రెండు సంవత్సరాల కిందట భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ దాదాపు ఏడాది పాటు మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టుకు ముఖేష్ దూరమయ్యాడు. అతడు చివరగా భారత్ తరపున గతేడాది జూలైలో ఆడాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్లోనూ ముఖేష్ ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతడి వద్ద అద్బుతమైన స్కిల్స్ ఉన్నాయని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాల్సిందేనని గంగూలీ మాత్రం సపోర్ట్గా నిలిచాడు."ఆసియాకప్లో ముఖేష్ కుమార్ ఖచ్చితంగా ఆడాలి. అతడు అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. యూఏఈ కండీషన్స్ అతడికి సరిగ్గా సరిపోతాయి. దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అతడు జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఆర్హుడు. ముఖేష్కు అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అతడికంటూ ఒక సమయం వస్తుంది. అందుకు కాస్త ఓపిక పట్టాలి" అని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.కాగా ముఖేష్ ఇప్పటివరకు భారత తరపున 17 టీ20లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అతడి పేరిట 36 వికెట్లు ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ తిరిగి టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సైతం తన ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. టోర్నీ ఆరంభ సమయానికి సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశముందిచదవండి: Asia Cup: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
అరంగేట్రంలో తిలక్ వర్మ అట్టర్ ప్లాప్..
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్ అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచాడు. మంగళవారం వేల్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గ్లామోర్గాన్తో జరుగుతున్న మ్యాచ్లో హాంప్షైర్ తరపున బరిలోకి దిగిన తిలక్.. డకౌట్గా వెనుదిరిగాడు.మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. పేసర్ నెడ్ లియోనార్డ్ బౌలింగ్లో అస ట్రైబ్కు క్యాచ్ ఇచ్చి ఈ హైదరాబాదీ ఔటయ్యాడు. అయితే అంతకుముందు కౌంటీ ఛాంపియన్షిప్లో తిలక్ అదరగొట్టాడు. 4 మ్యాచ్లలో హాంప్షైర్ తరపున తిలక్ 358 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన గ్లామోర్గాన్ కెప్టెన్ కిరణ్ కార్ల్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్కు దిగిన హాంప్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ సాధించింది.హాంప్షైర్ కెప్టెన్ గుబ్బిన్స్(144) భారీ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బెన్ మేయస్(74), ఓర్(45) రాణించారు. గ్లామోర్గాన్ బౌలర్లలో నెడ్ లియోనార్డ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో గ్లామోర్గాన్ 28 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. -
టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ
లండన్లోని ది ఓవల్లో ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా ఐదో రోజు ఆటలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మ్యాజిక్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావల్సిన నేపథ్యంలో సిరాజ్ బంతితో ప్రత్యర్ధి జట్టును బోల్తా కొట్టించాడు. చివరి రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ను దెబ్బతీశాడు. అతడితో పాటు ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ 8 వికెట్లు సాధించాడు. కాగా ఓవల్లో చారిత్రత్మక విజయం సాధించిన భారత జట్టు సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సమం చేస్తుందని తనకు ముందే తెలుసని టీమిండిమా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు."నాలుగవ రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా గెలుస్తుందనే నమ్మకం నాకు కలిగింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని గంగూలీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్కంఠపోరులో విజయం తర్వాత భారత జట్టును కొనియాడుతూ గంగూలీ ఓ ట్విట్ కూడాచేశాడు."అసాధారణ సిరీస్. అమోఘమైన ఫలితం. జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషభ్ పంత్, సిరాజ్... అందరూ నిలకడగా ఆడారు. భారత జట్టు విజయాల ఆకలితో ఉన్నట్లు మనవాళ్లు తమ ఆటతీరుతో నిరూపించారు" దాదా ఎక్స్లో రాసుకొచ్చారు.చదవండి: మా బ్యాటర్లు భయపడ్డారు.. కానీ అతడు ఉండుంటే గెలిచేవాళ్లం: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ -
సచిన్ గొప్పా? విరాట్ కోహ్లి గొప్పా?
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలు ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరిలో ఎవరు గొప్ప క్రికెటర్ అంటే సమాధానం చెప్పేందుకు కచ్చితంగా ఆలోచించాల్సిందే. ఒకరేమో 24 ఏళ్ల పాటు తన జీవితాన్ని భారత క్రికెట్కు అంకితం చేస్తే.. మరొకరేమో గత 17 ఏళ్ల నుంచి తన సేవలను అందిస్తున్నారు.ఒకరు క్రికెట్కు గాడ్ అయితే.. మరొకరు ఆ దేవుడు రికార్డులను కొల్లగొడుతున్న రన్ మిషన్. కాబట్టి సచిన్, కోహ్లిలలో ఎవరు గ్రేట్ క్రికెటర్ అంటే నీళ్లు నమలాల్సిందే. తాజాగా ఇదే పరిస్థితి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్కు ఎదురైంది.ఏబీ డివిలియర్స్ ఇటీవల శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్ పాడ్ కాస్ట్లో పాల్గోన్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో గొప్ప క్రికెటరో ఎవరో ఎంచుకోవాలని ఏబీడీని హోస్ట్ అడిగాడు. అందుకు కాసేపు ఆలోచించి డివిలియర్స్ తెలివగా సమాధనమిచ్చాడు."ఇద్దరిని ఒకరితో ఒకరని పోల్చలేము. ఎందుకంటే ఆ తరంలో సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్. ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గ్రేట్. ఎవరి తరంలో వారు గొప్ప క్రికెటర్లు. కాబట్టి పోల్చడం అసాధ్యం. నాక్ సచిన్ అంటే చాలా గౌరవం. అతను అతిసాధారణ స్థాయి నుంచి ఒక లెజెండ్గా ఎదిగాడు. ఇక విరాట్ నా స్నేహితుడు. కాబట్టి ఇద్దరిలో ఎవరూ గొప్ప అని నేను చెప్పలేను. అయితే విరాట్ ఆల్ ఫార్మాట్లలో గ్రేట్ నేను భావిస్తున్నాను. వన్డే, టెస్టు ఫార్మాట్లలో సచిన్ను మించిన వారు లేరు అనుకుంటున్నా" అని డివిలియర్స్ పేర్కొన్నాడు.టాప్ రన్ స్కోరర్గా..సచిన్ టెండూల్కర్ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి టెస్టు కెరీర్లో 51 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వన్డేల్లో కూడా మాస్టర్ బ్లాస్టర్ టాప్లో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్లలో 49 సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో 18426 పరుగులు చేశాడు. ఓవరాల్గా సచిన్ తన అంతర్జాతీయ కెరీర్లో 34,357 పరుగులు చేశాడు.సెంచరీల రికార్డు బ్రేక్..ఇక టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అయితే వన్డేల్లో మాత్రం అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. సచిన్ వన్డేల్లో 49 శతకాలు చేస్తే.. కోహ్లి ఇప్పటివరకు 51 సెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా 302 వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 57.88 సగటుతో 14181 రన్స్ చేశాడు.ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీ విజేతగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ను 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంలో డివిలియర్స్ది కీలక పాత్ర. 60 బంతుల్లో డివిలియర్స్ 12 ఫోర్లు, 7 సిక్స్లతో 120 పరుగులు చేశాడు.చదవండి: ప్రియజిత్.. ఇంత త్వరగా వెళ్లిపోయావా? 22 ఏళ్లకే క్రికెటర్ మృతి -
నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలలో "పవర్ కపుల్ పేరొందిన ఈ జంట ఒక్కసారిగా విడిపోయి అందరికి షాకిచ్చారు. సరిగ్గా ఇదంతా చాహల్ భారత జట్టుకు దూరమైన సమయంలోనే జరిగింది.దీంతో చాహల్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవడంపై చాహల్ తాజాగా స్పందించాడు. విడాకులు తర్వాత వచ్చిన తప్పుడు ఆరోపణలు తనను ఎంతోగానే బాధించాయని చహల్ భావోద్వేగానికి లోనయ్యాడు.ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.."విడాకుల సమయంలో నాపై ఎన్నో నిరాధరమైన ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను మానసికంగా కుంగిపోయాను. ఇక ఈ జీవితం చాలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. గంటలు తరబడి ఏడ్చేవాడిని. దాదాపు 40 నుంచి 45 రోజుల పాటు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయాను. నాకు ఇష్టమైన క్రికెట్పై ఏకాగ్రత పెట్టలేకపోయాను. నా స్నేహితుడితో ఆత్మహత్య ఆలోచనలను పంచుకునేవాడిని. చాలా భయపడ్డాను. అందుకే కొద్ది రోజులు క్రికెట్కు దూరంగా ఉన్నాను.నేను ఎప్పుడూ మోసం చేయలేదు.."ధనశ్రీతో విడాకులు తీసున్నాక చాలామంది మోసగాడిగా అభివర్ణించారు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నాకంటే నమ్మకమైన వ్యక్తి తనకు దొరకడు. సోదరీమణులు ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వారితో కలిసి పెరిగాను. కాబట్టి మహిళలను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. నా పేరును ఇతరులతో లింక్ చేసి చాలా కథనాలు రాశారు. కేవలం వ్యూస్ కోసం అలా చేశారు" అని రాజ్ షమానీ పాడ్కాస్ట్లో జరిగిన ఇంటర్య్వూలో చాహల్ పేర్కొన్నాడు. కాగా చాహల్-ధనశ్రీ వర్మలు 22 డిసెంబర్ 2020న ప్రేమ వివాహం చేసుకున్నారు.ఆ తర్వాత ఇద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరికి ముంబైలోని బాంద్రా కోర్టు విడాకులు మంజూరు చేసింది. చాహల్ ప్రస్తుతం ఆర్జే మహ్వాష్తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.చదవండి: #Karun Nair: మొన్నటి వరకు జట్టులో దండగ అన్నారు.. ఇప్పుడు అతడే దిక్కయ్యాడు -
IND Vs ENG: అధర్మసేన.. ఇంగ్లండ్కు ఫేవర్గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్
లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయర్ 98 బంతుల్లో 52 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు.అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(19) క్రీజులో ఉన్నాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్(14), జడేజా(9), గిల్(21) నిరాశపరచగా.. సాయిసుదర్శన్(38) పర్వాలేదన్పించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్ ఓ వికెట్ సాధించారు.అంపైర్పై ఫ్యాన్స్ ఫైర్..భారత్ ఇన్నింగ్స్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు దారి తీసింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్కు యార్కర్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోయాడు.బంతి ప్యాడ్స్కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు ఓకే. కానీ అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్కు తగిలినట్లుగా కూడా తన వేళ్లతో సైగ చేశాడు.నిబంధనల ప్రకారం డీఆర్ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు అంపైర్లు ఏ రీతిలో కూడా ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు చేయరాదు. కానీ ధర్మసేన ఇలా చేయడం ఇంగ్లండ్కు పరోక్షంగా సహకరించినట్లయింది. తమ అప్పీల్పై నమ్మకం ఉంటే ఇంగ్లండ్ డీఆర్ఎస్కు వెళ్లేది. నాటౌట్గా తేలితే జట్టు రివ్యూ కోల్పోయేది. అంపైర్ వ్యవహరించిన తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.చదవండి: బుమ్రా ఎంత కాలం ఇలా..! -
ఇంగ్లండ్తో ఐదో టెస్టు.. భారత జట్టులో కీలక మార్పులు! వారిద్దరిపై వేటు?
ఇంగ్లండ్తో నాలుగో టెస్టును డ్రా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. లండన్లోని ఓవల్ వేదికగా జూలై 31 నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్తో తాడోపేడో తేల్చుకునేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 2-2తో సమం చేయాలని గిల్ సేన భావిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ఆఖరి టెస్టుకు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కాగా.. ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్పై అనుమానాలు నెలకొన్నాయి. మాంచెస్టర్ టెస్టులో బుమ్రా ఫుల్ ఫిట్నెస్గా కన్పించలేదు. ఈ మ్యాచ్లో ఎక్కువ వేగంతో కూడా జస్ప్రీత్ బౌలింగ్ చేయలేకపోయాడు.ఈ స్టార్ పేసర్ 100కు పైగా పరుగులు సమర్పించుకుని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు గాయం కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన పేసర్ ఆకాష్ దీప్ ఫిట్నెస్పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.శార్ధూల్ పై వేటు..!వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్ధానంలో ధ్రువ్ జురెల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. పంత్కు ప్రత్నమయ్నాంగా తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్ నారాయణ్ను సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికి.. అనుభవం దృష్ట్యా జురెల్ వైపే మెనెజ్మెంట్ ఆసక్తి చూపే అవకాశముంది.అంతేకాకుండా నాలుగో టెస్టులో బంతితో విఫలమైన ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. అతడి స్ధానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచిన పేసర్ అన్షుల్ కాంబోజ్ను కూడా ఓవల్ టెస్టుకు పక్కన పెట్టనున్నట్లు సమాచారం.అతడి స్ధానంలో ఆకాష్ దీప్(ఫిట్నెస్కు లోబడి) లేదా ప్రసిద్ద్ కృష్ణకు అవకాశమివ్వాలని గంభీర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రాకు ఆఖరి టెస్టులో ఆడిస్తారా లేదా విశ్రాంతి ఇస్తారా అన్నది ఇప్పుడు ప్రశార్ధకంగా మారింది. మరోవైపు ఇంగ్లండ్ ఐదో టెస్టుకు తమ జట్టును ప్రకటించింది. బౌలింగ్ ఆల్రౌండర్ జేమి ఓవర్టన్కు తిరిగి మళ్లీ ఇంగ్లీష్ జట్టు సెలక్టర్లు పిలుపునిచ్చారు.ఇంగ్లండ్తో ఐదో టెస్టుకు భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్చదవండి: వారిద్దరూ అద్బుతం.. మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది: శుబ్మన్ గిల్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్బుతం చేశారు.రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), కెప్టెన్ శుబ్మన్ గిల్ (103), కేఎల్ రాహుల్(90) తమ విరోచిత పోరాటాలతో భారత్ను ఓటమి నుంచి గటెక్కించారు. 174/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. తొలుత రాహుల్, గిల్ అడ్డుగోడగా నిలవగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జడేజా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.వీరిద్దరిని ఔట్ చేయడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. ఆఖరికి ఇంగ్లండ్ ప్లేయర్లు దిగొచ్చి డ్రాకు అంగీకరించాలని భారత ప్లేయర్లను కోరారు. కానీ జడేజా, సుందర్లు తమ సెంచరీలు పూర్తియ్యాక డ్రా అంగీకరించారు. ఇక ఈ మ్యాచ్ను డ్రా ముగించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.👉ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సార్లు 350కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో భారత్ 7 సార్లు 350+ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.ఆస్ట్రేలియా మూడు టెస్టు సిరీస్లలో 6 సార్లు 350కు పైగా పరుగులు చేసింది. ఆసీస్ చివరగా 1980లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 6 సార్లు 350+ స్కోర్లు చేసింది. తాజా మ్యాచ్తో ఆసీస్ ఆల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.👉ఒక టెస్ట్ సిరీస్లో నలుగురు భారత బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్లో శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 400కు పైగా పరుగులు చేశారు.చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్ -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న తిలక్ వర్మ.. మరో సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్లో టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్లో హాంప్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న తిలక్ వర్మ.. నాటింగ్హామ్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో తిలక్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. నాలుగో డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ తన బ్యాటింగ్తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. తొలి ఇన్నింగ్స్లో 256 బంతులు ఎదుర్కొన్న వర్మ.. 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తొలిసారి ఆడుతున్న నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ.. తన అరంగేట్ర మ్యాచ్లోనే శతక్కొట్టాడు.ఈ ఏడాది సీజన్లో తిలక్కు ఇది రెండో సెంచరీ. రెడ్బాల్ క్రికెట్లో ఈ హైదరాబాదీ ఇదే ఫామ్ను కొనసాగిస్తే త్వరలోనే భారత టెస్టు జట్టులోకి వచ్చే అవకాశముంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక ఇప్పటివరకు 18 ఫస్ట్ క్లాస్లు మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ.. 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ హైదరాబాదీ భారత జట్టుకు వైట్-బాల్ స్పెషలిస్టుగా ఉన్నాడు. నాలుగు వన్డేలు, 25 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా అతడికి టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. 24 ఇన్నింగ్స్లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: డీఎస్పీ ఆన్ ఫైర్.. గొడవలు అవసరమా సిరాజ్ భయ్యా? వీడియో -
IND Vs ENG: డీఎస్పీ ఆన్ ఫైర్.. గొడవలు అవసరమా సిరాజ్ భయ్యా?
మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ(Mohammed Siraj) తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్తో సిరాజ్ వాగ్వాదానికి దిగాడు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్కు ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలీ(84) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్కు 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.కానీ ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ను బెన్ డకెట్ ఓ ఆట ఆడేసికున్నాడు. అతడి బౌలింగ్లో బౌండరీలు బాదుతూ డకెట్ పరుగులు రాబట్టుకున్నాడు.ఈ క్రమంలో తన ప్రశాంతతను కోల్పోయిన సిరాజ్.. డకెట్తో గొడవపడ్డాడు. ఏదో విషయంలో డకెట్ అంపైర్కు ఫిర్యాదు చేస్తుండగా బౌలింగ్ ఎండ్లో సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. వేలు చూపిస్తూ అతడిపై సీరియస్ అయ్యాడు. అందుకు బదులుగా డకెట్ సైతం మాటల యుద్దానికి దిగాడు. అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సిరాజ్ భయ్యా ఇది అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.కాగా డకెట్తో సిరాజ్ గొడవపడడం ఇది తొలిసారి కాదు. లార్డ్స్ టెస్టులో డకెట్ను అవుట్ చేసిన తర్వాత అతిగా సెలబ్రేట్ చేసుకున్నందుకు మహమ్మద్ సిరాజ్కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా ఐసీసీ విధించింది. ఇప్పుడు కూడా అదేవిధంగా సిరాజ్ ప్రవర్తిస్తుండడంతో ఐసీసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశముంది. కాగా మాంచెస్టర్ టెస్టులో ఇప్పటివరకు 10 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్.. వికెట్ ఏమీ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు.Tempers flared between Ben Duckett and M. Siraj. 🔥#ENGvIND 👉 4th TEST, DAY 2 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/Y3btplYguV pic.twitter.com/MmTP86rXNU— Star Sports (@StarSportsIndia) July 24, 2025 -
అది నా చేతుల్లో లేదు.. అంతా కెప్టెన్ ఇష్టమే: శార్ధూల్ ఠాకూర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ బ్యాట్తో రాణించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన శార్ధూల్.. 88 బంతులు ఎదుర్కొని 41 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బౌలింగ్లో మాత్రం మరోసారి లార్డ్ ఠాకూర్ తేలిపోయాడు.ఇప్పటివరకు 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఠాకూర్ వికెట్ ఏమీ తీయకుండా 35 పరుగులు సమర్పించుకున్నాడు. లీడ్స్లో జరిగిన తొలి టెస్టులో విఫలమం కావడంతో శార్ధూల్పై టీమ్మెనెజ్మెంట్పై వేటు పడింది. ఆ తర్వాత రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన ఈ ముంబై ఆల్రౌండర్.. తిరిగి మళ్లీ మాంచెస్టర్ టెస్టులో ఆడేందుకు అతడికి ఛాన్స్ లభించింది.అయితే బౌలర్గా శార్ధూల్ సేవలను టీమిండియా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో బౌలర్గా అద్బుతంగా రాణిస్తున్న ఠాకూర్కు మొదటి టెస్టులో కేవలం 16 ఓవర్లు మాత్రమే వేసే అవకాశం దక్కింది. ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో కూడా కేవలం 5 ఓవర్లు మాత్రమే శార్ధూల్తో గిల్ బౌలింగ్ చేయించాడు. తాజాగా ఇదే విషయంపై శార్ధూల్ ఠాకూర్ స్పందించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని బౌలింగ్ చేయాలనేది కెప్టెన్ ఇష్టమే అని ఠాకూర్ తెలిపాడు."ఒక బౌలర్కు బౌలింగ్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అది కెప్టెన్ నిర్ణయం. అది నా చేతుల్లో లేదు. బౌలింగ్లో ఎప్పుడు ఎవరిని ఎటాక్లోకి తీసుకురావాలో కెప్టెన్ నిర్ణయిస్తాడు. ఈ మ్యాచ్లో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను" అని రెండో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో ఠాకూర్ పేర్కొన్నాడు.ఇక మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియా కెప్టెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. వరల్డ్ రికార్డు బద్దలు
భారత అండర్-19 కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుష్ మాత్రే ఆల్టైమ్ రికార్డు సృష్టించాడు. యూత్ టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్లేయర్గా మాత్రే నిలిచాడు. చెమ్స్ఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.వన్డే తరహాలో కేవలం 64 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 80 బంతులు ఎదుర్కొన్న మాత్రే.. 13 ఫోర్లు, 6 సిక్స్లతో 126 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్కు చెందిన జార్జ్ బెల్ పేరిట ఉంది. అతడు 2022లో శ్రీలంక అండర్-19 టీమ్పై 88 బంతుల్లో సెంచరీ చేశాడు. తాజా మ్యాచ్తో బెల్ అల్టైమ్ రికార్డును మాత్రే బ్రేక్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో యూత్ టెస్టు డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్ జట్టు ఆఖరి రోజు ఆటలో భారత్ ముందు 355 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఈ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే వైభవ్ సూర్యవంశీ(0) వికెట్ను కోల్పోయింది. ఈ క్రమంలో ఆయూష్ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు(65)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే భారత విజయానికి 65 పరుగులు కావాల్సిన సమయంలో వెలుతురులేమి కారణంగా మ్యాచ్ను అంపైర్లు డ్రా ముగించారు.టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్లో 43 ఓవర్లు ఎదుర్కొని 6 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో కూడా మాత్రే 80 పరుగులతో రాణించాడు. తొలి యూత్ టెస్టులో కూడా మాత్రే సెంచరీతో మెరిశాడు. కాగా రెండు యూత్ టెస్టులు కూడా డ్రాగానే ముగిశాయి. వన్డే సిరీస్ మాత్రం భారత్ 3-2తో సొంతం చేసుకుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు -
అతడొక రన్మిషన్.. మాంచెస్టర్లో కూడా చెలరేగుతాడు: భారత మాజీ క్రికెటర్
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శతక్కొట్టిన గిల్.. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్లో భీబత్సం సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ(262)తో చెలరేగిన శుబ్మన్, రెండో ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో మెరిశాడు.కానీ లార్డ్స్ లో జరిగిన మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్ల(16,6)లోనూ విఫలమయ్యాడు. ఈ క్రమంలో శుబ్మన్ గిల్పై భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్టులో గిల్ తిరిగి అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తాడని మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. కాగా సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నాలుగో టెస్టులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఈ కీలక మ్యాచ్లో గిల్ ఎలా రాణిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.శుబ్మన్ గిల్ గిల్ తన ఫామ్ను కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను. అతడికి ఆ సత్తా ఉంది. లార్డ్స్ టెస్టుకు మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు దాదాపు ఎనిమిది రోజుల విశ్రాంతి లభించింది. దీంతో అతడు కాస్త రిలాక్స్గా ఉంటాడు. తన తండ్రి, స్నేహితులతో చాలా విషయాలు అతడు చర్చించి ఉంటాడు. గిల్ తన కెప్టెన్సీ, వ్యూహాలు, ఫీల్డింగ్, బ్యాటింగ్పై పెట్టాలి. అప్పుడే మాంచెస్టర్లో గిల్ రన్మిషన్ తిరిగి మళ్లీ పనిచేస్తోంది. ప్రస్తుత భారత జట్టులో గిల్ పాత్ర చాలా ముఖ్యమైనది. లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో గిల్ బ్యాట్తో విఫలమయ్యాడు. దీంతో భారత్ ఓడిపోయింది. అయినప్పటికి మెన్ ఇన్ బ్లూ ఆఖరి వరకు పోరాడింది. దీని బట్టి భారత జట్టు కేవలం గిల్ ఒక్కడిపైనే ఆధారపడటం లేదని ఆర్ధమైంది అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లే
అండర్సన్-సచిన్ డెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. లార్డ్స్ టెస్టులో గెలవాల్సిన మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ఓడిపోవడంతో సిరీస్లో వెనకబడింది.ఈ క్రమంలో మాంచెస్టర్లో ఎలాగైనా గెలిచి మూడో టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లలోనూ భారత పేసర్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని టీమ్మెనెజ్మెంట్ను కుంబ్లే సూచించాడు.కాగా వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని జట్టు సెలక్షన్ సమయంలోనే బీసీసీఐ సెలక్షన్ కమిటీ స్పష్టం చేశాడు. ఇందులో భాగంగానే తొలి టెస్టులో ఆడిన బుమ్రా.. రెండు మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ స్పీడ్ స్టార్ తిరిగి లార్డ్స్లో జరిగిన మూడో టెస్టులో ఆడాడు. ఇప్పుడు కీలకమైన నాలుగో టెస్టులో కూడా బుమ్రా ఆడాలని పలువురు మాజీలు డిమాండ్ చేస్తున్నారు."ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్లో నేను భాగమై ఉంటే బుమ్రాను కచ్చితంగా మాంచెస్టర్ టెస్టులో ఆడిస్తాను. ఎందుకంటే భారత జట్టుకు ఆ మ్యాచ్ చాలా కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతే సిరీస్ కథ ముగిసినట్లే. బుమ్రా నాలుగో టెస్టులోనూ కాదు ఆఖరి మ్యాచ్లో కూడా ఆడాలి.ముందే మూడు మ్యాచ్లు ఆడుతానని బుమ్రా చెప్పొండచ్చు. కానీ ఈ సిరీస్ తర్వాత అతడికి చాలా విశ్రాంతి లభిస్తోంది. కాబట్టి మిగిలిన రెండు మ్యాచ్లలో కూడా బుమ్రా కచ్చితంగా ఆడాలి. అతడికి మరింత విశ్రాంతి ఇవ్వాలనుకుంటే, స్వదేశంలో జరిగే సిరీస్లకు పక్కనపెట్టండి" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు -
వామ్మో మాంచెస్టర్.. భారత్ను భయపెడుతున్న గత రికార్డులు
లార్డ్స్ టెస్టులో అనుహ్య ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. జూలై 23 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానం వేదికగా ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో భారత్-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఎలాగైనా ఓడించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ కీలకపోరుకు ముందు మాంచెస్టర్లో గత రికార్డులు టీమిండియాను భయపెడుతున్నాయి.ఇంగ్లండ్దే పైచేయి..ఈ పర్యటనలో ఎడ్జ్బాస్టన్ టెస్టులో విజయం సాధించి ఇంగ్లండ్ కంచుకోటను బద్దలు కొట్టిన భారత జట్టు.. ఇప్పుడు మాంచెస్టర్పై కన్నేసింది. ఇప్పటివరకు మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డు మైదానంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్లో కూడా గెలవలేదు. ఈ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మొత్తం తొమ్మిది టెస్టులు జరిగాయి.అందులో ఇంగ్లండ్ నాలుగింట విజయం సాధించగా.. మరో ఐదు టెస్టులు డ్రాగా ముగిశాయి. ఈ మైదానంలో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ 1936లో ఆడింది. అప్పటి నుంచి భారత జట్టుకు విజయం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారత జట్టు చివరసారిగా ఈ వేదికలో 2014లో టెస్టు మ్యాచ్ ఆడింది. మళ్లీ ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో భారత్ ఆడనుంది.భారత ఓటమికి కారణమిదే..?ఇప్పటివరకు ఈ మైదానంలో భారత జట్టు విజయం సాధించికపోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మైదానంలో పిచ్ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తోంది. ఈ గ్రీన్ టాప్ వికెట్పై పేసర్లు పండగ చేసుకుంటారు. ఇటువంటి పిచ్పై ఆసియా జట్లకు ఆడడం చాలా కష్టంగా ఉంటుంది.బ్యాటర్లు స్వింగింగ్ కండీషన్స్కు అలవాటు పడకపోవడంతో ఈ మైదానంలో ఏషియన్ జట్లు ఎక్కువగా ఓటమి చవిచూడాల్సి వస్తోంది. ఈ మైదానంలో ఇంగ్లండ్ జట్టుకు అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 84 టెస్టుల్లో ఆతిథ్య జట్టు 33 మ్యాచ్ల్లో, 15 మ్యాచ్లలో ఓటమి చవిచూసింది.మిగిలిన 36 మ్యాచ్లను డ్రాగా ముగిసింది. ఈ మైదానంలో భారత అత్యధిక స్కోర్ 390 పరుగులగా ఉంది. ప్రస్తుతం భారత జట్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మినహా మిగితా ఎవరూ కూడా మైదానంలో ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరపున ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సునీల్ గవాస్కర్ ఉన్నారు. ఆయన ఈ మైదానంలో మూడు టెస్టులు ఆడి 242 పరుగులు చేశాడు.మాంచెస్టర్లో భారత రికార్డులుఅత్యధిక స్కోరు: 119.2 ఓవర్లలో 432/10 (ఆగస్టు 1990).అత్యల్ప స్కోరు: 21.4 ఓవర్లలో 58/10 (జూలై 1952).అతిపెద్ద ఓటమి (ఇన్నింగ్స్ వారీగా): 1952లో భారత్ను ఇంగ్లండ్ ఇన్నింగ్స్ అండ్ 207 పరుగుల తేడాతో ఓడించింది.అతిపెద్ద ఓటమి (పరుగులు వారీగా): జూలై 1959లో భారత్ను 171 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓడించింది.అత్యధిక పరుగులు: సునీల్ గవాస్కర్ మూడు టెస్టుల్లో 242 పరుగులు.అత్యధిక స్కోరు: ఆగస్టు 1990లో మహ్మద్ అజారుద్దీన్ 243 బంతుల్లో 179 పరుగులు.అత్యధిక సగటు: సచిన్ టెండూల్కర్ 187.00 (ఒక టెస్ట్లో 187 పరుగులు).సెంచరీలు చేసిన ప్లేయర్లు వీరే: సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ మర్చంట్, అబ్బాస్ అలీ బేగ్, పాలీ ఉమ్రిగర్, సునీల్ గవాస్కర్, సందీప్ పాటిల్, మహ్మద్ అజారుద్దీన్ సచిన్ టెండూల్కర్. -
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
ఇంగ్లండ్తో మాంచెస్టర్ వేదికగా జూలై 23 నుంచి ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బెకెన్హామ్లో తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. గురువారం తొలి ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు.లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పంత్ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడి స్ధానంలో ధ్రువ్ జురెల్ సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఫీల్డింగ్కు దూరంగా ఉన్న పంత్.. రెండు ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు మాత్రం వచ్చాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో టెస్టుకు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. తాజాగా పంత్ గాయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ అప్డేట్ ఇచ్చాడు. పంత్ ఇంకా నొప్పితో బాధపడుతున్నాడని, మాంచెస్టర్ టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడని టెన్డెష్కాట్ థీమా వ్యక్తం చేశాడు."మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్టుకు ముందు పంత్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ను మొదలు పెడతాడు. ఆ సమయానికి అతడు కచ్చితంగా ఫిట్నెస్ సాధిస్తాడన్న నమ్మకం ఉంది. అతడు మూడో టెస్టులో చాలా నొప్పితో బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత అతడి చేతి వేలి నొప్పి కాస్త తగ్గింది.కానీ ముందుస్తు జాగ్రత్తగా ప్రస్తుతం అతడు ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు. వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది ఆఖరిలో మేము నిర్ధారించుకుంటాము. మరోసారి ఇన్నింగ్స్ మధ్యలో కీపర్ను మార్చాల్సిన పరిస్థితి రాకూడదు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తే పంత్నే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ చేస్తాడు. రాబోయే రోజుల్లో అతడి ఫిట్నెస్పై కచ్చితంగా అప్డేట్ ఇస్తామని" విలేకరుల సమావేశంలో డెష్కాట్ పేర్కొన్నాడు.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీ20లకు, టెస్టులకు వీడ్కోలు పలికినప్పటికి అంతర్జాతీయ క్రికెట్లో తన రికార్డుల వేట మాత్రం కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఆల్టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి రేటింగ్ పాయింట్స్ను అప్డేట్ చేసింది.కోహ్లి రేటింగ్ పాయింట్స్ 897 నుంచి 909కి పెరిగాయి. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలో 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకున్న తొలి ప్లేయర్గా కింగ్ కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్లో అత్యధికంగా 937 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. వన్డేల్లో అతడి పేరిట 909 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి.ఓవరాల్గా ఆల్ టైమ్ టీ20 ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ డేవిడ్ మలన్ 919 రేటింగ్ పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్స్తో నిలిచాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో కోహ్లి ఉన్నాడు.కోహ్లి తన కెరీర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 48.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టుల్లో 123 మ్యాచ్లు ఆడి 9230 పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కోహ్లి రికార్డు స్ధాయిలో 51 వన్డే సెంచరీలు చేశాడు.చదవండి: IND vs ENG: 'తప్పేమి కాదు.. అతడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలి' -
భారత్ ఓటమికి కారణమదే.. అతడు మాత్రం అద్భుతం: సునీల్ గవాస్కర్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 193 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతకలపడింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్; 181 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బ్రైడన్ కార్స్ రెండు వికెట్లు సాధించాడు. ఇక గిల్ సేన ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. లక్ష్య చేధనలో బ్యాటర్లు భాగస్వామ్యాలను నెలకొల్పకపోవడం వల్ల భారత్ ఓటమి పాలైందని ఆయన తెలిపారు."భారత రెండో ఇన్నింగ్స్లో కనీసం ఒక్కటైన 60 నుంచి 70 పరుగుల భాగస్వామ్యం నమోదైంటే ఫలితం మరో విధంగా ఉండేది. కానీ భారత బ్యాటర్లు అలా చేయడంలో విఫలమయ్యారు. స్పిన్నర్లు జో రూట్, షోయబ్ బషీర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా దూకుడుగా ఆడలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఆ సమయంలో అతడు ఆడిన తీరు సరైనదే. ఎందుకుంటే బయట మరో వికెట్ లేదు. జడేజా పోరాటానికి పూర్తి మార్క్లు ఇవ్వాల్సిందేనని" అధికారిక బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నారు. కాగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం తమ ఓటమికి కారణం ఇదే చెప్పుకొచ్చాడు. ఒక 50 పరుగుల భాగస్వామ్యం వచ్చి వున్నా తాము గెలిచే వాళ్లమని గిల్ అన్నాడు. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంగ్లండ్ టెస్టు జట్టులోకి లైమ్ డాసన్ వచ్చాడు. భారత్ కూడా తమ తుది జట్టులో మార్పులు చేసే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs ENG: భారత్తో నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! 8 ఏళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ -
ఎస్ఆర్హెచ్ కీలక ప్రకటన.. కోచ్గా 'ఊహించని ప్లేయర్'
సన్రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్ టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్(Varun Aaron)ను ఎస్ఆర్హెచ్ మెనెజ్మెంట్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ వెల్లడించింది. గత సీజన్లో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కోచ్గా పనిచేసిన కివీస్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ స్ధానాన్ని భర్తీ చేయనున్నాడు.ఆరోన్కు అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. జార్ఖండ్కు చెందిన వరున్ ఆరోన్ 9 టెస్టులు, 9 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 29 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్), రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తరపున ఆడాడు.తన ఐపీఎల్ కెరీర్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 95 టీ20ల్లో 93 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆరోన్ చివరగా విజయ్ హాజారే ట్రోఫీ 2024-25 సీజన్లో జార్ఖండ్ తరపున ఆడాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్లకు క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ స్పీడ్ స్టార్.. కామెంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ తమ స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. 14 మ్యాచ్లు ఆడి కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించింది.చదవండి: IND vs ENG: జోఫ్రా ఆర్చర్ సూపర్ డెలివరీ.. రిషబ్ పంత్కు మైండ్ బ్లాంక్! వీడియో -
IND vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. విదేశీ గడ్డపై ఒక టెస్టు సిరీస్(కనీసం 3 మ్యాచ్లు)లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో నాలుగు సిక్స్లు బాదిన టీమిండియా.. ఈ అరుదైన ఫీట్ను తమ పేరిట లిఖించుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ 34 సిక్సర్లు నమోదు చేసింది.ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్, న్యూజిలాండ్ పేరిట సంయుక్తంగా ఉండేది. 1974లో వెస్టిండీస్ జట్టు భారత్లో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 32 సిక్సర్లు నమోదు చేసింది. ఆ తర్వాత 2014లో యూఏఈ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కివీస్ కూడా సరిగ్గా 32 సిక్సర్లు కొట్టింది. తాజా మ్యాచ్తో కివీస్, విండీస్ను భారత్ అధిగమించింది.ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 387 పరుగులు చేసింది. బదులుగా భారత్ కూడా తొలి ఇన్నింగ్స్లో చేసి 387 పరుగులే చేయగలిగింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్ల స్కోరు సమం అయింది. నాలుగో రోజు ఆట ఇరు జట్లకు కీలకం కానుంది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించి ఇంగ్లండ్ను ఆలౌట్ చేస్తే మరో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.చదవండి: నా వల్లే అలా జరిగింది.. పంత్ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్ -
ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే యశస్వి జైశ్వాల్, కెప్టెన్ శుబ్మన్ గిల్ వికెట్లు కోల్పోయిన భారత జట్టును.. తన సూపర్ పెర్ఫార్మెన్స్తో రాహుల్ ఆదుకున్నాడు.రిషబ్ పంత్తో కలిసి నాలగో వికెట్కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి రాహుల్ ఔటయ్యాడు. ఈ క్రమంలో రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.మూడో ప్లేయర్గా..సేనా( దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన మూడో ఏసియన్ బ్యాటర్గా రాహుల్ నిలిచాడు. రాహుల్కు ఇది సేనా దేశాల్లో 11వ ఫిప్టీ స్కోర్ కావడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లా మాజీ ప్లేయర్ తమీమ్ ఇక్భాల్, సయీద్ అన్వర్ పేరిట సంయుక్తంగా ఉండేది.ఈ దిగ్గజ ఆటగాళ్లు తమ కెరీర్లో సేనా దేశాల్లో 10 సార్లు 50+ పరుగులు చేశారు. తాజా ఇన్నింగ్స్తో వీరిని కేఎల్ అధిగమించాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో సునీల్ గవాస్కర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. అతడు 12 సార్లు 19 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత స్ధానంలో దిముత్ కరుణరత్నే(12) కొనసాగుతున్నాడు.ఇక లార్డ్స్ టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది. -
ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) అద్బుతమైన సెంచరీ సాధించాడు.అతడితో రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.గిల్-క్రాలీ వాగ్వాదం..కాగా మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో హ్రైడ్రామా చోటు చేసుకుంది. భారత్ ఆలౌటైనంతరం రెండో ఇన్నింగ్స్ను ఇంగ్లండ్ ఆరంభించింది. సెకెండ్ ఇన్నింగ్స్లో భారత బౌలింగ్ ఎటాక్ను జస్ప్రీత్ బుమ్రా ఆరంభించాడు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే,బెన్ డకెట్లు ఏమాత్రం ఇష్టపడలేదు.ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్కు జాక్ క్రాలే పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు. మూడో బంతిని బుమ్రా డెలివరీ చేసే సమయంలో క్రాలీ ఒక్కసారిగా పక్కకు తప్పుకొన్నాడు. దీంతో బుమ్రా అసహనానికి లోనయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం క్రాలీపై కోపంతో ఊగిపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ ఆడేందుకు ధైర్యం తెచ్చుకో అన్నట్లు సైగ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరి బంతి పడేముందు క్రాలీ గాయం పేరిట డ్రామా చేశాడు. ఫిజియె మైదానంలోకి రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు జాక్ క్రాలీని చప్పట్లు కొడుతూ గేలి చేశారు. వెంటనే క్రాలీ కూడా వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.Shubman Gill & Co. didn’t come to be played around, 𝙠𝙮𝙪𝙣𝙠𝙞 𝙔𝙚 𝙨𝙚𝙚𝙠𝙝𝙣𝙚 𝙣𝙖𝙝𝙞, 𝙨𝙞𝙠𝙝𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | SUN 13th JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/ix13r7vtja— Star Sports (@StarSportsIndia) July 12, 2025 Always annoying when you can't get another over in before close 🙄 pic.twitter.com/3Goknoe2n5— England Cricket (@englandcricket) July 12, 2025 -
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటర్ జేమీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రాహుల్ విడిచిపెట్టాడు.87 ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. మూడో బంతిని స్మిత్కు బ్యాక్ ఆఫ్ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. అయితే ఆ స్దానంలో రాహుల్ తన భుజం ఎత్తులో వచ్చిన బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చూసిన సిరాజ్ ఒక్కసారిగా షాకయ్యాడు.రాహుల్ తప్పిదానికి భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 5 పరుగుల దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. ఏకంగా 51 పరుగులు చేసి జట్టు స్కోర్ 350 రన్స్ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.బ్రాడైన్ కార్స్తో కలిసి ఎనిమిదో వికెట్కు 80 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవేళ రాహుల్ ఆ క్యాచ్ను పట్టి ఉంటే ఈపాటికే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసి ఉండేది. అయితే యాదృచ్ఛికంగా స్మిత్ తిరిగి సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 387 పరుగుల భారీ స్కోర్ చేయగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్(104) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs ENG: జో రూట్ ప్రపంచ రికార్డు.. -
బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైరల్
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్లో అత్యత్తుమ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్ధి గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. అతడు మరోసారి తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు.లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను బుమ్రా ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టోక్స్ను అద్బుతమైన బంతితో జస్ప్రీత్ క్లీన్ బౌల్డ్ చేశాడు.స్టోక్స్ మైండ్ బ్లాంక్..ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 86 ఓవర్ వేసిన బుమ్రా.. రెండో బంతిని రౌండ్ది వికెట్ నుంచి గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశగా పడిన బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్ను గిరాటేసింది.దీంతో ఒక్కసారిగా స్టోక్స్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. తొలి రోజు ఆటలో కూడా ఇదే తరహాలో హ్యారీ బ్రూక్ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టోక్స్ను ఔట్ చేసిన అనంతరం జో రూట్(104), క్రిస్ వోక్స్ను పెవిలియన్కు పంపాడు. మొత్తంగా ఇప్పటివరకు బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు.లంచ్ బ్రేక్కు భారత స్కోరంతంటే?రెండో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్(51), బ్రాడైన్ కార్స్(33) ఉన్నారు.Jasprit Bumrah takes three big wickets Root, Stokes & Woakes in just 7 balls.He flipped the match in a single spell.⁰Game-changer. Match-winner. Jasprit Bumrah 🐐⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/Wq19z1glb5— Kavya Maran (@Kavya_Maran_SRH) July 11, 2025 -
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprit bumrah) నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రెండో రోజు ఆటలో తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను అద్బతమైన బంతితో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత జో రూట్(104), క్రిస్ వోక్స్ను పెవిలియన్కు పంపాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..ఈ మ్యాచ్లో బుమ్రాకి ఇది నాలుగో వికెట్. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. స్టోక్స్ను ఔట్ చేసిన అనంతరం ఈ ఫీట్ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్లో 47 టెస్టు వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్దేవ్ తన కెరీర్లో ఇంగ్లండ్లో 13 మ్యాచ్లు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనతో కపిల్దేవ్ ఆల్టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ(48) అగ్రస్దానంలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితో ఇషాంత్ను బుమ్రా అధిగమిస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. 251/4 ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్గానూ గిల్? -
జస్ప్రీత్ బుమ్రా సూపర్ డెలివరీ.. వరల్డ్ నెం1 బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్బుతమైన బంతితో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బకు టెస్టు వరల్డ్ నెం1 బ్యాటర్కు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఓలీ పోప్ ఔటయ్యాక బ్రూక్ క్రీజులోకి వచ్చాడు.అప్పటికే క్రీజులో పాతుకుపోయిన జో రూట్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ బుమ్రా అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 55వ ఓవర్ వేసిన బుమ్రా ఐదో బంతిని.. హ్యారీ బ్రూక్కు ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. 140 కి.మీ వేగంతో వేసిన ఆ బంతిని బ్రూక్ ఆఫ్సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కాస్త లోగా వచ్చిన బంతి అతడి బ్యాట్ను మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. దీంతో బ్రూక్(8) ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి లార్డ్స్లో ఆడుతున్నాడు.68 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(62), బెన్స్టోక్స్(27) ఉన్నారు. భారత బౌలర్లలో ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి రెండు, జస్ప్రీత్ బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు.Number 1 bowler gets Number 1 batter at Lord’s.What a delivery by Jasprit Bumrah — absolute perfection.⁰Top of off, pace, precision — vintage Bumrah.⁰#INDvsENG #ENGvINDpic.twitter.com/kdGbLbPnND— Kavya Maran (@Kavya_Maran_SRH) July 10, 2025 -
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురదెబ్బ తగిలింది. తొలి రోజు ఆట సందర్భంగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రెండో బంతిని అందుకునే క్రమంలో పంత్ ఎడమ చేతి వేలికి గాయమైంది.బంతిని తీసుకున్నాక పంత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్స్ట్యూట్ వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవ్రమైనది కాకుడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో సెంచరీల మోత మ్రోగించిన పంత్.. రెండో టెస్టులో హాఫ్ సెంచరీతో మెరిశాడు.41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(37), పోప్(24) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ గడ్డపై టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్లక్ వెంటాడుతోంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ టాస్ ఓడిపోయాడు. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యా టింగ్ ఎంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్ టాస్ ఓడిపోవడం ఇది వరుసగా 13వ సారి కావడం గమనార్హం.ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. విండీస్ 1999లో వరుసగా 12 మ్యాచ్ల్లో టాస్ గెలవలేకపోయింది. తాజా మ్యాచ్తో విండీస్ను మెన్ ఇన్ బ్లూ అధిగమించింది.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్, భారత జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ జట్టులోకి జోఫ్రా ఆర్చర్ రాగా.. టీమిండియాలోకి జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. 35 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(27), పోప్(19) ఉన్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ(18), బెన్ డకెట్(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు.తుదిజట్లుభారత్శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.ఇంగ్లండ్బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్. -
రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్గా భారత జట్టుతో ప్రాక్టీస్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో మూడో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో ఆధిక్యం పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అందుకు తగ్గట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది. అయితే బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టుతో పాటు ఓ ప్రత్యేక ఆతిథి కసరత్తలు చేస్తూ కన్పించాడు. ఇంగ్లండ్ టూర్కు ఎంపిక కానప్పటికి నెట్స్లో జట్టుకు తన సేవలను అందించాడు. అతడే టీమిండియా, ముంబై ఇడియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్. ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్ టోర్నమెంట్ను వీక్షించేందుకు చాహర్ తన భార్యతో కలిసి లండన్కు వెళ్లాడు.ఈ క్రమంలో లండన్లో ఉన్న భారత జట్టుతో చాహర్ కలిశాడు. ఈ రాజస్తాన్ పేసర్ జట్టుతో కలవడమే కాకుండా నెట్స్లో భారత బ్యాటర్లకు బౌలింగ్ చేశాడు. సాధరణంగా దీపక్ చాహర్ కొత్త బంతిని అద్బుతంగా స్వింగ్ చేయగలడు. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో బంతి ఎక్కువగా స్వింగ్ అయ్యే అవకాశమున్నందన.. చాహర్ బౌలింగ్లో భారత బ్యాటర్లు ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకుముందు బర్మింగ్హామ్ టెస్టు సందర్భంగా పంజాబ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ భారత నెట్ ప్రాక్టీస్ సెషన్లో కన్పించి ఆశ్చర్చపరిచాడు. ఇప్పుడు చాహర్ నెట్బౌలర్గా మరి అందరికి షాకిచ్చాడు. దీపక్ చాహర్ చివరగా 2023 డిసెంబర్లో భారత తరపున ఆడాడు. వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన చాహర్.. టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్Deepak Chahar trains with Team India at Lord’s ahead of the third Test match.[ Rahul Rawat ] pic.twitter.com/bqnASrkAJU— Jay Cricket. (@Jay_Cricket12) July 9, 2025 -
టీమిండియాతో మూడో టెస్టు.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లార్డ్స్ వేదికగా గురువారం(జూలై 10) నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టు కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్ను ఇంగ్లండ్ బుధవారం ప్రకటించింది.స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 52 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇంగ్లండ్ టెస్టు జెర్సీలో కన్పించనున్నాడు. యువ పేసర్ జోష్ టాంగ్ స్ధానంలో ఆర్చర్ను తుది జట్టులోకి ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ తీసుకుంది. రెండో టెస్టుకు ఆర్చర్ అందుబాటులోకి వచ్చినప్పటికి ఫిట్నెస్ సమస్యల కారణంగా బెంచ్కే పరిమితమ్యాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీమిండియాపై నిప్పులు చెరిగేందుకు ఈ స్పీడ్స్టార్ సిద్దమయ్యాడు. ఆర్చర్ చివరగా 2021లో ఇంగ్లండ్ తరపున టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇక ఈ ఒక మార్పు మినహా రెండో టెస్టులో ఆడినే జట్టును ఇంగ్లండ్ కొనసాగించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ జాక్ క్రాలీకి ఇంగ్లండ్ మెనెజ్మెంట్ మరో ఛాన్స్ ఇచ్చింది.ఈ మూడో టెస్టు కోసం లార్డ్స్ క్యూరేటర్స్ పచ్చికతో కూడిన పిచ్ను తాయారు చేశారు. దీంతో ఈ పిచ్పై ఫాస్ట్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు. దీంతో ఈ వికెట్పై భారత బ్యాటర్లకు ఆర్చర్ గట్టి సవాల్ ఎదురుకానుంది. అయితే భారత జట్టులోకి జస్ప్రీత్ బుమ్రా తిరిగి రానునుండడంతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. పిచ్ కండీషన్స్ దృష్టా మూడో టెస్టులో యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా ఆడే ఛాన్స్ ఉంది.ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ మరియు షోయబ్ బషీర్. -
Sourav Ganguly: ఈ రికార్డులను ఇంత వరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!
భారత క్రికెట్కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.యువరాజ్ సింగ్, హార్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్ టైగర్ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్ రికార్డులపై ఓ లుక్కేద్దాం.ఒకే ఒక్కడు..అంతర్జాతీయ వన్డే మ్యాచ్లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్తో వన్డే సిరీస్లో దాదా ఈ ఘనత సాధించాడు.ఏకైక లెఫ్ట్ హ్యాండర్గా..వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు కూడా గంగూలీనే కావడం గమనార్హం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2000 ఫైనల్లో న్యూజిలాండ్పై సౌరవ్ సెంచరీ(117) సెంచరీతో మెరిశాడు.👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భారత తరపున నుంచి గంగూలీ ఒక్కడే ఉన్నాడు.👉ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భారత తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్లో శ్రీలంకపై గంగూలీ 183 పరుగులు పరుగులు చేశాడు.వరసుగా నాలుగు సార్లు1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయర్స్లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.1997లో – 1338 పరుగులు1998లో – 1328 పరుగులు1999లో – 1767 పరుగులు2000లో – 1579 పరుగులు👉వరల్డ్ క్రికెట్లో అంతర్జాతీయ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్ను అందుకున్నాడు.👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్ సాధించాడు.👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్నుని అందించిన కెప్టెన్ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది. -
గెలుపు ముంగిట టీమిండియా.. కానీ ఓ బ్యాడ్ న్యూస్! అదే జరిగితే?
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా(Teamindia) 7 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మైదానంలో ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టులో కూడా గెలవని భారత జట్టు.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించేందుకు సిద్దమైంది.బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి. అయితే గెలుపు ముంగిట భారత జట్టును వరుణుడు భయపెడుతున్నాడు. ఆఖరి రోజుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎడ్జ్బాస్టన్లో ఆదివారం ఉదయం మ్యాచ్ ప్రారంభ సమయంలో 60 శాతం వర్షం కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూ వెదర్ తమ రిపోర్టులో పేర్కొంది. అయితే మధ్యాహ్నం సమయంలో వర్షం ఉండకపోవచ్చని ఆక్యూ వెదర్ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైతే ఇంగ్లండ్ కచ్చితంగా డ్రా కోసం ఆడుతోంది.అయితే మరోవైపు కెప్టెన్ శుబ్మన్ గిల్(Shubman Gill) ఇన్నింగ్స్ను లేట్గా డిక్లేర్ చేయడాన్ని చాలా మంది క్రికెట్ నిపుణులు తప్పుబడుతున్నారు. కాస్త ముందుగానే ఇంగ్లండ్కు బ్యాటింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడివుండేవని అభిప్రాయపడుతున్నారు.కాగా ఓవర్నైట్ స్కోరు 64/1తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇండియా 427/6 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ (162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161) సెంచరీతో చెలరేగగా.. రవీంద్ర జడేజా (69 నాటౌట్), రిషబ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు.చదవండి: IND vs ENG: శుబ్మన్ గిల్ వరల్డ్ రికార్డు.. 148 ఏళ్లలో ఇదే తొలిసారి -
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్లో పడ్డ గిల్! వీడియో
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. ఈ మారథాన్ ఇన్నింగ్స్తో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా విరాట్ కోహ్లి(254) రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.ఓ దశలో గిల్ ట్రిపుల్ సెంచరీ మార్క్ను కూడా అందుకునేలా కన్పించాడు. అయితే సమయంలో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మైండ్ గేమ్స్ మొదలు పెట్టాడు. టీ విరామం తర్వాత 265 పరుగుల మార్కును దాటి బ్యాటింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్ ఏకగ్రాతను దెబ్బతీసేందుకు బ్రూక్ ప్రయత్నించాడు.స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్.. గిల్తో తన ట్రిపుల్ సెంచరీ కోసం చర్చించాడు. 143 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. గిల్-బ్రూక్ మధ్య జరిగిన సంభాషణ స్టంప్ మైక్లో రికార్డు అయింది. అయితే ఇద్దరి మాటలు అంత క్లారిటీగా బయటకు వినిపించడం లేదు.ఈ క్రమంలో కామెంటరీ బాక్స్ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్.. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. "290 పరుగుల వద్ద ఆడటం చాలా కష్టం" అని బ్రూక్ అనగా, "నీ కెరీర్లో ఎన్ని ట్రిపుల్ సెంచరీలు చేశావ్? అని గిల్ బదులు ఇచ్చినట్లు అథర్టన్ తెలిపారు.ఇది జరిగిన తర్వాత ఓవరే గిల్ తన వికెట్ను కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. కాగా హ్యారీ బ్రూక్ పేరిట ఓ టెస్టు ట్రిపుల్ సెంచరీ ఉంది. గతేడాది పాకిస్తాన్తో జరిగిన టెస్టులో బ్రూక్ 317 పరుగులు చేశాడు.ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైశ్వాల్( 87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.pic.twitter.com/PKokKBCd4R— The Game Changer (@TheGame_26) July 3, 2025 -
టెస్టు క్రికెట్కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్లో నేను బెస్ట్ బ్యాటర్గా నిలుస్తా.. కెప్టెన్గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్బాస్టన్లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్బర్గ్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్బ్లాస్టర్ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్లో గిల్తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. భారత తుది జట్టులోకి తమిళనాడు కుర్రాడు?
ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆడడం దాదాపు ఖాయమైంది. బౌలింగ్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్ స్ధానంలో నితీశ్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలం కావడంతో శార్ధూల్పై వేటు వేసేందుకు టీమ్ మెనెజ్మెంట్ సిద్దమైనట్లు సమాచారం.తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. ఎడ్జ్బాస్టన్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో సోమవారం తమ నెట్ప్రాక్టీస్ సెషన్ను భారత జట్టు పొడిగించింది. దాదాపు నాలుగైదు గంటల పాటు భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.ఫీల్డింగ్ డ్రిల్స్లో కూడా ఈ ఆంధ్ర క్రికెటర్ పాల్గోన్నాడు. ముఖ్యంగా నితీశ్ స్లిప్స్లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. జైశ్వాల్ బదులుగా నితీశ్ స్లిప్స్లో ఫీల్డింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి టెస్టులో జైశ్వాల్ స్లిప్స్లో ఏకంగా మూడు క్యాచ్లు విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే శార్ధూల్ ఠాకూర్ మాత్రం ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడని ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది.వాషింగ్టన్కు చోటు?మరోవైపు ఈ మ్యాచ్లో ఇద్దరు స్పిన్నర్లతో భారత్ ఆడనున్నట్లు తెలుస్తోంది. తొలుత కుల్దీప్ యాదవ్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వాలని టీమిండియా మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు కుల్దీప్ యాదవ్కు బదులుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు చోటివ్వాలని గంభీర్ అండ్ కో యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం జరిగిన నెట్సెషన్లో ఈ తమిళనాడు ఆల్రౌండర్ తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. అయితే ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన భారత జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కటే మాత్రం ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా బుమ్రా అందుబాటుపై కూడా మ్యాచ్ రోజున నిర్ణయం తీసుకుంటామని డస్కటే వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: నా మనసంతా అక్కడే.. ఎక్కడున్నా పట్టేస్తారు: పెదవి విప్పిన కావ్యా మారన్ -
అమ్మ చేతిలో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. వీడియో వైరల్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక కాకపోయిన సంగతి తెలిసిందే. దీంతో అయ్యర్ తనకు లభించిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న శ్రేయస్ తన ఫ్యామిలీతో సరదగా గడుపుతున్నాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ తన ఇంట్లో తల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. అయ్యర్ బ్యాటింగ్ చేయగా.. అతడి తల్లి బౌలింగ్ చేసింది. అయితే ఆమె విసిరిన ఓ బంతిని శ్రేయస్ కొట్టలేకపోయాడు. దీంతో ఆమె అయ్యర్ను క్లీన్ బౌల్డ్ చేసినట్లు సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వీడియోను పంజాబ్ కింగ్స్ ఎక్స్లో షేర్ చేసింది.మా సర్పాంచ్ సాబ్ ఇప్పుడు మాత్రం బౌల్డ్ అయినా పట్టించుకోడని పంజాబ్ క్యాప్షన్గా జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సొషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ రన్నరప్గా నిలిచాడు.అద్బుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరినప్పటికి.. తుది మెట్టుపై ఆర్సీబీ చేతిలో పంజాబ్ బోల్తా పడింది. ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉన్న అయ్యర్ వచ్చే నెలలో బంగ్లాదేశ్తో జరిగే వన్డే సిరీస్కు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: ఇంగ్లండ్కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రిOnly time SARPANCH won't mind getting bowled! 😂♥️ pic.twitter.com/jYUDd7DkD7— Punjab Kings (@PunjabKingsIPL) June 30, 2025 -
భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్లపై నీలినీడలు?
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్బాల్ సిరీస్లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్లు జరగడం అసంభవం అన్పిస్తోంది.అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్లో సిరీస్లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు? -
ఇంగ్లండ్కు టీమిండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి.. లేదంటే కష్టమే: రవిశాస్త్రి
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో రెండో టెస్టులో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టు నాలుగు రోజుల పాటు ప్రాక్టీస్ సెషన్లో గిల్ సేన తీవ్రంగా శ్రమించింది.ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్టులో ప్రత్యర్ధికి ధీటైన సమాధానిమివ్వాలని భారత జట్టును రవిశాస్త్రి కోరాడు."రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి ఇంగ్లండ్కు టీమిండియా కౌంటర్ పంచ్ ఇవ్వాలి. ఇది భారత్కు చాలా ముఖ్యమైన విషయం. ఈ మ్యాచ్లో భారత్ గెలవకపోతే సిరీస్లో వెనకబడుతోంది. తొలి టెస్టులో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆఖరి రోజు ఆటలో నిరాశపరచడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చివరి రోజు ఆటలో భారీ టార్గెట్ చేధించి గెలిచినందుకు ఇంగ్లండ్కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి పుంజుకోవాల్సిన అవసరముంది. ఎడ్జ్బాస్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడుతాడో లేదో ఇంకా తెలియదు. కానీ అతడు ఆడాలనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్.. ఇందులో గెలిస్తే సిరీస్ సమమవుతోంది. కాబట్టి ఈ ఒక్క మ్యాచ్లో అతడిని ఆడించి మిగితా మ్యాచ్లకు విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. ఇది ఐదు మ్యాచ్ల సిరీస్ కాబట్టి భారత్ తిరిగి కమ్బ్యాక్ ఇస్తుందని ఆశిస్తున్నా" అని ఐసీసీ రివ్యూలో శాస్త్రి పేర్కొన్నాడు.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: IND vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి -
టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు?
ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం.. మాజీ ఆల్రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) కోచింగ్ కన్సల్టెంట్గా ఇంగ్లండ్ జట్టులో చేరాడు.హెడ్ కోచ్ బ్రాండెన్ మెకల్లమ్తో కలిసి మోయిన్ అలీ తన సేవలను అందించనున్నట్లు టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విల్ మాక్ఫెర్సన్ వెల్లడించారు. సోమవారం అలీ నేతృత్వంలోనే ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ చేసినట్లు ఆయన ఎక్స్లో రాసుకొచ్చారు. ఎడ్జ్బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశమున్నందన మోయిన్ను తమ కోచింగ్ సెటప్లోకి ఇంగ్లండ్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆఫ్ స్పిన్నర్ అయిన అలీ.. తొలి టెస్టులో విఫలమైన యువ స్పిన్నర్ షోయబ్ బషీర్కు గైడ్ చేసే అవకాశముంది. అంతేకాకుండా రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ వంటి మిస్టరీ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లకు అలీ చిట్కాలు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడడంపై ఇంకా సందిగ్థం కొనసాగుతోంది. మ్యాచ్కు ముందే అతని అందుబాటుపై నిర్ణయం ఉంటుందని భారత అసిస్టెంట్ కోచ్ టెన్ డస్కటే చెప్పుకొచ్చాడు.ఒకవేళ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించింది. స్పీడ్ స్టార్ జోఫ్రా అర్చర్కు తుది జట్టులో చోటు దక్కలేదు. మూడో టెస్టు నుంచి అతడు అవకాశముంది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
IND Vs ENG: టీమిండియాకు హార్ట్ బ్రేక్.. ఒక్క వికెట్ తేడాతో ఓటమి
నార్తాంప్టన్ వేదికగా సోమవారం ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో ఒక్క వికెట్ తేడాతో భారత్ అండర్-19 జట్టు ఓటమి పాలైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 1-1 సమమైంది. భారత్ నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించింది.లక్ష్య చేధనలో ఇంగ్లండ్ యువ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో ఓ దశలో టీమిండియా సునాయసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఇంగ్లీష్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ థామస్ రెవ్ అద్భుతమైన సెంచరీతో భారత్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికి రెవ్ మాత్రం విరోచిత పోరాటం చేశాడు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో పాటు సెబాస్టియన్ మోర్గాన్నాట్(20), అలెక్స్ గ్రీన్(12) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యుధాజిత్ గుహ, హెనిల్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు.వైభవ్ మెరుపులు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 49 ఓవర్లలో 290 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు.అతడితో పాటు విహాన్ మల్హోత్రా(49), రాహుల్ కుమార్(47), కన్షిక్ చౌహన్(45) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ నాలుగు.. హోమ్, గ్రీన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఇదే వేదికలో జరగనుంది.చదవండి: బుమ్రాపై నిర్ణయం అప్పుడే.. మా దృష్టింతా దానిపైనే: టీమిండియా కోచ్ -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. టీమిండియాకు గుడ్ న్యూస్! వీడియో వైరల్
భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు కాస్త ఊరట లభించింది. శనివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పాల్గోన్నాడు.శుక్రవారం జరిగిన మొదటి ప్రాక్టీస్ సెషన్కు దూరంగా ఉన్న బుమ్రా.. రెండో రోజు మాత్రం దాదాపు ఆరగంట పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బుమ్రా తిరిగి మళ్లీ నెట్స్లో కన్పించడం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే రెండవ టెస్ట్లో బుమ్రా పాల్గొనడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తమ రిపోర్ట్లో పేర్కొంది. కాగా ఈ సిరీస్కు ముందే బుమ్రా కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే ఆడతాడని టీమిండియా మెనెజ్మెంట్ స్పష్టం చేసింది.కానీ ఏ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఒకవేళ రెండో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ యాజమాన్యం భావిస్తే.. వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశముంది. ఎందుకంటే తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్కు.. బర్మింగ్హామ్ టెస్టు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే సిరీస్ 1-1 సమమవుతోంది. అదే ఓడిపోతే 0-2తో టీమిండియా వెనకబడుతోంది. కాబట్టి రెండో టెస్టులో ఆడించి బుమ్రాకు మూడో టెస్టుకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు గంభీర్ అండ్ కో ఉన్నట్లు సమాచారం. బుమ్రా విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటారో మరో మూడు రోజులు వేచి చూడాలి.కాగా రెండో రోజు ప్రాక్టీస్కు టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాక్టీస్లో మాత్రం భారత జట్టు ఫీల్డింగ్, ఫిట్నెస్ డ్రిల్స్పై ఎక్కువగా దృష్టిసారించింది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి భారత ప్లేయర్గాBoom Time! 💣 pic.twitter.com/AhXEZg2ven— Sahil Malhotra (@Sahil_Malhotra1) June 28, 2025 -
గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్
జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం భారత జట్టు తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. లీడ్స్లో టెస్టులో ఓటమితో గంభీర్పై ఒత్తిడి పెరిగిందని చోప్రా అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్గా బాధ్యతలు చెపట్టిన తర్వాత భారత జట్టు బంగ్లాపై మినహా ఒక్క ప్రధాన టెస్టు సిరీస్లో కూడా విజయం సాధించలేకపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో ఓడిపోవడంతో గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఓటమితో ఆరంభించడం గంభీర్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది."గెలిచినప్పుడు ప్రశంసలు, ఓడిపోయినప్పుడు విమర్శలు గుప్పించడం భారత క్రికెట్ సూత్రం. మ్యాచ్లో గెలిచి అన్ని బాగా జరిగితే అందరికి ఆ క్రెడిట్ దక్కుతుంది. అదే ఓటమి పాలైతే ప్రతీ ఒక్కరూ విమర్శలు ఎదుర్కొక తప్పదు. లీడ్స్ టెస్టులో ఓటమికి కెప్టెన్ శుబ్మన్ గిల్ను నేను బాధ్యుడిని చేయాలనుకోవడం లేదు.ఎందుకంటే అతడు ఇప్పుడే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. పరిస్థితులను ఆర్ధం చేసుకోవడానికి అతడికి కాస్త సమయం పడుతోంది. కానీ గౌతం గంభీర్పైన మాత్రం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి ఉంటుంది. రెడ్ బాల్ క్రికెట్లో కోచ్గా తన మార్క్ చూపించలేకపోయాడు. అతడి పర్యవేక్షణలో భారత్ చాలా తక్కువ మ్యాచ్లను గెలిచింది. బంగ్లాదేశ్పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే టీమిండియా విజయం సాధించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై చెరో మూడు మ్యాచ్లలో భారత్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఇంగ్లండ్పై కూడా ఓ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. అతడి నేతృత్వంతో భారత్ కేవలం ఓటముల తప్ప విజయాలు సాధించలేకపోతుంది. ఇంగ్లండ్ సిరీస్లో ఆశించింన ఫలితం రాకపోతే గంభీర్ స్ధానం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఎందుకంటే గంభీర్ కోరిన ప్రతీది సెలెక్టర్లు, బీసీసీఐ చేసింది. ఎలాంటి ఆటగాళ్లు కావాలంటే అలాంటి ప్లేయర్లను సెలెక్టర్లు ఇచ్చారు. అయినప్పటికి విజయాలను అందించకపోతే సెలక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదుర్కొక తప్పదు" తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు.చదవండి: MLC 2025: ఉత్కంఠ పోరు.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన హెట్మైర్ -
'భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ను నేనే'.. టీమిండియాపై మైఖేల్ వాన్ సెటైర్లు
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా(Teamindia) ఓటమి పాలైంది. 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆఖరి రోజు ఆటలో బౌలర్లు తేలిపోయారు. దీంతో ఈ భారీ టార్గెట్ను ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(149) భారీ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్లింది. కాగా భారత్ ఓటమికి ప్రధానం కారణం ఫీల్డింగ్ వైఫల్యమే. మొత్తంగా ఈ మ్యాచ్లో 6 క్యాచ్లను భారత ఫీల్డర్లు జారవిడిచారు.ఆఖరి రోజు ఆటలో సైతం టీమిండియా ఫీల్డింగ్ ఏ మాత్రం మెరుగుపడలేదు. ఆఖరి రోజు ఆటలో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ బెన్ డకెట్ క్యాచ్ను 97 పరుగుల వద్ద జైశ్వాల్ విడిచిపెట్టాడు. దీంతో అతడు ఏకంగా 149 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ క్రమంలో పేలవ ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచిన టీమిండియాను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్(Michael Vaughan) ట్రోలు చేశాడు. "ఈ భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్ను నేనే అని ప్రకటిస్తున్నాను. నా ఫీల్డింగ్ ఆకాడమీ ప్రస్తుతం బాగా రాణిస్తోంది" అని అని సెటైరికల్ ట్వీట్ చేశాడు. అతడికి భారత అభిమానులు గట్టిగా కౌంటిరిస్తున్నారు. గతంలో వాన్ క్యాచ్లు విడిచిపెట్టిన వీడియోలను ఎక్స్లో షేర్ చేస్తున్నారు. గతంలో వాన్ తన సొంత జట్టును కూడా విధంగానే ట్రోలు చేశాడు. ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య రెండో టెస్టు వచ్చే బుధవారం నుంచి ప్రారంభం కానుంది.చదవండి: వారి వల్లే ఓడిపోయాము.. అందుకు ఇంకా సమయం ఉంది: గిల్The CV of the fielding coach: pic.twitter.com/1xkurSt9Qr— 𝐉𝐨𝐟𝐫𝐚 𝐒𝐭𝐨𝐜𝐤 𝐇𝐮𝐧𝐭𝐞𝐫 (@Niteish_14) June 24, 2025 -
టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఒకవేళ అదే జరిగితే?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలిటెస్టు తుది అంకానికి చేరుకుంది. గత నాలుగు రోజుల నుంచి హోరా హోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ఫలితం మంగళవారం తేలిపోనుంది. తొలి ఇన్నింగ్స్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో కూడా సత్తాచాటారు.దీంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని గిల్ సేన ఉంచింది. లక్ష్య చేధనలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. దూకుడుగా ఆడి లక్ష్యాన్ని పూర్తి చేయాలని స్టోక్స్ సేన భావిస్తుంటే.. భారత జట్టు మాత్రం ప్రత్యర్ధిని ఆలౌట్ చేయాలని పట్టుదలతో ఉంది.వర్షం ముప్పు..అయితే భారత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లే అవకాశముంది. ఐదో రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఆక్యూవెధర్, బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో లీడ్స్లో వర్షం పడటానికి 40 శాతం ఆస్కారం ఉంది. స్ధానిక కాలమానం ప్రకారం ఉదయం 11:00 గంటలకు ఆఖరి రోజు ఆట ఆరంభం కానుంది. ఒకవేళ రిపోర్ట్స్ ప్రకారం.. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగిస్తే తొలి టెస్టు డ్రాగా ముగిసే ఛాన్స్ ఉంది.ఆక్యూ వెదర్ రిపోర్ట్..మధ్యాహ్నం 2:30 (స్దానిక కాలమానం ఉదయం 10 గంటలకు 55% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 3:30 (స్దానిక కాలమానం ఉదయం 11 గంటలకు 40% వర్షం పడే అవకాశం)మధ్యాహ్నం 4:30 (స్దానిక కాలమానం ఉదయం 12 గంటలకు 43% వర్షం పడే అవకాశం)సాయంత్రం 6:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 2 గంటలకు 47 % వర్షం పడే అవకాశం)సాయంత్రం 7:30 (స్ధానిక కాలమనం మధ్యాహ్యం 3 గంటలకు 52 % వర్షం పడే అవకాశంరాత్రి 8:30-10:30( స్ధానిక కాలమనం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 50 % వర్షం పడే అవకాశం)చదవండి: చరిత్ర సృష్టించిన కిరాన్ పొలార్డ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా -
'అతడిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్'
ఠాకూర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరును కనబరిచాడు. జోష్ టంగ్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో శార్థూల్ ఠాకూర్పై టీమిండియా మెనెజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డర్లో శార్ధూల్ తన అనుభవంతో పరుగులు సాధిస్తాడని భావించింది. అందుకే ఆసీస్ గడ్డపై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్ను ఆడించారు.కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నమ్మకాన్ని శార్ధూల్ వమ్ము చేశాడు. ఈ క్రమంలో టీమ్మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాడు. శార్థూల్ను ఎందుకు అవకాశమిచ్చారు.. అతడి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని పోస్ట్లు పెడుతున్నారు. మరోవైపు శార్దూల్కు తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్ల మాత్రమే బౌలింగ్ ఇవ్వడాన్ని పలువురు మాజీలు తప్పబడుతున్నారు. అతడిపై మీకు నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక లీడ్స్ టెస్టు ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
వారెవ్వా రూట్.. ద్రవిడ్ వరల్డ్ రికార్డు సమం
ఇంగ్లండ్ స్టార్ బ్యా టర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఫీల్డర్గా భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ రికార్డును రూట్ సమం చేశాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు.నాలుగో రోజు ఆటలో శార్థూల్ ఠాకూర్ క్యాచ్ను అందుకున్న జో.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్, ద్రవిడ్ ఇద్దరూ సమానంగా చెరో 210 అవుట్ఫీల్డ్ క్యాచ్లను అందుకున్నారు. ద్రవిడ్ ఈ వరల్డ్ రికార్డును 164 టెస్టుల్లో సాధించగా.. రూట్ 154 మ్యాచ్లలోనే ఈ రేర్ఫీట్ను సమం చేశాడు.ఈ సిరీస్లో రూట్ మరో క్యాచ్ను అందుకుంటే ద్రవిడ్ను అధిగమిస్తాడు. ఈ రికార్డు సాధించిన జాబితాలో ద్రవిడ్, రూట్ తర్వాత స్ధానంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే(205 అవుట్ఫీల్డ్ క్యాచ్లు) ఉన్నారు. అయితే టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా దక్షిణాఫ్రికా లెజెండ్ మార్క్ బౌచర్(532) అగ్రస్దానంలో ఉన్నాడు.గెలుపువరిదో?ఇక ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి. భారత్ తమ విజయానికి పది వికెట్ల దూరంలో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 90/2 తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 96 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
బ్యాటింగ్కు అంత ఈజీగా లేదు.. విజయం మాదే: కేఎల్ రాహుల్
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. 90/2తో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన టీమిండియా.. అదనంగా 274 పరుగులు జోడించి తమ రెండో ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో చెలరేగారు.పంత్, రాహుల్ ఇద్దరూ నాలుగో వికెట్కు 195 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరూ ఔటయ్యాక టీమిండియా బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. 31 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 6 వికెట్లు కోల్పోయింది.దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం జోడించి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 21/0 స్కోరుతో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ విజయంపై సెంచూరియాన్ కేఎల్ రాహుల్ థీమా వ్యక్తం చేశాడు.ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని రాహుల్ తెలిపాడు. మరోవైపు ఇంగ్లండ్ సైతం డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ యువ సంచలనం జోష్ టంగ్ స్పష్టం చేశాడు."బ్లాక్బస్టర్ ముగింపు కోసం ఎదురు చూస్తున్నాము. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఫలితం తేలుతుంది. ఇంగ్లండ్ జట్టు కూడా డ్రా కోసం కాకుండా విజయం కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని వారు బహిరంగంగానే వెల్లడించారు. కాబట్టి వారు దూకుడుగా ఆడితే మాకు 10 వికెట్లు తీసేందుకు అవకాశం లభిస్తోంది. నాలుగో రోజు ఆటలో పిచ్ బ్యాటింగ్కు అంత అనుకూలంగా లేదు. బంతి కాస్త ఆగి వచ్చింది. రేపు(మంగళవారం) పిచ్ మరింత ట్రిక్కీగా మారవచ్చు. దీంతో ఇంగ్లండ్ను ఆలౌట్ చేసేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి" అని నాలుగో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
ఎప్పుడో నా కెరీర్ ముగిసిందన్నారు.. కానీ పదేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్ల హాల్తో మెరిశాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆటలో మరో రెండు వికెట్లను సాధించాడు.దీంతో విదేశీగడ్డపై టెస్టుల్లో అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్గా కపిల్దేవ్ సరసన బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన బుమ్రా.. తన ఫిట్నెస్పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటరిచ్చాడు. తన శరీరం సహకరించేంతవరకు భారత్ తరపున క్రికెట్ ఆడాలని అనుకుంటున్నానని అతడు తెలిపాడు.కాగా గత క్యాలెండర్ ఈయర్లో భారత్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన బౌలర్గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన పడ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ జస్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్కు వచ్చినప్పటికి వర్క్లోడ్, ఫిట్నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్లు ఆడుతాడన్న గ్యారెంటీ లేదు.రిపోర్టర్: గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?బమ్రా: "నా ఫిట్నెస్పై వచ్చే నెగిటివ్ కామెంట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్నెస్పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు -
స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు.. ఎవరీ యష్ వగాడియా?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ సైతం తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు చేసి టీమిండియాకు ధీటైన సమాధానం ఇచ్చింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. గిల్ సేన ప్రస్తుతం 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలంటే నాలుగో రోజు మొత్తం భారత్ బ్యాటింగ్ చేయాల్సిందే. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.స్టోక్స్ స్ధానంలో భారత సంతతి ఆటగాడు..ఇక నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత రెండో ఇన్నింగ్స్ సందర్బంగా ఇంగ్లండ్ స్క్వాడ్లో లేని ఓ ఆటగాడు ఫీల్డింగ్కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సబ్స్ట్యూట్గా యార్క్షైర్ క్లబ్ ఆటగాడు యష్ వగాడియా మైదానంలో అడుగుపెట్టాడు.భారత సంతతికి చెందిన 21 ఏళ్ల వగాడియా రెండు ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు. అయితే జట్టులో లేని ఆటగాడు ఫీల్డింగ్కు రావడమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాగా లీడ్స్ టెస్టు కోసం వగాడియాతో పాటు జవాద్ అక్తర్, నోహ్ కెల్లీను 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అంపైర్ అనుమతి తీసుకుని వగాడియా సబ్స్ట్యూట్గా బరిలోకి దిగాడు.ఎవరీ వగాడియా?21 ఏళ్ల యష్ వగాడియా.. దేశవాళీ క్రికెట్లో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. యష్కు బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే సత్తా కూడా ఉంది. ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. వగాడియా పదకొండేళ్ల వయసులోనే యార్క్షైర్ క్రికెట్ ఆకాడమీలో చేరాడు.అకాడమీ, అండర్-18 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దీంతో తొలిసారి 2023 సంవత్సరంలో యార్క్షైర్ క్రికెట్ క్లబ్ ప్రొఫెషనల్ కాంట్రాక్టును పొందాడు. వగాడియా 2024లో వార్విక్షైర్పై తన లిస్ట్-ఎ అరంగేట్రం చేశాడు. తన కెరీర్లో ఇప్పటివరకు రెండు లిస్ట్-ఎ మ్యాచ్లు ఆడిన వగాడియా.. 22 పరుగులు చేశాడు.ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయనప్పటికీ, అతను యార్క్షైర్ సెకండ్ ఎలెవన్ మ్యాచ్లలో క్రమం తప్పకుండా ఆడుతాడు. కాగా వగాడియాకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వగాడియా మాత్రం ఇంగ్లండ్లోని న్యూకాజిల్లో జన్మించాడు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్ -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్
టెస్టు క్రికెట్లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు ఇది 14వ ఫైవ్ వికెట్ హాల్ వికెట్ కావడం గమనార్హం. ఈ క్రమంలో బుమ్ బుమ్రా పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..👉టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక సార్లు అత్యధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భారత బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్లో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు బుమ్రా ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది మూడోసారి.2018లో ఇంగ్లండ్ పర్యటనలో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. 2021లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై రెండో సారి ఐదు వికెట్ల హాల్ను నమోదు చేశాడు. ఇప్పుడు తాజా పర్యటనలో ముచ్చటగా మూడో సారి ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజ క్రికెటర్లు లాలా అమర్ నాథ్, కపిల్ దేవ్, బి చంద్రశేఖర్, భువనేశ్వర్ కుమార్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్ మరియు సురేంద్రనాథ్ల పేరిట ఉండేది.ఈ లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో రెండు సార్లు ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించారు.లీడ్స్ టెస్ట్ కు ముందు బుమ్రా కూడా రెండు ఫైవ్ వికెట్ల హాల్తో ఈ జాబితాలో ఉండేవాడు. కానీ తాజా మ్యాచ్తో వీరిందని బుమ్రా అధిగమించాడు.👉అదేవిధంగా విదేశీ గడ్డపై అత్యధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా కపిల్ దేవ్ రికార్డును బుమ్రా సమం చేశాడు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.👉సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్గా నిలిచాడు. విదేశాల్లో అత్యధిక ఫైవ్ వికెట్స్ హాల్ సాధించిన ప్లేయర్లు.. 👉జస్ప్రీత్ బుమ్రా - 12👉కపిల్ దేవ్ - 12👉అనిల్ కుంబ్లే - 10👉ఇషాంత్ శర్మ - 9👉ఆర్ అశ్విన్ - 8సేనా దేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసియా బౌలర్లు👉జస్ప్రీత్ బుమ్రా - 31 మ్యాచ్ల్లో 150 👉వసీం అక్రమ్ - 32 మ్యాచ్ల్లో 146👉అనిల్ కుంబ్లే - 35 మ్యాచ్ల్లో 141👉ఇషాంత్ శర్మ - 40 మ్యాచ్ల్లో 127👉జహీర్ ఖాన్ - 30 మ్యాచ్ల్లో 119నువ్వా నేనా..భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(47), శుబ్మన్ గిల్(6) ఉన్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది.చదవండి: రోహిత్... ‘ప్రేమ కథా చిత్రం’𝘼 𝙢𝙖𝙨𝙩𝙚𝙧 𝙖𝙩 𝙬𝙤𝙧𝙠 🙌@Jaspritbumrah93 crafts magic with the ball once again, taking a stunning 5/83,his 14th Test 5-fer.WATCH HIS BRILLIANT PERFORMANCE 👉🏻 https://t.co/kg96V4NpFH#ENGvIND | 1st Test, Day 4 | MON, 23rd JUNE, 2:30 PM on JioHotstar pic.twitter.com/y1QUUMAVuC— Star Sports (@StarSportsIndia) June 22, 2025 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ సూపర్ స్టార్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్పటివరకు ఇంగ్లండ్లో భారత్తో జరిగిన టెస్టుల్లో 1589 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గడ్డపై సచిన్ 1575 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో రూట్ తన మార్క్ చూపించలేకపోయాడు. కేవలం 28 పరుగులు మాత్రమే చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.ఇంగ్లండ్లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు..👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*👉సచిన్ టెండూల్కర్ (భారత్) – 1575👉రాహుల్ ద్రవిడ్ (భారత్) – 1376👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196👉సునీల్ గవాస్కర్ (భారత్) – 1152👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్..తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్ డకెట్ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్,శుబ్మన్ గిల్, యశస్వి జైశ్వాల్ సెంచరీలతో మెరిశారు.చదవండి: IND vs ENG: జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత.. ఫస్ట్ ఓవర్ కింగ్గా -
ఎనిమిదేళ్ల తర్వాత ఛాన్స్.. కట్ చేస్తే! రీఎంట్రీ మ్యాచ్లో డకౌట్
టీమిండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ తన రీ ఎంట్రీలో తీవ్రనిరాశపరిచాడు. ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన.. కరుణ్ నాయర్కు తన లభించిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకోలేకపోయాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో కరుణ్ డకౌటయ్యాడు.మొదటి ఇన్నింగ్స్లో ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన నాయర్ నాలుగు బంతులు ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకోవడంతో నాయర్ డకౌట్ అవ్వాల్సి వచ్చింది. అంతకుముందు అరంగేట్ర ఆటగాడు సాయిసుదర్శన్ కూడా తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.టీమిండియా@471ఇక మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్ను ముగించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుబ్మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
గిల్, జైశ్వాల్ సెంచరీలు.. తొలి రోజు భారత్దే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు సత్తాచాటారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(101), కెప్టెన్ శుబ్మన్ గిల్(127 నాటౌట్) సెంచరీలతో మెరిశారు. ప్రస్తుతం క్రీజులో గిల్తో పాటు రిషబ్ పంత్(65) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. కార్స్ ఓ వికెట్ సాధించాడు. -
IND vs ENG: పాపం నితీశ్ కుమార్.. అతడి కోసం పక్కన పెట్టేశారు?
లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేస్ బౌలర్లకు పిచ్ అనుకూలించే అవకాశమున్నందన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్తో యువ ఆటగాడు సాయిసుదర్శన్ భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి మళ్లీ టీమిండియా తరపున ఆడుతున్నాడు.నితీశ్పై వేటు.. శార్ధూల్కు చోటుఅయితే ఈ మ్యాచ్ ఆడేందుకు భారత తుది జట్టులో స్టార్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్దానంలో వెటరన్ ఆల్రౌండర్ శార్ధూల్ ఠాకూర్కు టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేసిన నితీశ్ను ఎందుకు పక్కన పెట్టారన్న ప్రశ్న అందరిలోనూ మెదలుతోంది.కాగా నితీశ్ రెడ్డి బదులుగా శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. శార్ధూల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో కూడా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా శార్ధూల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రవీంద్ర జడేజాకు ఏడో స్ధానంలో టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. ఒకవేళ జట్టులో నితీశ్ ఉన్నా, అతడి బ్యాటింగ్ పొజిషన్ సెట్ చేయడం కాస్త కష్టమయ్యేది. అందుకే నితీష్కు బదులుగా శార్ధూల్ వైపు టీమిండియా మొగ్గు చూపింది. గతంలో ఇంగ్లండ్పై గడ్డపై ఆడిన అనుభవం కూడా ఈ ముంబై క్రికెటర్కు ఉంది. ఈ మ్యాచ్లో శార్ధూల్ రాణించకపోతే రెండో టెస్టుకు నితీష్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: అచ్చం నాన్నలాగే!.. కుమారుడితో రోహిత్- రితికా.. వీడియో వైరల్ -
బిజినెస్ రంగంలోకి సిరాజ్.. బంజారా హిల్స్లో లగ్జరీ రెస్టారెంట్
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని బంజారా హిల్స్(రోడ్ నంబర్ 3)లో 'జోహార్ఫా' పేరిట సరికొత్త లగ్జరీ రెస్టారెంట్ను సిరాజ్ ప్రారంభించనున్నాడు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. కస్టమర్ల కోసం పర్షియన్, అరేబియన్, మొఘలాయ్, చైనీల్ లాంటి రకరకాల వంటకాలు తమ రెస్టారెంట్లో అందించనున్నట్లు తెలిపాడు.ఈ ఫుడ్ బిజినెస్లో అతడి సోదరుడు భాగస్వామి ఉన్నట్లు సిరాజ్ మియా పేర్కొన్నాడు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభ తేదీ ఎప్పుడో ఇంకా సిరాజ్ వెల్లడించలేదు. కాగా భారత క్రికెటర్లు ఫుడ్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇదేమి తొలిసారి కాదు. ఇప్పటికే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి వన్ 8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. బెంగళూరు, ముంబై, పుణే, కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్లో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. కోహ్లితో పాటు రవీంద్ర జడేజా, జహీర్ ఖాన్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు సైతం ఫుడ్బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఇక సిరాజ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దమవుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి భారత బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.చదవండి: నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్ -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించగా.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బావుమా తిరిగి మళ్లీ వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు. ఇక చారిత్రత్మక విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్లో 282 పరుగుల టార్గెట్ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్పై 282 పరుగుల టార్గెట్ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్పై 344 పరుగుల టార్గెట్ను విండీస్ చేధించింది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా -
నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో ఆసీస్-సౌతాఫ్రికా ఆటగాళ్లు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్ను ధరించారు.ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్లో షేర్ చేసింది.కాగా అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(44 బ్యాటింగ్) ఆసీస్ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.The sports fraternity observes a solemn moment of silence in memory of the lives lost in the tragic Ahmedabad plane crash, standing in deep solidarity with the grieving families during this difficult time. pic.twitter.com/nTXfRnyksP— Star Sports (@StarSportsIndia) June 13, 2025చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్కు తిరిగొచ్చిన గౌతం గంభీర్ -
భారత పర్యటనకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు.. ఎప్పుడంటే?
న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానునున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026 సన్నహాకాల్లో భాగంగా ఈ టూర్ను కివీస్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఆతిథ్య టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఆఖరిలో కివీస్ తమ స్వదేశంలో విండీస్తో ఆల్ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే బ్లాక్ క్యాప్స్ జట్టు భారత్కు వచ్చే అవకాశముంది. కాగా టీ20 ప్రపంచకప్-2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ సన్నాహాల్లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు సైతం ఈ ఏడాది ఆఖరిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లు ఆడనుంది. న్యూజిలాండ్ చివరగా వైట్బాల్ సిరీస్లు ఆడేందుకు 2023లో భారత్ పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో బ్లాక్ క్యాప్స్ టీమ్ మూడు వన్డేల సిరీస్లో వైట్ వాష్ కాగా.. టీ20 సిరీస్ను 2-1 తేడాతో భారత్కు కోల్పోయింది.ఆ తర్వాత ఏడాది మాత్రం టీమిండియా జరిగిన రెడ్బాల్ సిరీస్లో మాత్రం న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు టెస్టుల సిరీస్లో 3-0 తేడాతో టీమిండియాను కివీస్ చిత్తు చేసింది. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో మాత్రం న్యూజిలాండ్ను భారత్ మట్టికరిపించింది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టు ఇదే! జడేజాకు నో ఛాన్స్? -
భారత కెప్టెన్ ఒక సూపర్ స్టార్.. కానీ అతడిని మిస్ అవుతారు: ఓలీ పోప్
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ ఓలీ పోప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్లో మైదానంలో ఎంతో యాక్టివ్గా ఉండే విరాట్ కోహ్లి సేవలను భారత్ మిస్ అవుతుందని పోప్ అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ప్రస్తుత భారత జట్టులో యంగ్ టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారని అతడు కొనియాడాడు.ఇంగ్లండ్ టూర్కు ముందు కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు వరకైనా కొనసాగాలని విరాట్ను సెలక్టర్లు కోరినప్పటికి అతడు మాత్రం తన మనసును మర్చుకోలేదు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెడ్ బాల్ క్రికెట్కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. దీంతో టీమిండియా టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలిసారి భారత టెస్టు జట్టులోకి చోటు దక్కగా.. కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్పై గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు.. ప్రాక్టీస్లో మునిగితేలుతోంది. ఇంగ్లండ్ వంటి కఠిన పరిస్థితుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలోని యంగ్ టీమిండియా ఎలా రాణిస్తుందో అందరూ ఆతృతగా ఎదురు చూస్తోంది.ఈ నేపథ్యంలో ఓలీ పోప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇది యువ భారత జట్టు. కానీ ఈ జట్టులో అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చాలా మందికి కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ టాలెంట్ కోసం మనందరికీ తెలుసు.అతడొక సూపర్ స్టార్. అయితే స్లిప్లో నిలబడి ప్రత్యర్ధి బ్యాటర్లను ఏకగ్రాతను కోల్పోయేలా చేసే విరాట్ కోహ్లి సేవలను మాత్రం భారత్ కోల్పోతుంది. అయినప్పటికీ భారత జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. వారిని ఎదుర్కొనేందుకు మా ఆటగాళ్లు కూడా సిద్దంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం -
టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనం
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి మరో ఎనిమిది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. అయితే తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.భారత్తో తొలి టెస్టు కోసం 19 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఎడ్జీ జాక్స్కు ఇంగ్లండ్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. తొలి టెస్టుకు ఎంపికైన మరో యువ పేసర్ జోష్ టాంగ్ గాయపడడంతో ప్రత్యామ్నయంగా జాక్స్ను జట్టులోకి తీసుకున్నారు. ఇండియా-ఎతో జరిగిన రెండు మ్యాచ్ల అనాధికారిక సిరీస్లో ఇంగ్లండ్ లయన్స్ తరపున జాక్స్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.నాలుగు ఇన్నింగ్స్లలో 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ను జాక్స్ ఔట్ చేశాడు. కాగా జాక్స్ తన కెరీర్లో ఇప్పటివరకు కేవలం రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అవికూడా ఇండియా-ఎపై ఆడినవే.వోక్స్పైనే భారం..కాగా తొలి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కన్పిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగా మార్క్వుడ్, ఓలీ స్టోన్ ఈ సిరీస్కు దూరం కాగా.. అటిన్కిసన్, ఆర్చర్ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.ఇప్పుడు ఈ జాబితాలోకి టంగ్ కూడా చేరడం ఇంగ్లీష్ జట్టు మెనెజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్ బౌలింగ్ భారాన్ని క్రిస్ వోక్స్ మోయనున్నాడు. వోక్స్, కార్స్, సామ్ కుక్ ఫ్రంట్లైన్ సీమర్లగా ఉన్నారు.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టుబెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), జోష్ టంగ్, క్రిస్ వోక్స్, జాక్చదవండి: WTC Final: కోహ్లి ఆల్టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్ -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత క్రికెట్ జట్టు అన్నివిధాల సన్నదమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా.. లార్డ్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో భారత జట్టు కొత్త టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు.అదేవిధంగా సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కగా.. వెటరన్ కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్తో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఆరంభం కానుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. మొదటి టెస్టుకు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను పలు అరుదైన రికార్డు ఊరిస్తోంది.అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా..ఈ మ్యాచ్లో బుమ్రా రెండు వికెట్లు పడగొడితే సెనా(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ పేరిట ఉంది.సెనా దేశాల్లో అక్రమ్ 32 టెస్టులు ఆడి 146 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా ఇప్పటివరకు 31 టెస్టులు ఆడి 145 వికెట్లు సాధించాడు. కాగా ఈ ఐదు టెస్టుల సిరీస్లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. వర్క్లోడ్ మెనెజ్మెంట్ కారణంగా మిగిలిన రెండు మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ప్లేయర్కు గాయం
ఇంగ్లండ్తో తొలి టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో భారత జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయపడినట్లు తెలుస్తోంది. రెవ్స్పోర్ట్స్ ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బంతి అతడి ఎడమ చేతికి బలంగా తాకినట్లు సమాచారం. తీవ్రమైన నొప్పితో పంత్ విల్లవిల్లాడని, ఫిజియో మైదానంలోకి వచ్చి ఐస్ ప్యాక్ పెట్టి చికిత్స అందించాడని సదరు వెబ్సైట్ పేర్కొంది.ఆ తర్వాత ఫిజియో పంత్ తన చేతికి బ్యాండేజ్ వేసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పంత్ ప్రాక్టీస్కు దూరంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పంత్ గాయంపై బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా పంత్ గాయం తీవ్రమైనది అయితే భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఎందుకంటే భారత టెస్టు జట్టులో పంత్ కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు కొత్త వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఈ డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ చేపట్టాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది.అంతకంటే ముందు ఈ నెల 13న ఇండియా-ఎ జట్టుతో భారత సీనియర్ జట్టు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ ఆడనుంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది.ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) చదవండి: ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక నియామకం -
IND vs ENG: టీమిండియా ప్రాక్టీస్ షురూ..
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం మొదలైంది. విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు వంటి దిగ్గజాలు లేకుండా తొలి టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శుబ్మన్ గిల్ సారథ్యంలోని యువ భారత జట్టుకు ఇంగ్లండ్ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.రోహిత్ వారసుడిగా బాధ్యతలు చేపట్టిన శుబ్మన్ గిల్.. జట్టును ఎలా నడిపిస్తాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్లను భారత్ కోల్పోవడంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పైన కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ క్రమంలో గిల్-గౌతీ కాంబనేషన్లో భారత జట్టు ఎలా రాణిస్తుందో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.టీమిండియా ప్రాక్టీస్ షూరూ..ఇక ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఆదివారం(జూన్ 8)తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్లో షేర్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ గిల్ రవీంద్ర జడేజా, అర్ష్దీప్, సిరాజ్ కసరత్తలు చేస్తున్నట్లు కన్పించింది.కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లె రౌక్స్ కూడా భారత జట్టులో చేరారు. రాజీనామా చేసిన సోహమ్ దేశాయ్ స్ధానంలో అడ్రియన్ బాధ్యతలు చేపట్టాడు. ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి టెస్టు జూన్ 20 నుంచి 24 వరకు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్𝗣𝗿𝗲𝗽 𝗕𝗲𝗴𝗶𝗻𝘀 ✅First sight of #TeamIndia getting into the groove in England 😎#ENGvIND pic.twitter.com/TZdhAil9wV— BCCI (@BCCI) June 8, 2025 -
India A vs England Lions: భారత్-ఎ బౌలర్లు విఫలం..
నార్తంప్టన్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు బౌలర్లు తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు భారత-ఎ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ లయన్స్ 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.క్రీజులో జోర్డాన్ కాక్స్(31),జేమ్స్ రెవ్(0) ఉన్నారు. టాపర్డర్ బ్యాటర్లు టామ్ హైన్స్(54), ఎమిలియో గే(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఇంకా 127 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఇప్పటివరకు కాంబోజ్, కోటియన్, దేశ్పాండే తలా వికెట్ సాధించారు.ఇక అంతకుముందు భారత్-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. 319/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా 29 పరుగులు చేసి ఇన్నింగ్స్ను ముగించింది. భారత్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్(116) టాప్ స్కోరర్గా నిలవగా..ధ్రువ్ జురేల్ (87 బంతుల్లో 52; 7 ఫోర్లు), కరుణ్ నాయర్ (71 బంతుల్లో 40; 4 ఫోర్లు), ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించారు.ఇక ఇంగ్లండ్ బౌలర్లలో సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ మూడు వికెట్లు పడగొట్టగా..జోష్ టంగ్, జార్జ్ హిల్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి అనాధికారిక టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.చదవండి: ఆర్సీబీలోకి బుమ్రా, సూర్యకుమార్, పంత్: విజయ్ మాల్యా డ్రీమ్ టీమ్ -
'అతడొక సూపర్ స్టార్.. గిల్ స్దానంలో బ్యాటింగ్కు పంపండి'
తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగే తొలి టెస్టులో సుదర్శన్ డెబ్యూ చేయడం దాదాపు ఖాయమైంది. భారత జట్టుతో పాటు లండన్కు చేరుకున్న సుదర్శన్ తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. వన్డే, టీ20ల్లో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్న సుదర్శన్.. ఇప్పుడు వైట్బాల్ జెర్సీలో భారత తరపున సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుదర్శన్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖల్ క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక అద్బుతమైన ఆటగాడని, మూడో స్ధానంలో బ్యాటింగ్కు పంపాలని క్లార్క్ సూచించాడు.కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ నాలుగో స్ధానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశముంది. దీంతో గిల్ స్ధానంలో సుదర్శన్ బ్యాటింగ్కు రావాలని క్లార్క్తో పాటు పలు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు."సాయిసుదర్శన్ ఒక సూపర్ స్టార్. అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. అతడు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా షాట్లు ఆడగలడు. టెస్టు క్రికెట్లో అతడు నంబర్ త్రీ స్ధానానికి సరిగ్గా సరిపోతాడు. అదే వన్డే, టీ20ల్లో అయితే ఓపెనర్గా అతడు ఇన్నింగ్స్ను ప్రారంభించాలని భావిస్తున్నాను. సుదర్శన్ భారత టెస్టు సెటప్లో భాగంగా ఉన్నాడు. కాబట్టి అతడికి ఇంగ్లండ్పై గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం లభిస్తుంది" అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్లో క్లార్క్ పేర్కొన్నాడు. -
రోహిత్ శర్మకు షాక్..! టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్?
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తుది మెట్టుపై బోల్తా పడినప్పటికి.. ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీతో అందరిని ఆకట్టుకున్నాడు. తన అద్బుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ను పదేళ్ల తర్వాత ఫైనల్కు చేర్చాడు. మరోవైపు వ్యక్తిగత ప్రదర్శన పరంగా అయ్యర్ దుమ్ములేపాడు.దీంతో అయ్యర్కు అంతర్జాతీయ క్రికెట్లో రివార్డు లభించినట్లు తెలుస్తోంది. ఇండియన్స్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. టీమిండియా వైట్బాల్ కెప్టెన్సీ రేసులో శ్రేయస్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా గత కొంతకాలంగా కేవలం వన్డేలకే పరిమితైన అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్సీ రేసులో శ్రేయస్..శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. కానీ ఈ ఏడాది ఐపీఎల్లో తన అద్బుత ప్రదర్శన తర్వాత అయ్యర్ టీ20 సెటప్లోకి కూడా వచ్చే అవకాశముంది. అంతేకాకుండా అయ్యర్ ఇప్పుడు వైట్కెప్టెన్సీ రేసులో కూడా ఉన్నాడు అని ఓ బీసీసీఐ అధికారి ది ఇండియన్స్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం భారత జట్టు టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. రోహిత్ శర్మ వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఇటీవలే నియమితుడయ్యాడు. అయితే మూడు ఫార్మాట్లకు వెర్వేరు కెప్టెన్లను నియమించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ త్వరలోనే వన్డేలకు సైతం వీడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించికపోయినా కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకునే అవకాశముంది. ఈ క్రమంలో అయ్యర్కు వన్డే పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.చదవండి: ENG vs WI: జోస్ బట్లర్ విధ్వంసం.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్ -
కోహ్లి, రోహిత్ ఉన్నా లేకున్నా ఒకేలా ఉంటుంది: శుబ్మన్ గిల్
టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి సవాల్ను ఎదుర్కొనేందుకు శుబ్మన్ గిల్ సిద్దమయ్యాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేని భారత జట్టును గిల్ ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇంగ్లండ్కు బయలుదేరే ముందు బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శుబ్మన్ గిల్ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్లపై కూడా గిల్ మాట్లాడాడు."సాధారణంగా ప్రతీ టూర్లోనూ ఒత్తిడి ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం మాకు నిజంగా గట్టి ఎదురుదెబ్చ అని చెప్పాలి. వారిద్దరూ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు. భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. వారి స్ధానాలను భర్తీ చేయడం చాలా కష్టం. అయితే రోహిత్, కోహ్లి ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అందులో ఎటువంటి మార్పు ఉండదు. మా బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా మేము ఖారారు చేయలేదు. అందుకు మాకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. లండన్లో 10 రోజుల ప్రాక్టీస్ క్యాంపును నిర్వహిస్తాము. ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లు ఆడతాము. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ను నిర్ణయిస్తాము అని గిల్ ప్రెస్కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్తోనే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్కు తెరలేవనుంది. ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్కు కొత్త పేరు ఖరారు -
IND Vs ENG: ఇంగ్లండ్కు బయలు దేరిన టీమిండియా.. 14 రోజుల ముందే
ఇంగ్లండ్-భారత మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి హెడ్డింగ్లీ వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శుక్రవారం ఇంగ్లండ్కు పయనమైంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. జట్టు తో పాటు హెడ్కోచ్ గౌతం గంభీర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు 14 రోజుల ముందే అక్కడకు గిల్ సేన చేరుకోనుంది. జూన్ 13 నుంచి 16 వరకు బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎతో సీనియర్ భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ప్రధాన సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇంగ్లండ్కు పయనమవ్వకముందు కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్, గౌతం గంభీర్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నారు.ఈ సందర్బంగా పలు ప్రశ్నలకు వీరిద్దరూ సమాధనమిచ్చారు. ఈ సిరీస్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. అదేవిధంగా భారత బ్యాటింగ్ ఆర్డర్ను ఇంకా ఖారారు చేయలేదని, తమకు ఇంకా రెండు వారాల సమయం ఉందని గిల్ పేర్కొన్నాడు.కాగా ఈ సిరీస్కు ముందు స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి స్ధానాలను ఎవరు భర్తీ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. విరాట్ కోహ్లి స్ధానంలో కరుణ్ నాయర్ బ్యాటింగ్కు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న అనాధికారిక టెస్టు సిరీస్లో దుమ్ములేపుతున్నాడు.తొలి అనాధికారిక టెస్టులో నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
కరుణ్ డబుల్ సెంచరీ.. తొలి ఇన్నింగ్స్లో భారత్-ఎ భారీ స్కోర్
కాంటర్బరీ వేదికగా ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శన కనబర్చి ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన కరుణ్ నాయర్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. కరుణ్ నాయర్ 281 బంతుల్లో 26 ఫోర్లు, ఒక సిక్సర్తో 204 పరుగులు చేశాడు. ఓవర్నైట్ స్కోరు 409/3తో శనివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ చివరకు 125.1 ఓవర్లలో 557 పరుగులకు ఆలౌటైంది.వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ (120 బంతుల్లో 94; 11 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (7) విఫలమయ్యాడు. శార్దుల్ ఠాకూర్ (27), హర్ష్ దూబే (32), అన్షుల్ కంబోజ్ (23) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో జోష్ హాల్, జమాన్ అక్తర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ లయన్స్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టామ్ హైన్స్ (147 బంతుల్లో 103 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... మ్యాక్స్ హోల్డెన్ (61 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఎమిలియో (46) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్లో సత్తాచాటిన భారత ‘ఎ’ ఆటగాళ్లు... బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఇంగ్లండ్ లయన్స్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే చెరో వికెట్ పడగొట్టగా... ముకేశ్ కుమార్, హర్షిత్ రాణా భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయిన నితీశ్ రెడ్డి బౌలింగ్లో 3 ఓవర్లే వేసి 27 పరుగులు సమరి్పంచుకున్నాడు. నాలుగు రోజుల ఈ పోరులో... చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్ లయన్స్ జట్టు భారత్ ‘ఎ’ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. టామ్ హైన్స్, హోల్డన్ క్రీజులో ఉన్నారు. మూడో రోజు భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం కనబరుస్తారో చూడాలి.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్ -
ఇంగ్లండ్ టూర్.. టీమిండియా మేనేజర్గా యుధ్వీర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు మేనేజర్గా యుధ్వీర్ సింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 20 నుంచి టీమిండియా ఇంగ్లండ్తో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ టూర్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యు«ద్వీర్ను మేనేజర్గా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యూపీసీఏ) కార్యదర్శిగా పనిచేస్తున్న యుధ్వీర్... గతంలో యూపీసీఏ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. క్రికెట్ వ్యవహారాల్లో అతడికి విశేష అనుభవం ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ప్రకటించగా... యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గిల్ సారథ్యంలోని యువ జట్టు ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ను భారత జట్టు ఇదే సిరీస్తో ప్రారంభించనుంది.చదవండి: పది మందికి రూ. 1 కోటికి పైగా... -
వరల్డ్ బౌలింగ్ లీగ్లో కోహ్లి పెట్టుబడి..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి... వరల్డ్ బౌలింగ్ లీగ్ (డబ్ల్యూబీఎల్)లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన కోహ్లి... డబ్ల్యూబీఎల్లో వ్యూహాత్మక పెట్టుబడిదారుడిగా మారాడు. డబ్ల్యూబీఎల్లో భాగంగా ఇటీవల తొలి జట్టు ఓఎమ్జీ ఫ్రాంచైజీని ప్రకటించింది.ఇప్పుడు తాజాగా క్రికెట్ సూపర్ స్టార్ కోహ్లి భాగస్వామ్యాన్ని బహిర్గతం చేసింది. ‘నేను 11 ఏళ్ల వయసులో బౌలింగ్ చేయడం ప్రారంభించా. 12 ఏళ్ల వయసు నుంచి బంతిని తిప్పేందుకు ప్రయతి్నస్తున్నా. ఈ లీగ్లో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. వ్యాపారాభివృద్ధి కోణంలోనూ ఇది మంచి అడుగు అనుకుంటున్నా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడలను ప్రోత్సహించాల్సిందే. ఈ1 సిరీస్లో మా జట్టు పురోగతి చూస్తే ముచ్చటేస్తోంది. డబ్ల్యూబీఎల్ వ్యూహాత్మక పెట్టుబడి దారుడిగా, సహ యజమానిగా ఉండడం ఉత్సాహాన్నిస్తోంది’అని విరాట్ కోహ్లి వెల్లడించాడు. -
రాహుల్, అభిమన్యు, సుదర్శన్.. టీమిండియా ఓపెనర్ ఎవరు?
భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. టీమిండియా కెప్టెన్గా అంతా ఊహించినట్లే శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్ను జైశ్వాల్తో కలిసి ఎవరు ఆరభిస్తారన్న చర్చ నడుస్తోంది. భారత ఓపెనర్ స్దానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయిసుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమాన్యు ఈశ్వరన్. కేఎల్ రాహుల్ వైపే మొగ్గు..?మిగితా ఇద్దరితో పోలిస్తే రాహుల్కే భారత ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ప్లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్గాను, మిడిలార్డర్లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్బాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనుభవం రాహుల్కు ఉంది. టెస్టుల్లో అతడికి ఓపెనర్గా రెండు సెంచరీలు ఉన్నాయి. 2018-21 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. 18 ఇన్నింగ్స్లలో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్గా 83 ఇన్నింగ్స్లలో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ వంటి బౌన్సీ కండిషన్స్లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్కు ఉంది. దీంతో రాహుల్-జైశ్వాల్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి.సాయిసుదర్శన్ మరో అప్షన్..!ఒక వేళ కేఎల్ రాహల్ను మిడిలార్డర్లో ఆడించాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తే.. యువ ఆటగాడు సాయి సుదర్శన్ను ఓపెనర్గా పంపే అవకాశముంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్లోనూ కాదు రెడ్ బాల్ క్రికెట్లో కూడా సుదర్శన్ను తనను తాను నిరూపించుకున్నాడు.ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-25 కాలంలో 49 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. కౌంటీ ఛాంపియన్షిప్లో సర్రే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీల్లో 8 ఇన్నింగ్స్లలో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు.అభిమన్యు ఈశ్వరన్..భారత జట్టు మెనెజ్మెంట్కు ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరో అప్షన్ ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్న ఈశ్వరన్.. ఇప్పటివరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టు ఎంపికైనా.. ప్లేయింగ్ ఎలెవన్లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లండ్ టూర్లో అతడు అరంగేట్రం చేస్తే.. కచ్చితంగా జైశ్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అభిమన్యు అనే చెప్పాలి. ఎందుకంటే అతడికి అపారమైన అనభవం ఉంది. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈశ్వరన్.. 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్కు ముందు ఇంగ్లండ్ లయన్స్తో జరగనున్న టెస్టు సిరీస్లో ఇండియా-ఎ టీమ్ కెప్టెన్గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్లో అభిమన్యు రాణిస్తే.. ప్రధాన సిరీస్లో కూడా అడే అవకాశముంది.చదవండి: Shreyas Iyer: కెప్టెన్ అవుతాడన్నారు.. కట్ చేస్తే! ఇప్పుడు టీమ్లోనే నో ఛాన్స్ -
ఇది కదా సక్సెస్ అంటే.. 25 ఏళ్లకే టీమిండియా కెప్టెన్గా
భారత టెస్టు క్రికెట్ జట్టుకు కొత్త నాయకుడొచ్చాడు. రోహిత్ శర్మ వారసుడు ఎవరో తేలిపోయింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే గిల్కే భారత జట్టు పగ్గాలను బీసీసీఐ అప్పగించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది.దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ పంజాబీ క్రికెటర్ను కెప్టెన్గా ఎంపిక చేశామని ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్పేర్కొన్నాడు.ఇక అరంగేట్రం చేసిన ఐదేళ్లలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగిన గిల్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది కదా సక్సెస్ అంటూ గిల్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. గిల్ 2020లో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు.25 ఏళ్ల వయస్సులోనే?భారత టెస్టు జట్టుకు 17 ఏళ్ల తర్వాత యువ కెప్టెన్ వచ్చాడు. 2008లో దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుంచి భారత టెస్టు జట్టు పగ్గాలను ఎంఎస్ ధోని చేపట్టాడు. అప్పటికి ధోని వయస్సు 27 ఏళ్లు. ఆ తర్వాత 8 ఏళ్ల పాటు భారత జట్టును మిస్టర్ కూల్ నడిపించాడు. అనంతరం 2014 డిసెంబరులో ధోనీ నుంచి కోహ్లికి టెస్టు కెప్టెన్సీ దక్కింది. అప్పటికి విరాట్కు 27 ఏళ్లు. కోహ్లి సరిగ్గా ఏడేళ్ల పాటు రెడ్బాల్ ఫార్మాట్లో భారత జట్టుకు సారథ్యం వహించాడు. కోహ్లి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. 2021 ఆఖరిలో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో అతడి వారుసుడిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యేటప్పటికి అతడి వయస్సు 34 ఏళ్లు. ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో శుబ్మన్ గిల్ 25 ఏళ్ల వయస్సులోనే కొత్త టెస్టు కెప్టెన్గా నియిమితుడయ్యాడు. దీంతో దిగ్గజ కెప్టెన్లు ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల కంటే అతి తక్కువ వయస్సులోనే టీమిండియా నాయకుడిగా ఎంపికై గిల్ చరిత్ర సష్టించాడు.ఓవరాల్గా భారత టెస్టు జట్టు కెప్టెన్గా ఎంపికైన ఐదవ అతి పిన్న వయస్కుడిగా గిల్ నిలిచాడు. గిల్ ప్రస్తుత వయస్సు 25 సంవత్సరాల 285 రోజులు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల 77 రోజులు) అగ్రస్దానంలో ఉన్నాడు.👉గిల్ ఇప్పటివరకు 32 టెస్టులు ఆడి 35.06 సగటుతో 1893 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 7 హాఫ్ సెంచరీలు, ఐదు శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో అతి పిన్న వయస్కులైన భారత కెప్టెన్లు వీరే..మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21 సంవత్సరాల, 77 రోజులు)సచిన్ టెండూల్కర్ -(23 సంవత్సరాల, 169 రోజులు)కపిల్ దేవ్ (24 సంవత్సరాల, 48 రోజులు)రవి శాస్త్రి (25 సంవత్సరాల, 229 రోజులు)శుబ్మాన్ గిల్ (25 సంవత్సరాల, 285 రోజులు)చదవండి: ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ -
ఇంగ్లండ్ టూర్.. అందుకే షమీని ఎంపిక చేయలేదు: అగార్కర్ క్లారిటీ
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు 18 సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ నియమితుడయ్యాడు. సాయిసుదర్శన్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లు తొలి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోగా.. కరుణ్ నాయర్, శార్థూల్ ఠాకూర్ వంటి వెటరన్ ప్లేయర్లు తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ షమీకి చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. టెస్టు క్రికెట్లో అపారమైన అనుభవం ఉన్న షమీని సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టరాన్న ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్కు షమీని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు."షమీ గత వారం రోజులగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేయించుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్ మొత్తం ఆడే సామర్థ్యం అతనికి ఇంకా రాలేదు. సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేస్తే షమీపై వర్క్ లోడ్ పడుతోంది. మా వైద్య బృందం సూచన మేరకు అతడిని ఈ సిరీస్కు పక్కన పెట్టాల్సి వచ్చింది. షమీ ఈ సిరీస్కు ఫిట్గా ఉంటాడని మేము కూడా ఆశించాము. కానీ దురదృష్టవశాత్తూ అతడి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. ఫిట్నెస్ లేని ప్లేయర్ ఎంపిక చేయడం కంటే వేరే ఆటగాడికి అవకాశమివ్వడం ఉత్తమమని భావించాము. అందుకే షమీని ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయలేదు" ప్రెస్ కాన్ఫరెన్స్లో అగార్కర్ పేర్కొన్నాడు. షమీ తన చివరి టెస్టు మ్యాచ్.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. 34 ఏళ్ల మహ్మద్ షమీ తన కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్ మ్యాచ్లు ఆడి.. 229 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 3.30 ఉంది. ఈ ఫార్మాట్లో అతను 6 సార్లు 5 వికెట్ల హాల్తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs ENG: టీమిండియా టెస్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్.. అధికారిక ప్రకటన -
రూ.25 లక్షలు మోసపోయిన దీప్తీ శర్మ..? సహచర క్రికెటర్పై కేసు నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ దీప్తి శర్మ ఇంట్లో చోరీ జరిగింది. అగ్రాలోని దీప్తీకి చెందిన ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులను ఢిల్లీ ఉమెన్స్ క్రికెటర్ ఆరుషి గోయల్ దొంగతనం చేసినట్లు ఆమె సోదరుడు సుమిత్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇండియన్ రైల్వేలో జూనియర్ క్లర్క్గా పనిచేస్తున్న ఆరుషి.. మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్స్ తరపున దీప్తీతో కలిసి ఆడింది. అదేవిధంగా దీప్తీని ఆరుషి రూ.25 లక్షలు మోసం చేసిందని సుమిత్ శర్మ ఆరోపించాడు."తన సోదరి ఇంట్లో దొంగతనం జరిగిందని దీప్తీ సోదరుడు సుమిత్ శర్మ అగ్రాలోని సదర్ పోలీస్ స్టేషన్ను సంప్రదించారు. ప్రాథమిక విచారణ అనంతరం మేము పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశాము. అరుషి, దీప్తీ కలిసి ఒకే జట్టుకు ఆడడం ఇద్దరూ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఈ క్రమంలో ఆరుషీ కుటుంబ అత్యవసర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను చూపుతూ దీప్తీ నుంచి పలుమార్లు నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మేము పూర్తి స్దాయి విచారణ జరుపుతామని" ఏసీపీ (ఆగ్రా సదర్), సుకన్య శర్మ తెలిపినట్లు టైమ్స్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది.దీప్తీ శర్మ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఇంగ్లండ్తో వైట్బాల్ సిరీస్లకు ప్రకటించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా హర్మాన్ ప్రీత్ సేన ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది.చదవండి: పుజారా ఆల్టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్కు నో ఛాన్స్? -
పుజారా ఆల్టైమ్ భారత జట్టు ఇదే.. రోహిత్, పంత్కు నో ఛాన్స్?
భారత టెస్టు క్రికెట్ హిస్టరీలో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు. తన అద్బుత బ్యాటింగ్తో టీమిండియా నయా వాల్గా పేరు గాంచాడు. అయితే ఫామ్ లేమితో సతమతవుతున్న పుజారా కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉటున్నాడు.ఈ మధ్య కాలంలో కామెంటేర్గా కూడా పుజారా అవతారమెత్తాడు. ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతున్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు.. భారత సెలక్టర్ల నుంచి పిలుపు వస్తే రీ ఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా స్పోర్ట్స్ తక్ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా తన ఆల్ టైమ్ ఇండియా టెస్ట్ ఎలెవన్ను ఎంచుకున్నాడు.చతేశ్వర్ తన ఎంచుకున్న జట్టులో ఓపెనర్లగా దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్లకు అవకాశమిచ్చాడు. అయితే పుజారా మూడో స్ధానంలో తనకు కాకుండా ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్కు చోటు ఇచ్చాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలకు ఛాన్స్ దక్కింది.ఆరో స్దానంలో వీవీఎస్ లక్ష్మణ్ను పుజారా ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్గా పంత్కు కాకుండా లెజెండరీ ఎంఎస్ ధోని అతడు సెలక్ట్ చేశాడు. స్పిన్నర్లగా అనిల్ కుంబ్లే, అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, కపిల్ దేవ్లకు పుజారా చోటిచ్చాడు. కాగా పుజారా ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, గ్రేట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం.పుజారా ఆల్-టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, ఎంఎస్ ధోనీ (వికెట్కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా. -
'అతడొక అద్బుతం.. ఇంగ్లండ్ టూర్కు సెలక్ట్ చేయండి'
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి ఇంకా నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలింది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లీడ్స్ వేదికగా జూన్ 20 నుంచి 24 వరకు జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.అయితే ఇంగ్లండ్ టూర్కు ఇంకా భారత జట్టును బీసీసీఐ ఖారారు చేయలేదు. క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం.. మే 24న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది. అయితే ఈ సిరీస్కు టీమిండియాను ఎంపిక చేయడం సెలక్టర్లకు బిగ్ ఛాలెంజ్ వంటిదే అని చెప్పాలి. ఇందుకు ఈ కీలక పర్యటనకు ముందు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరూ స్ధానాలను భర్తీ చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు. ఈ పర్యటనలో భారత టెస్టు జట్టులో కొన్ని కొత్త ముఖాలను చూసే అవకాశముంది. సాయిసుదర్శన్, అర్షదీప్ సింగ్లు టీమిండియా తరపున టెస్టు అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు హర్యానా స్పీడ్ స్టార్ అన్షుల్ కాంబోజ్ను ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయాలని చెన్నైసూపర్ కింగ్స్ హెడ్కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచించాడు. ఐపీఎల్-2025 సీజన్లో కాంబోజ్ సీఎస్కే తరపున ఆడుతున్నాడు."కాంబోజ్ అద్బుతమైన బౌలర్. అతడు గంటకు 138-139 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు తన పేస్ బౌలింగ్తో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. కాంబోజ్ వేసే బంతులు ఎల్లప్పుడూ చేతి గ్లౌవ్స్ దగ్గరగా వెళ్తూ ఉంటాయి.దీంతో బ్యాటర్లు వికెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైట్ ఎక్కువగా ఉండడంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ప్లాట్ వికెట్లపై కూడా అతడు అద్బుతంగా బౌలింగ్ చేయగలడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఫ్లాట్ వికెట్లపై ఎలా రాణించాడో చూశాము. కొంచెం సీమ్, స్వింగ్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగా రాణిస్తాడు. కాబట్టి ఇంగ్లండ్కు వెళ్లే భారత జట్టులో అతడు ఉంటాడని ఆశిస్తున్నానని" ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. -
టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్మన్ గిల్కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్? -
ఇంగ్లండ్తో తొలి టెస్టు.. భారత తుది జట్టులో ఎవరూ ఊహించని ప్లేయర్!?
ఐపీఎల్-2025 సీజన్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అదేరోజున భారత కొత్త టెస్టు కెప్టెన్ పేరును కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెల్లడించనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. సాయిసుదర్శన్, దేవదత్ పడిక్కల్ వంటి యువ ఆటగాళ్లకు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశముంది. జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భారత్కు ఇదే తొలి సిరీస్. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో మొదటి టెస్టుకు భారత ప్లేయింగ్ ఎలెవన్ను మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అంచనా వేశాడు.రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఓపెనర్గా కేఎల్ రాహుల్కు చోప్రా అవకాశమిచ్చాడు. భారత ఇన్నింగ్స్ను యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించాలని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా విరాట్ కోహ్లి స్ధానంలో సాయి సుదర్శన్ లేదా దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశమివ్వాలని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక కెప్టెన్సీ రేసులో ఉన్న శుబ్మన్ గిల్కు నాలుగో స్దానంలో అతడు చోటు కల్పించాడు. వికెట్ కీపర్ బ్యాటర్గా రిషబ్ పంత్ను ఈ భారత మాజీ క్రికెటర్ ఎంపిక చేశాడు. ఆల్రౌండర్ కోటాలో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలకు చోటిచ్చాడు.అయితే అనూహ్యంగా దీపక్ చాహర్ను ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయాలని అతడు సెలక్టర్లను సూచించాడు. ఎనిమిదవ స్ధానంలో దీపక్ చాహర్ లేదా శార్ధూల్ ఠాకూర్కు ఛాన్స్ ఇవ్వాలని అతడు మెనెజ్మెంట్ను కోరాడు. కాగా దీపక్ చాహర్ ఇప్పటివరకు టెస్టుల్లో భారత తరపున అరంగేట్రం చేయలేదు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలకు చోప్రా చోటిచ్చాడు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు చోప్రా ఎంపిక చేసిన ఇండియన్ ప్లేయింగ్ ఎలెవన్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్/దేవ్దత్ పడిక్కల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ/ ప్రసిద్ద్ కృష్ణ -
నేను కోచ్గా ఉండుంటే.. రోహిత్కు అలా జరిగేది కాదు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే తన 12 ఏళ్ల టెస్టు కెరీర్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్కు ముందు టెస్టు క్రికెట్లో కెప్టెన్గా, ఆటగాడిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో బీజీటీలో చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు దూరం కావడం వంటివి రోహిత్ను మానసికంగా దెబ్బతీశాయనే చెప్పుకోవాలి. రోహిత్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత బీజీటీలోని ఆఖరి మ్యాచ్ నుంచి హిట్ మ్యాన్ స్వచ్ఛందంగా తానంతట తనే తప్పుకున్నాడు. దీంతో కనీసం ఫేర్వెల్ మ్యాచ్ లేకుండానే రోహిత్ తన కెరీర్ను ముగించాడు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కోచ్గా ఉండుంటే, సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడేవాడని రవిశాస్త్రి వెల్లడించాడు."ఐపీఎల్-2025 సీజన్ టాస్ సమయంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తుండగా చాలాసార్లు చూశాను. కానీ ఆ సమయంలో అతడితో మాట్లాడటానికి తగినంత సమయం దొరకలేదు. ఓసారి మాత్రం అతడి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడాను. నేను కోచ్గా ఉండుంటే సిడ్నీ టెస్టు(బీజీటీలో ఆఖరి టెస్టు)లో ఆడకుండా ఉండేవాడివి కాదు అని చెప్పా. సిరీస్ అప్పటికి ఇంకా ముగియలేదు కాబట్టి కచ్చితంగా మిమ్మల్ని ఆడించేవాడిని. ఎందుకంటే 2-1తో ప్రత్యర్ధి జట్టు ముందుంజలో ఉన్నా, నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఆఖరి టెస్టు మ్యాచ్ 30-40 పరుగుల తేడాతో సాగింది. సిడ్నీ పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది. రోహిత్ ఫామ్లో ఉన్న లేకపోయానా జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే.ఎందుకంటే అతడు మ్యాచ్ విన్నర్. సరిగ్గా ఇదే విషయం రోహిత్ కూడా చెప్పాను. ఒకవేళ రోహిత్ ఆ మ్యాచ్లో ఆడి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు జట్టును నడిపించి ఉంటే సిరీస్ సమమయ్యేది. అయితే ప్రతీ కోచ్కు వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. ఇది నా శైలి. కేవలం నా ఆలోచిన విధానాన్ని మాత్రమే రోహిత్కు తెలియజేశాను. ఎప్పటి నుంచో ఇది నా మనసులో ఉంది. ఎట్టకేలకు అతడికి తెలియజేశాను" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రస్తుత భారత హెడ్కోచ్ గౌతం గంభీర్కు పరోక్షంగా కౌంటరిచ్చినట్లు అన్పిస్తోంది. గంభీర్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రో-కో టెస్టులకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
'గిల్ వద్దు.. టీమిండియా కెప్టెన్గా అతడే బెటర్'
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు నివేదికల ప్రకారం టెస్టు కెప్టెన్సీ రేసులో స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా విన్పిస్తోంది. కానీ గిల్ తో పోలిస్తే బుమ్రాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అనుభవం లేని గిల్ వైపు బీసీసీఐ సెలక్షన్ కమిటీ మొగ్గు చూపుతుండడం క్రికెట్ వర్గాల్లో అసంతృప్తికి దారితీసినట్లు తెలుస్తోంది.చాలా మంది మాజీలు భారత టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్గా బుమ్రా ఉండాలని, శుబ్మన్ గిల్ను అతడి డిప్యూటీగా ఎంపిక చేయాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు."భారత టెస్టు కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా ముందంజలో ఉంటాడాని భావిస్తున్నాను. ఒకవేళ తనంతట తానుగా కెప్టెన్సీ ఆఫర్ తిరష్కరిస్తే తప్ప సెలక్టర్లు మరో ఆప్షన్ను పరిశీలించరు. అతడిని కెప్టెన్గా చేసి గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలి. బుమ్రాకు విశ్రాంతి అవసరమైనప్పుడల్లా గిల్ జట్టును నడిపిస్తున్నాడు. దీంతో గిల్కు పూర్తి స్ధాయి కెప్టెన్గా ఎదిగేందుకు తగినంత సమయం లభిస్తోంది" అని జాఫర్ ఎక్స్లో రాసుకొచ్చాడు. కాగా గిల్కు కెప్టెన్గా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా అనుభవం లేదు. జింబాబ్వే సిరీస్లో భారత జట్టు సారధిగా గిల్ వ్యవహరించాడు. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టును నడిపించలేదు. ఐపీఎల్ మాత్రం కెప్టెన్గా అతడికి అనుభవం ఉంది. గుజరాత్ టైటాన్స్ సారథిగా గిల్ కొనసాగుతున్నాడు. ఇక ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును మే 23న బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.చదవండి: BCCI - IND vs ENG: టీమిండియాలో అతడికి చోటు కష్టమే! -
శుబ్మన్ గిల్, పంత్ కాదు.. అతడి టెస్టు కెప్టెన్ చేయండి: అశ్విన్
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరన్న చర్చ మొదలైంది. టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు. కెప్టెన్గా గిల్ ఎంపిక దాదాపు ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తదుపరి కెప్టెన్ గిల్ అన్న ఊహాగానాలపై భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది మాజీలు సంతృప్తి వ్యక్తం చేస్తూంటే.. మరి కొంత మంది సీనియర్ ఆటగాడిని కెప్టెన్గా చేయాలని బీసీసీఐని సూచిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను భారత కెప్టెన్గా ఎంపిక చేయాలని అశ్విన్ సూచించాడు.."ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు. అతడిని కూడా కెప్టెన్సీ ఎంపికగా పరిగణించాలి. మీరు కొత్త ఆటగాడికి శిక్షణ ఇచ్చి తర్వాత కెప్టెన్గా చేయాలని భావిస్తుంటే.. సారథిగా మీకు జడేజా బెస్ట్ ఛాయిస్. జడేజా రెండేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. జడ్డూకు డిప్యూటీగా మీరు ఎవరినైతే కెప్టెన్గా చేయాలనకుంటున్నారో వారిని నియమించండి. అప్పుడు అతడు మరింత రాటుదేలుతాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల. జడేజాకు అవకాశమిస్తే అతడు కచ్చితంగా స్వీకరిస్తాడని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా శుబ్మన్ గిల్పై కూడా అశూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. గిల్ అక్కడ జట్టును గెలిపిస్తే.. కెప్టెన్గా పరిపక్వత సాధించినట్లు అవుతోంది. అయితే టెస్టుల్లో కెప్టెన్సీ అంత సలువు కాదు. ఒక కెప్టెన్గా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కూడా ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని అశ్విన్ అన్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు.. ఇంగ్లండ్కు పంపండి: కుంబ్లే
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆ తర్వాత వారం రోజులకే విరాట్ కోహ్లి కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టును బీసీసీఐ వచ్చే వారం ప్రకటించింది. అయితే ఇన్నాళ్లు విరాట్ కోహ్లి ఆడిన నాలుగో స్ధానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్థానాన్ని కరుణ్ నాయర్ భర్తీ చేయగలడని కుంబ్లే జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ ఎంపికయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించడంతో పాటు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉండడంతో నాయర్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారంట."కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్లో చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతడు భారత జట్టులోకి తిరిగి రావడానికి అర్హుడు. అతడు నాలుగో స్ధానంలో ఆడొచ్చు. ఎందుకంటే భారత్కు ఇంగ్లండ్లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు కావాలి. కరుణ్కు ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ అనుభవం ఉంది. అతడికి అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. కరుణ్ వయస్సు పరగా 30 ఏళ్లు దాటిండొచ్చు. కానీ అతడు ఇంకా చాలా యంగ్ కన్పిస్తున్నాడు. ఇంకా చాలా కాలం పాటు క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు" అని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంబ్లే పేర్కొన్నారు.కాగా కరుణ్ నాయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ది కీలక పాత్ర. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్ స్కోరర్గా నిలిచాడు. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
రోహిత్ శర్మ స్థానంలో యువ సంచలనం..? ఇక భారత్కు తిరుగులేదు?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకివ్వగా.. హిట్మ్యాన్ బాటలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నడుస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని కోహ్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం.విరాట్ తన నిర్ణయాన్ని ఇప్పటికే బీసీసీఐకి తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వరకు అయినా కొనసాగాలని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొనసాగుతాడా లేదా రోహిత్ బాటలోనే నడుస్తాడా? అన్నది మే 23న తేలిపోనుంది. ఆ రోజున ఇంగ్లండ్ టూర్కు భారత జట్టుతో పాటు కొత్త కెప్టెన్ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయర్గా రోహిత్ శర్మ స్దానాన్నిమాత్రం తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్తో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. సాయిసుదర్శన్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఫార్మాట్తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న సుదర్శన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అతడి ఆటను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. రవిశాస్రి వంటి దిగ్గజ క్రికెటర్లు సుదర్శన్ను ఇంగ్లండ్ టూర్కు ఎంపిక చేయాలని సెలక్టర్లను సూచించారు.దీంతో భారత తరపున వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుదర్శన్.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. సుదర్శన్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజన్లలో తమిళనాడు తరపున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. సుదర్శన్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం కూడా అతడికి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు ముందు టీమిండియాకు భారీ షాక్..! -
'ప్లీజ్ కోహ్లి రిటైర్ అవ్వకు.. నీ అవసరం టీమిండియాకు ఉంది'
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. టెస్టు క్రికెట్ నుంచి రిటైరవ్వాలని అనుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లి లేఖ రాసాడన్న వార్త కలకలం రేపుతోంది. అయితే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు వరకు కొనసాగాలని కోహ్లిని బీసీసీఐ కోరినట్లు తెలుస్తోంది.ఇప్పటికే రెడ్ బాల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పకటించాడు. ఇప్పుడు కోహ్లి కూడా టెస్టుల నుంచి తప్పుకుంటే అది టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బే అవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లికి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక సూచనలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని విరాట్ను రాయుడు కోరాడు."విరాట్ కోహ్లి.. దయచేసి రిటైర్ అవ్వొద్దు. భారత జట్టుకు మీ అవసరం ఇప్పుడు చాలా ఉంది. ప్రస్తుతం మీలో ఆడే సత్తా ఇంకా ఉంది. ఇప్పటికీ చాలా ఫిట్గా కన్పిస్తున్నారు. మీరు టీమిండియా తరుపున పోరాడేందుకు బరిలోకి దిగకపోతే టెస్టు క్రికెట్ స్వరూపమే మారిపోతుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి" అని రాయుడు ఎక్స్లో రాసుకొచ్చాడు. అయితే టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై మాత్రం కోహ్లికి మంచి రికార్డులేదు. ఇంగ్లండ్లో 17 టెస్టులు ఆడిన విరాట్.. 33.21 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి తన టెస్టు కెరీర్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు, ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. కానీ గత 4 సంవత్సరాల నుంచి అతని సగటు 50 కంటే తక్కువగా ఉంది. కాగా ఇంగ్లండ్ టూర్కు మే 23న భారత జట్టుతో పాటు కొత్త టెస్టు జట్టు కెప్టెన్ను కూడా బీసీసీఐ ప్రకటించనుంది. -
టీమిండియాకు కొత్త టెస్టు కెప్టెన్ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?
ఐపీఎల్-2025 సీజన్ నిరావధికంగా వాయిదా పడడంతో భారత జట్టు ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సన్నద్దం కానుంది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టు భారత్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ప్రకటనకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముహార్తం ఖారారు చేసింది. క్రిక్బజ్ రిపోర్ట్ ప్రకారం.. మే 23న బీసీసీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు భారత టెస్ట్ కెప్టెన్ను కూడా ప్రకటించననున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక ఇప్పుడు అనివార్యమైంది. తొలుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును మే 20న ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. కానీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పడంతో జట్టు ప్రకటనను రెండు రోజుల పాటు వాయిదా వేసినట్లు వినికిడి. కోహ్లిని తన నిర్ణయాన్ని మార్చుకోవాలని బీసీసీఐ సూచించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరి కోహ్లి యూ-టర్న్ తీసుకుంటాడా? లేదా అన్నది మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇక భారత టెస్టు కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్ ముందుంజలో ఉన్నాడు.ప్రస్తుతం టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించకూడదని బీసీసీఐ భావిస్తుందంట. దాదాపు శుబ్మన్ గిల్ పేరును బీసీసీఐ ఖారారు చేసినట్లు వినికిడి. -
సోషల్ మీడియాలోనే రిటైర్మెంట్.. రోహిత్ను ఇలాగే పంపిస్తారా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టు క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు రోహిత్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అయితే భారత జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మను ముందే తొలిగించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రోహిత్ లాంటి అద్భుతమైన కెప్టెన్ సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించడం పట్ల భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రోహిత్కు సరైన విడ్కోలు లభించలేదని తివారీ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ అద్బుతమైన కెప్టెన్. కెప్టెన్గా అతడి ట్రాక్ రికార్డు చాలా బాగుంది. అతడి సారథ్యంలో భారత్ 12 టెస్టుల్లో విజయం, మూడు మ్యాచ్లను డ్రాగా ముగించింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా చేర్చాడు. అటువంటి కెప్టెన్కు సరైన విడ్కోలు లభించలేదు. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో కాకుండా మైదానంలో మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్ అయి ఉంటే బాగుండేది. అది అతడికి సరైన విడ్కోలు అయి ఉండేది. కానీ రోహిత్ విషయంలో అది జరగలేదని" పరోక్షంగా బీసీసీఐపై తివారీ మండిపడ్డాడు. రోహిత్ తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై సాధించిన 212 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించి, 12 విజయాలు, 9 ఓటములు, 3 డ్రాలు నమోదు చేశాడు.చదవండి: పాకిస్తాన్కు అంత సీన్ లేదు.. త్వరలోనే ఐపీఎల్ మళ్లీ మొదలు: గంగూలీ -
గిల్, బుమ్రా, పంత్ కాదు.. టీమిండియా కెప్టెన్గా అతడే?
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగనున్నట్లు హిట్మ్యాన్ తెలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త టెస్టు కెప్టెన్ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్లు శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని ఈ కెప్టెన్స్ రేసు నుంచి గ్రూప్ నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరినట్లు సమాచారం. కెప్టెన్గా తక్కువ అనుభవం ఉన్న గిల్, పంత్ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్కు పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని సెలక్టర్లు భావిస్తున్నట్లు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్లండ్ సిరీస్ తర్వాత పూర్తి స్ధాయి కెప్టెన్ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కెప్టెన్గా రాహుల్..టెస్టు కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్కు అనుభవం ఉంది. గతంలో మూడు సార్లు టీమిండియాకు రాయల్ నాయకత్వం వహించాడు. 2022లో అతడి సారథ్యంలోనే బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్లో కూడా రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు.అయితే ఆ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్లో వ్యక్తిగత గణాంకాల పరంగా కూడా రాహుల్కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఈ వికెట్ కీపర్ ఈ కీపర్-బ్యాటర్ 9 మ్యాచ్ల్లో 614 పరుగులు చేశాడు. ఈ టెస్టు పర్యటనకు బీసీసీఐ భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశముంది.చదవండి: పీసీబీకి చావు దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు! -
మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి హత్య బెదిరింపులు రావడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షమీని హత్య చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ వెల్లడించాడు. అంతేకాకుండా కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు హసీబ్ తెలిపాడు. ఈ ఘటనపై షమీ సోదరుడు ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.సోమవారం ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడతున్నారు. పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో రాజ్పుత్ సిందార్ అనే వ్యక్తి ఈ బెదిరింపు ఇమెయిల్ పంపినట్లు గుర్తించారు. కాగా ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా ఇటువంటి బెదిరింపులే వచ్చాయి. ఈ మెరకు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశాడు. కాగా మహ్మద్ షమీ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకుని ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పర్వాలేదన్పించిన షమీ.. ఐపీఎల్లో మాత్రం తేలిపోతున్నాడు. షమీ ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 56.17 సగటుతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్లో షమీ భారత తరపున ఆడనున్నాడు. -
నేను ఎదుర్కొన్న కఠిన బౌలర్లు వీరే: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ కింగ్ కోహ్లి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కోహ్లి.. ఇప్పటివరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు.భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత గొప్ప క్రికెటర్గా కీర్తింపబడ్డాడు.వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా పది వేల పరుగులు మైలు రాయిని అందుకున్న బ్యాటర్ కూడా కోహ్లినే కావడం విశేషం. అటు కెప్టెన్గా కూడా కోహ్లి తన మార్క్ను చూపించాడు. టెస్టుల్లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్ విరాట్ నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా విరాట్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్ది గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. అయితే తాజాగా మూడు ఫార్మాట్లలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ల జాబితాను కోహ్లి వెల్లడించాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ పేస్ బౌలింగ్ లెజండ్ జేమ్స్ ఆండర్సన్, వన్డేల్లో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్, టీ20ల్లో వెస్టిండీస్ స్పిన్నర్ సనీల్ నరైన్ బౌలింగ్ ఆడటానికి ఇబ్బంది పడినట్లు కోహ్లి పేర్కొన్నాడు. కాగా టెస్టుల్లో కోహ్లిపై ఆండర్సన్కు మంచి రికార్డు ఉంది. ఏడు సార్లు కోహ్లిని ఆండర్సన్ ఔట్ చేశాడు. మరోవైపు లసిత్ మలింగా కూడా చాలా సందర్భాల్లో కోహ్లిపై పై చేయి సాధించాడు. అదేవిధంగా ఐపీఎల్లో కోహ్లిపై మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ సైతం మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు.ఇక కోహ్లి ఈ ఏడాది జూన్లో తిరిగి భారత తరపున ఆడనున్నాడు. ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్కు పయనం కానునున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025లో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లి(443) ఐదో స్ధానంలో కొనసాగుతున్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కెప్టెన్సీకి అర్హుడు: సునీల్ గవాస్కర్ -
అందుకే అప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాను: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గతేడాది అంతర్జాతీయ టీ20 క్రికెట్కు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్కప్-2024 విజయం అనంతరం కోహ్లి తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. అతడితో పాటు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వెనక గల కారణాన్ని కోహ్లి వెల్లడించాడు. యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లి చెప్పుకొచ్చాడు. "టీ20లకు రిటైర్మెంట్ అన్ని ఆలోచించాకే ప్రకటించాను. కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాలని, వారు సిద్దమయ్యేందుకు కాస్త సమయం అవసరమని భావించాను.వారు తదుపరి టీ20 వరల్డ్కప్కు సిద్దంగా ఉండేందుకు కనీసం రెండేళ్ల సమయమైనా కావాలి. అందుకే వరల్డ్కప్ అనంతరం టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటి ఐపీఎల్లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్-2025లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన కోహ్లి 138.87 స్ట్రైక్ రేట్తో 443 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ జాబితాలో మూడవ స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు -
మూడేళ్లుగా సింగిల్గానే..: రిలేషన్షిప్పై నోరు విప్పిన శుబ్మన్ గిల్
టీమిండియా స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్ వ్యక్తిగత జీవితం గురుంచి గత కొంతకాలంగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో గిల్ ప్రేమాయణం సాగించినట్లు ప్రచారం జరిగింది. మళ్లీ కొంతకాలం తర్వాత వీళ్లిద్దరికి బ్రేకప్ అయిందని వార్తలు వినిపించాయి.అయితే ఈ వార్తలపై గిల్ కానీ సారా కానీ ఎప్పుడు స్పందించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్తో గిల్ డేటింగ్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ గిల్తో తాను డేటింగ్ చేయడం లేదని సారా అలీ ఖాన్ స్పష్టం చేసింది. వీరిద్దరి తర్వాత మరో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేతో గిల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అనన్య మాత్రం ఖండించింది. అవన్నీ వట్టి రూమర్సే అని కొట్టిపారేసింది. తాజాగా తన రిలేషన్షిప్పై వస్తున్న వార్తలపై గిల్ స్పందించాడు. గత మూడేళ్ల నుంచి తాను ఒంటరిగా ఉన్నానని గిల్ చెప్పుకొచ్చాడు."నేను ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను. గత మూడేళ్ల నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. ఇటీవల కాలంలో చాలా మందితో నన్ను ముడిపెట్టారు. నా వ్యక్తిగత జీవితంపై చాలా ఊహాగానాలు, పుకార్లు ప్రచారం చేశారు. నేను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తితో కూడా లింకులు పెడుతున్నారు. నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ప్రస్తుతం నేను నా ప్రొఫెషనల్ కెరీర్పై దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఒకరితో ప్రేమాయణం నడిపే అంత సమయం నా దగ్గర లేదు. మేము ఎక్కడక్కడికో ప్రయాణిస్తుంటాము. ప్రొఫెషనల్ కెరీర్తో బీజీగా ఉన్నాను" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు.చదవండి: బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్? -
బీసీసీఐ పొమ్మంది.. కట్ చేస్తే! అభిషేక్ నాయర్కు మరో ఆఫర్?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టుతో తెగదింపులు చేసుకున్న నాయర్.. తిరిగి మళ్లీ కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జతకట్టాడు. కేకేఆర్ కోచింగ్ స్టాప్లో అభిషేక్ భాగమయ్యాడు. గతేడాది సీజన్లో కోల్కతాను ఛాంపియన్గా నిలపడంలో నాయర్ది కీలక పాత్ర. మరోసారి తమ జట్టును విజయపథంలో నడిపిస్తాడని నాయర్పై కేకేఆర్ మెనెజ్మెంట్ గంపెడు ఆశలు పెట్టుకుంది.అయితే ఐపీఎల్ మధ్యలోనే నాయర్కు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ముంబై టీ20 లీగ్లో ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు మెంటార్గా నాయర్ ఎంపికనైట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. అభిషేక్ నాయర్ను ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ తమ మెంటార్గా నియమించింది.త్వరలోనే అభిషేక్ నాయర్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలవడనుంది అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ టోర్నమెంట్ మే 26 నుంచి ప్రారంభం కానుంది. అదేవిధంగా ఈ టోర్నీలో భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అంధేరీ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. వీరితో పాటు ఓంకార్ సాల్వి సోబో ముంబై ఫాల్కన్స్కు, ఐపీఎల్ మాజీ స్టార్ ప్రవీణ్ తంబే నార్త్ ముంబై పాంథర్స్కు హెడ్ కోచ్గా ఎంపికయ్యారు.చదవండి: IPL 2025: 'శ్రేయస్ చాలా బాధపడ్డాడు.. కేకేఆర్కు చుక్కలు చూపిస్తాడు' -
ఇక చాలు.. పాకిస్తాన్తో క్రికెట్ ఆడొద్దు: విరాట్ కోహ్లి ఫ్రెండ్
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిపై యావత్ క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ క్రూరమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. అందుకు బాధ్యలైన వారికి తగిన గుణపాఠం చెప్పాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సన్రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి తీవ్రంగా స్పందించాడు. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని అతడు బీసీసీఐకి లేఖకు రాశాడు. ఇందుకు సంబంధించిన లెటర్ను తన ఎక్స్ ఖాతాలో గోస్వామి పోస్ట్ చేశాడు."ఈ విషాదకర ఘటన సమయంలో నేను ఒక విషయం చెప్పాలనకుంటున్నాను. ఇకపై పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం మానేయాలి. ఇప్పుడే కాదు పాక్తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పాకిస్తాన్కు పంపనందుకు ఆ దేశ మాజీ క్రికెటర్లు కొంతమంది ఏదో ఏదో మాట్లాడారు.ఆటను రాజకీయాలను కలపొద్దంటూ లేనిపోని మాటలు చెప్పారు. వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు. అమాయక భారతీయులను హత్య చేయడమే వారి జాతీయ క్రీడలా కనిపిస్తోంది. బ్యాట్లు, బంతులతో కాకుండా వారి బాషలోనే మనం కూడా సమాధానం చెప్పాలి" అని గోస్వామి తన నోట్లోపేర్కొన్నాడు. కాగా ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఐపీఎల్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన శ్రీవత్స్ గోస్వామి, ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్లకు ప్రాతినిథ్యం వహించాడు. అదేవిధంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో కలిసి భారత్ అండర్-19 జట్టుకు గోస్వామి ఆడాడు. -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. శ్రేయస్ రీ ఎంట్రీ? యువ సంచలనానికి పిలుపు!
ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది. మే రెండో వారంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశముంది.అయితే ఇంగ్లండ్ టూర్కు తమిళనాడు యువ సంచలనం సాయిసుదర్శన్ను ఎంపిక చేసే ఆలోచనలో సెలక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ దుమ్ములేపుతున్నాడు. సుదర్శన్ ఇప్పటికే టీ20, వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు టెస్టుల్లో డెబ్యూ చసే సూచనలు కన్పిస్తున్నాయి. అతడికి ఇంగ్లండ్ రెడ్-బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. సుదర్శన్ కౌంటీ క్రికెట్లో సర్రే తరపున ఆడాడు. అదేవిధంగా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, రజిత్ పాటిదార్లకు తిరిగి పిలుపునివ్వాలని అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయ్యర్, పాటిదార్ ఇద్దరూ గతేడాది భారత టెస్టు జట్టుకు దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉండడంతో ఎంపిక చేయనున్నట్లు వినికిడి. మిడిలార్డర్లో అప్షన్స్ కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. సుదర్శన్, పాటిదార్, అయ్యర్లను ముందే ఇంగ్లండ్కు పంపించే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు ముగ్గురు భారత-ఎ జట్టు తరపున ఇంగ్లండ్ లయన్స్తో అధికారిక టెస్టు సిరీస్ ఆడనున్నారు. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. అభిషేక్ నాయర్, దిలీప్లపై వేటు!?
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్లో మార్పులు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హెడ్కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది.బ్యాటింగ్ కోచ్గా ఇప్పటికే సితాన్షు కోటక్ ఉండగా అభిషేక్ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది.ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన నాయర్కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించకున్నట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్దానంలో మరో సహాయక కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటవంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ భారత కొత్త హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నే మోర్కెల్లను సపోర్ట్ స్టాప్లోకి తీసుకువచ్చాడు. అయితే ఈ కోచింగ్ స్టాప్లో ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు వరుసగా ఘోర పరాభావాలు ఎదురయ్యాయి. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్, ఆస్ట్రేలియాతో బీజీటీని భారత్ కోల్పోయింది. దీంతో కోచింగ్ స్టాప్పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో గంభీర్ అండ్ కో కాస్త ఉపశమనం పొందారు. కానీ బీసీసీఐ మాత్రం కోచింగ్ స్టాప్ను కుదించాలని పట్టుదలతో ఉంది.చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్ -
టీమిండియాలోకి ట్రిపుల్ సెంచరీ వీరుడు.. ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ?
'డియర్ క్రికెట్.. నాకు ఒక్క చాన్స్ ఇవ్వు' మూడేళ్ల కిందట టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ ఇది. రంజీట్రోఫీకు కర్ణాటక జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో భావోద్వేగానికి లోనైన కరణ్ మాటలవి. కోరుకున్నట్లే క్రికెట్ అతడికి మరో ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటక నుంచి విదర్భకు మాకం మార్చిన కరణ్ నాయర్.. దేశీవాళీ క్రికెట్లో పరుగులు వరద పారిస్తున్నాడు. 2024-25 దేశవాళీ సీజన్లో అన్ని ఫార్మాట్లు కలిపి దాదాపు 2000 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో ఏకంగా 9 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రీఎంట్రీ ఇచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే అద్భుత ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచానికి మరోసారి తన పేరును పరిచయం చేసుకున్నాడు.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్పై కేవలం 40 బంతుల్లోనే 89 పరుగులు చేసి ఔరా అన్పించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సైతం నాయర్ ఊతికారేశాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నాయర్ నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్ నాయర్ టీమిండియా రీఎంట్రీకి మార్గం సుగమైనట్లు తెలుస్తోంది.ఇంగ్లండ్ టూర్కు కరుణ్ నాయర్..ఈ ఏడాది జూన్లో ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్కు కంటే ముందు భారత-ఎ జట్టు అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనుంది. భారత-ఎ జట్టుకు నాయర్ను ఎంపిక చేసి ముందుగానే ఇంగ్లండ్కు పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాడు. అక్కడ అతడి ప్రదర్శన ఆధారంగా సీనియర్ జట్టులో చోటు ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి."అర్హులైన ప్రతీ ప్లేయర్కు భారత జట్టులోకి తిరిగి వచ్చేందుకు తలుపులు తెరిచే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరుణ్ నాయర్ విషయాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తావించాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇండియా ఎ టీమ్ అనాధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనుంది. ఇండియా ఎ జట్టులో నాయర్కు అవకాశం లభిస్తుంది. కరుణ్ అద్భుతమైన ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదు. భారత-ఎ జట్టు తరపున బాగా రాణిస్తే, సెలక్టర్లు ఖచ్చితంగా అతడి పేరును పరిగణలోకి తీసుకుంటారు" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్స్పోర్ట్తో పేర్కొన్నారు.ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీకరుణ్ నాయర్ 2016 నవంబర్లో ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్ ఐదో టెస్టులో ఇంగ్లీష్ జట్టుపై నాయర్ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నాయర్ సూపర్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాయర్ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ కొనసాగుతున్నాడు. -
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఖారరైంది. ఈ ఏడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లలో తలపడేందుకు బంగ్లాదేశ్కు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మంగళవారం విడుదల చేసింది.ఆగస్టు 17న మిర్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసిన రెండు వారాలకే భారత జట్టు బంగ్లాకు పయనం కానుంది. ఈ క్రమంలో బంగ్లాతో వన్డే సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే బంగ్లాతో వన్డే సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్లో గిల్తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా వీరు ముగ్గురు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఆడనునున్నారు.కానీ సెలక్టర్లు మాత్రం బంగ్లా సిరీస్కు ఈ త్రయానికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బంగ్లాతో టీ20 సిరీస్లో మాత్రం ఆడేంచే అవకాశమున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో టీ20 ఆసియా కప్-2025 జరగనుండడంతో బంగ్లా సిరీస్లో బుమ్రా ఆడడం దాదాపుగా ఖాయం. బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్నాడు.మరోవైపు ఐపీఎల్లో దుమ్ములేపుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ తిరిగి వన్డే, టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని అస్సలు అనుకోలేదు: విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ చరిత్రలో తమకంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలను లిఖించుకున్నారు. బ్యాటర్లుగానే కాకుండా కెప్టెన్లగానూ కీలక పాత్ర పోషించిన ఇద్దరు మేటి ఆటగాళ్లు. రోహిత్ శర్మ కెప్టెన్గా భారత్కు రెండు ఐసీసీ టైటిల్స్ను అందించగా.. విరాట్ కోహ్లి సారథిగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని సాధించాడు. ఈ దిగ్గజ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్-2025లో సీజన్లో బిజీబిజీగా ఉన్నారు. విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. సోమవారం(ఏప్రిల్ 7) వాంఖడే వేదికగా ఆర్సీబీ-ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని విరాట్ కోహ్లి అభిమానులతో పంచున్నాడు. గత 15 ఏళ్లగా తమ క్రికెట్ జర్నీ ఎలా జరిగిందో కోహ్లి వెల్లడించాడు."ఎక్కువ కాలంగా ఒకరితో పాటు కలిసి ఆడుతున్నప్పుడు సహజంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. మా కెరీర్ ఆరంభంలో ఇద్దరికి ఒకే రకమైన సందేహలు ఉండేవి. ఆ సమయంలో ఆటపై మాకున్న అవగాహనను ఒకరితో మరొకరు పంచుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్లాము.కెప్టెన్సీ విషయంలో కూడా ఇద్దరూ కలిసి పనిచేశాము. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని తారతామ్యం లేకుండా మా జర్నీని కొనసాగించాము. మా ఆలోచనలను ఒకరికొకరు పంచుకునేవాళ్లం. మేమిద్దరం ఎక్కువగా ఒకే దానికి కట్టుబడి ఉండేవాళ్లం. ఆ నమ్మకమే జట్టు కోసం మరింత పనిచేయాలనే స్పూర్తినిచ్చింది. మేము ఇద్దరం కలిసిన ఆడిన సమయాన్ని ఆస్వాదించాము. మేము మా కెరీర్లను మరింత సుదీర్ఘంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాము. మేము ఇద్దరం భారత్ తరపున 15 ఏళ్ల పాటు కలిసి ఆడుతామని నా కెరీర్ తొలినాళ్లలో అస్సలు అనుకోలేదు. మా ప్రయాణంలో ఎన్నో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయి. రోహిత్తో ఇంత కాలం పాటు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: ప్రియురాలితో ఆసీస్ మహిళా క్రికెటర్ పెళ్ళి.. ఫోటోలు వైరల్KOHLI 🤝 ROHIT BOND ❤️- King talking about the special journey with Hitman over the years in Indian Cricket. pic.twitter.com/iL54z36xIO— Johns. (@CricCrazyJohns) April 6, 2025 -
రిటైర్మెంట్పై విరాట్ కోహ్లి కీలక వ్యాఖ్యలు!?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ ఆడతానని సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతనిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు ప్రణాళికలకపై కోహ్లి క్లారిటీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత మీ ముందు ఉన్న అతి పెద్ద లక్ష్యమేంటి అన్న ప్రశ్న కోహ్లికి ఎదురైంది. అందుకు కోహ్లి బదులిస్తూ.. "నా నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటో నాకు తెలియదు. తర్వాతి వరల్డ్ కప్ గెలిచేందుకు ప్రయత్నిస్తా" అని సమాధానం ఇచ్చాడు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్లో వరకూ ఆడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ టీ20లకు కోహ్లి వీడ్కోలు పలికాడు. అదేవిధంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ కోహ్లి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కోహ్లి వ్యాఖ్యలను బట్టి అతడు మరో మూడేళ్ల పాటు భారత జట్టు తరపున ఆడే అవకాశముంది. కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను భారత్ సొంతం చేసుకోవడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్లు ఆడి 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు.చదవండి: PAK vs NZ: పాక్తో రెండో వన్డే.. కివీస్కు భారీ షాక్! ఆరేళ్ల తర్వాత స్టార్ ప్లేయర్ రీఎంట్రీQuestion: Seeing In The Present, Any Hints About The Next Big Step? Virat Kohli Said: The Next Big Step? I Don't Know. Maybe Try To Win The Next World Cup 2027.🏆🤞 pic.twitter.com/aq6V9Xb7uU— virat_kohli_18_club (@KohliSensation) April 1, 2025 -
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్.. !
భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) 2025-26 ఏడాదికి గాను ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఈసారి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు ప్రమోషన్ దక్కనున్నట్లు సమాచారం. అతని సెంట్రల్ కాంట్రాక్ట్ను పునరుద్దరించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వినికిడి.అదేవిధంగా ఏ కేటగిరీలో ఉన్న టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను A+ కేటగిరీకి బీసీసీఐ ప్రమోట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా టీ20లకు విడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు A+ కేటగిరీలు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే A+ కేటగిరీలో కొనసాగాలంటే మూడు ఫార్మాట్లో ఆడాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్.. !ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు భారీ షాక్ తగిలే అవకాశముంది. అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.రుతురాజ్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడికి వచ్చిన అవకాశాలను కూడా గైక్వాడ్ సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించాలని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గతేడాది అతడు భారత్ తరపున కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. చివరగా జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా తరపున రుతురాజ్ ఆడాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్లు ఆడి 133 పరుగులు చేశాడు. ఓవరాల్గా గైక్వాడ్ తన కెరీర్లో ఇప్పటివరకు భారత్ తరపున 6 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. కాగా గైక్వాడ్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కే మొత్తం ఎంతంటే?ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది. -
ట్రోఫీ గెలవడమే మా లక్ష్యం.. అతడు ఎంతో సపోర్ట్గా ఉంటాడు: అయ్యర్
ఐపీఎల్-2025 సీజన్లో పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహించేందుకు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిద్దమయ్యాడు. పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్తో మరోసారి కలిసి పనిచేసేందుకు అయ్యర్ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే జట్టుతో కలిసిన శ్రేయస్.. ధర్మశాలలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.అదే విధంగా ఈ ఏడాది సీజన్లో కెప్టెన్గా అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేయస్ ప్రత్యేకంగా దృష్టి సారించాడు. తాజాగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభానికి ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అయ్యర్.. హెడ్ కోచ్ పాంటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. పాంటింగ్ తనను అద్బుతమైన ఆటగాడిగా భావిస్తున్నాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు."రికీ(పాంటింగ్) అందరికి చాలా సపోర్ట్గా ఉంటాడు. అతడితో నాకు మంచి అనుబంధం ఉంది. తొలిసారి అతడితో కలిసి పనిచేసినప్పుడే, నేను గొప్ప ఆటగాడిగా ఎదుగుతానని నాతో అన్నాడు. అంతేకాకుండా టీ20 ఫార్మాట్లో నేను బాగా రాణించగలన్న నమ్మకం కలిగించాడు. పాంటింగ్ ప్రతీ ప్లేయర్కు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉంటుంది. ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం. ఈ ఏడాది సీజన్లో మెరుగ్గా రాణించేందకు ప్రయత్నిస్తాము. ఈ సీజన్లో ప్రతీ మ్యాచ్ను కీలకంగా భావించి ముందుకు వెళ్తాము. నెట్స్లో కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాము" అని అయ్యర్ పేర్కొన్నాడు. అదేవిధంగా పాంటింగ్ కూడా అయ్యర్ను పొగడ్తలతో ముంచెత్తాడు.శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు"శ్రేయస్ మంచి కెప్టెనే కాదు.. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా. అతడు ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అన్న విషయం మనకు తెలుసు. అతడితో ఇంకా మేము ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే శ్రేయస్ మూడు రోజుల కిందటే క్యాంపులో చేరాడు.కెప్టెన్గా తన పనిని అయ్యర్ ప్రారంభించాడు. మా తొలి మ్యాచ్కు అన్ని విధాల సిద్దంగా ఉంటామని" పాంటింగ్ వెల్లడించాడు. కాగా వీరిద్దరూ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కలిసి పనిచేశారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో అయ్యర్ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. కాగా ఐపీఎల్-18 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ జట్లు తలపడనున్నాయి.చదవండి: ధనశ్రీకి చహల్ కౌంటర్?.. ఆ మాటలకు అర్థం ఏమిటి? మధ్యలో ఆమె! -
టీమిండియాలో నో ఛాన్స్.. చాహల్ కీలక నిర్ణయం
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. చాహల్ 2025 సీజన్లో నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత చాహల్ ఇంగ్లండ్కు పయనం కానున్నాడు. ఈ ఏడాది జూన్లో చాహల్ నార్తాంప్టన్షైర్ క్రికెట్ జట్టులో చేరి సీజన్ ఆఖరి వరకు కొనసాగనున్నాడు.రెడ్బాల్ క్రికెట్తో పాటు రాయల్ లండన్ వన్డే కప్నకు కూడా చాహల్ అందుబాటులో ఉండనున్నాడు. చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనుండడం ఇది రెండోసారి. అంతకుముందు 2023లో నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్కే చాహల్ ప్రాతినిథ్యం వహించాడు. కేవలం నాలుగు మ్యాచ్ల్లో 21.10 సగటుతో 19 వికెట్లు పడగొట్టి.. నార్తాంప్టన్షైర్ను డివిజన్ టూలో నాల్గవ స్థానానికి చేర్చాడు. ఇక మరోసారి నార్తాంప్టన్షైర్ క్రికెట్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై చాహల్ స్పందించాడు."గత సీజన్లో కౌంటీల్లో ఆడిన సమయాన్ని నేను ఆస్వాదించాను. మరోసారి నార్తాంప్టన్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషం ఉంది. నార్తాంప్టన్షైర్ డ్రెస్సింగ్ రూమ్లో లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. వారితో కలిసి మరోసారి డ్రెసింగ్ రూమ్ను పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.గత సీజన్లో చివరివరకు మేము అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈ సీజన్లో భారీ విజయాలను సాధిస్తామని ఆశిస్తున్నాము" అని చాహల్ పేర్కొన్నాడు. చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చాహల్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు. అయితే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో అతడ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఈ టోర్నీ మొత్తం బెంచ్కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్-2025 సీజన్ కోసం ఈ లెగ్గీ సన్నద్దమవుతున్నాడు. మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ -
Hardik Pandya: ఈ విజయం ఆయనకే అంకితం.. హార్దిక్ పాండ్యా భావోద్వేగం
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్ను భారత్కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్గా నిలిచింది. మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్గా నిలవడంలో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు వెన్నముకగా నిలిచాడు.ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్పై కూడా సంచలన స్పెల్ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు."నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్లో అందరం కలిసిమెలిసి ఉంటాము. నా పదేళ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్ -
జామ్నగర్లో రవీంద్ర జడేజా ఫామ్లో గుర్రాలను మీరు చూడండి (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత జట్టు అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను తిరిగి ముద్దాడింది. ఈ విజయంతో 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభావానికి భారత జట్టు బదులు తీర్చుకుంది. ఈ మెగా టోర్నీలో అద్వితీయమైన ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. మరోసారి 140 కోట్లమంది భారతీయులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. తొలుత బౌలర్లు అదరగొట్టగా.. అనంతరం బ్యాటర్లు తమ పని తాము చేసుకుపోయారు. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.రోహిత్ మాస్.. రాహుల్ క్లాస్లక్ష్య చేధనలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను హిట్మ్యాన్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అయితే సెంచరీ చేరువలో ఓ భారీ షాట్కు ప్రయత్నించి స్టంపౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మరోసారి వెన్నముకగా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63), మైఖేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు సాధించగా.. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.టీమిండియా వరల్డ్ రికార్డు..కాగాభారత్కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. ఈ క్రమంలో టీమిండియా ఓ ప్రపంచరికార్డును తమ పేరిట లిఖించుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా.. ఆ తర్వాత 2013, 2025లో ఈ మెగా టోర్నీ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా, భారత్ పేరిట సంయుక్తంగా ఉండేది. కానీ ఈ విజయంతో ఆసీస్ను మెన్ బ్లూ అధిగమించింది. అదేవిధంగా వరుసగా రెండు ఐసీసీ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్గా నిలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. టీ20 ప్రపంచకప్-2024లో ఆజేయంగా విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోలేదు.చదవండి: #Rohit Sharma: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక ప్రకటన.. -
భారత్ ఘన విజయం.. అభిమానంతో దద్దరిల్లిన ట్యాంక్ బండ్ (ఫొటోలు)
-
అతడికి కొత్త బంతిని ఇవ్వండి.. హెడ్కు చుక్కలు చూపిస్తాడు: అశ్విన్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో దుబాయ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ సెమీస్ పోరు కోసం ఇరు జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్కు ఆర్హత సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కొత్త బంతితో బౌలింగ్ చేసే అవకాశమివ్వాలని అశ్విన్ సూచించాడు. కాగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడిన వరుణ్.. 5 వికెట్లు పడగొట్టి భారత్కు అద్బుతమైన విజయాన్ని అందించాడు."ట్రావిస్ హెడ్ను అడ్డుకోవాలంటే పవర్ప్లేలో బౌలింగ్ వరుణ్ చక్రవర్తితో చేయించాలి. హెడ్కు స్టంప్స్ దిశగా బౌలింగ్ చేయమని వరుణ్కు చెప్పండి. అప్పుడు హెడ్ స్టంప్స్ను విడిచిపెట్టి ఓవర్ ది ఫీల్డ్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బంతి మిస్స్ అయ్యి స్టంప్స్ను తాకే అవకాశముంది.అంతేకాకుండా బౌలింగ్ తగ్గట్టు ఫీల్డ్ సెట్ చేస్తే హెడ్ దొరికిపోయే ఛాన్స్ ఉంది. వరుణ్ చక్రవర్తి కొత్త బంతితో భారత్కు మంచి అరంభాన్ని అందించగలడు. వరుణ్ బౌలింగ్లో హెడ్ నెమ్మదిగా ఆడుతాడని నేను అనుకోను. అతడు కచ్చితంగా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. వరుణ్ బౌలింగ్లో షాట్లు ఆడటం అంత సులువు కాదు. కాబట్టి వరుణ్ బౌలింగ్లో హెడ్ ఔటయ్యే అవకాశముంది. ఏదేమైనప్పటికి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి,ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షియస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్చదవండి: మాపై ఒత్తడి లేదు.. ఇది సాధారణ మ్యాచ్ మాత్రమే: శ్రేయస్ అయ్యర్ -
యువీ స్పిన్ మ్యాజిక్.. రాయుడు మెరుపులు! సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ టీ20 లీగ్ టోర్నీలో ఇండియా మాస్టర్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం వడోదర వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. భారత బౌలర్లు చెలరేగడంతో 13.5 ఓవర్లలో కేవలం 85 పరుగులకే ఆలౌటైంది.భారత బౌలర్లలో స్పిన్నర్ రాహుల్ శర్మ, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మూడు వికెట్లతో సత్తాచాటారు. రాహుల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇవ్వగా.. యువీ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు ఇచ్చాడు. వీరిద్దరితో పాటు నేగీ, బిన్నీ తలా రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో హెన్రీ డేవిడ్స్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారురాయుడు ఆజేయంగా..అనంతరం 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 11 ఓవర్లలోనే ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అంబటి రాయుడు(34 బంతుల్లో 7 ఫోర్లతో 41) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు పవన్ నేగి(21 నాటౌట్) రాణించాడు. అయితే భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్ మాత్రం ఈ మ్యాచ్లో తన మార్క్ను చూపించలేకపోయాడు. సచిన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇక మూడు వికెట్లతో సత్తాచాటిన రాహుల్ శర్మకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో మార్చి 5న వడోదర వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి.. -
భారత్కు అడ్వాంటేజ్.. ఇంగ్లండ్ మాజీలకు ఇచ్చిపడేసిన గవాస్కర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలగా హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నీ పాకిస్తాన్ ఒక్క వేదికగానే జరగాల్సి ఉండగా.. ఆ దేశానికి భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతను కారణంగా ఐసీసీకి చూపించింది.దీంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పీసీబీని ఒప్పించింది. దీంతో భారత్ తమ మ్యాచ్లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడుతోంది. ఈ క్రమంలో ఒకే వేదికలో మ్యాచ్లను నిర్వహించడం ద్వారా భారత్కు అడ్వాంటేజ్ కలుగుతోందని ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైఖేల్ అథర్టన్ ఐసీసీ తీరును తప్పుబట్టారు.వీరిద్దరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ తరహా కామెంట్సే చేశారు. తాజాగా ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటరిచ్చాడు. ముందు మీ జట్టు సంగతి చూసుకుండి, తర్వాత ఇతర జట్ల గురించి మాట్లాడండి అంటూ సన్నీ ఫైరయ్యాడు."మీరంతా ఎంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు. అంతేకాకుండా చాలా తెలివైన వారు కూడా. అసలు మీ జట్టు(ఇంగ్లండ్) ఎందుకు సెమీస్కు ఆర్హత సాధించలేకపోయిందో సమీక్షించుకుండి సర్. ఎప్పుడూ భారత జట్టుపై దృష్టి సారించే బదులు, మీ సొంత టీమ్పై ఫోకస్ చేయవచ్చుగా. మీ ఆటగాళ్లు చాలా పేలవంగా ఆడుతున్నారు. వారు అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతున్నారు. ఫస్ట్ మీ దేశం, మీ టీమ్ గురుంచి ఆలోచించడండి. అంతే తప్ప భారత్కు అది జరిగింది, భారత్ ఇలా ఆడింది అని పనికిమాలిన కామెంట్స్ ఎందుకు. భారత జట్టు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మీ వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ సేవలు అద్బుతం.ఆటపరంగానే కాకుండా, ఆర్థికపరంగా కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. టెలివిజన్ హక్కులు. మీడియా ఆదాయం ద్వారా భారీగా ఆదాయం వస్తోంది. కామెంటేర్లగా మీరు తీసుకుంటున్న జీతాలు కూడా భారత్ వల్లేనన్న విషయం మర్చిపోకండి "అంటూ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ మండిపడ్డాడు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్టు గ్రూపు స్టేజిలోనే ఇంటి ముఖం పట్టింది. అఫ్గానిస్తాన్ చేతిలో మరోసారి ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఈ ఓటుములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ తప్పుకున్నాడు. ఇంగ్లండ్ తమ ఆఖరి మ్యాచ్ శనివారం రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడుతోంది.చదవండి: 'భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం -
టీమిండియాకు భారీ షాక్.. రోహిత్కు గాయం! గిల్కు జ్వరం?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్కు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకున్న భారత జట్టు.. కివీస్పై కూడా గెలిచి గ్రూపు స్టేజిని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ కోసం దుబాయ్లోని ఐసీసీ ఆకాడమీ గ్రౌండ్లో మెన్ ఇన్ బ్లూ తీవ్రంగా శ్రమిస్తోంది.అయితే ఈ మ్యాచ్కు ముందు భారత్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నట్లు తెలుస్తోంది. హిట్మ్యాన్తో పాటు స్టార్ ప్లేయర్ శుబ్మన్ గిల్కు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ బుధవారం జరిగిన టీమ్ నెట్ ప్రాక్టీస్కు దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అస్వస్థత కారణంగా గిల్ హోటల్ రూమ్కే పరిమితం కాగా.. రోహిత్ శర్మ మైదానంకు వచ్చినప్పటికి ప్రాక్టీస్లో మాత్రం పాల్గోలేదని క్రిక్బజ్ తమ కథనంలో పేర్కొంది. గాయం తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రాక్టీస్ను రోహిత్ స్కిప్ చేశాడని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.కాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు. కొన్ని ఓవర్ల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి మైదానంలో వచ్చాడు. అయినప్పటికి రోహిత్ అంత ఫిట్నెస్గా కన్పించలేదు. అయితే రోహిత్, గిల్ ప్రాక్టీస్కు దూరంగా ఉండడంపై బీసీసీఐ నుంచి ఎటుంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.సూపర్ ఫామ్లో గిల్..కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో 101 పరుగులు చేసిన గిల్.. పాకిస్తాన్పై 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ కూడా తొలి రెండు మ్యాచ్ల్లో తన బ్యాట్ను ఝలిపించాడు. ఒకవేళ వీరిద్దరూ న్యూజిలాండ్తో మ్యాచ్కు దూరమైతే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. మరోవైపు గాయం నుంచి కోలుకున్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ప్రాక్టీస్ను మొదలు పెట్టాడు. రోహిత్, గిల్ కివీస్తో మ్యాచ్కు దూరమైతే వారి స్ధానాల్లో వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
బాబర్ ఆజం అరుదైన రికార్డు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam) మరోసారి తన మార్క్ను చూపించడంలో విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై హాఫ్ సెంచరీతో పర్వాలేదన్పించిన బాబర్.. టీమిండియాతో జరుగుతున్న రెండో మ్యాచ్లో మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు.ఓపెనర్గా బరిలోకి దిగిన బాబర్.. 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి ఆజం ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో బాబర్ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటికి.. ఓ అరుదైన రికార్డును మాత్రం తన పేరిట లిఖించుకున్నాడు.మూడో పాక్ బ్యాటర్గా..ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో 1000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో పాకిస్తాన్ బ్యాటర్గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు. హర్షిత్ రాణా బౌలింగ్లో కవర్ డ్రైవ్ షాట్తో బాబర్ ఈ ఫీట్ను అందుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి ఆజంకు 24 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ ఓపెనర్ సయీద్ అన్వర్(1204) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో జావేద్ మియాందాద్(1083) ఉన్నారు. కాగా బాబర్ ఆజం గత కొంత కాలంగా తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడి చివరి సెంచరీ ఆగస్టు 2023లో నేపాల్పై సాధించాడు.అప్పటి నుంచి మూడెంకెల స్కోర్ను ఈ మాజీ అందుకోలేకపోతున్నాడు. ఓవరాల్గా తన కెరీర్లో ఇప్పటివరకు 128 వన్డేలు ఆడిన ఆజం.. 55.51 సగటుతో 6106 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 19 సెంచరీలు ఉన్నాయి. చదవండి: Ind vs Pak: పాక్తో మ్యాచ్లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్ -
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్-భారత్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ షురూ అయింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తెల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో పాక్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన ఫఖార్ జమాన్ స్దానంలో ఇమామ్ ఉల్ హాక్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.టీమిండియా చెత్త రికార్డు..కాగా ఈ మ్యాచ్ ప్రారంభం కాకముందే టీమిండియా ఓ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన జట్టుగా భారత్ చెత్త రికార్డును నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్-2023 నుంచి భారత్ ఇప్పటివరకు వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయింది.ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు పేరిట ఉండేది. డచ్ జట్టు 2011-2013 కాలంలో వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయింది. తాజా మ్యాచ్తో నెదర్లాండ్స్ను భారత్ అధిగమించింది. అదేవిధంగా వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.రోహిత్ ఇప్పటివరకు వరుసగా 9 సార్లు టాస్ ఓడిపోయాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అగ్రస్ధానం ఉన్నాడు. లారా వన్డేల్లో వరుసగా 12 సార్లు టాస్ ఓడిపోయాడు.తుది జట్లు..పాకిస్తాన్: సౌద్ షకీల్, బాబర్ ఆజమ్, ఇమామ్ ఉల్ హక్, రిజ్వాన్ (కెప్టెన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
IND Vs PAK: పాకిస్తాన్తో మ్యాచ్.. టీమిండియాకు భారీ షాక్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సర్వం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా దాయాదుల పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది.భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్లో ఎడమ కాలికి గాయమైనట్లు సమాచారం. తాజాగా మ్యాచ్కు ముందు ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ఎడమ కాలికి ఐస్ ప్యాక్ పెట్టుకుని కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. దీంతో పాక్తో మ్యాచ్కు కోహ్లి అందుబాటులో ఉంటాడా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది.అయితే విరాట్ గాయంపై బీసీసీఐ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో కోహ్లి తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకవేళ కోహ్లి పాక్తో మ్యాచ్కు దూరమైతే రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక హైవోల్డేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.భారత్దే పై చేయి..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ముఖాముఖి 21 మ్యాచ్ల్లో తలపడగా.. 16 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా, పాక్ కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఓవరాల్గా వన్డే క్రికెట్లో అయితే భారత్పై పాక్ పై చేయి సాధించింది.ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 3, భారత్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి.చదవండి: IND vs PAK: 'అతడొక అద్భుతం.. పాక్పై 60 బంతుల్లోనే సెంచరీ చేస్తాడు' Virat Kohli spotted with an ice pack on his left leg after India’s practice session ahead of the high-voltage clash against Pakistan. A concern or just routine recovery? #INDvPAK #ViratKohli #CT2025 pic.twitter.com/eSUSETB6FY— Ankan Kar (@AnkanKar) February 22, 2025 -
ట్రెండింగ్ లో చాహల్, ధనశ్రీ.. ఎందుకో తెలుసా (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్ను చేరుకోవడానికి రోహిత్కు 261 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్లలో సాధించాడు. తాజా మ్యాచ్తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి హిట్మ్యాన్ తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
రోహిత్ శర్మ మంచి మనసు.. ఫ్యాన్స్ ఫిదా! వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్ -
ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్(Bangladesh) కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా.. ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్ను సాధించలేకపోయాడు.అసలేం జరిగిందంటే..?బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్కు పంపాడు. దీంతో అక్షర్కు తొలి హ్యాట్రిక్ సాధించే అవకాశం లభించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ క్లోజ్ ఫీల్డ్ను సెట్ చేశాడు.ఆ ఓవర్లో నాలుగో బంతిని అక్షర్.. అలీకి ఔట్సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మొదటి స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ ఈజీ క్యాచ్ను జారవిడిచాడు. అందరూ రోహిత్ అందుకున్నాడని భావించినప్పటికి ఆఖరి నిమిషంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది. అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంటనే అక్షర్కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్.. 31 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్ అలీకి రెండు ఛాన్స్లు లభించాయి. భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్కప్ వరకు అతడే కెప్టెన్’This moment could have put Axar's name in the record books for decades. But Rohit Sharma successfully ruined it 😒 pic.twitter.com/zDnFk83r0D— Mark. (@CheekuGang) February 20, 2025 -
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్ను మార్చుకోవాలి" అని ప్రెస్కాన్ఫరెన్స్లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్కు చేరుకున్న భారత జట్టు నెట్స్లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్కప్నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్కు ఛాన్సులు ఎక్కువే! -
ICC Champions Trophy: దుబాయ్కు చేరుకున్న భారత జట్టు..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్లో అడుగుపెట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ గౌతం గంభీర్తో కూడిన తొలి బృందం శనివారం దుబాయ్కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.ఈ మొదటి బ్యాచ్లో రోహిత్-కోహ్లిలతో పాటు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్లు ఉన్నారు. మిగతా ప్లేయర్లు ఆదివారం దుబాయ్కు చేరుకునే అవకాశముంది.ఇక దుబాయ్కు చేరుకున్న భారత ఆటగాళ్లు ఆదివారం నుంచి తమ ప్రాక్టీస్ను మొదలు పెట్టనున్నారు. ఈ టోర్నీలో రన్నరప్గా బరిలోకి దిగుతున్న బారత జట్టు.. ఈసారి ఎలాగైనా ఛాంపియన్స్గా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.బుమ్రా స్ధానంలో యువ పేసర్ హర్షిత్ రాణాకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ను జట్టు నుంచి తప్పించారు. జైశ్వాల్ స్ధానంలో మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల కాలంలో వరుణ్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న ఇదే వేదికలో దాయాది పాకిస్తాన్తో అమీతుమీ తెల్చుకోనుంది. కాగా భారత్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ఈ టోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
'అతడొక సూపర్ స్టార్.. దుబాయ్లో దుమ్ములేపుతాడు'
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన రీఎంట్రీలో సత్తాచాటలేకపోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తన రిథమ్ను తిరిగి పొందడానికి ఈ బెంగాల్ స్టార్ సీమర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లో షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) రూపంలో షమీ మరో సవాలు ఎదురు కానుంది. ఈ టోర్నీకి పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్కు షమీనే నాయకత్వం వహించాలి.అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యాతో కూడా పేస్ త్రయాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత షమీపైనే ఉంది. అయితే షమీ తన రిథమ్ను అందుకుంటే అపడం ఎవరి తరం కాదు. ఇప్పటికే 2023 వన్డే వరల్డ్కప్లో తనంటో ఈ స్పీడ్ స్టార్ నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో షమీపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో షమీ దుమ్ములేపుతాడని రాబిన్సింగ్ జోస్యం చెప్పాడు. కాగా రాబిన్ సింగ్ ప్రస్తుతం ఇంటర్ననేషనల్ టీ20 లీగ్లో ఎంఐ ఎమిరేట్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. దీంతో దుబాయ్ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటుందో అతడికి బాగా తెలుసు. ఈ క్రమంలోనే దుబాయ్ వికెట్ షమీకి సరిగ్గా సెట్ అవుతాందని రాబిన్ సింగ్ అంచనా వేశాడు."దుబాయ్ వికెట్పై రాత్రి పూట బౌలింగ్ చేయడం కొంచెం కష్టమనే చెప్పాలి. మంచు కారణంగా బంతి బౌలర్లు చేతి నుంచి జారిపోయే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మంచు విస్తృతంగా లేదు. ఈ వికెట్పై రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. పరుగులు సునాయసంగా రాబట్టవచ్చు. కానీ ఈ పరిస్థితులను మంచి సీమ్ బౌలర్ అయితే తనకు తగ్గట్టు మలుచుకుంటాడు. షమీలాంటి స్పీడ్ స్టార్కు ఈ వికెట్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సరైన లెంగ్త్తో పాటు గుడ్ ఏరియాలలో అతడు హిట్ చేస్తాడు. షమీ పర్ఫెక్ట్ సీమ్ పొజిషన్ కలిగి ఉన్నాడని" ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ సింగ్ పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిచదవండి: IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి -
Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఈమెగా ఈవెంట్లో మొత్తం 8 జట్లు భాగం కానున్నాయి.ఇక ఈ మెగా టోర్నీకి సంబంధించిన ప్రైజ్మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శుక్రవారం వెల్లడించింది. మొత్తం ప్రైజ్ మనీ రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ఖరారు చేసింది. చివరగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈ ప్రైజ్మనీ 53 శాతం అధికం కావడం గమనార్హం.విజేతకు ఎంతంటే?ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 2.24 మిలియర్ డాలర్లు (సుమారు రూ. 20 కోట్లు) నగదు బహుమతి అందనుంది. అదేవిధంగా రన్నరప్కు 1.12 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 12 కోట్లు), సెమీ ఫైనలిస్ట్లు ఒక్కొక్కరికి 560,000 డాలర్లు(సుమారు రూ.5 కోట్లు) లభించనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్మనీ కేటాయించింది.గ్రూపు స్టేజిలో విజయం సాధించిన జట్టుకు 34,000 డాలర్లు(సుమారు. 3 కోట్లు) అందనుంది. అదేవిధంగా ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జట్లు 350,000 డాలర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాలర్లు(రూ. సుమారు 1. 2 కోట్లు) దక్కించుకోనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాల్గోన్నందకు ప్రతీ జట్టుకు 125,000 డాలర్లు(రూ.కోటి) ఐసీసీ అందజేయనుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్? -
భారత్ ఆల్రౌండ్ షో.. మూడో వన్డేలో ఇంగ్లండ్ చిత్తు
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో భారత్(Teamindia) ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 355 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.లక్ష్య చేధనలో ఓపెనర్లు ఫిల్ సాల్ట్(23), డకెట్(34) తొలి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్(38) కూడా కాసేపు దూకుడగా ఆడాడు. కానీ సాల్ట్, బాంటన్ ఔటయ్యాక ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. వరుస క్రమంలో వికెట్ల కోల్పోయి ఇంగ్లీష్ జట్టు వైట్ వాష్కు గురైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ చెరో వికెట్ సాధించారు.శతక్కొట్టిన శుబ్మన్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో శుబ్మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 112) సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మార్క్ వుడ్ రెండు, సకీబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, జో రూట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా ప్లేయర్ ఆఫ్ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు రెండూ శుబ్మన్ గిల్కే దక్కాయి.ఛాంపియన్స్ ట్రోఫీకి సై..ఇక ఇంగ్లండ్ను స్వదేశంలో ఊడ్చేచిన భారత్కు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కఠిన సవాలు ఎదురు కానుంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు ఫిబ్రవరి 15న దుబాయ్కు పయనం కానుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SA vs PAK: పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. సఫారీలు ఇచ్చిపడేశారుగా! వీడియో -
ఇంగ్లండ్కు ఊహించని షాక్.. అతడికి గాయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ ముంగిట ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్(Jos Butler) గాయపడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో బట్లర్ కుడి చేతి భుజానికి గాయమైంది.భారత ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో జోస్ గాయపడ్డాడు. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో బట్లర్ మైదానాన్ని వీడాడు. అతడు తిరిగి మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టాండిన్ కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తున్నాడు.అదేవిధంగా బట్లర్కు సబ్స్ట్యూట్గా రెహాన్ ఆహ్మద్ ఫీల్డ్లోకి వచ్చాడు. కాగా అద్బుతమైన ఫామ్లో ఉన్న బట్లర్ గాయపడటం నిజంగా ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే యువ ఆటగాడు జాకబ్ బెతల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా బట్లర్ గాయం ఇంగ్లండ్ టీమ్ మెనెజ్మెంట్ను ఆందోళన కలిగిస్తోంది.అయితే బట్లర్ గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా భారత్తో మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఘోర పరాభావం చవిచూసింది.ఈ క్రమంలో ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఆఖరి మ్యాచ్లో కూడా భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో తన 7వ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 64 బంతులు ఎదుర్కొన్న గిల్.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(78), విరాట్ కోహ్లి(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ జట్టు:జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్స్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జో రూట్చదవండి: IND vs ENG: శుబ్మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్గా -
ఆసీస్, భారత్, ఇంగ్లండ్ కాదు.. ఆ జట్టు చాలా డేంజరస్: రవి శాస్త్రి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ వరల్డ్కప్ కోసం ఆయా జట్లు అన్ని విధాల సన్నదమవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు గ్రూపు-ఎలో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా గ్రూపు-బిలో ఉన్నాయి. భారత జట్టు విషయానికి వస్తే తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ చిరకాల ప్రత్యర్ధుల పోరు ఫిబ్రవరి 23న జరగనుంది.ఆ జట్టుతో జాగ్రత్త..ఇక ఈ మెగా టోర్నీకి ముందు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ను తక్కువగా అంచనా వేయెద్దని ఈ టోర్నీలో పాల్గోనే జట్లకు రవిశాస్త్రి హెచ్చరించాడు. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది.దక్షిణాఫ్రికా, జింబాబ్వే , ఆస్ట్రేలియాపై వరుసగా మూడు వన్డే సిరీస్లను గెలుచుకున్న పాకిస్తాన్.. ఛాంపియన్స్ ట్రొఫీలో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై పాకిస్తాన్కు అద్బుతమైన రికార్డు ఉంది. షాహీన్ షా అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీం షా వంటి పేస్ త్రయం పాక్ జట్టులో ఉంది.గత కొన్ని నెలల నుంచి వైట్ బాల్ క్రికెట్లో పాకిస్తాన్ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో పాక్ ప్లేయర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. సౌతాఫ్రికా వంటి పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాదు. అయితే దురదృష్టవశాత్తు యువ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.అతడు అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నీలో అతడు కీలకంగా మారుతాడని పాక్ ఆశలు పెట్టుకుంది. కానీ అయూబ్ గాయం కారణంగా ఈ ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అయితే అయూబ్ లేనంతమాత్రన పాక్ను తేలికగా తీసుకోవద్దు. లోతైన బ్యాటింగ్ లైనప్ వారికి ఉంది. సాధరణంగా ఏ జట్టు అయినా వారి సొంతగడ్డపై డేంజరస్గా ఉంటుంది. పాకిస్తాన్ కనుక సెమీస్ చేరుకుంటే, ఆ జట్టు డబుల్ డేంజరస్గా మారుతుంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: SA vs NZ: సౌతాఫ్రికాతో మ్యాచ్.. కేన్ మామ సూపర్ సెంచరీ! వీడియో వైరల్ -
ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ప్రయాణానికి ముహూర్తం ఖరారు!?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు కౌంట్డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది. పాక్ జట్టు ఈసారి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఓ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యమివ్వనుండడం 29 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్బోర్డు భావిస్తోంది.అయితే భారత్ ఆడే మ్యాచ్లు మొత్తం దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్ సెమీఫైనల్, ఫైనల్కు చేరినా ఈ మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగనున్నాయి. ఇక ఇప్పటికే ఈ ఈవెంట్లో పాల్గోనే ఆ దేశ క్రికెట్ బోర్డులు తమ జట్లను సైతం ప్రకటించాయి. ఈ మినీ వరల్డ్కప్ కోసం అన్ని దాదాపు అన్ని తమ సన్నాహకాల్లో బీజీబీజీగా ఉన్నాయి. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడుతుండగా.. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు ట్రైసిరీస్లో తలపడుతున్నాయి.ముహూర్తం ఖరారు..కాగా మెగా టోర్నీ కోసం భారత జట్టు దుబాయ్ వెళ్లేందుకు ముహర్తం ఖారారైంది. ఫిబ్రవరి 15న రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా దుబాయ్కు పయనం కానుంది. భారత జట్టు ప్రస్తుతం మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. ఇప్పటికే రెండు వన్డేల ముగియగా.. ఆఖరి వన్డే బుధవారం(ఫిబ్రవరి 12) జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఈ మెగా టోర్నీలో పాల్గోనేందుకు రోహిత్ సేన వెళ్లనుంది.అదేవిధంగా స్పోర్ట్స్ టాక్ రిపోర్ట్ ప్రకారం.. భారత జట్టు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండానే నేరుగా ఈ మెగా టోర్నీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ప్రతీ ఐసీసీ ఈవెంట్కు ముందు ఆయా జట్లు కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడుతాయి.తొలుత భారత్ కూడా యూఏఈ లేదా బంగ్లాదేశ్తో ఓ వార్మాప్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ జట్ల బీజీ షెడ్యూల్ కారణంగా వార్మాప్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఐసీసీకి వీలుపడలేదు. ఇక ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు -
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సమయం అసన్నమవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, యూఏఈ వేదికలగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్లో అందరి కళ్లు భారత్-పాకిస్తాన్ మ్యాచ్పైనే ఉన్నాయి. ఈ టోర్నీ మొత్తం ఒక లెక్క.. ఈ దాయుదుల పోరు ఒక లెక్క. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల మధ్య పాక్-భారత్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.దీంతో ఈ రెండు జట్లు ఎప్పుడెప్పుడు తలపడతాయా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు మరి కొన్ని రోజుల్లో తెరపడనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ జట్టుకు దిశానిర్దేశం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఎంత ముఖ్యమో, టీమిండియాను ఓడించడం అంతే ముఖ్యమని షరీఫ్ ఉద్ఘాటించారు. శుక్రవారం రాత్రి లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాలా బాగుంది. ఇటీవల కాలంలో ఆటగాళ్లు సైతం అద్బుతంగా రాణిస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి అసలైన సవాలు ఎదురు కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా మన చిరకాల ప్రత్యర్ధి భారత్పై విజయం సాధించాలి. దేశం మొత్తం మీ వెనక ఉంది. అల్ ది బెస్ట్ అంటూ" షరీఫ్ పేర్కొన్నారు. కాగా షరీఫ్ వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగా కౌంటరిస్తున్నారు. మీకు అంత సీన్ లేదులే.. ముందు గెలిచి మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా గత రెండు ఐసీసీ టోర్నీల్లోనూ పాక్ను భారత్ మట్టికర్పించింది. వన్డే ప్రపంచకప్-2023లో దాయాదిని చిత్తు చేసిన భారత్.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో మాత్రం పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూసింది.ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ అజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రర్ షాహమ్, హరీస్ నహ్మద్, హరీస్ నహ్మద్, హరీస్ షాహమ్ రౌఫ్ అఫ్రిది. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్దీప్ సింగ్చదవండి: రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్ -
పూరీ జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు! వీడియో వైరల్
కటక్ వేదికగా ఇంగ్లండ్తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం(ఫిబ్రవరి 9) మధ్యహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి వన్డేలో పర్యాటక ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే కటక్కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో నిలబడాలని ఇంగ్లండ్ భావిస్తోంది.జగన్నాథుడిని దర్శించుకున్న భారత క్రికెటర్లు..ఈ క్రమంలో భారత క్రికెటర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ పూరి జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. పోలీసులు భారీ భద్రత మధ్య భారత క్రికెటర్లను ఆలయంలోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన వీరికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.రోహిత్ ఫామ్ను అందుకుంటాడా?ఇక ఇది ఇలా ఉండగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో కూడా అదే తీరును కనబరిచాడు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో హిట్మ్యాన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు తన వికెట్ను సమర్పించుకుంటున్నాడు. కనీసం రెండో వన్డేతోనైనా రోహిత్ తన ఫామ్లను అందుకోవాలని భావిస్తున్నారు.విరాట్ కోహ్లి ఇన్..!ఇక తొలి వన్డేకు గాయం కారంణంగా దూరమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫిట్నెస్ను సాధించాడు. దీంతో అతడు రెండో వన్డేలో జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. కింగ్ కోహ్లి జట్టులోకి వస్తే.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది.నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశ్వాల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో వన్డేలో భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డౌన్లో కోహ్లి బ్యాటింగ్కు రానున్నాడు.చదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు Odisha: Indian cricket team players visited the Jagannath Temple in Puri to seek blessings pic.twitter.com/fXtNjbJSuP— IANS (@ians_india) February 8, 2025 -
కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్కే వేటు
నాగ్పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.దీంతో నాగ్పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. "బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ సైతం అప్డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.జైశ్వాల్పై వేటు..ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్పై వేటు పడే అవకాశముంది. నాగ్పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్మన్ గిల్ను యథావిధిగా ఓపెనర్గా పంపాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది.సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..ఇక ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్లో పాకిస్తాన్పై ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు.. -
సూర్యకుమార్.. అందుకు సమయం అసన్నమైంది: అశ్విన్
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav) మాత్రం తన పేలవ ఫామ్తో తీవ్ర నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో విఫలమైన సూర్య.. ఇంగ్లండ్ సిరీస్లోనూ అదే తీరును కనబరిచాడు.ఐదు మ్యాచ్ల్లో మిస్టర్ 360 కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. అతడి చివరి ఐదు ఇన్నింగ్స్లో రెండు డకౌట్లు కూడా ఉండటం గమనార్హం. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నప్పటికి.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా పూర్తిగా ఈ ముంబైకర్ తేలిపోతున్నాడు. తన ఫేవరేట్ షాట్ల ఆడటంలో కూడా సూర్య విఫలమవుతున్నాడు.ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లోనూ సూర్య ఒకేలా ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ది కూడా ఇదే పరిస్థితి. దక్షిణాఫ్రికా సిరీస్లో వరుస సెంచరీలతో చెలరేగిన శాంసన్.. ఇంగ్లండ్పై మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్లో శాంసన్ కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. సంజూ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తొలి మూడు మ్యాచ్ల్లో జోఫ్రా అర్చర్ చేతికే సంజూ చిక్కాడు. అయితే ఆఖరి టీ20లో శాంసన్ చేతి వేలికి గాయం కావడంతో ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. అతడు తిరిగి మళ్లీ ఐపీఎల్-2025తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్, సంజూను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ తన బ్యాటింగ్ స్టైల్ను మార్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అశ్విన్ అన్నాడు."సిరీస్ గెలిచినప్పటికి సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం భారత్కు ప్రధాన సమస్యగా మారింది. ఈ సిరీస్లో అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. అతడి కెప్టెన్సీలో ఎటువంటి లోపాలు లేవు. కానీ బ్యాటింగ్ పరంగా మెరుగ్గా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు సంజూ శాంసన్ కూడా తన బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు.వీరిద్దిరూ ఒకే రకమైన బంతి, ఒకే ఫీల్డ్ పొజిషేన్లో ఔట్ అవ్వుతున్నారు. ఒకట్రెండు మ్యాచ్ల్లో ఇలా జరిగితే ఫర్వాలేదు. కానీ వీరిద్దరూ ప్రతీ మ్యాచ్లోనూ ఇదే తరహాలో తమ వికెట్లను కోల్పోతున్నారు. ఆటగాళ్లు స్వేఛ్చతో ఆడాలన్న విషయంతో నేను కూడా ఏకీభవిస్తాను. కానీ ఒకే తరహాలో ఔట్ అవుతున్నప్పుడు దానికి కొత్త సమాధానం కనుగొనాల్సిన బాధ్యత మీపై ఉంది. సూర్యకుమార్ యాదవ్ చాలా అనుభవం ఉన్న ఆటగాడు.బ్యాటింగ్లో భారత క్రికెట్ అప్రోచ్ను మార్చడంలో సూర్య భాగమయ్యాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ తన బ్యాటింగ్ విధానాన్ని కొద్దిగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నానని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: CT 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు -
జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని సిరాజ్, మహిరా సన్నిహితులు ధ్రువీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కలిసి కన్పించలేదు.అయినప్పటికి సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేయడం, ఫోటోలకు లైక్లు చేయడం వంటి చర్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ మొదలయ్యాయి. కాగా సిరాజ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవ్వడం ఇదేమి తొలిసారి కాదు.ఇటీవలే లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో ఈ స్టార్ పేసర్ ప్రేమలో ఉన్నాడని వార్తలు విన్పించాయి. కానీ వాటిని వారిద్దరూ కొట్టిపారేశారు. తమది అన్నాచెల్లెళ్ల బంధమంటూ చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరోసారి సిరాజ్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి.ఎవరీ మహిరా శర్మ?మహిరా శర్మ.. వర్ధమాన భారతీయ నటీమణులలో ఒకరు. నాగిన్-2, బేపనా ప్యార్, కుండలీ భాగ్యలాంటి సీరియల్స్ తో పాపులర్ అయింది. పలు పంజాబీ మ్యూజిక్ వీడియోలలో కూడా ఆమె కన్పించింది. అయినప్పటికి బిగ్ బాస్ 13లో పాల్గొన్న తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. అక్కడ తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె ప్రేమయాణం నడిపింది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు.స్పందించిన మహిరా తల్లి..అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ తాజాగా స్పందించింది. అసలేమి మాట్లాడుతున్నారు. వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు. ప్రజలు ఎదైనా మాట్లాడుతారు. ఇప్పుడు నా కుమార్తె సెలబ్రిటీ కాబట్టి ఎటువంటి వార్తలు రావడం సహజం. వీటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఈ వార్త పూర్తిగా అబద్ధమని టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా శర్మ పేర్కొంది.రంజీల్లో ఆడనున్న సిరాజ్..కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సిరాజ్ రంజీ బాట పట్టాడు. గురువారం నుంచి నాగ్పూర్లో విదర్భ జట్టుతో జరిగే ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్నాడు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2020లో చివరి రంజీ మ్యాచ్ కూడా విదర్భతోనే ఆడిన సిరాజ్... మళ్లీ ఆ ప్రత్యర్థితోనే దేశవాళీ ఆట ఆడబోతున్నాడు.చదవండి: అందరి చూపు కోహ్లి వైపు -
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
12 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్న కోహ్లి.. రేపే జట్టులోకి ఎంట్రీ?
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 30 నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్తో ప్రారంభం కానున్న మ్యాచ్లో ఢిల్లీ తరపున కింగ్ కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ శరణ్దీప్ సింగ్ ధ్రువీకరించాడు. విరాట్ మంగళవారం(జనవరి 28) ఢిల్లీ జట్టులో చేరి, ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనున్నట్లు ఆయన తెలిపారు.రెడ్ బాల్ క్రికెట్లో కోహ్లి గత కొంతకాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి టెస్టులో సెంచరీ మినహా మిగితా మ్యాచ్ల్లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ వంటి ప్లేయర్లు కూడా నిరాశపరిచాడు.ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రంజీ బాటపడుతున్నారు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సైతం ఆడేందుకు సిద్దమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.కాగా కోహ్లికి రంజీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్లో ఢిల్లీ తరపున ఆడాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు? -
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు చేరే జట్లు ఇవే.. అదేలా సాధ్యం భజ్జీ?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కు సమయం అసన్నమవుతోంది. పాకిస్తాన్, యూఏఈ అతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్లో కేవలం భారత్ ఆడే మ్యాచ్లు మాత్రమే దుబాయ్ వేదికగా జరగనుండగా.. మిగితా మ్యాచ్లన్నీ పాక్లోనే జరగనున్నాయి.ఈ టోర్నీ కోసం ఆతిథ్య పాక్ తప్ప మిగితా ఏడు దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ప్రకటించాయి. అయితే ఈ ఐసీసీ ఈవెంట్కు సమయం దగ్గర పడుతుండడంతో మాజీ క్రికెటర్లు సెమీస్, ఫైనల్కు చేరే జట్లను అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) సైతం ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ చేరే జట్లను అంచనా వేశాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరుతాయని క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ పేర్కొన్నాడు. అయితే ఇక్కడే భజ్జీ పప్పులో కాలేశాడు. ఎందుకంటే భజ్జీ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్ న్యూజిలాండ్.. గ్రూపు-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు మాత్రమే సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.కానీ భజ్జీ మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్కు చేరుకుంటాయని అంచనావేశాడు. మ్యాథమెటికల్గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు హార్బజన్ను ట్రోలు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంటలో భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: #RavindraJadeja: 12 వికెట్లతో చెలరేగిన జడేజా.. పంత్ టీమ్ చిత్తు -
పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. కట్ చేస్తే! 3 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. పదేళ్ల తర్వాత రంజీట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న రోహిత్ శర్మ.. అక్కడ కూడా తీవ్ర నిరాశపరిచాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ వేదికగా జమ్మూ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో హిట్మ్యాన్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్మూ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి 19 బంతులు ఆడి పేసర్ ఉమార్ నజీర్ బౌలింగ్లో ఔటయ్యాడు. అతడితో పాటు మరో స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సైతం విఫలమయ్యాడు. జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అకిబ్ నబీబ్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై కేవలం 41 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్, జైశ్వాల్తో పాటు కెప్టెన్ అజింక్య రహానే,హార్దిక్ తోమార్, శివమ్ దూబే వంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్కు చేరారు. జమ్మూ బౌలర్ ఉమార్ నజీర్ నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశాడు.తీరు మారని రోహిత్..కాగా రోహిత్ శర్మ రెడ్బాల్ ఫార్మాట్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 5 ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.అంతకముందు న్యూజిలాండ్ సిరీస్లోనూ హిట్మ్యాన్ అదే తీరును కనబరిచాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో తన రిథమ్ను తిరిగి పొందేందుకు రంజీల్లో ఆడాలని రోహిత్ నిర్ణయించుకున్నాడు. కానీ అక్కడ కూడా తన మార్క్ను చూపించలేకపోయాడు. కనీసం సెకెండ్ ఇన్నింగ్స్లోనైనా హిట్మ్యాన్ తన బ్యాట్కు పనిచెబుతాడో లేదో చూడాలి.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా Rohit Sharma out for 3 in 19 😶Embarrass!ng #RohitSharmapic.twitter.com/UIoY5tCj6Z— Veena Jain (@DrJain21) January 23, 2025 -
తండ్రికి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్.. వీడియో
టీమిండియా స్టార్ ప్లేయర్, కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ డౌన్ టు ఎర్త్ క్రికెటర్లలో ఒకడు. పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ సింగ్.. తనకు ఇష్టమైన ఆటకోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒకొనొక దశలో స్వీపర్గా పనిచేసిన రింకూ.. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అయితే రింకూ సింగ్ విజయం వెనక అతడి తండ్రిది ఖన్చంద్ర సింగ్ కీలక పాత్ర. ఖన్చంద్ర సిలిండర్ల మోస్తే వచ్చే డబ్బుతో రింకూ క్రికెట్ ఆడేవాడు. అతడి సంపాదనతో కుటుంబం మొత్తం గడిచేది. అయితే తాజాగా రింకూ సింగ్ తన తండ్రిపై ప్రేమను చాటుకున్నాడు. తన తండ్రికి రింకూ ఖరీదైన నింజా స్పోర్ట్స్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ బైక్ ఖరీదు రూ. 3.19 లక్షలగా ఉన్నట్లు తెలుస్తోంది. నింజా స్పోర్ట్స్ బైక్తో రింకూ తండ్రి అలీఘడ్లో చక్కర్లు కొడుతున్నాడు. ఆ సిటీలోని చిన్న చిన్న వీధుల్లో అతను కవాసాకి నింజా బైక్ను రైడ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తన తనయుడు స్టార్ క్రికెటర్ అయినప్పటికి.. ఖన్చంద్ర ఇంకా వంటగ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే పనని వదలకపోవడం విశేషం. మరోవైపు రింకూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ జరిగే అవకాశముంది. కాగా రింకూ సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు సిద్దమవుతున్నాడు. బుధవారం జరగనున్న తొలి టీ20లో రింకూ ఆడనున్నాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్తో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! అతడికి నో ఛాన్స్? View this post on Instagram A post shared by Sonu Lefti (@sonulefti0700)