టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య దేవిషా శెట్టి త్వరలోనే పండింటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలో శనివారం దేవిశా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ హ్యాపీ మూమెంట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దీంతో సూర్య- దేవిశా దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికి 2010లో ముంబైలోని ఆర్.ఎ పోడార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్లో మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఈ జంట 2016లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. దేవిషా వృత్తిరీత్యా భరతనాట్యం కోచ్. ఆమె సూర్య కెరీర్ ఆరంభం నుంచి అతడికి అండగా ఉంటూ వస్తోంది. ఎన్నో సందర్బాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన విజయాల్లో భార్య దేవిశా పాత్రను ఎప్పుడూ కొనియాడుతుంటారు. కాగా సూర్య ఇటీవల కెప్టెన్గా భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ను అందించిన సంగతి తెలిసిందే.
Baby shower of Suryakumar Yadav and Devika 😍❤️ pic.twitter.com/rYudGduOPE
— Jeet (@JeetN25) March 14, 2026
చదవండి: సన్రైజర్స్కు పాక్ ప్లేయర్ ఆడడం కష్టమే?


