breaking news
Mancherial District News
-
గూడెం గుట్ట..భక్తుల కిటకిట
దండేపల్లి: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో కార్తిక సందడి కొనసాగుతోంది. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో గూడెం గుట్ట భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవున్ని దర్శించుకుని పూజలు చేశారు. 905 జంటలు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నోముకున్నారు. గుట్ట కింద రావిచెట్టు వద్ద గుట్టపైన ఖాళీ ప్రదేశంలో మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఈవో శ్రీనివాస్, సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. సుమారు 600 మందికి అన్నదానం చేశారు. -
చిరువ్యాపారులపై కమిషనర్ జులుం
చెన్నూర్: వివిధ రాష్ట్రాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని వేధింపులకు గురిచేస్తున్న కమిషనర్ మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజుయాదవ్ డిమాండ్ చేశారు. కమిషనర్ తీరును నిరసిస్తూ ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల నుంచి బ్లాంకెట్లు, చద్దర్లు అమ్ముకుని జీవనం సాగించేందుకు 40 ఏళ్లుగా వ్యాపారులు వస్తున్నారని తెలిపారు. కమిషనర్ వారివద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే షాపులను జేసీబీలతో తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తానని వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి రత్నాకర్ మహదేవ్, నాయకులు దుర్గం రాజమల్లు, చిరు వ్యాపారులు కిషన్, విజయ్, సాగర్, కిరణ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పతకాల పంట
ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అండర్–17 బాల,బాలికల జూడో పోటీల్లో ఆదిలాబాద్ క్రీడా పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో ఈనెల 1, 2 తేదీల్లో నిర్వహించిన పోటీల్లో 12 పతకాలతో మెరిశారు. బాలికల్లో డి.నాగిని ప్రియ (–44 కేజీలు), పి.అక్షిత (–57), జి. సహస్ర (–48) లు స్వర్ణ పతకాలతో ప్రతిభ కనబరర్చారు. టి.సింధు (–52 కేజీలు) రజత పతకంతో మెరవగా, ప్రణీత(–63), బి.శృతి (–36)లు కాంస్య పతకాలతో సత్తా చాటారు. బాలురలో ఎస్.మనోజ్ కుమార్ (–40 కేజీలు), ఆర్.తరుణ్ (–55), ఎం.హర్షవర్ధన్(–60), ఆర్.మధు(–81), ఏ.సంతోష్ (–90)లు స్వర్ణ పతకాలు సాధించారు. పి.లోకేష్ (–66 కేజీల) ఈవెంట్లో రజత పతకం సాధించినట్లు కోచ్ రాజు తెలిపారు. డీవైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, క్రీడా పాఠశాల సిబ్బంది, శిక్షకులు తదితరులు వారికి అభినందనలు తెలిపారు. -
మొలకెత్తిన దూది
చెన్నూర్రూరల్: జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలు పత్తి రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలు చేతికి వచ్చే మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షం కురవడంతో పత్తి, వరి చేలు దెబ్బతిన్నాయి. ఏరే దశలో ఉన్న పత్తి తడిసిపోయింది. చెన్నూర్ మండలం కాంబోజిపేట గ్రామానికి చెందిన యువరైతు పెండ్లి సంతోష్ గ్రామ సమీపంలోనే ఎకరానికి రూ.15వేలు కౌలు చెల్లించి మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఇప్పటివరకు పత్తి పంట సాగుకు సుమారు రూ.లక్షకు పైగా ఖర్చు చేశాడు. మొక్కలకు ఉన్న పత్తి కాయల నుంచి పత్తి బయటకు వచ్చింది. కురిసిన వర్షాలకు ఇలా బయటకు వచ్చిన పత్తి మొత్తం తడిసి పోయి గింజలోంచి మొలకలు వచ్చాయి. ప్రభుత్వం ఆదుకోవాలని సదరు రైతు కోరుతున్నాడు. -
ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ
మంచిర్యాలఅర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1న కాగజ్నగర్లో నిర్వహించిన అండర్–14 జోనల్స్థాయి ఫుట్బాల్ పోటీల్లో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న పల్లపు హర్షవర్ధన్, తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణీత్ ఈ నెల 3న నుంచి 5 వరకు వికారాబాద్లో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, పీడీ రాజయ్య అభినందించారు. -
పత్తి కొనుగోళ్లు
నేటి నుంచి మంచిర్యాలఅగ్రికల్చర్/బెల్లంపల్లి/దండేపల్లి: జిల్లాలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ మూడు వ్యవసాయ మార్కెట్యార్డుల పరిధిలో 10 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. చెన్నూర్ పరిధిలో 6, బెల్లంపల్లిలో 3, లక్సెట్టిపేటలో 1 జిన్నింగ్ మిల్లులో ఏర్పాట్లు చేశారు. సోమవారం బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని తాండూర్ మండలంలో రేపల్లెవాడ జిన్నింగ్ మిల్లు, లక్సెట్టిపేట మార్కెట్ పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 నుంచి 13 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు అధికారుల అంచనా. గతేడాది ఆందోళనలు, రాస్తారోకోలుగతేడాది 7.58 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పత్తి అమ్ముకునేందుకు అరిగోస పడ్డారు. సీసీఐ నిబంధనతో అవస్థలు పడ్డారు. తేమ, పింజపొడవు తదితర నిబంధనల సాకుతో వారంలో మూడు నాలుగు రోజులు కొనుగోళ్లు నిలిపివేయడంతో పత్తి వాహనాలతో నిరీక్షించారు. డిసెంబర్, జనవరి మాసంలో మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయి త రచూ కొనుగోళ్లు నిలిపివేయడంతో రాస్తారోకోలు, ఆందోళనలు సైతం చేపట్టారు. కొంతమంది రైతులు సీసీఐ కొర్రీలతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు. వర్షాలతో తగ్గిన దిగుబడిఈ ఏడాది జిల్లాలో 1.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పంట నీటమునిగింది. కొన్నిచోట్ల మొక్కలు జాలువారి దిగుబడి తగ్గింది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా 4 నుంచి 5 క్వింటాళ్లకు మించి వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి వెళ్తే చాలని సరిపుచ్చుకుంటున్నారు. అరకొరగా వచ్చిన దిగుబడికి సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఏటా సీసీఐకి రైతులు తీసుకువచ్చిన పత్తికి తేమ, పింజపొడవు, తదితర నిబంధనల పేరుతో కొనుగోలు చేయడం లేదు. ఆరంభంలో తేమ 12 శాతం కంటే ఎక్కువగా వస్తుందని కొనుగోలు చేయడం లేదు. గడిచిన నాలుగేళ్లలో డిసెంబర్, జనవరి మాసాల్లో పెద్ద ఎత్తున పత్తి మార్కెట్లకు తరలివచ్చింది. ఈ సమయంలో సీసీఐ తేమ తిరకాసుతో రైతులు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయారు. నాణ్యమైన పత్తి తీసుకురావాలి జిల్లాలో సీసీఐ ద్వారా 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయనున్నప్పటికీ నేడు తాండూర్ మండలం రేపల్లెవాడ, లక్సెట్టిపేటలోని జిన్నింగ్ మిల్లులో కలెక్టర్ పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. పత్తి విక్రయించే రైతులు కపాస్ కి సాన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలి. నాణ్యమైన పత్తి తీసుకువచ్చి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర పొందాలి. – షాబొద్దీన్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అఽధికారిపత్తికి మద్దతు ధర ఇలా (క్వింటాలుకు)కొత్త తిప్పలు.. కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకవచ్చింది. పత్తి విక్రయించే రైతులు ముందుగా ఈ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయ శాఖ ద్వారా సాగు చేసిన పత్తి పంటకు సంబంధించి క్రాప్ బుకింగ్లో నమోదు చేసి ఉండాలి. ఆధార్కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీ లేదా, బయోమెట్రిక్/ ఐరిస్ ద్వారా కూడా ఆధార్ దృవీకరించనున్నారు. రైతులు ఆధార్కు అనుసంధానించిన సెల్ నంబర్ను యాప్లో నమోదు చేసుకుంటే స్లాట్ బుకింగ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్లో కపాస్ కిసాన్యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులో పత్తి విక్రయించే తేదీ, జిన్నింగ్ మిల్లు కేటాయిస్తారు. అవగాహన లేని రైతులకు ఏఈవోలు, సీసీఐ సిబ్బంది ద్వారా స్లాట్ బుకింగ్ సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీఐ నిబంధనల మేరకు 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయనుంది. 8 శాతం తేమ ఉంటే క్వింటాలుకు రూ.8,110, ఆపై పెరిగితే ఒక్క శాతానికి రూ.81 తగ్గించి ధర చెల్లించనున్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
నెన్నెల: వసతిగృహ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గూర్చి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు. పరిశుభ్రత పాటించాలని, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సిబ్బందికి సూచించారు. వంటగది, భోజనశాల, స్టోర్రూమ్ హాస్టల్కు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు ట్యూటర్లను నియమించాలని వార్డెన్ జయశంకర్ను ఆదేశించారు. -
ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి
నిర్మల్టౌన్: ఆర్యవైశ్యులు పార్టీలకతీతంగా రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఆదివారం పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఆమెడ శ్రీధర్, కార్యవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండేళ్ల పదవీ కాలంలో ఆర్యవైశ్యులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మల్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి రూ.25 లక్షల నిధుల విడుదలకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జిగా పట్టణానికి చెందిన పత్తి విజ్ఞతేజ నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్ మిరుదొడ్డి శ్యామ్, వైస్ చైర్మన్ యాద నాగేశ్వర్రావు, మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గాదె విలాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. గంజాయి సాగు చేసిన రైతుపై కేసు ఇంద్రవెల్లి: చేనులో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రైతుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇ.సాయన్న తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని పాటగూడ గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్.. ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న, కంది, పత్తి పంటలు, అంతర పంటగా 20 గంజాయి మొక్కలు సాగు చేశాడు. పక్కా సమాచారం మేరకు ఆదివారం భీంరావ్ చేనులో తనిఖీ చేయగా 20 గంజాయి మొక్కలు లభ్యం కాగా, వాటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కలప స్మగ్లింగ్ నిందితుడికి 14 రోజుల రిమాండ్ఖానాపూర్: కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పరిధిలో కలప స్మగ్లింగ్కు పాల్పడిన ఎంబడి శేఖర్కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు నిర్మల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాసు మె జిస్ట్రేట్, ఖానాపూర్ ఇన్చార్జి భవిష్య తెలి పారు. నిందితుడిని రాత్రి నిర్మల్ సబ్జైల్కు తరలించినట్లు ఎఫ్డీవో శివకుమార్, ఎఫ్ఆర్వో అనిత పేర్కొన్నారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకుంటామన్నారు. కలప పట్టివేతజన్నారం: మండలంలోని రోటిగూడ గ్రామంలో ఆదివారం సాయంత్రం తాళ్లపేట రేంజ్ అధికారి సుష్మారావు, ఇందన్పల్లి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పాలాజీ సుధాకర్, భాస్కర్ ఇళ్లలో రెండు కర్ర కోత యంత్రాలు, కలపను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వీటి విలువ రూ. 24,500 ఉంటుందన్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. తాళ్లపేట డీఆర్వోలు సాగరిక, పోచమల్లు, ఎఫ్ఎస్వోలు శంకర్, నరేశ్, బీట్ అధికారులు రహీమోద్దీన్, సాయ రవికిరణ్, అనిత, జ్యోతి, కృష్ణమూర్తి, రుబీనా, వెంకటేశ్, లవన్ ఉన్నారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి
ఖానాపూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధి గండిరాంపూర్కు చెందిన గాదె నరేశ్(22) గత కొంతకాలంగా ఖానాపూర్ మండలం సత్తన్పల్లి పంచాయతీ పరిధిలోని రాంరెడ్డిపల్లెలో నివాసం ఉంటున్నాడు. గతనెల 31న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు, గ్రామస్తులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. గ్రామంలో అడ్ప లక్ష్మారెడ్డి మామిడి తోటలో వ్యవసాయ బావిలో ఆదివారం మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. నరేశ్ మానసిక సమస్యతోపాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడని ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నస్పూర్: పట్టపగలే ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాక్కు ని ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ పరిధిలోని రాయల్ గార్డెన్ సమీపంలోని గణేశ్నగర్కు చెందిన చేవెళ్ల సరస్వతి.. ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం ఆమె పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించింది. ఆ తర్వాత తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి సరస్వతి మెడలోని రెండు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ అశోక్కుమార్, ఎస్సై ఉపేందర్రావు ఘటనస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ అక్కడికి చేరుకుని బాధితురాలితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆలయంలో చోరీ ముధోల్: కారేగాం గ్రామంలోని శనివారం రాత్రి ఎ ల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రం, వెండి కన్నులతోపాటు భక్తులు సమర్పించిన కానుకలు, రూ.2 వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. తాళం పగులగొట్టిన హుండీ తెరుచుకోకపోవడంతో అక్కడే వదిలివెళ్లిపోయారని గ్రామస్తులు తెలిపారు. -
మంచిర్యాల
7గూడెం గుట్ట..భక్తుల కిటకిట దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 8లోu ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. సత్ఫలితాలిస్తున్న గడ్డిక్షేత్రాలు కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తున్నాయి. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. 8లోu -
వృత్తి రక్షణకు పార్టీలకతీతంగా ఏకం కావాలి
భైంసాటౌన్: గ్రామాల్లో కల్లుగీత కార్మికులపై వీడీసీ వేధింపులు ఎక్కువయ్యాయని, వృత్తి రక్షణకు గౌడ కులస్తులు పార్టీలకతీతంగా ఏకం కావాలని మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సరస్వతి గౌడ సంఘ భవనంలో నక్కల మోహన్గౌడ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మోకుదెబ్బ జిల్లా ముఖ్యుల సమావేశంలో మాట్లాడారు. అంతకుముందు జిల్లా అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కనక గౌడ్(కుభీర్), ముష్కం అశోక్ గౌడ్(భైంసా)ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రక్షణ, గౌడ కులస్తుల ఐక్యత కోసం మోకుదెబ్బ కృషి చేస్తోందన్నారు. వీడీసీల నిలువు దోపిడీపై రాజకీయాలకతీతకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చార ు. కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో గౌడ కులస్తుల వాటా సాధన కోసం మోకుదెబ్బ పని చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసి 5 లక్షల మందితో హైదరాబాద్లో భారీ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మురళిగౌడ్, కార్యవర్గ సభ్యులు రాజేందర్గౌడ్, వెంకట్గౌడ్, దశాగౌడ్, జిల్లాలోని అన్ని మండలాల గౌడ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
16న కుంగుఫూ చాంపియన్షిప్ పోటీలు
నస్పూర్: నస్పూర్లో వి కరాటే అండ్ ఫిట్నెస్ అకాడమీ మంచిర్యాల ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ స్మారకార్థం ఈనెల 16న రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే కుంగు ఫూ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ న్యాయవాది ఎండీ సంధాని తెలిపారు. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన పోటీల నిర్వాహకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంధాని మాట్లాడుతూ నస్పూర్ కాలనీలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ స్మారకార్థం నిర్వహించే పోటీల్లో క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో నిర్వాహకులు వెంకటేశ్, శ్రీనివాస్, మహేశ్, రమేశ్, ఎండీ అబ్బాస్, ఎండీ మయూబ్, విజయ్, నరెడ్ల శ్రీనివాస్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు. -
సోయా టోకెన్ల కోసం బారులు
ముధోల్:మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సోమవారం నుంచి సోయా టోకెన్ల పంపిణీ చేయనున్నారు. ఆదివారం రాత్రి రైతులు తరలివచ్చి కార్యాలయం వద్ద బారులు తీరారు. క్యూలో చెప్పులు, వాటర్ బాటిళ్లు ఉంచారు. విషయం తెలుసుకున్న ఎస్సై బిట్లా పెర్సిస్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఉదయం కార్యాలయానికి రావాలని కోరిన వారు అక్కడే ఉండిపోయారు. సోమవారం ముధోల్, ముద్గల్, విఠోలి, మచ్కల్, తరోడా గ్రామాలు, మంగళవారం రాంటెక్, టాక్లీ, దోడాపూర్, లబి గ్రామాలకు టోకెన్లు జారీ చేయనున్నారు. క్యూలైన్లో చెప్పులు ఉంచిన రైతులు -
యాప్లో పల్లెల లెక్క
మంచిర్యాలరూరల్(హాజీపూర్):గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు, ప్రభుత్వ ఆస్తుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు గత నెల 18న చేపట్టిన జీపీ మానిటరింగ్ సర్వే నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో సర్వే జరుగుతోంది. పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం, నిధుల కొరతతో పలు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోవడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు ఈ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ జీపీ మానిటరింగ్ సమాచారంతో గ్రామాల అభివృద్ధికి బాటలు వేయవచ్చని ప్రభుత్వం సర్వేకు ఉపక్రమించింది. 21 అంశాలపై సర్వే..జీపీ మానిటరింగ్ యాప్ ద్వారా అన్ని గ్రామాల్లో 21 అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ యాప్లో పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. పంచాయతీ భవనం, ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్, పారిశుద్ధ్యం, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, వైకుంఠధామం, తాగునీరు, వీధిదీపాలు, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, తదితర ప్రాథమిక వసతు ల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లోని వసతులతో పాటు ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా తెలుస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు గ్రామాల్లోని ప్రభుత్వ ఆస్తుల వాస్తవ పరిస్థితులు, అభివృద్ధి అవకాశాలు తెలియడంతో పాటు ఈ సర్వే ద్వారా పంచాయతీలోని సమగ్ర సమాచారంపై పూర్తి అవగాహన వస్తోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడనుంది. పారదర్శకంగా సర్వే.. గ్రామ పంచాయతీల్లో చేపడుతున్న జీపీ మానిటరింగ్ యాప్ సర్వే పారదర్శకంగా సాగుతోంది. పంచాయతీల్లోని ప్రభుత్వ ఆస్తులు, మౌలిక వసతులపై సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు 21 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను జీపీ మానిటరింగ్ యాప్లో నమోదు చేస్తున్నారు. సర్వేపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి -
A…«§ýl E´ë-«§éÅ-Ķæ¬yìl ˘ దొరకని ఆచూకీ
కడెం: కరీంనగర్కు చెందిన అంధ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్రెడ్డి శనివారం కడెం ప్రాజెక్ట్లో దూకి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి రాత్రివరకు ఎస్సై పి.సాయికిరణ్, సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టిన ఆచూకీ లభ్యం కాలేదు. మధ్యాహ్నం కడెం ప్రాజెక్ట్ వరద గేటు ఎత్తారు. బ్యాక్వాటర్లో నుంచి గేటు బయటకు వెళ్లి ఉంటాడా, లేదా బురదలో తట్టుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాల రీత్యా రాజశేఖర్రెడ్డి మనస్తాపంతో కడెం ప్రాజెక్ట్లో దూకి ఉండవచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. -
తేలిన టీచర్ల లెక్క
ఈ చిత్రంలో కనిపిస్తోంది దండేపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల. ఇందులో 227 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. రేషనలైజేషన్ (పాఠశాలల హేతుబద్ధీకరణ) మేరకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈలెక్కన 14 మంది టీచర్లు మిగులు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ టీచర్లను అవసరమున్న పాఠశాలలకు సర్దుబాటు చేయనుంది. మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పునర్విభజన, మిగులు పోస్టులను సర్దుబాటుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమిస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా 2025–26 విద్యాసంవత్సరంలో టీచర్ల సర్దుబాటు (తాత్కాలిక డిప్యూటేషన్) చేసింది. తాజాగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు మిగులు టీచర్లు, ఉపాధ్యాయుల కొరత వివరాలు సేకరించి నివేదించింది. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించింది. అవసరం ఉన్న పాఠశాలలకు వర్క్అడ్జస్ట్ పేరిట మొదటి విడత 73 మంది, రెండో దఫా 19 మంది టీచర్లను సర్దుబాటు చేసింది. మరోసారి ఉపాధ్యాయుల సర్దుబాటుతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మిగులు 367.. కొరత 96జిల్లాలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రైమరీ స్కూళ్లు 488, యూపీఎస్లు 88, ఉన్నత పాఠశాలలు 101 ఉన్నాయి. 30,406 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా 2,474 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న (మిగులు పాఠశాలలు)లెక్క తేల్చారు. మొత్తం 367 మంది మిగులు టీచర్లు (సర్ప్లస్) ఉన్నట్లు గుర్తించారు. ఇందులో చెన్నూర్, దండేపల్లి మండలాల్లో 43 మంది చొప్పున మిగులు ఉన్నట్లు గుర్తించారు. నెన్నెలలో 29, జైపూర్లో 26, మంచిర్యాలలో 26, కోటపల్లిలో 25, తాండూర్లో 24, హాజీపూర్లో 22 మంది సర్ప్లస్ ఉపాధ్యాయులుండగా మిగిలిన మండలాల్లో నలుగురి నుంచి 20లోపు ఉన్నట్లు విద్యాశాఖ నిర్ధారించింది. విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట ఉపాధ్యాయుల కొరత గుర్తించింది. ఆయా పాఠశాలల్లో 96 మంది ఉపాధ్యాయులు అవసరమున్నట్లు తేల్చారు. ఇందులో అత్యధికంగా జన్నారం మండలంలో 17 మంది, మంచిర్యాలలో 14, మందమర్రిలో 12 మంది, మిగిలిన మండలాల్లో 1 నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లు తేల్చింది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువగా ఉన్న పాఠశాలలకు వారిని సర్దుబాటు చేయనున్నారు. రేషనలైజేషన్ ఇలా.. పాఠశాల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ప్రక్రియలో చైల్డ్ఇన్ఫోలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను కేటాయిస్తారు. ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం నిర్వహిస్తున్న చోట 50 మందికిపైగా విద్యార్థులుంటే పూర్తిస్థాయిలో అంటే ఏడుగురు టీచర్లు, ఒక హెచ్ఎం, పీఈటీని కేటాయించాలి. మిగిలిన మీడియంకు నాన్ లాంగ్వేజ్ గణితం, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ టీచర్ను నియమించాలి. ప్రైమరీ, యూపీఎస్ పాఠశాలలో 1 నుంచి 10 మంది విద్యార్థులుంటే 1టీచరు, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 ఉంటే ఐదుగురు, 151 నుంచి 200 మంది వరకు ఉంటే ఆరుగురు టీచర్లు అవసరముంటుంది. 6, 7 తరగతులకు 1 నుంచి 20 ఒక లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ టీచర్, 21 మందిపైన–నాలుగు సబ్జెక్టు టీచర్లను నియమించాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలో 220 మంది వరకు విద్యార్థులు ఉంటే ఏడుగురు టీచర్లు, 221 నుంచి 250 వరకు ఉంటే 8, 251 నుంచి 280 వరకు ఉంటే 9, 281 నుంచి 310 వరకు ఉంటే 10, 311నుంచి 340 వరకు ఉంటే 12, 671 నుంచి 700 వరకు ఉంటే 24 మంది ఉపాధ్యాయులను కేటాయిస్తారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువ టీచర్లు ఉండగా, మరికొన్నింట్లో విద్యార్థుల సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు. మచ్చుకు కొన్ని.. -
బియ్యం మారినా.. దందా ఆగలే!
మంచిర్యాలక్రైం: గత ప్రభుత్వాలు పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పంపిణీ చేసిన రేషన్ (దొడ్డు) బి య్యం తినడానికి యోగ్యంగా లేకపోవడంతో రా ష్ట్రంలో 90 శాతం మంది ప్రజలు వాటిని దళారుల కు అమ్ముకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొడ్డు బియ్యం ఎవరూ తినడం లేదని ఈ ఏడాది మే నెలలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో బాగానే ఉన్నా ఆతర్వాత అన్నం మెత్తగా అవుతోందని, ఇసుక ఉంటోందని జిల్లాలో 70 శాతం మంది లబ్ధిదారులు సన్నబియ్యం అమ్ముకుంటున్నారు. ధళారులు వీధుల గుండా తిరుగుతూ కిలోకు రూ.18 చొప్పున కొనుగోలు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది మే నుంచి అక్టోబర్ వరకు 20 కేసులు నమోదు కాగా 208.31 క్వింటాళ్ల రేషన్బియ్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సన్నబియ్యం అక్రమ రవాణపై సివిల్ సప్లై అధికారులు ‘మామూలు’గా తీసుకోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. మళ్లీ అదే దందా.. అదే జోరు..గతంలో 90 శాతం మంది ప్రజలు ఉచితంగా వచ్చిన రేషన్ బియ్యాన్ని కిలోకు రూ.12 నుంచి 14 వరకు దళారులకు విక్రయించేవారు. ఇదే అదనుగా భావించిన రేషన్ డీలర్లు సైతం లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకుని నగదు చెల్లించేవారు. దళారులు ప్రస్తుతం ఒకరు రూ.18 చెల్లిస్తుంటే మరొకరు పోటీగా రూ.20 పెట్టి వాడల్లో తిరుగుతూ సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. కొందరు మహారాష్ట్రలోని సిరోంచకు, మరికొందరు స్థానికంగా, ఇతర ప్రాంతాల రైస్మిల్లులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సైతం మళ్లీ దళారుల అవతారమెత్తి దర్జాగా దందా సాగిస్తున్నట్లు సమాచారం. సగానికిపైగా అనర్హులే...జిల్లాలో 423 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీనెల జిల్లాకు 9 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బి య్యం పంపిణీ చేస్తోంది. ఇందులో సగానికిపైగా అ నర్హత కలిగిన కుటుంబాలు ఉండడం గమనార్హం. రేషన్ కార్డు బహుళ ప్రయోజన కారి కావడంతో నిరుపేదలతో పాటు ఆదాయ వర్గాలు సైతం పెద్దఎత్తున కార్డులు పొందారు. వారికి పీడీఎస్ బియ్యం అవసరం లేకపోయినప్పటికీ కేవలం తమ రేషన్ కార్డు రద్దు కాకుండా యాక్టివ్గా ఉండేందుకు అప్పుడప్పుడు బియ్యం కోటా డ్రా చేస్తున్నారు. ఎవరైన సన్నబియ్యం అమ్ముకుంటే వారిని గుర్తించి రేషన్కా ర్డు రద్దు చేస్తామని ఓ వైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా దందా ఆగడం లేదు. సరిహద్దులో నిఘా కరువు...మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన రాపనపల్లి ప్రాణ హిత నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర రహదారి అక్ర మ రవాణాకు వారధిగా మారింది. మంచిర్యా ల నుంచి మహారాష్ట్రకు డీసీఎం, ఆటోలు, ట్రాలీ ఆటో ల ద్వారా రాత్రి పగలు తేడాలేకుండా యథేచ్చగా రేషన్బియ్యం తరలిస్తున్నారు. గతంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీ సులు ప్రత్యేక టీంగా ఏర్పడి అక్రమ రవాణా, చ ట్ట వ్యతిరేఖ కార్యక్రమాలపై నిఘా పెట్టి వరుస దాడులు నిర్వహించారు. ప్రస్తుతం టాస్క్ఫోర్ బృందం లేకపోవడంతో అంతర్రాష్ట్ర వారధిపై నిఘా వైఫల్యం వల్లే అక్రమ రవాణా దందా యథేచ్చగా సాగుతోంది. ప్రతీరోజు జిల్లా నుంచి మహారాష్ట్రకు సుమారు రూ.కోటి విలువైన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఏదైనా సమాచారం ఉంటే తప్ప పోలీసులు తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అడపాదడపా చేసిన దాడుల్లోనే క్వింటాళ్ల కొద్దీ బియ్యం పట్టుబడడం గమనార్హం. రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడంలో పౌరసరఫరాల శాఖ పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాపై నిఘా... రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. బియ్యం అమ్మిన వారి రేషన్కార్డు రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తున్నాం. అక్రమ రవాణా ఏదైనా సరే వదిలిపెట్టిది లేదు. ఇప్పటికీ చాలా కేసులు నమోదు చేశాం. అదే వృత్తిగా మలచుకుని దందా కొనసాగిస్తున్న కొందరిని గుర్తించాం. త్వరలో వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తాం. బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలి. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
సత్ఫలితాలనిస్తున్న గడ్డిక్షేత్రాలు
జన్నారం: కవ్వాల్ టైగర్జోన్లో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డిక్షేత్రాలు సత్ఫలితాలిస్తోంది. గతంతో పోలిస్తే వీటి వల్ల వన్యప్రాణుల సంఖ్య పెరిగాయి. అటవీప్రాంతంలో గడ్డి క్షేత్రాలు విస్తరించి ఉంటే శాకాహార జంతువుల సంతతి పెరుగుతుందనే ఆ శాఖ అధికారులు 2019లో వీటి పెంపకానికి శ్రీకారం చుట్టారు. దీంతో పులుల రాక కోసం అటవీ అధికారులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పులికి ఆహారంగా అడవిలో నివాసం ఉండే శాకాహార జంతువుల సంఖ్య పెంపునకు చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం వరకు జన్నారం అటవీ డివిజన్లో సుమారు వెయ్యి హెక్టర్లలో గడ్డి మైదానాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మరో 80 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో గడ్డి విత్తనాలు చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సహజసిద్ధంగా మొలసిన గడ్డిలో కలుపు తొలగిస్తూ పెంపకం చేస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే పశువులు తినకుండా సిబ్బంది జాగ్రత్త పడుతున్నారు. కేరాఫ్గా జన్నారం డివిజన్ జన్నారం అటవీ డివిజన్లో అత్యధికంగా గడ్డి మైదానాలున్నాయి. వీటికి కేరాఫ్గా చెప్పువచ్చు. ఈ అటవి డివిజన్ పులి అవాసాలకు అనువుగా ఉండటం వల్ల గడ్డిపెంపకంపై దృష్టి సారిస్తున్నారు. దీనికితోడు శాకాహార జంతువులు జింకలు, దుప్పులు, నీలుగాయిలు, సాంబ ర్లు, కుందేళ్లు, గడ్డి, కృష్ణ జింకలు అవాసాలు ఏ ర్పాటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే గడ్డిక్షేత్రాలతో వన్యప్రాణుల సంఖ్య పెరిగినట్లు అఽ దికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో స హజసిద్ధంగా గడ్డి వస్తుంటుంది. గత సంవత్సరంలో ఎండిన గడ్డి విత్తనాలు మొలకెత్తుతా యి. ఆయా ప్రాంతంలో గడ్డి క్షేత్రాలు పరిశీలించడం, కలుపు తీయించడం, జరుగుతుంది. దీంతో కలుపు లేని గడ్డిని వన్యప్రాణులు ఇష్టంగా తింటాయని అధికారులు పేర్కొంటున్నారు. -
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ) బాలుర గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. గురుకులంలో 8వ తరగతి చదువుతున్న బి.ఉషాకిరణ్ ఇటీవల కాగజ్నగర్లో జరిగిన ఉమ్మడి జిల్లా జోనల్స్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 3 నుంచి 5వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయి. సదరు విద్యార్థిని సీవోఈ కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్సాగర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. సీవోఈ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు సీ.హెచ్.రాజశేఖర్, అల్లూరి వామన్ పాల్గొన్నారు. -
సామాజికసేవలో ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర
ఆదిలాబాద్: సామాజిక సేవలు ఆర్ఎస్ఎస్ కీలకపాత్ర పోషిస్తోందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహ సేవా ప్రముఖ్ బలవత్రి గణేశ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు భాగంగా జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో ఆదివారం పథ సంచలన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథ సంచలన్ జిల్లాకేంద్రంలోని ప్రధాన చౌక్ల గుండా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్ అన్నివర్గాలకు విపత్కర సమయాల్లో అండగా నిలుస్తోందన్నారు. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చిన సంఘ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ సంచలన్లో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇందూర్ విభాగ్ సంఘ్ చాలక్ నిమ్మల ప్రతాపరెడ్డి, నగర సంఘ్ చాలక్ నూతుల కల్యాణ్రెడ్డి పాల్గొన్నారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమీత్ డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల్లో దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న వారు పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారన్నారు. ఈ క్రమంలో ఆఫీస్ సబార్డినేటర్లకు, విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు, ఐదు డీఏలు మంజూరు చేయాలని, పీఆర్సీ వర్తింజేయాల ని, హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలి పారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కవితారాణి, కోశాధికారి సుజాత, సభ్యులు శేఖర్, అంకూస్, సతీశ్, సునీత, తారాబాయి, శ్రీనివాస్, గోవర్దన్, తదితరులు పాల్గొన్నారు. -
నానో ఎరువుల వినియోగం పెంచాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): పంటల సా గులో రైతులు నానో ఎరువుల వినియోగం పెంచేలా వ్యవసాయ అధికారులు కృషి చే యాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం గుడిపేట రైతువేదికలో హాజీపూర్ మండల వ్యవసాయాధికారి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ద్రవ రూపంలో యూరియా, డీఏపీ వాడకం జరిగేలా అవగా హన కల్పించాలని అన్నారు. పీఎం కిసాన్, రైతుబీమా, ఎరువుల పంపిణీ ఇతర అంశాల పై అధికారులతో కలిసి ప్రగతిని సమీక్షించా రు. సమావేశంలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, కోరమాండల్ కంపెనీ ప్రతినిధులు, నానో ఫర్టిలైజర్ కో ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
15న ప్రత్యేక లోక్ అదాలత్
మంచిర్యాలక్రైం: ఈ నెల 15న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ.వీరయ్య తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో ప్రత్యేక లోక్ అదాలత్పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బ్యాంకు రికవరీ, సివిల్, మోటార్ వెహికిల్ యాక్ట్ తదితర కేసులు పరిష్కరించాలని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్సింగ్ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.నిర్మల, అదనపు సినియర్ సివిల్ జడ్జి డీ.రామ్మోహన్రెడ్డి, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.నిరోష, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పంటల సర్వే.. కాకి లెక్కలే!
మంచిర్యాలఅగ్రికల్చర్: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన వ్యవసాయ అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ప్రభుత్వం సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, రుణాలు, ఇతర రాయితీ పథకాలు, పనిముట్లు, పంట నష్టపోతే గుర్తించేందుకు వీలుగా పంట పొలాల్లోకి వెళ్లి లొకేషన్ ఆధారంగా నమోదుకు డిజిటల్ సర్వే ప్రవేశపెట్టింది. కానీ సాగు విస్తీర్ణం నమోదు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. సెప్టెంబర్ 30వరకు పంటల నమోదుకు రైతులే ఏఈవో వద్దకు రావాలని, ఆధార్కార్డు, పట్టాపాస్ పుస్తకం తీసుకొచ్చి ఏ పంట సాగు చేశారో నమోదు చేసుకోవాలని.. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని సూచించారు. రైతులు ఇచ్చిన వివరాలు, పంటలు మాత్రమే నమోదు చేసుకున్నారు. కొందరు రైతులు అందుబాటులో లేకపోవడం, పట్టాపాస్పుస్తకం లేక నమోదు చేసుకోలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిందీ లేక నమోదు చేసిందీ లేక కాకిలెక్కలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. గత జూలై, ఆగస్టులో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు నీటమునిగాయి. ఆ సమయంలో నష్టం నమోదు, మూడు రోజుల క్రితం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షంతో నష్టం నమోదు తీరు కాకిలెక్కలేనని తెలుస్తోంది. గత నెల 30న 15 మండలాల్లో 2,751మంది రైతులు 3,351 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో భీమిని, భీమారం మండలాల్లో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడం గమనార్హం. ఆయా మండలాల్లో పంటలు నేలవాలి వరిగొలుసు నీటిలో మునిగాయి. పరిశీలించి నమోదు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాలలో 75 ఎకరాల్లో 45 మంది రైతులు, నస్పూర్ ప్రాంతంలో 75 ఎకరాల్లో 45మంది రైతులు ఒకే పంట వరి నష్టపోయినట్లు గుర్తించారు. హాజీపూర్ మండలంలో వరి పంట 200 ఎకరాలు, 200 మంది రైతులు నష్టపోయారని పేర్కొనడం గమనార్హం. క్షేత్రస్థాయికి వెళ్లరు.. నమోదు చేయరు..ప్రతీ సీజన్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం రైతుల వ్యవసాయ అవసరాలు తీరుస్తుంది. ప్రస్తుత ఖరీఫ్లో పంట విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా నమోదు చేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏ వారంలో ఏయే పంటలు సాగయ్యాయనే సమాచారం పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. గత వానాకాలం సీజన్ 3.33 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేశారు. గత నెలాఖరు వరకు 3.24,551 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు ధ్రువీకరించారు. ఇందులో ప్రధానంగా పత్తి 1,69,397 ఎకరాలు, వరి 1,53,183 ఎకరాల్లో సాగైనట్లు నమోదు చేశారు. గత ఏడాది జైపూర్ మండలంలో వానాకాలం కంటే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగినట్లు వ్యవసాయ అధికారులు తప్పుడు లెక్కలు నమోదు చేశారు. ఓ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం తప్పుడు లెక్కలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోనూ వానాకాలం కంటే యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలతో సాగు విస్తీర్ణం తీరు బయటపడుతోంది. అక్రమార్కులకు అనుగుణంగా సాగువిస్తీర్ణం పెరిగినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాధారణంగా వానాకాలంలో సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ యాసంగి సీజన్లో వరిసాగు పెరిగినట్లు నమోదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే ఉంటూ పంటల నష్టం నమోదు చేస్తుండడంతో నష్టపోయిన వారికి పరిహారం అందకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. -
రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమావేశం నిర్వహించారు. సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ 2002 ఎలక్టోరల్ జాబితాలో నియోజకవర్గాల వారీగా నాలుగు కేటగిరీలుగా విభజించామని తెలిపారు. ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు పాల్గొన్నారు. -
‘అటవీ భూములు ఆక్రమిస్తే సహించం’
దండేపల్లి: అటవీ భూములు ఆక్రమిస్తే ఎంతటివారైనా సహించేది లేదని మంచిర్యాల డీఎఫ్వో శివ్ఆశిష్ సింగ్ అన్నారు. మండలంలోని తాళ్లపేట అటవీ రేంజ్ పరిధి చింతపల్లి ఫారెస్ట్లోని నార్త్, ఈస్ట్ బీట్లను జన్నారం ఎఫ్డీవో రాంమ్మోహన్తో కలిసి శనివారం పరిశీలించారు. గుండాలకు చెందిన కొందరు భూమి చదును చేయడంపై ఆరా తీశారు. తమకు తిర్యాణి తహసీల్దార్ పట్టాలు జారీ చేశారని, వాటిని సాగు చేస్తేనే రైతు భరోసా డబ్బులు వస్తాయని చెప్పడంతో దున్నామని గిరిజనులు తెలిపారు. ఆక్రమిత భూమిలో తిర్యాణి, కాసిపేట మండలాల సర్వేయర్లతో సర్వే నిర్వహించారు. వాస్తవ పట్టాభూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్వో సాగరిక, ఎఫ్ఎస్వో నరేష్, ఎ్ఫ్బీవోలు రవికిరణ్, నాగరాజుచారి పాల్గొన్నారు. 48గంటల్లో గుడిసెలు తొలగించాలిమండలంలోని లింగాపూర్ ఫారెస్ట్ బీట్లో దమ్మన్నపేట గ్రామానికి చెందిన గిరిజనులు వేసిన గుడిసెలు 48గంటల్లో తొలగించాలని తహసీల్దార్ రోహిత్దేశ్పాండే, డీఆర్వో సాగరిక సూచించారు. శనివారం వారు దమ్మన్నపేట గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. -
మంచిర్యాల
7లీకేజీలతో అరిగోస చెన్నూర్, భీమారం, నస్పూర్లో మిషన్ భగీర థ పైపులైన్ల లీకేజీల కారణంగా తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. తాగునీరు క లుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది. ఈదురుగాలులు వీస్తాయి. అద్దె భవనాలు.. అసౌకర్యాలు బెల్లంపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ గు రుకుల విద్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అసౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలి
మందమర్రిరూరల్: రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని డీసీపీ భాస్కర్ అన్నారు. శనివారం పట్టణంలోని జీఎం కార్యాలయ సమీపంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదా ల్లో 17 మంది చనిపోగా అందులో యాపల్, అంగడిబజార్ ప్రాంతాలకు చెందిన వారు ఏడుగురు ఉన్నారని తెలిపారు. ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్, మందమర్రి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, నేషనల్ రోడ్డు అథారిటీ అధికారులు, రోడ్డు భద్రత కమిటీ సభ్యులు అబ్బాస్, గణేష్, నర్సయ్య పాష, రాజేశ్వరి పాల్గొన్నారు. -
యూడైస్ ప్లస్లో వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలఅర్బన్: ప్రీ ప్రైమరీ నుంచి ఇంట ర్మీడియెట్ విద్యనందించే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్లు యూడైస్ ప్లస్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని జిల్లా విద్యాధి కారి యాదయ్య అన్నారు. శనివారం జిల్లా సైన్స్ కేంద్రంలో సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డి నేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యూడైస్ ప్లస్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ తరగతి గదులు, వాటి స్థితిగతులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, కిచెన్షెడ్, ఉచిత పాఠ్య పుస్తకాలు తదితర వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎం.భరత్కుమార్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రాజ్కుమార్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చౌదరి, సత్యనారాయణ మూర్తి, రాజ్కుమార్, టెక్నికల్ పర్సన్ నగేష్ పాల్గొన్నారు. -
● జిల్లాలో ప్రాచీన కళలకు ఆదరణ ● కలరి, కర్ర, కత్తిసాము, ముద్గర్ ● ఏళ్ల నాటి మార్షల్ ఆర్ట్స్పై ట్రెండ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న రోబోటిక్ స్మార్ట్యుగంలో ప్రాచీన యుద్ధ కళలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంఫూ, తైక్వాండో, యోగ తదితర విద్యల్లో జిల్లా వాసులు ప్రావీణ్యం సాధించారు. కేరళలో ఉద్భవించిన ‘కలరిపయట్టు’, మహాభారతం నాటి ‘ముద్గర్’, కర్ర, కత్తిసాము వంటి వేల ఏళ్లనాటి యుద్ధ కళల ట్రెండ్ మొదలైంది. జిల్లాలో చిన్నా పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రోజువారీగా బిజీగా ఉంటున్న వారంతా శారీరక, మానసిక దృఢత్వం కోసం రోజులో కొంత సమయం కేటాయిస్తూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, మంచిర్యాలముద్గర్ముద్గర్ ఓ ప్రాచీన వ్యాయామ కళ. యుద్ధవిద్య(మార్షల్ ఆర్ట్స్)లో కీలక వ్యాయామమిది. దేశంలో వేల ఏళ్ల క్రితం గట్టి కర్రతో చేసే ముద్గర్ను వాడుతున్నారు. ముద్గర్ను శివుడు పరుశురాముడికి నేర్పించారని ఇతిహాసాల్లో ఉంది. భీముడు, దుర్యోధనుడు, హనుమాన్ గదలను వాడడంలో అగ్రగణ్యులు. ఈ ముద్గర్ పేరుతో ఉత్తర భారతదేశంలో అనేక క్లబ్లు ఉన్నాయి. ఒక కిలో బరువు ఉన్న ముద్గర్ నుంచి 30కిలోల బరువు ఉన్నవి చేతులతో తిప్పడం నేర్పుతున్నారు. చేతులు, చాతి, భుజాలు, జీర్ణక్రియలు మెరుగు పడి దృఢత్వంగా మారేందుకు దోహదపడుతోంది. జిల్లాలో గత పదేళ్ల క్రితమే ఆరంభమైనప్పటికీ ఈ మధ్యకాలంలోనే ముద్గర్పై వందలాదిమంది శిక్షణకు మొగ్గుచూపుతున్నారు. జిల్లా కేంద్రంలో శిక్షకుడు మండ శ్రీనివాస్ ప్రత్యేకంగా ఓ అకాడమి నిర్వహిస్తున్నారు. తమ రంగంలో మరింత పట్టు సాధించేందుకు ముద్గర్ చక్కని వ్యాయామ సాధనం. మనస్సు, శరీరంలో అద్భుత మార్పులుక్రీడల్లో రాణిస్తున్న వారికి శారీరక దృఢత్వం ఉంటుంది. శరీరం అదుపులో ఉంటుంది. ప్రాచీన యుద్ధ కళలతో శరీరం, మనస్సు ప్రభావితం అవుతుందని శిక్షకులు చెబుతున్నారు. అంతఃశుద్ధితో మానసిక ప్రశాంతత చేకూరి అద్భుతమైన మార్పులు వస్తాయని వివరిస్తున్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి తగ్గి, ఆక్యుపెన్సీ పాయింట్స్ ఉత్తేజితమవుతాయి. శరీరంలో ఏడు చక్రాలు ఉత్తేజితమై సోమరితనం దూరమవుతుంది. బిజీగా ఒత్తిడితో పని చేసే ఆయా రంగాల్లో ఉండేవారికి డిప్రెషన్, చికాకు, ఆందోళన వంటివి దరి చేరవు. మానసిక ప్రశాంతతో గుండె జబ్బులు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర రుగ్మతల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. క్రీడల్లో రాణించే వారికి ఈ ప్రాచీన యుద్ధ కళలతో చదువులో ఏకాగ్రత పెరగడంతో రెజ్లింగ్, కుస్తీ, జూడో, క్రికెట్, కబడ్డీ తది తర క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునే వీలుంది. -
రైల్వే సామగ్రి చోరీ.. నిందితులు అరెస్ట్
బెల్లంపల్లి: రైల్వే సామగ్రి దొంగతనం చేసిన నిందితులను బెల్లంపల్లి రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆర్పీఎఫ్ ఏఎస్సై మోహన్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వేకు చెందిన చిన్నసైజ్ పట్టాలను బెల్లంపల్లిలో కొందరు యువకులు అపహరించుకు పోతున్నారని రామగుండం ఆర్పీఎఫ్ సీఐ రాజేంద్రప్రసాద్కు గురువారం రాత్రి సమాచారం అందింది. సీఐ వెంటనే బెల్లంపల్లి సిబ్బందికి సమాచారం అందించి అప్రమత్తం చేశారు. కాల్టెక్స్ ఏరియా ప్రాంతంలో నిఘా పెట్టి తాండూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మోటం తిరుపతి, సీసీసీ నస్పూర్కు చెందిన కడమంచి సురేశ్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 45 చిన్నసైజ్ రైలు పట్టాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.27,660 వరకు ఉంటుందని అంచనా వేశారు. చెన్నూర్లో స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్న కడారి శేఖర్ అనే వ్యక్తికి రైల్వే సామగ్రిని అమ్మకానికి తీసుకెళ్లే క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. సామగ్రి తరలించడానికి వినియోగించిన మారుతి ఆల్టో కారును స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులతో పాటు కొనుగోలు దారుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
దస్తురాబాద్: తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన మండలంలోని రేవోజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రేవోజీపేట గ్రామానికి చెందిన ముప్పిడి రాధ అనే వివాహిత తన కూతూరు నిత్యతో కలిసి అక్టోబర్ 27న కరీంనగర్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. 30న ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంట్లోని బీరువాను గుర్తుతెలి యని వ్యక్తులు పగులగొట్టి 5తులాల వెండి, తులం బంగారు కమ్మలు, అర్ధతులం చైను దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇద్దరు బైండోవర్
జన్నారం: అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్తో కనిపించిన ఇద్దరిని బైండోవర్ చేసినట్లు తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావు తెలిపారు. శుక్రవారం రేంజ్ అధికారి తెలిపిన వివరాల ప్ర కారం విశ్వసనీయ సమాచారం మేరకు అటవీ ప్రాంతంలో పరిశీలించగా తపాలపూర్ గ్రామానికి చెందిన ఏదుల చంద్రయ్య, వొడ్డెపల్లి శ్రీని వాస్లు అటవీ ప్రాంతంలో రంపం, జీఐ వైర్, తాళ్లతో పట్టుబడ్డారు. వారిని ఎఫ్ఆర్వో సుష్మారావు ఆదేశాల మేరకు డీఆర్వో సాగరిక, ఎఫ్ ఎస్వో నహీదా, ఎఫ్బీవోలు సాయి, శ్రీ కాంత్లు విచారించారు. అనుమానంతో నింది తుల ఇళ్లలో తనిఖీ చేయగా రెండు టేకు దుంగలు ల భ్యమయ్యాయి. దీంతో వారిపై కేసు నమో దు చేసి తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ప్రియురాలి కోసం సెల్టవర్ ఎక్కిన యువకుడుబెజ్జూర్: ప్రియురాలి కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి గ్రామంలో గంటపాటు కలకలం రేపాడు. మద్దిగూడ గ్రామానికి చెందిన కోరితే కిష్టయ్య అనే యువకుడు సులుగుపల్లి గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలలుగా ప్రేమలో ఉన్నాడు. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం సులుగుపల్లి గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి హైడ్రామా సృష్టించాడు. యువకుడు టవర్ పైకి ఎక్కి తన ప్రేమను అంగీకరించకపోతే కిందికి దూకుతానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై సర్తాజ్ పాషా, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. యువకుడితో మాట్లాడి కిందికి దింపారు. అనంతరం యువకుడిని పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. తెగిపడిన విద్యుత్ తీగరామకృష్ణాపూర్: పట్టణంలోని తారకరామకాలనీ నుంచి పులిమడుగు వెళ్లే మార్గంలో ఓ ఇంటి ఆవరణలో శుక్రవారం హైటెన్షన్ విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడగా పెను ప్రమాదం తప్పింది. 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి పడి ఇంట్లోని ఇనుప తీగ(దండెం)కు తాకింది. అదే సమయంలో ఇంటి వాకిలి ఊడుస్తున్న రజితకు దండెం తీగ తగలడంతో విద్యుత్ షా క్కు గురై కిందపడిపోయింది. విద్యుత్ తీగను స్థానికులు గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాక్కు గురైన రజితను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. దొంగ అరెస్ట్తలమడుగు: తలమడుగు మండలం ఉండం గ్రామ శివారులో గల పేట పోచమ్మ ఆలయంలో ఈనెల 29వ తేదీన దొంగతనం చేసిన మండలంలోని లాల్ఘడ గ్రామానికి చెందిన దోడిసం లచ్చిరాంను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై రాధిక తెలిపారు. నిందితుడు ఈ నెలలోనే తాంసి మండలంలోని దుర్గామాత ఆలయంలోనూ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. -
చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి
కాసిపేట: మండలంలోని రొట్టెపల్లికి చెందిన పోగు ల పోసు(70) అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు దువాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మల్కేపల్లి ఆశ్రమ పాఠశాలలో స్వీపర్గా పనిచేసే పోసుకు ఐదు నెలల క్రితం కిడ్నీలలో రాళ్లు రావడంతో అపరేషన్ చేశారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో జీ వితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లోని గడ్డి మందు తాగింది. ఆమె కుమారుడు పోగుల శంకర్ కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం ఉద యం మృతిచెందింది. శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వంతెన కోసం గిరిజనుల పాదయాత్ర
పెంబి: కడెం వాగుపై వంతెన నిర్మించాలని పలు గిరిజన గ్రామాల ప్రజలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మండల పరిధిలోని గిరిజన గ్రామాలు యాపలగడ, దోందారి, వస్పల్లి, చాకిరేవు, సత్తుగడ, రాంనగర్లతో పాటు దాదాపు 15 గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే కడెం, దోత్తి వాగు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. వంతెనలు నిర్మించాలని షెట్పల్లి గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తోడసం శంభు, విజయ్, భీంరావు, సోమేశ్, ప్రజలు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫీజు భారం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షల షె డ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి –మార్చి నెలల్లో రెండు దశల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించాలని ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రూ.100 లేటు ఫీజుతో నవంబర్ 24 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 1వరకు, రూ.1000 ఫైన్తో డిసెంబర్ 8 వరకు, రూ.2000 ఫైన్తో డిసెంబర్ 15 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది పరీక్ష ఫీజు పెంపుతో ఒక్కో విద్యార్థిపై రూ.120 అదనపు భారం మోపింది. గత ఏడాది కంటే ఎక్కువ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థులు మొత్తం 32,343 మందికిపైగా ఉన్నారు. ఫస్టియర్ ఇంటర్ (జనరల్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో కలిపి) రూ. 630, వొకేషనల్ –థియరీ, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో రూ. 870, సెకండియర్ జనరల్ సైన్స్ రూ.870, జనరల్ ఆర్ట్స్ (ఇంగ్లిష్ ప్రాక్టికల్స్తో) రూ. 630 ఫీజు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్కు రూ. 520 కాగా 2025 –26 విద్యాసంవత్సరంలో పరీక్షలు రాసే విద్యార్థులకు అదనంగా రూ.10 కలిపి రూ. 530 చెల్లించాలి. గతేడాది నిర్వహించిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫీజు కూ డా జనరల్ ఫీజులోనే (రూ. 520) తీసుకునేవారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో మాత్రం ఇంగ్లిష్ ప్రా క్టికల్ పేరిట రూ. 100 అదనంగా ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఇంగ్లిష్ ప్రాక్టికల్ కలిపి రూ.110 అదనపు భారం పడనుంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గతేడాది ఫీజు రూ.750 కాగా ప్రస్తుతం రూ.870 చెల్లించాల్సి ఉండటంతో రూ.120 అదనం భారం పడనుంది. ఇక ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్యాలు ఇష్టానుసారంగా రెట్టింపు ఫీజులు వసూలు చేస్తాయనే ఆరోపణలు ఉన్నాయి.జిల్లా కాలేజీలు ఫస్టియర్ సెకండియర్ మంచిర్యాల 65 4699 3528 కుమురంభీం 49 5507 4791 నిర్మల్ 69 7069 6749 జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ విద్యార్థుల వివరాలు..పెంపు సరికాదు ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు పెంపు సరికాదు. గతంలో ఎన్నడూలేని విధంగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ పేరిట రూ.100 ఫీజు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ఫీజుల పేరిట అదనపు భారం మోపొద్దు. బ్రిడ్జికోర్సులు చదివే విద్యార్థుల ఫీజులు రూ.200 వరకు పెంచారు. బోర్డు వెంటనే పెంచిన ఫీజులు ఉపసంహరించుకోవాలి. – చిప్పకుర్తి శ్రీనివాస్, టీవీయూవీ రాష్ట్ర కార్యదర్శి -
ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
సారంగపూర్: మండలంలోని జామ్ గ్రామానికి చెందిన రసూల్ సాయి(26) అనే యువకుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి చిన్నతనంలోనే తల్లి మృతి చెందగా తన ఆలనాపాలన తాత, నానమ్మలు ఆశన్న –ఆశమ్మలు చూసుకునేవారు. తండ్రి ప్రకాశ్ వద్దకు వెళ్లకుండా వీళ్ల వద్దే ఉండేవాడు. ఈనేపథ్యంలో మద్యానికి బానిసై డబ్బులకోసం వారిని వేధిస్తూ కొట్టేవాడు. బాధ భరించలేక సాయి నానమ్మ, తాతయ్యలు సాయికి దూరంగా వేరే ఇళ్లు అద్దె కు తీసుకుని ఉంటున్నారు. ఈక్రమంలో అతిగా మద్యం సేవించి మద్యం మత్తులో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
కళాకార్ సంఘ్ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్
జైపూర్: మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రకారుల సంస్థ భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 28, 29 తేదీల్లో జరిగిన భారతీయ కళాకార్ సంఘ్ జాతీయ సమావేశాల్లో ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు అంకూర్, జాతీయ అధ్యక్షుడు కుమార్, యూపీ అధ్యక్షుడు పాలన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాము పాల్గొన్నారు. -
బాసర ఆలయంలో కార్తిక సందడి
బాసర: కార్తికమాసం పురస్కరించుకుని శుక్రవారం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేకువజామున ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణ మధ్య సరస్వతి, లక్ష్మి, మహాకాళి అమ్మవార్లకు అభిషేకం, అర్చన, అలంకరణ హా రతి పూజలు నిర్వహించారు. గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి కార్తీకదీపం వదిలి శ్రీ సూరేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం క్యూ లైన్లో వేచి ఉండి తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు చేయించి మొ క్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనాదేవి, ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అ మ్మవారి దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా ఆలయానికి శుక్రవారం అక్షరాభ్యాసాలు, వివిధ అర్జిత సేవలతో మొత్తం రూ.7 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనా దేవి తెలిపారు. -
గోదావరిలో పడి వృద్ధుడు..
లోకేశ్వరం: మండలంలోని అబ్ధుల్లాపూర్ గ్రామానికి చెందిన దుందు చిన్న భోజన్న (65) అనే మతిస్థిమితం లేని వృద్ధుడు గోదావరిలో పడి మృతి చెందాడు. లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపిన వివరాలు.. దుందు భోజన్నకు మతిస్థిమితం లేదు. ఈనెల 23 నుంచి కన్పించడం లేదు. కుటుంబ సభ్యులు ఫి ర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం పాత అబ్ధుల్లాపూర్ గ్రామ శివారు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో శవమై కన్పించాడు. మృతదేహం కుళ్లిపోవడంతో భైంసా ఆస్పత్రి వైద్యులు సంఘటన స్థలంలోనే పంచనామా నిర్వహించారు. కాగా భార్య రుక్మవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
జైపూర్: మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో గల అడ్మిన్ భవన కార్యాలయంలో శుక్రవారం సైబర్ మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్మోహన్ల అధ్యక్షతన అధికారులు, ఉద్యోగులకు ఐడీ డీజీఎంలు శ్రీనివాస్రావు, నానా ఫర్ణవీస్లు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఆధార్, బ్యాంకు, ఇతర ముఖ్యమైన నంబర్లను సోషల్మీడియాలో ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అంతకుముందు ఎస్టీపీపీలో జాతీయ ఐక్యత దినోత్సవం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వల్లాభాయ్ పటేల్ 150వ జయంతి నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో ఇంటర్ పరీక్షలు
లక్ష్మణచాంద: ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 17 వరకు నిర్వహించనున్నా రు. ప్రయోగ పరీక్షలను ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు జరుపనున్నారు. ఇంగ్లిష్ ప్రయోగ పరీక్షలను ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల కు జనవరి 21న, రెండో సంవత్సరం విద్యార్థులకు 22న నిర్వహిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూ మన్ వాల్యూస్ పరీక్ష జనవరి 23న, పర్యావరణ విద్య జనవరి 24న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షల నేపథ్యంలో.. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు నీట్, జేఈఈ, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు ఉండడంతో ఈసారి ముందుగానే ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో మార్చిలో కాకుండా ఫిబ్రవరిలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటివరకు 75శాతం సిలబస్ పూర్తయినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నాటికి 100 శాతం పూర్తి చేసి జనవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు అధ్యాపకులు తెలిపారు. సీసీ కెమెరాల మధ్య ప్రయోగ పరీక్షలు.. ఈసారి ఇంటర్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించాలని నిర్ణయించారు. సీసీ కె మెరాలు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు మాత్రమే ప్రయోగ పరీక్ష కేంద్రాలు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే జూనియర్ కళాశాలల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. సన్నద్ధత ప్రారంభించాం ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాం. కళాశాలలో సాయంత్రం సమయంలో నిర్వహించే ప్రత్యేక స్టడీ అవర్స్లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. – హారతి, ఇంటర్ విద్యార్థిని అధ్యాపకుల పర్యవేక్షణలో.. ఇంటర్ వార్షిక పరీక్షల కోసం అధ్యాపకుల పర్యవేక్షణలో చదువుకుంటున్నాం. వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్నాం. – మహాలక్ష్మి, ఇంటర్ విద్యార్థిని ప్రణాళికతో ముందుకు.. ఇంటర్ బోర్డు సూచనల మేరకు జూనియర్ కళాశాలల్లో చర్యలు చేపడుతున్నాం. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ఉన్నాయి. ఇప్పటికే 75శాతం సిలబస్ పూర్తయ్యింది. డిసెంబర్ చివరకు సిలబస్ పూర్తి చేస్తాం. విద్యార్థులను పరీక్షల కోసం సన్నద్ధం చేసేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. – పరశురాం నాయక్, ఇంటర్ నోడల్ అధికారి, నిర్మల్ -
బెల్లంపల్లిలో రోడ్డు విస్తరణ పనులు షురూ
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాల్టీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు శుక్రవారం ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త ము న్సిపల్ కార్యాలయం ముందు నుంచి కాంటా చౌర స్తా వరకు పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపుల ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు జేసీబీలతో తొలగించి విస్తరణకు అడ్డుగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ధార్మిక, విద్యాసంస్థల ప్రహరీలను కూల్చివేశారు. ముందుగా ఎలాంటి అభ్యంతరాలు లేని కట్టడాలు తొలగించారు. శిథిలాలను మున్సిపల్ ట్రాక్టర్లలో డంప్యార్డుకు తరలించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు వంద ఫీట్ల రోడ్డును విస్తరించనుండడంతో అడ్డుగా ఉన్న కట్ట డాలను తొలగించే పనులు ముమ్మరం చేశారు. సింగరేణి ఆస్తులకు సంబంధించి ప్రహరీలు, సీఎస్ఐ చర్చి, క్యాంపు కార్యాలయం ఇతర ప్రాంతాల్లో కట డాలను రాత్రి వరకు కూల్చివేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.9.7కోట్ల అంచనాతో మున్సిపాల్టీలో ప్రతిపాదించిన రోడ్లను విస్తరించనున్నారు. మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ పర్యవేక్షణలో పనులు జరిగాయి. బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్ పర్యవేక్షణలో వన్టౌన్, బెల్లంపల్లి రూరల్, తాండూర్ సీఐలు కే.శ్రీనివాసరావు, హెచ్.హనోక్, ఎన్.దేవయ్య, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ప్రజాధనం వృథా వీధి వ్యాపారుల కోసం ప్రధాన రహదారి మూసివేతకు గురైన సింగరేణి ఎక్స్ప్లోరేషన్ విభాగం ఎదుట మున్సిపల్ ఆధ్వర్యంలో షెడ్లు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ షెడ్లలో వీధి, చిరు వ్యాపారులు చేపలు, పండ్లు, రెడీమేడ్ దుస్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుత విస్తరణలో షెడ్లు కూల్చివేతకు గురయ్యాయి. షెడ్లను ఆధారం చేసుకుని జీవనం సాగించిన చిరువ్యాపారులు వీధినపడ్డారు. షెడ్లు కూల్చివేతతో ప్రజాధనం వృథా అయిందని, అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. -
పర్యవేక్షణేది..!
కొనుగోళ్లపై సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం సేకరణలో కొన్ని చోట్ల గోల్మాల్ జరగడం జిల్లాలో కలకలం రేపుతోంది. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకునే వరకూ గుర్తించకపోవడంలో ప్రధానంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. తాజాగా జైపూర్ మండలంలో రూ.కో టిన్నర వరకు అక్రమాలు చోటు చేసుకోవడం పర్యవేక్షణలో డొల్లతనాన్ని బయటపెడుతోంది. జిల్లాలో ప్రతీ సీజన్లో వరి ధాన్యం సేకరణ లక్ష్యం పెరుగు తూ వస్తోంది. ఆయా సీజన్లలో ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేపడుతోంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, మెప్మా, డీసీఎంఎస్, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రాల నిర్వాహకులపైనా ఆరోపణలు రావడం, వారి స్థానంలో కొత్తవా రిని ఎంపిక చేయడం జరుగుతోంది. ఐకేపీ, మెప్మా కేంద్రాల కన్నా డీసీఎంఎస్, సహకార సంఘాల్లో అధికంగా అక్రమాలు జరుగుతున్నాయి. మంచిర్యా ల నియోజకవర్గంలో గత రెండు సీజన్లుగా కేవలం మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు చేపడుతున్నారు. కేంద్రాలు అప్పగించడం మొదలు, మిల్లుల ట్యాగింగ్, రవాణా తదితర అన్నింటిలోనూ మోసాలకు ఆస్కారం ఉంది. ప్రజాధనం పక్కదారి పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సరిహద్దు నుంచి లారీల కొద్దీ ధాన్యం జిల్లాకు అక్రమంగా వస్తోంది. ఇక్కడ కొందరు రాజకీయ పార్టీ నాయకులు, అధికారులతో కుమ్మకై ్క దొడ్డిదారిన వడ్లు తెచ్చి విక్రయిస్తున్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న బోనస్ సైతం కాజేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు సహకరించుకుంటూ రైతులను ముంచేస్తున్నారు. తాలు, దుమ్ము, ధూళి, తేమ అంటూ తరుగు పేరుతో కటింగ్ పెడుతున్నారు. అధికంగా వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. రైతు పంపిన బస్తాలకు, మిల్లు నుంచి వచ్చే రశీదుల మధ్య వ్యత్యాసం వస్తోంది. ఇక కొన్ని చోట్ల మిల్లర్లే రవాణా కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సైతం వారి కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. దీంతో ధాన్యం సేకరణ నుంచి కొనుగోలు, రవాణా, మిల్లులకు అప్పగింత, సీఎంఆర్ కింద బియ్యం ఇచ్చే వరకు అంతా తమ అదుపులో ఉంటోంది. దీంతో ఎక్కడైనా ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఆన్లైన్లో నమోదు చేసినా..కొనుగోలు కేంద్రాల్లో ప్రతీ గింజను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. వానాకాలం, యాసంగి వడ్ల కొనుగోళ్ల సమయంలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుని తతంగం నడిపిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖతోపాటు జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా పర్యవేక్షణ చేపటాల్సిందిగా రైతులు కోరుతున్నారు.ధాన్యం కొనుగోళ్లు(ఫైల్)జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలు(విలువ మెట్రిక్ టన్నుల్లో)సంవత్సరం ఖరీఫ్ రబీ 2017–18 31254.6 138147.3 2018–19 67044.3 156585.9 2019–20 119044.3 199856.2 2020–21 51765.9 222990.9 2021–22 137179.8 113080.3 2022–23 158336.8 186113.040 2023–24 139663.8 155067.7 2024–25 1.01లక్షలు 197590.9 2025–26 2.32లక్షలు(లక్ష్యం) -
జాతీయ సమైక్యతకు నిదర్శనం ‘సర్దార్’
మంచిర్యాలక్రైం: దేశ ప్రజలందరినీ ఏకతాటి పైకి తీసుకొచ్చి జాతీయ సమైక్యతకు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఐబీ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జిల్లా క్రీడా యువజ న సర్వీసుల అధికారి హనుమంతరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయ, సాంస్కృతిక విభేదాలు లేకుండా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని కొనియాడారు. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించారని తెలిపారు. ప్రజలంద రూ ఐక్యతతో ముందుకు సాగితే రాష్ట్రం, దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని, దేశభక్తి, సమైక్యత భా వం ప్రతీ ఒక్కరిలో ఉండాలని అన్నారు. మహనీ యుల ఆశయాలను యువత సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150వ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) వేడుకలు గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సమైక్యతను ప్రదర్శించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బెటాలియన్ నుంచి గుడిపేట గోదావరి శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరకు 2కే రన్ నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ పి.వెంకటరాములు, అసిస్టెంట్ కమాండెంట్లు నాగేశ్వర్రావు, బాలయ్య, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో..హాజీపూర్ పోలీసుల ఆధ్వర్యంలో పటేల్ జయంతి సందర్భంగా 2కే రన్ నిర్వహించారు. పోలీస్స్టేషన్ నుంచి పడ్తనపల్లి, రాంపూర్ విద్యారణ్య ఆవాస వి ద్యాలయం మైదానం వరకు సాగింది. ఎస్సై స్వరూప్రాజ్, పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల శ్రేణులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్లో కమాండెంట్ వెంకటరాములు, పోలీస్ అధికారులురన్ను ప్రారంభిస్తున్న కలెక్టర్ కుమార్దీపక్, డీసీపీ భాస్కర్ -
జీజీహెచ్ ఇంచార్జి సూపరింటెండెంట్గా వేదవ్యాస్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీ జీహెచ్) ఇంచార్జి సూ పరింటెండెంట్గా డాక్టర్ వేదవ్యాస్ను ని యమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడిక ల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఏ.నరేంద్రకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఇటీవల బదిలీ అయిన విష యం తెలిసిందే. ఆయన స్థానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ వేదవ్యాస్కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. -
క్రీడాకిట్లు మాయం..?
మంచిర్యాలటౌన్: యువత క్రీడల్లో నైపుణ్యం సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, వార్డుల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఆటలు ఆడేలా సౌకర్యాలు కల్పించకపోయినా క్రీడాకిట్లు మాత్రం పంపిణీ చేసింది. మైదానానికి వచ్చేవారిలో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలు వెలికితీసేలా క్రీడాకిట్లు ఉపయోగపడుతాయని అంతా భావించారు. కానీ ప్రస్తుతం క్రీడాకిట్లు మాయం కావడంతో లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పట్టణాలు, వార్డులు, గ్రామాల్లో 670 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలు గుర్తించింది. ఆయా స్థలాలను చదును చేసి బోర్డులు ఏర్పాటు చేసి వదిలేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణానికి పలు క్రీడల కిట్లు అందజేశారు. ఇందులో క్రికెట్ కిట్(రెండు బ్యాట్లు, బ్యాగింగ్ గ్లౌజులు రెండు జతలు, వికెట్ కీపింగ్ లెదర్ గ్లౌజులు ఒక జత, లెగ్ప్యాడ్లు రెండు జతలు, వికెట్ కీపింగ్ లెగ్గార్డు/ప్యాడ్ ఒక జత, స్టంప్స్ సెట్లు 2, అబ్డమినాల్ గార్డులు రెండు జతలు, ప్రాక్టిస్ బాల్స్ 6, ఆర్మ్గార్డ్ 2, థై ప్యాడ్లు 4, క్రికెట్ కిట్ బ్యాగ్ 1), జిమ్(డంబెల్స్ మూడుసెట్లు), వాలీబాల్ సెట్లో వాలీబాల్ సింథటిక్ 1, నెట్ 1, సైకిల్ పంప్ బిగ్ సైజ్(ఫుట్ పంప్1), ఆటవస్తువులకు కిట్ బ్యాగ్, 75 టీషర్టులు, స్కిప్పింగ్ రోప్ 4, ప్లాస్టిక్ విజిల్స్ 3, స్టాప్ అండ్ గో వాచ్ 1 చొప్పున ప్రతీ క్రీడా ప్రాంగణానికి అందజేశారు. పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో నమోదు చేసుకున్న యువజన సంఘాలకు కిట్లు అప్పగించగా, గ్రామీణ ప్రాంత కిట్లను ఎంపీడీవోలకు అందించారు. ఇందులో ఎన్ని కిట్లు యువతకు చేరాయి, ఎన్ని వినియోగంలో ఉన్నాయనే వివరాలు ప్రస్తుతం అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం. రూ.లక్షలు వెచ్చించి అందించిన కిట్లు ప్రస్తుతం క్రీడల్లో శిక్షణ పొందాలనుకునే వారికి అందుబాటులో లేకపోవడంతో, స్వంతంగా కొనుగోలు చేసుకుని సాధన చేయాల్సి వస్తోంది. గతంలో ఇచ్చిన క్రీడా కిట్లు ఏమయ్యాయనే వివరాలు సేకరించి, ఉన్నవాటిని ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారికి అందిస్తే మేలు జరిగే అవకాశం ఉంది. వివరాలు సేకరిస్తాం జిల్లాలో క్రీడాకిట్ల పంపిణీ గతంలోనే చేపట్టారు. వాటిని యువతకు ఇస్తే ఎక్కడ వినియోగిస్తున్నారనే వివరాలు సేకరిస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రీడాకిట్లు అందించగా, వాటిని యువత సద్వినియోగం చేసుకునేలా చూస్తాం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పలు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్తున్నారు. ఆసక్తి ఉన్న వారికి మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తాం. – హన్మంతరెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి -
మంచిర్యాల
7వైద్యులు సమయపాలన పాటించాలి మంచిర్యాలటౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్వో అనిత అన్నారు. స్థానిక సాయికుంట బస్తీ దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యులు ఏసన్న, అమన్ పాల్గొన్నారు. బాలికల హాస్టల్ తనిఖీ మంచిర్యాలఅర్బన్: స్థానిక ఎస్సీ కళాశాల బాలికల హాస్టల్ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి(డీడీ) దుర్గాప్రసాద్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి టిఫిన్ చేశారు. రికార్డులు, కిచెన్ గదులు పరిశీలించారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. -
పోలీస్స్టేషన్లో డీసీపీ తనిఖీ
భీమారం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఫిర్యాదులను ఎలా ఆన్లైన్ చేస్తున్నారని పరిశీలించారు. ఎఫ్ఆర్ఐ కాపీలు పరిశీలించి కేసుల వివరాలపై సీఐని అడిగి తెలుసుకున్నారు. పోలీస్స్టేషన్కు వచ్చేవారికి మర్యాద ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గంజాయి అమ్మకాలు చేపట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఆ నేరాలకు పాల్పడకుండా చూడాలని అన్నారు. రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఇంచార్జి ఎస్సై లక్ష్మిప్రస్సన్న, సిబ్బంది పాల్గొన్నారు. -
పేకాటస్థావరంపై పోలీసుల దాడి
జైనథ్: విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని కంఠ గ్రామంలో శుక్రవారం ఎస్సై గౌ తమ్ పవర్ ఆధ్వర్యంలో పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. నిందితులతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.5325 నగదు స్వా ధీ నం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు న మో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ సేవలకు పురస్కారంమంచిర్యాలటౌన్: జిల్లాలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పురస్కారాలు అందించారు. ప్రీ హాస్పిటల్ కేర్, బెల్లంపల్లి వాహనంలో సేవలు అందిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎం. భూమన్నకు, 108 లక్సెట్టిపే ట్ వాహనం పైలట్లు ఎం. సత్తయ్య, గంగన్న, 102 అమ్మ ఒడి కెప్టెన్ శంకర్లు ప్రశంసాపత్రాలు అందుకున్నారు. కార్యక్రమంలో 108 ఉమ్మ డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, మంచిర్యాల 108 అధికారి డి. సంపత్ పాల్గొన్నారు. -
డ్రగ్స్ నిర్మూలనకు పోరాటం చేయాలి
పాతమంచిర్యాల: సామాజిక రుగ్మతలకు మూలకారణమైన డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు నిరంతర పోరాటాలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, తెలంగా ణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ భాషా, సాంస్కృతిక, సామాజిక, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సల హా కమిటీ సభ్యుడు పల్లె నర్సింహ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ‘ఎంజాయి పేరుతో గంజాయి వద్దు’ అనే నినాదంతో సాగుతున్న బస్ కళాజాత కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన నిర్వహించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీని వాస్, సీపీఐ నాయకులు మేకల దాసు, ఖలిందర్ అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, రాజేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, సౌకర్యాలు కల్పించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు క ల్పించి నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర వి ద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ సంచా లకులు నవీన్ నికోలస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారులు తో సమీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నా రు. ఈ సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, డీఈవో యాద య్య, ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య పాల్గొన్నారు. పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీకాసిపేట: మండలంలోని కేజీబీవీ, తెలంగాణ మో డల్ స్కూల్, రేగులగూడ, మల్కేపల్లి గిరిజన ఆశ్ర మ పాఠశాలలు, జూనియర్ కళాశాలను కలెక్టర్ కు మార్ దీపక్ శుక్రవారం తనిఖీ చేశారు. వంటశాల, రిజిష్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో సబ్ధర్ అలీ పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి తాండూర్: పత్తి కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని శ్రీరామ, మహేశ్వరి జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు ఏర్పాట్లను తహసీల్దార్ జ్యోత్స్నతో కలిసి పరిశీలించారు. రైతులు తమ వివరాలను కిసాన్ కపాస్ యాప్లో నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. -
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా పీఎస్సార్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలటౌన్: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు(పీఎస్సార్) నియామకం అయ్యారు. కేబినెట్ హోదాతో కూడిన పదవిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎస్సార్ ఎమ్మెల్యేగా ఎన్నికై నప్పటి నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు బెర్త్ ఖరారు కాకపోవడంతో ఇన్నాళ్లుగా నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఇచ్చినా కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ముందు నుంచీ కాంగ్రెస్లోనే..కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకమైన నాయకుడిగా ఉన్నారు. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్లో ప్రారంభించి.. పార్టీ మారకుండా పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుతూ వస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా, 1999 నుంచి 2002 వరకు పీసీసీ సభ్యుడిగా, 2002 నుంచి 2005 వరకు పీసీసీ సెక్రెటరీగా, 2004 నుంచి 2006 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా, 2005 నుంచి 2007 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా, 2007 నుంచి 2013 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పనిచేశారు. 2018 నుంచి ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతూనే, 2022లో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, 2023 సాధారణ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. పదవిపై విముఖతకేబినెట్ మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రేమ్సాగర్రావు కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్వీకరించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో బెర్త్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు రెండో విడతలో మంత్రిగా అవకాశం కల్పించి ప్రేమ్సాగర్రావును పక్కనబెట్టారు. అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ సమయంలో చీఫ్ విప్, విప్తో సహా కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో అవకాశం కల్పించడంపై చర్చకు వచ్చాయి. ఆయన మంత్రి పదవి తప్ప మరే పదవీ వద్దని, ఎమ్మెల్యేగానే నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని పలుమార్లు ప్రకటించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం కోయంబత్తూర్లో ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సమయంలోనే ఆయనను నామినేటెడ్ పదవిలో నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ పదవి చేపట్టేందుకు ఇష్టం లేనట్లుగా ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుని కోలుకుని వచ్చాక నామినేటెడ్ పదవిని స్వీకరిస్తారా? లేదా తిరస్కరిస్తారా అనేది స్పష్టత రానుంది. -
ఎస్టీపీపీ సీఎంవోఏఐ ప్రెసిడెంట్గా పంతులా
జైపూర్: స్థానిక సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో శుక్రవారం సీఎంవోఏ ఐ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఎస్టీపీపీ జీఎం నరసింహారావు, వోఅండ్ఎం జీఎం మదన్మోహన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీ పదవులకు నామినేషన్ కోరారు. అధికారుల సంఘం సభ్యులందరూ సీఎంవోఏఐ ఎస్టీపీపీ బ్రాంచ్ ప్రెసిడెంట్గా డి.పంతులాను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. వైస్ప్రెసిడెంట్గా జనగామ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీగా శ్యామలను ఎన్నుకున్నట్లు ప్రకటించారు. నూతన కమిటీ సభ్యులు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవికి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అంద రి సహకారంతో సెంట్రల్ కమిటీ సభ్యులతో యాజమాన్యాన్ని సమన్వయపర్చుతూ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. -
ఆర్జీయుకేటీలో ఆంగ్లభాషపై అవగాహన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఈ నెల 30, 31 తేదీల్లో విద్యార్థులకు ఆంగ్లభాషపై అవగాహన కల్పిస్తున్నట్లు వీసీ గోవర్ధన్ తెలిపారు. ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఆంగ్లభాష నైపుణ్యం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కెన్నడి బాబు హాజరై ఆంగ్లభాషపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆంగ్ల విభా గం అధిపతి ఎ.విజయ్ కుమార్, డాక్టర్ ఎస్ విఠల్, డాక్టర్ గుజ్జారి శంకర్, డాక్టర్ ఎన్.విజయ్కుమార్, యు.ప్రభాకర్, డి.వసంత్బాబు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఖాళీ...!
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారి (ఏఎల్వో) కార్యాలయం అస్తవ్యస్తంగా తయారైంది. అసంఘటిత కార్మికవర్గానికి అందుబాటులో ఉండి సేవలు అందించడానికి రెగ్యులర్ అసిస్టెంట్ లేబర్ అధికారి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏఎల్వో కార్యాలయంలో ఏడాదిన్నర నుంచి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), అత్యంత అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ కావడంలేదు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎల్వో పాక సుకన్య మృతి చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు కోసం గత జులై 18న తన వ్యక్తిగత సహాయకురాలు మోకెనపల్లి రాజేశ్వరి ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారుల చిక్కి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె స్థానంలో మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ అధికారి సత్యనారాయణకు బెల్లంపల్లి ఇన్చార్జి ఏఎల్వో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ ఒక్కడే అన్నీ తానై విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫైళ్లు కానరాక అయోమయం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏఎల్వో పాక సుకన్య పట్టుబడక ముందు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిందనే విమర్శలు ఉన్నాయి. కొంతమందిని సహాయకులుగా నియమించుకుని ప్రతీపనికి లెక్కకట్టి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే అనేక మంది అసంఘటిత కార్మికులు కార్యాలయంలో అందజేసిన ఫైళ్లను సుకన్య వ్యక్తిగతంగా తన వద్ద ఉంచుకుని ముడుపులు ముట్టజెప్పిన కార్మికుల ఫైళ్లను మాత్రమే క్లియర్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగతా కార్మికుల పైళ్లను పెండింగ్లో పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఫైళ్ల క్లియరెన్స్ కోసం రోజువారీగా అసంఘటిత కార్మికులు ఏఎల్వో కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. కొందరి పైళ్లు కానరాకుండా పోయినట్లుగా తెలుస్తోంది. అయితే మరుగునపడిన ఫైళ్లను ఒక్కొక్కటిగా వెతికి ఇన్చార్జి ఏఎల్వో ఫార్వర్డ్ చేస్తుండటంతో కార్మికులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. మూడు నెలల కాలంలో ఇప్పటి వరకు 70కి పైగా ఫైళ్లు ఫార్వర్డ్ కాగా మరో 100 వరకు ఎక్కడున్నాయో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. రెగ్యులర్ ఏఎల్వో వచ్చేదెప్పుడో? అసిస్టెంట్ లేబర్ అధికారి కార్యాలయం పరిధిలో బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాలు ఉన్నాయి. కార్మిక క్షేత్రం బెల్లంపల్లిలో ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, హెల్పర్స్, హమాలీలు, దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలు, తదితర రంగాల వర్కర్లు వేల సంఖ్యలో ఉన్నారు. కాసిపేట, తాండూర్లో సిమెంట్, సిరామిక్స్ పరిశ్రమల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు, భీమిని, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, కళాకారులు తదితరులు ఉన్నారు. వీరందరికి సేవలు అందించడంలో అసిస్టెంట్ లేబర్ అధికారి పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. అంతముఖ్యమైన పోస్టును రెగ్యులర్ అధికారితో భర్తీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జిగా పని చేస్తున్న ఏఎల్ఓతో పాటు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పని భారానికి గురవుతున్నారు. ఏమాత్రం జాప్యం చేయకుండా రెగ్యులర్ ఏఎల్వోను నియమించి అసంఘటిత కార్మికులకు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
డబ్బులు తిరిగివ్వాలని ఆత్మహత్యాయత్నం
● కొండాపూర్ యాపలో టవరెక్కిన బాధితుడుకాసిపేట: దేవాపూర్ రేంజ్ పరిధిలో పనిచేసే బీట్ అఫీసర్ లత ఎనిమిదేళ్ల క్రితం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చుంచు జనార్దన్ అనే వ్యక్తి గురువారం రాత్రి 9 గంటలకు కొండాపూర్యాపలో సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. మండలంలోని తుంగగూడకు చెందిన జనార్దన్ వద్ద బీట్ ఆఫీసర్ లత 2018లో ప్లాట్ విషయంలో రూ.2.50 లక్షలు తీసుకుందని, అడిగితే ధూషిస్తోందని వాపోయాడు. పలుమార్లు అటవీశాఖ అధికారులకు, పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో మనస్తాపం చెందినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న దేవాపూర్ ఎస్సై గంగారాం సంఘటన స్థలానికి చేరుకోని బాధితుడితో ఫోన్లో మాట్లాడాడు. అటవీశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగాడు. -
బైక్ అదుపుతప్పి ఒకరు మృతి
నిర్మల్రూరల్: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల మేరకు సోన్ మండలంలోని న్యూవెల్మల్కు చెందిన ప్రవీణ్ కుమార్ (35) జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆస్పత్రికి బయలుదేరాడు. అక్కాపూర్ గ్రామం వద్ద రోడ్డుపై ఓ రైతు ఆరబోసిన సోయాకుప్పలోంచి బైక్ వెళ్లడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: మండలంలోని గూడెం వద్ద గోదావరిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. హాజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన గోళ్ల రవీందర్ (35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఉదయం అతని భార్య సుమలత అత్త దేవక్కతో కలిసి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం సమీప బంధువైన శ్రీనివాస్ సుమలతకు ఫోన్చేసి మీ భర్త బైక్ గూడెం బ్రిడ్జి వద్ద ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లింది. భర్త కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికించగా మృతదేహం లభించింది. మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
ఇద్దరిపై రౌడీషీట్
నిర్మల్టౌన్: పట్టణానికి చెందిన ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. సోన్ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఉమర్, గఫర్ తమ స్నేహితులతో కలిసి నిర్మల్కు వచ్చారు. హోటల్లో భోజనం చేసిన అనంతరం రాత్రి 10 గంటల సమయంలో గఫర్ తన స్నేహితులతో కలిసి తిరుమల లాడ్జి ఎదుట నిలబడి ఉండగా బాలాజీవాడకు చెందిన ప్రమోద్, బుధవార్పేట్కు చెందిన దేవర రాజ్ కుమార్ వారిని బూతులు తిడుతూ గఫర్ను బండతో కొట్టి గాయపరిచారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా గత నేరచరిత్ర ఉండడంతో వారిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. -
ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థత
బజార్హత్నూర్: మండలంలోని కొలారి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఐరన్ మాత్రలు మింగి అస్వస్థతకు గురయ్యారు. ఇన్చార్జి ఎంఈవో రాంకిషన్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనంతరం ఆశ కార్యకర్త సురేఖ ఐరన్ (ఫొలిక్ యాసిడ్) మాత్రలు ఇచ్చారు. అవి వేసుకున్న ఏడుగురు విద్యార్థులు టార్పే సాక్షిత, టార్పే ఇందుజ, ఆరాధ్య, అమృత, సుజా త, ఓంకార్, కార్తీక్ వాంతులు చేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిలివేరి శ్రీలక్ష్మి వెంటనే మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అవినీతి నిర్మూలనకే విజిలెన్స్ విభాగం
మందమర్రిరూరల్: సింగరేణిలో అవినీతి నిర్మూలన కోసమే విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఏరియాలోని జీవీటీసీలో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గెస్ట్ లెక్చరల్ కిషోర్ బుగాడియాతో కలసి అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం భాస్కర్రెడ్డి, శ్రీరాంపూర్ ఏజీఎం రాజేందర్, జీవీటీసీ మేనేజర్ శంకర్, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియా అధికారులు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి
పాతమంచిర్యాల: రజక వృత్తిదారుల రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి మదర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని చార్వాక భవన్లో రజక వృత్తిదారుల 25వ వార్షికోత్సవ సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిపై ఆధారపడి జీవ నం సాగిస్తున్నారని, ఆర్థికంగా, సామాజికంగా వె నుకబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రజకుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. పెత్తందారులు కులవివక్ష దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ రజకులకు ఉచిత విద్యుత్ పథకం కోసం నిధులు కేటాయించా లని, విద్యుత్ అధికారుల వేధింపులు ఆపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి అన్నారపు వెంకటేశ్వ ర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి క నికరపు అశోక్, పట్టణ పౌర వేదిక కన్వీనర్ గోమాస ప్రకాష్, జిల్లా కార్యవర్గ సభ్యులు నడిగోడి తిరుప తి, తోట కళావతి, సందీప్, సదయ్య పాల్గొన్నారు. -
హాస్టల్ విద్యార్థి తలకు గాయం
లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం రాత్రి ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన తోపులాటలో పదోతరగతి చదువుతున్న కార్తీక్ అనే విద్యార్థి అదుపుతప్పి కిందపడ్డాడు. ఇనుప డోర్కు తాకడంతో తలకు గాయమైంది. హాస్టల్ వార్డెన్ కెజియారాణి వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై వార్డెన్ను వివరణ కోరగా మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, ప్రమాదంలేదని వైద్యులు చెప్పడంతో గురువారం తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. -
వేతనాలు తక్కువ వేశారని ఫిర్యాదు
మందమర్రిరూరల్: తమకు అక్టోబర్ మాసం వేతనాల్లో తక్కువ వేశారని మండలంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో రాజేశ్వర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఈద లింగయ్య మాట్లాడుతూ పని ప్రోగ్రెస్లో ఎలాంటి పొరపాటు లేనప్పటికీ ఏపీవో మండలంలోని ప్రతీ ఫీల్డ్ అసిస్టెంట్కు 250, సారంగపల్లి ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.1,397, శంకర్పల్లి ఫీల్డ్ అసిస్టెంట్కు రూ.1,011 వేతనంలో తగ్గించి వేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని డీపీఆర్వో దృష్టికి తీసుకెళ్లి తగ్గించి వేసిన వేతనాన్ని తిరిగి ఇప్పించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శెట్టి సత్యనారాయణ, నెండుగూరి బాపు, బోరె జ్యోతి, సెగ్యం శంకరయ్య, తదితరులు ఉన్నారు. -
‘గడ్డెన్నవాగు’కు భారీగా వరద
దిగువకు వెళ్తున్న నీళ్లుఎగువన మహారాష్ట్రతో పాటు పరీవాహక ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 14వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరడంతో అధికారులు రెండు గేట్లు 2 మీటర్ల మేర ఎత్తి 14,280 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358.70 మీటర్లు కొనసాగిస్తూ నీటిని వదిలేస్తున్నారు. సాయంత్రానికి ఇన్ఫ్లో 9వేల క్యూసెక్కులకు తగ్గడంతో గేట్లను 1.2 మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు. – భైంసాటౌన్ -
నయా.. వంచకులు
బెల్లంపల్లి: భూముల క్రయ విక్రయాల పేరుతో కొందరు కొనుగోలు దారులను నయవంచనకు గు రిచేస్తున్నారు. సాగులో ఉన్న, పడావుగా ఉన్న భూ ములకు నకిలీ దస్త్రాలు సృష్టించి రూ.లక్షల్లో అడ్వా న్స్ తీసుకుని ఏళ్లు గడుస్తున్నా భూమి అప్పగించకుండా, అడ్వాన్స్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాము మోసపోయామని గుర్తించిన కొందరు బాధితులు అడ్వాన్స్గా తీసుకున్న డబ్బులు చెల్లించాలని నెల క్రితం బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లిలో ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి ఆందోళన చేసిన ఘటన మరువక ముందే పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు సరిగ్గా అదే కారణంతో కిడ్నాప్ కావడం కలకలం సృష్టించింది. ఆ రెండు సంఘటనలు భూ విక్రయాల పేరుతో జరుగుతున్న మోసాలకు అద్దం పడుతున్నాయి. సారవంతమైన భూములు చూపించి... వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు బెల్లంపల్లి ప్రాంతం నెలవుగా మారింది. భీమిని, తాండూర్, కన్నెపల్లి, వేమనపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో సాగులో ఉన్న పట్టా భూములతో పాటు ఉద్యానవన తోటలు, పడావుగా ఉంటున్న భూములను అమ్మకానికి చూపిస్తున్నారు. సారవంతమైన భూములు కావడం, జల వనరులతో అలరారుతుండడంతో కొనుగోలుదారులు ఇష్టపడి అడ్వాన్స్ చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. వీటిలో అనేక భూములు వివాదంలో ఉంటున్నాయి. నెలలు గడుస్తున్నా భూమిని పట్టా చేసి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు. సివిల్ కేసుల పరిధిలోకి రావడంతో... భూ సమస్యలు, అమ్మకం, కొనుగోళ్లు, డబ్బుల వ్య వహారాలు సివిల్ కేసుల పరిధిలోకి వస్తాయి. కో ర్టుల ద్వారా మాత్రమే ఆయా సమస్యలను పరి ష్కరించుకోవాల్సి ఉంటుంది. సివిల్ తగాదాలను పో లీస్స్టేషన్లో పరిష్కరించరాదనే కోర్టు ఆదేశాలు ఉండటంతో భూ మోసాలు, నయవంచనలు పో లీసు అధికారుల దృష్టికి వెళ్లినా నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. దీంతో పెద్ద మనుషులు, తెలి సిన వ్యక్తుల సమక్షంలో మాట్లాడుకుని డబ్బుల చెల్లింపునకు ఒప్పంద పత్రాలు రాసుకుంటున్నారు. గడువు ప్రకారం డబ్బులు ముట్టజెప్పక పోవడంతో అమ్మకం, కొనుగోలు దారుల మధ్య ఘర్షణ వాతా వరణం నెలకొంటోంది. చివరికి బాధితులు కొందరు రౌడీలు, గూండాలను ఆశ్రయిస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇంకొందరు రాజకీయ నేతలను ఆశ్రయించి వొత్తిళ్లు తీసుకు వస్తున్నారు. కాగా భూ అమ్మకాలకు సిద్ధపడిన వ్యక్తులు సైతం తామేం తక్కువ కాదన్నట్లు ఆకతాయి యువకులతో గ్యాంగ్లు మెయింటేన్ చేస్తున్నారు. ఏదిక్కూలేని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలిస్తున్నా భూముల అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదు. కొనుగోలు దారులంతా స్థానికేతరులే ... రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, హైదరాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో పాటు మంచిర్యాలకు చెందిన వ్యక్తులు కూడా భూములకోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు భూ క్రయ విక్రయాలు సాగిస్తున్న కొంతమంది ఆయా ప్రాంతాలకు వెళ్లి తప్పుడు పత్రాల ఆధారంగా వారితో బేరం కుదుర్చుకుంటున్నారు. కనిష్టంగా రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ.కోటికి పైగా వసూలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. -
సంక్షేమం పట్టేదెవరికి..!
మంచిర్యాలఅర్బన్: సంక్షేమ వసతిగృహాల్లో వరుస సంఘటనలు కలవరపెడుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం, పర్యవేక్షణ లేమి వెరసి తల్లిదండ్రుల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారుల నుంచి వార్డెన్ల వరకు ఇన్చార్జీలు కొనసాగడం, ఏదో ఒక కారణంగా బాధ్యతల నుంచి తప్పించడం, సస్పెండ్కు గురి కావడం, రెగ్యులర్ పోస్టు నుంచి డిప్యూటేషన్లు ఇవ్వడం అంతా షరా మామూలుగా మారింది. ఏసీబీ అధికారుల తనిఖీల్లో నిర్వహణ లోపం మొదలు విద్యార్థుల అస్వస్థత.. అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల్లో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎస్టీ హాస్టళ్లలో గందరగోళంఎస్టీ వసతిగృహాల పర్యవేక్షణ గాలికి వదిలేశారు. ఇన్చార్జీలు, డిప్యూటేషన్లతోనే సర్దుకుపోతున్నారు. గత ఏడాది నవంబర్ 6న ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనకు బాధ్యులను చేస్తూ జిల్లా స్థాయి అధికారి(ఎస్సీ డీడీ)తోపాటు హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ఇదే పాఠశాలలో రెగ్యులర్ వార్డెన్ను కూడా జన్నారానికి డిప్యూటేషన్ చేశారు. వేధింపుల వ్యవహారంలో ఓ ఉపాధ్యాయుడిని బాబానగర్కు, పీడీని వేమనపల్లికి డిప్యూటేషన్ పంపించారు. సస్పెన్షన్కు గురైన హెచ్ఎంకు తిరిగి ఇదే పాఠశాలలో రెగ్యలర్ పోస్టు కేటాయించి వేమనపల్లి ఆశ్రమ పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించారు. బియ్యం గోల్మాల్ ఘటనలో వేమనపల్లి ఆశ్రమ పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేసి తిరిగి అక్కడే రెగ్యులర్ పోస్టు ఇచ్చినట్లే ఇచ్చి మరో పాఠశాలకు డిప్యూటేషన్ ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారింది. ఎస్టీ డీడీగా విధులు నిర్వర్తించి సస్పెండ్కు గురి కావడంతో నిర్మల్ అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఏమైందో ఏమోగానీ మూడు నెలలు గడవక ముందే ఆయన స్థానంలో ఓ అధికారిని నియమించారు. రెగ్యులర్ పోస్టును కాదని ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు డిప్యూటేషన్పై వెళ్లడం ఏమిటో అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించడం గమనార్హం. ఇదివరకు జిల్లాలోని ఎస్టీ హాస్టళ్ల నిర్వహణ లోపంపై ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూడడంతో ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వసతిగృహం అంతేగా..ఎస్సీ వసతిగృహాల్లోనూ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. హెచ్డబ్ల్యూవో, ఓ అధికారి వ్యవహార శైలిపై మంత్రికి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేయ డం తెలిసిందే. బెల్లంపల్లిలో ఇన్చార్జిగా కొనసాగుతున్న వసతిగృహం సంక్షేమాధికారి వద్దంటూ వి ద్యార్థులు లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. మెనూ అమలు చేయాలంటూ రోడ్డెక్కారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇంత జరిగినా షోకాజ్ నోటీసుతో సరిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి(ఎస్సీ డీడీ)గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందడంతో ఎస్సీ కార్పొరేషన్ ఈడీని ఇన్చార్జిగా నియమించారు. పదోన్నతిపై ఖాళీగా ఉన్న ఓ హెచ్డబ్ల్యూవో స్థానంలో ఏఎస్డబ్ల్యూవోకు ఇంచార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు. గతంలో వార్డెన్గా ఉన్న సమయంలో చేసిన అవకతవకలపై జిల్లా అధికారికి ఫిర్యాదు చేసినా వెనకేసుకొచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్ వచ్చినా ప్రోసీడింగ్ ఇవ్వకపోవడం, అధికారుల వేధింపులు తాళలేక లక్సెట్టిపేట వసతిగృహ సంక్షేమాధికారి రాజగోపాల్రావు ఆత్మహత్యాయత్నం చేసిన విష యం తెలిసిందే. విద్యార్థి సంఘాలు అధికారి చిట్టా తో కలెక్టర్, మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఎట్టకేలకు ఇన్చార్జి బాధ్యతల నుంచి అతడిని తప్పించి మరో వార్డెన్ను నియమించడం గమనార్హం. నిధులపై నిగ్గుతేలేనా..?బీసీ వసతిగృహాల్లో వ్యవహారం మరోలా ఉంది. శాఖకు ఏమాత్రం సంబంధం లేని అధికారికి అప్పగించారు. ఇదే అదునుగా భావించిన అధికారి ఆ శాఖ బాధ్యతలు శాశ్వతమని భావించాడేమో తెలియదు కానీ.. కార్యాలయం(క్యాబిన్) కోసం ప్రభు త్వ నిధులు లేకుండా పనులు చక్కబెట్టారు. సార్ కూర్చునే గదితోపాటు మరో రెండు గదులకు రూ.3లక్షలతో వార్డెన్లు క్యాబిన్ చేయించారంటే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల సంఖ్యను బట్టి వా ర్డెన్లు నిధులు సమకూర్చాలని హూకుం జారీ చేసిన అదృశ్య శక్తి ఎవరో తెలియకుండాపోయింది. వార్డెన్లు ఇష్టానుసారంగా ని ధులు సమకూర్చారనే వాదనలూ లేకపోలేదు. అయితే.. రూ.3లక్షలకు పైగా ఎందు కు ఇచ్చారనేదే తెలియాల్సి ఉంది. ఇటీవల లక్సెట్టిపేట హాస్టల్లో నెలకొన్న వివాదంతో వార్డెన్ను సస్పెండ్ కాకుండా సరెండర్ చేయడంపై చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్కు తనిఖీకి వెళ్లినప్పుడు హాజరు పుస్తకంలో ఉన్నదానికంటే విద్యార్థులు తక్కువగా ఉన్నా.. ఓ విద్యార్థిపై చేయి చేసుకున్నా కిమ్మనకుండా ఉండడం వెనుక లోగుట్టు ఏమిటో తనిఖీ అధికారికే తెలియాలి. తనిఖీకి వెళ్లినప్పుడు శాఖకు సంబంధం లేని వ్యక్తులను తీసుకెళ్లడంపై వార్డెన్లు తప్పుపడుతున్నారు. మహనీ యుల వర్ధంతి, జయంతికి నిధులు మంజూ రైనా వార్డెన్లకు బరువు బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు లేకపోలేదు. అధికారి బాగోతంపై ఉన్నతాధికారులకు హెచ్డబ్ల్యూవోలు ఫిర్యాదులు చేయడమో..? ఏ మోగానీ అధికారిని బాధ్యతల నుంచి త ప్పించారు. అన్ని విషయాలపై నిగ్గు తేల్చేందుకు విచారణ చేపట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏబీసీడబ్ల్యూవోను ఇంచార్జిగా నియమించడం కొసమెరుపు. -
అక్షరాస్యతలో ముందుండాలి
వేమనపల్లి: అక్షరాస్యతలో మండలాన్ని ప్రథ మ స్థానంలో నిలపాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ అన్నారు. గురువారం స్థానిక మండల పరిష త్ కార్యాలయంలో ఎంపీడీఓ కుమారస్వామి అధ్యక్షతన ‘అమ్మకు అక్షరమాల’ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేశామన్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సీఆర్పీలతో ప్రతీ గ్రామ సంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీఓఏలకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అందరూ సమన్వయం, అంకితభావంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి ఎంఈఓ శ్రీధర్రెడ్డి, సీఆర్పీలు తిరుమల, అమీనా, డీఆర్పీ సుమన్ పాల్గొన్నారు. -
డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలి
మంచిర్యాలటౌన్: నవంబర్లో డిజిటల్ లైవ్ సర్టిఫి కేట్ సమర్పించేందుకు సీఎంపీఎఫ్ అధికారులు ఏరి యా వారీగా చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భా గంగానే డిజిటల్ మెడికల్ కార్డులు ఇవ్వాలని సింగరేణి విశ్రాంత కార్మికులు కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. డిజిటల్ లైవ్ సర్టిఫికేట్ స్పెషల్ డ్రైవ్ కేంద్రాలను మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండలో ఏర్పాటు చేయడం వల్ల విశ్రాంత పెన్షనర్లకు ఉ పయోగకరంగా ఉంటుందని అన్నారు. మీసేవా కేంద్రాలలో జీవన్ ప్రమాణ్ లైవ్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల గత ఏడాది దాదాపు ఐదు వేల మంది విశ్రాంత ఉద్యోగులకు కోల్మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ పింఛన్లు ఆగిపోయాయని అన్నారు. ఈ స మావేశంలో తెలంగాణ సింగరేణి రిటైర్మెంటు కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు చెలిమల అంజన్న, బీంసేన్, ఆర్. రాజేశం, కె.భిక్షపతి, జి.లింగయ్య, సుధీర్సేన్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ బిల్లు ‘లక్ష’ణంగా అందజేత
వేమనపల్లి: ‘ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్’ శీర్షికన గు రువారం సాక్షిలో ప్రచురితమైన కథనం మండలంలో సంచలనం సృష్టించింది. బిల్లు స్వాహా చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎంపీడీవో కుమారస్వామి పోస్టుమాస్టర్ శాంకతోపాటు బాధితురాలు పదిరె అంకు, కుటుంబ సభ్యులను మండల పరిష త్ కార్యాలయానికి పిలిపించారు. ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించారు. పొరపాటుగా తాను బా ధితురాలి ఖాతా నుంచి ఆమెకు చెప్పకుండా రూ.లక్ష డ్రా చేసుకోవడం తప్పేనని పోస్టుమాస్ట ర్ అంగీకరించారు. గతంలో రూ.10వేలు ఇవ్వగా.. మిగతా రూ.90వేలు ఎంపీడీవో చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. పింఛన్లో రూ.16 కోత విధించడంపై బాధితులు ఆందోళనకు దిగిన విష యం తెలిసిందే. ఇకముందు లబ్ధిదారులకు రూ.16 నగదు అందజేస్తానని పోస్టుమాస్టర్ అంగీకరించా రు. మరోసారి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కానివ్వనని రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. ‘సాక్షి’ కథనంతో తమకు న్యాయం జరిగిందని బా ధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుమురం రమేష్, నాయకులు జాడి గోపాల్, వెంకటేష్గౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఎఫెక్ట్ -
ఇంటర్ ఫస్టియర్లో ‘ప్రయోగ’ం
మంచిర్యాలఅర్బన్: ప్రయోగాలు చేయడం విజ్ఞానశాస్త్రంలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. శాస్త్ర సాంకేతిక విప్లవంలో ప్రయోగాలకు ప్రధాన స్థానం ఉంది. తరగతిలో విన్న పాఠాన్ని తెలుసుకునేందుకు కృత్యాలు.. ప్రయోగాలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో మాత్రమే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగాల కు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలోనే విద్యార్థులకు నేర్పించాల్సి ఉన్నా చాలా కళాశాలల్లో బోధనోపకరణాలపై దుమ్ము పేరుకుపోయి కనిపిస్తుంది. రెండో సంవత్సరంలో మాత్రమే నిర్వహిస్తున్న ప్రయోగాలను వచ్చే ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విషయ పరిజ్ఞానం పెరుగుదలకు ప్రయోగ పరీక్షలు ఎంతో దోహదపడుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 4699, రెండో సంవత్సరం విద్యార్థులు 3528 మంది ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ, వృత్తి విద్య విద్యార్థులు ప్రయోగం చేయడంతో విషయ పరిజ్ఞానం పెరుగనుంది. ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణ ద్వారా మొదటి సంవత్సరం నుంచి సన్నద్ధమవుతారు. ప్రస్తుతం రెండో సంవత్సరంలో నిర్వహించడం వల్ల విషయ పరిజ్ఞానంలో వెనుకబడి పోతున్నారు. గతేడాది ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరికరాలకు ఒక్కో కళాశాలకు రూ.25వేల చొప్పున నిధులు మంజూ రు చేసింది. రసాయనశాస్త్రంలో లవణ, విశ్లేషణ, మూలకాలు, తదితర వాటి గురించి తెలియాలంటే రసాయనాలు అవసరం. హైడ్రో క్లోరిక్ యాసిడ్, సల్ఫర్ యాసిడ్తో 24 రకాల సాల్ట్(లవణాలు) అవసరమైన పరికరాలు కొనుగోలు చేశారు. బోట నీ, జువాలజీ ల్యాబ్స్లో జంతు కళేబరాలు, అవశేషాలు విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం తదితర విషయాలు తెలుసుకునేందుకు మెక్రోస్కోప్లు వినియోగించడంతో విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపడే వీలుంటుంది. -
సురక్షితంగా ప్రయాణించేలా..!
ఆదిలాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బైకర్ నిర్లక్ష్యం, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్, కండక్టర్ల నిర్లిప్తత వెరసి 19 మంది ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆర్టీసీ సంస్థ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సుల్లో సైతం అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే తీసుకోవాల్సిన భద్రత ప్రమాణాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. ముందే చెకింగ్.. ఆర్టీసీ బస్సులు బయలు దేరేముందే అన్ని విధాలుగా మెకానిక్లు చెక్ చేయనున్నారు. బస్సు డిపోకు చేరుకున్న తర్వాత సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసి, డ్యామేజీలు, టైర్ల పనితీరు వంటివి క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనంతరం ట్యాంకులో డీజిల్ నింపి, వాషింగ్, స్వీపింగ్ వంటివి చేసి బస్సులను మెకానిక్ వద్దకు పంపుతారు. మెకానిక్లు లీకేజీలు, ఇంజన్ ఆయిల్ చెకింగ్, కూలెంట్ పనితీరు, బోల్ట్లు చెక్ చేయడం వంటివి చేసి ఏవైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. ఎలక్ట్రీషియన్ వైరింగ్ చెక్ చేయడంతో పాటు హెడ్లైట్స్, ఇండికేటర్స్ వంటివి సరి గ్గా పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తారు. ప్రతీ నెల రోజులకు ఒకసారి హబ్ సర్వీసింగ్ చేయడం, ప్రతీ మూడు నెలలకు గేర్ బాక్స్ మార్పిడి వంటివి చేపడుతారు. అయితే ఇకనుంచి ఒకటికి రెండుసార్లు బస్సును పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే నడిపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు సూచనలు.. ఆర్టీసీ బస్సుల్లో బస్సులు బయలు దేరేముందు ప్రయాణికులకు డ్రైవర్లు పలు సూచనలు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ప్రయాణికులు ఏ రకంగా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయంపై సూచించనున్నారు. ముందుగా తమను తాము పరిచయం చేసుకొని, బస్సు వివరాలు, ఎన్ని గంటలకు గమ్యం చేరుకుంటుందనే విషయాన్ని తెలియపరుస్తారు. ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడడం ఎలాగో వివరిస్తారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక పరికరాల వాడకం, అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు హామర్స్ వినియోగం వంటి విషయాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన..అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ అధికారులతో డ్రైవర్లు, కండక్టర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే డ్రైవర్లు ఏ విధంగా వ్యవహరించాలి, అగ్నిమాపక పరికరాలను ఏ విధంగా వినియోగించాలనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మంటలు బస్సులో వేగంగా వ్యాపించినప్పుడు ఏ రకంగా వాటిని అదుపు చేయాలనే అంశాలను వివరిస్తున్నారు.డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లు ప్రయాణికులకు సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. డ్రైవర్లు, కండక్టర్లకు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే విషయంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రయాణికుల భద్రతే పరమావధిగా, సురక్షిత ప్రయాణాన్ని కల్పించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. – ఎస్.భవాని ప్రసాద్, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్
కాగజ్నగర్రూరల్: ఆన్లైన్లో మోసం చేసిన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు. బుధవారం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆన్లైన్లో మోసపోయి రూ.45,790లను కోల్పోయినట్లు ఆగస్టు 15న ఓ బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా డబ్బులు ఏ అకౌంట్కు వెళ్లాయో డీఫోర్సీ బృందంతో సాంకేతిక ఆధారాలు సేకరించి ట్రేస్ చేయగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సాత్నా జిల్లాకు చెందిన ఆశిష్ కుమార్ దోహార్ అకౌంట్లో జమయ్యాయి. నిందితుడు అకౌంట్ పేరును ఆశిష్ కిరాణా స్టోర్ అని మార్పు చేసి వినియోగిస్తున్నాడు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, డీఫోర్సీ బృందం మధ్యప్రదేశ్కు వెళ్లి ఈనెల 25న నిందితుడిని పట్టుకుని అక్కడి న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి ఈనెల 28న కాగజ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా ఆశిష్ టీస్టాల్లో పని చేస్తూ జీవిస్తున్న సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఆకాశ్ వద్వానీతో పరిచయం ఏర్పడింది. ఏటీఎం, ఆధార్ కార్డు, మొబైల్ లింక్ అకౌంట్ ఇస్తే నెలకు రూ.10వేలు ఇస్తానని ఆకాశ్ వద్వానీ చెప్పడంతో ఆశిష్ ఇచ్చాడు. ఇతరులను మోసం చేసి వచ్చిన డబ్బులను ఆ అకౌంట్లో జమ చేసేవాడని ఆశిష్ పోలీసులకు తెలిపాడు. కాగా ఫిర్యాదు దారుడి అకౌంట్ నుంచి మోసపోయిన రూ.45,790లకు గాను రూ.34,537 లను ఫ్రీజ్ చేశామని సీఐ వివరించాడు. ఆకాశ్ వద్వానీ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సైబర్ కేసును ఛేదించిన కాగజ్నగర్ రూరల్ ఎస్సై సందీప్ కుమార్, పోలీసు సిబ్బంది, డీఫోర్సీ బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
శాంతి భద్రతల కోసమే కార్డన్ సెర్చ్
ఇచ్చోడ: శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండటానికే కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని గుండాల గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. పోలీసులు ఎల్లప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారని తెలిపా రు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవిండ్ లైసెన్స్లు కలిగి ఉండాలని పేర్కొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 బైకులు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ ఎస్సైలు పురుషోత్తం, శ్రీకాంత్, ఇమ్రాన్, పూజతో పాటుగా స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
వైన్స్షాప్లో చోరీ.. ముగ్గురు రిమాండ్
బేల: బేలలోని కనకదుర్గ వైన్స్షాప్లో ఈ నెల 27 అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ ముగ్గురిని రిమాండ్ చేసినట్లు జైనథ్ సర్కిల్ సీఐ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో మాట్లాడారు. చోరీపై వైన్స్ నిర్వాహకుడు రవీందర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించామన్నారు. వైన్స్షాపు వెనుక భాగాన ఉన్న వెంటిలెటర్ నుంచి వైన్స్లోపలకు ప్రవేశించి రూ.13,400విలువ గల మద్యంతో పాటు రూ.41,930 నగదును ముగ్గురు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. చోరీకి పాల్పడిన బేలకు చెందిన పుసాం నారాయణ, షిండే అజయ్, టేకం జోష్వలను స్థానిక గణేశ్ గార్డెన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి రూ.10,320 విలువ గల మద్యం బాటిళ్లతో పాటు రూ.38,630 నగదు, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రణాళిక బద్ధంగా దొంగతనం చేసి నగదును వ్యక్తిగత వినోదాలకు వినియోగించినట్లు గుర్తించామన్నారు. సమావేశంలో ఎస్సై ఎల్. ప్రవీణ్, ఏఎస్సై కనక జీవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం సందర్శన
నార్నూర్: మండలంలోని నాగల్కొండ గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం వరల్డ్ బ్యాంకు బృందం సభ్యులు సందర్శించారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రిజిస్టర్లను పరి శీలించారు. రోగులకు వైద్యం అందిస్తున్న తీరును స్థానిక ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీ, ఆశ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందుతున్న తీరును గ్రామ పెద్దలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కేంద్రంలో ఉన్న మందులు పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం పనితీరు బా గుందన్నారు. వరల్డ్ బ్యాంకు బృందం ప్రతినిధులు డాక్టర్ కృష్ణ, రంజన్ బివర్మ, అనికేత్ ఘన్శ్యామ్, రాష్ట్ర క్వాలిటీ మేనేజర్ రాధిక, స్టేట్ డీడీఎం జా న్సన్, జిల్లా మలేరియా అధికారి శ్రీధర్, జిల్లా ప్రో గ్రాం అధికారి జాదవ్ దేవిదాస్, ప్రభుత్వ ఆసుపత్రి డీడీవో డాక్టర్ రాంబాబు తదితరులు ఉన్నారు. ఉట్నూర్రూరల్: ఉట్నూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులు ఎస్.కృష్ణ, రంజన్, బి. వర్మ, అనికేత్ ఘన్శ్యామ్ అన్నారు. బుధవారం ఉ ట్నూర్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వ సతులు, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర క్వాలిటీ ఆఫీసర్ రాధిక, డీఎంవో డా క్టర్ శ్రీధర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ దేవీదాస్ జా దవ్, ఏవో గీతేష్, డీడీఎం రమణ, నోడల్ ఆఫీసర్ డా.కపిల్ నాయక్, ఆసుపత్రి ఆర్ఎంవో డా.మ హేందర్ సిబ్బంది ఉన్నారు. -
‘వైద్యుల నిర్లక్ష్యంతోనే కార్మికుడు మృతి’
మందమర్రిరూరల్: కార్పొరేట్ ఆసుపత్రుల్లోని వైద్యుల నిర్లక్ష్యం, సింగరేణి పీఆర్వోల బాధ్యతారాహిత్యం వల్లనే మందమర్రి ఏరియాలోని వర్క్షాపులో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే తాళ్ల రమేశ్ మృతి చెందాడని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం రామన్కాలనీలో రమేశ్ ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ జ్వరంతో బాధపడుతున్న రమేశ్ హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా రూ.9 లక్షలు పేమెంట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేస్తామని కాలయాపన చేశారని ఆరోపించారు. కొత్తగూడెం సీఎంవో నుంచి పేమెంట్ అప్రూవల్ వచ్చిన తర్వాత పేషెంట్ మంగళవారం మృతి చెందినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారన్నారు. కార్మికుడి మృతికి సింగరేణి భవన్లో ఉన్న హెల్ప్లైన్ డాక్టర్లు, పీఆర్వోలు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రమేశ్ మృతదేహాన్ని టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ తదితర సంఘాల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. -
చిరుత సంచారం
ముధోల్: మండల కేంద్రంలోని కంటి ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై చిరుత సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి అటుగా వెళ్లిన వాహనదారులకు చిరుత కనిపించింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ బుధవారం ఉదయం చిరుత సంచరించిన ప్రదేశాన్ని పరిశీలించారు. రోడ్డు పక్కన వ్యవసాయ చేనులో చిరుత పాదముద్రలు లభ్యమయ్యాయి. చిరుత ముధోల్, తరోడా శివారుల్లో సంచరిస్తున్నందున రైతులు ఒంటరిగా చేలోకి వెళ్లొద్దని, గుంపులుగా, చేతిలో కర్రలతో వెళ్లాలని సూచించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలన్నారు. తాంసి(కే)లో పెద్దపులి సంచారంభీంపూర్: మండలంలోని తాంసి(కే) గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం పులి సంచరించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనలకు గురై పరుగులు తీసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు అటవీశాఖ అధికారి హైమద్ఖాన్ను సంప్రదించగా.. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కడెం గేట్ల లీకేజీలకు మరమ్మతులుకడెం: కడెం ప్రాజెక్ట్ వరద గేట్ల లీకేజీలను అరికట్టేందుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. లీకేజీల రూపంలో వృథాగా నీళ్లు పోకుండా ఉండేందుకు గేట్ల కింది భాగంలో కాటన్ వేస్ట్ అమర్చుతున్నారు. ప్రస్తుతం 12 గేట్ల లీకేజీ మరమ్మతులు పూర్తయినట్లు ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. -
ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీలకు ఎంపిక
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగిన సాఫ్ట్బాల్ అంతర్జిల్లా యూనివర్సిటీ టోర్నమెంట్లో మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మంచిర్యాల జట్టు రన్నర్స్గా నిలవగా ఇందులో డానియల్, కమల్రాజ్, ప్రదీప్, అభినవ్లు కాకతీయ యూనివర్శిటీ జట్టు నుంచి ఆల్ ఇండియా యూనివర్శిటీ పోటీలకు ఎంపికయ్యారు. పంజాబ్ యూనివర్సిటీలో డిసెంబర్ 12న జరిగే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. క్రీడాకారులను పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, డైరెక్టర్ విజయ్కుమార్, పీడీ శ్రీని వాస్లు అభినందించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి..
గుడిహత్నూర్: మండలంలోని మా న్కాపూర్ గ్రామానికి చెందిన నల్వాడ్ విట్టల్ (39) మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్ర కారం.. వ్యవసాయం చేసే నల్వాడ్ విట్టల్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం మద్యం తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డాడు. అనంతరం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి తన అన్న కొడుకు మనోజ్కు ఫోన్ చేసి విషయం తెలిపాడు. మనోజ్తో సహా కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి కదల లేని స్థితిలో ఉన్న విట్టల్ను రిమ్స్కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం విట్టల్ మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతుడి తమ్ముడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పలు రైళ్లు రద్దుకాగజ్నగర్టౌన్: మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను బుధ, గురు రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదే విధంగా బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్ స్టేషన్ల మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ రైలును బల్లార్షా నుంచి కాజిపేట స్టేషన్ వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
కాసిపేట: బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధి మద్దిమాడలో చోటుచేసుకుంది. దేవాపూర్ ఎస్సై గంగారాం, మృతుడి తల్లి గంగుబాయి తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడలో తల్లి గంగుబాయితో కలిసి ఉండే ఆదె సాయికుమార్(20) దేవాపూర్లోని మెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సాయికుమార్ తనకు బైక్ కొనివ్వాలని తల్లిని అడిగాడు. అయితే తన వద్ద డబ్బులు లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహంతో తల్లిని బయటకు గెంటేసి తలుపులు పెట్టుకున్నాడు. తల్లి బయట షెడ్డులో పడుకుని బుధవారం ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా సాయికుమార్ దూలానికి ఉరేసుకుని కన్పించాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. గంగుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సహకరించాలి
మందమర్రిరూరల్: ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు నాయకులు సహకరించాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. నాయకులు ఏరియాలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఎస్వో టు జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, ఐఈడీ కిరణ్కుమార్, సీవిల్ ఎస్ఈ రాము, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు దాగం మల్లేష్, అక్బర్ అలీ, కంది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రేటింగ్స్లో వెనుకబడి!
మంచిర్యాలఅర్బన్: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాలల స్థితిగతులను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయాల రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరిట కార్యక్రమం చేపట్టింది. మూత్రశాలల వినియోగం, నీటి వసతి, మొక్కలు నాటి సంరక్షణ తదితర అంశాలు పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ఆయా పాఠశాలల పరిస్థితిని ఎస్హెచ్వీఆర్ యాప్, https:// shvr. education. gov. in వెబ్సైట్లో యూడైస్ కోడ్తో లాగిన్ అయి నమోదు చేసుకున్నారు. జిల్లాలో 1,045 పాఠశాలల్లో 1,27,834 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తం 908 పాఠశాలలు ఆన్లైన్లో రిజిష్టర్ చేసుకోగా.. ఇందులో 400 పాఠశాలలు రేటింగ్లో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైవ్స్టార్(అత్యుత్తమ) సాధించిన పాఠశాలలు 23 ఉన్నాయి. పచ్చదనం, నీటి పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణలో ఫోర్త్స్టార్(4స్టార్)లో 377 ఉన్నాయి. మిగతా 508 పాఠశాలలు రేటింగ్స్లో అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆరు అంశాలు.. ఆరవై ప్రశ్నలు స్వచ్ఛతకు సంబంధించిన ఆరు అంశాలను పరిగణ నలోకి తీసుకుని 60 ప్రశ్నలు ఆన్లైన్ ప్రక్రియలో ఉంచారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు విద్యార్థుల నడవడిక, ఎకోక్లబ్ల ఏర్పాటు, నీటి సంరక్షణ, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మొక్కలు, తోటల పెంపకం, సౌరశక్తి వినియోగం తదితర అంశాలకు ఆన్లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చారు. అవసరమైన ఫొటోలు అప్లోడ్ చేశారు. మెరుగ్గా ఉండే వాటికి మార్కుల ఆధారంగా కేంద్రం ఎంపిక చేసింది. క్షేత్రస్థాయి తనిఖీలు ఎస్హెచ్వీఆర్ కార్యక్రమంలో భాగంగా అప్లోడ్ చేసిన వివరాలు, చిత్రాలను కమిటీ బృందం తనిఖీ చేస్తుంది. ఫైవ్స్టార్, 4స్టార్ పాఠశాలల్లో అప్లోడ్ చేసిన వివరాలు నిర్ధారించనున్నాయి. ఆయా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో కాంప్లెక్స్ హెచ్ఎం, సహాయకుడితో బుధవారం నుంచి పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లా నుంచి ఎనిమిది పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రాథమిక 3, ఉన్నత పాఠశాలలు 3, అర్బన్ నుంచి ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఒక్కొక్కటి అత్యుత్తమమైన వాటిని తనిఖీల అనంతరం ఎంపిక చేస్తారు. ప్రతీ రాష్ట్రం నుంచి 20 పాఠశాలలను జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు. జాతీయ స్థాయిలో మొత్తం 200 పాఠశాలలను ఎంపిక చేసి రూ.లక్ష స్కూల్గ్రాంట్గా ఇవ్వనున్నారు. పాఠశాలలను ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు ఎక్స్ఫోజర్ విజిట్(క్షేత్ర సందర్శన)కు తీసుకెళ్తారు. -
ఎడతెరిపి లేని వాన
చెన్నూర్/చెన్నూర్రూరల్/భీమారం/మందమర్రిరూరల్/జైపూర్/భీమిని/బెల్లంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మోంథా తుపాను ప్రభావం కారణంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్లోని గోదావరి నదీ తీరం వెంట పత్తి, వరి, మిర్చి పంటలు సాగు చేసిన రైతులు ఆందోళన చెందతున్నారు. చెన్నూర్ మండలం అక్కెపల్లి, చింతలపల్లి, శివలింగాపూర్, భీమారం మండలం అంకుసాపూర్, పోలంపల్లి, మద్దికల్, మందమర్రి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట నేలవాలి నష్టం వాటిల్లింది. మొక్కలపై పత్తి తడిసిపోవడంతో నల్ల గా మారే ప్రమాదం ఉంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో పెట్టుబడి కూడా రాకుండా పోతుందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో నాగమల్ల సోమయ్య ఇంటి పై కప్పు కూలింది. జిల్లాలో.. మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7.7మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల మండలంలో 21 మిల్లీమీటర్లు, జైపూర్లో 16.5, దండేపల్లిలో 14.5, నస్పూర్లో 10.5, కన్నెపల్లిలో 10.5, బెల్లంపల్లిలో 9, హాజీపూర్లో 8.8, భీమినిలో 7.5, భీమారంలో 5.8, నెన్నెలలో 5.5, తాండూర్లో 5.5, చెన్నూర్లో 4.5, మందమర్రిలో 3.5, లక్సెటిపేటలో 3.3, కోటపల్లిలో 1.8, జన్నారంలో 0.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో రెండ్రోజులు తుపాను కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓసీపీలో నిలిచిన ఉత్పత్తి శ్రీరాంపూర్: వర్షం వల్ల శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి క్వారీలో షవల్స్, డంపర్లు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రస్తుతం రోజుకు 10 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తున్నారు. 3 వేల టన్నుల బొగ్గు వస్తుంది. వర్షం కారణంగా ఇది పూర్తిగా నిలిచిపోయింది. క్వారీలో చేరిన నీటిని భారీ సామర్థ్యం ఉన్న పంపులతో బయటకు తోడేస్తున్నారు. వర్షం పూర్తిగా తగ్గితేనే క్వారీ నడుస్తుందని మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. -
ఇందిరమ్మ బిల్లు కాజేసిన పోస్టుమాస్టర్
వేమనపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారు ఖాతాలో జమ అయిన డబ్బులను ఓ పోస్టుమాస్టర్ స్వాహా చేసింది. విడతల వారీగా రూ.లక్ష డ్రా చేసుకుంది. చివరికి రూ.10వేలు వృద్ధురాలికి ఇవ్వగా.. అనుమానం వచ్చి ఖాతాను మరోచోట పరిశీలించగా స్వాహా పర్వం బయటపడింది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పదిరె అంకుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్మెంటు వరకు నిర్మించుకోగా గృహ నిర్మాణ శాఖ నుంచి సెప్టెంబర్ 29న రూ.లక్ష మొదటి విడత బిల్లు ఆమె పోస్టాఫీసు ఖాతాలో జమ అయ్యాయి. ఈ విషయమై ఆమెకు తెలియదు. ఈ నెల 11న గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బుల విషయమై వేమనపల్లి పోస్టాఫీసుకు వెళ్లింది. ఖాతాను పరిశీలించిన పోస్టుమాస్టర్ శాంక రూ.లక్ష ఉండడం గమనించింది. ఈ విషయం అంకుకు, ఆమె కుమారుడు చిన్నన్నకు చెప్పకుండా.. గ్యాస్ డబ్బులు పడలేదని తెలిపింది. అంకు వేలిముద్ర ద్వారా ఆ రోజు నుంచి డబ్బులు డ్రా చేస్తూ వచ్చింది. ఈ నెల 13, 15, 16వ తేదీల్లో పోస్టాఫీసుకు వస్తే ఖాతా పరిశీలిస్తానని చెప్పడంతో వెళ్లారు. ఆయా రోజుల్లో రూ.25వేల చొప్పున అంకు వేలిముద్ర ద్వారా రూ.75వేలు పోస్టుమాస్టర్ శాంక డ్రా చేసుకుంది. చివరి రోజు రూ.10వేలు అంకుకు ఇవ్వడంతో పోస్టుమాస్టర్పై అనుమానం వచ్చి మరోచోట ఆన్లైన్ సెంటర్లో వాకబు చేసింది. రూ.25వేల చొప్పున నాలుగు విడతలుగా డ్రా చేసుకున్నట్లు తెలియడంతో వృద్ధురాలు, కుటుంబ సభ్యులు ఆవాక్కయ్యారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమురం రమేష్, బౌడి గోపాల్, తాళ్ల వెంకటేష్గౌడ్ తదితకరులు లబ్ధిదారు, కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇఫ్తేకర్ అలీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన పోస్టుమాస్టర్ను ఆరా తీయగా.. అరగంటలో వస్తానని, తాను తప్పు చేశానని, డబ్బులు తిరిగి ఇస్తానని బతిమాలింది. పోస్టుమాస్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని లబ్ధిదారు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
మద్యనిషేధంపై తీర్మానం
వేమనపల్లి: మండలంలోని పల్లెలు ఏకమై గుడుంబా నిర్మూలనకు ముందుకు కదులుతున్నాయి. మండల కేంద్రంలో బుధవారం గ్రా మస్తులు గుడుంబా, బెల్ట్షాపుల్లో మద్యం అ మ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. గ్రా మంలో మద్యనిషేధానికి తీర్మానించారు. గు డుంబా విక్రయించొద్దని, బెల్ట్షాపులు మూసే యాలని కోరారు. నీల్వాయి ఇంచార్జి ఎస్సై శ్యాంపటేల్, అబ్కారీ అధికారులకు సమాచా రం ఇచ్చారు. తమకు సహకరించాలని కోరా రు. గ్రామ పంచాయతీ ఎదుట ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి గుడుంబాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరిలో కలుస్తోంది. బుధవారం రాత్రి వరకు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 87వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 50వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 288 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 23 గేట్లు ఎత్తి 1.59లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వదులుతున్నారు. -
దివ్యాంగులకు ‘స్వయం’ భరోసా
పాతమంచిర్యాల: దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్హెచ్జీ) ఏర్పాటు చేస్తోంది. దివ్యాంగ మహిళలకు భరోసా కల్పించి జీవితం సుఖమయంగా మార్చడానికి పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆసరా పింఛన్లు పొందుతూ ఉండి స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా లేని చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక దివ్యాంగ మహిళల వివరాలు నెల రోజులుగా సేకరిస్తున్నారు. ఐదు నుంచి 15మంది సభ్యులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 253మంది వివిధ రకాల వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచి నిర్వహణకు సంరక్షకులను నియమిస్తున్నారు. దివ్యాంగుల సంరక్షకులు బ్యాంకు రుణాలు తీసుకోవడం, చెల్లించడం, ప్రతీ నెల నిర్వహించే వీవో సమావేశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అంది సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడిపే అవకాశం ఉంది. చికిత్స, పునరావాస సేవలు సంఘ సభ్యులకు వారి వైకల్య తీవ్రతను బట్టి ఫిజి యోథెరపి, ఆక్యుపేషన్ థెరపి, స్పీచ్థెరపి వంటి అవసరమైన సేవలు అందిస్తారు. పలు రకాల ఉపకరణాలు అందిస్తారు. సాంకేతిక పరికరాలు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. ఆదాయ అభివృద్ధి సంఘాల్లో వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు సీడ్క్యాపిటల్, రివాల్వింగ్ఫండ్, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పిస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా కంప్యూటర్ స్కిల్స్, టైలరింగ్, హస్తకళలు, ఫుడ్ ప్రాసెసింగ్లో శిక్షణ కల్పించి ఆదాయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం.. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి ఆత్మస్థైర్యంతో జీవించేలా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లాలో సదరం సాఫ్ట్వేర్లో నమోదైన, ఆసరా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల వివరాలు సేకరించి ఎస్హెచ్జీలు ఏర్పాటు చేశాం. వారికి బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, వైద్య పరీక్షలు, చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్.కిషన్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మంచిర్యాలవీరు అర్హులు దివ్యాంగులు 40శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్న మహిళలు, పిల్లలు, బాలికలను దివ్యాంగ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యులు చేర్చుకుంటారు. కుటుంబంలో ఒకరి కన్న ఎక్కువ మంది వైకల్యం కలిగిన వారు ఉన్నా సంఘంలో చేరడానికి అర్హులే. -
పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి
నెన్నెల: పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని, పత్తిని వీలైనంత త్వరగా సేకరించి సురక్షిత ప్రాంతానికి తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. బుధవారం ఆమె ఏవో సృజన, ఏఈవో రాంచందర్తో కలిసి నెన్నెల, బొప్పారం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే పత్తిని తీసి తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని తెలిపారు. తడిసిన పత్తిని చెట్లపై నుంచి తీయకుండా ఆరిపోయాక సేకరించాలని తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12శాతం మించకుండా జాగ్రత్త పడాలని అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు పగిలిన పత్తిని తీయడంతో రంగు, నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందని, మొదట 2, 3 తీతల్లో వచ్చే పత్తి అధిక నాణ్యత ఉంటుందని, దీనిని వేరుగా నిల్వ చేసుకుంటే మంచి ధర పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఉదయం పూట మంచు అధికంగా కురుస్తుందని మంచు తగ్గిన తర్వాతనే సేకరించాలన్నారు. అనంతరం కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి విక్రయంపై సందేహాలను వ్యవసాయ అధికారుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. -
రక్తదానం మహోన్నత సేవ
జైపూర్: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలువాలని, రక్తదానం మహోన్నత సేవతో సమానమని రామగుండం సీపీ అంబర్కిషోర్ ఝా అన్నారు. బుధవారం మండలంలోని ఇందారంలో ఉన్న ఫంక్షన్హాల్లో జైపూర్ సబ్ డివిజన్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం, ఓపెన్హౌస్ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. మంచిర్యాల రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ అత్యవసర సమయంలో అందించే రక్తంతో ప్రాణ దానం చేసినవారవుతారని తెలిపారు. విద్యార్థులకు పోలీసుల విధులు, రక్షణ, షీటీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టంపై అవగాహన కల్పించారు. రోడ్డు నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గంజాయి, మత్తుపదార్థాలతో జరుగుతున్న అనర్థాలపై ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయుడు అడిచర్ల సాగర్ రచించిన అమర జవాన్ల త్యాగానికి నివాళి–ఆకాశమంత త్యాగం అనే పాటను విడుదల చేశారు. -
విద్యార్థులకు నాణ్యమైన విద్య
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలేక్టరేట్లో జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పరిపాలన అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థ, ఉపయోగానికి పనికిరాని పాత గదులను తొలగించి నూతన భవనాల నిర్మాణలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రహరీలకు ప్రతిపాదనలు పంపించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలిపారు. కేజీబీవీ సందర్శన మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. డిప్యూటీ తహసీల్దార్ సంతోష్తో కలిసి తరగతి గదులు, వంటశాల, రికార్డులు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని తెలిపారు. -
బస్సులు ఆపాలని మహిళల రాస్తారోకో
కోటపల్లి: మండలంలోని రాంపూర్ గ్రామంలో బస్సులు ఆపాలని మహిళలు బుధవారం రాస్తారోకో చేశారు. ఆర్టీసీ బస్సులు ఆపకుండా డ్రైవర్లు, కండక్టర్లు తమపట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు గ్రామస్తులు, మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించారు. చెన్నూర్ నుంచి రాంపూర్ మీదుగా కాళేశ్వరం, సిరోంచకు వెళ్తున్న బస్సులు ఆపడం లేదని తెలిపారు. కాళేశ్వరం వెళ్లే ఆర్డీనరి బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు తగిలించి గ్రామంలో ఆపకుండా వెళ్తున్నాయని తెలిపారు. గ్రామస్తులు, విద్యార్థులకు ప్రయాణ కష్టాలు తప్పడం లేదన్నారు. రాంపూర్ గ్రామంలో బస్సు దిగాలంటే మూడు కిలోమీటర్ల దూరంలోని కొల్లూర్, దేవులవాడ గ్రామంలో ఆపుతున్నారని, రాత్రివేళల్లో ప్రయాణించే మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. గతంలో పలుమార్లు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. మంచిర్యాల ఆర్టీసీ డీఎంతో ఫోన్లో మాట్లాడించగా.. మూడు రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీనిచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
పీఎఫ్ బకాయి చెల్లింపు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నస్పూర్ మున్సిపల్ కార్మికుల పెండింగ్ ఈపీఎఫ్(ఉద్యోగ భవిష్య నిధి)ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మరోమారు చెల్లించింది. బకాయిలపై గతంలో రూ.30లక్షలు చెల్లించగా.. మంగళవారం మరో రూ.44లక్షలు చెల్లించారు. మొత్తంగా ఇప్పటివరకు రూ.74లక్షల వరకు కార్మిక శాఖకు కట్టారు. పూర్తిగా రూ.2.50కోట్ల వరకు బకాయిలు ఉండగా కార్పొరేషన్ వాటిని తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్లు సకాలంలో 128మంది కార్మికులకు సంబంధించి నెల నెలవారీగా డబ్బులు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. కార్మిక శాఖ గత ఏడేళ్లుగా ఇప్పటివరకు ఆయా కార్మికులకు నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్ చెల్లించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో మొదట 2018నుంచి 2021వరకు రూ.1.05కోటిపైగా ఉండగా, 2021నుంచి ప్రస్తుత నెల వరకు మరో రూ.కోటిన్నర వరకు బకాయిలు ఉన్నాయి. నెల నెలా ఆ మొత్తం పెరుగుతూ వస్తోంది. దీనిపై నస్పూర్ పరిధిలోనే అప్పటి మున్సిపల్ అధికారులకు పలుమార్లు నోటీసులు జారీ చేయడం, బ్యాంకు ఖాతా ఫ్రీజ్ చేయడం వంటివి చేసినా స్పందించలేదు. చివరకు కార్పొరేషన్లో విలీనమయ్యాక కూడా ఆ బకాయిల చెల్లింపులు చేయాల్సి వస్తోంది. మరోవైపు కార్పొరేషన్ బ్యాంకు ఖాతాను సైతం తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి హెచ్చరించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో కార్మిక శాఖకు చెల్లించాల్సి వస్తోంది. ఇక జరిమానాలు, వడ్డీలు సైతం చెల్లించాల్సి వస్తే ఇంకా అధిక మొత్తంలోనే కార్మిక శాఖకు కట్టాల్సి వస్తుంది. బాధ్యులను వదిలేస్తారా?గతంలో కార్మిక శాఖకు కార్మికులకు సంబంధించి నెల నెలా చెల్లించాల్సిన పీఎఫ్తోపాటు ఈఎ స్ఐని సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేశా రు. దీంతో రూ.కోట్లు బకాయి పడేలా చేసిన అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. ఇప్పటికే వీరి పరిధిలో ముగ్గురు కార్మికులు చనిపోయారు. వీరికి పీఎఫ్ చెల్లించకపోవడంతో కార్మిక బీమా వర్తించకుండా ఆ మొత్తాన్ని కోల్పోయారు. కొంతమంది సర్వీస్ ముగిసిపో యి, నిబంధనల మేరకు చెల్లించే మొత్తాన్ని కో ల్పోయారు. వీటితోపాటు ఇతర సౌకర్యాల కింద పింఛన్ వంటి డబ్బులు పొందలేక బాధిత కార్మిక కుటుంబాలు దూరమయ్యారు. గత ఏడేళ్లుగా ఆయా పీఎఫ్ పథకంతోపాటు ఈఎస్ఐ లేకపోవడంతో కార్మికుల ఆరోగ్య రక్షణ, చికిత్సలకు అవకాశం లేకుండా పోయింది. మళ్లీ ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే రెగ్యులర్గా అన్ని సౌకర్యాలు పొందవచ్చు. అప్పటి అధికారులు కార్మికులతో పని చేయించుకుని వారికి కనీస సౌకర్యం పొందకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవా లని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించా లని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజ మాన్యాన్ని కోరారు. మంగళవారం స్థానిక జీఎం కార్యాలయంలో గుర్తింపు సంఘం, యాజమాన్యం మధ్య ఏరియా స్థాయి స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. కాలనీలో కార్మికుల క్వార్టర్లకు మరమ్మతులు చేయాలన్నారు. అన్ని కాలనీల్లో రోడ్డు, క్వార్టర్ల నంబ ర్లు సైన్బోర్డ్ పై రాయించాలని, ఆర్కే 7 గని లో సపోర్ట్మెన్ కార్మికుల కోసం గది నిర్మించాలని కోరారు. ఇన్చార్జి జీఎం కురుమ రాజేందర్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి షేక్ బాజీసైదా, ప్రతినిధులు కొట్టే కిషన్ రావు, ఎం. కొముర య్య, బద్రి బుచ్చయ్య, నాగభూషణం, ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు అనిల్కుమార్, రాజన్న ఆనంద్కుమార్, రవీందర్, మల్లయ్య పాల్గొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు
తాండూర్: పారిశుద్ధ్య సమస్య తలెత్తే విధంగా బహిరంగ ప్రదేశాలు, జనావాసాల మధ్య చెత్త వేస్తే ఉపేక్షించబోమని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు హెచ్చరించారు. మంగళవారం మండలంలోని తాండూర్ గ్రామ పంచాయతీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తాండూర్ ఐబీ రోడ్ల పక్కన ఉన్న దుకాణాలను తనిఖీ చేసి రోడ్లపై చెత్త వేసిన పలువురికి జరిమానా విధించారు. అనంతరం తాండూర్ ఐబీ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, నీటి సమస్యలు లేకుండా శ్రద్ధ వహించాలన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీ అధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి దివాకర్ పాల్గొన్నారు. -
అజ్ఞాతం వీడిన బండి దాదా
మందమర్రిరూరల్: మావోయిస్టు అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(సికాస) కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ ప్రభాత్ అజ్ఞాతం వీడారు. కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం వరకు ఎదిగిన నేత అనారోగ్యంతో లొంగుబాట పట్టారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. మందమర్రి పట్టణంలోని మొదటిజోన్కు చెందిన అప్పటి సింగరేణి ఉద్యోగి రామారావు, అమృతమ్మ దంపతులకు నలుగురు సంతానం కాగా.. ప్రకాష్ రెండో సంతానం. స్థానిక కార్మెల్ హైస్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఇంటి సమీపంలోని కటికె దుకాణాల ఏరియా అంటే అప్పట్లో నక్సలైట్లకు అడ్డాగా ఉండేది. నక్సలైట్ల అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యూ(రాడికల్ విద్యార్థి సంఘం), రాడికల్ యూత్ లీగ్(ఆర్వైఎల్) పోటాపోటీగా కార్యకలాపాలు సాగించేవి. గ్రామాలకు తరలిరండి అనే కార్యక్రమానికి ఆకర్శితుడైన ప్రకాష్ ఆర్ఎస్యూతోపాటు అప్పటి ఎనిమిది మస్టర్ల కోత చట్టానికి వ్యతిరేకంగా కేకే–2 గనిలో చేస్తున్న సమ్మెలో సికాస నాయకులతో చురుగ్గా పాల్గొన్నాడు. 1984లో అప్పటి ఏఐటీయూసీ నేత అబ్రహం హత్య కేసులో శిక్ష పడగా ఆదిలాబాద్ సబ్ జైల్కు వెళ్లాడు. ఇతర కేసుల్లో ఉన్న అప్పటి పీపుల్స్వార్ నాయకులు నల్లా ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యలతో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం హైదరాబాద్లో అజ్ఞాతంలో ఉంటూ హేమను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. 1992లో హైదరాబాద్లో పోలీసులకు చిక్కడంతో జైలుకు వెళ్లాడు. 2004 సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతోపాటు విడుదలయ్యాడు. వరంగల్ జైలులో ఉండగా పీపుల్స్వార్ రాష్ట్ర కమిటీ సభ్యులతో సంబంధాలు ఏర్పడడంతో 2004లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన శాంతిచర్చల్లో పాల్గొన్నాడు. చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కోల్బెల్ట్ నుంచి దండకారణ్యం నేతగా ఎదిగాడు. కుటుంబ సభ్యుల ఆనందంబండి ప్రకాష్ లొంగిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, చిన్ననాటి మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ఎన్కౌంటర్లలో మృతిచెందాడని వార్త వినాల్సి వచ్చింది. అజ్ఞాతం వీడి లొంగిపోయి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనారోగ్యం.. ప్రకాష్కు వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడం, దేశవ్యాప్తంగా పలు ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లు కుంగదీశాయి. దీంతో రెండు మూడు నెలల క్రిత మే లొంగుబాటు ప్రక్రియ ప్రారంభించాడు. మావోయిస్టు అగ్రనేతలతో చర్చించి కేంద్ర కమిటీ సభ్యుడిగా వచ్చే అవకాశాన్ని వదులుకుని తన ఆయుధాన్ని పార్టీకి అప్పగించి 20రోజుల క్రితమే లొంగుబాటు కోసం పోలీసుల ఆదీనంలోకి వచ్చినట్లు సమాచారం. డీజీపీ సమక్షంలో లొంగిపోవడంతో ఆయన పేరిట ఉన్న రివార్డు రూ.25లక్షలు అందజేశారు. -
జాతీయ రహదారిపై ‘బెల్ట్’ జోరు
కోటపల్లి: మండలంలోని జాతీయ రహదారి–63పై బెల్ట్ దుకాణాల్లో మద్యం దందా జోరుగా సాగుతోంది. దాబాల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం సిట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవిస్తూ అతివేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసు ల దర్యాప్తులో వెల్లడవుతోంది. కోటపల్లి మండలం లక్ష్మిపూర్, మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని ఆనుకు ని ఉన్న అంతర్రాష్ట్ర వంతెనకు కొద్ది దూరంలోనే మద్యం బెల్టుషాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర సరిహద్దు గ్రా మాల్లోని మందుబాబులు లక్ష్మిపూర్ గ్రామ సమీ పంలోని దాబాల్లో మద్యం కొనుగోలు చేస్తుంటా రు. దాబాల్లో ఒక్కో మద్యం బాటిల్పై రూ.50నుంచి రూ.100 వరకు వసూలు చేస్తుంటారు. జాతీయ రహదారికి ఇరువైపులా మహా రాష్ట్ర, తెలంగాణ స రిహద్దు ప్రాంతాలైన లక్ష్మిపూర్, రాపన్పల్లి 63వ జా తీయ రహదారిపై దాబాల్లో ఎకై ్సజ్, పోలీసులు తని ఖీ చేసిన దాఖలాలు లేవు. ఒకవేళ తనిఖీకి వెళ్లాల్సి వస్తే ముందుగానే నిర్వాహకులకు సమాచారం చేరుతుందనే ఆరోపణలున్నాయి. దాబాల్లో మద్యం అమ్మకాలపై ఎకై ్సజ్ చెన్నూర్ సీఐ హరిని సంప్రదించగా.. దాబాల్లో మద్యం అమ్మకాలు నిషేధమని, విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
పంటలు వర్షార్పణం
చెన్నూర్ గోదావరి పరీవాహక ప్రాంతంలో నెలకొరిగిన వరి పంటచెన్నూర్: జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు కళ్లముందే నాశనం అవుతుంటే రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నెలలో కురిసిన వర్షాలతో వరద ముంచెత్తి గోదావరి పరీవాహక ప్రాంతంలో పత్తి పంటకు 50శాతం నష్టం వాటిల్లింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి కాయ రాలిపోతోంది. పొట్టకు వచ్చిన వరి పంట నేలకొరిగిపోవడంతో ధాన్యం దెబ్బతింటోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెన్నూర్ మండలం నారాయణపూర్, కిష్టంపేట, కొమ్మెర, ఆస్నాద తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. బయటకు వచ్చిన పత్తి తడిసి ముద్దవుతోంది. చెన్నూర్ మండలంలో 13,818 ఎకరాల్లో పత్తి, 18,270 ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాది కంటే ఈసారి ఆయా పంటల సాగు పెరిగింది. పత్తి క్వింటాల్కు రూ.8,100 ధర పలుకుతుండడంతో లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. వర్షాలకు పత్తి దెబ్బతినడంతో ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. వరి నేలకొరగడంతో ధాన్యం తాలుగా మారుతుందని, ఆశించిన ధర రాదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న మోంథా తుపానుమొన్నటి వరకు భారీ వర్షాల భయం ఉండగా రెండ్రోజులుగా వాయుగుండ ప్రభావం మోంథా తుపానుగా మారింది. మూడు రోజులపా టు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. భారీ వర్షాలు కురిస్తే పంటలు వర్షార్పణం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మంచిర్యాల
7కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జిల్లాలోని పలు మండలాల్లో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. రైతులు ధాన్యం విక్రయించి మద్ద తు ధర పొందాలని సూచించారు. 9లోu ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరం దిశగా ఈదురుగాలులు బలంగా వీస్తాయి. ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు.. కార్తిక మాసం నేపథ్యంలో ఆర్టీసీ శైవక్షేత్రాల పర్యాటకంపై దృష్టి సారించింది. ఆలయాల్లో భక్తుల దర్శనాల కోసం ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. 8లోu -
నేరాల నియంత్రణకు పోలీసు వ్యవస్థ
మంచిర్యాలక్రైం/నస్పూర్: ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం పోలీస్ వ్యవస్థ పని చేస్తోందని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల(పోలీస్ ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని మంగళవారం స్థానిక సీసీసీ కార్నర్ నుంచి మంచిర్యాల ఐబీ చౌరస్తా వరకు మంచిర్యాల డివిజన్ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీసీపీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల కోసం పోలీసులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఎందరో పోలీసులు విధి నిర్వహణలో మావోయిస్టులు, కరుడుగట్టిన నేరగాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించినప్పుడే నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్రావ్, నరేష్కుమార్, సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీపీ ఏ.భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, జాతీ య రహదారులు, రోడ్లు భవనాలు, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు, మున్సిపల్ కమి షనర్లతో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్ర త కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి 7వరకు అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. హైదరాబాద్–కరీంనగర్–చంద్రాపూర్ రహదారిపై రంబుల్ స్ట్రిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, బాసర–లక్సెట్టిపేట రహదారి(రాష్ట్రీయ రహదారి–24)పై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నందున భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు సెల్లార్ స్థలాలు పార్కింగ్ కోసమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, నాలాలపై అనధికార నిర్మాణాలను వెంటనే తొలగించాలని, సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. బాధ్యతగా వ్యవహరించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ చాంబర్లో పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27నుంచి నవంబర్ 2వరకు విజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలిపా రు. అవార్డుల జారీ వేగవంతం చేయాలిమంచిర్యాలటౌన్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. -
‘మహా’ ధాన్యం వ్యాన్ పట్టివేత
కోటపల్లి: మహారాష్ట్ర నుంచి వరి ధాన్యం జిల్లాలోకి తరలిస్తు న్న వ్యాన్ను తెలంగాణ సరిహద్దులోని రాపన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ‘జిల్లాకు ‘మహా’ ధాన్యం!’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. చెక్పోస్టు వద్ద పోలీ సులు వాహనాల తనిఖీ చేపట్టారు. మహారా ష్ట్రలోని సిరొంచ తాలూ కా నగురం గ్రామానికి చెందిన బూర్తి మల్ల య్య చెన్నూర్ పట్టణంలో ని ఓ మిల్లుకు 254 వడ్ల బస్తాలను అక్రమంగా వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సివిల్ సప్లయ్ అధికారుల కు అప్పగించినట్లు ఎస్సై రాజేందర్ తెలిపా రు. అంతర్రాష్ట్ర చెక్పోస్టులో 24గంటలు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్పందన -
పింఛన్లో రూ.16 కోతపై ఆందోళన
వేమనపల్లి: ఆసరా పింఛన్ల లబ్ధిదారుల నుంచి రూ.16 కోత విధించడంపై మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వృద్ధులు మంగళవారం ఆందోళన చేపట్టారు. పోస్టుమాస్టర్ పంచాయతీ కార్యాలయం వద్ద పింఛన్ నగదు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.2016, దివ్యాంగులకు రూ.4,016 అందజేయాలి. కానీ ప్రతీ నెల రూ.16 మినహాయించుకుని మిగతా మొత్తం ఇస్తున్నారు. దీంతో వృద్ధులు ఆందోళనకు దిగారు. మండలంలో వృద్ధులు 1,225 మంది, వితంతువులు 875, దివ్యాంగులు 266 మంది పింఛన్ పొందుతున్నారు. పింఛన్లో డబ్బు కోతపై పోస్టుమాస్టర్ శాంతను సంప్రదించగా.. కొందరు రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) చెల్లిస్తున్నారని, వడ్డీ కట్టడం లేదని తెలిపారు. చిల్లర రూ.16 వడ్డీ కింద తీసుకుంటున్నామని, ఈ వ్యవహారం మండలం అంతటా ఇలానే ఉందని సమాధానం ఇచ్చారు. -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
తాండూర్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి సూచించారు. ఇటీవల అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయన్న వార్తల నేపథ్యంలో మంగళవారం మండలంలోని బోయపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, విద్యాభారతి పాఠశాల పరీక్ష కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశ్నపత్రాలను ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు. ప్రశ్నపత్రాల పంపిణీ తీరు, పరీక్షల నిర్వహణను క్షు ణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల ప్రతిభ ను వెలికితీతకు నిర్వహించే ఈ పరీక్షలను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎంఈఓ మల్లేశం, విద్యాభారతి విద్యాసంస్థల కరస్పాండెంట్ సురభి శరత్కుమార్ పాల్గొన్నారు. -
పొట్టకచ్చింది..
ఐదెకరాల్లో వరి పంట సాగు చే శా. పొట్ట దశకు వచ్చింది. ఇటీవ ల కురిసిన భారీ వర్షానికి వరి నేలవాలింది. నోటికాడికి వచ్చిన పంట కళ్లముందే నాశనమైంది. పంట కోసం చేసిన అప్పు తీరే పరిస్థితి లేదు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. –టి.రాజయ్య, రైతు, చెన్నూర్ పత్తి సర్వనాశనమైంది.. ఈ ఏడాది పత్తి రైతులను ప్రకృతి పగబట్టింది. వరుస వర్షాలతో పత్తి పంట తీ వ్రంగా దెబ్బతింది. ఎకరానికి పది నుంచి 15 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలి. వర్షాల కారణంగా ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు. వర్షాలకు అప్పులే మిగిలే అవకాశం ఉంది. –మహేశ్, రైతు, చెన్నూర్ -
మానసిక ఆరోగ్యస్థితిపై సర్వే
కోటపల్లి: మండలంలోని ఎసన్వాయి గ్రా మంలో నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2 ప్రా జెక్టును మంగళవారం ప్రారంభించారు. ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడి, వృద్ధాప్య స మస్యలు, మద్యపానం, మహిళల ఆరోగ్యం, పిల్లల పోషణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్లు డాక్టర్ వామన్ కుల్కర్జి, డాక్టర్ సాయికృష్ణ, తెలంగా ణ రాష్ట్ర కో ఆర్డినేటర్ వినిల్, డాక్టర్ అరుణ శ్రీ, కార్యదర్శి అబ్ధుల్ తాజుద్దీన్, ఏఎన్ఎం తి రుపతి, అశా కార్యకర్త స్వరూప పాల్గొన్నారు. -
విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి వేళాయె..
సారంగపూర్: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మ హాపోచమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమానికి దేవాదాయశాఖ న వంబర్ 7న ముహూర్తం ఖరారు చేసింది. అమ్మవా రి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నేటి నుంచి 11 రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మండలంలో ని ఆయా గ్రామాల్లోని దాదాపు 100మంది భక్తులు అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు ఆలయ ప్రధాన అ ర్చకుడు శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లోని వసతిగదుల్లో సన్నిధానం ఏ ర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మాలధారణకు ముందుకు వచ్చిన భక్తులకు శతాధిక ప్రతిష్ఠాపనా చార్యులు గురుమంచి చంద్రశేఖరశర్మ మాలవేసి ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మండలంలోని వీడీసీలు ముందుకువచ్చాయి. ఇతర సేవాకార్యక్రమాలు చేపట్టేందుకు మహారాష్ట్రకు చెందిన భక్తులు ఆసక్తి చూపుతున్నా రు. దేవాదాయశాఖ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను అట్ట హాసంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశా రు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజల అభీ ష్టం మేరకే విగ్రహ ప్రతిష్ఠాపన ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ ఈవో భూమయ్య తెలిపారు. భ క్తులు విరాళాలిచ్చేందుకు ముందుకువస్తున్నట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
పెట్టుబడుల పేరిట మోసగించిన ఒకరి అరెస్ట్
కాగజ్నగర్ టౌన్: స్టాక్స్, ఐపీవో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ పేరిట వాట్సాప్ గ్రూప్లు సృష్టించి మోసగించిన ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వహీదుద్దీన్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్కు చెందిన అశోక్కుమార్ వర్మాస్బుక్ డిస్కషన్, అలయన్స్ పేరిట వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేశాడు. 108 మందిని చేర్చి వారితో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డబ్బులు కాజేశాడు. బాధితులు 26 దఫాలుగా రూ.76.50లక్షలు ఇన్వెస్ట్ చేశారు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఓ ఫిర్యాదుదారు జూలై 5న ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుదారు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కాంతిలాల్పాటిల్ ఆదేశాల మేరకు కాగజ్నగర్ పట్టణ సీఐ ప్రేంకుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడిని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో పెట్టుబడుల పేరిట వచ్చే ఆఫర్లను నమ్మవద్దని డీఎస్పీ తెలిపారు. అపరిచతులు క్రియేట్ చేసిన గ్రూపుల్లో ఉండకూడదని పేర్కొన్నారు. ఆన్లైన్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే అధికారిక, ధ్రువీకృత ప్లాట్ఫాంలనే ఉపయోగించాలని తెలిపారు. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైం, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పట్టణ సీఐ ప్రేంకుమార్, ఎస్సై సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు. -
ఏఐ సంస్థతో ఆర్జీయూకేటీకి అవగాహన ఒప్పందం
బాసర: బాసర ఆర్జీయూకేటీకి మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాల అవగాహన ఒప్పందం కుదిరిందని వీసీ గోవర్ధన్ తెలిపారు. మంగళవారం ఆయన కళాశాలలో మాట్లాడారు. విద్యార్థుల్లో వృత్తిపరమై న నైపుణ్యాలు, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్ ద్వారా శక్తిమంతమైన కృత్రిమ మేధస్సు (ఏఐ) పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి ఆర్జీయూకేటీ బాసర హైదరాబాద్కు చెందిన మ్యాడ్ సైంటిస్ట్ ఏఐ సంస్థతో అంతర్జాలంలో పరస్పర అవగాహన ఒప్పందం కుదరడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్జీయూకేటీ విద్యార్థులకు మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నైపుణ్య శిక్షణ ఇస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ఏఐ విద్య, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వనరులను ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దిల్ బహార్, డా.మహేశ్, శేఖర్, డా.విఠల్, డా.సాగర్, డా.కాశన్న, డా.భావ్సింగ్, సుజయ్ సర్కార్, ఉపేందర్, వెంకటరామ్, మ్యాడ్ సైంటిస్ట్ సంస్థ నిపుణులు సిలివేరు శ్రీనివాస్, భాను కిరణ్, భానుప్రసాద్, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. -
నాగారంలో గుడుంబా నిషేధం
వేమనపల్లి: గుడుంబా విక్రయాలు జరపకూడదని మండలంలోని నాగారం గ్రామస్తులు తీర్మానించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మండలంలోని బు య్యారం, దహెగాం, కన్నెపల్లి మండలాల నుంచి కొందరు గుడుంబా ప్యాకెట్లు తెచ్చి గ్రామంలో విక్రయిస్తున్నారు. గుడుంబా తాగినవారు కుటుంబాల్లో గొడవ పడుతున్నారు. పలువురు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరు ఉల్లంఘించినా పట్టుకుని పోలీస్, ఆబ్కారీశాఖ అధికారులకు అప్పగించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. -
ఉరేసుకుని రైతు ఆత్మహత్య
లోకేశ్వరం: మండలంలోని మొహళ గ్రామానికి చెందిన రైతు దండే గంగన్న (53) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గంగన్నకు ఇద్దరు కూతుళ్లున్నారు. రూ.3లక్షలు అప్పు చేసి పెద్ద కూతురు వివాహం చేశాడు. ఖరీఫ్లో తాను సాగు చేసిన పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి వద్ద ఉన్న వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతుడి భార్య బోజాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ నిందితుడి అరెస్ట్ముధోల్: ఆగస్టు 12న మండల కేంద్రంలోని ఝటాశంకర్ ఆలయంలో చోరీకి పాల్పడ్డ బాసర గ్రామానికి చెందిన ఓర్సా లక్ష్మణ్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పెర్సీస్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐబీ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా లక్ష్మణ్ పారిపోవడానికి ప్రయత్నించగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నట్లు తెలిపారు. అతడి నుంచి రూ.1,500 నగదు, ద్విచక్రవాహనం స్వాధీ నం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుకున్న ద్విచక్రవాహనం సోమవారం బోధన్ పట్టణంలోని ఓ మెకానిక్ షాపు నుంచి దొంగిలించినట్లు తెలిపారు. అతడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. పాము కాటుతో మహిళ మృతికెరమెరి: మండలంలోని సావర్ఖెడా గ్రామానికి చెందిన మొహర్లే సంధ్య (32) పాముకాటుతో మరణించింది. ఎస్సై మధూకర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్య సోమవారం చేనులో పత్తి సేకరిస్తుండగా గుర్తు తెలియని పాము కా టువేసింది. గమనించిన పలువురు రైతులు ఆమె భర్త తులసీరాంకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చా రు. వెంటనే అక్కడికి చేరుకున్న తులసీరాం సంధ్యను ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తులసీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధూకర్ తెలిపారు. -
కుక్కదాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో వీధి కుక్క వృద్ధురాలిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన పురప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వివరాలు.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన దారవేణి లచ్చక్క (లక్ష్మి) అనే వృద్ధురాలు 20 ఏళ్లుగా నిత్యం బెల్లంపల్లికి వచ్చి పాలు విక్రయిస్తోంది. లచ్చక్క మంగళవారం హన్మాన్ బస్తీకి వెళ్లి ఇంటింటా తిరుగుతూ పాలు పోస్తోంది. ఈ క్రమంలో ఓ వీధి కుక్క ఒక్కసారిగా లచ్చక్క రెండు కాళ్లను కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఆమె అరుపులు విని వచ్చిన పలువురు కుక్కను వెళ్లగొట్టారు. లచ్చ వ్వ స్పృహ తప్పి పడిపోగా అంబులెన్స్లో బె ల్లంపల్లి ఏరియాస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. లచ్చక్క కుటుంబీకులు వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కాగా, లచ్చక్కకు తీవ్ర రక్తస్రావం అవుతుండగా చికిత్స క్లిష్టంగా మారి నట్లు ఆమె కుమారుడు వెంకన్న తెలిపాడు. -
ఆర్టీసీ చూపు.. శైవక్షేత్రాల వైపు
ఆదిలాబాద్: ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కార్తీకమాసాన్ని పరమపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. హరిహరాదులకు ప్రీతిపాత్రంగా భావించే ఈ మాసంలో కార్తీక స్నానాలు చేయడంతోపాటు శైవక్షేత్రాలను భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేక బస్సులు వేశారు. పుణ్యక్షేత్రాలు ఇవే.. కార్తీకమాసం నేపథ్యంలో ఆదిలాబాద్ డిపో నుంచి ఆర్టీసీ అధికారులు అరుణాచలం, కాళేశ్వరం క్షేత్రాల కు ప్రత్యేక సర్వీసులు నడుపనున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి అరుణాచలం, అయోధ్య, మంచి ర్యాల నుంచి అరుణాచలం, శ్రీశైలం, భైంసా నుంచి వేములవాడ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు వేశా రు. ప్రయాణికుల డిమాండ్కు తగినట్లు తిరుపతి, రామేశ్వరం, శబరిమలై పుణ్యక్షేత్రాలకూ బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి.. మంచిర్యాల బస్టాండ్ నుంచి.. నిర్మల్, భైంసా బస్టాండ్ల నుంచి.. వివరాలకు సంప్రదించాల్సిన నంబర్లు డిపో పేరు సెల్ నంబర్ ఆదిలాబాద్, ఉట్నూరు 9959226002 నిర్మల్ 9959226003 భైంసా 9959226005 ఆసిఫాబాద్ 9959226006 మంచిర్యాల 9959226004 సద్వినియోగం చేసుకోవాలి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం ప్రముఖ శైవక్షేత్రాలకు బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్లోని జిల్లా కేంద్రాలకు సమీపంగా ఉండే పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అరుణాచలం, అయోధ్య, కాశీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకూ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఇప్పటికే తొమ్మిది ప్రత్యేక సర్వీసులు బుక్ అయ్యాయి. ప్రయాణికుల స్పందనకు అనుగుణంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. – ఎస్.భవానీ ప్రసాద్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
కై లాస్నగర్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జావిద్ నిజాయితీ చాటుకున్నాడు. తన ఆటోలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరిచిపోయిన బ్యా గును పోలీసులకు అప్పగించాడు. వివరాలు.. ఉట్నూర్ ఎక్స్ రోడ్డుకు చెందిన సునీత సొంతూరు మహారాష్ట్రకు వెళ్లింది. తిరిగి మంగళవారం ట్రైన్లో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమె బస్టాండ్కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించింది. బస్టాండ్లో దిగిన ఆమె ఐదు గ్రాముల బంగారు కమ్మలు, 10 తులాల వెండి ఆభరణాలు కలిగిన బ్యాగు మరిచిపోయింది. వెంటనే అప్రమత్తమై బస్టాండ్ వద్ద గల ఆదిలాబా ద్ పోలీస్ సబ్ కంట్రోల్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఏఆర్ ఎస్సై దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ అప్రమత్తమయ్యారు. ఇంతలో ఆటోడ్రైవర్ జావిద్ నిజాయితీగా అక్కడకు చేరుకుని ఆ బ్యాగును పోలీసులకు అందజేశాడు. దీంతో ఆ బ్యాగును వారు బాధితురాలికి అప్పగించారు. త్వరగా స్పందించి బాధితురాలికి న్యాయం చేసేలా కృషి చేసిన సిబ్బందిని, నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ను డీఎస్పీ జీవన్రెడ్డి అభినందించారు. -
ఆటో బోల్తా: పలువురికి గాయాలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి వాగు వంతెన వద్ద ఆటో బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. మంగళవారం నాగారం గ్రామం నుంచి బద్దంపల్లికి వెళ్తుండగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఇందులో బోగారపు బాపు అనే ప్రయాణికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నాయిని గట్టయ్య, మరో ప్రయాణికుడికి స్వల్ప గాయాలు కాగా, వీరిని 108 అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలాన్ని ఏఎస్సై నరేశ్, పోలీసులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుదిలావర్పూర్: మండల కేంద్రానికి సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై మంగళవారం సా యంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. కుంటాల మండల కేంద్రానికి చెందిన జుట్టు సుభాష్ తన కారులో నిర్మల్ వైపు నుంచి తన స్వగ్రామమైన కుంటాల వైపునకు వెళ్తున్నాడు. ఇతడి కారును గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. గమనించిన సమీప టోల్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ సుభాష్ను కారులోంచి దించి అంబులెన్స్లో చికిత్స కోసం నిర్మల్కు తరలించారు. ప్రస్తుతం సుభాష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిమామడ: మండలంలోని బూరుగుపల్లి జాతీయరహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన లాకేశ్వర్ నాయ క్ (25) దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ఆదిలాబాద్ వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొ ట్ట డంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
వ్యాన్ను ఢీకొట్టిన మట్టి లారీ
తాండూర్: సుబాబుల్లోడ్తో వెళ్తున్న వ్యాన్ను మంగళవారం తెల్లవారుజామున తాండూర్ మండలం వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద నిలిపి ఉంచగా వెనుక నుంచి ఓ మట్టి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో క్లీనర్ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రోడ్డుపై రెండు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయమేర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ అక్కడికి చేరుకుని వాహనాలను పక్కకు తీయించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. సర్వీస్ రోడ్లపై వాహనాలు నిలుపవద్దని ఆదేశాలున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
● ఎంపీడీవో వేధింపులతోనేనని ఆరోపణలు ● విచారణకు ఆయా సంఘాల డిమాండ్
టెక్నికల్ అసిస్టెంట్ మృతిబెల్లంపల్లిరూరల్: మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ దుగుట భాస్కర్ (31) మంగళవారం తెల్లవా రుజామున మృతి చెందాడు. ఎంపీడీవో మహేందర్ 15రో జులుగా విధి నిర్వహణలో భాస్కర్పై ఒత్తిడి పెంచి మనోవేదనకు గురిచేస్తున్నట్లు తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎంపీడీవో ముడుపులు ఇవ్వాలని ఒత్తిడి తేవడం, ఈక్రమంలో వారంక్రితం భార్గవ్కు మెమో జారీ చేయడంతో తీవ్ర మనస్తాపం చెందడంతోపాటు అనారోగ్యానికి గురై మృతి చెందినట్లు వారు చెబుతున్నారు. ఈజీఎస్ ఈసీ అనిల్ ఎంపీడీవోపై ఇవే ఆరోపిస్తూ చేస్తూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భార్గ వ్ మృతికి కారణమైన ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని తోటి ఉద్యోగులు కోరుతున్నారు. ఎంపీడీవోను సస్పెండ్ చేయాలి భార్గవ్ మృతికి ఎంపీడీవోనే కారణమని, అతడిని వెంటనే సస్పెండ్ చేయాలని నేతకాని మహార్ సేవా సంఘం, దళిత సంఘాల నాయకులు గుమాస శ్రీకాంత్, ముడిమడుగుల మహేందర్, దాగం మల్లేశ్, రామటెంకి వాసుదేవ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆరోపణల్లో వాస్తవం లేదు – మహేందర్, ఎంపీడీవో భార్గవ్ మృతి విషయంలో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఎంపీడీవో మహేందర్ వివరించారు. ఈజీఎస్ ఆధ్వర్యంలో గ్రామాల్లో 145 సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల ఏర్పాటు చేయకుండానే రూ.5.80 లక్షలు డ్రా చేయడంపై సిబ్బంది నిలదీశానని తెలిపారు. దీని పై ఉన్నతాధికారులకు నివేదించానని సూచించారు. అయితే.. గిట్టని వారే తనపై కక్ష సాధింపుతో తప్పు డు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భార్గవ్ మృతిపై ఉన్నతాధికారులు విచారణ చేపడితే తాను సహకరిస్తానని తెలిపారు. కొంతకాలంగా అనారో గ్యంతో బాధ పడుతున్న భార్గవ్ ఆరోగ్యం క్షీణించిన కారణంగానే మృతి చెందినట్లు పేర్కొన్నారు. -
లాభాల ఆశ చూపి మోసగించారని ఫిర్యాదు
ఖానాపూర్: ఓ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని నమ్మించి తమ వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేశారని ఖానాపూర్, కడెం, పెంబి మండలాలకు చెందిన 12మంది రైతులు మంగళవారం ఎస్పీ జానకీ షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము పెట్టుబడి పెట్టి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని వాపోయారు. బాధ్యులపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో దొనికెని భీమయ్య, మోటపలుకుల రాజమౌళి, ఎండీ ఖాజా, కూరపాటి రాజేశ్వర్రెడ్డి, గుడిసె నర్స య్య, ఏలేటి నర్సింహారెడ్డి, ముత్యాల రాజేశ్వర్రెడ్డి, మేకల రాజిరెడ్డి, భూషణ్రెడ్డి, పుప్పాల రవి, బండారి రవీందర్, గుమ్ముల లింగన్న ఉన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో కాంస్య పతకం
బెల్లంపల్లి: యాదాద్రి భువనగిరిలో ఈ నెల 24 నుంచి 26వరకు స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు సత్తా చాటారు. సీఎస్ఎన్ఆర్ గౌడ్ జూనియర్ కళాశాలలో అండర్–19 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకం గెలుచుకున్నారు. క్రీడాకారులను సోమవారం కాసిపేట సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్కుమార్, ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెక్రెటరీ బాబురావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీడీ హరీష్, సంక్షేమ గురుకుల వైస్ ప్రిన్సిపాల్ ఎస్.రమేష్, పీఈటీలు అల్లూరి వామన్, రాజేందర్ పాల్గొన్నారు. -
లక్కు దక్కింది.. ఇక కిక్కే..!
పారదర్శకంగా కేటాయింపులు నస్పూర్: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగింది. లక్కీడ్రాలో దుకాణాలు దక్కిన వారు ఎగిరి గంతేయగా.. దుకాణాలు దక్కని వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. జిల్లాలోని 73 దుకాణాలకు 1,712 దరఖాస్తులు రాగా.. నస్పూర్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్లో సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులు భద్రత చర్యలు చేపట్టారు. ఉదయం 9గంటల నుంచి దరఖాస్తుదారులను మాత్రమే లోపలికి అనుమతించారు. మొబైల్ఫోన్లను కూడా అనుమతించలేదు. ఉదయం 11గంటలకు కలెక్టర్ కుమార్ దీపక్ డ్రా పద్ధతిలో దుకాణాలు కేటాయింపు చేపట్టారు. డ్రాలో మొదటి షాపును మహిళ దక్కించుకున్నారు. జిల్లాలోని ఇందారం ఒకటో నంబరు దుకాణానికి ఓపెన్ కేటగిరీలో అత్యధికంగా 64 దరఖాస్తులు రాగా.. మహిళను అదృష్టం వరించింది. రెండోస్థానంలో భీమారం దుకాణం నంబరు 25కు జనరల్ కేటగిరీలో 59 దరఖాస్తులు రాగా.. ఆ షాపు సైతం మహిళనే వరించింది. ఎస్సీలకు 10, ఎస్టీ 6, గౌడ్లకు 6 దుకాణాలు కేటాయించగా.. ఆయా కేటగిరీల వారు దక్కించుకున్నారు. మొత్తంగా 16మంది మహిళలకు దుకాణాలు దక్కాయి. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న షాపుల టెండర్ నవంబర్ 30తో ముగుస్తున్న సంగతి తెలిసిందే. సంతోషంగా ఉంది.. మాది హాజీపూర్. నేను మొదటిసారిగా మద్యం షాపు టెండర్లలో పాల్గొన్నాను. నేను టెండర్ వేసిన మొదటిసారే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. గెజిట్ నంబర్–1 షాప్ దక్కింది. – గజెంగి లక్ష్మి నూతన మద్యం పాలసీ విధానం 2025–27 ద్వారా పారదర్శకంగా మద్యం దుకాణాలు కేటాయించినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలో వీడియో చిత్రీకరణ చేస్తూ డ్రా తీసినట్లు వివరించారు. దుకాణాలు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజులో 1/6వ వంతు 24గంటల్లోపు చెల్లించాలని సూచించారు. ఫీజు చెల్లించిన తర్వాత డిసెంబర్ 1 నుంచి కొత్తగా షాపులు నిర్వహించవచ్చని తెలిపారు. ఎకై ్సజ్, ప్రోహిబిషన్ జిల్లా అధికారి నందగోపాల్, ఏసీపీ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
ఖానాపూర్: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపిన వివరాల మేరకు శాంతినగర్ కాలనీకి చెందిన కోమటిపెల్లి నడిపి పోశెట్టి (50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. సోమవారం ఉదయం గాంధీనగర్ శివారులోని నల్ల పోచమ్మ ఆలయ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతునికి భార్య రాజమణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మధుకర్ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి
వేమనపల్లి: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ను కోరా రు. సోమవారం ఆయన మధుకర్ కుటుంబ స భ్యులతో కలిసి కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిశారు. మధుకర్ కు టుంబానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంపెల అజయ్కుమార్, నాయకులు సత్యనారా యణ, మధునయ్య, వెంకాగౌడ్, లస్మయ్య, ఏట వెంకటేష్, రవికుమార్ పాల్గొన్నారు. -
వలపువల విసిరి.. రూ.8లక్షలు దోచేసి
ఆదిలాబాద్టౌన్: అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వలపు వలతో రూ.8లక్షలు స్వాహా చేసిన ఘరానా ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. సోమవారం వన్టౌన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన లక్ష్మీకాంత్ ఈ నెల 25న వన్టౌన్లో ఫిర్యాదు చేశాడు. తన వివాహాం కోసం బాధితుడు యూబ్యూబ్లో పరిశీలించగా కృష్ణవేణి అనే అమ్మాయి ఫొటోతో రూపావత్ శ్రావణ్కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజీ అనే మోసగాడిని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడైన మంజీ కృష్ణవేణి పేరిట మహిళా గొంతుతో మాట్లాడి తాను ధనవంతురాలినని తన ఆస్తులు కోర్టులో ఉన్నాయని నమ్మించాడు. న్యాయవాదికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని తన వివాహాం తర్వాత ఆస్తులు, వ్యాపారాలను పూర్తిగా చూసుకోవాలని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు విడుతల వారీగా మోసగాడికి రూ.8లక్షలను ఆన్లైన్లో పంపించాడు. తిరిగి డబ్బులివ్వాలని అడుగగా వారు నిరాకరించారు. దీంతో బాధితుడు మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ విభాగం 1930కు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన వన్టౌన్ పోలీసులు సైబర్ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సూర్యాపేట జిల్లాకు పంపించారు. ఈ క్రమంలో ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లుగా వివరించారు. వారిలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రాంచంద్రాపూరం తండాకు చెందిన మాలోత్ మంజీ, భుక్యా గణేశ్, రూపావత్ శ్రావణ్ కుమార్ ఉన్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.1.50లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రేంకుమార్, సైబర్ సెల్ ఎస్సై గోపీకృష్ణ, వన్టౌన్ ఏఎస్సై గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ రమేశ్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్ తదితరులున్నారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బేల మండలం బోదిడి గ్రామానికి చెందిన కుమరం దేవరావు తనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టా మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు. గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాల మండలం రెబ్బన గ్రామానికి చెందిన శిరీష ఎంబీబీఎస్ చదువు కోసం ఫీజు మంజూరు చేయాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. -
నగరంలో దోమల మోత
మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలో డ్రె యినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం లేక మురు గు నీరు ఖాళీ స్థలాల్లోకి పారుతూ దోమలు, పందులకు ఆవాసంగా మారుతోంది. దుర్వాసన, దోమల మోతతో ప్రజలు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. వర్షాకాలంలో పారి శుద్ధ్యాన్ని మెరుగుపర్చకపోవడంతో మురుగునీరు ఇళ్ల మధ్యన చేరుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు పారిశుద్ధ్యం మెరుగ్గానే ఉండేది. ఎప్పటికప్పుడు చెత్త తొలగించడం, డ్రెయినేజీ నీరు రోడ్లు, ఖాళీస్థలాల్లోకి రాకుండా చూడడంతోపాటు ఖాళీ స్థలాల్లో నిలిస్తే దోమలకు ఆవాసంగా మారకుండా ఆయిల్ బాల్స్ వేసి ఫాగింగ్ చేసేవారు. ఈ ఏడాది జనవరిలో నస్పూరు మున్సిపాలిటీతో పాటు హాజీపూర్ మండలంలోని ఎనిమిది గ్రామాలను మంచిర్యాల మున్సిపాలిటీలో విలీ నం చేసి కార్పొరేషన్గా మార్చారు. పరిధి పెరగడంతో కార్మికులు లేక ఉన్నవారిని కార్పొరేష న్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు వినియోగిస్తున్నారు. నగర విస్తీర్ణానికి అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉండడంతోపాటు పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా నిర్వహించలేక సమస్య ఏర్పడుతోందని తెలుస్తోంది. పాలకవర్గ పదవీ కాలం జనవరిలో పూర్తయింది. డివిజన్లలో తాజామాజీ ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నా కార్పొరేషన్ అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉందని ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్ ఏర్పడి పది నెలలు అవుతున్నా ఇంకా పాలన గాడిలో పడకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్రెయినేజీలు నిర్మిస్తేనే...మంచిర్యాల కార్పొరేషన్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం సమస్యగా మారుతోంది. నగరంలో 463 కిలోమీటర్ల మేర డ్రెయినేజీ వ్యవస్థ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 273 కిలోమీటర్లు మాత్రమే నిర్మించారు. మిగతా 190 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి చేసేలోపు శివారు ప్రాంతాల్లో మరిన్ని కొత్త ఇళ్ల నిర్మాణాలు చేపడితే మరింత పెరుగుతాయి. శరవేగంగా పెరుగుతున్న నగర విస్తీర్ణానికి అనుగుణంగా డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడం, పలుచోట్ల గతంలో నిర్మించిన కాలువలు శిథిలమవడం వల్ల మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి పారుతోంది. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ చేపట్టినా మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి రాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. అవసరం మేరకు తాత్కాలికంగా కార్మికులను నియమించుకుని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూనే అవసరమైన చోట డ్రెయినేజీలు నిర్మిస్తే నగరం పరిశుభ్రంగా ఉండేందుకు అవకాశం ఉంది.మురుగు నీరు నిల్వ లేకుండా చూస్తాం నగరంలో అవసరమైన చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొన్ని చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, డ్రెయినేజీల నిర్మాణ పనులు చేపట్టని చోట మురుగు నీరు రోడ్లు, ఖాళీ స్థలాల్లోకి వస్తోంది. మురుగు నీరు బయటకు రాకుండా, దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాని కి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి రాగానే నిర్మాణ పనులు చేపడతాం. – సంపత్కుమార్, కమిషనర్, మంచిర్యాల కార్పొరేషన్ -
తోటల పనులు ప్రారంభించాలి
దండేపల్లి: మండలంలోని లింగాపూర్ అటవీ బీట్లోని 379, 380 కంపార్ట్మెంట్లో ఆక్రమణలు తొలగించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధిహామీ పథకం ద్వారా వెదురు, యూకలిప్టస్ తోటల పెంపకం పనులు ప్రారంభించాలని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. తాళ్లపేట అటవీ రేంజి కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీవో, అటవీ శాఖ సిబ్బందితో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు 380 కంపార్ట్ మెంట్లో గిరిజనులతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రసాద్, డీఆర్వో సాగరిక, ఎఫ్ఎస్వో రాజేందర్ పాల్గొన్నారు. -
నేరస్తులపై బహిష్కరణ వేటు
మంచిర్యాలక్రైం: కరుడుగట్టిన నేరస్తులు, గంజాయి, దొంగతనాలు, చైన్స్నాచర్లు, మహిళలను వేధించేవారు, భూ ఆక్రమణదారులు వంటి చట్టవ్యతిరేకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు అమలు చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 37మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకుడిపై 25 కేసులు ఉండడంతో రెండు నెలల క్రితం పీడీ యాక్టు నమోదైంది. మరికొందరిపై పీడీ యాక్టు, పద్ధతి మార్చుకోకపోతే నగర బహిష్కరణకు సైతం జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే మందమర్రికి చెందిన ఓ రౌడీషీటర్పై నెల రోజుల క్రితం నగర బహిష్కరణ విధించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, సెటిల్మెంటు, గ్యాంగుదాడులు, సంఘవిద్రోహ శక్తులు, పాత నేరస్తులపై ఎస్బీ, ఇంటెలిజెన్స్, ప్రత్యేక పోలీసు బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద హత్య, హైదరాబాద్లోని చాదర్ఘాట్లో డీసీపీ, గన్మెన్లపై కత్తులతో సెల్ఫోన్ దొంగల దాడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నేరచరితుల విషయంలో పోలీసులు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానాన్ని పక్కనపెట్టి వారిని కట్టడి చేయడంలో నిమగ్నమయ్యారనే చర్చ జరుగుతోంది. జిల్లాలో.. జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయ డం, గ్యాంగ్దాడులు, సెటిల్మెంట్లు, నేరస్తులు, గంజాయి, భూకబ్జాలకు పాల్పడే 250 మందిపై రౌడీషీట్ ఉంది. ఇందులో కొందరు పాత నేరస్తులు కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 30మందిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. వీరిలో ఒకరిపై నగర బహిష్కరణ విధించారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించడం, పద్ధతి మార్చుకోవాలని లేదంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో దడనగర బహిష్కరణ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కేసుల నమోదుతో అక్రమార్కుల్లో పోలీసులు దడ పుట్టిస్తున్నా రు. జిల్లాలోని కొందరు రౌడీషీటర్లు ఇప్పటి కే మంచిర్యాలను వదిలి హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లి ఇతరత్రా పనులు చేసుకుంటున్నారు. జిల్లాలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక నిఘాను పటిష్టం చేశారు. -
పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నిత్యం విధుల్లో పోలీసులతోపాటు విధి నిర్వహణలో అమరులు అవుతున్న వారి త్యాగాలు వెలకట్ట లేనివని బెటాలి యన్ కమాండెంట్ పి.వెంకటరాములు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవా రం బెటాలియన్ ఆవరణలో బైక్ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గుడిపేట గ్రామ, జాతీయ రహదారులపై బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ప్రాణరక్షణలో పోలీసులు ఏదో ఒక సందర్భంలో అమరులు అవుతున్నారని తెలిపారు. ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్రావు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాకు మహా ధాన్యం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు విచారణ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత యాసంగి సీజన్లో చెన్నూరు నియోజకవర్గంలో పలు కొనుగోలు కేంద్రాలకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ధాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర రైతుల పేర్లతో విక్రయించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇటీవల పౌరసరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు ఆయా కేంద్రాల్లో జరిగిన కొనుగోళ్ల తీరుపై తనిఖీ చేసి వెళ్లారు. జిల్లా కార్యాలయం, జైపూర్ మండలం నర్సింగాపూర్, చెన్నూరు మండలం దుగ్నేపల్లితోపాటు పలు కేంద్రాల్లో గత యాసంగిలో పొరుగు రాష్ట్ర ధాన్యం ఇక్కడి రైతుల పేర్లతో అమ్ముకున్నట్లు రావడంతో అప్పటి రికార్డులు పరిశీలించారు. కేంద్ర నిర్వాహకులు, వ్యవసాయ అధికారులు, సహకరించిన రైతులు ఎవరెవరు, ఆ కేంద్ర పరిధిలో ఎంత మొత్తం లక్ష్యం ఉంది?, ఎంత మొత్తంలో అమ్మారు?, ఏయే మిల్లులకు ఆ ధాన్యం వెళ్లిందనే కోణంలో దర్యాప్తు చేశారు. దీనిపై నివేదిక ఉన్నతస్థాయిలోనే అందజేయనున్నట్లు తెలిసింది. దిద్దుబాటు చర్యలు మహారాష్ట్ర ధాన్యం రాకుండా జిల్లా యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేట్టింది. గత సీజన్లలో పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం వస్తోందనే చెక్పోస్టులు ప్రాణహిత బ్రిడ్జికి సమీపంలోనే ఏర్పాటు చేశారు. గతంలో జాతీయ రహదారిపైనున్న కోటపల్లి మండలం పారుపల్లి శివారులో ఉండేది. దీంతో పర్యవేక్షణ కొరవడింది. ఇక అక్కడ ఉన్న సిబ్బందిని మేనేజ్ చేస్తూ ధాన్యం రాష్ట్రం దాటిస్తూ అమ్మేస్తున్నారు. రాత్రివేళ లారీలకొద్దీ కోటపల్లి, చెన్నూరు, జైపూర్ మండలాల్లో కేంద్రాలకు తరలించి ఉదయం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. వీటికి కేంద్ర నిర్వాహకులతోపాటు వ్యవసాయ అధికారుల సహకారంతోనూ ఈ అక్రమ ధాన్యం కొనుగోలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వానాకాలంలో 301కేంద్రాలతో 2.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ఈసారి పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అక్రమాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. పకడ్బందీగా నిఘా మహారాష్ట్ర నుంచి ధాన్యం జిల్లాకు వస్తే చాలాసార్లు ఆ లారీలను తిప్పి పంపించాం. ఆ రాష్ట్ర ధాన్యం ఇక్కడ అమ్ముకోవడానికి వీలు లేదు. దీనిపై చెక్పోస్ట్ల్లో పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశాం. అక్రమాలకు పాల్పడితే వారిపై చర్యలు ఉంటాయి. – సీహెచ్.బ్రహ్మారావు, జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి దొడ్డిదారిలో..జిల్లాకు వందల క్వింటాళ్ల కొద్దీ మహారాష్ట్ర నుంచి ధాన్యం దొడ్డిదారిలో వస్తోంది. ప్రాణహిత నది ఆవల కొందరు సిరొంచ సమీప గ్రామాల నుంచి అధిక ధర ఆశతో జిల్లాకు చాటుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వడ్ల వ్యాపారులు ఇక్కడి వారి సహకారంతో అక్కడ తక్కువ ధరతో కొనుగోలు చేసి తెలంగాణ పరిధిలో స్థానిక రైతుల పేర్లతో అమ్ముకుని లాభం పొందుతున్నారు. ఈ సీజన్లో పరిశీలిస్తే ఒక క్వింటాల్కు ఏ గ్రేడ్ రూ.2,389 సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర ఉంది. ఇక సన్న రకం వడ్లకు అదనంగా క్వింటాల్కు రూ.500 బోనస్ ఉంది. మహారాష్ట్రలో ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లతో అక్కడి ధర తక్కువ. ఇక్కడ బోనస్ పొందే అవకాశం ఉంది. దీంతో చెక్పోస్టులను దాటేస్తే అమ్ముకోవచ్చని ఎత్తు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రంతో స్థానికుల బంధుత్వాలు, సత్సంబంధాలు, వ్యవసాయ భూములు ఉండడంతో అక్కడి వారికి జిల్లా వాసులు సహకారం అందిస్తున్నారు. దీంతో అధిక ధర పొందేందుకు సులువుగా మారుతోంది. ప్రభుత్వం రూ.వందల కోట్లు పెట్టి రాష్ట్ర రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇవ్వాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మిల్లులకు ధాన్యం తరలిస్తోంది. అయితే పొరుగు రాష్ట్ర రైతులు అక్రమ మార్గంలో అమ్ముకోవడంతో ప్రజాధనం దుర్వి నియోగం అవుతోంది. -
సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. జిల్లా కేంద్రం హమాలీవాడ, సూర్యనగర్ కాలనీ వాసులు గత కొద్దిరోజులుగా నల్లానీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన జే.బాలక్క, ఎస్సీ కాలానికి చెందిన ఎన్.లక్ష్మి, భూపెల్లి లావణ్య ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన ఇందూరి కిష్టయ్య తన కుమారుడు భూములు లాక్కొని ఇంటి నుంచి వెళ్లగొట్టాడని, న్యాయం చే యాలని ఫిర్యాదు చేశారు. పలువురు పింఛన్ల కో సం వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో జ్యోతి రావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఏర్పా టు చేయాలని యుగంధర్, సాయి, సంధ్యారాణి, నరేష్, కుమారస్వామి కోరారు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపడుతున్నామని, తమ స్థలం పై నుంచి ఉన్న విద్యుత్ తీగలు తొలగించాలని భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన పద్మ కోరింది. -
హామీలు సరే.. అమలేది..!
బెల్లంపల్లి: రెండున్నర దశాబ్దాల క్రితం వరకు భూగర్భ బొగ్గుగనులు, విభాగాలు వేలాదిమంది కార్మికులతో విరాజిల్లిన బెల్లంపల్లి ప్రస్తుతం కళ తప్పింది. ప్రభుత్వ భూములు, మౌలిక వసతులు, మానవ వనరులు అపారంగా ఉన్నా అభివృద్ధి కరువైంది. ఎన్నికల సమయంలో నాయకులు, పాలకులు ఇచ్చే హామీలు అమలుకు నోచుకోక నిరుద్యోగం పెరిగిపోతోంది. పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ ఎప్పుడో..! బెల్లంపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అప్గ్రేడ్ చేస్తామని గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాలకులు, నాయకులు హామీలు ఇస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయించి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో, ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల కాలంలో పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ అంశం ఎన్నికల నినాదంగా మారింది. ఈ విషయంలో అడుగు ముందుకు పడక విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వ్యవసాయ కళాశాల బెల్లంపల్లి కేంద్రంగా కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ఏర్పాటై పంటల సాగులో సూచనలు, సలహాలు అందిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. కేవీకేకు అనుబంధంగా అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ కళాశాల మంజూరుకు అవకాశాలు ఉన్నా ఆ దిశగా పాలకులు యోచించడం లేదు. అగ్రికల్చర్/హార్టికల్చర్ కళాశాల మంజూరైతే విద్యార్థులు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. రెండున్నర దశాబ్దాల క్రితం బెల్లంపల్లికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మంజూరు కాగా అప్పటి పాలకుల పట్టింపులేని తనంతో జగిత్యాలకు తరలిపోయింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలేవీ..? రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధి గాంచిన బెల్లంపల్లిలో బొ గ్గు ఆధారిత పరిశ్రమల ఊసు లేకుండా ఉంది. బొ గ్గు గనులతో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో రకరకాల కారణాలతో గనులన్నీ మూ త పడగా, వేలాది మంది కార్మికులు ఇతర ఏరియాలకు వెళ్లారు. గనులు మూతపడి, కార్మికులు బదిలీ కావడంతో బెల్లంపల్లి వైభవం మసకబారింది. ఈ క్రమంలో అర్ధంతరంగా మూతపడ్డ భూగర్భ గనుల్లో ఇంకా ఏళ్ల తరబడి తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నా వెలికితీతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటోంది. ఈ కారణంగా బొగ్గు ఆధారిత పరి శ్రమలు ఏర్పాటు కాక నిరుద్యోగులు, కార్మికుల పి ల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. బెల్లంపల్లి పట్టణం నర్సింగ్ కళాశాల లేనట్లే..! ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో 275 పడకల సామర్థ్యం కలిగిన ఏరి యా ఆసుపత్రి, ప్రభుత్వ పరంగా వంద పడకలతో కూడిన ఏరియా ఆసుపత్రులు బెల్లంపల్లిలో ఉన్నాయి. ఏటా వందలాది మంది ఈ ప్రాంత విద్యార్థినులు నర్సింగ్ విద్య అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ అవకాశం అందుబాటులో లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు అందుబాటులో ఉండడంతో బాలికలు పోటీ పడి చేరుతున్నారు. అదే తీరుగా నర్సింగ్ కళాశాల మంజూరు చేయించాలనే డిమాండ్ ఉన్నా పట్టింపు చేయడం లేదు. జాడలేని మెడికల్ కళాశాల.. ఆర్టీసీ బస్డిపో.. బెల్లంపల్లికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మెడికల్ కళాశాల, ఆర్టీసీ బస్ డిపో మంజూరు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని హామీలిచ్చిన పాలకుల నోటి వెంట ప్రస్తుతం ఆ మాట రావడం లేదు. మెడికల్ కళాశాల మంజూరు అవుతుందో లేదో తెలియదు కానీ కనీసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించడంలోనూ విఫలం అవుతున్నారు. ఆర్టీసీ బస్డిపో మంజూరు చేయిస్తానని చేసిన వాగ్దానం నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదనే అసంతృప్తి ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం
పాతమంచిర్యాల: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షు డు దుంపల రంజిత్కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో యూనియన్ 2వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ ఎఫ్టీఏను చెల్లించాలని అ న్నారు. రెండో ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలు మరణిస్తే రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా దుంపల రంజిత్కుమార్, అధ్యక్షురాలుగా సంధ్య, కార్యదర్శిగా మౌ లాలి, కోశాధికారిగా గంగ, ఉపాధ్యక్షులుగా శోభ, రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిగా విజయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులుగా సత్యవతి ఎన్నికయ్యారు. -
ఫిర్యాదులు పరిష్కరించాలి
బెల్లంపల్లిరూరల్: పోలీస్స్టేషన్కు వచ్చేవారి తో మర్యాదపూర్వకంగా మెదిలి ఫిర్యాదుల ను సత్వరమే పరిష్కరించాలని డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీస్స్టేషన్ను ఆయన బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. స్టేష న్ పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. గ్రా మాల్లో నిరంతరం నిఘా వేసి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల ని సిబ్బందిని ఆదేశించారు. గ్రామీణులకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, గంజాయి వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, తాళ్లగురిజాల ఎస్సై బి.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసు విధులపై విద్యార్థులకు అవగాహన
మంచిర్యాలక్రైం: పోలీసుల విధులు, బాధ్యతలపై వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఓపెన్హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు చట్టాలు, విధులు, షీ టీమ్స్, భరోసా సెంటర్లు, కమ్యూనికేషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్ డివైస్ ఉపయోగాలు, స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ నిబంధనలు తదితర వాటిపై వివరించారు. అనంతరం సీపీ అంబర్కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీసులు నేరస్తులను పట్టుకోవడానికే కాదు.. సమాజంలో శాంతిభద్రతలు, చట్టపరమైన అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్ఏసీపీ ప్రతాప్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన శ్రీరాముల శ్రీకాంత్(44) పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య వాణిశ్రీ, కూతురు శ్లోక ఉన్నారు. గతకొంత కాలంగా భార్య అనారోగ్యం బారిన పడింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మనస్తాపానికి గురైన శ్రీఖాంత్ ఈ నెల 19న మావల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. కుటుంబీకులు పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఈ నెల 20న హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా ఈయన గతంలో మాజీ మంత్రి జోగు రామన్న వద్ద పీఏగా పనిచేశారు. -
మనమూ చేద్దాం... మారథాన్
మామడ: నేటి పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం కారణంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడితో మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. నడక, జాగింగ్, రన్నింగ్ చేయడం మర్చిపోతే పనిఒత్తిడి వలన ఆందోళన, చికాకుతో పాటు బీపీ, షుగర్ వ్యాధుల బారినపడే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో వాకింగ్, మారథాన్, యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ఇంగ్లండ్కు చెందిన రన్నర్ జాక్ సెయింట్ ఇటీవల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు మారథాన్ చేపట్టారు. ఇటీవల నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకోగా మారథాన్ రన్నర్ల బృందం ఆయనకు ఘనస్వాగతం పలికింది. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ దానిని అధిగమించాల న్న ధృడసంకల్పంతో మారథాన్ చేస్తున్నట్లు తెలి పారు. 60 రోజుల పాటు రోజుకు 60 కిలోమీటర్ల దూరం పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత ఆసక్తి... సుదీర్ఘ దూరం నడకను మారథాన్గా పేర్కొంటారు. 42.196 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 6 గంటల్లో, 21 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల సమయంలో పూర్తి చేస్తారు. మారథాన్లో పాల్గొనడం శ్రమ అనుకుంటే 10 కి.మీ, 5కి.మీ, 3 కి.మీల క్లబ్లలో చేరుతున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా పట్టణాలకు చెందిన రన్నర్లు హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తదితర పట్టణాల్లో నిర్వహిస్తున్న మారథాన్ పోటీలలో పాల్గొంటున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ క్రీడాకారుల ప్రతిభ
ఆదిలాబాద్: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించిన రాష్ట్రస్థాయి వుషూ ఉమెన్స్ లీగ్ పోటీల్లో ఆరు పతకాలతో ప్రతిభ కనబరిచారు. సీనియర్ విభాగంలో ఆకోజివార్ శృతి బంగారు పతకం సాధించగా, జూనియర్ విభాగంలో ముంగటివారి ప్రజ్ఞ, వడ్నాల కీర్తన రజత పతకాలతో మెరిశారు. అలాగే జూనియర్స్ విభాగంలో రావుల అవంతిక కాంస్య పతకం సాధించగా, సబ్ జూనియర్స్ విభాగంలో సుంకు ఘనశ్రీ, కాంక్ష కాంస్య పతకాలు కై వసం చేసుకున్నట్లు మాస్టర్ వీరేశ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై జిల్లా క్రీడా శాఖ అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. -
కన్నతల్లి కాదనుకుంది..!
కాగజ్నగర్టౌన్: నవమాసాలు కడుపున మోసింది.. బిడ్డను భూమి మీదకు తెచ్చేందుకు పురిటి నొప్పులు తట్టుకుంది. ఏమైందో ఏమోగాని పొత్తిళ్ల పాలు తాగుతూ సేదతీరాల్సిన పసికందును ఆ తల్లి కాదనుకుంది. రైలులో ఓ ప్రయాణికుడికి అప్పగించి దిగి వెళ్లిపోయింది. దీంతో రెండు నెలల ప్రాయంలోనే ఆ పసికందు మాతృప్రేమకు దూరమైంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్తున్న ధానాపూర్ ఎక్స్ప్రెస్ రైలులోని వెనుకవైపు ఉన్న జనరల్ బోగీలో గుర్తు తెలియని మహిళ సుమారు రెండు నెలల వయస్సు ఉన్న పాపతో కాజిపేట రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. మళ్లీ వస్తానని చెప్పి ఓ ప్రయాణికుడికి పాపను అప్పగించి కిందికి దిగింది. రైలు కదిలినా సదరు మహిళ రాకపోవడంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్ వరకు చూసిన అతడు కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. వారు ఆ పాపను సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో అప్పగించాలని సూచించారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు పాపను తమ ఆధీనంలోకి తీసుకోని జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్కు విషయం తెలియజేశారు. వెంటనే జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బంది స్టేషన్కు చేరుకుని పాపను ఆసిఫాబాద్లోని బాలరక్ష భవన్కు తరలించారు. అక్కడి నుంచి జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్లోని శిశు సంక్షేమ గృహానికి తీసుకెళ్లారు. చట్టబద్ధంగా శిశుగృహం ద్వారా పాపను దత్తత ఇస్తామని ఆయన తెలిపారు. బాల రక్షభవన్ సిబ్బంది శ్రవణ్కుమార్, జమున, చంద్రశేఖర్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తాండూర్లో తెల్లకాకి దర్శనం
తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్లోని ఓ ఇంటి వద్ద ఇటీవల తెల్తరంగు హౌస్క్రో(దేశీయ కాకి) కనిపించింది. ఈ విషయమై హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ(హెచ్వైటీఐసీఓఎస్) సభ్యుడు, వన్యప్రాణి పరిరక్షకుడు శ్రీపతి వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని భాగాలు తెల్లగా ఉన్న కాకులు మాత్రమే కనిపించగా.. పూర్తి తెల్లకాకి కనిపించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకి ల్యూసిజం అనే అరుదైన జన్యు పరిస్థితిని కలిగి ఉంది. దీని వల్ల పక్షి రెక్కలు పూర్తిగా తెల్లగా మారినప్పటికీ కళ్ల రంగు సహజంగా ఉంది. అల్బినిజంలో కళ్లతో సహా శరీరమంతా తెల్లబడుతుంది. కానీ ల్యూసిజంలో కళ్లు సాధారణంగా ఉంటాయి. ఇదే రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా. సహజత్వానికి భిన్నంగా ఉన్న రూపం వల్ల ఇతర కాకులతో సంబంధాలు, సంతాన ఎంపిక ప్రభావితం కావడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ చాలా తెలివైన కాకులు వాటి సామాజిక బంధాలు, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం వల్ల ఆ ఇబ్బందులను అధిగమిస్తాయి. తెల్లరంగు కాకి పెద్ద వయస్సు వరకు జీవించడం దాని అనుకూల సామర్థ్యానికి నిదర్శనమని వైష్ణవ్ తెలిపారు. -
డీసీసీపై వీడని ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేన్నట్లుగా ఈ సారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో.. అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్గా ఉండేది. అయితే.. పార్టీలో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రధానంగా కష్టపడ్డవారిని గుర్తించాలని, సామాజిక, స్థానిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు పరిశీలకులను నియమించి డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఎంపికలో వీరే కీలకం..మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడు డాక్టర్ నరేశ్కుమార్, పీసీసీ పరిశీలకులు అడువాల జ్యోతి, పులి అనిల్కుమార్, శ్రీనివాస్గౌడ్ జిల్లా అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారారు. ఇక జిల్లా నుంచి మంత్రి వివేక్ వెంకట స్వామితో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు సంఘాల బాధ్యుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లాలో 28మంది పార్టీ నాయకులు డీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచి దరఖాస్తు చేసుకున్నారు. వీరందరితోనూ ప రిశీలకులు వ్యక్తిగతంగా మాట్లాడారు. పార్టీలో కనీ సం ఐదేళ్ల అనుభవం, పార్టీని నడిపే సత్తా, కేడర్ను సమన్వయం చేయగల సమర్ధత లాంటి అర్హతలు పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వడబోసి షార్ట్ లిస్ట్ తయారు చేసి మూడు పేర్లను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహుల లాబీయింగ్రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయనున్న నేపథ్యంలో వెనుకబడిన వర్గాల నుంచి ఓ నాయకుడిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జిల్లాలోని రెండు అసెంబ్లీ, ఎంపీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కావడంతో అన్ని వర్గాలకు సమప్రాధాన్యత ఇవ్వాలంటే ఓసీ లేదా బలహీన వర్గాలకు చెందిన నాయకులకు అవకాశమివ్వడంపై సమాలోచనలు చేస్తున్నారు. అయితే.. డీసీసీ అధ్యక్ష పీఠంపై గంపెడాశలు పెట్టుకున్న ఇద్దరు నాయకులు స్థానిక ఎమ్మెల్యేలు, ఏఐ సీసీ అబ్జర్వర్లు, గాంధీభవన్లో సీనియర్ నేతలతో ఢిల్లీ వరకు లాబీయింగ్ చేసుకుంటున్నట్లు తెలిసింది. అధిష్టానం చివరకు ఎవరికి డీసీసీ పీఠం కట్టబెట్టనుందో త్వరలోనే తేలిపోనుంది.సీనియర్లకే అవకాశంప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులకు అవకాశం ఇవ్వకపోవడంతో పా టు సీనియార్టీని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నేళ్లుగా పార్టీలో పని చేస్తున్నా రు? గతంలో వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు ఏవైనా పదవులు వచ్చాయా? లాంటి అంశాల ను పరిశీలిస్తున్నారు. నామినేటెడ్ పదవులు, ఇత ర పార్టీ పదవులు అనుభవించినవారికి అవకా శం తక్కువేనని చెబుతున్నారు. అధ్యక్షుడిగా ఎంపికై నవారు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమన్వయం చేయాలి. జిల్లాలోని ఎమ్మెల్యేలతో సఖ్యత, రాబోయే ఎన్నికల్లో క్రియాశీలకంగా ఉండే జిల్లా పదవి కావడంతో ఆచితూచీ అన్ని కోణాల్లో వడపోసి సీనియర్ నాయకుడికి అవకా శం ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే షార్ట్ లిస్ట్ నుంచి సామాజిక కోణం లాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స మాచారం. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కో ణంతో పాటు కొత్తవారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, యువతను ఆకర్షించేందుకు చురుగ్గా ఉండే నాయకుడిని ఎంపిక చేస్తున్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. జిల్లాలో పదవి ఆశిస్తున్న వారిలో ఒకరిద్దరి పేర్లు తుది జాబితాకు చేరినట్లు తెలిసింది. -
మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి: స్థానిక ఏఎంసీ క్రీడా మైదానంలో ఆది వారం నిర్వహించనున్న మెగా జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. శనివారం ఏఎంసీ క్యాంపు కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా సింగరేణి ప్రాంత యువతలో మా ర్పు రావాలని, విచక్షణ కోల్పోకుండా ముందుకుసా గాలని సూచించారు. సబ్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ.. ఏడో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలున్న నిరుద్యోగులు జాబ్మేళాకు హాజరు కావాల ని సూచించారు. జాబ్మేళాకు ఏర్పాట్లు చేసినట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకు 5వేల పైచిలుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. మేళాకు 75 కంపెనీలు హాజరవుతుండగా, దాదాపు 4వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించే అవకాశముందని తెలిపారు. ఏసీపీ ఎ.రవికుమార్, ఎ స్వోటూ జీఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, పలు విభాగాల అధికారులున్నారు. ఏర్పాట్ల పరిశీలన బెల్లంపల్లి ఏఎంసీ క్రీడామైదానంలో ఆదివారం నిర్వహించనున్న మెగా జాబ్మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే వినోద్ పరిశీలించారు. ఏర్పాట్లపై సింగరేణి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. -
చేపలు పడుతుండగా మూర్చ
కుంటాల: సరదాగా చేపల వేటకు వెళ్లిన యువకుడు మూర్చ రావడంతో నీటిలో పడి మృతి చెందిన ఘటన మండలంలోని కల్లూరులో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సునీల్ (22), నీలేష్లు కల్లూరు వాగు చెక్డ్యాం వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. సునీల్ చేపలు పట్టే క్రమంలో ఒక్కసారిగా మూర్చ వ్యాధి రావడంతో నీటిలో పడి మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన నీలేష్ కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆయన వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వచ్చి సునీల్ను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి అన్న దమ్మపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై జీవన్ రావు తెలిపారు. -
అధిక సాంద్రత పత్తి సాగు చేయాలి
కాసిపేట: జిల్లా రైతులు వనరులను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు అధిక సాంద్రత పత్తి సాగు సాంకేతికతను అవలంబించాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ సూచించారు. శనివారం మండలంలోని సండ్రల్ పహాడ్ శివారులో అధిక సాంద్రత పత్తిసాగుపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు అధిక సాంద్రత పత్తిసాగుపై అవగాహన కల్పించారు. ప్రతీ ఎకరాకు అధిక మొక్కల సాంద్రత ఉంచడం ద్వారా దిగుబ డులు పెరగడం, నేల సారాన్ని కాపాడటం లాంటి ప్రయోజనాల గురించి వివరించారు. పత్తి మొక్కల ఎత్తు ఆధారంగా మెపిక్వాట్ క్లోరైడ్ స్ప్రే వాడకం, పోషక లోప లక్షణాలు, కీటక వ్యాధి లక్షణాల మ ధ్య తేడా వివరించారు. సమగ్ర పోషక నిర్వహణ, యాంత్రిక పత్తికోత, సమగ్ర కీటక వ్యాధి నిర్వహణ పద్ధతులపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్, కేవీకే శాస్త్రవేత్తలు ఎన్.మహేశ్, నాగరాజు, ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, ఏఈవో శ్రీధర్, రైతులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క దాడిలో ఆరుగురికి గాయాలు
నెన్నెల: మండల కేంద్రంలో శనివారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ కుక్క దాడి చేస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెన్నెల గ్రామంలో చాకలివాడకు చెందిన ఓరగంటి బాపు, లేతకారి కుమార్లతో పాటు బెస్తవాడకు చెందిన కంప ల రాజేశం, కంపల జశ్వంత్, కుమ్మరివాడలో భీమరాజుల హరీశ్, అట్కపురం పోశంలపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన వారికి నెన్నెల పీహెచ్సీలో ప్రథమ చికిత్స అందించి బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామస్తులు వెంబడించి పిచ్చికుక్కను కర్రలతో కొట్టి హతమార్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న పిచ్చికుక్కల నుంచి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. -
తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి
పాతమంచిర్యాల: 42శాతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ కోరారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నాయకులతో కలిసి శనివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు కర్ణ శ్రీధర్, గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, పంపరి వేణుగోపాల్, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు నెన్నెల నర్సయ్య, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు చెలగాని సుదర్శన్, షెట్పల్లి గట్టయ్య, చెలిమెల అంజయ్య, కీర్తి భిక్షపతి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. నేడు సామూహిక వివాహాలుబెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ శివారులోని శివాలయంలో ఆదివారం సామూహిక వివా హాలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి తిలక్ వాకర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో నిరుపేద యువతి, యువకులకు వివాహాలు చేయడానికి నిర్వాహకులు ముందుకొచ్చారు. ఉదయం 11.29గంటలకు వివాహ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నా రు. కార్యక్రజుమానికి హాజరయ్యే వధూవరులకు పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు అందజేస్తారు. అలాగే వివాహానికి వధూవరుల తరఫున హాజరయ్యే ప్రజలకు భోజన సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. -
‘ప్రజల భద్రత కోసమే పోలీసులు’
మంచిర్యాలక్రైం: పోలీసులున్నది ప్రజల భద్రత కోసమేనని డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్హాల్లో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జి ల్లాకు చెందిన యువత, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ఆటో డ్రైవర్లు, పొలీస్ అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ అమరులైన పోలీసుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని దా నాల కన్నా రక్తదానం చాలా విలువైందని తెలిపా రు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో రౌడీషీటర్ రి యాజ్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ హత్యకు గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 172 యూనిట్ల రక్తం సేకరించగా రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీపీ ప్రకాశ్, సీఐలు ప్రమోద్రావ్, రమణమూర్తి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేశ్కుమార్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు సత్యపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎస్ఏఈ ఇండియా’ క్లబ్ ప్రారంభం
బాసర: ఆర్జీయూకేటీలో ఎస్ఏఈ ఇండియా కాలేజియేట్ క్లబ్ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా లార్వెన్ ఏఐ సహ వ్యవస్థాపకులు వైఘారెడ్డి, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం యూనివర్సిటీలో ఆటోమేటివ్ ఇంజనీరింగ్ కార్యకలాపాలకు ఒక మైలురాయన్నారు. సాంకేతిక పోటీలలో, పరిశ్రమ ఆధారిత అభ్యాసంలో విద్యార్థులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని తెలిపారు. ఫ్యాకల్టీ సలహాదారు రాహుల్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరలో ఔత్సాహిక ఇంజనీర్లకు ఎస్ఏఈ భాగస్వామ్యం ద్వారా లభించే విద్యా, ఉపాధి అవకాశాలు వివరించారు. డీన్స్ డాక్టర్ కే. మహేశ్, డాక్టర్ విఠల్, ఎస్. శేఖర్, చరణ్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ధాన్యం తనిఖీ కేంద్రం ఏర్పాటు
కోటపల్లి: ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ లోకి ధాన్యం రాకుండా మహారాష్ట్ర–తెలంగా ణ సరిహద్దు ప్రాంతమైన రాపన్పల్లి అంతర్రాష్ట్ర వంతెనపై ధాన్యం తనిఖీ కేంద్రాన్ని త హసీల్దార్ రాఘవేందర్రావు, ఎస్సై రాజేంద ర్ శనివారం ప్రారంభించారు. త్వరలో ధా న్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అరికట్టేందుకే 24గంటల చెక్పోస్టును ప్రారంభించినట్లు వారు తెలిపా రు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చెక్పోస్టు వద్ద అప్రమత్తంగా ఉండి ధాన్యం రాకుండా అడ్డుకట్ట వేయాలని సిబ్బందిని ఆదేశించారు.


