ఘనంగా ‘నూతన’ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘నూతన’ వేడుకలు

Jan 2 2026 11:31 AM | Updated on Jan 2 2026 11:31 AM

ఘనంగా ‘నూతన’ వేడుకలు

ఘనంగా ‘నూతన’ వేడుకలు

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను ఆయన చాంబర్‌లో గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ మహమ్మద్‌ విలాయత్‌ అలీ, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో కిషన్‌, డీపీవో కృష్ణమూర్తి, కలెక్టరేట్‌ ఏవో రాజేశ్వర్‌, వివిధ శాఖల అధికారులు దుర్గప్రసాద్‌, భాగ్యవతి, పురుషోత్తంనాయక్‌ కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ● జైపూర్‌లోని ఎస్టీపీపీలో ఉన్న ప్రాణహిత అతిథి గృహంలో ఈడీ చిరంజీవి, జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్‌తోపాటు అధికారులు, ఉద్యోగులు కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ అధికారుల సంఘం అధ్యక్షుడు పంతుల, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రెటరీ సత్యనారాయణ, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

పవర్‌ ప్లాంట్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న ఈడీ చిరంజీవి, జీఎంలు మదన్‌మోహన్‌, నర్సింహారావు

మంచిర్యాలటౌన్‌/మంచిర్యాలఅగ్రికల్చర్‌/జైపూర్‌: జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. టీఎన్జీవోస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్‌, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీశ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, కేజియా రాణి, రాంకుమార్‌, తిరుపతి, అంజయ్య, సంయుక్త కార్యదర్శి సునిత పాల్గొన్నారు.

జిల్లా అధికారులతో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement