మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లి..
విద్యుదాఘాతంతో యువకుడి మృతి మరొకరి తీవ్రగాయాలు.. కాళేశ్వరంలో ఘటన మృతుడు మంచిర్యాల జిల్లా చెన్నూరు వాసి
చెన్నూర్/కాళేశ్వరం: మొక్కులు చెల్లించుకోవడానికి సంతోషంగా వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా మహదేవర్పూర్ మండలం కాళేశ్వ రం దర్గాలో చోటు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని లైన్గడ్డకు చెందిన ఎంఏ.మజీద్(32), స్నేహితుడు మహమ్మద్ సమీరుద్దీన్తోపాటు మరి కొంత మంది ముస్లింలు కాళేశ్వరంలోని మజీద్పల్లి దర్గా వద్ద మహ్మద్ షా వలీ జన్మదిన వేడుకల్లో(సందల్) పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుప పైపునకు జెండాను బిగించి పైకి ఎత్తుతున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగి లింది. దీంతో ఆ పైపును పట్టుకున్న ఎం.ఏ.మజీద్, మహమ్మ ద్ సమీరుద్దీన్కు విద్యుత్ సరఫరా కావడంతో అపస్మారక స్థి తికి చేరుకున్నారు. వారిని వెంటనే మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎం.ఏ. మజీద్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమీరుద్దీన్ను మె రుగైన వైద్యం కోసం మంచి ర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లి..


