breaking news
India vs New Zealand
-
T20 WC: రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటం: ఆసీస్ మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా నిలిచిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా.. మూడుసార్లు టీ20 వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన ఏకైక టీమ్గా.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డులు సాధించింది.సెమీస్ దాకా వైఫల్యాలునిజానికి లీగ్ దశలో భారత్ అజేయంగా నిలిచినా.. ఆయా మ్యాచ్లలో తమ ప్రదర్శన కోచ్ గౌతం గంభీర్కు సైతం సంతృప్తినివ్వలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్వయంగా చెప్పాడు. ఇక భారీ అంచనాలతో తొలిసారి బరిలోకి దిగిన ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma).. వరుసగా మూడు మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సెమీస్ దాకా వైఫల్యాలు కొనసాగించాడు.మరోవైపు.. సంజూ శాంసన్కు ఆది నుంచి తుదిజట్టులో చోటులేని పరిస్థితి. అయితే, నాకౌట్ మ్యాచ్లలో అంటే వెస్టిండీస్తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 97 నాటౌట్, ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో రాణించి దుమ్ములేపాడు.టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకంఇక అభిషేక్ శర్మ సైతం అసలైన టైటిల్ పోరులో విధ్వంసకర అర్ద శతకం (21 బంతుల్లో 52)తో సత్తా చాటాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జట్టులోని ప్రతి సభ్యుడూ కీలక సమయాల్లో రాణించి తమ వంతు పాత్ర పోషించారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘గేమ్ను టీమిండియా బాగా అర్థం చేసుకుంది. ముఖ్యంగా ఫైనల్లో వారు అద్భుతం చేశారు. బుమ్రా ఆడిన తీరు చూస్తే.. సూపర్స్టార్ల నుంచి ఏ జట్టైనా కోరుకునేది ఇదే కదా అనిపిస్తుంది.రాస్కెల్స్.. నిప్పుతో చెలగాటంఅభిషేక్ శర్మ ఆటకు నేను వీరాభిమానిని. అయితే, టోర్నీ ఆరంభంలో అతడు డకౌట్లు కావడం.. ఆ తర్వాత కూడా విఫలమై దారుణంగా నిరాశపరిచాడు. దీంతో ఒత్తిడిలోకి కూరుకుపోయాడు.అయితే, తప్పక ఆడాల్సిన మ్యాచ్లో బ్యాట్ ఝులిపించాడు. కొంతమంది రాస్కెల్స్ ఉంటారు.. నిప్పుతో చెలగాటం ఆడటం వారికి సరదా! ఫైనల్లో అభిషేక్ శర్మ విజృంభించిన తీరు చూస్తే మీకే ఇది అర్థమవుతుంది. అందరూ అతడే ఒత్తిడిలో ఉంటాడనుకుంటే.. అతడు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు’’ అని బ్రాడ్ హాడిన్ ప్రశంలస వర్షం కురిపించాడు. చదవండి: ‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’ -
టీ20 ప్రపంచకప్ ఫైనల్.. వీక్షణలో ఆల్ టైమ్ రికార్డ్..
-
‘తుదిజట్టులో చోటు ఇవ్వనపుడు.. అతడికి చెప్పిందిదే’
జట్టులో చోటే లేని దుస్థితి నుంచి టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నీరాజనాలు అందుకునే స్థాయికి ఎదిగాడు సంజూ శాంసన్. ఈ ఐసీసీ టోర్నీకి ముందు ఓపెనర్గా తుదిజట్టులో సంజూ స్థానం గల్లంతైంది. వరుస వైఫల్యాలే ఇందుకు కారణం. అదే సమయంలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ (Ishan Kishan).. ఓపెనర్, వికెట్ కీపర్గా సంజూను రీప్లేస్ చేశాడు. వరుస మ్యాచ్లలో అదరగొడుతూ తుదిజట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.అలా వచ్చిఇక సంజూ ఈసారి కూడా వరల్డ్కప్ ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు అని అభిమానులు నిరాశచెందిన వేళ.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) కడుపునొప్పితో లీగ్ దశలో నమీబియాతో మ్యాచ్కు దూరం అయ్యాడు. ఆ మ్యాచ్లో ఇషాన్తో పాటు సంజూ ఓపెనర్గా బరిలో దిగాడు. నాకౌట్ మ్యాచ్లలో ఆకాశమే హద్దుగాఅనంతరం సూపర్-8లో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్కు చోటు దక్కింది. ఈ రెండు మ్యాచ్లలో వేగంగా ఆడే క్రమంలో సంజూ అవుటైనా.. నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.సూపర్-8లో వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన సంజూ శాంసన్.. జట్టును సెమీస్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో 89 పరుగులు చేసిన ఈ కుడిచేతివాటం బ్యాటర్.. న్యూజిలాండ్తో ఫైనల్లోనూ 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో కేవలం ఐదు మ్యాచ్లే ఆడి ఏకంగా 321 పరుగులతో సంజూ సత్తా చాటాడు.అతడు తలచుకుంటే మూడూ సెంచరీలు అయ్యేవిఈ నేపథ్యంలో సంజూ శాంసన్పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ‘‘తుది జట్టులో శాంసన్కు చోటు ఇవ్వలేనప్పుడు సర్ది చెప్పాల్సి వచ్చింది. ఇది కఠిన సమయం కావచ్చు కానీ దేవుడు దయతలిస్తే నీకూ అవకాశం వస్తుంది. అప్పుడు నువ్వేంటో చూపించాలి అన్నాను.దాని కోసం మాత్రం అతడు ఎప్పుడూ సిద్ధమవుతూనే వచ్చాడు. చివరి వరుస మూడు మ్యాచ్లలో శాంసన్ ప్రతాపం ఏమిటో చూశాం. అతడు అనుకుంటే ఈ మూడు ఇన్నింగ్స్లు కూడా సెంచరీలుగా మారేవి. కానీ అతను మాత్రం జట్టు కోసమే ఆడాడు’’ అని ‘చెట్టా (మలయాళంలో పెద్దన్న అనే అర్థం)’ సంజూను సూర్య కొనియాడాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జట్టు గెలుపే లక్ష్యంగా నిస్వార్థంగా ఆడాడని ప్రశంసించాడు.చదవండి: రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త -
T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్
టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ను హెడ్కోచ్ గౌతం గంభీర్ సమర్థించాడు. డారిల్ మిచెల్ విషయంలో అర్ష్దీప్ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అర్ష్దీప్ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.మిచెల్కు గట్టిగా తగిలిన బంతిఅహ్మదాబాద్లో జరిగిన టైటిల్ పోరులో క్రీజులో ఉన్న కివీస్ స్టార్ డారిల్ మిచెల్కు బౌలింగ్ చేసిన అర్ష్దీప్ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్ కోపంగా అర్ష్దీప్ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ సముదాయించడంతో చల్లబడ్డాడు.అనంతరం అర్ష్దీప్ కూడా మిచెల్ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ అర్ష్దీప్నకు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అందులో అర్ష్దీప్ తప్పేమీ లేదుఇదిలా ఉంటే.. హెడ్కోచ్ గౌతం గంభీర్ ANI పాడ్కాస్ట్కు హాజరు కాగా అర్ష్దీప్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్లో బాదితే ఏ బౌలర్కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే ఈ సోషల్ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్ అర్ష్దీప్ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. -
T20 WC 2026: కెప్టెన్గా సాంట్నర్.. అక్షర్కు దక్కని చోటు!
జగజ్జేత టీమిండియాపై ప్రశంసల వర్షం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసిన సూర్య సేన విజయాన్ని అభిమానులు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా వరల్డ్కప్ హీరోలుగా పేరొందిన సంజూ శాంసన్ (Sanju Samson), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లతో పాటు.. అక్షర్ పటేల్ (Axar Patel), శివం దూబే వంటి సైలెంట్ హీరోలను కూడా ఫ్యాన్స్ హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎంపిక చేశాడు. ఇందులో అనూహ్యంగా అక్షర్కు మాత్రం చోటు ఇవ్వలేదు.ఓపెనింగ్ జోడీ ఇదేఓపెనర్లుగా టీమిండియా స్టార్ సంజూ శాంసన్, న్యూజిలాండ్ పవర్ హిట్టర్ టిమ్ సీఫర్ట్ను ఎంచుకున్న చిక్కా.. వన్డౌన్లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్కు చోటు ఇచ్చాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో విండీస్ వీరుడు షిమ్రన్ హెట్మైర్, భారత ఆల్రౌండర్ శివం దూబేను ఎంపిక చేసుకున్న శ్రీకాంత్.. టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా, ఇంగ్లండ్ డేంజరస్ ప్లేయర్ విల్ జాక్స్కు స్థానం ఇచ్చాడు.పన్నెండో ఆటగాడిగాఇక ఈ జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను కాదని.. న్యూజిలాండ్ సారథి మిచెల్ సాంట్నర్ను ఎంచుకున్నాడు చిక్కా. బౌలింగ్ విభాగంలో ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చాడు. పన్నెండో ఆటగాడిగా విండీస్ వీరుడు జేసన్ హోల్డర్ను చిక్కా ఎంపిక చేసుకున్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మొత్తంగా పద్నాలుగు వికెట్లు తీసిన బుమ్రా.. వరుణ్ చక్రవర్తితో కలిసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. మరోవైపు.. ఆరు మ్యాచ్లలో కలిపి 383 పరుగులతో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలవగా.. కేవలం ఐదు మ్యాచ్లలోనే సంజూ 321 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. రెండోస్థానంలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన టిమ్ సీఫర్ట్ (326 పరుగులు) ఉన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 చిక్కా టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్సంజూ శాంసన్, టిమ్ సీఫర్ట్, ఇషాన్ కిషన్, షిమ్రన్ హెట్మైర్, శివం దూబే, హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ఆదిల్ రషీద్, లుంగి ఎంగిడి, జస్ప్రీత్ బుమ్రా.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
T20 WC: రైలులో 3rd ఏసీలో ముంబైకి వచ్చా: శివం దూబే
టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీ గెలవడంలో శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. కీలక సమయాల్లో తన ఆల్రౌండ్ ప్రతిభతో రాణించి జట్టును ఆదుకున్నాడు. అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో దూబే 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు.ఇక ఈ టోర్నీలో లోయర్ ఆర్డర్లో వచ్చి మెరుపు బ్యాటింగ్తో మొత్తంగా 235 పరుగులు సాధించిన దూబే.. ఐదు వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్లో విజయం తర్వాత తాను రైలులో ముంబైకి చేరుకున్నట్లు దూబే వెల్లడించాడు. విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడంతో భార్య అంజుమ్ ఖాన్తో కలిసి 3rd ఏసీలో ప్రయాణించినట్లు తెలిపాడు.3rd ఏసీ టికెట్లు దొరికాయి‘‘విమానాలేవీ అందుబాటులో లేవు. వేకువజామునే నిద్రలేచి అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవాలని నిర్ణయించుకున్నాం. రోడ్డు మార్గం కూడా వెళ్లి ఉండవచ్చు. అయితే, రైలు వేగంగా వెళ్తుంది కదా అని ఇలా ప్లాన్ చేసుకున్నాం.నేను, నా భార్య, మా స్నేహితుడు.. ముగ్గురం కలిసి 3rd ఏసీ టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో వాటిని బుక్ చేసుకున్నాం. రైలులో నన్ను అభిమానులు గుర్తుపడితే పరిస్థితి చేయిదాటి పోతుందని మా వాళ్లంతా కంగారుపడ్డారు.అలా జరుగకూడదనే నేను మాస్కు ధరించాను. ఫుల్ స్లీవ్స్ ఉన్న టీ షర్టు వేసుకున్నాడు. తెల్లవారి 5.10 నిమిషాలకు ప్లాట్ఫామ్కు చేరుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది అక్కడ టీమిండియా జెర్సీలతో సందడి చేస్తున్నారు.పోలీసులకు ముందుగానే సమాచారంఅందుకే రైలు వచ్చేంత వరకు కార్లోనే ఉందామని నా భార్యకు చెప్పాను. రైలు బయల్దేరే ఐదు నిమిషాల ముందు ట్రైన్లోకి వెళ్లిపోయాము. అదృష్టశాత్తూ నన్నెవరూ గుర్తుపట్టలేదు. అయితే, ట్రైన్ దిగిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అందుకే భద్రత కోసం పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాను’’ అని శివం దూబే ఇండియన్ ఎక్స్ప్రెస్కు తెలిపాడు.నాలుగేళ్ల కుమారుడు అయాన్, రెండేళ్ల కుమార్తె మెవిష్లను తొందరగా కలుసుకోవాలనే రైలు ప్రయాణం రిస్క్ అని తెలిసినా ధైర్యం చేశానని దూబే చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్కప్ హీరో ట్రైన్లో వస్తున్నాడని తెలిస్తే.. అభిమానులు ఎంత హంగామా చేస్తారో తెలిసిందే. అందుకే దూబే ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుని ముంబైకి చేరుకున్నాడు.చదవండి: T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ.. ప్రకటన విడుదల -
'భారత్ గొప్ప జట్టేమి కాదు'.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అక్కసు
టీ20 వరల్డ్కప్-2026 ట్రోఫీని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన టీమిండియా.. మూడోసారి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ టైటిల్ గెలిచినప్పటికీ, టోర్నీలో అత్యుత్తమ జట్టు దక్షిణాఫ్రికానేనని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ అసాంతం భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికి, సూపర్-8లో మాత్రం సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. అదే విషయాన్ని స్టీవ్ హార్మిసన్ ప్రస్తావించాడు."న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు నెలకొల్పిన భాగస్వామ్యమే భారత్ను విజేతగా నిలిపింది. ఫ్లాట్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా ప్రదర్శనే ఇతర జట్లకు, భారత్కు మధ్య తేడా చూపించింది. ఈ టోర్నీలో భారత్ అత్యుత్తమ జట్టు అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో దక్షిణాఫ్రికానే అత్యుత్తమ జట్టు. టీమిండియా కేవలం 'బెస్ట్ మొమెంట్ టీమ్' మాత్రమే. మ్యాచ్ మలుపు తిరిగే కీలక సమయాల్లో వారు అద్భుతంగా రాణించి విజేతగా నిలిచారు. గ్రూపు స్టేజిలో భారత్ అంతగా ఆకట్టుకోలేకపోయారు. వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది.కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్కు బలం. ఇక టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా, సెమీఫైనల్లో ఫిన్ అలెన్ విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్-8లో భారత్ను సైతం సౌతాఫ్రికా ఓడించందని" టాక్స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'గంభీర్ చాలా పెద్ద తప్పు చేశాడు' -
అర్షదీప్ సింగ్పై కన్నెర్ర చేసిన ఐసీసీ
భారత నంబర్ వన్ టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కన్నెర్ర చేసింది. టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజ్లో 15 శాతం కోత విధించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. గత 24 నెలల్లో ఇదే మొదటి తప్పిదం కావడంతో అర్షదీప్ నిషేధం ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అర్షదీప్ డారిల్ మిచెల్పైకి ప్రమాదకర రీతిలో బంతిని విసిరాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఐసీసీ అర్షదీప్పై కఠిన చర్యలు తీసుకుంది. వాస్తవానికి అర్షదీప్ మిచెల్పై అంత ఆగ్రహంగా బంతిని విసరాల్సిన అవసరం లేదు. ఫాలో అప్లో భాగంగా బంతిని వికెట్లపై విసరడంతో ప్రమాదవశాత్తు మిచెల్ను బలంగా తాకింది. Final Hungama : Daryl Mitchell 🆚 Arshdeep Singh Surya ಬಂದ ಮೇಲೆ ಎಲ್ಲವೂ ಶಾಂತ... SKY Handle ಮಾಡಿದ ರೀತಿ ನಿಜಕ್ಕೂ ಅದ್ಬುತ!👏🏻🤝🏻ವೀಕ್ಷಿಸಿ | ICC Men’s #T20WorldCup 👉🏻 FINAL | #INDvNZ | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#T20WorldCup2026Final pic.twitter.com/K4ECnGh9ra— Star Sports Kannada (@StarSportsKan) March 8, 2026ఆ సమయంలో మిచెల్ సైతం సహనాన్ని కోల్పోయాడు. అయితే అర్షదీప్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సర్ది చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది. ఈ ఘటన తర్వాత అర్షదీప్-మిచెల్ కరచాలనం చేసుకున్నారు.అయితే ఇలాంటి ఘటనలు ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.9 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తాయి. ఈ ఆర్టికల్ ప్రకారం, బంతి లేదా ఇతర క్రికెట్ సామగ్రిని మరో ఆటగాడి వైపు అనుచితంగా లేదా ప్రమాదకరంగా విసరడం విరుద్ధం. ఇందుకు తగిన మూల్యాన్ని అర్షదీప్ చెల్లించుకున్నాడు.కాగా, ప్రపంచకప్ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో నెగ్గి వరుసగా రెండో టీ20 ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది. -
మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్
టీ20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. వరుసగా రెండో టి20 ప్రపంచకప్ విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సహా పేస్ బౌలింగ్తో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన హార్దిక్ కొన్ని మ్యాచ్ల్లో కీలక సమయాల్లో మెరుపులు మెరిపించాడు. అతని నిలకడను గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ జట్టులో ఆల్రౌండర్గా స్థానం కల్పించింది.పాండ్యాతో పాటు శాంసన్, ఇషాన్, బుమ్రా ఐసీసీ టీమ్లో ఉన్నారు. 32 ఏళ్ల పాండ్యా 18 నెలల క్రితం బార్బడోస్ (2024)లో రోహిత్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో విజయోత్సంలో పాల్గొన్న ఈ ఆల్రౌండర్ అప్పుడు ఆత్మ ప్రమాణం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.‘నాడు దక్షిణాఫ్రికాపై (2024లో) కప్ గెలవగానే... ఇకమీదట భారత్ తరఫున ఏ టోర్నీలో బరిలోకి దిగినా... జట్టు గెలవడానికే ఆడతాను. ట్రోఫీని సగర్వంగా ఎత్తుతాను అని నా మనసుకు నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు కివీస్పై విజయంతో నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు.నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ఐసీసీ టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. నిన్నటి నుంచే మేమే ఛాంపియన్లమని నాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే నాకు లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఆ ప్రపంచకప్ (2024) సమయంలో తాను ఎన్నో వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యానని చెప్పాడు. అందుకే ఇతరత్రా విషయాల్ని పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టేందుకు స్వీయ వాగ్దానం చేసుకున్నట్లు చెప్పాడు.చదవండి: T20 WC 2026: పాపం పాకిస్తాన్..! మరోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్ -
T20 WC 2026 Final: అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించాడు..!
నిన్న (మార్చి 8) జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో పొట్టి ప్రపంచకప్ను (2024, 2026), ఓవరాల్గా మూడో పొట్టి ప్రపంచకప్ను (2007, 2024, 2026), మొత్తంగా ఐదో ప్రపంచకప్ను (1983, 2011 (వన్డే), 2007, 2024, 2026 (టీ20)) సాధించింది.ఫైనల్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో చెలరేగి ఏకపక్ష విజయాన్ని సాధించారు. ముఖ్యంగా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించారు. పవర్ ప్లేలో భారత బ్యాటర్లు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ న్యూజిలాండ్ బౌలర్లను ఊచకోత కోశారు.వరుస వైఫల్యాల తరువాత ఈ మ్యాచ్లో అభిషేక్ విలయతాండవం చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ తన ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఉన్న ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ను అతను సహచరుడు శివమ్ దూబే నుంచి అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడినట్లు పేర్కొన్నాడు.అభిషేక్ మాటల్లో.. ఇవాళ నేను శివమ్ దూబే బ్యాట్తో ఆడాను. ఉదయం ఏదో కొత్తగా ప్రయత్నించాలని అనిపించింది. శుభ్మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో దూబే దగ్గరికి వెళ్లి అతని బ్యాట్ తీసుకున్నానని చెప్పాడు. ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి ఆరంభ మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా పేలవ ప్రదర్శనలు చేశాడు. అయితే కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి భారత్ భారీ స్కోర్ చేయడానికి పటిష్ట పునాది వేశాడు. సంజూ శాంసన్తో కలిసి అతను నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ దశనే మార్చేసింది. ఇలాంటి కీలక ఇన్నింగ్స్ను అతను అరువు తెచ్చుకున్న బ్యాట్తో ఆడటం విశేషం. అభిషేక్కు ముందు నుంచి సెంటిమెంట్లు ఎక్కువ. ఇదే ప్రపంచకప్లో వరుసగా విఫలమవుతున్నాడని ఓ మ్యాచ్లో సిరాజ్ జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. అంతకుముందు కూడా టీమిండియా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాట్తో పలు సందర్భాల్లో ఆడాడు. ఫైనల్గా ఫైనల్లో అరువు తెచ్చుకున్న బ్యాట్తో అరిపించి, భారత్ జగజ్జేతగా అవతరించడంలో తనవంతు పాత్ర పోషించాడు. -
ఫైనల్కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ది కీలక పాత్ర. అభిషేక్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు.ఏమి జరిగిందంటే?ఫైనల్కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిషన్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిషన్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్కతాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించని సంఘటన జరిగింది. వారిద్దరి మరణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విషయంపై కిషన్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జరిగిపోయింది. మేము చాలా బాధలో ఉన్నాము అని అన్నారు. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్కు హాజరావ్వాల్సి ఉండేది. కానీ తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కారణంగా ప్రణవ్ కోల్కతాలో ఉండిపోయారు. మ్యాచ్ అనంతరం కిషన్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇప్పుడు నన్ను ఛాంపియన్గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధగా ఉందని కిషన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే -
‘తుదిజట్టులో అతడు లేకుంటే టీమిండియాకు ఓటమే’
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా సత్తా చాటింది. సమిష్టి ప్రదర్శనతో రాణించి న్యూజిలాండ్ను మట్టికరిపించింది. అహ్మదాబాద్లో కివీస్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ముచ్చటగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్పాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత తుదిజట్టులో సంజూ శాంసన్ లేకపోయి ఉంటే.. సూర్య సేన ప్రయాణం ఇక్కడిదాకా సాగేది కాదన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..తుదిజట్టులో లేకపోయి ఉంటే..‘‘ఈ ప్రపంచకప్ టోర్నీలో.. ఒకవేళ సంజూ శాంసన్ గనుక భారత తుదిజట్టులో లేకపోయి ఉంటే.. టీమిండియా ట్రోఫీ గెలిచేది కాదు. వెస్టిండీస్తో సూపర్-8లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.ఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ అత్యద్భుత రీతిలో బ్యాటింగ్ చేశాడు. ఫైనల్లోనూ ఇదే పునరావృతం చేసి ముచ్చటగా, వరుసగా మూడో భారీ హాఫ్ సెంచరీ సాధించాడు. నిజానికి తన కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి.అయినా సరే అతడు కఠినంగా శ్రమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాడు. అందుకే ఆ దేవుడు అతడి కష్టానికి తగిన గుర్తింపు వచ్చేలా చేశాడు. సంజూ హార్డ్వర్క్కు లభించిన స్వీటెస్ట్ రివార్డు ఇది’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్పై ప్రశంసలు కురిపించాడు.నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపంకాగా టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందే తుదిజట్టులో సంజూ చోటు కోల్పోయాడు. అయితే, నమీబియాతో మ్యాచ్కు అభిషేక్ శర్మ కడుపు నొప్పి వల్ల దూరం కాగా మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. అనంతరం జింబాబ్వేతో మ్యాచ్లోనూ ఆడాడు.అయితే, నాకౌట్ మ్యాచ్లలో సంజూ విశ్వరూపం చూపించాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇంగ్లండ్తో సెమీస్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్All yours, Sanju! You’ve earned every bit of it! ❤️#T20WorldCup #INDvNZ pic.twitter.com/Ya4aJeeyyL— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
T20 WC Final: రవిశాస్త్రికి ఏమైంది?
క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ కామెంటేటర్గా టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రికి పేరుంది. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఛలోక్తులు, చణుకులు విసరడంలో అతడు దిట్ట. ఎన్నో చిరస్మరణీయ విజయాలు, అద్భుతమైన క్షణాలను తన వ్యాఖ్యానంతో మరింత గుర్తుండిపోయేలా చేసిన ఘనత అతడిది.ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్కప్లో సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్లో.. నాటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్.. ధోని సిక్స్ బాది విజయాన్ని ఖరారు చేయగానే.. ‘‘ఎంఎస్ ధోని తనదైన శైలిలో ముగింపు ఇచ్చాడు( "MS Dhoni finishes off in style" )’’ అన్న రవిశాస్త్రి మాటలు ఇప్పటికీ.. క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమ్రోగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.అంతటి రవిశాస్త్రి కామెంట్రీలోనూఅయితే, అంతటి రవిశాస్త్రి కామెంట్రీలో కూడా కొన్నిసార్లు తప్పులు దొర్లడం సహజం. టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ సందర్భంగా అతడు చేసిన పొరపాటు నెట్టింట ట్రోలింగ్కు కారణమైంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.టాపార్డర్ దుమ్ములేపడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు సాధించింది. తద్వారా పొట్టి ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ను.. భారత్ 159 పరుగులకే ఆలౌట్ చేసింది.తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతోకివీస్ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లోనే.. అక్షర్ పటేల్ తొలి వికెట్ తీసి శుభారంభం అందించగా.. అభిషేక్ శర్మ బౌలింగ్లో జేకబ్ డఫీ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ పట్టడంతో న్యూజిలాండ్ కథ ముగిసింది. అయితే, తిలక్ క్యాచ్ అందుకున్న సమయంలో రవిశాస్త్రి.. న్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది అని కామెంట్రీలో చెప్పాడు.అద్భుతమైన ప్రదర్శనఆ వెంటనే తప్పును గ్రహించి.. ‘‘నిజానికి అంతా అయిపోయింది.. టీమిండియా మూడోసారి ప్రపంచకప్ గెలిచింది. వరుసగా రెండుసార్లు ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాదు.. సొంతగడ్డపై టీ20 వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ప్రదర్శన’’ అని రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు.వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియాకు టైటిల్ కోల్పోయిన వేదికపైనే.. ఇప్పుడు టీ20 వరల్డ్కప్ గెలిచి సత్తా చాటిందని కొనియాడాడు. రవిశాస్త్రి కామెంట్రీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: సంజూ, ఇషాన్ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ మాజీ క్రికెటర్Let the celebrations begin 🤩India are #T20WorldCup 2026 champions 🏆 pic.twitter.com/zGgQtwODwH— ICC (@ICC) March 8, 2026 -
అర్ష్దీప్.. ఇదేనా నీ సంస్కారం? ఫ్యాన్స్ ఫైర్
టీ20 వరల్డ్కప్-2026 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించిన భారత్ మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది. అయితే ఈ తుది పోరులో టీమిండియా పేసర్ అర్ష్దీప్ సింగ్ క్రీడా స్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడు. మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్తో అర్ష్దీప్ గొడవపడ్డాడు.అసలేమి జరిగిందంటే?న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో తొలి రెండు బంతులను మిచెల్ భారీ సిక్సర్లగా మలిచాడు. అదే ఓవర్లో ఐదో బంతికి నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు మిచెల్ ఆడాడు. అయితే ఫాలో త్రులో బంతిని అందుకున్న అర్ష్దీప్ కోపంతో వికెట్ల వైపు త్రో చేశాడు.అయితే బంతి నేరుగా వెళ్లి మిచెల్కు బలంగా తాకింది. క్రీజులో ఉన్నప్పటికి తనపైకి బంతి విసిరడంతో మిచెల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. అర్ష్దీప్ వైపు కోపంగా చూస్తూ, గట్టిగా అరుస్తూ అతని వైపు వెళ్లాడు. ఆ సమయంలో అర్ష్దీప్ మొదట క్షమాపణ చెప్పకుండా వెనక్కి నడవడంతో మిచెల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని మిచెల్కు సర్దిచెప్పాడు. అంపైర్ కూడా అర్ష్దీప్ను పిలిచి హెచ్చరించాడు. అయితే ఓవర్ ముగిసిన తర్వాత అర్ష్దీప్ స్వయంగా మిచెల్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది.కానీ అర్ష్దీప్ ప్రవర్తనను భారత అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. సారి చెప్పినా, అర్ష్దీప్ అలా చేయడం సరికాదు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ తన 4 ఓవర్లలో కోటాలో32 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.చదవండి: T20 WC 2026: టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?Rohit Sharma to Arshdeep Singh regarding Daryl Mitchell incident🎙;Paaji !! Since when do you start doing so much sledging😭❤🔥pic.twitter.com/5l49estQO4— Gillfied⁷ (@Gill_Iss) March 8, 2026 -
టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. ప్రైజ్మనీ ఎన్ని కోట్లంటే?
పొట్టి ఫార్మాట్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి చాటి చెప్పింది. టీ20 ప్రపంచకప్-2026 విజేతగా సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు నిలిచింది. గతంలో చేదు జ్ఞాపకాలు మిగిల్చిన చోట మన జట్టు అద్భుతాలు సృష్టించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తుదిపోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించిన టీమిండియా.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.ఈ తుది పోరులో భారత జట్టు ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. ఈ చారిత్రత్మక విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాన్ని దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత్కు ఎంత ప్రైజ్ మనీ దక్కిందో ఓసారి పరిశీలిద్దాం.ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?విజేత టీమిండియాకు రూ.27.48 కోట్ల నగదు బహుమతి లభించింది. టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధికం . అదేవిధంగా రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు రూ.14.65 కోట్ల ప్రైజ్మనీ దక్కనుంది. సెమీఫైనలిస్ట్స్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సుమారు రూ. 7.24 కోట్లు అందుకోనున్నాయి. గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయిన ప్రతి జట్టుకు దాదాపు రూ. 2.29 కోట్లు లభించనుంది. 2024 టీ20 వరల్డ్ కప్తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం వరకు భారీగా పెంచారు. ఐసీసీ ఏకంగా ఈ ఏడాది వరల్డ్కప్ ప్రైజ్మనీని రూ.123 కోట్లగా నిర్ణయించింది. బీసీసీఐ సైతం భారత జట్టుకు భారీ క్యాష్ రివార్డును ప్రకటించనుంది.చదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్ -
అబ్బా.. అదొక కిల్లర్ కాంబో: ధోని పోస్ట్ వైరల్
టీమిండియా చరిత్ర పునరావృతం చేసింది. బార్బడోస్ వేదికగా 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్.. తాజాగా ఆదివారం నాటి ఫైనల్లోనూ జయభేరి మోగించింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్ను ఏకంగా 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సాధించింది.ఈ నేపథ్యంలో యావత్ భారతావని సూర్య సేన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కెప్టెన్, టీమిండియాకు తొలి టీ20 వరల్డ్కప్ అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తనదైన శైలిలో స్పందించాడు. జట్టుతో పాటు.. ఒకప్పటి సహచర ఆటగాడు, ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ గురించి ఆసక్తికర పోస్టు చేశాడు.కన్నులపండుగ‘‘అహ్మదాబాద్లో చరిత్ర సృష్టించబడింది. టీమిండియాకు శుభాకాంక్షలు. సహాయక సిబ్బంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత క్రికెట్ అభిమానులకు అభినందనలు. ఈరోజు టీమిండియా ఆట కన్నులపండుగగా సాగింది.అబ్బా అదొక కిల్లర్ కాంబోకోచ్ సాహెబ్.. మీ ముఖంపై చిరునవ్వు ఎంతో గొప్పగా ఉంటుంది. గంభీరమైన ముఖంలో ఆ నవ్వు.. అబ్బా అదొక కిల్లర్ కాంబో. మీరు అద్భుతం చేశారు. ఈ విజయాన్ని ఆస్వాదించండి బాయ్స్. ఇక బుమ్రా గురించి కూడా ఒక మాట చెప్పాలిగా.. అతడొక చాంపియన్ బౌలర్’’ అని ధోని ఇన్స్టా వేదికగా రాసుకొచ్చాడు. ఇందుకు టీమిండియా ట్రోఫీతో ఉన్న ఫొటో జతచేశాడు. ధోని షేర్ చేసిన ఈ పోస్టు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆరు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఏకైక కెప్టెన్గాకాగా ఐసీసీ 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్కప్ను ధోని సారథ్యంలో భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్కప్ (ఇందులోనూ గంభీర్ సభ్యుడే), 2013లో చాంపియన్స్ ట్రోఫీని ధోని అందించాడు. తద్వారా భారత్కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్గా కొనసాగుతున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్👉వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్👉టాస్: న్యూజిలాండ్.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 255/5(20)👉న్యూజిలాండ్ స్కోరు: 159(19)👉ఫలితం: 96 పరుగుల తేడాతో భారత్ జయభేరిచదవండి: అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్The ICC Men's #T20WorldCup 2026 Champions, everyone! ⭐️ ⭐️ ⭐️#INDvNZ #TeamIndia #Champions pic.twitter.com/5FFrQvYcww— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
#T20WorldCup2026final : టీమిండియా విక్టరీ మూమెంట్ హైలైట్స్.. (ఫొటోలు)
-
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
టీ–20 వరల్డ్ కప్ : హైదరాబాద్ లో క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి: సాంట్నర్
మరోసారి దురదృష్టం.. స్వయంకృతాపరాధానికి మూల్యం.. 2015. 2019, 2021, 2026.. నాలుగు సందర్భాల్లోనూ ఐసీసీ టోర్నీ ఫైనల్స్కు చేరుకున్న న్యూజిలాండ్ జట్టు రన్నరప్తోనే సరిపెట్టుకుంది. కీలక సమయంలో ఒత్తిడికి గురై.. మరోసారి ‘చోకర్స్’గా మిగిలిపోయింది.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన కివీస్.. ‘రెండోస్థానం’ అనే చేదు ముద్రను పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ విచారం వ్యక్తం చేశాడు. అయితే, తమ జట్టు ఆట పట్ల మాత్రం తాను సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము‘‘అవును.. ఇది జరిగిపోయింది. అయినా మా జట్టు ప్రయాణం ఇక్కడిదాకా సాగినందుకు గర్వంగా ఉంది. మా వాళ్లు గొప్పగా ఆడారు. టోర్నీ ఆసాంతం మేము సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రతీ దశలోనూ ఆటంకాన్ని అధిగమించి ఇక్కడిదాకా వచ్చాము.ఈరోజు కూడా గొప్పగా ఆడిన జట్టు చేతిలోనే ఓడిపోయాము. స్టేడియం మొత్తం నీలి వర్ణమే. వారి సాక్షిగానే ఓటమిని ఆహ్వానించాము. మేము ఇక్కడ ఫేవరెట్ జట్టు కాదు.ఏదేమైనా సొంతగడ్డపై సూర్యకుమార్ సేన అద్భుతం చేసింది. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మా జట్టులోని ఒక్కో సభ్యుడు ఒక్కో సందర్భంలో ముందుకు వచ్చి జట్టును గెలిపించాడు. సూపర్-8, సెమీ ఫైనల్లో మేము గొప్పగా ఆడాము.ముందుగా చెప్పినట్లు గొప్ప జట్టు చేతిలోనే ఫైనల్ ఓడిపోయాము. మా వాళ్లు నాకు గర్వకారణం’’ అని సాంట్నర్ కివీస్ జట్టును ప్రశంసించాడు. ఇక తమ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ..అదే మా కొంప ముంచింది.. అందుకే ఈ ఓటమి‘‘పవర్ ప్లేలో వాళ్లు ఒక్క వికెట్ కోల్పోకుండా ఏకంగా 90 పరుగుల మేర అసాధారణ స్కోరు నమోదు చేశారు. మేము మాత్రం పవర్ప్లేలో సుమారుగా 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అక్కడే చాలా వెనుకబడి పోయాము. 256 పరుగుల మేర భారీ స్కోరు ఛేదనలో ఇలాంటి పరిస్థితి రావడం అతి పెద్ద సవాలు’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.భారత ఓపెనర్ల విధ్వంసంకాగా న్యూజిలాండ్తో ఫైనల్లో టీమిండియా పవర్ ప్లే (తొలి ఆరు ఓవర్లు)లో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు సాధిస్తే.. న్యూజిలాండ్ 52 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ విధ్వంసం కారణంగా భారత్కు పవర్ ప్లేలో ఈ మేర స్కోరు సాధ్యమైంది. పవర్ ప్లే ముగిసేసరికి సంజూ 17 బంతుల్లో 33, అభిషేక్ 19 బంతుల్లో 51 పరుగులు చేశారు. ఓవరాల్గా సంజూ 89 పరుగులు సాధించగా.. అభిషేక్ 52 పరుగులు చేశాడు. చదవండి: Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డులక్కీ కెప్టెన్!CHAK DE, INDIAAAAA! 🇮🇳Ladies & gentlemen, presenting the three-time ICC Men's T20 World Cup champions 🏆🏆🏆#T20WorldCup #INDvNZ pic.twitter.com/0hb7APCcD2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
వాళ్లు అద్భుతం.. తదుపరి లక్ష్యం గోల్డ్ మెడల్: సూర్యకుమార్
టీమిండియా అద్భుతం చేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ సాధించింది. తమ ఖాతాలో మూడో పొట్టి వరల్డ్కప్ ట్రోఫీని జమచేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ ఏకంగా 96 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. ఈ ఘనత సాధించింది.చరిత్ర పుటల్లోకి ఈ అద్వితీయ గెలుపుతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) దిగ్గజాల సరసన నిలిచాడు. భారత్కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni), రోహిత్ శర్మ (Rohit Sharma)లతో పాటు సూర్య పేరు కూడా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత సూర్య రిటైర్ అవుతాడనే ఊహాగానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో విజయానంతరం సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ తదుపరి లక్ష్యం ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలవడమేనని పేర్కొన్నాడు. తద్వారా ఇప్పుడే తాను రిటైర్ కాబోనని 35 ఏళ్ల సూర్య సంకేతాలు ఇచ్చాడు.గోల్డ్ మెడల్ లక్ష్యంకాగా 2028లో లాస్ ఏంజెలెస్ వేదికగా విశ్వ క్రీడలు జరుగనున్న సంగతి తెలిసిందే. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ తదుపరి ఎడిషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సూర్య మాట్లాడుతూ.. ‘‘తదుపరి ఒకే ఏడాదిలో టీ20 వరల్డ్కప్తో పాటు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యం’’ అని పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో.. ‘‘ఈ సంతోషం నుంచి తేరుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుంది.వాళ్లు అద్భుతంసంజూ శాంసన్, అభిషేక్ శర్మ ప్రత్యేక ఆటగాళ్లు. వారు ఏదైనా అద్భుతం చేయగలరని అనుకున్నాం. ఫైనల్లో ఆ పని చేసి చూపించారు. ఇక మా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. తరానికొక్క అరుదైన బౌలర్. అతడిని జాతీయ సొత్తు అని పిలవవచ్చు. జట్టును గెలిపించేందుకు ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా.. జట్టులోని ఇలా ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను చక్కగా నెరవేర్చారు’’ అని సూర్య ప్రశంసలు కురిపించాడు.చదవండి: లక్కీ కెప్టెన్!From World Cup glory to the next challenge, #SuryakumarYadav opens up about what lies ahead for #TeamIndia.🇮🇳❤️#T20WorldCup #INDVNZ pic.twitter.com/5NPw2aNK5X— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు.. విశ్వవిజేతగా భారత్
అహ్మదాబాద్లో భారత పురుషల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో.. ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్కప్-2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ముద్దాడింది.తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన జట్టుగా మెన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ గెలిచిన జట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్ 2007,2024లో విశ్వవిజేతలగా నిలవగా.. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మరోసారి కప్ కొట్టి సత్తాచాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.దంచి కొట్టిన భారత బ్యాటర్లుఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత భారత్ను బ్యాటింగ్కు అహ్హనించాడు. అయితే శాంట్నర్ తీసుకున్న నిర్ణయం మిస్ ఫైర్ అయింది. భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.సంజూ, అభిషేక్ తొలి వికెట్కు 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఓ దశలో భారత్ 300 పరుగుల మార్క్ అందుకునేలా కన్పించింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికల పడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ మూడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (52) టాప్ స్కోరర్ నిలిచాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలవగా.. సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అవార్డు లభించింది. Make it THREEEEEEE! 🏆🏆🏆#TeamIndia have repeated & defeated history by becoming the first team to 👇▪️ Win back-to-back titles▪️Three titles▪️Win the title at home#T20WorldCup #INDvNZ pic.twitter.com/bQlm5t0D3k— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్... ఐపీఎల్-2026 ప్రారంభం ఎప్పుడంటే?
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఐపీఎల్-2026 సీజన్ ప్రారంభ తేదీ మారింది. గతంలో ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఈ టీ20 క్రికెట్ టోర్నీ మార్చి 28 నుంచి షురూ కానుంది. ఈ విషయాన్ని భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది.ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్లో ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లను నిలిపివేశారు. ఇప్పుడు కర్ణాటక సర్కార్ నుంచి అనుమతి లభించడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మళ్లీ మొదలు కానుంది. ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లలో 5 మ్యాచ్లను బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది. కాగా ఫైనల్ లేదా ఓ ప్లే ఆఫ్ మ్యాచ్కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. త్వరలోనే పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలింగ్ను చితక్కొడుతూ భారత టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడిన టీమిండియా.. కివీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది.అభిషేక్. సంజూ ధనాధన్గత మ్యాచ్లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న ఓపెనర్ అభిషేక్ శర్మ.. టైటిల్ పోరులో బ్యాట్ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులు సాధించాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇక మరో ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెమీస్ మాదిరే సెంచరీకి మరోసారి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026ఇషాన్ సైతంవన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కాగా.. హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 18) నిరాశపరిచాడు. తిలక్ వర్మ 6 బంతుల్లో 8 పరుగులతో అజేయంగా నిలవగా.. శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్లు బాది 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలా ఒక వికెట్ పడగొట్టారు.చరిత్ర సృష్టించిన టీమిండియాటీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్తో టైటిల్ పోరులో 255/5 స్కోరు నమోదు చేసిన టీమిండియా.. గత ఎడిషన్లో తాను సృష్టించిన రికార్డును.. తాజాగా బద్దలు కొట్టింది. కాగా టీ20 ప్రపంచకప్-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా 176/7 నమోదు చేసింది.టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్లు👉టీమిండియా- 2026లో న్యూజిలాండ్పై 255/5👉టీమిండియా- 2024లో సౌతాఫ్రికాపై 176/7👉ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్పై 173/2👉న్యూజిలాండ్- 2021లో ఆస్ట్రేలియాపై 172/4👉వెస్టిండీస్- 2016లో ఇంగ్లండ్పై 161/6👉టీమిండియా- 2007లో పాకిస్తాన్ 157/5.చదవండి: టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు -
ఫైనల్లో ఊచకోత.. సంజూ శాంసన్ వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్కప్-2026ను టీమిండియా స్టార్ ఓపెనర్గా సంజూ శాంసన్ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో శాంసన్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.సంజూ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్లో ఇప్పటివరకు 4 సిక్స్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్, క్వింటన్ డికాక్, గుర్బాన్, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్లో మూడు సిక్స్లు బాదారు.👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్(21)ను సంజూ అధిగమించాడు.👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. శాంసన్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
Final: ఊచకోత.. టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు
భారత టీ20 ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో న్యూజిలాండ్తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.CHETTA POWER! 💪Outrageous six from Sanju Samson as 21 runs came off Matt Henry's over! 🥶ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/LGg4snOIuP— Star Sports (@StarSportsIndia) March 8, 2026దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్ జోరు కొనసాగించారు. అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.Cometh the hour, cometh the man! 😍Abhishek Sharma brings up his fifty in just 18 balls, fastest of the tournament! 💪ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/mcmGhlxJxe— Star Sports (@StarSportsIndia) March 8, 2026మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్.. రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్ తొలి వికెట్కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.కాగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ స్టార్లు కమ్రాన్ అక్మల్- షాజైబ్ హసన్ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. -
ఫైనల్లో అభిషేక్ శర్మ విధ్వంసం.. ఫాస్టెస్ట్ ఫిప్టీ
టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక మ్యాచ్లో తన ఫామ్ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్కు చెక్ పెడుతూ కివీస్ బౌలర్లను ఉతికారేశాడు.నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్కప్ నాకౌట్స్ మ్యాచ్లలో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన ప్లేయర్గా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, ఇంగ్లండ్ యువ సంచలనం జాకబ్ బెతల్ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్కప్ సెమీఫైనల్స్లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్తో వీరిద్దరిని అభిషేక్ అధిగమించాడు.ఓవరాల్గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ స్కోర్ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది.🚨 ABHISHEK SHARMA SELECTION UNDER QUESTION 🚨Fans said – “Why is GG wasting a spot for this blind slogger?”Management said – Abhishek has only 89 runs in 7 matches with 3 ducks, but we won’t change the winning combination for the Final! 🤯pic.twitter.com/05OFSZf4PT— Sam (@Cricsam01) March 7, 2026 -
T20 WC Final: అదృష్టం!.. భయపెడుతున్న మరో సెంటిమెంట్
న్యూజిలాండ్తో టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. నంబర్ వన్ బౌలర్ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.అదే వేదిక.. అదే అంపైర్ఇదిలా ఉంటే.. భారత్- కివీస్ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్కు అంపైర్గా వ్యవహరించిన రిచర్డ్ ఇల్లింగ్వర్త్.. తాజా ఫైనల్కు కూడా అంపైర్ కావడం గమనార్హం.అదృష్టం ఏమిటంటేఇక ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. కాగా టీమిండియా కివీస్తో ఫైనల్లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ కోల్ మెకాంచీ స్థానంలో జేకబ్ డఫీని తీసుకువచ్చింది. Classic Ravi Shastri energy at the toss! 😍🚨 The coin toss goes Mitchell Santner's way & New Zealand will bowl first in the final! ✌️ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉 https://t.co/Tz1DBSb4nT pic.twitter.com/g8UkcXpNKo— Star Sports (@StarSportsIndia) March 8, 2026తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ . -
గతం గురించి ఆలోచించడం లేదు.. ఇది మాకు చాలా స్పెషల్: సూర్య
టీ20 ప్రపంచకప్-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్-భారత్ తలపడతున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హనించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. మెక్కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్లో ఆడిన టీమ్నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.2023 వరల్డ్కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ -
న్యూజిలాండ్-భారత్ ఫైనల్.. టిక్కెట్ ధర ఎన్ని లక్షలంటే?
టీ20 వరల్డ్కప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.బుక్మై షో యాప్ ద్వారా టికెట్లను విక్రయించారు. ప్రారంభ టిక్కెట్ ధర రూ. 2 వేలు కాగా.. గరిష్ట ధర రూ. 75000గా నిర్ణయించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానులను ధళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్లో ఒక్కో టిక్కెట్ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. అడ్డదారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోటల్లో ఒక రోజుకు ధర రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ క్రేజ్ కారణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు. -
టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్స్గా భారత్
వరల్డ్ ఛాంపియన్గా భారత్టీ20 వరల్డ్కప్-2026 ఛాంపియన్గా భారత్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడోసారి పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికలపడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.UPDATESన్యూజిలాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన శాంట్నర్.. బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.బుమ్ బుమ్ బుమ్రా..16వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కివీస్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి నీషమ్, నాలుగో బంతికి హెన్రీ క్లీన్ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్: 143/8ఆరో వికెట్ డౌన్.. మిచెల్ ఔట్124 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్.. అక్షర్పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.న్యూజిలాండ్ ఐదో వికెట్ డౌన్52 పరుగులు చేసిన టిమ్ సీఫర్ట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు కివీస్ స్కోర్: 80-5కివీస్ నాలుగో వికెట్ డౌన్న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన చాప్మన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఔటయ్యాడు.సీఫర్ట్ హాఫ్ సెంచరీఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి టిమ్ సీఫర్ట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 7 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.న్యూజిలాండ్ మూడో వికెట్ డౌన్న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.కివీస్ రెండో వికెట్ డౌన్రచిన్ రవీంద్ర రూపంలో కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవీంద్ర.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఔటయ్యాడు.కివీస్ తొలి వికెట్ డౌన్256 పరుగుల భారీ లక్ష్యంంతో బరిలోకి దిగిన కివీస్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న ఫిన్ అలెన్.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 3 ఓవర్లకు కివీస్ స్కోర్: 32/1న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే?టీ20 వరల్డ్కప్-2026లో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 89), అభిషేక్ శర్మ(52), ఇషాన్ కిషన్(54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-4హార్దిక్ 12, తిలక్ 5 పరుగులతో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్15.6: సూర్యకుమార్ డకౌట్. నీషమ్ బౌలింగ్లో రచిన్కు క్యాచ్ ఇచ్చి అవుట్. స్కోరు: 204-4(16). క్రీజులోకి తిలక్ వర్మ. హార్దిక్ ఒక పరుగుతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన భారత్15.5: నీషమ్ బౌలింగ్లో మార్క్ చాప్మన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇషాన్ (25 బంతుల్లో 54).రెండో వికెట్ కోల్పోయిన భారత్15.1: జేమ్స్ నీషమ్ బౌలింగ్లో సంజూ మెకాంచీ (సబ్స్టిట్యూట్ ఫీల్డర్)కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్స్లు కొట్టి 89 పరుగులు సాధించాడు.ఇషాన్ హాఫ్ సెంచరీ23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ హాఫ్ సెంచరీ14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-1సంజూ 44 బంతుల్లో 88, ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.శాంసన్ హాఫ్ సెంచరీసంజూ శాంసన్ ఫైనల్లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 161 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన భారత్అభిషేక్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్లో టిమ్ సీఫర్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్లలో విఫలమైన అభిషేక్ ఈసారి 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు.పవర్ ప్లేలో టీమిండియా రికార్డు స్కోరు: 92-0(6)అభిషేక్ 19 బంతుల్లో 51, సంజూ శాంసన్ 17 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీకేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్ధ శతకం బాదాడు. రికార్డు అలర్ట్టీ20 ప్రపంచకప్ ఫైనల్లో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించిన భారత జోడీ సంజూ- అభిషేక్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లుఫైనల్ మ్యాచ్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(23), సంజూ శాంసన్(24) దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.తుదిజట్లుభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీటీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నాయి. ఊర్రూతలూగేలా..పాప్ స్టార్ రికీ మార్టిన్ క్లోజింగ్ సెర్మనీలో మారియా సాంగ్తో ప్రేక్షకులను అలరించాడు. డాన్సులతో ఉర్రూతలూగించాడు. అంతకుముందు సుఖ్బీర్ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.#WATCH | Gujarat: Team India leaves from their hotel in Ahmedabad for Narendra Modi Stadium where they will face New Zealand in #ICCT20WorldCupfinal this evening. pic.twitter.com/X2sjnwXyTb— ANI (@ANI) March 8, 2026ధోని సైతం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం అహ్మదాబాద్కు చేరుకున్నారు.#WATCH | Gujarat | Former Captain of the Indian Cricket Team Mahendra Singh Dhoni arrives at Ahmedabad ICC Men's T20 World Cup 2026 final between India and New Zealand, to be played today at the Narendra Modi Stadium. pic.twitter.com/5Q6gNuIcsQ— ANI (@ANI) March 8, 2026 సతీ సమేతంగా రోహిత్సతీ సమేతంగా భారత మాజీ కెప్టెన్, టీ20 ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ అహ్మదాబాద్కు విచ్చేశాడు.#WATCH | Gujarat: Former Captain of the Indian Cricket Team, Rohit Sharma and his wife Ritika Sajdeh arrive in Ahmedabad to watch the India vs New Zealand #ICCT20WorldCup final at Narendra Modi Stadium this evening. pic.twitter.com/iXVibFowWH— ANI (@ANI) March 8, 2026 -
మరి కొన్ని గంటల్లో ఫైనల్.. టీమిండియా సంచలన నిర్ణయం!?
టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు మరి కొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా తెరలేవనుంది.ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి మూడో సారి టైటిల్ను ముద్దాడాలని భారత్ భావిస్తుంటే.. కివీస్ సైతం తొలి టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.వరుణ్పై వేటు..?‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టనున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు పలు రిపోర్ట్లు వెల్లడించాయి. ఫైనల్ మ్యాచ్కు ముందు కుల్దీప్ నెట్స్లో తీవ్రంగా శ్రమించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వరుణ్ చక్రవర్తి మాత్రం నామమాత్రపు ప్రాక్టీస్కే పరిమితం కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ తమిళనాడు స్పిన్నర్ లీగ్ స్టేజ్లో రాణించినప్పటికి.. కీలకమైన సూపర్-8 దశలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.సెమీఫైనల్లో కూడా ఓ వికెట్ పడగొట్టినప్పటికి పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో కుల్దీప్ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ మెనెజ్మెంట్ భావిస్తుందంట. వరుణ్ కంటే కుల్దీప్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. ఫ్లాట్ పిచ్పై కూడా బంతిని తిప్పగలిగే సత్తా కుల్దీప్ యాదవ్కు ఉంది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు సైతం కుల్దీప్ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు. మరి టీమ్ మెనెజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఆడాడు.భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్ -
T20 WC Final: మారవా?.. నీ అంచనా తప్పుతుంది!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. సూర్యకుమార్ సేనపై మిచెల్ సాంట్నర్ బృందానిదే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు. కివీస్ జట్టు సమిష్టిగా రాణిస్తుంటే.. టీమిండియా ఇంకా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటమే ఇందుకు కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు టైటిల్ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే.. పాక్ మాజీ పేసర్ ఆమిర్ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.పదే పదే అదే మాటలీగ్ దశలో సూర్య సేన అజేయంగా నిలిచినప్పటికీ.. అది అదృష్టం వల్లేనని ఆమిర్ (Mohammad Amir) అన్నాడు. ఇక సూపర్-8 దశలోనూ టీమిండియా రాణించలేదని సెమీస్కు చేరలేదని వాదించాడు. అయితే, భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టడమే కాకుండా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్ చేరింది.న్యూజిలాండ్ గెలుస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా మొహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘న్యూజిలాండ్ జట్టు సమిష్టి ప్రదర్శతో సెమీస్లో సౌతాఫ్రికాను ఓడించింది. కానీ టీమిండియా.. జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ వంటి ఇద్దరు ఆటగాళ్ల కారణంగా ఈరోజు ఫైనల్లో ఉంది. వాళ్లిద్దరు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్కు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్ విభాగం టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టులో బుమ్రా తప్ప ఎవరూ ఫామ్లో లేరు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు.నీ అంచనా తప్పుతుందిఅయితే, బ్యాటింగ్ పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముందుగా చెప్పినట్లు న్యూజిలాండ్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా ఎక్కువగా బుమ్రా మీదే ఆధారపడుతోంది. కాబట్టి న్యూజిలాండ్దే గెలుపు అని విశ్వసిస్తున్నాను’’ అని మొహమ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆమిర్కు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. సూర్య సేన ఈసారి సమిష్టిగా రాణించి గెలిచి తీరుతుందని.. మరోసారి నీ అంచనా తప్పని నిరూపిస్తుందని పేర్కొంటున్నారు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC 2026: ఫైనల్కు ముందు టీమిండియాకు భారీ బూస్టప్
టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను, ఓవరాల్గా మూడో టైటిల్ సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్కు టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.ఓవరాల్గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్లు జరగ్గా.. 16 మ్యాచ్ల్లో భారత్, 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచాయి. మూడు మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి.ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్. భారత్ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. ఈ విషయం పలు సార్లు మిస్ ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు. -
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్..?
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (మార్చి 8) తుది సమరం జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్ వరుసగా తమ రెండో టైటిల్ను సాధిస్తుందా లేక న్యూజిలాండ్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరిస్తుందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.మండుటెండల్లో ఈ హీట్కు తోడు మరో సంచలన విషయం వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది. అదేంటంటే.. భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేటి ఫైనల్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడని సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్ గెలిచినా, గెలవకపోయినా సూర్య నిర్ణయం మారదని పలు కథనాలు వెలువడుతున్నాయి.వయసు పైబడటం (35), మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) అవకాశాలు లేకపోవడం చేత స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తరహాలోనే స్కై కూడా కెరీర్కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. రోహిత్, కోహ్లి టీ20 ప్రపంచకప్ 2024 గెలుపు తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడిన సూర్య.. ఈ ప్రపంచకప్కు ముందే తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఫామ్లో ఉన్నప్పుడే కెరీర్కు పుల్స్టాప్ పెడితే గౌరవంగా ఉంటుందన్న మరో భావన కూడా సూర్య రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు. నేటి ఫైనల్లో ఓ మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపుకు దోహదపడితే స్కై భారత కెప్టెన్గా తన కెరీర్కు న్యాయం చేసినట్లవుతుంది.రోహిత్ శర్మ తర్వాత భారత టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. కెప్టెన్గా అసమానమైన ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పైగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్ట భారీ సిరీస్ విజయాలు సాధించాడు. అతని కెప్టెన్సీ సక్సెస్ రేట్ 80 శాతానికి పైగా ఉందంటే, అతను ఏ రేంజ్లో విజయాలు సాధించాడో అర్దమవుతుంది. వ్యక్తిగతంగా విఫలమైనా, స్కై కెప్టెన్గా జట్టును విజయవంతంగా ముందుండి నడిపించాడు.స్కై రిటైర్మెంట్పై ఊహాగానాలు తప్పిస్తే.. ఇప్పటివరకు అతని నుంచి కానీ, బీసీసీఐ నుంచి కాని ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. ఈ విషయంపై సందిగ్దత వీడాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
సంజూ మాట!.. కోహ్లి మాదిరే విశ్వరూపం చూపిస్తాడా!
టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేక కిందామీదా పడింది టీమ్ ఇండియా. ముంబై వేదికగా గురువారం జరిగిన రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓవరాల్గా నాలుగోసారి, వరుసగా రెండోసారి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. అయితే, జట్టు విజయపథంలో ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.వాస్తవానికి అభిషేక్ శర్మకు ఈ టీ20 వరల్డ్ కప్ ఓ పీడకలలా మారింది. ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్ల్లో అతడు కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ స్టేజ్లో ఆడిన మూడు మ్యాచ్లలోనూ అభిషేక్.. కనీసం ఖాతా తెరవకుండానే డకౌటయ్యి వెనుదిరగడం గమనార్హం. జింబాబ్వేపై 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించినా.. ఆ తర్వాత వెస్టిండీస్, సెమీస్లో ఇంగ్లండ్పై మళ్ళీ విఫలమయ్యాడు. దీంతో ఫైనల్లో అభిషేక్ ప్లేస్లో ఫినిషర్ రింకూ సింగ్నైనా టీమ్లోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతమవుతుందన్న వాదన వినిపిస్తోంది.అయితే.. అభిషేక్ ఫామ్ లేమిపై సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఫైనల్లో అభిషేక్ దుమ్మురేపుతాడేమోనని అన్నాడు. కాగా.. గత టీ20 వరల్డ్కప్లోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత వరల్డ్కప్లో ఇలానే వరుస ఫెయిల్యూర్లతో ఆందోళన రేకెత్తించాడు. చివరికి సెమీస్లోనూ రాణించలేకపోయాడు.ఆ సమయంలో అప్పటి కెప్టెన్గా ఉన్న రోహిత్ సరిగ్గా ఇలాంటి కామెంట్లే చేశాడు. కోహ్లీ ఫైనల్లో ఖచ్చితంగా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్ అన్నట్టే కోహ్లీ ఫైనల్లో సౌతాఫ్రికాపై విజృంభించాడు. ఆసక్తికరంగా ఫైనల్లో అంతా విఫలమవగా కోహ్లీ ఒక్కడే ఆదుకున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో ఓపెనింగ్ బ్యాటర్ కోహ్లి 59 బంతుల్లో 76 పరుగులు సాధించాడు.దీంతో ఇప్పుడు సంజూ అన్నట్టు.. ఈసారి అభిషేక్ కూడా ఫైనల్లో విశ్వరూపం చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అదే జరిగితే అంతకంటే సంతోషం ఉండదు. చూడాలి మరి అభిషేక్ శర్మ అభిమానులతో పాటు యాజమాన్యం నమ్మకం నిలబెట్టుకుంటాడో లేదో!! -
T20 WC Final: సాంట్నర్కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సాంట్నర్ అబద్ధం చెబుతున్నాడని.. తమను కట్టడి చేయడం అంత తేలికేమీ కాదని చురకలు అంటించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్కు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం.. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతున్న అంశం చర్చనీయాంశంగా మారింది.ఎర్రమట్టి పిచ్!అహ్మదాబాద్లో ఈసారి ఎర్రమట్టి పిచ్ తయారు చేస్తున్నారని.. బ్యాటర్లకు అనుకూలించే వికెట్ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా 253 పరుగుల భారీ స్కోరు చేసినా.. లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఆఖరి బంతి వరకు పోరాడాల్సి వచ్చింది.220 పరుగులకే కట్టడి చేస్తేఈ పరిణామాల నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘అహ్మదాబాద్లో ఫ్లాట్ పిచ్ ఉంటుంది. టీమిండియాను 250కి బదులు 220 పరుగులకే కట్టడి చేస్తే.. మాకు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి’’ అని పేర్కొన్నాడు.అబద్ధం చెబుతున్నాడుఈ క్రమంలో శనివారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్.. సాంట్నర్కు గట్టిగానే ఇచ్చిపడేశాడు. ‘‘అతడు అబద్ధం చెబుతున్నాడు. మేము గొప్పగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తాం. 225 లేదంటే 250 పరుగులు చేస్తే బాగుంటుంది.అయితే, కొన్నిసార్లు అనుకున్న దాని కంటే వికెట్ భిన్నంగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే మేము ఆడాల్సి ఉంటుందిఇ. డ్రెస్సింగ్రూమ్లో కూర్చుని ఎంత స్కోరు చేయగలమని అంచనా వేయడం కష్టం. పిచ్ డిమాండ్కు తగ్గట్లే ఆడాల్సి ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?
-
సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?
-
ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా
-
IND vs NZ: అభిషేక్ శర్మ వద్దు.. అతడిని ఆడించండి!
న్యూజిలాండ్తో ఫైనల్లో భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ నడుస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత కూడా అభిషేక్ శర్మను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కీలక మ్యాచ్కు ముందు తుదిజట్టులో మార్పులు చేసి రిస్క్ తీసుకోవద్దని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. వైఫల్యాలు అభిషేక్ శర్మ మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని.. కాబట్టి అతడికి విశ్రాంతినివ్వడమే ఉత్తమమని పేర్కొన్నాడు. ఇందుకు వెస్టిండీస్ ఆటగాళ్లను ఉదాహరిస్తూ పోలిక తెచ్చాడు.విశ్రాంతినివ్వాలి‘‘అభిషేక్ శర్మకు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వాలి. ఇప్పటికే అతడు చాలా మ్యాచ్లు ఆడేశాడు. అన్నింటిలోనూ విఫలం అయ్యాడు. ఫైనల్లో తుదిజట్టులో మార్పులు చేయడం ఏమంత హానికరం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎప్పటికప్పుడు ఇలాంటి మార్పులు సహజమే.టీమిండియాతో సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్.. ఫామ్లో లేని బ్రాండన్ కింగ్కు బదులు.. రోస్టన్ ఛేజ్ను ఓపెనర్గా ఆడించింది. బ్రాండన్రు ఐదు- ఆరు మ్యాచ్లు ఆడించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే కీలక మ్యాచ్ అయినా సరే అతడికి బ్రేక్ ఇచ్చారు.టీమిండియా కూడా ఆదిలో సంజూను పక్కన పెట్టింది. కీలక మ్యాచ్లలో ఆడించి అనుకున్న ఫలితం రాబట్టింది. అతడు గొప్ప ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. జట్టుకు ప్రయోజనం చేకూర్చాడు. భారత జట్టులో ఇప్పటికే ఎంతో మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు.రింకూను ఆడించండిటెస్టులు, రంజీ ట్రోఫీ, ఐపీఎల్.. ఇలా టోర్నీ ఏదైనా రింకూ సింగ్ పరుగులు రాబట్టగలడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ కీలక సమయాల్లో వికెట్లు కూల్చి జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ప్లేయర్లు డగౌట్లో కూర్చుని ఉండటం చూస్తే.. అభిషేక్ శర్మకు బదులు వీరిలో ఒకరిని ఆడించవచ్చు కదా అనిపిస్తుంది.అవును.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు బదులు డగౌట్లో కూర్చోబెడుతున్న రింకూ సింగ్ను తుదిజట్టులోకి తీసుకోండి. బాగా ఆడని ఆటగాడికి చోటు ఇస్తూ.. అద్భుతంగా ఆడే ప్లేయర్ను బెంచ్కే పరిమితం చేయడం సరికాదు. అభిషేక్ శర్మ గొప్ప నైపుణ్యాలు ఉన్న ఆటగాడే. కానీ ఐసీసీ టోర్నీలు అతడికి కొత్త. ఏదేమైనా సంజూతో అతడిని పోల్చవద్దు. సంజూతో పోలిక వద్దుఇప్పటికే సంజూ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. టాప్-10 బ్యాటర్లలో అతడూ ఉంటాడు’’ అని మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ఫైనల్లో అభిషేక్ శర్మను తప్పించి రింకూను ఫైనల్లో ఆడించాలని కైఫ్ సూచించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్- న్యూజిలాండ్ ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: హృదయాలు ముక్కలు చేస్తాం: సాంట్నర్
అహ్మదాబాద్ పిచ్పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఇప్పటి వరకు వికెట్ను పరిశీలించలేదని.. అయితే, ఫ్లాట్ పిచ్నే రూపొందించి ఉంటారని భావిస్తున్నామన్నాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల వరద ఖాయమని పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2026 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం భారత్- న్యూజిలాండ్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మిచెల్ సాంట్నర్ పలు విషయాలపై స్పందించాడు.హై స్కోరింగ్కు అవకాశంపిచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు మేము వికెట్ ఎలా ఉందో చూడలేదు. ఇప్పటికీ కవర్లు కప్పే ఉన్నాయి. అయితే, ఈ పిచ్ ఫ్లాట్గా ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ హై స్కోరింగ్కు అవకాశం ఉంటుంది’’ అని సాంట్నర్ (Mitchell Santner) పేర్కొన్నాడు.మా లక్ష్యం అదే..అదే విధంగా.. ‘‘టీమిండియాకు మద్దతుగా వచ్చే ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండేలా చేయడమే మా లక్ష్యం (Goal to silence the crowd). అందుకు అనుగుణంగానే మా ఆట ఉంటుంది. అయితే, క్రికెట్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. టీ20 క్రికెట్ వైవిధ్యంతో కూడుకున్నది.హృదయాలు ముక్కలు చేస్తాంఏదేమైనా సొంతగడ్డపై ఫైనల్ గెలవాలన్న ఒత్తిడి టీమిండియాపై కచ్చితంగా ఉంటుంది’’ అని సాంట్నర్ అన్నాడు. టోర్నీ ఆసాంతం తాము నిలకడగా ఆడామని.. ట్రోఫీ గెలవడం సాధ్యమేనని పేర్కొన్నాడు. కొంతమంది హృదయాలు ముక్కలు చేసేందుకు తామేమీ వెనుకాడమని టీమిండియా అభిమానులను ఉద్దేశించి సాంట్నర్ కామెంట్ చేశాడు.కాగా సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ ఫైనల్ చేరగా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్పై గెలిచి టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీకి ముందు భారత్.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో 4-1తో ఏకపక్ష విజయం సాధించింది. చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు -
T20 WC Final: ఆ ఇద్దరిపై వేటు!.. అతడికి చోటు?
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో బ్యాటర్ల, బౌలర్ల జాబితాలో అగ్రస్థానం టీమిండియా ఆటగాళ్లదే. ఓపెనింగ్ స్టార్ అభిషేక్ శర్మ నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతుండగా.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నంబర్ వన్ బౌలర్గా కొనసాగుతున్నాడు.అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో అభిషేక్, వరుణ్ స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ దారుణమైన ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కలిపి అతడు చేసిన పరుగులు కేవలం 89.ఏకంగా 64 పరుగులుమరోవైపు.. వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఆరంభ మ్యాచ్లలో రాణించినా.. కీలక నాకౌట్ దశలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరంగా పరిణమించింది. ముఖ్యంగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో ఈ స్పిన్ బౌలర్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 64 పరుగులు ఇచ్చుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ కూల్చాడు.ఆ ఇద్దరిపై వేటు వేయాలి!ఇక ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి వరుణ్ 8.85 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో ఫైనల్ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలపై వేటు వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.ముఖ్యంగా వరుణ్ను తప్పించి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తిలను కొనసాగించాలా? వద్దా? అన్న అంశం గురించి స్పందించాడు.నలుగురు విఫలమైనా.. ‘‘ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అభిషేక్ శర్మ (Abhishek Sharma)ను ఎందుకు కొనసాగించవచ్చో చెబుతాను. మనకు ఎనిమిది మంది బ్యాటర్లు ఉన్నారు. మరీ గ్రహచారం బాగాలేకపోతే నలుగురు విఫలమైనా.. మరో నలుగురు పరుగులు రాబట్టే అవకాశం ఉంటుంది.బౌలర్లలో ఒక్కరు విఫలమైనా..అభిషేక్ శర్మ పరుగులు చేయకుండానే టీమిండియా ఫైనల్ వరకూ వచ్చింది. అయితే, బౌలర్ ఒక్క ఓవర్లో విఫలమైనా భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఐదుగురు బౌలర్లలో ఒక్కరు చెడ్డగా ఆడినా అంతే సంగతులు.ఇన్నింగ్స్లో ఓ బౌలర్కు 20 శాతం బౌలింగ్ కోటా ఉంటుంది. నిజానికి గత మ్యాచ్లో వరుణ్ పేలవంగా ఆడాడు. అందుకే కుల్దీప్ను తీసుకురావాలనే ఆలోచన రావొచ్చు. అనుభవజ్ఞుడైన లెఫ్టార్మ్ స్పిన్నర్ అందుబాటులో ఉంటే బాగుంటుంది.నేను మాత్రం ఆ ఇద్దరినీ కొనసాగిస్తాఅయితే, నేను మాత్రం తుదిజట్టును ఎంపిక చేసే స్థానంలో ఉంటే.. వరుణ్ చక్రవర్తినే కొనసాగిస్తా. అతడితో పాటు అభిషేక్ శర్మనూ కొనసాగిస్తా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్లో తుదిజట్టులో మార్పులు అంతగా మంచిది కాదని.. తమదైన రోజున చెలరేగే సత్తా ఉన్న అభిషేక్, వరుణ్ వంటి స్టార్లపై వేటు వేయడం తగదని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఆదివారం ఫైనల్కు షెడ్యూల్ ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫైనల్కు రంగం సిద్ధమైంది. టీమిండియా- న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్ ఫైనల్ విజేతపై తమ అంచనాలు తెలియజేశారు. డివిలియర్స్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. ప్రతి ఒక్కరు సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అని పిలవడానికి ఇష్టపడతారు. కీలక మ్యాచ్లలో మనం ఓడిపోవడం ఇందుకు కారణం.ఇది అసాధ్యంఅయితే, న్యూజిలాండ్ విషయంలోనూ నేను ఇదే మాట అంటాను. న్యూజిలాండ్ ఇప్పటి వరకు వరల్డ్కప్లు గెలవనేలేదు. సౌతాఫ్రికా మాదిరే ఎన్నోసార్లు ఫైనల్కు చేరినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈసారైనా గెలిచేందుకు ప్రయత్నించండి.నిజానికి నాకు న్యూజిలాండ్ జట్టు అంటే చాలా ఇష్టం. కానీ వాళ్లు టీమిండియాను ఓడించలేరు. ఇది జరగాలంటే మాత్రం ఏదో ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని భారత జట్టు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇది అసాధ్యం. కివీస్ గెలవాలనే కోరుకుంటున్నా. కానీ వాళ్లు భారత్ను ఓడించగలరా?.. అంటే లేదనే చెప్తాను’’ అని పేర్కొన్నాడు.జట్టు గెలవాలని నాకూ ఉందిఇందుకు డివిలియర్స్ బదులిస్తూ... ‘‘అవును.. న్యూజిలాండ్కు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. ఆ జట్టు గెలవాలని నాకూ ఉంది. కానీ వారికి ఆ అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి’’ అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా ఐసీసీ టోర్నీ ఫైనల్స్లో న్యూజిలాండ్ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే నెగ్గింది.రెండుసార్లు టీమిండియాను ఓడించిఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని 2000 సంవత్సరంలో కైవసం చేసుకున్న కివీస్.. మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ విజేతగానూ 2021లో అవతరించింది. ఈ రెండుసార్లూ న్యూజిలాండ్ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. అయితే, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్తో తలపడిన కివీస్కు ఈ సారి పరాజయమే ఎదురైంది. భారత్ విజేతగా అవతరించింది. అయితే, కివీస్ ఇంత వరకు ఒక్క వరల్డ్కప్ ట్రోఫీ గెలవకపోగా.. భారత్ మూడు ప్రపంచకప్ టోర్నీలు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను సొంతం చేసుకుంది.చదవండి: T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా? -
T20 WC Final: పిచ్ ఎలా ఉండబోతోంది?.. ఎర్ర మట్టితోనా?
టీమిండియా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టింది సూర్యకుమార్ సేన.సొంతగడ్డపై టీ20 వరల్డ్కప్-2026 ఆడుతున్న భారత జట్టు లీగ్ దశలో అజేయంగా నిలిచింది. సూపర్-8లో తొలుత తడబడినా.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించి సెమీస్ చేరింది. ఇక సెమీ ఫైనల్లో ఇంగ్లండ్తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లోనూ ఏడు పరుగుల తేడాతో గెలిచి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరుసగా రెండుసార్లుతద్వారా వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ టోర్నీ ఫైనల్కు చేరిన జట్టుగా నిలిచింది. ఇక ట్రోఫీ కోసం న్యూజిలాండ్తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది. అయితే, ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కావడం సెంటిమెంట్ పరంగా టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇదే వేదికపై 2023 వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో తాజా ఫైనల్కు సంబంధించిన పిచ్ విషయంలో కూడా టీమిండియా తీవ్రంగా ఆలోచిస్తోంది. నిజానికి పిచ్ ఎంపిక, తయారీ ఐసీసీ పరిధిలోని అంశం. కానీ ఎర్ర మట్టితో చేసిన పిచ్పై ఆడాలనే తమ ఉద్దేశాన్ని భారత జట్టు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఎర్రమట్టితో చేసిన పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తోంది. ముంబైలో ఇదే జరిగింది.టీమిండియా కోరుకుంది ఇదేఇక అహ్మదాబాద్లో నల్లరేగడి మట్టితో చేసిన పిచ్పై సౌతాఫ్రికా జట్టుతో ‘సూపర్–8’ మ్యాచ్ ఆడిన సూర్యకుమార్ సేన దారుణంగా ఓడిపోయింది. అది పునరావృతం కాకుండా టీమిండియా బ్యాటింగ్ పిచ్నే కోరుకుంటోంది. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ఎర్ర మట్టితోనే‘‘నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు మిశ్రమ మట్టితో తయారైన పిచ్ లభించనుంది. స్పోర్టింగ్ పిచ్నే రూపొందిస్తున్నారు. అయితే, ఎక్కువ మటుకు ఇది ఎర్ర మట్టితోనే తయారు చేస్తారు. కాస్త బౌన్సీగా ఉండటంతో పాటు.. బ్యాటర్లకు కూడా అనుకూలిస్తుంది’’ అని పేర్కొన్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన తొలి ఐదు మ్యాచ్లలో పేస్ బౌలింగ్లో 762 బంతుల్లో బ్యాటర్లు 1062 పరుగులు సాధించారు. ఫాస్ట్ బౌలర్లకు 45 వికెట్లు దక్కాయి. ఇక స్పిన్ బౌలింగ్లో 421 బంతుల్లో బ్యాటర్లు 617 పరుగులు రాబట్టగా.. బౌలర్ల ఖాతాలో 20 వికెట్లు చేరాయి. చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
T20 WC Final: బుమ్రా కూడా మనిషే కదా!: కివీస్ స్టార్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ టైటిల్ పోరుకు న్యూజిలాండ్, టీమిండియా అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం (మార్చి 8) ఫైనల్కు ముహూర్తం ఖరారైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.ఈ నేపథ్యంలో భారత్తో ఫైనల్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాను చూసి.. తాము అంతగా భయపడటం లేదన్నాడు. బుమ్రా క్లాసిక్ బౌలర్ అయినప్పటికీ.. అతడూ ఒక మనిషే కదా అని పేర్కొన్నాడు.ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లోకాగా ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో టీమిండియా గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. పరుగుల వరద పారిన వాంఖడే స్టేడియంలో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో బుమ్రా 18వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చి మ్యాచ్ను భారత్ వైపు తిప్పాడు. కీలక సమయంలో రాణించి జట్టు గెలుపునకు పునాది వేశాడు.దీంతో బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్లోనూ అతడు తన మ్యాజిక్ చూపిస్తాడని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ మాత్రం మిగతా బౌలర్లలాగే.. బుమ్రా తమకు ఓ బౌలర్ అని అన్నాడు.అతడు కూడా మనిషే కదా!‘‘ఇటీవల టీమిండియా సిరీస్లో భాగంగా బుమ్రా బౌలింగ్లో మేము మెరుగ్గా ఆడాము. అతడొక క్లాస్ బౌలర్. వైవిధ్యభరితంగా బౌలింగ్ చేస్తాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట. అతడి బౌలింగ్లో ఆడటం తేలిక కాదు. కానీ అసాధ్యం కూడా కాదు.బుమ్రాను వదిలేసి వేరే వాళ్ల బౌలింగ్లో ఆడాలని అనుకోవడం లేదు. అతడు కూడా మనిషే కదా!.. అందరిలాగే తనకూ ఒక చెడు రోజు ఉంటుంది. ఆరోజు అతడు విఫలం అవుతాడు. అదే, అతడి మీద మాకు మంచి రోజు అవుతుంది. ఫైనలే ఆరోజు కావాలని ఆశిస్తున్నాం?’’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్లో తాము మెరుగ్గా ఆడగలమని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు స్వదేశంలో భారత్ కివీస్తో ఐదు టీ20లు ఆడింది. ఇందులో 4-1తో గెలిచింది. అయితే, ఈ సిరీస్లో బుమ్రా ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 9.46 ఎకానమీతో కేవలం నాలుగు వికెట్లే తీశాడు.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026 Final: ఐసీసీ ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో భారత్- న్యూజిలాండ్ మధ్య మార్చి 8 (ఆదివారం) ఫైనల్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇక ఈ మెగా ఫైనల్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది.అంపైర్లు వీరే..టీమిండియా- కివీస్ (IND vs NZ Final) మధ్య టైటిల్ పోరుకు అంపైర్లను శుక్రవారం ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లకు చోటు ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరు ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు కూడా అంపైర్లుగా వ్యవహరించారు.ఆ రెండుసార్లూ గెలిచినా..ఇదిలా ఉంటే.. ఐసీసీ టోర్నీల్లో ఇప్పటికే ప్రతిష్టాత్మక ఫైనల్లలో అంపైర్గా పని చేసిన అనుభవం ఇల్లింగ్వర్త్కు ఉంది. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్లో ఆయనే అంపైర్.అయితే, 2023లో తప్ప 2024, 2025 టైటిల్ పోరులో టీమిండియానే విజయం వరించింది. అన్నట్లు 2023లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఆందోళనలో అభిమానులు.. కారణం ఇదేఅయితే, 2024లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాను.. 2025లో దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి ట్రోఫీ విజేతగా నిలిచింది. అయితే, 2023 మాదిరే ఈసారి కూడా అదే అంపైర్ (ఇల్లింగ్వర్త్), అదే వేదిక (అహ్మదాబాద్)పై ఫైనల్ కావడంతో అభిమానులు కాస్త సెంటిమెంట్ ఫీలవుతున్నారు. దురదృష్టం వెంటాడకూడదని ప్రార్థిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026లో భారత్- న్యూజిలాండ్ ఫైనల్కు అంపైర్లు వీరే👉ఆన్ ఫీల్డ్ అంపైర్లు- రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్👉థర్డ్ అంపైర్- అల్లాఉద్దీన్ పలేకర్👉ఫోర్త్ అంపైర్- అడ్రియాన్ హోల్డ్స్టక్👉మ్యాచ్ రిఫరీ- ఆండీ పైక్రాఫ్ట్.చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
T20 WC 2026 Final: అభిషేక్పై వేటు పడుతుందా..?
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్కు ముందు టీమిండియాను ఓ విషయం తెగ కలవరపెడతుంది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడలేకపోవడంతో యావత్ భారతం ఆందోళన చెందుతుంది. ఈ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్ల్లో డకౌట్లైన అతను.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్తో జరిగిన కీలక సమరాల్లోనూ చేతులెత్తేశాడు. టోర్నీ మొత్తంలో జింబాబ్వే మ్యాచ్ మినహాయించి ఒక్క మ్యాచ్లో కూడా కనీస ప్రదర్శనలు చేయలేకపోయాడు. మొత్తంగా 7 ఇన్నింగ్స్ల్లో 12.71 సగటున 89 పరుగులు మాత్రమే చేశాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో మార్చి 8న న్యూజిలాండ్తో జరుగబోయే ఫైనల్ మ్యాచ్లో అభిషేక్కు ఆడించాలా వద్దా అన్న చర్చ భారత క్రికెట్ సర్కిల్స్లో జోరుగా సాగుతుంది. మేనేజ్మెంట్ అభిషేక్ను వెనకేసుకొస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత దేశ పరువు సమస్య కాబట్టి, ఛాన్స్లు తీసుకోవద్దని సూచిస్తున్నారు.క్లిష్ట సమయంలో మేనేజ్మెంట్తో పాటు సహచరులు, కోచ్ గౌతమ్ గంభీర్ అభిషేక్కు అండగా నిలుస్తున్నారు. తాజాగా మరో ఓపెనర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. భారత జట్టు అభిషేక్పై నమ్మకం కోల్పోలేదని అన్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా పాజిటివ్గా ఉంది. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమే అని వెనకేసుకొచ్చాడు. ఒకట్రెండు మంచి షాట్లు ఆడితే ఫామ్ తిరిగి వస్తుంది. ఫైనల్ అతని రోజు కావచ్చని సహచరుడికి పూర్తి స్థాయి మద్దతు తెలిపాడు.వాస్తవానికి అభిషేక్ వరుస వైఫల్యాలకు అతనిపై ఉన్న అధిక అంచనాలే కారణమని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి అధికం కావడం వల్ల అభిషేక్ తడబడుతున్నాడని అభిప్రాయపడుతున్నారు. అతనికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే సత్ఫలితాలు రావచ్చని అంటున్నారు. పరుగులు రాబట్టేందుకు కష్టపడుతున్న మాట కూడా వాస్తమే అయినప్పటికీ.. ఒక్కసారి లైన్లోకి వచ్చాడంటే, అతన్ని ఆడపం కష్టమని అంటున్నారు. ఆఫ్ స్పిన్ను ఎదుర్కోవడంలో లోపాలు సరిదిద్దుకుంటే రాణించగలడని అంచనా వేస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా, కీలకమైన ఫైనల్లో రాణిస్తే మాత్రం అభిషేక్ భారత క్రికెట్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.ప్రస్తుత ప్రపంచకప్లో అభిషేక్ ప్రదర్శనలు..యూఎస్ఏపై 0 (1)నమీబియాపై ఆడలేదుపాకిస్తాన్పై 0 (4)నెదర్లాండ్స్పై 0 (3)సౌతాఫ్రికాపై 15 (12 బంతులు; 2 ఫోర్లు, సిక్స్)జింబాబ్వేపై 55 (30 బంతులు; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)వెస్టిండీస్పై 10 (11 బంతులు; 2 ఫోర్లు)ఇంగ్లండ్పై 9 (7 బంతులు; 2 ఫోర్లు)కాగా, టీ20 ప్రపంచకప్ 2026 తుది అంకానికి చేరింది. భారత్, న్యూజిలాండ్ ఫైనల్స్కు చేరాయి. న్యూజిలాండ్ సౌతాఫ్రికాను.. భారత్ ఇంగ్లండ్ను మట్టికరిపించి తుది పోరులో అమీతుమీకి సిద్దమయ్యాయి. ఈ సమరం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. -
రోహిత్, కోహ్లి అభిమానులకు పండగే..!
టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు శుభవార్త. టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ స్టార్ ద్వయానికి అదనపు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివర్లో టీమిండియా మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటించనుంది. ఈ సిరీస్లో 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్లు షెడ్యూలయ్యాయి.2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా వన్డే మ్యాచ్ల సంఖ్యను 3 నుంచి 5కు పెంచాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. వన్డే మ్యాచ్ల సంఖ్య 4కు పెంచితే, టీ20 మ్యాచ్ల సంఖ్యను 3కు కుదించే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. వన్డేల పెంపు ఖరారైందని సమాచారం.ఈ అంశం ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు వాణిజ్యపరమైన లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. రోహిత్-విరాట్ ఎక్కువ మ్యాచ్ల్లో కనబడితే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అలాగే వన్డే ప్రపంచకప్కు ముందు రో-కోకు వీలైనంత రియల్ ప్రాక్టీస్ కూడా లభించినట్లవుతుంది. కాబట్టి న్యూజిలాండ్ పర్యటనలో వన్డే లెగ్ పొడిగించడం దాదాపుగా ఖరారైనట్టే. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.ఐపీఎల్ తర్వాత వన్డేలపై దృష్టిఐపీఎల్ 2026 సీజన్ మే చివర్లో ముగిసిన వెంటనే, భారత జట్టు దృష్టి వన్డే ప్రపంచకప్ సన్నాహాలపై కేంద్రీకృతమవుతుంది. గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్లో బిజీగా ఉన్న భారత జట్టు.. జూన్ మొదటి వారం నుంచి వన్డేలపై దృష్టి సారించనుంది.ఐపీఎల్ 2026 తర్వాత భారత వన్డే క్యాలెండర్ - జూన్లో ఆఫ్ఘానిస్తాన్తో మూడు మ్యాచ్లు - జూలైలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్లు - ఆగస్టులో వెస్టిండీస్తో మూడు మ్యాచ్లు - అక్టోబర్లో న్యూజిలాండ్ పర్యటన- సంవత్సరం చివర్లో శ్రీలంకతో మూడు మ్యాచ్లు -
భారత్పై సెంచరీల మోత.. మిచెల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డారిల్ మిచెల్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. జనవరి 2026 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా మిచెల్ ఎంపికయ్యాడు. గత నెలలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో మిచెల్ దుమ్ములేపాడు.కివీస్ జట్టు 2-1తో సిరీస్ గెలవడంలో డారిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు వన్డేల సిరీస్లో అతడు ఏకంగా 352 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండడం గమనార్హం. ఈ అద్భుత ప్రదర్శన ఫలితంగానే అతడికి ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఈ అవార్డును మిచెల్ సొంతం చేసుకున్నాడు. ఇక బంగ్లాదేశ్కు చెందిన శోభన మోస్తరీ మహిళల విభాగంలో ఈ అవార్డును దక్కించుకుంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో శోభన అసాధరణ ప్రదర్శన కనబరిచింది. టీ20 వరల్డ్కప్-2026కు బంగ్లా క్వాలిఫై కావడంలో ఆమెది కీలక పాత్ర. -
వికెట్ కీపర్గా సంజూకు నో ఛాన్స్.. క్లారిటీ ఇచ్చిన సూర్యకుమార్
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు? సంజు శాంసన్కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. శాంసన్ పేలవ ఫామే ఇందుకు ప్రధాన కారణం. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తిలక్ యధావిధిగా మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తిరువనంతపురం వేదికగా కివీస్తో జరిగిన ఐదో టీ20లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు మ్యాచ్లలో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్గా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఆఖరి టీ20లో సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పటికి ఇషాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ క్రమంలో సంజూ వరల్డ్కప్లో ఆడడం ఇక కష్టమేనన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు."తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం దక్కింది. అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్లలో శాంసన్, చివరి రెండు మ్యాచ్లలో కిషన్కు వికెట్ కీపింగ్ చేసే అవకాశమివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.కానీ కిషన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ20లో ఆడలేదు, లేదంటే ఆ మ్యాచ్లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు కిషన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడు" అని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: టీమిండియా వరల్డ్ రికార్డు -
భారత్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరమైన తిలక్... బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. సీఓఈలో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో అతడు ఉత్తీర్ణీత సాధించాడు.దీంతో తిలక్కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చింది. అతడు మంగళవారం(ఫిబ్రవరి3) ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. భారత్ ఆడబోయే రెండు వార్మప్ మ్యాచ్లలో తిలక్ భాగం కానున్నాడు. ఇక కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన సంజు శాంసన్ స్థానంలో టీ20 ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ పొట్టి ప్రపంచకప్లో భారత్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 7న నవీ ముంబై వేదికగా యూఎస్ఎతో తలపడనుంది. అంతకుముందు ఫిబ్రవరి 2న అమెరికా, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో మెన్ ఇన్ బ్లూ వార్మప్ మ్యాచ్లలో ఆడనుంది.టీ20 ప్రపంచకప్ 2026కు భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్. -
టీమిండియా వరల్డ్ రికార్డు
టీ20 ప్రపంచకప్-2026కు ముందు టీమిండియా భీకర ఫామ్లో ఉంది. ఈ మెగా టోర్నీ సన్నాహల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ అదరగొట్టింది. ఈ సిరీస్ను 4-1 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. శనివారం తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి టీ20లోనూ టీమిండియా దుమ్ములేపింది.కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 61) సైతం సత్తాచాటాడు. 272 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఆఖరివరకు పోరాడింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్తో విరుచుకుపడ్డ టీమిండియా పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.ఇంగ్లండ్ వరల్డ్ రికార్డు బ్రేక్..అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీమిండియా ఇప్పటివరకు నాలుగు సార్లు 250 పైగా పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే(3) రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది. అదేవిధంగా ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక సిక్స్లు(69) కొట్టిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట(64) ఉండేది.చదవండి: 'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య -
'స్కై' మళ్లీ నీలి రంగులోకి మారింది.. చాలా సంతోషంగా ఉంది: సూర్య
టీ20 ప్రపంచకప్-2026కు ముందు న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి పోరు(ఐదో టీ20)లో టీమిండియా సత్తాచాటింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ను 46 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్(43 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్లతో 103) శతక్కొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(63), హార్దిక్ పాండ్యా(42) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో కివీస్ 225 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ నిలవగా.. సూర్యకుమార్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. గతేడాది మొత్తం పేలవ ఫామ్తో ఇబ్బందిపడిన సూర్య.. కొత్త ఏడాదిలో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో అతడు మూడు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు."ఈ క్షణం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నా రిథమ్ను తిరిగి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్కై ఉన్నప్పుడు భయం ఎందుకని మురళీ కార్తీక్ గత సిరీస్లోనే చెప్పారు. నేను కొత్తగా ఏమీ ప్రయత్నించలేదు. నా బ్యాటింగ్లో కూడా ఎటువంటి మార్పులు చేసుకోలేదు.ఎందుకంటే నేను 'అవుట్ ఆఫ్ ఫామ్' లో లేను, కేవలం 'అవుట్ ఆఫ్ రన్స్'లో ఉన్నానని నాకు తెలుసు ఒక మంచి ఇన్నింగ్స్తో నా రిథమ్ తిరిగి అందుకోవచ్చన్న థీమాతో ఉండేవాడిని. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్లో నా ఫామ్ను తిరిగి సాధించాను.వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు తిరిగి ట్రాక్లో పడడం ఆనందంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆకాశం(స్కై) నీలి రంగులో కన్పించలేదు. కానీ ఒక క్రీడాకారుడి జీవితంలో ఎత్త పల్లాలు సహజం. ఇటువంటి సమయంలో అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుంటే తిరిగి కమ్బ్యాక్ ఇవ్వవచ్చు. ఇప్పుడు నేను అదే పనిచేశాను. గత సిరీస్ తర్వాత దొరికిన విరామంలో సన్నిహితులతో గడిపాను. వారు చెప్పిన కొన్ని కీలక విషయాలు నన్ను ప్రేరేపించాయి. ఇక గెలిచినా, ఓడినా ప్రతి మ్యాచ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. ముంబైలో సౌత్ ఆఫ్రికాతో జరిగే వార్మప్ మ్యాచ్ తర్వాత, మాలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుంటాము. మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టీ20 ఫార్మాట్ బౌలర్లకు ఒక కఠిన పరీక్ష వంటిది. మనం భారీ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు కూడా అంతే ధీటుగా బదులు ఇస్తోంది. కెప్టెన్, బౌలింగ్ యూనిట్పై ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లడమే ఏకైక మార్గం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్..
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో సూర్య మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తన అద్భుత బ్యాటింగ్తో ఒకప్పటి సూర్యను గుర్తు చేశాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో సూర్యకు ఇది మూడో అర్ధశతకం. రాయపూర్, గువహటి వేదికగా జరిగిన టీ20ల్లోనూ హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఏదేమైనప్పటికీ టీ20 ప్రపంచకప్కు ముందు సూర్యకుమార్ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో టీమ్ మెనెజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. కాగా ఈ మ్యాచ్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య ఓ అరుదైన ఘనత సాధించాడు.అంతర్జాతీయ టీ20ల్లో బంతులు పరంగా అత్యంతవేగంగా 3000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా సూర్య చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను స్కై కేవలం 1822 బంతుల్లోనే సాధించాడు. ఇంతుకుముందు ఈ రికార్డు యూఏఈ ఆటగాడు ముహమ్మద్ వసీమ్(1947) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో వసీంను సూర్య అధిగమించాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లి (2169 బంతులు), రోహిత్ శర్మ (2149 బంతులు) వంటి దిగ్గజాల కంటే త్వరగా సూర్య అందుకోవడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు) అద్భుతమైన శతకంతో మెరిశాడు. -
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 272
తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్ జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంసన్ ఆరంభంలోనే ఔటైనప్పటికి మిగితా బ్యాటర్లు మాత్రం కివీస్ బౌలర్లను ఉతికారేశారు.వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు. సంజూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ ప్రత్యర్ధి బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 4 ఫోర్లు, 10 సిక్స్లతో 103 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్లతో 42), అభిషేక్ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్, జేమిసన్, డఫీ తలా వికెట్ సాధించారు. -
తీరు మారని సంజూ శాంసన్.. హోం గ్రౌండ్లోనూ
టీ20 వరల్డ్కప్-2026కు ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదో టీ20లో కూడా సంజూ దారుణ ప్రదర్శన కనబరిచింది. సొంత ప్రేక్షకుల ముందు శాంసన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు.6 బంతులు ఎదుర్కొన్న శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో జాకబ్స్కు క్యాచ్ ఇచ్చి సంజూ ఔటయ్యాడు. ఈ సిరీస్ మొత్తంగా శాంసన్ కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.తిలక్ వర్మ పునరాగమనం చేస్తే తుది జట్టులో సంజూ స్ధానం గల్లంతే అంటూ పోస్ట్లు పెడుతున్నారు. గాయం కారణంగా న్యూజిలాండ్తో సిరీస్కు దూరంగా ఉన్న మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ.. త్వరలోనే జట్టులో చేరనున్నాడు. తిలక్ జట్టులోకి వస్తే ఇషాన్ కిషన్ లేదా సంజూ శాంసన్లో ఎవరో బెంచ్కే పరిమితమవ్వాలి. అయితే ఇషాన్ తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. శాంసన్ కంటే ఈ జార్ఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అంతేకాకుండా ఓపెనర్గా కూడా కిషన్కు మంచి రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. ఇషాన్ కిషన్.. అభిషేక్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశముంది.అంతకుముందు శుభ్మన్ గిల్ టీ20ల్లో రీఎంట్రీ ఇవ్వడంతో సంజూను బెంచ్కే పరిమితం చేశారు. ఆసియాకప్, సౌతాఫ్రికా సిరీస్లో ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో టీమ్మెనెజ్మెంట్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో గిల్ను టీ20ల నుంచి తప్పించి మళ్లీ ఓపెనర్గా శాంసన్కు అవకాశమిచ్చారు. కానీ తనకు వచ్చిన ఛాన్స్ను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఉపయోగించుకోలేకపోయాడు. -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఐదో టీ20లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ ఆఖరి పోరులో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.అదేవిధంగా గత మ్యాచ్కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తిలు కూడా పునరాగమనం చేశారు. అయితే వరుసగా నాలుగు మ్యాచ్లలో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మరోసారి టీమ్మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. తన సొంతమైదానంలో సంజూ సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కివీస్ ఏకంగా తమ జట్టులో నాలుగు మార్పులు చేసింది. లాకీ ఫెర్గూసన్, అలెన్, నీషమ్,జాకబ్స్ జట్టులోకి వచ్చారు.తుది జట్లున్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
IND vs NZ: అతడికి ఇదే లాస్ట్ ఛాన్స్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియా న్యూజిలాండ్తో ఆఖరి మ్యాచ్కు సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా భారత్- కివీస్ మధ్య శనివారం ఐదో టీ20కి షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు స్థానిక ఆటగాడు సంజూ శాంసన్పైనే ఉన్నాయి.గతేడాది కాలంలో టీమిండియా టీ20 ఓపెనర్గా రాణించిన సంజూ (Sanju Samson).. కివీస్తో గత నాలుగు మ్యాచ్లలో మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా వరల్డ్కప్ వంటి మెగా టోర్నీకి ముందు అతడు ఇలా విఫలం కావడం ఆందోళనకరంగా మారింది.మరోవైపు.. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రూపంలో సంజూకు పోటీ తీవ్రతరమైంది. కివీస్ ఆఖరి మ్యాచ్లోనూ ఈ కేరళ స్టార్ విఫలమైతే.. ప్రపంచకప్ టోర్నీలో వికెట్ కీపర్గా.. ఓపెనర్గా అతడి స్థానాన్ని ఇషాన్ భర్తీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.మరింత ఒత్తిడి "తిరువనంతపురంలో ఆఖరి మ్యాచ్. హోం బాయ్ సంజూ శాంసన్కు కూడా బహుశా ఇదే చివరి అవకాశం కావొచ్చు. ఈ మ్యాచ్లో అతడిపై ఒత్తిడి మరింత పెరగడం ఖాయం. గత కొన్నాళ్లుగా అతడు పరుగులు రాబట్టడంలో ఇబ్బంది పడుతున్నాడు.ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడలేకపోతున్నాడు. మరోవైపు.. ఇషాన్ కిషన్ దుమ్ములేపుతున్నాడు. కాబట్టి కివీస్తో ఐదో టీ20లో సంజూ బాగానే ఆడినా.. టీ20 ప్రపంచకప్లో ఓపెనర్గా అతడి స్థానం సుస్థిరం అని చెప్పలేము.అలా అనుకుంటే తప్ప చోటు కష్టమేఒకవేళ టాపార్డర్లో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు వద్దు అని మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రమే సంజూ.. ఇషాన్ను దాటి తుదిజట్టులోకి రాగలడు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. కాగా గత నాలుగు మ్యాచ్లలో సంజూ చేసిన స్కోర్లు 10, 6, 0, 24.ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. ఇషాన్ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు. కాగా తిలక్ వర్మ గాయం నుంచి కోలుకుని వరల్డ్కప్తో నేరుగా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: WC 2026: భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ -
టీమిండియాకు గుడ్ న్యూస్.. డేంజరస్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు!
టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కారణంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన స్టార్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ.. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అబ్డోమినల్ సర్జరీ తర్వాత తిలక్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నాడు.అయితే శుక్రవారం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగే సిమ్యులేషన్ మ్యాచ్లో తిలక్ పాల్గోనున్నాడు. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ తన ఫిట్నెస్ను నిరూపించుకుంటే బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తుంది. ఒకవేళ బోర్డు నుంచి క్లియరెన్స్ లభిస్తే తిలక్.. ఫిబ్రవరి 3న భారత జట్టుతో కలిసే అవకాశముందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.కాగా తొలుత న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20 సిరీస్లో ఆఖరి రెండు మ్యాచ్లకు తిలక్ అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. కానీ పూర్తిగా కోలుకుండా అతడి ఆడించి రిస్స్ తీసుకోడదని బీసీసీఐ భావించింది. ఈ క్రమంలోనే తిలక్ స్ధానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ను ఆఖరి రెండు టీ20లకూ కొనసాగించారు. తిలక్ తిరిగి రీఎంట్రీ ఇస్తే జట్టు మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. మయాంక్ ఫిట్..మరోవైపు వెన్నునొప్పి కారణంగా దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్న ఢిల్లీ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా జరిగే వార్మప్ మ్యాచ్లలో ఇండియా-ఎ తరపున మయాంక్ బరిలోకి దిగనున్నాడు. అదేవిధంగా కుడి భుజం గాయం నుంచి కోలుకున్న అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ యో-యో టెస్టు పాస్ అయ్యాడు.అతడు కూడా తిలక్తో కలిసి సిమ్యులేషన్ మ్యాచ్లో భాగం కానున్నాడు. ఇక కివీస్తో వన్డే సిరీస్లో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతోంది. అతడికి ఫిబ్రవరి 4న ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్కప్ లీగ్ మ్యాచ్లకు వాషీ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.చదవండి: వరల్డ్కప్ నుంచి సౌతాఫ్రికా అవుట్ -
న్యూజిలాండ్తో ఐదో టీ20.. భారత తుది జట్టులోకి స్టార్ ప్లేయర్?
టీ20 ప్రపంచకప్-2026కు ముందు చివరి మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి నాలుగో టీ20లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది. అయితే ఈ ఆఖరి మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.అక్షర్ పటేల్ రీఎంట్రీ?నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో గాయపడిన భారత స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అక్షర్ ప్రస్తుతం నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. . 4వ టీ20 టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ.. అక్షర్ కోలుకుంటున్నాడని, వరల్డ్ కప్నకు ముందు అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని పేర్కొన్నాడు. దీంతో తిరువనంతపురం టీ20కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్కు విశ్రాంతి..అదేవిధంగా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో పాండ్యా కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్గానే ఆడాడు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. అతడి స్ధానంలోనే అక్షర్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు నాలుగో టీ20కు దూరమైన ఇషాన్ కిషన్ కూడా ప్లేయింగ్ ఎలెవన్లోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్న హర్షిత్ రాణాపై వేటు పడే అవకాశం ఉంది. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లతో భారత్ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకుంది.భారత తుది జట్టు(అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
గుడ్బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
శివాలెత్తిన శివమ్ దూబే.. రోహిత్ శర్మ రికార్డు సమం
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. ఆల్రౌండర్ శివమ్ దూబే మాత్రం తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత జట్టుకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. మెన్ ఇన్ బ్లూ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఓవైపు క్రమం తప్పుకొండా వికెట్లు పడుతున్నప్పటికి ఈ ముంబై స్టార్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగించాడు. భారత ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఇష్ సోధీకి దూబే చుక్కలు చూపించాడు.ఆ ఓవర్లో దూబే ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి రెండు పరుగులు తీసిన దూబే.. ఆ తర్వాత వరుసగా 4,6,4,6,6 బాదాడు. ఈ క్రమంలో ఒకే అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డును దూబే సమం చేశాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్(36), సంజూ శాంసన్(30) తొలి రెండు స్ధానాల్లో ఉన్నాడు.అయితే ఓ దశలో మ్యాచ్ను గెలిపించేలా కన్పించిన దూబే.. దురదృష్టవశాత్తు రనౌట్గా వెనుదిరిగాడు. మొత్తంగా కేవలం 23 బంతుల్లో మాత్రమే ఎదుర్కొన్న దూబే 7 ఫోర్లు, 3 సిక్స్లతో 65 పరుగులు చేశాడు. దూబేతో పాటు రింకూ సింగ్(39) రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా ఐదు మ్యాచ్ల సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.कल शिवम दुबे ने 15 गेंदों पर फिफ्टी पीट दिया।घोड़े के पैर में जंजीर नहीं बाधेंगे तो वो इतिहास ही रचेगा।pic.twitter.com/6f80FCvmlJ— Shubham Shukla (@Shubhamshuklamp) January 29, 2026 -
ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్
టీమిండియాతో టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఎట్టకేలకు విజయం సాధించింది. విశాఖపట్నంలో బుధవారం జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ సేనను 50 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించింది.టీమిండియా మాదిరే ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ గెలుపుపై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్పందించాడు. ‘‘మా ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా పవర్ప్లేలో మా వాళ్లు అద్భుతం. టీమిండియా మాదిరే మా ఆటగాళ్లు కూడా పవర్ప్లేలో కావాల్సినన్ని పరుగులు రాబట్టారు.అందుకే మేము మెరుగైన స్కోరు సాధించాము. టీమిండియా లాంటి జట్టుకు 200 మేర లక్ష్యం ఎంతమాత్రం మాకు సురక్షితం కాదు. వాళ్లు సులువుగానే ఈ టార్గెట్ను ఛేదించగలరు. గత మ్యాచ్లో మాకు ఈ విషయం చాలా బాగా అర్థమైంది.అద్భుతమైన ఫినిషింగ్ టచ్మధ్య ఓవర్లలో మేము వికెట్లు కోల్పోవడం కాస్త ఆందోళన కలిగించింది. అయితే, డారిల్ మిచెల్, ఫౌల్క్స్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. భారత్లో వరల్డ్కప్ టోర్నీకి ముందు టీమిండియాతో ఆడటం కంటే గొప్ప సన్నాహకం ఇంకేం ఉంటుంది. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి.మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంపై దృష్టి సారించాము. వరల్డ్కప్ టోర్నీలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాము. పవర్ ప్లేలో వికెట్లు తీయడం మాకు కలిసి వచ్చింది’’ అని సాంట్నర్ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.ఫిబ్రవరి 7 నుంచి..కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ను సొంతం చేసుకుంది. నామమాత్రపు నాలుగో టీ20లో మాత్రం కివీస్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. సిరీస్ కోల్పోయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఊరట దక్కే విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ నాలుగో టీ20 స్కోర్లున్యూజిలాండ్-215/7(20)టీమిండియా- 165(18.4)ఫలితం: యాభై పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62).చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన -
'ఇదేమి బ్యాటింగ్'.. సంజూపై గవాస్కర్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేలవ ఫామ్ టీమ్ మెనెజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి మూడు టీ20ల్లో విఫలమైన సంజూ.. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఈ నేపథ్యంలో శాంసన్ ఔట్ అయిన తీరుపై సునీల్ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు.'శాంట్నర్ బౌలింగ్లో సంజూ అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడు. అతడి బ్యాటింగ్లో ఫుట్ వర్క్ అస్సలు లేదు. బంతి పెద్దగా టర్న్ అవ్వకపోయినా, కేవలం రూమ్ కల్పించి ఆఫ్-సైడ్ ఆడాలనే తొందరలో క్లీన్ బౌల్డయ్యాడు. శాంసన్ తరచుగా లెగ్-స్టంప్ బయటకు కదులుతూ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో మూడు స్టంప్లు బౌలర్కు క్లియర్గా కనిపిస్తున్నాయి. బౌలర్ స్టంప్స్ను టార్గెట్ చేయడంతో అతడు క్లీప్ బౌల్డ్ అవ్వాల్సి వచ్చింది" అని కామెంటరీ బాక్స్లో ఉన్న గవాస్కర్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడిన సంజూ కేవలం 40 పరుగులు చేశాడు. దీంతో వరల్డ్కప్ తుది జట్టులో సంజూ స్ధానంపై సందిగ్థత నెలకొంది. ఎందుకంటే ప్రత్యామ్నయ ఓపెనర్గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తన రీ ఎంట్రీలో ఇరగదీస్తున్నాడు. సంజూ స్ధానంలో ఓపెనర్గా ఇషాన్కు చోటు ఇవ్వాలని చాలా మంది సూచిస్తున్నారు.చదవండి: తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన -
తుది నిర్ణయం వారిదే: గంభీర్ ‘తొలగింపు’పై బీసీసీఐ స్పందన
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టుల్లో 3-0తో వైట్వాష్.. ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం.. సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత తొలిసారి సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్లో 2-0తో వైట్వాష్.. తాజాగా స్వదేశంలో తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ (2-1) కోల్పోవడం..పదవి నుంచి తొలగించాలిగౌతం గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాత టీమిండియా చవిచూసిన ఘోర పరాభవాలు ఇవి.. ఈ నేపథ్యంలో అతడిని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. భారత జట్టు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సైతం ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులేఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా వ్యంగ్యరీతిలో స్పందించారు. ‘‘ఇండియాలో 140 కోట్ల మందితో కూడిన దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు క్రికెట్ నిపుణులే. ప్రతి ఒక్కరికి వారికంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం.కాబట్టి మనం ఎవరినీ మాట్లాడకుండా ఆపలేము. మీడియా సహా అందరూ తమ అభిప్రాయాలను చెబుతూనే ఉంటారు. వార్తా సంస్థలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు.. ఇతర వ్యక్తులు అంతా ఎప్పటికప్పుడు తమకు నచ్చినట్లుగా మాట్లాడుతూనే ఉంటారు. ఇది సోషల్ మీడియా యుగం.వారిదే తుది నిర్ణయంఅయితే, బీసీసీఐలో క్రికెట్ కమిటీ ఉంటుంది. అందులో మాజీ క్రికెటర్లు ఉంటారు. వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోవైపు.. జట్టు ఎంపిక కోసం ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. వాళ్లు కూడా అర్హత ప్రకారమే ఆ స్థానానికి చేరుకున్నారు. వాళ్లకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి.అయితే, ఇతరులు వాటితో విభేదించవచ్చు. అయినప్పటికీ బోర్డులోని వ్యక్తుల మాటలు, నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. క్రికెట్ కమిటీ, సెలక్టర్లదే తుది నిర్ణయం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు. చదవండి: Suryakumar Yadav: ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే -
ఓడినా పర్లేదు.. మా ప్లాన్ అదే: సూర్యకుమార్
టీ20ల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు న్యూజిలాండ్ ఓటమి రుచిని చూపించింది. బుధవారం వైజాగ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో 50 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 216 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక మెన్ ఇన్ బ్లూ చతికల పడింది.కివీస్ బౌలర్ల దాటికి భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది. శివమ్ దూబే(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో 65), రింకూ సింగ్(39) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. బ్లాక్క్యాప్స్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు, డఫీ, సోధి రెండు వికెట్లు సాధించారు.అతడితో పాటు మాట్ హెన్రీ, ఫౌల్క్స్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."ఈ మ్యాచ్లో కావాలనే ఆరుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు పూర్తి స్ధాయి బౌలర్లతో ఆడాలని నిర్ణయించుకున్నాము. 180 ప్లస్ టార్గెట్ను చేసేటప్పుడు ఆరంభంలోనే రెండు మూడు వికెట్లు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను ఎలా తీసుకుంటారో పరీక్షించాలనుకున్నాము.ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లందరికి ఈ సిరీస్లో అవకాశమివ్వాలనుకున్నాం.మేము మొదట బ్యాటింగ్ చేసినప్పుడు బాగానే ఆడుతున్నాం. కానీ ఛేజింగ్లో వికెట్లు పడితే మా ఆటగాళ్లు బాధ్యతను ఎలా స్వీకరిస్తారో చూడాలనుకున్నాము. మాకు మేమే ఛాలెంజ్ చేసుకున్నాము. అందుకే తొలుత బౌలింగ్ ఎంచుకున్నా. వచ్చే మ్యాచ్లో అవకాశం వస్తే మళ్లీ ఛేజింగ్ చేయడానికే ఇష్టపడతాం. ఈ ఓటమి నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా శివమ్ దూబే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి తోడుగా మరొక బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సూర్య పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్లో భారత్ ఒక బ్యాటర్ తక్కువగా బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్కు విశ్రాంతి ఇచ్చి పేసర్ అర్ష్దీప్ సింగ్ను తుది జట్టులో తీసుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఆఖరికి బెడిసికొట్టింది.చదవండి: హార్దిక్, అర్ష్ దీప్ కీలకం: రోహిత్ -
నాలుగో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్
వైజాగ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (36 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), డెవాన్ కాన్వే (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో డారిల్ మిచెల్ (18 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది.సీఫర్ట్, కాన్వే ధాటికి న్యూజిలాండ్ 8.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును తాకింది. సీఫర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20ల్లో భారత్పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడిగా రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. ఈ మ్యాచ్లో కాన్వే కూడా జోరును ప్రదర్శించాడు. పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదాడు.వీరిద్దరు ఔటైన తర్వాత న్యూజిలాండ్ మధ్యలో కాస్త తడబడింది. రచిన్ రవీంద్ర (2), మార్క్ చాప్మన్ (9) త్వరితగతిన ఔటయ్యారు. ఈ మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ ఓ మోస్తరు మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో డారిల్ మిచెల్ బ్యాట్ ఝులిపించడంతో న్యూజిలాండ్ 200 పరుగుల మార్కును దాటింది. సాంట్నర్ (11), ఫౌల్క్స్ (13) వేగంగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. సాంట్నర్ను హార్దిక్ పాండ్యా అద్భుతమైన డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. మిచెల్తో పాటు మ్యాట్ హెన్రీ (6) అజేయంగా నిలిచాడు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-33-2), కుల్దీప్ యాదవ్ (4-0-39-2), బుమ్రా (4-0-38-1) కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా (4-0-54-0), రవి బిష్ణోయ్ (4-0-49-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. -
న్యూజిలాండ్తో నాలుగో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
వైజాగ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను పక్కన పెట్టింది. గత మ్యాచ్లో అతను స్వల్ప గాయానికి గురయ్యాడు. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఓ మార్పుతో బరలోకి దిగింది. జేమీసన్ స్థానంలో ఫౌల్క్స్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే 3-0తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా -
గిల్కు బాగానే అర్థమైంది: రాహుల్ ద్రవిడ్
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్గా ఇప్పటికైనా గిల్కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.ఘోర పరాభవాలుగత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్స్వీప్ అయింది.అందుకే ఈ చేదు అనుభవాలుఈ పరిణామాల నేపథ్యంలో హెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.బీసీసీఐకి ఓ విజ్ఞప్తిఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్కు హాజరైన సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ..గిల్కు బాగానే అర్థమైంది‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరంగత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్బాల్ మ్యాచ్ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే! -
IND vs NZ: తుదిజట్టులో శ్రేయస్ అయ్యర్!
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది టీమిండియా. మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్లలోనూ గెలిచి.. ప్రపంచకప్ టోర్నీకి ముందు మరోసారి సత్తా చాటాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.మరోవైపు.. ఐసీసీ ఈవెంట్కు ముందు టీమిండియాను ఒక్కసారైన నిలువరించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నం వేదికగా బుధవారం ఇరుజట్లు నాలుగో టీ20 (IND vs NZ 4th T20I)లో తలపడనున్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా ఈ సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో.. వరల్డ్కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.హార్దిక్ పాండ్యా స్థానంలో..ఈ క్రమంలో చాన్నాళ్లుగా టీమిండియా తరఫున టీ20లలో పునరాగమనం చేయాలన్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కల నెరవేరే అవకాశం లేకపోలేదు. హార్దిక్ పాండ్యా స్థానంలో అతడు తుదిజట్టులోకి వస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైనా సంజూ శాంసన్కు మరొక్క అవకాశం దక్కనుంది.సంజూ కూడా సేఫ్వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడం ఇటు సంజూకు.. అటు శ్రేయస్కు సానుకూలాంశంగా మారింది. తిలక్ స్థానంలో శ్రేయస్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఓపెనర్గా సంజూ విఫలం కావడం.. అదే సమయంలో మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర ఆట తీరుతో ఆకట్టుకోవడంతో సంజూ స్థానం ప్రమాదంలో పడింది.ఇషాన్ను ఓపెనర్గా ప్రమోట్ చేస్తే..ఒకవేళ తిలక్ నాలుగో టీ20తో తిరిగి వస్తే ఇషాన్ను ఓపెనర్గా ప్రమోట్ చేసి సంజూను తుదిజట్టు నుంచి తప్పించే అవకాశం ఉండేది. అయితే, ఇప్పటికి ఆ ప్రమాదం తప్పింది. తిలక్ లేకపోవడం వల్ల ఇలా సంజూ సేఫ్ కాగా.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే శ్రేయస్ అయ్యర్కు బ్యాట్ పట్టే అవకాశం రావొచ్చు.ఇక రొటేషన్లో భాగంగా బుమ్రా స్థానంలో అర్ష్దీప్ సింగ్ తుదిజట్టులోకి రావొచ్చు. అదే విధంగా.. అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని కుల్దీప్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.న్యూజిలాండ్తో నాలుగో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా/శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా/అర్ష్దీప్ సింగ్.చదవండి: T20 WC 2026: పాక్ క్రికెట్ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్ -
T20 WC 2026: సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!
పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్-2026 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లో ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి.నాలుగు గ్రూపులుగ్రూప్-ఎ నుంచి డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా (India), పాకిస్తాన్ (Pakistan), అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా (Australia), ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్-సిలో ఇంగ్లండ్ (England), వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్ ఉన్నాయి. బంగ్లాదేశ్ నిష్క్రమణతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరింది.ఇక గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ20 వరల్డ్కప్ సెమీ ఫైనలిస్టులు, ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై మాజీ క్రికెటర్లు తమ అంచనా తెలియజేస్తున్నారు.ఈసారి భారత్- ఆస్ట్రేలియా ఫైనల్ చేరతాయని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. తాజాగా సెమీ ఫైనలిస్టుల గురించి భారత మాజీ క్రికెటర్లు స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా తమ అంచనాలను తెలిపారు. సెమీ ఫైనల్ చేరే జట్లు ఇవే!ఇందులో భాగంగా 2007 టీ20 ప్రపంచకప్ విన్నర్ రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. టీమిండియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ టాప్-4లో నిలుస్తాయని అభిప్రాయపడ్డాడు.పాకిస్తాన్ కూడా వస్తుందిఇక టీ20 వరల్డ్కప్-2007 విజేత ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. తన అభిప్రాయం ప్రకారం ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లతో పాటు పాకిస్తాన్ సెమీస్కు అర్హత సాధిస్తుందని పేర్కొన్నాడు. మరోవైపు.. భారత మాజీ టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా.. టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరతాయని జోస్యం చెప్పాడు.గత ఎడిషన్ విజేత టీమిండియాఅదే విధంగా.. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా పూజారా అభిప్రాయంతో ఏకీభవించాడు. కాగా గత వరల్డ్కప్ ఎడిషన్ (2024)లో భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్లతో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే తొలి సెమీ ఫైనల్లో అఫ్గన్ను సౌతాఫ్రికా.. రెండో సెమీస్ మ్యాచ్లో ఇంగ్లండ్ను భారత్ ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఇక టీమిండియా ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్! -
విశాఖలో క్రికెట్ సందడి..భారత్, కివీస్ నాలుగో టి20 (ఫొటోలు)
-
ఆ మరుక్షణమే రిటైర్మెంట్: కేఎల్ రాహుల్
టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ రిటైర్మెంట్పై తొలిసారి నోరు విప్పాడు. గతంలో చాలాసార్లు ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన వచ్చిందని.. తన విషయంలో రిటైర్మెంట్ కష్టతరంగా ఉండబోదని వ్యాఖ్యానించాడు. కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్.. 2014లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇప్పటి వరకు 67 టెస్టులు, 94 వన్డేలు, 72 టీ20 మ్యాచ్లు ఆడిన కేఎల్ రాహుల్.. టెస్టుల్లో 4053, వన్డేల్లో 3360, టీ20లలో 2265 పరుగులు సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో టెస్టుల్లో 11 సెంచరీలు, వన్డేల్లో 8 శతకాలు, టీ20లలో రెండు సెంచరీలు ఉన్నాయి.వికెట్ కీపర్గానూటీమిండియా తరఫున ప్రస్తుతం టెస్టు, వన్డే జట్లలో కీలకంగా ఉన్న 33 ఏళ్ల కేఎల్ రాహుల్ (KL Rahul).. యాభై ఓవర్ల ఫార్మాట్లో వికెట్ కీపర్గానూ సేవలు అందిస్తున్నాడు. అయితే, గతంలో ఈ మంగళూరు ప్లేయర్ చాలాసార్లు గాయాల బారిన పడ్డాడు. అదే విధంగా.. నిలకడలేమి ఆట తీరు కారణంగా ఓపెనర్గా ఉన్న అతడు మిడిలార్డర్కు డిమోట్ అయ్యాడు. మరికొన్నిసార్లు తిరిగి ఓపెనర్గా వచ్చాడు.మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తాప్రస్తుతానికి జట్టులో కేఎల్ రాహుల్ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీలేదు. అయితే, తన అవసరం టీమ్కు లేదని భావించిన మరుక్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ తాజాగా అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ముచ్చటిస్తూ..‘‘రిటైర్మెంట్ (Retirement) గురించి నేనెప్పుడో ఆలోచించాను. నా విషయంలో ఇది మరీ అంత కష్టంగా ఉండబోదు. మన పట్ల నిజాయితీగా ఉంటే.. రిటైర్మెంట్కు సరైన సమయం ఏమిటో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని పెద్దగా నాన్చాల్సిన పని ఉండదు.ఇంకాస్త సమయం ఉందినేనైతే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతానికి నా రిటైర్మెంట్కు ఇంకాస్త సమయం ఉంది. అయితే, ఆటను వదిలేయాలని అనిపించినపుడు ఆ దిశగా నిర్ణయం తీసుకోవడమే మంచిది.క్రికెట్ ఒక్కటే జీవితం కాదు. మనకంటూ ఓ కుటుంబం ఉంటుంది. నాకు కూతురు పుట్టిన తర్వాత ఒక్కసారిగా నా దృష్టి కోణం మారిపోయింది. జీవితంలో మరెన్నో ముఖ్య విషయాలు ఉంటాయి. ఏదేమైనా ఆటకు నా అవసరం లేదని అనిపించిన మరుక్షణం నేను తప్పుకొంటా.నేను లేకపోయినా దేశంలో, ప్రపంచంలో క్రికెట్ కొనసాగుతూనే ఉంటుంది. గతంలో నేను చాలాసార్లు గాయపడ్డాను అప్పుడు మనతో మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఫిజియో, సర్జన్ల వల్ల మన శరీరానికి నొప్పి కలగవచ్చు.మానసిక స్థితి బలహీనపడుతుందిఅయితే, ఆ సమయంలో మన మానసిక స్థితి బలహీనపడిపోతుంది. ఇంకెన్నాళ్లు ఇలా.. ఇక చాలు అని మెదడు చెబుతుంది. అదృష్టవశాత్తూ క్రికెట్ వల్ల మనం ఎక్కువగా డబ్బు సంపాదించగలం. కాబట్టి ఆటను వదిలినా పెద్దగా నష్టమేమీ లేదు.. ఇంకొన్నాళ్లు జీవితం సాఫీగా సాగించవచ్చు అని సంకేతాలు ఇస్తుంది. ఇలాంటి మానసిక స్థితిని అధిగమిస్తేనే మళ్లీ మనం మైదానంలోకి దిగగలము’’ అని కేఎల్ రాహుల్ తన మనసులోని భావాలను వెల్లడించాడు. కాగా ఇటీవల న్యూజిలాండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కేఎల్ రాహుల్ చివరగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్!An Incredibly Honest KL Rahul On Retirement 💭 pic.twitter.com/8LJcxVLpnG— The Switch | Kevin Pietersen (@kptheswitch) January 26, 2026 -
IND vs NZ: న్యూజిలాండ్ జట్టులో కీలక మార్పులు
టీమిండియాతో టీ20 సిరీస్లో న్యూజిలాండ్ ఓటమిపాలైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హ్యాట్రిక్ విజయాలతో 3-0తో కివీస్ను చిత్తు చేసింది. ఫలితంగా మిగిలిన రెండు మ్యాచ్లలోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు తమకు మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్తో మిగిలిన రెండు టీ20లకు సంబంధించి తమ జట్టులో కీలక మార్పులు చేసింది.ఆ ఇద్దరిపై వేటుయువ ఫాస్ట్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్తో పాటు టాపార్డర్ బ్యాటర్ టిమ్ రాబిన్సన్లను జట్టు నుంచి తొలగించిన కివీస్. వారి స్థానాల్లో జేమ్స్ నీషమ్, లాకీ ఫెర్గూసన్లను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా టిమ్ సీఫర్ట్ కూడా జట్టుతో చేరినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇక ఐదో టీ20 కోసం టాపార్డర్ బ్యాటర్ ఫిన్ అలెన్ కూడా జట్టుతో చేరతాడని బ్లాక్క్యాప్స్ తెలిపింది.కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత్కు వచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ జట్టు. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ 2-1తో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించిన కివీస్.. టీ20 సిరీస్లో మాత్రం వరుస వైఫల్యాలతో ఓటమిపాలైంది. ఇక భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాలుగో టీ20, శనివారం ఐదో టీ20 జరుగనున్నాయి. ఇందుకు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలు.భారత్తో మిగిలిన రెండు టీ20లకు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జేకబ్ డఫీ, జేమ్స్ నీషమ్, కైల్ జెమీసన్, మైకేల్ బ్రేస్వెల్, బెవాన్ జేకబ్స్, ఫిన్ అలెన్ (5వ టీ20కి మాత్రమే).చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్! -
అభిషేక్ శర్మకు యువరాజ్ సవాల్!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ జోరు కొనసాగిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్తో గువాహటిలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై ఓ రేంజ్లో విరుచుకుపడి పరుగుల సునామీ సృష్టించాడు. అభిషేక్కు తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దంచుకొట్టుడు కొట్టడంతో 10 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించేశారు. బంతితో బుమ్రా నిప్పులు చెరగడంతో 8 వికెట్ల తేడాతో కివీస్ను టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.ఈ సిరీస్లో రెండో అర్ధసెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ.. మరో ఘనత సాధించాడు. గువాహటి మ్యాచ్లో 14 బంతులోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ బాదేశాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20ల్లో తక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. ఓవరాల్గా 7వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసి సత్తా చాటాడు. మొత్తం 20 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 340 స్ట్రైక్రేట్తో న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. నాగ్పూర్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84 పరుగులు; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కొట్టాడు. ఎప్పుడు బ్రేక్ చేస్తావ్?అభిషేక్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్పై మాజీ ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడి గురువు యువరాజ్ సింగ్ తన శిష్యుడికి సవాల్ విసిరాడు. తన పేరిట రికార్డ్ను ఎప్పుడు బ్రేక్ చేస్తావంటూ ఆట పట్టించాడు. ''ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావా?'' అంటూ ఎక్స్లో కామెంట్ పెట్టాడు. ''బాగా ఆడావు, ఇదే జోరు కొనసాగించాల''ని ఎంకరేజ్ చేశాడు. కాగా, టీమిండియా తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు 19 ఏళ్లుగా యువీ పేరిటే ఉంది. 2007 ప్రపంచకప్లో ఇంగ్లండ్పై 12 బంతుల్లోనే అతడు అర్ధశతకం సాధించి రికార్డు నెలకొల్పాడు.నెటిజన్ల స్పందనకాగా, అభిషేక్ శర్మను మోడ్రన్ యువరాజ్ సింగ్గా వర్ణిస్తూ.. గురువును రికార్డును అధిగమించే సత్తా శిష్యుడికే ఉందని నెటిజనులు అంటున్నారు. అభిషేక్ శర్మ ఇదే హై కొనసాగిస్తే త్వరలోనే యూవీ రికార్డు బ్రేక్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. కుర్రాడిని ఇలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది నెటిజనులు అంటే.. శిష్యుడిని ఉత్సాహపరిచేందుకే యువీ సవాల్ విసిరాడని ఇంకొంత మంది అంటున్నారు. ఏదేమైనా రానున్న టి20 వరల్డ్కప్లోనూ అభిషేక్ శర్మ ఇదే జోరు కొనసాగించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: రోహిత్శర్మపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలుభారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ ఈ నెల 26న విశాఖపట్నంలో జరుగుతుంది. చివరి మ్యాచ్ ఈ నెల 31న తిరువనంతపురంలో జరగనుంది. చూడాలి మరి.. ఈ రెండు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ గురువు రికార్డును బ్రేక్ చేస్తాడో, లేదో!Still can’t get a 50 off 12 balls, can you? 🤪 Well played - keep going strong! 💪🏻 @OfficialAbhi04 #IndVSNz pic.twitter.com/6MQe1p6sx4— Yuvraj Singh (@YUVSTRONG12) January 25, 2026 -
విరాట్ కోహ్లి సరసన సంజూ శాంసన్
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్లు) మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. చాప్మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్ ఫామ్పై ఆందోళనలు ఈ సిరీస్లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్కు ముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
శ్రేయస్ అయ్యర్కు మరో ఛాన్స్
న్యూజిలాండ్ టీ20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్కు మరో లక్కీ ఛాన్స్ దక్కింది. తిలక్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన శ్రేయస్ను చివరి రెండు టీ20లకు కూడా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు. ప్రపంచకప్కు ముందు శ్రేయస్ తనను తాను నిరూపించుకునేందుకు ఇది సువర్ణావకాశం. శ్రేయస్ భారత్ తరఫున టీ20లు ఆడక చాలా కాలమైంది.న్యూజిలాండ్తో తొలి మూడు టీ20లకు అతను ఎంపికైనా, తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 3-0తో చేజిక్కించుకోవడంతో శ్రేయస్కు చివరి రెండు టీ20ల్లో అవకాశం దక్కవచ్చు. ఈ అవకాశాన్ని శ్రేయస్ సద్వినియోగం చేసుకోగలిగితే, ప్రపంచకప్ జట్టులో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు.ప్రపంచకప్కు ఎంపికైన వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతూ న్యూజిలాండ్ సిరీస్కు కూడా దూరమయ్యాడు. ఒకవేళ సుందర్ ప్రపంచకప్కు దూరమైతే అతని స్థానాన్ని శ్రేయస్తో భర్తీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇది అంత సులువుగా జరిగే విషయం అయితే కాదు. ఎందుకంటే, సుందర్ స్థానానికి ఇప్పటికే గట్టి పోటీ ఉంది.సుందర్కు ప్రత్యామ్నాయంగా న్యూజిలాండ్ సిరీస్కు ఎంపికైన రవి బిష్ణోయ్ ప్రధాన పోటీదారుగా మారాడు. బిష్ణోయ్ చాలాకాలం తర్వాత లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మూడో టీ20లో సత్తా చాటాడు. ప్రపంచకప్ భారత ఉపఖండంలో జరుగుతుంది కాబట్టి, సెలెక్టర్లు సుందర్ లాంటి ఆల్రౌండర్ కాకపోయినా, బిష్ణోయ్ లాంటి నాణ్యమైన స్పిన్నర్తో అడ్జస్ట్ కావచ్చు.సుందర్ స్థానానికి మరో ప్రధాన పోటీదారుడు రియాన్ పరాగ్. పరాగ్ సుందర్ లాగే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి, సెలెక్టర్లు అతనివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పరాగ్ సైతం చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నా, ఐపీఎల్ 2025 సత్తా చాటడం అతనికి కలిసొచ్చే అంశం.ఈ లెక్కన వాషింగ్టన్ సుందర్ ప్రపంచకప్కు దూరమైతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్ రేసులో ఉంటారు. వీరిలో బిష్ణోయ్ ఇదివరకే (మూడో టీ20) తనను నిరూపించుకున్నాడు. శ్రేయస్కు ఒకవేళ చివరి రెండు టీ20ల్లో అవకాశం వచ్చి, అతను కూడా సత్తా చాటితే, సుందర్ స్థానానికి ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, శ్రేయస్ చివరి రెండు టీ20లకు కొనసాగనుండటంతో, న్యూజిలాండ్ సిరీస్కు తిలక్ వర్మ అందుబాటులో ఉండడనే విషయం స్పష్టమవుతుంది. విజయ్ హజారే ట్రోఫీలో గాయపడిన తిలక్ను న్యూజిలాండ్తో తొలి మూడు టీ20లకు మాత్రమే ఎంపిక చేయలేదు. అతను చివరి రెండు టీ20లకు అందుబాటులో వస్తాడని సెలెక్టర్లు ఆశించారు. అయితే అతను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రేయస్ చివరి రెండు మ్యాచ్లకు కూడా కొనసాగనున్నాడు. తిలక్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమైనా ప్రపంచకప్కు అందుబాటులోకి వస్తాడని కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి. న్యూజిలాండ్తో చివరి రెండు టీ20లు విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా జనవరి 28, 31 తేదీల్లో జరుగనున్నాయి. -
T20 WC 2026: టీమిండియాకు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఐసీసీ ఈవెంట్కు స్టార్ ఆల్రౌండర్ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా మెగా టోర్నీకి సన్నాహకంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.3-0తో కైవసం ఇందులో భాగంగా తొలి మూడు మ్యాచ్లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్ను 3-0తో కైవసం చేసుకుంది. అయితే, ఈ సిరీస్ ఆరంభానికి ముందు నుంచే టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ తొలి మూడు టీ20లకు దూరం కాగా.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. వాషింగ్టన్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయి (Ravi Bishnoi) జట్టులోకి వచ్చారు. ఇక తిలక్ వేగంగా కోలుకుంటుండగా.. వాషీ మాత్రం ఇప్పట్లో మ్యాచ్ ఫిట్నెస్ సాధించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ..ఇంకో రెండు వారాలు‘‘అతడు పూర్తిగా ఫిట్గా మారడానికి ఇంకో రెండు వారాల సమయం పట్టొచ్చు. టీ20 ప్రపంచకప్ జట్టుతో అతడిని కొనసాగించాలా? లేదంటే మరో ఆటగాడితో వాషీ స్థానం భర్తీ చేయాలా? అన్న విషయం గురించి సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యం ఆలోచిస్తోంది’’ అని పేర్కొన్నాయి.కాగా ఒకవేళ వాషీ గనుక వరల్డ్కప్ టోర్నీకి దూరమైతే భారత తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. పవర్ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు లెఫ్టాండర్లకు బ్యాటింగ్ చేయడంలో అతడు సేవలు అందించగలడు.అక్షర్ సైతం అయితే, స్పిన్ విభాగంలో ఇప్పటికే మిస్టరీ బౌలర్ వరుణ్ చక్రవర్తి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్లతో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు. కాకపోతే అక్షర్ సైతం గాయం వల్ల కివీస్తో రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో వాషీ సైతం దూరమైతే పరిస్థితి గందరగోళంగా మారుతుంది.ఇక కివీస్తో సిరీస్లో ఆడుతున్న రవి బిష్ణోయి.. వాషీ స్థానంలో టీ20 వరల్డ్కప్ జట్టులోకి కూడా వచ్చే అవకాశం ఉంది. కాగా న్యూజిలాండ్తో మూడో టీ20తో తుదిజట్టులోకి వచ్చిన బిష్ణోయి.. రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
వారి వల్లే ఈ స్థాయిలో ఉన్నా: సూర్యకుమార్
వన్డేల్లో న్యూజిలాండ్తో చేతిలో ఎదురైన పరభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం గౌహతి వేదికగా కివీస్తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే 3-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది.తొలుత బౌలింగ్లో పర్యాటక జట్టును కేవలం 153 పరుగులకే కట్టడి చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్లోనూ దుమ్ములేపింది. ఓపెనర్ అభిషేక్ శర్మ( 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు.ఫలితంగా 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మురళీ కార్తీక్ నుంచి కెప్టెన్ సూర్యకుమార్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలానే ఆధిపత్యాన్ని చెలాయించావా? అని కార్తీక్ ప్రశ్నించాడు."మా స్కూల్ ప్రిన్సిపాల్ , టీచర్లు క్రికెట్ ఆడేందుకు నాకు చాలా సమయం ఇచ్చేవారు. పరీక్షల సమయం, స్కూల్ టైమ్లో కూడా నాకు చాలా సెలవులు ఇచ్చారు. గ్రౌండ్కు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడని. అక్కడే నేను ఆటలోని మెలకువలన్నీ నేర్చుకున్నాను. ఈ లక్ష్య చేధన గురించి మేం ముందే మాట్లాడుకున్నాం. మేము మొదట బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒకే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నాము.ఒకవేళ రేపు మ్యాచ్లో 20 పరుగులకే 3 వికెట్లు లేదా 40 పరుగులకే 4 వికెట్లు పడినా, పరిస్థితికి తగ్గట్టు ఎలా బ్యాటింగ్ చేయాలో మాకు తెలుసు. మా జట్టులో అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు. ఇక మా టాప్ 2-3 బ్యాటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు నా పనిని సులభం చేస్తున్నారు. ఇక బిష్ణోయ్ తన రీ ఎంట్రీ మ్యాచ్లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. బిష్ణోయ్ తన రోల్పై ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అతడికి తన బలాలు ఏంటో తెలుసు. క్లిష్ట సమయాల్లో వికెట్లు అందించడం అతడిప్రత్యేకత. రవి చాలా జట్టులో ఉండడం మాకు ప్లస్ పాయింట్" అని సూర్య పేర్కొన్నాడు. కాగా భారత జట్టును కెప్టెన్గా సూర్యకుమార్ అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో 41 మ్యాచ్లు ఆడిన భారత్ 33 మ్యాచ్ల్లో విజయం సాధించింది. -
అభిషేక్ అదరహో.. మూడో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలూండగానే 3-0 తేడాతో మెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. కివీస్ నిర్ధేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 10 ఓవర్లలోనే ఊదిపడేసింది.ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విధ్వంసం సృష్టించాడు. బర్సపారా క్రికెట్ స్టేడియంలో అభిషేక్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 7 ఫోర్లు, 5 సిక్స్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 57 నాటౌట్) వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28)సైతం దూకుడుగా ఆడాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ తలా వికెట్ సాధించారు.బుమ్రా మ్యాజిక్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్(48) టాప్ స్కోరర్గా నిలిచాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు హార్దిక్ పాండ్యా, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: ప్రపంచకప్కు ముందే సౌతాఫ్రికాతో భారత్ 'ఢీ' -
అభిషేక్ శర్మ విధ్వంసకాండ.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని, ఓవరాల్గా ఏడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 2007 వరల్డ్కప్లో ఇంగ్లండ్పై యువరాజ్ కేవలం 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీగా కొనసాగుతుంది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఎయిరీ పేరిట ఉంది. దీపేంద్ర 2023 ఏషియన్ గేమ్స్లో మంగోలియాపై కేవలం 9 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించేలా కనిపిస్తుంది. అభిషేక్ విధ్వంసం ధాటికి భారత్ 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి లక్ష్యానికి 17 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. సంజూ శాంసన్ (0), ఇషాన్ కిషన్ (28) ఔట్ కాగా.. అభిషేక్ శర్మ (67), సూర్యకుమార్ యాదవ్ (42) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 66 బంతుల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేయాలి.అంతకుముందు బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-17-3), హార్దిక్ పాండ్యా (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
రెచ్చిపోయిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన న్యూజిలాండ్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసి ప్రత్యర్థిని 153 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో పేసు గుర్రం బుమ్రా మహోగ్రరూపం దాల్చాడు. తన కోటా 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వీటిలో టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్ వికెట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచాయి. వీరిద్దరిని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. క్లీన్ బౌల్డ్ అంటే ఏదో సాదాసీదా కాదు. బుమ్రా బౌలింగ్ వేగానికి వికెట్లు గాల్లో నాట్యం చేశాయి. మరో బౌలర్ రవి బిష్ణోయ్ కూడా ఈ మ్యాచ్లో సత్తా చాటాడు. 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా, బిష్ణోయ్.. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తికి ప్రత్యామ్నాంగా వచ్చి చెలరేగడం విశేషం.న్యూజిలాండ్ను స్వల్ప స్కోర్కు కట్టడి చేయడంలో మరో ఇద్దరు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషించారు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన డెవాన్ కాన్వే వికెట్ తీయగా.. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3-0-32-0), శివమ్ దూబే (2-0-24-0) వికెట్లు తీయకపోగా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (48) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. చాప్మన్ (32), సాంట్నర్ (27), డారిల్ మిచెల్ (14), సీఫర్ట్ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. కాన్వే (1), రచిన్ (4), జేమీసన్ (3), హెన్రీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
ఇదేం బౌలింగ్ సామీ.. నిప్పులు చెరిగిన బుమ్రా
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో బరిలోకి దిగిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్ న్యూజిలాండ్ను ఇబ్బంది పెడుతోంది. 14.4 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 112 పరుగులు చేసి సగం వికెట్లు కోల్పోయింది. కాన్వే (1), సీఫర్ట్ (12), రచిన్ రవీంద్ర (4), చాప్మన్ (32), డారిల్ మిచెల్ (14) ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (48), సాంట్నర్ క్రీజ్లో ఉన్నారు.భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. వీరిలో బిష్ణోయ్, బుమ్రా అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండగా.. మిగతా వారు పర్వాలేదనిపిస్తున్నారు. ఇప్పటివరకు బౌలింగ్ చేసిన దాంట్లో కుల్దీప్ యాదవ్ (3-0-32-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దూబే కూడా ఓ ఓవర్ వేసి 13 పరుగులిచ్చాడు.గాల్లో నాట్యంఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికి బుమ్రా అద్భుతం చేశాడు. ఫుల్ లెంగ్త్ బంతిని డిఫెండ్ చేసుకునే క్రమంలో సీఫర్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి సీఫర్ట్ బ్యాట్ను ఆఫ్ స్టంప్ను గిరాటు వేసింది. బుమ్రా సంధించిన వేగానికి వికెట్ కాసేపే గాల్లో నాట్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.A PEACH FROM THE BEST BOWLER OF GENERATION - BUMRAH 😍 pic.twitter.com/QyUNGzYLS1— Johns. (@CricCrazyJohns) January 25, 2026రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
న్యూజిలాండ్తో మూడో టీ20.. టాస్ గెలిచిన సూర్యకుమార్
గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా -
నేడూ టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: వైజాగ్ వేదికగా జరగనున్న భారత్–న్యూజిలాండ్ టీ–20 మ్యాచ్కు సంబంధించి రెండో దశ టికెట్లను ఆదివారం సాయంత్రం 5 గంటలకు విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. కనిష్టంగా రూ.1,200 నుంచి గరిష్టంగా రూ.15,000 వరకు వివిధ డినామినేషన్లలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోని మొత్తం 18 స్టాండ్లతో పాటు కార్పొరేట్ బాక్స్ టికెట్లను కూడా ఈ విడతలో విక్రయించనున్నారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 27,251 కాగా, ఇప్పటికే ఈ నెల 23న జరిగిన తొలి దశ విక్రయాల్లో చాలా వరకు టికెట్లు అమ్ముడయ్యాయి. కాగా.. టీ–20 సిరీస్లో భాగంగా నాలుగో మ్యాచ్ ఆడేందుకు భారత్, న్యూజిలాండ్ జట్లు ఈ నెల 26న విశాఖ చేరుకోనున్నాయి. 27న ఇరు జట్లు వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుండగా, 28వ తేదీ రాత్రి 7 గంటలకు ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్ ప్రారంభం కానుంది. -
మాజీ క్రికెటర్తో హార్దిక్ పాండ్యా గొడవ!?.. వీడియో వైరల్
న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో టీమిండియాలో పునరాగమనం చేశాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఆసియా టీ20 కప్-2025 సందర్భంగా గాయపడిన అతడు పూర్తిగా కోలుకుని దేశీ క్రికెట్లో సొంత జట్టు బరోడా తరఫున బరిలో దిగినప్పటికీ.. కివీస్తో వన్డే సిరీస్ నుంచి మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతినిచ్చింది.మొత్తంగా రెండు వికెట్లుఈ క్రమంలో నాగ్పూర్లో న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా బుధవారం రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్.. ఆ మ్యాచ్లో 16 బంతుల్లో 25 పరుగులు చేయడంతో పాటు.. ఒక వికెట్ తీశాడు. తాజాగా రాయ్పూర్లో శుక్రవారం నాటి రెండో టీ20లోనూ ఒక వికెట్ పడగొట్టిన ఈ పేస్ ఆల్రౌండర్కు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రాలేదు.వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 76), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 82 నాటౌట్).. ఆల్రౌండర్ శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) ధనాధన్ దంచికొట్టడంతో భారత్ 15.2 ఓవర్లలోనే కివీస్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.మురళీ కార్తిక్తో గొడవ?ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండో టీ20కి ముందు అతడు.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్తో గొడవపడినట్లు తెలుస్తోంది. బ్యాట్తో హార్దిక్ మైదానంలోకి వస్తుండగా.. మురళీ కార్తిక్ అతడిని పలకరించాడు.ఇంతలోనే కోపోద్రిక్తుడైన హార్దిక్ అతడితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మురళీ కార్తిక్ వివరించే ప్రయత్నం చేయగా.. హార్దిక్ మాత్రం మాటల బాణాలు వదులుతూనే ఉన్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, వీరిద్దరు ఏ విషయంపై గొడవపడ్డారు? అసలేం జరిగింది? అన్నది మాత్రం తెలియరాలేదు. హార్దిక్ అభిమానులు మాత్రం మురళీ కార్తిక్ ఏదో అడగకూడని విషయం అడిగినందుకే ఇలా రియాక్ట్ అయి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్🚨 Hardik Pandya angry at Murali Kartik – Hardik Pandya had an argument with Murali Kartik before the IND vs NZ 2nd ODI in Raipur. pic.twitter.com/axpjLykXfY— Sonu (@Cricket_live247) January 23, 2026 -
‘నేనేమీ తినలేదు.. ఆ ప్రశ్నకు జవాబు దొరికింది’
న్యూజిలాండ్తో రెండో టీ20లో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్లు సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) విఫలమైన వేళ ఈ వన్డౌన్ బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు.ఇషాన్ ధనాధన్కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఏకంగా 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. సూర్య, దూబే మెరుపులుఇక ఇషాన్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అజేయ అర్ధ శతకం (37 బంతుల్లో 82)తో రాణించగా.. శివం దూబే (18 బంతుల్లో 36 నాటౌట్) కూడా అదరగొట్టాడు. ఫలితంగా రాయ్పూర్ వేదికగా కేవలం మూడు వికెట్లు నష్టపోయి టీమిండియా 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదుఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సూర్య భాయ్ అనుకున్నట్లు మధ్యాహ్న భోజనంలో నేను ప్రత్యేకంగా ఏమీ తినలేదు. సాధారణ భోజనమే తిన్నాను. ఏదేమైనా ఈరోజు మ్యాచ్లో మెరుగ్గా ఆడాలనే సంకల్పంతోనే మైదానంలో అడుగుపెట్టాను.ఒక్కోసారి మనం బాగానే బ్యాటింగ్ చేస్తున్నాం అనుకుంటాం. అలాంటపుడు బంతిని చూస్తూ.. మనకు అనువైన, మంచి షాట్లు మాత్రమే ఆడాలి. నేను ఈరోజు అదే పని చేశాను. రిస్క్ తీసుకోకుండానే పవర్ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలని గట్టిగా అనుకున్నాను.పవర్ప్లే అత్యంత ముఖ్యంముఖ్యంగా టీ20లలో 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పవర్ప్లే అత్యంత ముఖ్యమైనదిగా మారుతుంది. పవర్ప్లేలో.. మధ్య ఓవర్లలో నేను బాగా ఆడాను. నాకు నేనే వెన్నుతట్టుకున్నా. మంచి షాట్లు ఆడి జట్టును గెలిపించాలని భావించాను.దేశవాళీ క్రికెట్లో నేను విరివిగా పరుగులు రాబట్టాను. తద్వారా టీమిండియాకు ఆడగల సత్తా నాలో ఇంకా మిగిలే ఉందని నాకు నేనే సమాధానం చెప్పుకోగలిగాను. జార్ఖండ్ తరఫున కెప్టెన్గా టీ20 టోర్నీ ట్రోఫీ కూడా గెలిచాను. పునరాగమనంలో నేను ఇది చేయగలనా? అని సందేహం వచ్చింది.సరైన సమాధానం దొరికిందిఅయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు నాకు సరైన సమాధానం దొరికింది. మంచి షాట్లు ఆడితే అనుకున్న ఫలితం రాబట్టగలము. ఈ క్రమంలో ఒకవేళ నేను అవుట్ అయినా చింతించాల్సిన అవసరం ఉండదు’’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.కాగా క్రమశిక్షణా రాహిత్యంతో దాదాపుగా మూడేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు మళ్లీ పిలుపునిచ్చిన సెలక్టర్లు.. న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో పాటు ఏకంగా ప్రపంచకప్ టోర్నీకి ఎంపిక చేశారు. ఆధిక్యంలో టీమిండియాఅయితే, పునరాగమనంలో అంటే కివీస్తో తొలి టీ20లో మాత్రం ఇషాన్ (5 బంతుల్లో 8) విఫలమయ్యాడు. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లో చితక్కొట్టి తన విలువను చాటుకున్నాడు. ఇక తొలి టీ20లోనూ గెలిచిన టీమిండియా.. కివీస్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యం సంపాదించింది.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్𝟓𝟎 𝐢𝐧 𝐚 𝐟𝐥𝐚𝐬𝐡 ⚡#IshanKishan slams the fastest T20I half-century in just 21 balls for India v NZ. 😮💨#INDvNZ, 2nd T20I | LIVE NOW 👉 https://t.co/Be1n2FWbLQ pic.twitter.com/UbpqrgpcTm— Star Sports (@StarSportsIndia) January 23, 2026 -
ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్లో విఫలమైనప్పటికి బ్యాటింగ్లో మాత్రం దుమ్ములేపింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో చేధించింది.తద్వారా న్యూజిలాండ్ను 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తన రీఎంట్రీ మ్యాచ్లో విఫలమైన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్.. రాయ్పూర్లో మాత్రం తన విశ్వరూపాన్ని చూపించాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కిషాన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో ఏకంగా 76 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఇక సంచలన ఇన్నింగ్స్ ఆడిన కిషన్పై సూర్యకుమార్ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్ప్లేలో అతడు ఆడిన తీరు అద్భుతమని సూర్యకొనియాడాడు. "ఇషాన్ లంచ్లో ఏం తిన్నాడో, మ్యాచ్కు ముందు ఏ 'ప్రీ-వర్కౌట్' డ్రింక్ తీసుకున్నాడో నాకు తెలియదు. కానీ అతడి బ్యాటింగ్ చేసిన తీరు మాత్రం అద్భుతం. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఇలాంటి విధ్వంసకర బ్యాటింగ్ను నేను ఎప్పుడూ చూడలేదు. పవర్ప్లేలో తొలి రెండు ఓవర్లలో మాకు కేవలం 8 పరుగులకే వచ్చాయి. అటువంటిది పవర్ప్లేను 75 పరుగులతో ముగించడం నిజంగా గ్రేట్. ఆ క్రెడిట్ మొత్తం కిషన్కే దక్కాలి. 200 పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్ల నుంచి ఇటువంటి ఇన్నింగ్స్లే మేము ఆశిస్తాము. ప్రతీ ఒక్కరూ పూర్తి స్వేచ్చగా ఆడుతూ తమను తాము నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్లో ఇషాన్ సరిగ్గా అదే చేశాడు.పవర్ప్లేలో ఇషాన్ స్ట్రైక్ అస్సలు నాకు ఇవ్వలేదు, అందుకు కోపంగా ఉన్నాను(నవ్వుతూ). అయితే కిషాన్ దూకుడుగా ఆడడంతో క్రీజులో కుదురుకోవడానికి నాకు సమయం దొరికింది. చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. గత మూడు వారాల నుంచి నెట్స్లో ఎక్కువగా గడిపాను. వాటి ఫలితం ఈ మ్యాచ్లో స్పష్టంగా కన్పించింది.ఒకానొక దశలో న్యూజిలాండ్ 230 పరుగులు చేసేలా కనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని కట్టడి చేశారు. దూబే కూడా కీలక ఓవర్ బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. రాబోయో మ్యాచ్లలో ఇదే బ్రాండ్ ఆఫ్ కొనసాగిస్తాము" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో పేర్కొన్నాడు. -
ఇషాన్, సూర్య విధ్వంసం.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన భారత్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో ఊదిపడేసింది. లక్ష్య చేధనలో 7 పరుగులకే ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వికెట్లను భారత్ కోల్పోయింది.అయితే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. భారీ షాట్లతో ప్రత్యర్ధి బ్యాటర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం కిషన్ కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 76 పరుగులు చేశాడు. కిషన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన సూర్య.. క్రీజులో సెటిల్ అయ్యాక తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. టీ20ల్లో ఏడాది తర్వాత తన హాఫ్ సెంచరీ మార్క్ను సూర్య అందుకున్నాడు. ఓవరాల్గా 37 బంతులు ఎదుర్కొన్న స్కై.. 9 ఫోర్లు, 4 సిక్స్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు శివమ్ దూబే (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 36 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ, ఇష్ సోధీ, డఫీ తలా వికెట్ సాధించారు. టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్కు ఇదే అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ కావడం విశేషం.Let me tell to today's Generation, Ishan Kishan was our Abhishek Sharma before Abhishek Sharma existed. pic.twitter.com/wtwZ7D4bVu— Selfless⁴⁵ (@SelflessCricket) January 23, 2026కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. -
IND VS NZ 2nd T20I: న్యూజిలాండ్ భారీ స్కోర్
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.న్యూజిలాండ్ ఈ స్కోర్ చేసేందుకు ప్రతి ఒక్కరి దోహదపడ్డారు. రచిన్ రవీంద్ర (44), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటారు. కాన్వే (19), సీఫర్ట్ (24), ఫిలిప్స్ (19), డారిల్ మిచెల్ (18), మార్క్ చాప్మన్ (10), జకరీ ఫౌల్క్స్ (15 నాటౌట్) క్రీజ్లో ఉన్నంతసేపు బ్యాట్ ఝులిపించారు. ఆఖర్లో సాంట్నర్, ఫౌల్క్స్ క్యామియో న్యూజిలాండ్ను 200 పరుగుల మార్కును దాటించింది.భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ (4-0-53-0) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్లో తెచ్చారు.మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు.కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
న్యూజిలాండ్తో రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రాయ్పూర్లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. తొలి టీ20లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి హర్షిత్ రాణాను ప్లేయింగ్ ఎలెవెన్లో తెచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ మూడు మార్పులు చేసింది. రాబిన్సన్ స్థానంలో టిమ్ సీఫర్ట్.. క్రిస్టియన్ క్లార్క్ స్థానంలో జకరీ ఫౌల్క్స్, జేమీసన్ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జకరీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి -
IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు!
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా మరో విజయంపై కన్నేసింది. రాయ్పూర్ వేదికగా రెండో మ్యాచ్లోనూ గెలిచి ఆధిపత్యం కొనసాగించాలని పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.ఆడతాడా? లేదా?నాగ్పూర్లో కివీస్తో తొలి టీ20 సందర్భంగా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injured) గాయపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 16వ ఓవర్ వేసిన అక్షర్ బౌలింగ్లో డారిల్ మిచెల్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడగా.. బంతిని ఆపే క్రమంలో అక్షర్ ఎడమచేతికి గాయమైంది. చూపుడు వేలు చిట్లి రక్తం వచ్చింది. దీంతో అతడు మధ్యలోనే మైదానం వీడాడు.అయితే, అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో కివీస్తో రెండో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్నది తేలలేదు. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టులో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ ఆల్రౌండర్ అక్షర్ స్థానాన్ని.. మరో లెఫ్టాండర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భర్తీ చేసే అవకాశం ఉంది.కుల్దీప్ వైపు మొగ్గున్యూజిలాండ్తో వన్డే సిరీస్లో కుల్దీప్ యాదవ్ అంతంత మాత్రంగానే రాణించినా.. టీ20లలో అతడికి అపార అనుభవం ఉంది. కాబట్టిరవి బిష్ణోయిని కాదని కుల్దీప్ వైపు యాజమాన్యం మొగ్గుచూపవచ్చు. ఈ ఒక్క మార్పు మినహా భారత ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.బ్రేస్వెల్ వస్తాడా?కాగా కుల్దీప్ యాదవ్ ఇప్పటికి టీమిండియా తరఫున 50 టీ20 మ్యాచ్లు ఆడి.. 90 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టుకు శుభవార్త అందినట్లు తెలుస్తోంది. ఆల్రౌండర్ మైకేల్ బ్రేస్వెల్ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. అతడు తుదిజట్టులోకి వస్తే యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్పై వేటు పడే అవకాశం ఉంది.ఇక రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి సన్నాహకంగా ఇరుజట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. నాగ్పూర్లో 48 పరుగులు తేడాతో గెలిచి ఆధిక్యంలో నిలిచింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 తుదిజట్లు అంచనాభారత్అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రాబిన్సన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, క్రిస్టియన్ క్లార్క్/ మైకేల్ బ్రేస్వెల్, కైలీ జేమీసన్, ఇష్ సోధి, జేకబ్ డఫీ.UPDATE: తుదిజట్టులో రెండు మార్పులు.. సూర్య, ఇషాన్ విధ్వంసంచదవండి: భారత్కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
న్యూజిలాండ్కు భారీ షాక్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ ఆడం మిల్నే గాయపడ్డాడు. ఫలితంగా ఐసీసీ టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు.న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని శుక్రవారం ధ్రువీకరించింది. తొడ కండరాల గాయంతో మిల్నే వరల్డ్కప్ జట్టుకు దూరమైనట్లు తెలిపింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో భాగంగా మిల్నే సన్రైజర్స్ ఈస్టర్న్కేప్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు.మిల్నే స్థానంలో అతడేఇక ఆడం మిల్నే (Adam Milne) స్థానాన్ని బ్లాక్క్యాప్స్.. కైలీ జెమీషన్ (Kyle Jamieson)తో భర్తీ చేసింది. రిజర్వు ప్లేయర్గా ఉన్న అతడిని ప్రధాన జట్టులోకి చేర్చింది. జెమీషన్ స్థానంలో మరో ట్రావెలింగ్ రిజర్వును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. కాగా కివీస్ జట్టును గాయాల బెడద వేధిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే విలియమ్ ఒరూర్కీ, బ్లేయర్ టిక్నర్, నాథన్ స్మిత్, బెన్ సియర్స్ వంటి ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇక కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మార్క్ చాప్మన్, మ్యాట్ హెన్రీ తదితరులు ఇటీవలే గాయాల నుంచి కోలుకున్నారు. వీరంతా ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్నారు.ఫెర్గూసన్ సైతంఇదిలా ఉంటే.. వరల్డ్కప్ జట్టులో భాగమైన లాకీ ఫెర్గూసన్ పిక్కల్లో నొప్పి కారణంగా టీమిండియాతో సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. ఒకవేళ వరల్డ్కప్ నాటికి అతడు కోలుకోకపోతే జట్టుకు దూరమయ్యే పరిస్థితి.కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంకలు వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి టీ20లో టీమిండియా గెలవగా.. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి రెండో టీ20కి రాయ్పూర్ వేదిక.టీ20 వరల్డ్కప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ అప్డేటెడ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కైలీ జెమీషన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: వరల్డ్కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
ODI WC 2027: భారత వన్డే జట్టు.. ఊహించని పేరు!
టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.1199 పరుగులుఈ మ్యాచ్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్రేటు 190.93 కావడం విశేషం.వరల్డ్కప్ -2027 జట్టులోనూ ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్కప్ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్ప్లేలోనూ అభిషేక్ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.రోహిత్- గిల్ జోడీఇక వన్డేల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుత సారథి శుబ్మన్ గిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్తో సిరీస్లో అభిషేక్ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్గా వరల్డ్కప్ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
ప్రధాని తర్వాత కష్టమైన జాబ్ చేస్తున్నాడు
టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను ఏకీపారేస్తుంటే.. కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు, తిరువనతంపురం ఎంపీ శశిథరూర్ మాత్రం ప్రశంసలు కురిపించారు. దేశంలో రెండో కష్టతర కొలువు చేస్తూ కూడా గంభీర్ ఎంతో నిబ్బరంగా ఉన్నారంటూ కితాబిచ్చారు. నాగ్పూర్లో బుధవారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టి20 మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతకుముందుకు గంభీర్తో ఆయన భేటీ అయ్యారు. దీని గురించి 'ఎక్స్'లో పోస్ట్ చేసి, తమ ఫొటోను షేర్ చేశారు.''నాగ్పూర్లో నా పాత స్నేహితుడు గౌతమ్ గంభీర్తో జరిగిన చర్చను ఆస్వాదించాను. ప్రధానమంత్రి తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయనే! ప్రతిరోజూ లక్షలాది మంది తనను విమర్శిస్తున్నా ప్రశాంతంగా పనిచేసుకుపోతూ, ధైర్యంగా ముందుకెళుతున్నారు. గంభీర్ నిశ్శబ్ద సంకల్పం, సమర్థ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నాను. ఈరోజు నుండి ఆయనకు అన్ని విజయాలు దక్కాలని కోరుకుంటున్నాన''ని ఎక్స్లో రాసుకొచ్చారు. శశిథరూర్ ట్వీట్కు ధన్యవాదాలు అంటూ గంభీర్ సమాధానం ఇచ్చారు.కివీస్ రన్స్ కంటే నా సెల్పీలే ఎక్కువతన నాగ్పూర్లో పర్యటనలో భాగంగా ఆంత్రప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్(ఈవో) నిర్వహించిన కార్యక్రమంలో శశిథరూర్ పాల్గొన్నారు. బుధవారం రాత్రి విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- న్యూజిలాండ్ టి20 మ్యాచ్ను ఆయన వీక్షించారు. క్రికెట్ ప్రేమికుల కోలాహలం నడుమ మ్యాచ్ చూడడం ఎంతో బాగుందని పేర్కొంటూ.. తన ఫొటోలను 'ఎక్స్'లో షేర్ చేశారు. టీమిండియా-కివీస్ మ్యాచ్ చూడడంతో తన నాగ్పూర్ పర్యటన పూర్తయిందన్నారు. న్యూజిలాండ్ చేసిన పరుగుల కంటే తాను ఎక్కువ సెల్ఫీలు ఇచ్చానని చమత్కరించారు. టీమిండియా (Team India) విజయాన్ని పూర్తిగా ఆస్వాదించానని పేర్కొన్నారు.చదవండి: బెంగళూరు ఎన్నికలు.. రంగంలోకి బీజేపీ కీలక నేతకాగా, శశిథరూర్ కొంతకాలంగా సొంత పార్టీతో అంటిముట్టన్నట్టుగా వ్యవహరిస్తూ.. కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించి హస్తం పార్టీకి చిక్కులు తెచ్చిపెట్టారు. తాజాగా బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్ను కలవడంతో పాటు ఆయనను పొడగ్తలతో ముంచెత్తారు. గంభీర్ హెడ్కోచ్గా వచ్చిన తర్వాతే టీమిండియా ఎన్నడూ చవిచూడని పరాజయాలు పొందిందని అందరూ విమర్శిస్తుంటే.. థరూర్ మాత్రం ఆయనను వెనుకేసుకురావడం గమనార్హం. వీరిద్దరి భేటీపై కాంగ్రెస్ నాయకులు ఇంకా స్పందించలేదు. In Nagpur, enjoyed a good &frank discussion with my old friend @GautamGambhir, the man with the hardest job in India after the PM’s! He is being second-guessed by millions daily but stays calm &walks on undaunted. A word of appreciation for his quiet determination and able… pic.twitter.com/LOHPygVV0E— Shashi Tharoor (@ShashiTharoor) January 21, 2026 -
అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య
న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్పూర్ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్ అభిషేక్ శర్మదే.అతిపెద్ద సానుకూలాంశంఇక అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.సరైన సమయంలో క్రీజులోకివ్యక్తిగతంగా నా బ్యాటింగ్ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్లో నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.ఎక్కడున్నా అదే ఆలోచనఇక అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్లో.. టీమ్ బస్లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్ ప్లాన్ గురించే ఆలోచిస్తాడు. చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు.238 పరుగులుకాగా నాగ్పూర్లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్- కివీస్ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్కు రాయ్పూర్ వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా రికార్డుA thumping win! 👏🏻🇮🇳Shivam Dube finishes off the proceedings & after putting up a mammoth total, Team India bowlers combine to restrict the Kiwi batters to go 1-0 up! 👌🏻Watch #INDvNZ | 2nd T20I 👉 FRI, 23rd JAN, 6 PM on Star Sports Network & JioHotstar pic.twitter.com/WTK7BuF1Nv— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్- న్యూజిలాండ్ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.నాగ్పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.ఆకాశమే హద్దుఅయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్లో జెమీషన్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.కివీస్ ఓటమిభారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ You keep on counting, he keeps on hitting! 🤩😍𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026 -
అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్..తొలి టి20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
టీమిండియాకు భారీ షాక్
టీ20 ప్రపంచకప్ టీమిండియాను గాయాల బెడద వదలడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా.. తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో అక్షర్ గాయపడ్డాడు.కివీస్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్లో మూడో బంతిని డారిల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.మిగిలిన ఓవర్ను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే అక్షర్ గాయం తీవ్రమైనది కానట్లుగా తెలుస్తోంది. వేలు పైన మాత్రమే చిట్లడం వల్ల రక్త స్రవమైందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కానీ శుక్రవారం జరగనున్న రెండో టీ20కు మాత్రం అక్షర్ దూరమయ్యే అవకాశముంది.ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అభిషేక్ శర్మ 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రింకూ సింగ్(44) రాణించాడు. అనంతరం కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: అటు గిల్... ఇటు జడేజా -
తొలి టీ20లో భారత్ ఘన విజయం
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ను 48 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ సాధించిందిఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ విఫలమైనప్పటికి అభిషేక్ మాత్రం కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లుతో 84 పరుగులు చేశాడు. అతడితో పాటు రింకూ సింగ్(24 బంతుల్లో 44 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(32), హార్దిక్ పాండ్యా(25) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, జాకబ్ డఫ్ఫీ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. శాంట్నర్, సోధీ, క్లార్క్ తలా వికెట్ సాధించారు.అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగల్గింది. కివీస్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్స్లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు చాప్మన్(39)రాణించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్, అర్ష్దీప్, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 రాయ్పూర్ వేదికగా శుక్రవారం(జనవరి 23) జరగనుంది.చదవండి: అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్ -
అరుదైన మైలురాయిని తాకిన సూర్య భాయ్
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో నాగ్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 32 పరుగులు చేసిన సూర్య భాయ్.. పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా అత్యంత వేగంగా (321 ఇన్నింగ్స్లు) ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో విరాట్ కోహ్లి (271 ఇన్నింగ్స్లు), శిఖర్ ధవన్ (308) సూర్య కంటే ముందున్నారు. ప్రపంచం మొత్తంలో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ పేరిట ఉంది. బాబర్ కేవలం 245 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనత సాధించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. అభిషేక్ విధ్వంసం (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు), రింకూ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు) మెరుపుల కారణంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అతి భారీ స్కోర్ (238/7) చేసింది.మిగతా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. సూర్య భాయ్కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 100వ మ్యాచ్.ఈ మ్యాచ్లో సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8), శివమ్ దూబే (9), అక్షర్ పటేల్ (5) నిరాశపరిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు తొలి ఓవర్లోనే చేదు అనుభవం ఎదురైంది. రెండో బంతికే అర్షదీప్ డెవాన్ కాన్వేను (0) ఔట్ చేశాడు. రెండో ఓవర్లో న్యూజిలాండ్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా రచిన్ రవీంద్రను (1) పెవిలియన్కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 39-2గా ఉంది. రాబిన్సన్ (19), గ్లెన్ ఫిలిప్స్ (18) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 200 పరుగులు చేయాలి. -
అభిషేక్ విధ్వంసం, రింకూ మెరుపులు.. టీమిండియా భారీ స్కోర్
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా భారీ స్కోర్ (238/7) చేసింది. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి బంతి నుంచి ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు.అభిషేక్కు జతగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. అతని తర్వాత హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) కూడా సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 44 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేసింది.మిగతా భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ 10, ఇషాన్ కిషన్ 8, శివమ్ దూబే 9, అక్షర్ పటేల్ 5, అర్షదీప్ (6 నాటౌట్) పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జేమీసన్ చెరో 2.. క్రిస్టియన్ క్లార్క్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. -
అభిషేక్ శర్మ ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే..!
నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 21) జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్పై అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2020లో ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.అభిషేక్కు టీ20ల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ. దీంతో అతను మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు (8) పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అభిషేక్ తర్వాతి స్థానాల్లో ఫిల్ సాల్ట్, సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్ ఉన్నారు. వీరంతా తలో ఏడు సార్లు 25 అంతకంటే తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి ఐష్ సోధి బౌలింగ్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి జేమీసన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఇన్నింగ్స్లో అభిషేక్ టీ20ల్లో 5000 పరుగుల మార్కును తాకాడు. అభిషేక్ తన స్వల్ప అంతర్జాతీయ టీ20 కెరీర్లో (33 ఇన్నింగ్స్లు) 2 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీల సాయంతో, 190.92 స్ట్రయిక్రేట్తో, 37.46 సగటున 1199 పరుగులు చేశాడు. ఇందులో 112 ఫోర్లు, 81 సిక్సర్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి బంతి నుంచే ఎదురుదాడి ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (7 బంతుల్లో 10; 2 ఫోర్లు) స్వల్ప స్కోర్కే ఔటైనా అభిషేక్ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) సైతం నిరాశపర్చినా, అభిషేక్ మెరుపులు ఆగలేదు. ఇంకా చెప్పాలంటే ఇషాన్ ఔటయ్యాక శృతి మించాయి.కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 32; 4 ఫోర్లు, సిక్స్) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత వచ్చిన శివమ్ దూబే (9) భారీ షాట్లు ఆడే క్రమంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో ఉన్న హార్దిక్ (14 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనికి జతగా రింకూ సింగ్ (4) క్రీజ్లో ఉన్నాడు. 15.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 185/5గా ఉంది. -
భారత్తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్తో క్రిస్టియన్ క్లార్క్ వన్డే అరంగేట్రం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు పేసర్లుగా జేమీసన్, డఫీ ఉన్నారు.మరోవైపు భారత్ ముందుగా చెప్పినట్లుగానే శ్రేయస్ను కాదని వన్డౌన్లో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చింది. హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్లను బెంచ్కే పరిమితం చేసింది. కాగా, ఈ సిరీస్కు ముందు జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను పర్యాటక న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.తుది జట్లు..న్యూజిలాండ్: టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీభారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా -
సూర్యకుమార్ యాదవ్ సెంచరీ
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇవాళ (జనవరి 21) ఓ చారిత్రక మైలురాయిని తాకనున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్లు ఆడిన స్కై.. న్యూజిలాండ్తో నేడు జరుగబోయే మ్యాచ్తో మ్యాచ్ల సెంచరీని పూర్తి చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు.భారత క్రికెట్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ (159), విరాట్ కోహ్లి (125), హార్దిక్ పాండ్యా (124) మాత్రమే 100 టీ20 మ్యాచ్ల మైలురాయిని తాకారు.మరో చారిత్రక మైలురాయి దిశగా..మ్యాచ్ల సెంచరీతో పాటు సూర్య మరో చారిత్రక మైలురాయి దిశగా కూడా అడుగులు వేస్తాడు. మొత్తం టీ20 కెరీర్లో ఇప్పటివరకు 346 మ్యాచ్ల్లో 395 సిక్సర్లు కొట్టిన స్కై, మరో ఐదు సిక్సర్లు కొడితే 400 సిక్సర్ల క్లబ్లోకి ప్రవేశిస్తాడు. ఈ ఘనతను భారత క్రికెట్లో ఇప్పటివరకు కేవలం రోహిత్ శర్మ (547), విరాట్ కోహ్లి (435) మాత్రమే సాధించారు.పేలవ ఫామ్తో సతమతమవుతున్న సూర్యనేటి మ్యాచ్లో చారిత్రక మైలురాయిని అందుకోబోతున్న సూర్య గత ఏడాది కాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. గతేడాది అతను 21 మ్యాచ్ల్లో కేవలం 12.62 సగటున 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో కనీసం ఒక్క అర్ధశతకం కూడా లేదు. టీ20 వరల్డ్కప్ నేపథ్యంలో ప్రస్తుతం సూర్యపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెప్టెన్గా సఫలమవుతున్నప్పటికీ.. చెత్త ప్రదర్శన కారణంగా అతను ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాడు. స్కై ఇదే ఫామ్ను ప్రపంచకప్లోనూ కొనసాగిస్తే అతని కెరీర్ అర్దంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది.ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. -
IND vs NZ: అతడే మమ్మల్ని గెలిపిస్తాడు: కివీస్ కెప్టెన్
భారత్ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచి కొత్త ఏడాదిలో శుభారంభం అందుకుంది న్యూజిలాండ్. టీ20 సిరీస్లోనూ ఇదే ఫలితం పునరావృతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు పటిష్ట, నంబర్ వన్ జట్టును ఓడించి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తోంది.ఇదేమీ అంత కష్టం కాదంటున్నాడు కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner), డారిల్ మిచెల్ జోరు కొనసాగిస్తే తాము సులువుగానే టీ20 సిరీస్నూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడేందుకు భారత్కు వచ్చింది న్యూజిలాండ్.డారిల్దే కీలక పాత్రఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. కివీస్ భారత్ను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ది కీలక పాత్ర. ఈ సిరీస్లో అతడు సాధించిన పరుగులు వరుసగా.. 84, 131 నాటౌట్, 137.గతంలో స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డ డారిల్ మిచెల్ (Daryl Mitchell).. ఈసారి మాత్రం ఆ అవరోధాన్ని అధిగమించాడు. ముఖ్యంగా భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) బౌలింగ్లో అతడు చితక్కొట్టడం ఇందుకు నిదర్శనం. వన్డే ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని.. టీ20 సిరీస్లోనూ మిచెల్ అద్భుతాలు చేస్తాడని కివీస్ గట్టిగా నమ్ముతోంది.ఆరంభంలో ఇబ్బంది పడ్డాడుఈ నేపథ్యంలో నాగ్పూర్లో బుధవారం నాటి తొలి టీ20కి ముందు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘‘కెరీర్ ఆరంభంలో డారిల్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోలేక చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే, ఆ లోపాన్ని సరిచేసుకునేందుకు అతడు కఠినంగా శ్రమించాడు.అందుకు తగ్గ ఫలితాలు, ఫలాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అతడు స్పిన్ను సమర్థవంతంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో మధ్య ఓవర్లలో మ్యాచ్ను తన నియంత్రణలోకి తెచ్చుకున్న తీరు అద్భుతం. టీ20 సిరీస్లోనూ అదే స్థాయి ప్రదర్శన కనబరుస్తాడని ఆశిస్తున్నాం’’ అని సాంట్నర్ పేర్కొన్నాడు.ఇక్కడా గెలుస్తాంఇక ఇటీవలి కాలంలో సొంతగడ్డపై టెస్టుల్లో టీమిండియాను వైట్వాష్ చేసిన న్యూజిలాండ్.. తాజాగా వన్డే సిరీస్లో తొలిసారి గెలుపు రుచిచూసింది. ఈ నేపథ్యంలో సాంట్నర్ మాట్లాడుతూ.. ‘‘భారత్లో ఆడటం మాకెంతో ఇష్టం. అలాంటిది ఇక్కడ చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగడం మరింత సంతోషం.ఇప్పటికే రెండు ఫార్మాట్లలో అనుకున్న ఫలితం రాబట్టాము. ఇప్పుడు కూడా అదే పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాము. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదొక మంచి సన్నాహకంగా ఉంటుంది’’ అని సాంట్నర్ తెలిపాడు. చదవండి: భారత్లో మ్యాచ్లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్ -
IND vs NZ: అతడిపై వేటు.. భారత తుదిజట్టు ఇదే!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ఆఖరి సన్నాహకంగా న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నుంచి సిరీస్ ఆరంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టీ20 సందర్భంగా టీమిండియా స్టార్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ తమ స్థానాలు పదిలం చేసుకోగా.. గాయపడిన వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) స్థానంలో ఇషాన్ కిషన్ మూడో స్థానంలో వస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.శ్రేయస్ అయ్యర్కు నిరాశేఫలితంగా టీ20లలో రీఎంట్రీ ఇవ్వాలన్న వన్డే స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు మరోసారి నిరాశ తప్పదు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య బరిలోకి దిగుతాడని తెలిసిందే. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే సిద్ధంగా ఉన్నారు. ఏడు ఎనిమిది స్థానాల్లో శివం దూబేతో కలిసి హిట్టింగ్ ఆడే క్రమంలో రింకూ సింగ్కు కూడా తుదిజట్టులో చోటు ఖాయమే.వరుణ్ చక్రవర్తికే ఓటుస్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్ను కాదని వరుణ్ చక్రవర్తి వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇక పేసర్ల విభాగంలో ప్రధాన బౌలర్ బుమ్రాతో పాటు టీ20 వికెట్ల వీరుడు అర్ష్దీప్ సింగ్ స్థానం దక్కించుకోవడం సహజమే.కాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు విశ్రాంతినివ్వగా.. ఈ ఇద్దరి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఆడారు. ఆఖరిదైన మూడో వన్డేల్లో నితీశ్ (53), హర్షిత్ (52) అర్ధ శతకాలతో అలరించారు. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓడినా విరాట్ కోహ్లి (124)తో కలిసి కాస్తైనా పరువు నిలిచేలా చేశారు.అతడిపై వేటు తప్పదుఅయితే, టీ20 సిరీస్ సందర్భంగా హార్దిక్, బుమ్రా తిరిగి వచ్చారు. పాండ్యా ఉన్నాడు కాబట్టి నితీశ్ రెడ్డిని టీ20లకు ఎంపిక చేయలేదు. ఇక బుమ్రా కూడా వచ్చాడు కాబట్టి తొలి టీ20 సందర్భంగా హర్షిత్ రాణాపై వేటు పడక తప్పదని తెలుస్తోంది. ఒకవేళ లోయర్ ఆర్డర్లో హర్షిత్ బ్యాటింగ్కు ఉపయోగపడతాడని భావించినా.. టాపార్డర్ పటిష్టంగానే ఉన్న కారణంగా ఎక్స్ట్రా బ్యాటర్గా అతడి అవసరం ఉండకపోవచ్చు. అందుకే బుమ్రాకు తోడుగా అర్ష్దీప్ రంగంలోకి దిగుతాడని తెలుస్తోంది.న్యూజిలాండ్తో తొలి టీ20కి భారత తుదిజట్టు (అంచనా)సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.చదవండి: T20 WC: సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ వార్నింగ్ -
భారత్తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
భారత్-న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఎలా ఉండబోతుందో అనే దానిపై ఓ అంచనా వేద్దాం. ప్రపంచకప్కు ముందు జరుగబోయే చివరి సిరీస్ కావడంతో ఈ సిరీస్లో న్యూజిలాండ్ అన్ని కాంబినేషన్లను పరీక్షించే అవకాశం ఉంది.ఓపెనర్లుగా టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే బరిలోకి దిగడం లాంఛనమే. వీరిలో రాబిన్సన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాన్వే టీ20 ఫామ్ కాస్త కలవరపెడుతున్నా, ఇతర ఫార్మాట్లలో మంచి టచ్లో ఉండటం ఊరట కలిగించే అంశం. ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్ కావడంతో తుది జట్టులో కాన్వే స్థానం పక్కా. వన్డౌన్లో రచిన్ రవీంద్ర రావడం కూడా దాదాపుగా ఖాయమే. రచిన్కు ఈ స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 మ్యాచ్ల్లో 143.81 స్ట్రయిక్రేట్తో 325 పరుగులు చేశాడు. స్పిన్ బౌలర్లపై ఎదురుదాడి చేయగల సమర్దత రచిన్ను ఈ స్థానానికి ఫిక్స్ చేస్తుంది.న్యూజిలాండ్ మిడిలార్డర్లో చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ ఆ జట్టుకు ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం రాదు. నాలుగో స్థానంలో డారిల్ మిచెల్, ఆతర్వాత మార్క్ చాప్మన్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి బలమైన హిట్టర్లు, ఆల్రౌండర్లు ఉన్నారు. సమయానుసారంగా వీరి స్థానాల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.లోయర్ ఆర్డర్ విషయానికొస్తే.. ఇక్కడ కూడా దాదాపు అన్ని బెర్త్లు ఖరారై ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్ కమ్ బ్యాటర్గా మిచెల్ సాంట్నర్ ఏడు లేదా ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ సిరీస్లో సాంట్నర్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేయవచ్చు. సాంట్నర్కు భారత్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను ఆడిన 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ విభాగం మిగతా విభాగాల కంటే అత్యంత పటిష్టంగా ఉంది. గతేడాది ఫార్మాట్లకతీతంగా చెలరేగిన మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ తుది జట్టులో ఉంటారు. వీరికి మరో ఇన్ ఫామ్ పేసర్ కైల్ జేమీసన్ జత కలుస్తాడు. ఈ ముగ్గురితో కివీస్ పేస్ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది.ఐష్ సోది డౌటే..!భారత్పై ఐష్ సోధికి అద్భుత రికార్డు (20 మ్యాచ్లు, 25 వికెట్లు, ఎకానమీ 7.54) ఉన్నా, జట్టు కాంబినేషన్ కారణంగా తొలి మ్యాచ్లో అతనికి ఆడే అవకాశం రాకపోవచ్చు. సాంట్నర్తో పాటు రవీంద్ర, బ్రేస్వెల్, చాప్మన్, ఫిలిప్స్ స్పిన్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు.భారత్తో తొలి టీ20కి న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్. -
న్యూజిలాండ్తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్పూర్ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందుతుంది. ఈ మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ వన్డౌన్లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రకటించాడు.ISHAN KISHAN LOCKED 🔐 - Ishan will bat at 3 tomorrow for India. 🇮🇳pic.twitter.com/rHXco5dmLN— Johns. (@CricCrazyJohns) January 20, 2026రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్పై మేనేజ్మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ జట్టులోకి వస్తే, శ్రేయస్ అయ్యర్ బెంచ్కు పరిమితం కాక తప్పదు. తిలక్ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ భర్తీ చేయగలడని మేనేజ్మెంట్ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్ కంటే ఇషాన్కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్ మాటల ద్వారా స్పష్టమవుతుంది.ఇషాన్ చివరిగా 2023లో భారత్ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్కు ఇషాన్ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్ సిరీస్కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జట్టులోకి వచ్చినా తిలక్ గాయపడకుంటే, ఇషాన్కు అవకాశం వచ్చేది కాదు. తిలక్ గాయం ఇషాన్కు కొత్త లైఫ్ ఇచ్చినట్లైంది.వరల్డ్ కప్కు ముందు కీలక సిరీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ప్రపంచకప్కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్ జట్టునే ఈ సిరీస్కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్కు ముందు భారత్ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్కు ఎంపిక చేసిన వారిలో తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. తిలక్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్, సుందర్ స్థానాన్ని రవి బిష్ణోయ్ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వన్డౌన్లో ఇషాన్ కిషన్, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి రావచ్చు.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురం -
రేపటి నుంచి భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్
భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (జనవరి 21) ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్కు నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్స్టార్ యాప్ మరియు వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురంఈ సిరీస్లోని అన్ని మ్యాచ్లు రాత్రి 7 గంటలకే, పైన పేర్కొన్న మాధ్యమాల ద్వారానే ప్రత్యక్ష ప్రసారమవుతాయి.జట్లు..భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిన్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, మైఖేల్ బ్రేస్వెల్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జకరీ ఫౌల్క్స్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్, ఐష్ సోది, క్రిస్టియన్ క్లార్క్ఈ సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్లు, వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం.భారత్, న్యూజిలాండ్ మధ్య ఇప్పటివరకు 8 ద్వైపాక్షిక టీ20 సిరీస్లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ మూడు, భారత్ ఐదింట విజయాలు సాధించింది. ఇరు జట్ల మధ్య 2008-09లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆతర్వాత 2012లో న్యూజిలాండ్ తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటించింది. 2 మ్యాచ్ల ఈ సిరీస్ను కూడా న్యూజిలాండే కైవసం చేసుకుంది (1-0).అనంతరం 2017-18లో న్యూజిలాండ్ మరోసారి భారత్లో పర్యటించింది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్కు భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకొని, తొలిసారి న్యూజిలాండ్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది.ఆ మరుసటి ఏడాది (2018-19) భారత్ న్యూజిలాండ్లో పర్యటించి, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది.2019-20లో భారత్ మరోసారి న్యూజిలాండ్లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి, ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్ కోహ్లి టీ20 కెరీర్లోనూ ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది.అనంతరం 2021-22లో న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను కూడా భారత్ క్లీన్స్వీప్ (3-0) చేసింది.2022-23లో ఇరు జట్ల మధ్య రెండు సార్లు ద్వైపాక్షిక సిరీస్లు జరిగాయి. రెండు సిరీస్లను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యాటక జట్టుగా 1-0తో.. ఆతర్వాత ఆతిథ్య జట్టుగా 2-1తో సిరీస్లను కైవసం చేసుకుంది.శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంఇరు జట్ల మధ్య చివరిగా జరిగిన మ్యాచ్లో ప్రస్తుత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 126 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 168 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది. -
నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్తో గంభీర్.. వీడియో వైరల్
సొంతగడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సన్నాహకంగా కివీస్తో జరిగే ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్ సేన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది.హార్దిక్ పాండ్యా రీఎంట్రీహెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్-2025 మ్యాచ్లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్.. మంచి ఫామ్లో ఉన్నాడు. కివీస్తో టీ20 సిరీస్, ప్రపంచకప్ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కుపెట్టావు?ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ సెషన్లో బంతితో, బ్యాట్తో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్రౌండర్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్- హార్దిక్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.పవర్ఫుల్ హిట్టింగ్తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. ఇందుకు హార్దిక్.. ‘‘మొదటి టైర్లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్ టైర్లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు. బుమ్రా కూడాఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కివీస్తో టీ20 సిరీస్తో తిరిగి టీమిండియాతో చేరాడు. కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!Sound On 🔊 Dialling up the intensity as #TeamIndia steps into T20I mode to take on New Zealand ⚡️ #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/RSE2DXLFXA— BCCI (@BCCI) January 20, 2026 -
శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!
చాన్నాళ్లుగా టీమిండియా తరఫున వన్డేలకే పరిమితమయ్యాడు శ్రేయస్ అయ్యర్. దేశవాళీ టీ20 టోర్నీలో పరుగుల వరద పారించినా.. జట్టులో ఇప్పటికే పాతుకుపోయిన ఆటగాళ్ల కారణంగా అతడికి భారత టీ20 జట్టులో స్థానం కరువైంది.అయితే, తిలక్ వర్మ గాయం కారణంగా అనూహ్య రీతిలో ఇటీవలే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో పునరాగమనం చేసే అవకాశం దక్కించుకున్నాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma)గాయపడిన విషయం తెలిసిందే.శస్త్రచికిత్స విజయవంతంపొట్ట కింది భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడికి టెస్టిక్యులర్ టార్షన్ సమస్య ఉన్నట్లు తేలింది. దీంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ధ్రువీకరించింది.వేగంగా కోలుకుంటున్న తిలక్స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మూడు మ్యాచ్లకు తిలక్ వర్మ దూరమయ్యాడని బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే ఈ హైదరాబాదీ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం తిలక్ వర్మ వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం.బరిలోకి దిగేందుకు సైటైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. తిలక్ వర్మకు నొప్పి నుంచి విముక్తి లభించింది. ఇప్పటికే అతడు ఫిజికల్ ట్రెయినింగ్ మొదలుపెట్టాడు. ఫిట్నెస్ పరీక్ష కోసం అతడు మంగళవారం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి చేరుకుంటాడు.ఒకవేళ ఫిట్నెస్ నిరూపించుకుంటే కివీస్తో నాలుగో టీ20 (జనవరి 28)కి తిలక్ వర్మ అందుబాటులోకి వస్తాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ స్థానం గల్లంతు కావడం ఖాయం. అదే విధంగా.. తిలక్ గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2026లో ఆడాలన్న ఈ ముంబైకర్ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లు అవుతుంది. కాగా గత రెండేళ్లుగా భారత టీ20 జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన తిలక్ వర్మ.. ఆసియా కప్-2025 ఫైనల్లో జట్టును గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయి.చదవండి: బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్! -
గిల్ కెప్టెన్సీపై అశ్విన్ ఘాటు విమర్శలు
టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుబ్మన్ గిల్ టీమిండియా సారథిగా పగ్గాలు చేపట్టాడు. అనంతరం వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తప్పించి మరీ ఆ బాధ్యతలను గిల్కు అప్పగించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI).అయితే, పూర్తి స్థాయి కెప్టెన్గా గిల్ (Shubman Gill) ఇంత వరకు చెప్పుకోదగ్గ విజయాలు ఏవీ సాధించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయగలిగాడు. అయితే, స్వదేశంలో వెస్టిండీస్ను 2-0తో టెస్టుల్లో వైట్వాష్ చేసినా.. సౌతాఫ్రికా చేతిలో పాతికేళ్ల తర్వాత భారత్ తొలిసారి 2-0తో వైట్వాష్కు గురైంది.అశూ స్పందన ఇదేతాజాగా గిల్ సేనకు న్యూజిలాండ్ చేతిలోనూ ఘోర పరాభవం ఎదురైంది. కివీస్ జట్టు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా ఈ విషయంపై స్పందించాడు.ధోని, రోహిత్లను చూసి నేర్చుకోకివీస్ సిరీస్లో ముఖ్యంగా ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో గిల్ అనుసరించిన వ్యూహాలను అశూ తప్పుబట్టాడు. ఈ మేరకు.. ‘‘మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మలను గొప్ప కెప్టెన్లు అని ఎందుకు ప్రశంసిస్తారో తెలుసు కదా!వారిద్దరికి ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించాలో బాగా తెలుసు. తమకు ఉన్న వనరులను వారు ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకుంటారు. ఏ బ్యాటర్కు ఏ బౌలర్తో బౌలింగ్ వేయించాలో వాళ్లకు బాగా తెలుసు. అయితే, కివీస్తో సిరీస్లో ఇది మిస్సయింది.ఎంతమాత్రం సరికాదుఈ విషయంలో గిల్ కెప్టెన్సీలో లోపాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్లో బాగా ఆడకపోయినంత మాత్రాన నీ బౌలర్లపై నమ్మకం కోల్పోతావా? కెప్టెన్కు ఇది ఎంతమాత్రం సరికాదు. ముఖ్యంగా మూడో వన్డేలో గ్లెన్ ఫిలిప్స్ ఫాస్ట్ బౌలర్లను చితకబాదుతుంటే.. మధ్య ఓవర్లలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎందుకు బరిలోకి దించలేదు.అతడితో రెండు ఓవర్లు వేయించి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది. డారిల్ మిచెల్ విషయంలోనూ అనుకున్న ఫలితం రాబట్టగలిగేవాళ్లు. అందుబాటులో ఉన్న వనరులను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అన్నింటికంటే పెద్ద వైఫల్యం. ఒకవేళ అన్ని సరిగ్గా చేసినా ఓడిపోతే అదివేరు. కానీ ఇక్కడ మీ బెస్ట్ బౌలర్ల సేవలను సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు’’ అని అశ్విన్.. గిల్ కెప్టెన్సీపై ఘాటు విమర్శలు చేశాడు.చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగువాళ్లను పక్కనపెడతారా?: గిల్పై రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్ యంగ్స్టార్కి గోల్డెన్ ఛాన్స్
భారత్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్లో సత్తా చాటిన యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్వెల్ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్కాప్స్ (న్యూజిలాండ్)తో బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్ బ్రేస్వెల్ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్పూర్లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్ బ్రేస్వెల్ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్ ఆడిన కివీస్ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్తో తొలి వన్డేలో హర్షిత్ రాణాను అవుట్ చేసి తన ఖాతాలో తొలి వికెట్ జమచేసుకున్న క్లార్క్.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోనూ క్రిస్టియన్ క్లార్క్ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్లకు).షెడ్యూల్: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!
న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్తో మ్యాచ్లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు -
భారత్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో భారత్తో జరుగబోయే టీ20 సిరీస్ను రద్దు చేసుకొని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 21 నుంచి 31 వరకు భారత్లో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టులో ఎంపికైన నీషమ్, చివరి నిమిషంలో జాతీయ విధులను వద్దనుకొని, ఫ్రాంచైజీ లీగ్కు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాజ్షాహీ వారియర్స్ (నీషమ్ బీపీఎల్ ఫ్రాంచైజీ) హెడ్ కోచ్ హన్నన్ సర్కార్ సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు. కాగా, భారత్తో సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచకప్కు ముందు రిహార్సల్గా భావించబడుతోంది. ఈ సిరీస్కు ఎంపికైన వారే దాదాపుగా ప్రపంచకప్ జట్టులోనూ ఉంటారు. నీషమ్ కూడా న్యూజిలాండ్ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేశ ప్రయోజనాలు కాకుండా, వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై న్యూజిలాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నీషమ్ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా నీషమ్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ జట్టులో లేకపోవడం న్యూజిలాండ్కు పెద్ద లోటుగా పరిగణించబడుతుంది. అది భారత్తో సిరీస్ అయినా, ప్రపంచకప్ అయినా నీషబ్ లేని లోటు న్యూజిలాండ్ జట్టులో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీపీఎల్ 2025-26 ఎడిషన్లో నీషమ్ పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శనలేమీ చేయలేదు. నాలుగు మ్యాచ్ల్లో 30 పరుగులు, మూడు వికెట్లు మాత్రమే తీశాడు. నీషమ్ సత్తా చాటలేకపోయినప్పటికీ అతని జట్టు రాజ్షాహీ వారియర్స్ లీగ్ దశలో అగ్రస్థానంలో (10 మ్యాచ్ల్లో 8 విజయాలు) నిలిచింది. రాజ్షాహీ వారియర్స్ జనవరి 20న జరిగే తమ తదుపరి మ్యాచ్లో చట్టోగ్రామ్ రాయల్స్తో (తొలి క్వాలిఫయర్) తలపడనుంది. ఇదిలా ఉంటే, జనవరి 21న నాగ్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 జరుగనుంది. 35 ఏళ్ల నీషమ్కు ఈ మ్యాచ్లో ఆడే అవకాశం తప్పక ఉండేది.భారత్తో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు..హెన్రీ నికోల్స్, విల్ యంగ్, మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), నిక్ కెల్లీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, జకరీ ఫౌల్క్స్, జోష్ క్లార్క్సన్, డెవాన్ కాన్వే, మిచెల్ హే, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జేమీసన్, జేడన్ లెన్నాక్స్, మైఖేల్ రే -
గౌతమ్ గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ భవితవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అతడి మార్గదర్శకంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ను (1-2) కోల్పోవడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సిరీస్కు ముందు వరకు గంభీర్ను టెస్ట్ల నుంచి మాత్రమే తప్పించాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే తాజా పరాభవం తర్వాత గంభీర్పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. అతన్ని మొత్తానికే టీమిండియా నుంచి తప్పించాలని ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. స్వదేశంలో, అందులో సి-టీమ్ (న్యూజిలాండ్) చేతిలో పరాభవాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.వాస్తవానికి గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్లకు మాత్రమే పరిమితం అని అంతా అనుకుంటారు. కానీ, వన్డేల్లోనూ అతనికి చెత్త ట్రాక్ రికార్డే ఉంది. అతని జమానాలో టీమిండియా చిన్న జట్టైన శ్రీలంక చేతిలో కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ భారత్కు భంగపాటే ఎదురైంది.అతడి పుణ్యమా అని భారత్ తొలిసారి స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. మొత్తంగా అతని పదవీకాలంలో భారత జట్టు వన్డేల్లో 11 విజయాలు సాధించి, 6 పరాజయాలు ఎదుర్కొంది. వన్డేల్లో గంభీర్ చెప్పుకోదగ్గ విజయం ఏదైనా ఉందంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే.గంభీర్ పేలవ ప్రదర్శన టెస్ట్ల నుంచి చిన్నగా వన్డేలకు కూడా పాకడంతో, ఇక భరించేది లేదని అభిమానులు కరాఖండిగా చెబుతున్నారు. కేవలం టీ20ల కోసమే అతన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ స్థానంలో రాజకీయాలు చేయని ఎవరికైనా అవకాశం ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు.గంభీర్ కోచ్గా తన ప్రదర్శన కంటే రాజకీయాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో ఉంటాడు. అతని జమానాలో టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రచారం జరుగుతుంది. గంభీర్ కారణంగానే వారిద్దరు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారని టాక్. రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని అంతా అంటుంటారు. అంతగా అర్హం కాని శుభ్మన్ గిల్కు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్సీ కట్టబెట్టడంలోనూ గంభీర్దే కీలకపాత్ర అని ప్రచారం జరిగింది. సంజూ శాంసన్కు అన్యాయం చేసి గిల్ను టీ20ల్లోనూ ప్రమోట్ చేయాలని గంభీర్ ప్రణాళికలు రచించాడని సమాచారం.మహ్మద్ షమీ లాంటి సీనియర్ను అకారణంగా తప్పించి, హర్షిత్ రాణాకు ఎవరికీ ఇవ్వని అవకాశాలు ఇవ్వడం మనం చూస్తున్నాం. సర్ఫరాజ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ గంభీర్ రాజకీయాలకు బలైయ్యారనే టాక్ కూడా నడుస్తుంది. కోచ్గా తన పనితనంపై ఫోకస్ పెట్టకుండా గంభీర్ ఇలాంటి రాజకీయాలు కోకొల్లలు చేశాడని చాలామంది టీమిండియా మాజీలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీసీసీఐ వెంటనే గంభీర్పై వేటు వేయాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.గురువు ఎంతో శిష్యుడూ అంతే..!గంభీర్ ప్రమోట్ చేసిన శుభ్మన్ గిల్ సైతం భారత కెప్టెన్గా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అతని హయాంలో భారత్ తొలిసారి న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. అంతకుముందు ఆస్ట్రేలియా చేతిలోనూ పరాభవం ఎదుర్కొంది. టెస్ట్ల్లోనూ గిల్ (కెప్టెన్గా) ప్రదర్శన పేలవంగానే ఉంది. అరంగేట్రం సిరీస్లో (ఇంగ్లండ్) చావుతప్పి కన్ను లొట్ట పోయింది (2-2తో డ్రా). తాజాగా సౌతాఫ్రికా చేతిలో స్వదేశంలోనే ఘోర భంగపాటు (క్లీన్ స్వీప్) ఎదురైంది. ప్రదర్శన విషయంలో గిల్ తన గురువు గంభీర్తో పోటీ పడుతున్నాడు. -
టీమిండియా సిరీస్ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు
భారత క్రికెట్ జట్టుకు సొంతగడ్డపై మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. కివీస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. సొంత గడ్డపై తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న టీమిండియాకు న్యూజిలాండ్ వరుస షాకిలిస్తోంది. మొన్న టెస్టు సిరీస్.. నేడు వన్డే సిరీస్. స్వదేశంలో న్యూజిలాండ్పై వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ.. ఈ అప్రతిష్టను మూటకట్టుకుంది. 338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా చతికల పడింది. విరాట్ కోహ్లి ఆఖరి వరకు పోరాడినప్పటికి.. మిగితా సీనియర్ ప్లేయర్ల నుంచి సహకారం లభించలేదు. ఈ క్రమంలో సిరీస్ ఓటమికి గల కారణాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్.. నోహిట్ సాధారణంగా ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్ ఈ సిరీస్లో ముగబోయింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. హిట్మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. త్వరగా ఔట్ కావడంతో నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న శుభ్మన్ గిల్పై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్లో రోహిత్ మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ అన్నట్లుగా రోహిత్ మ్యాచ్ ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది.జడేజా అట్టర్ ప్లాప్రవీంద్ర జడేజా.. భారత జట్టు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. తన ఆల్రౌండర్ ప్రదర్శనతో ఎన్నో మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించిన ఘనత అతడిది. అటుంటి జడేజా ఈ సిరీస్లో దారుణ ప్రదర్శన కనబరిచాడు. బహుశా తన కెరీర్లో అత్యంత చెత్త ప్రదర్శనలలో ఈ సిరీస్ ఒకటిగా నిలిచిపోతుంది. మూడు మ్యాచ్లలో జడేజా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అలా అని బ్యాట్తో కూడా రాణించలేకపోయాడు. కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్లో ప్రధాన ఆల్రౌండర్గా జడేజా ప్రభావం చూపకపోవడం భారత్ను దెబ్బతీసింది.శ్రేయస్ సైలెంట్..ఇక మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 49 పరుగులతో రాణించిన అయ్యర్.. తర్వాతి రెండు మ్యాచ్లలో ఘోరంగా విఫలమయ్యాడు. కీలకమైన మూడో వన్డేలో అయ్యర్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. మిడిలార్డర్లో నమ్మదగ్గ ఆటగాడిగా ఉన్న శ్రేయస్ అయ్యర్ తన బ్యాట్కు పనిచెప్పకపోవడం భారత్ ఓటమికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు.బౌలింగ్ ఫెయిల్ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కన్పించింది. భారత పేసర్లు తేలిపోయారు. హర్షిత్ రాణా, సిరాజ్ ఫర్వాలేదన్పించినప్పటికి.. ప్రసిద్ద్ కృష్ణ మాత్రం పూర్తిగా తేలిపోయాడు. తొలి వన్డేలో భారత బౌలర్లు ఏకంగా 300 పరుగులు సమర్పించుకున్నారు.చదవండి: చక్కటి సంసారం.. ‘వివాహేతర సంబంధం’ చిచ్చు.. ఆఖరికి! -
మాది చిన్న దేశం.. అయినా పెద్ద పెద్ద జట్లను ఓడిస్తున్నాం: కివీస్ కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ గడ్డపై తొలి దైపాక్షిక వన్డే సిరీస్ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ 2-1 తేడాతో న్యూజిలాండ్ కైవసమైంది. గత పర్యటనలో టెస్టుల్లో భారత్ను వైట్వాష్ చేసిన కివీస్.. ఈసారి వన్డేల్లో మట్టి కరిపించింది. చివరి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్, బౌలింగ్లో దుమ్ములేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్ మిచెల్ (137), గ్లెన్ ఫిలిప్స్ (106) అద్భుత సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య చేధనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(124) ఒంటరి పోరాటం చేశాడు. అతడితో పాటు హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ రోహిత్, గిల్,శ్రేయస్ అయ్యర్ వంటి టాపార్డర్ బ్యాటర్ల నుంచి సహకరం లభించకపోవడంతో 296 పరుగుల వద్ద భారత్ ఆలౌట్ అయింది. ఇక ఈ చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ స్పందించాడు. భారత్పై సిరీస్ విజయం తమకెంతో ప్రత్యేకమని బ్రేస్వెల్ చెప్పుకొచ్చాడు."భారత్కు వచ్చి ఇక్కడ ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాం. టీమిండియా వంటి పటిష్టమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించి, తొలిసారి వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయాన్ని మేము ఎప్పటకీ మర్చిపోము. భారత్కు వచ్చి మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రతీ జట్టు కోరుకుంటుంది.మేము ఒక జట్టుగా మా ప్రణాళికలకు కట్టుబడి, సమష్టిగా రాణించేందుకు ప్రయత్నించాం. అది మాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రపంచంలో ఒక మూలన ఉన్న చిన్న దేశం నుంచి వచ్చిన మేము.. ఐక్యంగా ఉండి పెద్ద పెద్ద జట్లను సవాల్ విసురుతున్నాము. కలిసి కట్టుగా ఆడడం ఒక్కటే న్యూజిలాండ్ క్రికెట్ సిద్ధాంతం. ఇక డారిల్ మిచెల్ ఒక అద్బుతం. గత కొన్నేళ్లుగా వన్డేల్లో తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. అతడు మాకు మిడిలార్డర్లో కీలకమైన ఆటగాడు. మిచెల్ మా బ్యాటింగ్ యూనిట్ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ సిరీస్లో అరంగేట్రం చేసిన ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్ ప్రదర్శన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాము. భారత్ వంటి కఠిన పరిస్థితులలో వారి ఆట తీరు చూస్తుంటే కివీస్ క్రికెట్ భవిష్యత్తుపై ఎటువంటి ఢోకా లేదన్పిస్తోందని" బ్రేస్వేల్ పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.చదవండి: T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ డెడ్ లైన్.. లేదంటే? -
భారత జెర్సీలో మళ్లీ రో-కోలు కనిపించేది ఎప్పుడంటే?
టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.అంతకంటే మందు జూన్లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్పై కచ్చితంగా ఆడనున్నారు.కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్.. రోహిత్ ఫట్ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం! -
వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం!
న్యూజిలాండ్ వన్డే జట్టు తాత్కాలిక కెప్టెన్ మైకేల్ బ్రేస్వెల్పై టీమిండియా మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో భారత గడ్డపై తొలిసారి కివీస్కు వన్డే సిరీస్ విజయాన్ని అందించాడని కొనియాడాడు.మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) ఫిట్నెస్ సమస్యల కారణంగా వన్డే సిరీస్కు దూరం కాగా.. టీ20 సారథి బ్రేస్వెల్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.ఈ క్రమంలో బ్రేస్వెల్ (Michael Bracewell) కెప్టెన్సీలో తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన కివీస్.. ఆఖరి రెండు మ్యాచ్లలో గెలిచి తొలిసారి భారత్లో వన్డే సిరీస్ గెలిచింది. ఇండోర్లో ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది.బ్రేస్వెల్ ధనాధన్ఈ మ్యాచ్లో డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137), గ్లెన్ ఫిలిప్స్ (106) శతకాలతో చెలరేగగా.. కెప్టెన్ బ్రేస్వెల్ ధనాధన్ దంచికొట్టాడు. కేవలం 18 బంతుల్లోనే ఓ ఫోర్, మూడు సిక్సర్లు బాది 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసిన కివీస్.. లక్ష్యాన్ని కాపాడుకుని జయభేరి మోగించింది.ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఐదో స్థానంలో వచ్చి గ్లెన్ ఫిలిప్స్ మరోసారి అద్భుతంగా ఆడాడు. షార్ట్ పిచ్ డెలివరీలను చక్కగా ఆడాడు. బంతిని నేరుగా బౌండరీ మీదుగా తరలించాడు.అత్యంత కీలకంవికెట్ బాగుంది. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, మైకేల్ బ్రేస్వెల్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఈ మ్యాచ్కు అత్యంత కీలకం. అతడి కారణంగానే న్యూజిలాండ్ స్కోరు 300- 330 వరకు చేరుకోగలిగింది. బ్రేస్వెల్ సూపర్గా సిక్సర్లు బాదాడు.ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కూడా అతడిని ఎందుకు కొనలేదో నాకు ఇంత వరకు అర్థం కాలేదు. గాయం కారణంగా అతడు పెద్దగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అంతే తప్ప బ్యాటింగ్లో పర్లేదు. మరెందుకనో ఐపీఎల్ జట్లు అతడి వైపు మొగ్గు చూపలేదు.అసలు ఏ ప్రాతిపదికన ఐపీఎల్ జట్లు ఆటగాళ్లను ఎంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన బ్రేస్వెల్.. రెండో వన్డేలో బ్యాటింగ్ చేయకపోయినా వికెట్ తీయగలిగాడు. తాజాగా మూడో వన్డేలో విలువైన 28 పరుగులు చేయడంతో పాటు తన అద్భుత కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. కాగా 34 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ అయిన బ్రేస్వెల్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా! ఐపీఎల్ వేలం-2026లో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన బ్రేస్వెల్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.చదవండి: వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్! -
వాళ్లను పక్కనపెడతారా?: రహానే, జహీర్ ఖాన్ ఫైర్!
న్యూజిలాండ్తో మూడో వన్డేలో శుబ్మన్ గిల్ కెప్టెన్సీని భారత వెటరన్ క్రికెటర్ అజింక్య రహానే విమర్శించాడు. టీమిండియా బౌలర్ల సేవలను అతడు సరిగ్గా వాడుకోలేదని.. అందుకే కివీస్ భారీ స్కోరు సాధించగలిగిందని అభిప్రాయపడ్డాడు.ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.డారిల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలుడారిల్ మిచెల్ (Daryl Mitchell- 137), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips-106) శతకాలతో చెలరేగడంతో న్యూజిలాండ్కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 219 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ బ్రేక్ అనంతరం క్రిక్బజ్ వేదికగా అజింక్య రహానే మాట్లాడుతూ.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు గిల్ సరైన సమయంలో బంతిని ఇవ్వలేదని విమర్శించాడు.వాళ్లను పక్కనపెట్టి తప్పు చేశారు‘‘మధ్య ఓవర్లలో కుల్దీప్తో కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయించాడు గిల్. అక్కడే అతడు పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ 37-38వ ఓవర్ వరకు అతడి చేతికి బంతి రాలేదు.అదే విధంగా జడేజాను సైతం 30వ ఓవర్ వరకు అలాగే ఉంచారు. ఈ ఇద్దరు మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు తీయగల సత్తా కలిగిన వారు. అయినప్పటికీ వారిని పక్కనపెట్టారు. అక్కడే టీమిండియా అతిపెద్ద తప్పు చేసింది’’ అని రహానే అభిప్రాయపడ్డాడు.మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటేఇందుకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సైతం మద్దతు పలికాడు. కుల్దీప్ కంటే కూడా జడేజాను మిడిల్ ఓవర్లలో రప్పించి ఉంటే ఫలితం వేరుగా ఉండేదన్నాడు. జడ్డూను ఆలస్యంగా బరిలోకి దించి తప్పు చేశారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.మరోవైపు.. జడేజా ఆరు ఓవర్లు వేసి 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో మూడు వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది.ఓపెనర్లు రోహిత్ శర్మ (11), కెప్టెన్ శుబ్మన్ గిల్ (23) నిరాశపరచగా.. శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి పట్టుదలగా నిలబడ్డాడు. సెంచరీ (124)తో కదం తొక్కాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (53), ఎనిమిదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు.అయితే, మిగతా వారంత విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్ల ధాటికి 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌట్ అయిన గిల్ సేన.. మ్యాచ్తో పాటు తొలిసారి సొంతగడ్డపై కివీస్కు వన్డే సిరీస్నూ కోల్పోయింది. చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.ఈ టూర్లో వన్డే సిరీస్లో గిల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్ మొదలయ్యే వరకు గిల్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
కోహ్లి వీరోచితం సరిపోలేదు
భారత్ ముందున్న లక్ష్యం 338 అసాధారణమైంది. దీన్ని ఛేదించే క్రమంలో 71/4 స్కోరు వద్దే టీమిండియా కుదేలైంది. అప్పటికే రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అవుట్! ఉన్నది కోహ్లి ఒక్కడే! ఈ చేజింగ్ కింగ్... నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి 159 స్కోరు వరకు తీసుకెళ్లాడు. జడేజా నిర్లక్ష్యంగా ఆడినా... హర్షిత్ రాణాతో ఒడ్డున పడేసేందుకు కడదాకా శ్రమించాడు. 40 బంతుల్లో 61 పరుగుల సమీకరణం గెలుపుపై ధీమాను తెచి్చంది. ఇలాంటి తరుణంలో 277 స్కోరు వద్ద హర్షిత్ ని్రష్కమించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. కోహ్లి వీరోచిత పోరాటానికి అండగా నిలిచేవారే లేకపోవడంతో చివరకు 41 పరుగులతో మ్యాచ్ ఓడిన భారత్ సిరీస్ను 1–2తో చేజార్చుకుంది. ఇండోర్: ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో దెబ్బ కొట్టిన న్యూజిలాండ్... ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లోనూ కంగుతినిపించింది. మూడు వన్డేల సిరీస్ను ఓటమితో మొదలుపెట్టిన బ్రేస్వెల్ సారథ్యంలోని కివీస్ ఆ తర్వాత వరుస మ్యాచ్లు గెలిచి సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. వన్డే సిరీస్ను చేజార్చుకుంది. టాస్ నెగ్గిన టీమిండియా కెపె్టన్ శుబ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా న్యూజిలాండ్ నిరీ్ణత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’.. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ డరైల్ మిచెల్ (131 బంతుల్లో 137; 15 ఫోర్లు, 3 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 106; 9 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ను నాలుగో వికెట్కు 219 పరుగులు జోడించడం ద్వారా మిచెల్, ఫిలిప్స్ భారీస్కోరుకు బాట వేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. విరాట్ కోహ్లి (108 బంతుల్లో 124; 10 ఫోర్లు, 3 సిక్స్లు) వన్డేల్లో 54వ శతకం సాధించాడు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (57 బంతుల్లో 53; 2 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షిత్ రాణా (43 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తదుపరి ఇరు జట్ల మధ్య ఐదు టి20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ 21న నాగ్పూర్లో జరగనుంది. నిర్ల్యక్షంగా ఆడి... పెద్ద లక్ష్యం ముందుంటే బ్యాటింగ్కు స్వర్గధామమైన పిచ్పై పెద్దగా కష్టపడకుండానే రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ (3), కేఎల్ రాహుల్ (1) నిర్లక్ష్యంగా అవుటయ్యారు. 13వ ఓవర్ ముగియకముందే 71/4 స్కోరు వద్ద భారత్ లక్ష్యానికి దూరమైంది. వచ్చిరాగానే సిక్స్తో అలరించిన కోహ్లి అడపాదడపా బౌండరీలు బాదాడు. నితీశ్ రెడ్డితో కలిసి మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత సింగిల్స్, డబుల్స్తో ఇన్నింగ్స్ను చక్కబెట్టాడు. నితీశ్ కొట్టిన ఫోర్తో భారత్ స్కోరు 20వ ఓవర్లో 100కు చేరింది. తర్వాత కోహ్లి 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్స్లు బాదిన నితీశ్ కూడా 52 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే నితీశ్ను క్లార్క్ అవుట్ చేయడంతో ఐదో వికెట్కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కోహ్లి ముందుండి... తర్వాత కోహ్లికి జతయిన జడేజా (12) నిరాశపరిచాడు. కానీ హర్షిత్ రాణా బ్యాటర్ను తలపించే ఆటతీరుతో చక్కని భాగస్వామ్యానికి బాట వేశాడు. 37వ ఓవర్లో భారత్ 200 దాటింది. హర్షిత్తో పాటు కోహ్లి కూడా షాట్లు ఆడటంతో ఈ దశలో వేగంగా పరుగులు వచ్చాయి. ఈ జోరు సాగుతుండటంతో పోయిన ప్రాణం లేచివచ్చినట్లుగా భారత్ గెలుపుపై ఆశలు చిగురించాయి. దీంతోపాటు ‘కింగ్’ కోహ్లి 91 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 250 పరుగులకు చేరుకుంది. భారీ సిక్స్లతో విరుచుకుపడుతున్న హర్షిత్ 41 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. వెంటనే అతను అవుటవడంతో 69 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యానికి, భారత్ ఆశలకు తెరపడింది. 292 పరుగుల వద్ద కోహ్లి నిష్క్రమించగా, మరో రెండు బంతులకే భారత్ ఆలౌటైంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రోహిత్ (బి) హర్షిత్ 5; నికోల్స్ (బి) అర్ష్ దీప్ 0; యంగ్ (సి) జడేజా (బి) హర్షిత్ 30; మిచెల్ (సి) కుల్దీప్ (బి) సిరాజ్ 137; ఫిలిప్స్ (సి) రాహుల్ (బి) అర్ష్దీప్ 106; బ్రేస్వెల్ (నాటౌట్) 28; మిచెల్ హే (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 2; జాక్ ఫోక్స్ (సి) కుల్దీప్ (బి) అర్ష్దీప్ 10; క్లార్క్ (బి) హర్షిత్ 11; జేమీసన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–5, 2–5, 3–58, 4–277, 5–283, 6–286, 7–304, 8–327. బౌలింగ్: అర్ష్దీప్ 10–1–63–3, హర్షిత్ 10–0–84–3, సిరాజ్ 10–0–43–1, నితీశ్ 8–0–53–0, కుల్దీప్ 6–0–48–1, జడేజా 6–0–41–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లార్క్ (బి) ఫోక్స్ 11; గిల్ (బి) జేమీసన్ 23; కోహ్లి (సి) మిచెల్ (బి) క్లార్క్ 124; అయ్యర్ (సి) ఫోక్స్ (బి) క్లార్క్ 3; రాహుల్ (సి) ఫిలిప్స్ (బి) లెనాక్స్ 1; నితీశ్ (సి) యంగ్ (బి) క్లార్క్ 53; జడేజా (సి) యంగ్ (బి) లెనాక్స్ 12; హర్షిత్ (సి) నికోల్స్ (బి) ఫోక్స్ 52; సిరాజ్ (సి) హే (బి) ఫోక్స్ 0; కుల్దీప్ (రనౌట్) 5; అర్ష్దీప్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 8; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 296. వికెట్ల పతనం: 1–28, 2–45, 3–68, 4–71, 5–159, 6–178, 7–277, 8–277, 9–292, 10–296. బౌలింగ్: జేమీసన్ 9–0–58–1, ఫోక్స్ 9–0–77–3, క్లార్క్ 9–0–54–3, లెనాక్స్ 10–0–42–2, మిచెల్ 1–0–10–0, ఫిలిప్స్ 8–0–54–0. 1: భారత్లో భారత జట్టుతో న్యూజిలాండ్ ఇప్పటి వరకు 8 ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడింది. ఏడుసార్లు సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి భారత గడ్డపై వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.1: ఇండోర్లోని హోల్కర్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు 8 వన్డేలు ఆడింది. ఈ వేదికపై వరుసగా ఏడు వన్డేల్లో నెగ్గిన టీమిండియాకు న్యూజిలాండ్ తొలిసారి ఓటమి రుచి చూపించింది. 6: భారత్లో భారత జట్టును ఓడించి వన్డే సిరీస్ సొంతం చేసుకున్న ఆరో జట్టు న్యూజిలాండ్. గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఈ ఘనత సాధించాయి.9: కోహ్లి సెంచరీ సాధించిన వన్డేలో భారత జట్టు ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. -
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్తో వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. -
విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీ
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి.. కోహ్లి మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో అభిమానుల్లో గెలుపు ఆశలను రేకెత్తించాడు.ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది.న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు. -
ఇదేమి నాకు కొత్త కాదు.. క్రికెట్ కూడా వదిలేయాలనుకున్నా: హర్షిత్ రాణా
టీమిండియా యువ ఆల్రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్కు గురువుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు."వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను. ఒకానొక దశలో క్రికెట్ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు. -
ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా!
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్మ్యాన్ నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో రోహిత్ ఔటయ్యాడు.మిడాన్లో క్లార్క్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవలం 61 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్ను కివీస్పై మాత్రం కొనసాగించలేకపోయాడు. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో ఉన్న హిట్మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్మెంట్ మెరుగైన ప్రదర్శలను ఆశిస్తోంది.తడబడుతున్న భారత్..కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్మన్ గిల్ 23 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ఫౌల్క్స్, క్లార్క్, లినిక్స్, జేమిసన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
వన్డే క్రికెట్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. భారత్పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై గత ఐదు మ్యాచ్లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
మిచెల్, ఫిలిప్స్ సెంచరీలు.. భారత్ ముందు భారీ టార్గెట్
ఇండోర్ వేదికగా భారత్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు డెవాన్ కాన్వే(5), హెన్రీ నికోల్స్(0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డారిల్ మిచిల్.. విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. యంగ్(30) ఔటయ్యాక అసలు కథ మొదలైంది. అతడి స్ధానంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్, మిచెల్ కలిసి భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు ఏకంగా 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని అర్ష్దీప్ సింగ్ బ్రేక్ చేశాడు. మిచెల్ 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేయగా.. ఫిలిప్స్ కేవలం 88 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్స్లతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖరిలో బ్రేస్వెల్(28) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు. రవీంద్ర జడేజా మరోసారి కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కాగా డారిల్ మిచెల్కు ఈ సిరీస్లో ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్
సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్. ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.మిచెల్ సెంచరీల మోత..మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్లపై సత్తాచాటుతున్నాడు.వన్డే ప్రపంచకప్-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైనల్ అయితే తన విరోచిత సెంచరీతో భారత్ను ఓడించే అంతపనిచేశాడు. అంతకుముందు లీగ్ మ్యాచ్లో కూడా భారత్పై సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్లో భారత్పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్ను తాజా పర్యటనలో అతడు కొనసాగిస్తున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో అతడు పరుగులు వరద పారిస్తున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్లో విరోచిత సెంచరీతో చెలరేగాడు. మళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. మిచెల్ భారత్లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భారత్పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.రెండో ప్లేయర్గా..భారత్పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్ను మిచెల్ అధిగమిస్తాడు.చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్.. -
గంభీర్ చూశావా? తొలి ఓవర్లోనే వికెట్! వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత తుది జట్టులోకి వచ్చిన పేసర్ అర్ష్దీప్ సింగ్.. తొలి ఓవర్లోనే తన మార్క్ చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే కివీస్ ఓపెనర్ హెన్రీ నికోల్స్ను పెవిలియన్ పంపి భారత్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో గిల్ బౌలింగ్ ఎటాక్ను ప్రారంభించేందుకు కొత్త బంతిని అర్ష్దీప్ చేతికి ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని ఈ పంజాబ్ పేసర్ వమ్ముచేయలేదు. తన వేసిన తొలి ఓవర్ రెండో బంతికి డెవాన్ కాన్వే ఫోర్ బాదినా.. అర్ష్దీప్ ఏమాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు.అదే ఓవర్ ఐదో బంతికి అద్భుతమైన ఇన్స్వింగర్తో నికోల్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అతడు గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో తొలి రెండు వన్డేల్లో అర్ష్దీప్కు అవకాశమివ్వని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. ఇటువంటి బౌలర్ను ఎలా పక్కన పెట్టావు? అంటూ పోస్ట్లు పెడుతున్నారు.మొదటి రెండు వన్డేల్లో అర్ష్దీప్ బెంచ్కే పరిమితమయ్యాడు. దీంతో అశ్విన్ మాజీలు గంభీర్పై విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఎట్టకేలకు సిరీస్ డిసైడర్ మ్యాచ్లో అర్ష్దీప్కు అవకాశం దక్కింది. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ ప్రసిద్ద్ కృష్ణ స్దానంలో తుది జట్టులోకి వచ్చాడు.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్వెల్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్Arshdeep Singh has always been a wicket taker for India in every format.Still Gautam Gambhir used to bench him in most of the games. Jasprit Bumrah and Arshdeep will be the key in the T20 World Cup and the 2027 WC if Gambhir does not play politics 🔥🙇pic.twitter.com/tBcjoU9R2v— Tejash (@Tejashyyyyy) January 18, 2026 -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. టాస్ గెలిచిన టీమిండియా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్ కృష్ణ స్థానంలో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచ్ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. మూడో మ్యాచ్లో గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది.తుది జట్లు..న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ -
కివీస్తో మ్యాచ్ వరల్డ్ ఫైనల్ లాంటిది: మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్తో ఆదివారం ఇండోర్ వేదికగా సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో తాడో పేడో తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. మరోవైపు కివీస్ కూడా భారత గడ్డపై మరోసారి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ను వరల్డ్కప్ ఫైనల్లా భావిస్తున్నామని సిరాజ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిరీస్లో రెండు జట్లు సమవుజ్జీలగా ఉన్నాయి. గత పర్యటన మాదిరిగానే భారత జట్టుకు కివీస్ గట్టీ పోటీ ఇస్తుంది. అందుకే సిరాజ్ ఆఖరి వన్డేను ప్రపంచకప్ ఫైనల్తో పోల్చాడు.భారత్లో మాకు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఎదురవుతుంటాయి. మొన్న సౌతాఫ్రికా, నేడు న్యూజిలాండ్. చివరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము. ఈ మ్యాచ్ మాకు దాదాపు ప్రపంచ కప్ ఫైనల్ లాంటిది. జట్టులోని సీనియర్లు యువ ఆటగాళ్లకు చాలా మద్దతుగా ఉన్నారు. వారు నుంచి మాకు సలహాలు, సూచనలు అందుతున్నాయి.దీంతో డ్రెసింగ్ రూమ్ వాతావరణం చాలా బాగుంది. మేము మొదటి మ్యాచ్ గెలిచాం. దురదృష్టవశాత్తూ రెండో వన్డేలో ఓడిపోయాం. కాబట్టి ఇప్పుడు మాపై కాస్త ఒత్తిడి ఉంది. రాజ్కోట్ వన్డేలో డారిల్ మిచెల్ అవుట్ చేసేందుకు అన్ని విధాలంగా ప్రయాత్నించాము. కానీ ఒక క్యాచ్ డ్రాప్ కావడం వల్ల మ్యాచ్ పరిస్థితి మారిపోయింది.అతడు స్పిన్ను ఎదుర్కొనే తీరు, సింగిల్స్ తీస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచే విధానం నిజంగా అద్భుతం. మా బౌలింగ్ గురుంచి ఎలాంటి ఆందోళన లేదు. జట్టులో ప్రతీ ఒక్కరు పాజిటివ్ మైండ్తో ఉన్నారు. సిరీస్ డిసైడర్లో తప్పక గెలుస్తాము" అని సిరాజ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు!
భారత్-న్యూజిలాండ్ మధ్య సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఆదివారం ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక మ్యాచ్ భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను మూడో వన్డేలో ఆడించాలని టీమ్మేనెజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్లో ఇప్పటివరకు అర్ష్దీప్కు అవకాశమివ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన మనసు మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పేసర్ ప్రసిద్ద్ కృష్ణ స్ధానంలో అర్ష్దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.బదోని అరంగేట్రంఇక వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా అనుహ్యంగా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు అయూశ్ బదోని.. ఇండోర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. గత మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో అతడిపై వేటు వేసి బదోనికి ఛాన్స్ ఇవ్వాలని గంభీర్ అండ్ కో ఫిక్స్ అయినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే తొలి రెండు వన్డేల్లో విఫలమైన సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మరో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. జడ్డూ వన్డేల్లో గత కొంతకాలంగా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలని పలువరు మాజీలు టీమ్మెనెజ్మెంట్ను సూచిస్తున్నారు.పిచ్ రిపోర్ట్:ఇండోర్లోని హోల్కర్ స్టేడియం బ్యాటింగ్కు స్వర్గధామం. ఇక్కడ బౌండరీ లైన్స్ చాలా చిన్నవిగా ఉండటం వల్ల పరుగుల వరద పారే అవకాశం ఉంది. ఈ మైదానంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇండోర్లో టీమిండియా ఇప్పటివరకు 7 వన్డేలు ఆడగా, అన్నింటిలోనూ విజయం సాధించింది. 2011లో వెస్టిండీస్పై భారత్ ఏకంగా 418 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (219 పరుగులు) డబుల్ సెంచరీతో మెరిశాడు.మూడో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)శుభ్మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అయూష్ బదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ -
టీమిండియా స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో రేపు (జనవరి 18) జరుగబోయే నిర్ణయాత్మక మూడో వన్డే తర్వాత టీమిండియాకు అతి భారీ షాక్ తగలనుందని తెలుస్తుంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ తర్వాత వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని సమాచారం. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా వన్డే కెరీర్ భవితవ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటన్నిటికి మరి కొద్ది గంటల్లో అధికారికంగా తెరపడే అవకాశం ఉంది.వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలంప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్లో జడేజా తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి మ్యాచ్లో 9 ఓవర్లు వేసి వికెట్ లేకుండా 56 పరుగులు సమర్పించుకొని, ఆతర్వాత బ్యాటింగ్లో పూర్తిగా తేలిపోయాడు (4 పరుగులు). రెండో వన్డేలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి కొనసాగింది. బ్యాటింగ్లో (44 బంతుల్లో 27) కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్లో (8-0-44-0) సీన్ రిపీటయ్యింది. అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ జడ్డూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా బంతితో బాగా ఇబ్బంది పడ్డాడు.ఈ నేపథ్యంలో జడేజాకు వన్డే రిటైర్మెంట్పై ఒత్తిడి పెరిగి ఉంటుంది. అతను టెస్ట్ల్లో సత్తా చాటుతున్నా వన్డేల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నాడు. వాస్తవానికి న్యూజిలాండ్తో రెండో వన్డేనే జడ్డూకు చివరిదని టాక్ నడిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్కు వేదిక అయిన రాజ్కోట్ జడేజాకు హోం గ్రౌండ్. కానీ, ఆ మ్యాచ్ తర్వాత జడేజా ఎలాంటి ప్రకటన చేయలేదు. మూడో వన్డేకు ముందు మరోసారి అతని వన్డే రిటైర్మెంట్పై ఊహాగానాలు ఊపందుకున్నాయి.జడేజా ఫిట్గా ఉన్నాడు, ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం భారత జట్టుకు ఉపయోగపడతాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తాజాగా కామెంట్ చేసినప్పటికీ.. జడేజా వన్డే రిటైర్మెంట్పై ఆల్రెడీ డిసైడైపోయాడని ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల జడేజా ఇప్పటిరకు 209 వన్డేలు ఆడి 2893 పరుగులు చేసి, 232 వికెట్లు తీశాడు. వన్డేల్లో జడేజా స్థానంపై అక్షర్ పటేల్ ఇదివరకే కర్చీఫ్ వేసి ఉంచాడు. జడ్డూ రిటైర్మెంట్ తర్వాత అతను వన్డేల్లో రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయే అవకాశం ఉంది. -
శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్కు ఊహించని అవకాశం
భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఐపీఎల్కు మాత్రమే పరిమితమైన రవి బిష్ణోయ్కు ఊహించని ఆఫర్ వచ్చింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు ఎంపికైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాల బారిన పడటంతో వారి స్థానాలు భర్తీ చేసే సువర్ణావకాశం వీరికి దక్కింది. శ్రేయస్, బిష్ణోయ్ను న్యూజిలాండ్ సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.జనవరి 21, 23, 25 తేదీల్లో జరగబోయే తొలి మూడు మ్యాచ్ల్లో శ్రేయస్ తిలక్ వర్మ స్థానంలో ఆడనున్నారు. తిలక్ ఐదు మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లో మొదటి మూడు మ్యాచ్లకు మాత్రమే దూరమైన విషయం తెలిసిందే. బిష్ణోయ్ మాత్రం సిరీస్ మొత్తానికి సుందర్కు రీప్లేస్మెంట్గా ఉంటాడు. వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన సుందర్ న్యూజిలాండ్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానమేనని తెలుస్తుంది.సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స పొందుతున్నాడు. సుందర్కు స్కాన్స్లో సైడ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ అని తేలింది. దీంతో అతనికి దాదాపు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఒకవేళ అతను త్వరగా కోలుకుంటే ప్రపంచకప్కు ఎంపికయ్యే అవకాశం ఉంది.శ్రేయస్ భారత్ తరఫున తన చివరి టీ20ని 2023 డిసెంబర్లో ఆస్ట్రేలియాతో ఆడారు. ఆతర్వాత అతను క్రమంగా టీమిండియా టీ20 సర్కిల్స్ నుంచి మాయమయ్యాడు. అయితే 2025 ఐపీఎల్లో అత్యుత్తమంగా రాణించడంతో శ్రేయస్కు భారత టీ20 జట్టులో స్థానం కల్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు తిలక్ గాయపడటంతో అతనికి ఊహించని విధంగా భారత టీ20 బెర్త్ దక్కింది. ఒకవేళ శ్రేయస్ న్యూజిలాండ్తో మొదటి మూడు టీ20ల్లో రాణిస్తే, ఆ సిరీస్ మొత్తానికి కొనసాగించడంతో పాటు ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశం ఉంది. శ్రేయస్ గత ఐపీఎల్లో 175.07 స్ట్రయిక్రేట్తో 604 పరుగులతో సత్తా చాటడంతో, తన జట్టు పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా ఫైనల్స్కు కూడా చేర్చాడు.రవి బిష్ణోయ్ విషయానికి వస్తే.. ఈ కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ చివరిగా 2025 జనవరిలో ఇంగ్లండ్తో జరిగిన టీ20లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆతర్వాత వరుణ్ చక్రవర్తి కారణంగా అతనికి అవకాశాలు రాలేదు. వరుణ్ దాదాపు ప్రతి మ్యాచ్లో రాణిస్తూ భారత స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానాన్ని కబ్జా చేశాడు. దీంతో బిష్ణోయ్కు అవకాశాలు రాలేదు. తాజాగా వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో బిష్ణోయ్కు ఊహించని అవకాశం దక్కింది. తొలుత సుందర్ స్థానాన్ని మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో భర్తీ చేస్తారని అంతా అనుకున్నారు. రియాన్ పరాగ్ పేరు పరిశీలనలో కూడా ఉండింది. అయితే ఊహించని విధంగా భారత సెలెక్టర్లు స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన బిష్ణోయ్కు అవకాశం కల్పించారు. బిష్ణోయ్ ఇప్పటివరకు భారత్ తరఫున 42 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.న్యూజిలాండ్ టీ20 సిరీస్కు టీమిండియా (అప్డేటెడ్): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు మ్యాచ్లు), రవి బిష్ణోయ్ -
అతడి కారణంగానే రాజ్కోట్లో ఓడిపోయాం: ఇర్ఫాన్ పఠాన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.భారత బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్తో పాటు బంతితో విఫలమైన ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై పఠాన్ విమర్శలు గుప్పించాడు. జడేజా నెమ్మదిగా ఆడడమే వల్లే భారత్ 300 పరుగులు దాటలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డాడు.రాజ్కోట్ వన్డేలో భారత్ స్కోర్ సునాయసంగా 300 పరుగుల మార్క్ దాటి ఉండేది. ఎల్ రాహుల్ అద్భుతంగా ఆడి 90 స్ట్రైక్ రేట్తో సెంచరీ చేస్తే.. జడేజా మాత్రం తన సొంత మైదానంలో 60 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కనీసం 80 స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే భారత్ అదనంగా మరో 20-30 పరుగులు వచ్చేవి. జడేజా అద్భుతమైన ఆల్రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.టెస్ట్ క్రికెట్లో కపిల్ దేవ్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఆల్రౌండర్గా జడ్డూ నిలిచాడు. కానీ వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా అతడు కష్టపడుతున్నాడు.2020 తర్వాత జడేజా వన్డేల్లో ఇప్పటివరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. గత ఐదు మ్యాచ్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఒక సీనియర్ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రదర్శనలు జట్టుకు అస్సలు మంచిది కాదు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ను ఆడించడం బెటర్ అని తన యూట్యూబ్ ఛానల్లో పఠాన్ పేర్కొన్నాడు.చదవండి: అతడొక అద్భుతం.. కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్ -
కనీసం మూడో మ్యాచ్లోనైనా ఆడించండి: అశ్విన్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియాకు ఘోర పరభావం ఎదురైన సంగతి తెలిసిందే. భారత్ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కివీస్.. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఆదివారం(జనవరి 18) ఇండోర్ స్టేడియం వేదికగా జరగనుంది.అయితే తొలి రెండు వన్డేల్లో భారత స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అర్ష్దీప్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పటికి అతడికి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణల వైపు టీమ్ మెనెజ్మెంట్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో అర్ష్దీప్ను కనీసం మూడో వన్డేలోనైనా తుది జట్టులోకి తీసుకోవాలని హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు."బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లకు అయితే హిట్-ది-డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్తో అటువంటి బౌలర్లు అవసరం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ విషయాన్ని నేను ఆర్ధం చేసుకోగలను. కానీ అర్ష్దీప్ గురుంచి ఎవరూ ఆలోచించడం లేదు.అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి చేరుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో జట్టు విజయాల్లో భాగమయ్యాడు. అయినా ఇప్పటికీ అతడు జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. బ్యాటర్ల విషయంలో ఇలా ఎప్పుడూ జరగదు. ప్రతీసారి బౌలర్లే బలి అవుతున్నారు.అత్యుత్తమంగా రాణించినా బౌలర్లు కూడా తమ చోటును కాపాడుకోవడానికి నిరంతరం పోరాడాల్సి వస్తోంది. ఎక్కువ కాలం మ్యాచ్లు ఆడకుండా బెంచ్పై కూర్చోబెడితే, ఎంతటి గొప్ప బౌలర్ అయినా తన రిథమ్ను కోల్పోవాల్సి వస్తుంది. కనీసం మూడో వన్డేలోనైనా అతడికి ఛాన్స్ ఇవ్వండి" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: అతడి కోసం బీసీసీఐ 'ప్లాన్ బి'.. రేసులో స్టార్ ప్లేయర్లు -
జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం
టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం అసన్నమైందా? అంటే అవునానే సమాధనం ఎక్కువగా వినిపిస్తోంది. జడేజా టెస్టు క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి.. వన్డేల్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు.ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లోనూ అతడి ఆట తీరు ఏ మాత్రం మారలేదు. తొలి వన్డేలో కూడా ఘోరంగా విఫలమైన జడేజా బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. ఈ మ్యాచ్లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు.బ్యాటింగ్లోనూ కేవలం 27 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలిగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్రౌండర్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్షర్ పటేల్ను ఎందుకు వన్డే జట్టులోకి తీసుకోవడం లేదని సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా పేలవ ఫామ్ గురుంచి కూడా అతడు మాట్లాడాడు."నాకు ఇష్టమైన ఆటగాళ్లలో జడేజా ఒకరు. కానీ అతడు ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతమవుతున్నాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా రాణించలేకపోతున్నాడు. బంతిని అటాకింగ్గా వేయాలా లేక ఫ్లైట్ ఇచ్చి బ్యాటర్ను ట్రాప్ చేయాలా అనే విషయంలో అతడు కాస్త గందరగోళంగా ఉన్నాడు.ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఎందుకు ఆడకూడదు? ఆల్రౌండర్ అంటే మీడియం పేసరే ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్కోట్ వన్డేలో భారత్కు అదనపు స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అక్షర్ పటేల్ ఉండి ఉంటే బాగుండేది. అక్షర్ను ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు? అతడొక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు సాటి వచ్చే ఆటగాడు దొరకడం కష్టం. కాబట్టి అత్యుత్తమ ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ను జట్టులోకి తీసుకోవడం బెటర్" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా వాషీ స్దానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.దీంతో మరోసారి భారత జట్టులో ఆల్రౌండర్ల కొరత కన్పిస్తోంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన జడేజా.. ఇదే ఫామ్ కొనసాగితే వన్డేల నుంచి కూడా తప్పుకొనే అవకాశముంది. ఈ క్రమంలో జడేజాకు ప్రత్యామ్నాయంగా అక్షర్ పటేల్ పేరును చాలా మంది మాజీలు సూచిస్తున్నారు.చదవండి: ఇరగదీసిన అరంగేట్రం ఆటగాడు.. ప్లే ఆఫ్స్కు సన్రైజర్స్జడేజా తరహాలోనే ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని, సెలక్టర్లు అక్షర్ పటేల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లోనూ సత్తాచాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ అతడు భాగంగా ఉన్నాడు. -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు కీలక ప్లేయర్ దూరం
త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో తొలి వన్డే సందర్భంగా గాయపడిన కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ప్రపంచకప్లో పాల్గొనేది కూడా అనుమానంగా మారింది. న్యూజిలాండ్ టీ20 సిరీస్కు వరల్డ్కప్కు ఒకే జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే.సుందర్కు ఏమైంది..?జనవరి 11న వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ ఎడమ వైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో అతను ఉన్నపళంగా మైదానం వదిలి వెళ్లాడు. అయితే, ఛేదనలో అతని బ్యాటింగ్ సేవలు జట్టుకు అవసరం కావడంతో రిస్క్ చేసి బరిలోకి దిగాడు. ఈ ప్రయత్నమే సుందర్ గాయాన్ని మరింత పెంచిందని వైద్యులు భావిస్తున్నారు. ఆ మ్యాచ్లో సుందర్ తనవంతుగా 7 పరుగులు చేసి జట్టు విజయంలో భాగమయ్యాడు. అనివార్యం కావడంతో బ్యాటింగ్ చేసిన సుందర్, ఆతర్వాత వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానాన్ని ఆయుశ్ బదోనితో భర్తీ చేశాడు. సుందర్ గాయం తీవ్రత అధికంగా ఉండటంతో తాజాగా అతన్ని టీ20 సిరీస్ నుంచి కూడా తప్పించారు. టీ20లకు సుందర్ ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. పరిస్థితలు చూస్తుంటే సుందర్ టీ20 వరల్డ్కప్కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. పొట్టి ఫార్మాట్లో సుందర్ లాంటి కీలకమైన మిడిలార్డర్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం టీమిండియా విజయావాకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. సుందర్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్లో నమ్మదగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ సమయంలో అయినా బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటంతో పాటు 6,7 స్థానాల్లో సైతం సమర్దవంతంగా బ్యాటింగ్ చేయగలడు.రియాన్ పరాగ్ వస్తాడా..?న్యూజిలాండ్ టీ20 సిరీస్కు సుందర్కు ప్రత్యామ్నాయంగా రియాన్ పరాగ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పరాగ్ ఐపీఎల్ 2025లో ఓ మోస్తరుకు మించి రాణించాడు. 32.75 సగటున 393 పరుగులు చేశాడు. ఒకవేళ పరాగ్కు న్యూజిలాండ్ సిరీస్లో అవకాశం వచ్చి రాణిస్తే.. ప్రపంచకప్కు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఉపఖండంలో పిచ్లపై స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు చాలా కీలకం. మరోవైపు వన్డేల్లో సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఆయుశ్ బదోనీనే టీ20 సిరీస్కు కూడా కొనసాగించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
మరో అరుదైన మైలురాయిని తాకిన రోహిత్ శర్మ
భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ తన కెరీర్లో మరో అరుదైన మైలురాయిని తాకాడు. ఆసియా ఖండంలో 7000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న ఏడో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో ఈ ఫీట్ను సాధించాడు. రోహిత్కు ముందు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, కుమార సంగక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే ఆసియాలో 7000 వన్డే పరుగుల మైలురాయిని తాకారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో అద్బుత విజయం సాధించిన టీమిండియాకు రెండో మ్యాచ్లో చుక్కెదురైంది. పర్యాటక న్యూజిలాండ్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాగా, ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
అందుకు మూల్యం చెల్లించుకున్నాం.. రెండో వన్డేలో ఓటమిపై గిల్ కామెంట్స్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ (56) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 24, విరాట్ కోహ్లి 23, శ్రేయస్ అయ్యర్ 8, రవీంద్ర జడేజా 27, నితీశ్ కుమార్ రెడ్డి 20, హర్షిత్ రాణా 2 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్ 3, జేమీసన్, ఫౌల్క్స్, లెన్నాక్స్, బ్రేస్వెల్ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (131 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కదంతొక్కడంతో 47.3 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మిచెల్కు విల్ యంగ్ (87) సహకరించాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ క్యామియో (మెరుపు ఇన్నింగ్స్) ఆడాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత శ్రమించినా మిచెల్, యంగ్ను నిలువరించలేకపోయారు. కుల్దీప్ యాదవ్ అయితే ఒక్క వికెట్ తీసి, ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లది కూడా అదే పరిస్థితి. హర్షిత్, ప్రసిద్ద్ తలో వికెట్ తీసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ సైతం తమ బౌలింగ్ ప్రదర్శనపై పెదవి విరిచాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం వల్ల మూల్యం చెల్లించుకున్నామని అన్నాడు. అదనంగా 15-20 పరుగులు చేసినా ఫలితం ఇలాగే ఉండేదని అభిప్రాయపడ్డాడు. బోర్డుపై మంచి స్కోర్ ఉంచినా, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే మ్యాచ్ను తమ చేతి నుంచి లాగేసుకుందని తెలిపాడు.మరిన్ని విషయాలు గిల్ మాటల్లో.. 10–15 ఓవర్లలో బంతి కాస్త కదిలి బౌలర్లకు సహకరించింది. కానీ 20–25 ఓవర్ల తర్వాత పిచ్ స్థిరపడింది. మధ్య ఓవర్లలో మేము మరింత ధైర్యంగా బౌలింగ్ చేసి, రిస్క్ తీసుకొని ఉండాల్సింది. అలా చేసుంటే ఫలితం వేరుగా ఉండేది.ఫీల్డింగ్ లోపాలు కూడా జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాయి. గత మ్యాచ్లో కూడా కొన్ని అవకాశాలు వదిలేశాం. ఫీల్డింగ్లో మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం. అవకాశాలు వదిలేస్తే మాత్రం ఈ ఫార్మాట్లో ఓటమి తప్పదని గిల్ అభిప్రాయపడ్డాడు. మొత్తంగా గిల్ బౌలింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా.. తాజాగా న్యూజిలాండ్ రెండో వన్డే గెలిచింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరుగనుంది. -
న్యూజిలాండ్దే పైచేయి...
భారత్ వరుసగా గత ఎనిమిది వన్డేల్లో న్యూజిలాండ్ను ఓడిస్తూ వచ్చి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు ఈ జోరును కివీస్ ముగించగలిగింది. ముందుగా సమష్టి బౌలింగ్తో భారత్కు 300 పరుగులు కూడా దాటనీయకుండా నిలువరించిన జట్టు... ఆ తర్వాత మిచెల్, విల్ యంగ్ పదునైన బ్యాటింగ్తో విజయాన్ని సొంతం చేసుకుంది. మన బౌలర్లంతా విఫలం కాగా, అంతకుముందు కేఎల్ రాహుల్ చేసిన అజేయ సెంచరీ వృథా అయింది. రాజ్కోట్: భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ 1–1తో సమమైంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో కివీస్ 7 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 112 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకం సాధించాడు. కెపె్టన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డరైల్ మిచెల్ (117 బంతుల్లో 131 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్లు), విల్ యంగ్ (98 బంతుల్లో 87; 7 ఫోర్లు) మూడో వికెట్కు 25.2 ఓవర్లలో 162 పరుగులు జోడించి జట్టు గెలుపును సులువు చేశారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (38 బంతుల్లో 24; 4 ఫోర్లు), గిల్ నెమ్మదిగా ప్రారంభించారు. ఫలితంగా తొలి 5 ఓవర్లలో 10 పరుగులే వచ్చాయి. అయితే తాను ఆడిన తర్వాతి 10 బంతుల్లో రోహిత్ 4 ఫోర్లు కొట్టగా, ఫోక్స్ ఓవర్లో గిల్ వరుసగా 4, 6 కొట్టడంతో 3 ఓవర్లలో భారత్ 33 పరుగులు రాబట్టింది. 10 ఓవర్లలో జట్టు స్కోరు 57 పరుగులకు చేరింది. 70 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత రోహిత్ వెనుదిరగ్గా, 47 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఈసారి విరాట్ కోహ్లి (29 బంతుల్లో 23; 2 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. గత ఐదు ఇన్నింగ్స్లలో వరుసగా 74, 135, 102, 65, 93 చేసిన అతను ఈ మ్యాచ్లో అర్ధసెంచరీ అందుకోలేకపోయాడు. కివీస్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో 19 పరుగుల వ్యవధిలో భారత్ గిల్, శ్రేయస్ అయ్యర్ (8), కోహ్లి వికెట్లు కోల్పోయింది. మధ్య ఓవర్లలో న్యూజిలాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒక దశలో 62 బంతుల పాటు ఒక్క ఫోర్ కూడా రాలేదు! ఇలాంటి స్థితిలో రాహుల్ రెండు కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. ముందుగా జడేజా (44 బంతుల్లో 27; 1 ఫోర్)తో ఐదో వికెట్కు 73 పరుగులు జోడించిన రాహుల్... ఆ తర్వాత ఆరో వికెట్కు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 20; 1 సిక్స్)తో 57 పరుగులు జత చేశాడు. హర్షిత్ రాణా (2) విఫలం కాగా 48 ఓవర్లు ముగిసేసరికి రాహుల్ 88 పరుగులతో ఉన్నాడు. జేమీసన్ వేసిన 49వ ఓవర్లో తొలి 5 బంతుల్లో 8 పరుగులు రాబట్టిన అతను... ఆఖరి బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్గా మలచి 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్లు విఫలం... లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కూడా ఆరంభంలో తడబడింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో భారత్ పేస్ బౌలింగ్నే ఎక్కువసేపు కొనసాగించింది. పేసర్లే వేసిన తొలి 15 ఓవర్లలో కివీస్ 64 పరుగులు మాత్రమే చేసి కాన్వే (16), నికోల్స్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే మిచెల్, యంగ్ పట్టుదలగా క్రీజ్లో నిలబడి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా నిలదొక్కుకోవడంపై దృష్టి పెట్టిన వీరిద్దరు ఆ తర్వాత స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ముందుగా మిచెల్ 52 బంతుల్లో, ఆ తర్వాత యంగ్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీలను అందుకున్నారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. కుల్దీప్ బౌలింగ్లో 80 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద ప్రసిధ్ వదిలేయడం కూడా జట్టుకు కలిసొచి్చంది. ఎట్టకేలకు కుల్దీప్ తర్వాతి ఓవర్లో యంగ్ వెనుదిరగడం భారత్కు కాస్త ఊరటనిచి్చంది. అయితే మిచెల్ మాత్రం తగ్గలేదు. 96 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న అతను... గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు 1 సిక్స్)తో కలిసి మరో 15 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యంగ్ (బి) క్లార్క్ 24; గిల్ (సి) మిచెల్ (బి) జేమీసన్ 56; కోహ్లి (బి) క్లార్క్ 23; అయ్యర్ (సి) బ్రేస్వెల్ (బి) క్లార్క్ 8; రాహుల్ (నాటౌట్) 112; జడేజా (సి అండ్ బి) బ్రేస్వెల్ 27; నితీశ్ రెడ్డి (సి) ఫిలిప్స్ (బి) ఫోక్స్ 20; హర్షిత్ (సి) బ్రేస్వెల్ (బి) లెనాక్స్ 2; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–70, 2–99, 3–115, 4–118, 5–191, 6–248, 7–256. బౌలింగ్: జేమీసన్ 10–2–70–1, ఫోక్స్ 9–0–67–1, క్లార్క్ 8–0–56–3, లెనాక్స్ 10–0–42–1, బ్రేస్వెల్ 10–1–34–1, ఫిలిప్స్ 3–0–13–0. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (బి) హర్షిత్ 16; నికోల్స్ (బి) ప్రసిధ్ 10; యంగ్ (సి) నితీశ్ (బి) కుల్దీప్ 87; మిచెల్ (నాటౌట్) 131; ఫిలిప్స్ (నాటౌట్) 32; ఎక్స్ట్రాలు 10; మొత్తం (47.3 ఓవర్లలో 3 వికెట్లకు) 286. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–208. బౌలింగ్: సిరాజ్ 9–0–41–0, హర్షిత్ 9.3–1–52–1, ప్రసిధ్ 9–0–49–1, నితీశ్ రెడ్డి 2–0–13–0, జడేజా 8–0–44–0, కుల్దీప్ 10–0–82–1. -
రాహుల్ సెంచరీ వృథా.. రాజ్కోట్ వన్డేలో టీమిండియా ఓటమి
రాజ్కోట్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో బ్లాక్ క్యాప్స్ జట్టు సమం చేసింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఆడుతూ పడుతూ 47.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మిచెల్ అజేయ శతకంతో చెలరేగాడు.117 బంతులు ఎదుర్కొన్న మిచెల్.. 11 ఫోర్లు, 2 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. అతడితో విల్ యంగ్ కూడా కీలక నాక్ ఆడాడు. యంగ్ 98 బంతుల్లో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరిలో గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రాణా తలా వికెట్ సాధించారు.రాహుల్ సెంచరీ వృథా..అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(12) విరోచిత శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు. ఇక సిరీస్ డిసైడర్ మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 18న జరగనుంది. -
వారెవ్వా హర్షిత్.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్గా సంధించాడు.బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.కెప్టెన్ శుభ్మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్(112) అజేయ సెంచరీతో మెరిశాడు.చదవండి: క్రికెట్కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్Off stump out of the ground 🔥🔥Harshit Rana gets the opening wicket in fine fashion! ⚡️Updates ▶️ https://t.co/x1fEenI0xl#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mYvTSD273W— BCCI (@BCCI) January 14, 2026 -
'గంభీర్ సపోర్ట్తో అతడిని సెలెక్ట్ చేశారు'.. క్లారిటీ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్
న్యూజిలాండ్తో ఆఖరి రెండు వన్డేలకు భారత జట్టులో ఢిల్లీ బ్యాటర్ అయూశ్ బదోనికి చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో బదోనికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.అయితే సెలెక్టర్ల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లని కాదని బదోనిని తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. గంభీర్ సపోర్ట్ వల్లే అతడిని అనుహ్యంగా జట్టులోకి తీసుకున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు.కాగా బదోని ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడతున్నాడు. గతంలో లక్నో మెంటార్గా గౌతీ పనిచేశాడు. అతడి గైడెన్స్లో బదోని మరింత రాటుదేలాడు. అంతేకాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బదోని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.గంభీర్ కూడా ఢిల్లీ నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విషయం విధితమే. ఈ కారణాలతో అయూశ్ వైపు మొగ్గు చూపాడని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేవలం అతడిని టాలెంట్ ఆధారంగానే జట్టులోకి తీసుకున్నామని తెలిపాడు."అయూశ్ దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు. భారత్-ఎ జట్టు తరపున కూడా అతడు వన్డే మ్యాచ్లు ఆడాడు. బదోని బ్యాటింగ్తో పాటు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. కేవలం ఐదుగురు బౌలర్లతో మాత్రమే ఆడడం సరైన నిర్ణయం కాదు.ఒకవేళ ప్రధాన బౌలర్లలో ఎవరైనా మ్యాచ్ మధ్యలో గాయపడితే, ఆ ఓవర్లను భర్తీ చేయడానికి ఆరో బౌలింగ్ ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. బదోని అవసరమైతే 3 నుండి 5 ఓవర్ల వరకు బౌలింగ్ చేయగలడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాము" అని రెండో వన్డేకు ముందు విలేకరుల సమావేశంలో కోటక్ పేర్కొన్నాడు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు


