గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 25) జరుగనున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చారు.
మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. జకరీ ఫౌల్క్స్ స్థానంలో కైల్ జేమీసన్ తుది జట్టులోకి వచ్చాడు.
కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(w), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామీసన్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, జాకబ్ డఫీ
భారత్: సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా


