న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్‌ గెలిచిన టీమిండియా | India won the toss against New Zealand in 3rd ODI | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టాస్‌ గెలిచిన టీమిండియా

Jan 18 2026 1:14 PM | Updated on Jan 18 2026 1:18 PM

India won the toss against New Zealand in 3rd ODI

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 18) జరుగునున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఓ మార్పు చేసింది. 

తొలి రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రసిద్ద్‌ కృష్ణ స్థానంలో స్టార్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌ల్లో ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్‌, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలుపొందాయి. మూడో మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ కైవసం​ చేసుకుంటుంది.

తుది జట్లు..
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్‌వెల్(c), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, క్రిస్టియన్ క్లార్క్, జేడెన్ లెన్నాక్స్

టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement