breaking news
cricket news
-
మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు ప్రమోషన్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా చాంపియన్స్ జట్టు తమ కెప్టెన్గా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఎంపిక చేసింది. కాగా ఈ జట్టుకు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ యజమానిగా ఉన్నాడు. మూడో సీజన్లో తనతో పాటు పునీత్ సింగ్ కూడా జట్టు యజమానిగా వ్యవహరించనున్నట్లు పాంటింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. "మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వడమే గాక గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతుండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అంతేకాదు మా ఆటతీరుతో అభిమానులను అలరించబోతున్నామన్న విషయం సంతోషం కలిగిస్తుంది" అని వార్నర్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియన్ చాంపియన్స్ జట్టులో భాగం కావడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పునీత్తో పాటు జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా. డేవిడ్ నాయకత్వంలో మా జట్టు అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)టోర్నీ మూడో సీజన్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీ యూకే వెలుపల జరగడం ఇదే తొలిసారి. లెజెండ్స్ క్రికెట్ లీగ్ మూడో సీజన్లో వార్నర్తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, షాహిద్ అఫ్రిది, మోయిన్ అలీ, మహ్మదుల్లా సహా ఇతర క్రికెటర్లు ఆడనున్నారు. ఇక మూడో సీజన్కు బంగ్లాదేశ్ చాంపియన్లను చేర్చడం ద్వారా డబ్ల్యూసీఎల్ తన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించింది. మొదటి సీజన్లో పాక్ను ఓడించి ఇండియా లెజెండ్స్ చాంపియన్గా నిలవగా, రెండో సీజన్లో సౌతాఫ్రికా లెజెండ్స్ టైటిల్ నెగ్గారు.Read: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్లను భారతదేశ సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ వీడియోను ఏసీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది."మా దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఉమ్మడి అభిరుచి కలిగిన రెండు దేశాలను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవలం మ్యాచ్లు కాదు. స్వదేశంలోని లక్షలాది మంది ప్రజల ఆశలు, గర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టనుంది."అని రాసుకొచ్చింది.ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా, తాజాగా ఆఫ్గన్ క్రికెట్ బోర్డు చేపట్టిన చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ మ్యాప్పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భారత్ తెలిపింది. ఇక భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఈ నెల 13న, రెండో టీ20 15న, మూడో టీ20 17న జరగనున్నాయి.A series the nation has been eagerly awaiting. 🤩A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.🤜🤛These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026Read: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్జోన్తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో రమన్దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్మోల్ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది. బౌలింగ్లో రెండు వికెట్లు, బ్యాటింగ్లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్తో మెరిసిన రమన్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్ల్లో మొహలీ కింగ్స్కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రమణ్దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్దీప్కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్రౌండర్ భావిస్తున్నాడు.85(34) with the bat.🌟2/31 (4) with the ball.🤛Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026Read: కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం! -
అతడు పోతేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు. పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను. కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది. కోచ్గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years.""Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026చదవండి: కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం! -
కసితీరా బాదిన అభిషేక్.. గిల్పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్కు తెరపడింది. గిల్తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్తో టీమిండియా కెప్టెన్ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
సీపీఎల్లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ చెలరేగుతున్నాడు. టీమిండియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో నబీ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లీగ్లో భాగంగా మహ్మద్ నబీ గయానా అమెజాన్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం సెంట్కిట్స్ అండ్ నేవిస్ పాట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో గయానా వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో మహ్మద్ నబీ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తొలుత బౌలింగ్లో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో పాటు, ఆ తర్వాత బ్యాటింగ్లో 25 పరుగులు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే మ్యాచ్లో మరో ఆఫ్గన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (39) కూడా కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ అండ్ నేవీ పాట్రియాట్స్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనజే (52) అర్థసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్, దాసున్ షనక చెరో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అనంతరం గయానా వారియర్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గుర్బాజ్, నబీలతో పాటు షెయ్ హోప్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంట్కిట్స్ బౌలర్లలో నవిన్ బిడాయిసె 2 వికెట్లు తీశాడు.రికార్డు బద్దలయ్యేనా?ఈ సీజన్లో గయానా అమెజాన్ వారియర్స్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. 2019 సీపీఎల్ సీజన్లోనూ గయనా అమెజాన్ వారియర్స్ ఫైనల్లో బార్బడోస్ చేతుల్లో ఓటమికి ముందు వరుసగా 11 మ్యాచ్ల్లో విజయం సాధించింది. మరి తాజా సీజన్లో గయానా జట్టు ఆ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు టైటిల్ కొల్లగొడుతుందేమో చూడాలి.41 year old Mohammed Nabi picked 4/17 in the CPL. 🤯 pic.twitter.com/TXshweqawc— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2026చదవండి: ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే! -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్డౌన్లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్కు కీలక బ్యాటర్గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్లో నైబ్ తన బ్యాట్తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్లు కూడా బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు
ఇంగ్లండ్ క్రికెట్కు సంబంధించి ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్కు కీలక బాధ్యతలు దక్కాయి. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ పురుషుల వైట్బాల్ జట్లకు అతడిని స్పెషలిస్ట్ మెంటర్గా నియమించారు. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీ వరకు ఆయన జట్టుతో కలిసి పనిచేయనున్నారు.పీటర్సన్కు తొలి అసైన్మెంట్ ఆస్ట్రేలియా పర్యటన కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలోనూ జట్టుతో పనిచేస్తారు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్తో జరిగే స్వదేశీ సిరీస్లకు కూడా అందుబాటులో ఉంటారు. కేపీ తన బ్యాటింగ్ అనుభవంతో ఆటగాళ్లకు సూచనలను అందిస్తారు.2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. జింబాబ్వే, నమీబియా సహ ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. పీటర్సన్ జన్మస్థలం దక్షిణాఫ్రికానే కావడం ఈ నియామకానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది.బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ వైట్బాల్ కోచింగ్ బృందంలో పీటర్సన్ భాగం కానున్నారు. ఈ బృందంలో మార్కస్ ట్రెస్కోథిక్, టిమ్ సౌథీ, సారా టేలర్, జీతన్ పటేల్ కూడా ఉన్నారు. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్కు మెంటర్గా పనిచేసిన అనుభవం పీటర్సన్కు ఉంది.కాగా, పీటర్సన్ 2014లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. 12 ఏళ్ల తర్వాత అతడు మళ్లీ ఇంగ్లండ్ సెటప్లోకి రానున్నాడు. చదవండి: 250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్గా ఇషాన్ కిషన్ -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో సౌత్జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రహ్మాన్ బౌలింగ్లో చెలరేగడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్పై విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ ఫామ్లోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచడంతో తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బ్యాటర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల సాధారణ స్కోరు చేసింది. కమిల్ పూరన్ (37) టాప్ స్కోరర్గా నిలవగా, రోస్టన్ చేజ్ (34) పర్వాలేదనిపించాడు. బార్బడోస్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3 వికెట్లు తీయగా, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రడెంట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (47 నాటౌట్), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించగా, ఓపెనర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండన్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, జాషువా బిషప్లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్లతో మెరిసిన ముజీబ్ ఉర్ రహ్మాన్కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.Two for the price of one! ☝️ Mujeeb ur Rahman gets two in the over!🇧🇧 x 🇱🇨#CPL26 #BTvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/Mv9ufmSPgq— CPL T20 (@CPL) September 7, 2026Read: క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్! -
ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా
జింబాబ్వే, నమీబియాలతో జరిగిన ట్రై సిరీస్ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఆదివారం విండ్హొక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (29 బంతుల్లో 53), డెవాల్డ్ బ్రెవిస్ (32), కన్నోర్ ఎస్తర్హుజిన్ (32) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ నైమూరి, బ్రాడ్ ఎవన్స్ చెరో 2 వికెట్లు తీయగా, సికందర్ రజా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ ఎవన్స్ (31 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడం జింబాబ్వే కొంపముంచింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్, బోర్న్ ఫోర్టున్ చెరో 3 వికెట్లు తీయగా, ఈథన్ బోస్క్ 2 వికెట్లు పడగొట్టాడు. మెరుపు అర్థసెంచరీ సాదించిన జోర్డాన్ హెర్మన్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్ల్లో 226 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు.🚨 MATCH RESULT 🚨#TheProteas seal a commanding 48 run victory over Zimbabwe to clinch the T20I Tri-Series title in Namibia! 🇿🇦🏆A statement finish from South Africa as they get their hands on the trophy! 💪#Unbreakable pic.twitter.com/6c1TqCqSDe— Proteas Men (@ProteasMenCSA) September 6, 2026Read: సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు! -
సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు!
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్టాపిక్గా మారిపోయింది.విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్స్టార్స్తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు. త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు. కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్తో సిరీస్కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది.Any problems between Sreesanth and Sanju Samson?👀There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది! -
'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు. దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 197 ఇన్నింగ్స్ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్జోన్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.Meet Abhimanyu Easwaran 🥲>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే -
కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్!
కౌంటీ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. డెర్బీషైర్తో జరిగిన మ్యాచ్లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఓవరాల్గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ (తొలి ఇన్నింగ్స్లో రెండు, రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు) డెర్బీషైర్ పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో సాయి కిషోర్ 18 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం.దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయి కిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు తన ఎంపిక గురించి హెచ్చరికలు పంపాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. అతడి బౌలింగ్ శైలి కూడా గంభీర్ విధానాలకు తగినట్లుగా ఉండడం ఆసక్తికర విషయం. రాబోయే రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్లు ఆడనుంది. మరి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి కిషోర్ టీమిండియాకు ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.SAI KISHORE: 18-12-20-5 🤯🔥- One of the best spells in this County Championship, he is bowling his heart out. pic.twitter.com/qpY6gqe1IJ— Johns. (@CricCrazyJohns) September 6, 2026చదవండి: ‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’ -
‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి తన ప్రదర్శనతో అదరగొడుతుంది. శనివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసింది. మ్యాచ్లో చేసిన ప్రదర్శనకు గానూ శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు తీసుకున్న అనంతరం శ్రీ చరణి మాట్లాడింది. ‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. మహిళల క్రికెట్ ఆడుతూ దేశానికి సేవ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నా. అయితే ప్రతీ మ్యాచ్కు జట్టులోని స్పిన్నర్లమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. నాతో పాటు ప్రేమ రావత్, దీప్తి శర్మ, రాధా యాదవ్ కలిసి మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేయాలనేది చర్చించుకుంటాం. దీప్తి, రాధా దీదీలు చెప్పే ప్రతి సలహాను మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. 50 వికెట్ల మార్క్కు ఒక్క వికెట్ దూరంలోఎ ఉన్నప్పటికీ, వాటిని నేను పట్టించుకోను. బౌలింగ్పైనే నా దృష్టంతా పెట్టాలనుకుంటున్నా. ఇక నాతో పాటు బౌలింగ్లో వికెట్లు తీసిన ప్రేమ రావత్కు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆమెది సహజమైన ప్రతిభ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ సమానంగా ఉంటాయి. బౌలర్లకు సహకరించే వికెట్పై సుమారు 120 పరుగులు అనేది మంచి స్కోరు కింద లెక్కే. ఇకపై కూడా నా ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే పాకిస్తాన్పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. శ్రీ చరణి, ప్రేమ రావత్లు చెరో 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత జట్టు 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. హర్మన్ ప్రీత్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు పడగొట్టింది.Read: ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్? -
శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్
మహిళల ఆసియా కప్ టోర్నీలో తెలుగు క్రికెటర్ శ్రీ చరణి మరోసారి తన బౌలింగ్తో మెరిసింది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీ చరణి (4-0-7-3) తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తాను వేసిన తొలి ఓవర్లోనే శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ చరణి ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2026 ఏడాదిలో భారత మహిళల క్రికెట్లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రీచరణి రికార్డులకెక్కింది. పాక్తో మ్యాచ్లో మూడు వికెట్లు తీయడం ద్వారా శ్రీ చరణి 34వ వికెట్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా 2026 ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా శ్రీ చరణి నిలిచింది. రెండో స్థానంలో ఆల్రౌండర్ దీప్తి శర్మ 23 వికెట్లతో కొనసాగుతుండగా, నందని శర్మ 12 వికెట్లు, అరుంధతీ రెడ్డి 11 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 9 వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్ జాబితాలో పూనమ్ రౌత్ 2018లో 35 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.కుప్పకూలిన పాక్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. షావల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మినహా మిగతా 8 మంది బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్లు చెరో 3 వికెట్ల తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.టాస్ గెలవడం ఒక్కటే పాకిస్తాన్కు ఊరట అని చెప్పొచ్చు. బ్యాటింగ్కు దిగిన కాసేపటికే పాక్కు భారత బౌలర్లు బొమ్మ చూపించారు. శ్రీ చరణి ఆరంభంలోనూ మూడు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టేయగా, ఆ తర్వాత స్పిన్నర్ ప్రేమా రావత్ బాధ్యతలు తీసుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాక్ బ్యాటర్లు పరుగులు చేయలేక నానా అవస్థలు పడ్డారు.Innings Break!An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌3️⃣ wickets each for Sree Charani & Prema Rawat2️⃣ wickets for Deepti Sharma1️⃣ wicket for Shafali VermaStay tuned for India's chase! ⌛️Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0— BCCI Women (@BCCIWomen) September 5, 2026 Shree Charani strikes twice in her very first over! 💥 3 wickets in 3 overs.3-0-6-3.Match winning performance by Charani.#INDvPAK #ShreeCharani #Dubai #T20 #TeamIndia #PakistanCricket #AsiaCup #WomensCricket pic.twitter.com/PVEQQBZlf1— lightningspeed (@lightningspeedk) September 5, 2026Read: మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు -
మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు
టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్షిప్లోనూ అదరగొడుతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఆడుతున్న మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్తో హాంప్షైర్తో మ్యాచ్లో ఏడు వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు) నమోదు చేయడం విశేషం. మానవ్ సుతార్ విజృంభణ కారణంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో హాంప్షైర్పై ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 398 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హాంప్షైర్ తొలి ఇన్నింగ్స్లో 115, రెండో ఇన్నింగ్స్లో 154 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 15 ఓవర్లు వేసిన మానవ్ సుతార్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 23.3 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ ఆడడానికి ముందు శ్రీలంక పర్యటనలోనూ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. రెండు టెస్టులు కలిపి 11 వికెట్లు పడగొట్టిన సుతార్ ఖాతాలో ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత పలుచబడిన స్పిన్ విభాగంలో మానవ్ సుతార్ తన మ్యాజిక్తో భారత జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు.ఇరగదీసిన చాహల్, అకిబ్ నబీఇక కౌంటీల్లో మానవ్ సుతార్తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టారు. జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ కూడా అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలిసారి కౌంటీల్లో ఆడుతున్న ఈ బారాముల్లా ఎక్స్ప్రెస్ సర్రే తరఫున రెండు కీలక వికెట్లు తీసి యార్క్షైర్పై విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. మరో టీమిండియా సీనియర్ యజ్వేంద్ర చాహల్కూడా నార్తంప్టన్షైర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన చాహల్ ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ చాహల్ అదరగొట్టాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ సీజన్లో చాహల్ 14 వికెట్లు తీశాడు.Manav Suthar vs Hampshire: 3/42 in the 1st inns4/52 in the 2nd innsOutstanding bowling touch in last few months for Indian spinner... 🔥pic.twitter.com/uTrBKhD1OS— CricketGully (@thecricketgully) September 5, 2026చదవండి: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
పాకిస్తాన్తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్
మహిళల ఆసియా కప్ టోర్నీ-2026లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలయ్యింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. థాయ్లాండ్, హాంకాంగ్లపై విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్కు చేరుకుంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి అజేయంగా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన జాబితాలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది. హర్మన్కు కెప్టెన్గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. పురుషుల, మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యహరించిన రికార్డు హర్మన్ పేరిటే ఉంది. ఈ జాబితాలో చమేరీ ఆటపట్టు 121 మ్యాచ్లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ (100 మ్యాచ్లు), హెథర్ నైట్ (96 మ్యాచ్లు, ఇంగ్లండ్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(వికెట్ కీపర్), షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా(కెప్టెన్), ఉమ్-ఎ-హనీ, ఈమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗠𝗼𝗺𝗲𝗻𝘁, 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝗮𝗹 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🚨Harmanpreet Kaur becomes the first cricketer to captain a side in 1️⃣5️⃣0️⃣ T20Is. 👏 👏Updates ▶️ https://t.co/1WHHWPMe2o#TeamIndia | #WomensAsiaCup | @ImHarmanpreet pic.twitter.com/WrdFlp7kcH— BCCI Women (@BCCIWomen) September 5, 2026 🚨 Toss and Playing XI Update #TeamIndia will bowl first and here's our line-up for the match 🔽Updates ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/69Jmw9YgUu— BCCI Women (@BCCIWomen) September 5, 2026Read: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్ క్లబ్ క్రికెటర్, అథ్లెట్ సామ్ బోడోనో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్ (Longest Bowling Run-up) తో తొలి బంతిని వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాడు. బంతి వేయడానికి ఏకంగా వంద కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ క్యాన్సర్తో మరణించింది. ఆమె పేరిట ఆండ్రూ స్ట్రాస్ నడుపుతున్న రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ఫర్ క్యాన్సర్ చారిటీకి సామ్ బోడోవాన్ 6 వేల పౌండ్లు సేకరించి అందించాడు. ఈ క్రమంలో వ్యాలీ క్రికెట్ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తున్న సామ్ బోడోవానో తండ్రికి తొలి బంతి వేసేందుకు సామ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బౌలింగ్ రన్-అప్ ప్రారంభించాడు. 14 గంటల్లో 100 కిమీ దూరం (62 మైళ్లు) పరిగెత్తి బంతిని విసరడం విశేషం. ఈ నేపథ్యంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్తో సామ్ బోడోవానో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించాడు.గతంలో అత్యంత లాంగెస్ట్ రన్-అప్ టామ్ డున్ పేరిట ఉంది. 2024 ఆగస్టులో ఇతగాడు ఈస్ట్ లండన్లోని బెత్నెల్ గ్రీన్ నుంచి సౌత్ లండన్లోని వాండ్స్వార్త్ మధ్య 24 కిమీ దూరం (15 మైళ్లు) పరిగెతాడు. తాజాగా టామ్ రికార్డును సామ్ సవరించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ 2019లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడిచింది. అదే ఏడాది ఆమె గుర్తుగా ఆండ్రూ స్ట్రాస్ రూత్ స్ట్రాస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ 2003 నుంచి 2012 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ గొప్ప బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్ట్రాస్ 100 టెస్టుల్లో 7,037 పరుగులు, 127 వన్డేల్లో 4,205 పరుగులు సాధించాడు.Read: ‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’ -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్జోన్ ఫైనల్కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్జోన్, సౌత్జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్గా మారిపోయాడు. ఒక బౌలర్గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్లో ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్గా వ్యవహరించనున్న షో పేరు "ఫ్యామిలీ ఫుల్హౌస్ విత్ రోహిత్ శర్మ". ఈ షోలో మల్టీ జనరేషన్ టీమ్స్ పాల్గొననున్నాయి. ఇప్పటిదాకా మైదానంలో బ్యాట్ పట్టి అభిమానులను అలరించిన హిట్మ్యాన్ ఇకపై గ్రీన్ మ్యాట్పై షోకు విచ్చేసే కుటుంబాలు చెప్పే కథలను కెమెరా, లైటింగ్ మధ్య విననున్నాడు. స్వతహాగా మంచి మాటకారి అయిన రోహిత్ను షోకు హోస్ట్గా ఎంపిక చేయడంతోనే సోనీ ఎంటర్టైన్మెంట్ సగం విజయం సాధించేసింది. ఇక రోహిత్ తన కామెడీ టైమింగ్తో షోను ఎంత మేర నడిపిస్తాడనేది చూడాలి. ఇప్పటికే ప్రోగ్రామ్కు సంబంధించిన ప్రోమో కట్స్, అందులో రోహిత్ చేస్తున్న అల్లరి అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చేయబోయే పని కూడా ఇదేనని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్కప్ రోహిత్ శర్మకు చివరి టోర్నీ అయ్యే అవకాశం లేకపోలేదు. కాగా రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో ఉంటాడని, అతడి గురించి అనవసర ఊహాగానాలు చేయడం ఆపేయాలని హితవు పలికాడు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్ను ఇంగ్లండ్తో ఆడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓవరాల్గా ఇంగ్లండ్తో సిరీస్లో మూడు వన్డేలు కలిపి 175 పరుగులు చేశాడు.Garden Se Reporting Live, Jersey No. 45 😉Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.#RohitSharma#FamilyFullHouse#ComingSoon #SonyTV@ImRo45 pic.twitter.com/DGWRp6Epzv— sonytv (@SonyTV) September 5, 2026చదవండి: భారత్తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్ -
62 మంది క్రికెటర్లపై నిషేధం యోచనలో బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్తో పాటు స్పిన్ ఆల్రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.ఇక ఉత్తర ప్రదేశ్కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం -
కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
కౌంటీ చాంపియన్షిప్లో ఆడుతున్న జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ మెయిడెన్ వికెట్ సాధించాడు. సీజన్లో సర్రే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అకిబ్ నబీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా కౌంటీల్లో తొలి వికెట్ పొందాడు. యార్క్షైర్తో మ్యాచ్ సందర్భంగా నబీ వేసిన బంతిని ఆడే క్రమంలో కుల్దీప్ స్లిప్లో ఆడి కార్డన్కు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఉన్న పార్టనర్షిప్ బ్రేక్ అవ్వడంతో పాటు 53 బంతుల తర్వాత వికెట్ లభించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.ఇక జమ్మూ కశ్మీర్లోని బారాముల్లాకు చెందిన అకిబ్ నబీ గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. కానీ సిరీస్లో మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో సిరీస్ ముగిసిన వెంటనే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకున్నాడు. కెరీర్లో తొలిసారి కౌంటీ ఆడుతున్న అకిబ్ నబీ తన బౌలింగ్ మెరుపులను ఇంగ్లీష్ గడ్డపై ప్రత్యర్థులకు రుచి చూపించే పనిలో పడ్డాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఉండడంతో కౌంటీల్లో సత్తా చాటి మరోసారి జట్టుకు ఎంపికవ్వాలని అకిబ్ నబీ భావిస్తున్నాడు. ఇక మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్ తీసిన నబీ రెండో ఇన్నింగ్స్లో జేమ్స్ వార్టన్ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్లో సర్రే జట్టు విజయం దిశగా నడుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్రే జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.దేశవాళీలో సంచలన ప్రదర్శనఇక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ తరఫున అకిబ్ నబీ వరుసగా రెండేళ్లు సంచల ప్రదర్శన నమోదు చేశాడు. 2025-26 రంజీ సీజన్లో అకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే అకిబ్ నబీ 43 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 162 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అకిబ్ నబీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కౌంటీ ముగిసిన తర్వాత అకిబ్ నబీ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్లు ఆడనున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్తో జరగబోయే టెస్టు సిరీస్కు బీసీసీఐ మదిలో ఉన్న ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలో అకిబ్ నబీ పేరు కూడా ఉండడం విశేషం.Auqib Nabi gets his first Surrey wicket as Kuldeep Yadav is caught at second slip by Ollie Pope. ✅Yorkshire 170/8 at the Kia Oval.🤎 | #CountyChampionship pic.twitter.com/VXVuEeI4mA— Surrey Cricket (@surreycricket) September 3, 2026Read: చివరి గ్రాండ్స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్! -
భారత బౌలర్ దెబ్బకు స్టోక్స్ ఫ్యూజులు ఔట్!
టీమిండియాలో చోటు కోల్పోయిన లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్షిప్లో బిజీ అయ్యాడు. అకీబ్ నబీ, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్తో పాటు చాహల్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో నార్తాంప్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ డుర్హమ్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. చాహల్ ఖాతాలో అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కాసే అల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్ ఉన్నారు.ఈ నాలుగింటిలో స్టోక్స్ను బురిడీ కొట్టించిన తీరు మ్యాచ్కే హైలైట్ అని చెప్పొచ్చు. చాహల్ వేసిన రిప్పర్ అనూహ్య టర్న్ తీసుకొని ఔట్సైడ్ వెళ్లి స్టంప్స్ను ఎగురగొట్టింది. చాహల్ వేసిన మ్యాజిక్ బంతికి స్టోక్స్ ఫ్యూజులు కదిలాయని చెప్పొచ్చు. ఏం జరిగింది అన్న తరహాలో స్టోక్స్ తల గోక్కుంటూ క్రీజు వీడడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇటీవలే టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బెస్ట్ బౌలర్ల జాబితాలో చాహల్ చోటు దక్కించుకున్నాడు. బుమ్రా మిస్ అయిన జాబితాలో చాహల్ నాలుగోస్థానం పొందగా, వెటరన్ భువనేశ్వర్ కుమార్ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే చాహల్ దెబ్బకు డుర్హమ్ తమ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్హమ్ (81) టాప్ స్కోరర్ కాగా, మయాంక్ అగర్వాల్ (36) పర్వాలేదనిపించాడు. చాహల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఆటను ప్రారంభించిన నార్తంప్టన్ షైర్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. లూయిస్ మెక్మనస్ (18), లూయిస్ కింబర్ (4) క్రీజులో ఉన్నారు. సైఫ్ జయీబ్ (52), జేమ్స్ సేల్స్ (69) అర్థసెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.46.3 | WHAT A BEAUTY 😵💫Yuzi Chahal with an absolute peach to dismiss Ben Stokes 🤯Durham 187/6.Watch live 👉 https://t.co/obDgNotzBX pic.twitter.com/0RKBVz0Gxq— Northamptonshire CCC (@NorthantsCCC) September 3, 2026Read: వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా! -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సచిన్ టెండూల్కర్లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్రేట్తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: హాంకాంగ్పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! -
హాంకాంగ్పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో అదరగొడుతుంది. పసికూన హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో మంధన శతకంతో మెరిసింది. 64 బంతుల్లో 124 పరుగులు సాధించిన స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. సెంచరీతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ కన్నీళ్లు సంతోషంతోనే తప్ప బాధతో వచ్చనవి కావని మంధాన మీడియాతో పేర్కొంది.అనంతరం మ్యాచ్లో మీరు చేసిన సెంచరీని ఎవరికి అంకితం చేస్తారని ప్రశ్న వేయగా.. ‘‘ఈ సెంచరీని అంకితం చేయడానికి నా మైండ్లో ఎవరు లేరు. కానీ ఈ శతకాన్ని మాత్రం కచ్చితంగా నా ఫ్యామిలీకే అంకితమిస్తాను. హాంకాంగ్తో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నందున ఆ జట్టు గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. వాళ్ల బౌలింగ్కు సంబంధించిన వీడియో క్లిప్లను మ్యాచ్కు ముందు రోజు వీక్షించాము. Photo Credit: BCCI Twitterఒక తెలియని బౌలర్ మన ముందుకు వచ్చినప్పుడు వారి గురించి కాకుండా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. వస్తాను, బంతిని చూస్తాను, కొడతాను అన్న తరహాలోనే నా బ్యాటింగ్ కొనసాగుతుంది. అయితే పవర్ ప్లేలో కొన్ని ఫుల్టాస్ బంతులను వదిలేశాను. నిజానికి ఫుల్టాస్ బంతులు నా బలం కాదు.. బలహీనత. వాటిని వదిలేసినప్పుడు మనసులో కాస్త సంతోషపడ్డాను. ఎందుకంటే అప్పుడు వదిలేయకుంటే సెంచరీ వచ్చేది కాదేమో. Photo Credit: BCCI Twitterటాపార్డర్లో ఆడుతాం కాబట్టే బ్యాటర్కు సెంచరీ చేసే అవకాశం వస్తోంది. టీ20 క్రికెట్లో టాపార్డర్ మినహా మిగతా ఏ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చినా సెంచరీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఈ సెంచరీతో నేను ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టానన్న విషయం నాకు తెలియదు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఆ రికార్డులేంటన్నివి చూశాను’’ అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్లు తలా 2 వికెట్లు పడగొట్టారు. THE HISTORIC MOMENT FOR SMRITI MANDHANA. pic.twitter.com/v12EhZPgwY— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2026చదవండి: టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్ -
టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నమీబియా, హాంకాంగ్లపై గెలుపుతో హర్మన్ సేన సెమీస్కు దూసుకెళ్లింది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి అజేయంగా సెమీస్లో అడుగుపెట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. గురువారం రాత్రి హాంకాంగ్ వుమెన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్గా శ్రీ చరణి నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీ చరణి 31 వికెట్లు పడగొట్టింది. Photo Credit: BCCI Twitterతద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పూనమ్ యాదవ్ (2018లో 35 వికెట్లు), ఆల్రౌండర్ దీప్తి శర్మ (2024లో 30 వికెట్లు, 2022లో 29 వికెట్లు) మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించింది. 2024లో రాధా యాదవ్ 29 వికెట్లు తీసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్ ఇంకా ముగియకపోవడంతో శ్రీ చరణి అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో త్వరలోనే టాప్ స్థానానికి చేరుకునే అవకాశముంది.Photo Credit: BCCI Twitter👉137- మహిళల టీ20 క్రికెట్లో పరుగుల పరంగా హాంకాంగ్పై భారత జట్టుకు రెండో అతి పెద్ద విషయం. గతంలో 2018 ఆసియా కప్లో మలేషియా వుమెన్స్పై 142 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది.👉మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్పై భారత్ సాధించిన 137 పరుగుల విజయం నాలుగో అతిపెద్దది. తొలి స్థానంలో పాకిస్తాన్ వుమెన్స్ 147 పరుగుల తేడాతో మలేషియా వుమెన్స్పై విజయం సాధించగా, రెండో స్థానంలో శ్రీలంక వుమెన్స్ (144 పరుగులు వర్సెస్ మలేషియా) కొనసాగుతుండగా, ఇండియా వుమెన్ (142 పరుగులు వర్సెస్ మలేషియా) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్లు తలా 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: లంక బ్యాటర్ శివతాండవం.. 39 బంతుల్లోనే సెంచరీ -
లంక బ్యాటర్ శివతాండవం.. 39 బంతుల్లోనే సెంచరీ
ఇంగ్లండ్ టూర్కు ఎంపికైన ఆనందంలో శ్రీలంక మాజీ కెప్టెన్ దాసున్ షనక కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2026)లో శివతాండవం ఆడాడు. సీపీఎల్లో భాగంగా సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షనక సెంట్ లూసియా కింగ్స్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే శతకం సాధించిన దాసున్ షనక ఓవరాల్గా 43 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో షనక సాధించిన సెంచరీ అత్యంత వేగవంతమైన శతకంగా రికార్డులకెక్కింది. ఇటీవలే షిమ్రోన్ హెట్మైర్ 40 బంతుల్లో సెంచరీ సాధించగా, దానిని షనక అధిగమించి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. Photo Credit: CPL Twitterసీపీఎల్ చరిత్రలో షనక 39 బంతుల్లో సెంచరీ చేసి తొలి స్థానంలో నిలవగా, హెట్మైర్, టిమ్ సీఫెర్ట్, ఆండ్రీ రసెల్లు 40 బంతుల్లో శతకాలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరో విండీస్ హిట్టర్ షెయ్ హోప్ 41 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక రసెల్ ఖాతాలో సీపీఎల్ రెండు ఫాస్టెస్ట్ సెంచరీలున్నాయి. ఒకసారి 40 బంతుల్లో శతకం చేస్తే, మరోసారి 42 బంతుల్లో సెంచరీ సాధించాడు.దాసున్ షనక విధ్వంసంతో సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. షనకకు తోడుగా వికెట్ కీపర్ ఆండ్రీ ఫ్లెచర్ (38 బంతుల్లో 64) అర్థసెంచరీతో రాణించాడు. అంతకముందు ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (26) ఆకట్టుకున్నాడు. సెంట్ లూసియా బౌలర్లలో మాథ్యూ ఫోర్డె 2 వికెట్లు తీయగా, తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.కాగా ఈ నెలలో లంక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. టూర్లో భాగంగా శ్రీలంక వన్డేలతో పాటు టీ20 సిరీస్ ఆడనుంది. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక మాజీ కెప్టెన్ షనకను రెండు ఫార్మాట్లకు ఎంపిక చేయడం విశేషం. షనక తన చివరి మ్యాచ్ను 2024 జనవరిలో ఆడాడు.RECORD BREAKER 🤩Amazing scenes at Warner Park as Dasun Shanaka smashes the CPL record with a 39 ball 💯 😱🇱🇰#CPL26 #SKNPvSLK #DasunShanaka #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/w881tdoRrm— CPL T20 (@CPL) September 4, 2026Read: ఆసీస్తో సిరీస్కు పక్కనబెట్టారు.. కట్చేస్తే ట్రిపుల్ సెంచరీ -
భారత్ వేదికగా మహిళల చాంపియన్స్ ట్రోఫీ
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహించనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారత్కు ఆతిథ్య హక్కులను జారీ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ టోర్నీలో టాప్-6 టీమ్స్ తలపడనున్నాయి. అయితే తొలుత మహిళల తొలి చాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యమివ్వాల్సింది. కానీ ప్రస్తుతం శ్రీలంక పాలనా పరమైన సమస్యలతో సతమతమవుతున్న వేళ ఐసీసీ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి భారత్కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో జూలైలో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో లంకకు బదులుగా టోర్నీని బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, భారత్ రూపంలో మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా ఐసీసీ బుధవారం భారత్కు ఆతిథ్య హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకుంది. జూలై 6 అర్హత కటాఫ్ తేదీ నాటికి ఐసీసీ మహిళల టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్లో తమ స్థానాల ప్రకారం అర్హత సాధించిన ఆ ఆరు జట్లు రౌండ్-రాబిన్ లీగ్లో పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్కు చేరుకుంటాయి. కటాఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలు తొలి చాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాయి.India set to host the inaugural ICC Women's Champions Trophy 2027 from 14 to 28 February.The Cricket Club of India (CCI) in Mumbai and the Vadodara International Cricket Stadium will be the venues for the landmark tournament.More details here - https://t.co/PlDTCL9adC pic.twitter.com/NwM4zPrZk8— BCCI (@BCCI) September 2, 2026 A landmark moment for women’s cricket awaits. The dates and venues for the inaugural Women’s Champions Trophy in 2027 are now confirmed, as India prepares to welcome the world’s best teams from 14-28 February.Read more ➡️ https://t.co/QrY2iyDwyU pic.twitter.com/m7cWLxY8I8— ICC (@ICC) September 2, 2026Read: ఆసీస్తో సిరీస్కు పక్కనబెట్టారు.. కట్చేస్తే ట్రిపుల్ సెంచరీ -
ఆసీస్తో సిరీస్కు పక్కనబెట్టారు.. కట్చేస్తే ట్రిపుల్ సెంచరీ
బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ తౌహిద్ హ్రిదోయ్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్లో తౌహిద్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 450 బంతుల్లో 25 ఫోర్లు, ఆరు సిక్సర్లతో త్రిశతకం మార్క్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.👉ఫస్ట్క్లాస్ క్రికెట్లో బంగ్లాదేశ్ తరఫున ట్రిపుల్ సెంచరీ బాదిన మూడో క్రికెటర్గా తౌహిద్ హ్రిదోయ్ నిలిచాడు. గతంలో తమీమ్ ఇక్బాల్, రకీబుల్ హసన్లు ఈ ఫీట్ సాధించారు.👉విదేశీ గడ్డపై ఫస్ట్క్లాస్ క్రికెట్లో త్రిశతకం బాదిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్గా తౌహిద్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్-ఎ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగాను నిలిచాడు. గతంలో షహ్రియార్ హొస్సేన్ చేసిన 218 పరుగులే రికార్డుగా ఉండేది. తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.👉ట్రిపుల్ సెంచరీ ఒక రికార్డయితే, అదీ సౌతాఫ్రికా గడ్డపై రావడం అరుదు. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా గడ్డపై ఫస్ట్క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ బాదిన రెండో ఓవర్సీస్ బ్యాటర్గా తౌహిద్ నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ దిగ్గజం డెన్నిస్ కాంప్టన్ (1948-49లో) సరిగ్గా 300 పరుగులు బాదాడు.👉ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఆల్టైమ్ అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన జాబితాలో తౌహిద్ హ్రిదోయ్ చోటు దక్కించుకున్నాడు. 350 పరుగులు నాటౌట్గా నిలిచిన తౌహిద్ హ్రిదోయ్ నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా మొదటి మూడు స్థానాలు వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారావే కావడం విశేషం. ఫస్ట్క్లాస్లో క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు లారా (501 నాటౌట్) 1994లో వోర్విక్షైర్ తరపున సాధించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్పై (400 నాటౌట్) సాధించిన ఏకైక క్వాడ్రపుల్ సెంచరీ. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. 1994లోనే ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో లారా (375 నాటౌట్) మరోసారి మెరిశాడు.బంగ్లా బోర్డుకు హెచ్చరికతాజాగా ట్రిపుల్ సెంచరీతో తౌహిద్ హ్రిదోయ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు (బీసీబీ) హెచ్చరికలు పంపాడు. బంగ్లా తరఫున ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన తౌహిద్ను ఆ తర్వాత జట్టు నుంచి తొలగించారు. కానీ అరంగేట్రం సమయంలో తౌహిద్ హ్రిదోయ్ను వైట్బాల్ స్పెషలిస్ట్గానే పరిగణించారు. ఇటీవలే ఆసీస్తో జరిగిన టెస్టు సిరీస్కు తౌహిద్ హ్రిదోయ్ను పక్కనబెట్టారు.కానీ త్రిశతకంతో తనను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ తౌహిద్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. 25 ఏళ్ల తౌహిద్ 25 ఫస్ట్క్లాస్ ఇన్నింగ్స్ల్లో 41 సగటుతో 995 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ తరఫున 56 వన్డేల్లో 1,698 పరుగులు, 65 టీ20ల్లో 1,409 పరుగులు సాధించాడు.బంగ్లాకు 164 పరుగుల ఆధిక్యంఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్-ఏ తమ తొలి ఇన్నింగ్స్ను 676-8 వద్ద డిక్లేర్ చేసింది. తౌహిద్ హ్రిదోయ్ (481 బంతుల్లో 350 నాటౌట్; 27 ఫోర్లు, 10 సిక్సర్లు) అజేయంగా నిలవగా, జాకర్ అలీ (94) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, మొహమ్మద్ సైఫుద్దీన్ (87) రాణించాడు. చివర్లో ముస్కిఫ్ హసన్ (31 నాటౌట్) మెరుపులతో బంగ్లా 650 మార్క్ను క్రాస్ చేసింది. అనంతరం సౌతాఫ్రికా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ప్రస్తుతం 154 పరుగులు వెనుకబడి ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్లో 512 పరుగులకు ఆలౌటైంది. నినెతెంబా ఖుషిలే (121), లెసెగో సెనోక్వానె (111) సెంచరీలతో మెరవగా, గావిన్ కప్లన్ (97), కైల్ సిమ్మండ్స్ (66) అర్థశతకాలతో రాణించారు.Skipper Towhid Hridoy leading from the front for Bangladesh A vs South Africa A with a triple hundred 🤩#SAAvBANA pic.twitter.com/chlzsTXfhj— Cricbuzz (@cricbuzz) September 2, 2026 300 UP!!!What an immense innings from Towhid Hridoy!!1st Bangladeshi to smash 300 vs an SA side!And it was FLAWLESS!!@BCBtigers @ProteasMenCSA https://t.co/hCQuakXI7H pic.twitter.com/kihlsHtzhG— Bhubesi🦁👑 (@MpenduloTweets) September 2, 2026Read: టెస్టు క్రికెట్పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు -
టెస్టు క్రికెట్పై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
దులీప్ ట్రోఫీలో భాగంగా వన్ మ్యాన్ షో చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్జోన్తో జరిగిన సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్థసెంచరీతో జట్టును విజయపథంలో నడిపించి "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ తన క్రికెట్ భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్టపడుతా. వైట్బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నా. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ రెడ్బాల్ క్రికెట్లో బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా. అదే నా కల..ఎప్పటికైనా టీమిండియా టెస్టు జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నా. నిజానికి పదేళ్ల వయసు నుంచే క్రికెట్లో కష్టపడుతున్నా. నా కష్టాన్ని ఎవరూ చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు నా వయసు 23. ఐపీఎల్ కారణంగా వైట్బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టంతో కూడిన గ్రౌండ్వర్క్ చేశాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. అదే నా బలం కూడా. ఇప్పుడైతే దేశం తరఫున టీ20లు, వన్డేల్లో ఆడుతున్నాను. గత మూడు, నాలుగేళ్లుగా దేశవాళీ క్రికెట్లో రెడ్బాల్ క్రికెట్ ఆడేందుకు సమయం కుదరడం లేదు. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే రెడ్బాల్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను.’ అని చెప్పుకొచ్చాడు.ఈజీగా మార్చుకోగలను..అయితే టెస్టుల్లో ఇప్పుడు మూడు లేదా ఆరో స్థానం ఖాళీగా ఉంది. ఒకవేళ మీకు అవకాశమొస్తే ఆ స్థానాలను భర్తీ చేయగలరా అని తిలక్ వర్మకు ప్రశ్న ఎదురైంది. దీనిపై తిలక్ వర్మ స్పందిస్తూ.. ‘నిజానికి రెడ్బాల్ నుంచి వైట్బాల్కు షిఫ్ట్ అవ్వడం ఈజీ. అదే సమయంలో వైట్బాల్ నుంచి రెడ్బాల్కు షిఫ్ట్ అవ్వడం కఠినం. కానీ నేను సాధ్యమైతనంత మేర వైట్బాల్ నుంచి రెడ్బాల్కు సులువుగానే మారగలను. అయితే రెడ్బాల్ క్రికెట్లో మంచి టెక్నిక్ ఉన్నప్పుడే మనం అన్ని ఫార్మాట్లలోనూ గుడ్ ప్లేయర్గా మారగలం’ అని పేర్కొన్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు ఫైనల్ చేరడం సంతోషంగా ఉందని తెలిపాడు. తనకు ఫైనల్ మ్యాచ్ ఆడాలని ఉందని, కానీ అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ కారణంగా అది సాధ్యపడుతుందా అనేది చూడాలని తెలిపాడు. నిజానికి ఆఫ్గన్తో తొలి టీ20 మ్యాచ్ 13న జరగనుండడంతో, 11న టీమిండియాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నాడు. తనకు సాధ్యమైతే మాత్రం ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు రెడీ ఉన్నట్లు తిలక్ వర్మ వెల్లడించాడు.South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026 🚨 CAPTAIN TILAK VARMA SHINES IN THE SEMIFINAL! Tilak Varma led South Zone into the Duleep Trophy final with a brilliant all-round batting display:116* (250) — 1st innings51* (79) — 2nd inningsHighest scorer of the matchPlayer of the Match#TilakVarma #DuleepTrophy… pic.twitter.com/36hLYlXrEX— Clutch Sports (@Clutchsportsz) September 2, 2026చదవండి: లంక జట్టు ప్రకటన; రెండేళ్ల తర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్! -
లంక జట్టు ప్రకటన; రెండేళ్ల తర్వాత జట్టులోకి మాజీ కెప్టెన్!
ఇంగ్లండ్ గడ్డపై ఈ నెల 15 నుంచి శ్రీలంక జట్టు వైట్బాల్ సిరీస్ (వన్డే, టీ20లు) ఆడనుంది. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంక క్రికెట్ బోర్డు వన్డే, టీ20 సిరీస్లకు 16 మందితో కూడిన వేర్వేరు జట్లను ప్రకటించింది. గాయాల నుంచి కోలుకున్న లంక విధ్వంసకర బ్యాటర్లు కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంకలు తిరిగి జట్టుతో చేరారు. వన్డే, టీ20 జట్లకు కుశాల్ మెండిస్ కెప్టెన్గా ఎంపికవ్వగా, చరిత్ అసలంక అతడికి డిప్యుటీగా వ్యవహరించనున్నాడు. ఇటీవలే గాయాలతో టీమిండియాతో టెస్టు సిరీస్కు దూరమైన పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తిరిగి రావడం లంక జట్టును బలంగా మార్చేసింది. 2027 వన్డే వరల్డ్కప్ నేపథ్యంలో..జట్టు ఎంపికలో మరో విశేషమేమిటంటే.. రెండేళ్ల తర్వాత మాజీ కెప్టెన్ దాసున్ షనక వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2024 జనవరిలో చివరి వన్డే ఆడిన షనక మళ్లీ ఇన్నాళ్లకు జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. పనిలో పనిగా వన్డేలతో పాటు టీ20 జట్టుకు కూడా షనకను ఎంపిక చేయడం విశేషం. ప్రస్తుతం 35 ఏళ్లున్న షనక 2027 వన్డే వరల్డ్కప్లో లంక జట్టులో కీలక ఫినిషర్ కానున్న నేపథ్యంలో అతడి ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది.ఇంగ్లండ్ టూర్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన చరిత్ అసలంక టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఆ తర్వాత జరిగిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్ 2026)లో చరిత్ అసలంక 153 స్ట్రైక్రేట్తో 385 పరుగులు సాధించి తిరిగి ఫామ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై తమ పర్యటనను ఆత్మవిశ్వాసంతో ఆరంభించనుంది.ఆ ఇద్దరి స్థానాలు పదిలం..లంక ప్రీమియర్ లీగ్లో అదరగొట్టిన కమిల్ మిషారా (411 రన్స్), లాహిరు ఉదారా (434 రన్స్) రెండు జట్లలోనూ తమ స్థానాలను నిలబెట్టకున్నారు. కమిందు మెండిస్ కూడా రెండు జట్లలోనూ చోటు దక్కించుకోగా, మరో సీనియర్ వనిందు హసరంగతో పాటు దునిత్ వెల్లలాగేలు కూడా వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. లంక స్టార్ బౌలర్ మహీశ్ తీక్షణ రాకతో స్పిన్ విభాగం బలపడింది. ఇక పేస్ విభాగంలో ఇషాన్ మలింగ, దుష్మంత చమీరలు కీలకం కానున్నారు. సెప్టెంబర్ 5న లంక జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది.ఇంగ్లండ్, శ్రీలంక టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్:👉తొలి టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 15న, సౌతాంప్టన్ 👉రెండో టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 17న, కార్డిఫ్👉మూడో టీ20 మ్యాచ్: సెప్టెంబర్ 19న, మాంచెస్టర్👉తొలి వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 22న, చెస్టర్ లీ స్ట్రీట్👉రెండో వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 24న, లీడ్స్👉మూడో వన్డే మ్యాచ్: సెప్టెంబర్ 27న, ఓవల్శ్రీలంక వన్డే జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, దాసున్ షనక, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహీశ్ తీక్షణ, సచిందు కొలంబాగే, దుష్మంత చమీర, ఇషాన్ మలింగ, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మధుషంక.శ్రీలంక టీ20 జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, లహిరు ఉదార, కమిందు మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), జనిత్ లియానగే, దాసున్ షనక, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ, తరిందు రత్ననాయకె, దుష్మంత చమీర, ఇసాన్ మలింగ, నువాన్ తుషారా, బినూర ఫెర్నాండో.చదవండి: ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్! -
ర్యాంకింగ్స్లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్!
శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్లో రెండు సెంచరీలతో అదరగొట్టిన భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో దుమ్మురేపాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు. నిజానికి ఇదేమి గొప్ప ర్యాంక్ కాకపోయినప్పటికీ, పడిక్కల్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడమే గాక, భారత్ తరఫున టాప్ స్కోరర్గా (328 పరుగులు) నిలిచాడు. టెస్టు సిరీస్ను 1-0తో భారత్ గెలవడం వెనుక పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. గిల్, పంత్ మినహామిగతా బ్యాటర్ల విషయానికొస్తే కెప్టెన్ శుబ్మన్ గిల్ లంక సిరీస్లో ఒక అర్థసెంచరీ మాత్రమే సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి గిల్, పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. రెండుకు ఎగబాకిన స్మిత్ఇదే సిరీస్లో రెండు సెంచరీలతో భారత్కు కొరకరాని కొయ్యగా మారిన లంక బ్యాటర్ సోనల్ దినూష ఏకంగా 29 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక టాప్లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (856 పాయింట్లు) కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో లంక టూర్కు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో అదరగొట్టిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్వన్ స్థానాన్ని అధిరోహించాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా తన నెంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (ఏడో స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.Read: తిలక్ వర్మ వన్మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్జోన్ -
తిలక్ వర్మ వన్మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్జోన్
దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సౌత్జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో జట్టును విజయపథంలో నడిపించగా, స్మరణ్ రవిచంద్రన్ (32 నాటౌట్) అతడికి సహకరించాడు. అంతకముందు ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయన్ జగదీషన్ (43) రాణించారు. నార్త్జోన్ బౌలర్లలో అబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్లో అజేయ సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో అజేయ అర్థ సెంచరీతో రాణించి మ్యాచ్లో వన్మ్యాన్ షో ప్రదర్శన కనబరిచిన కెప్టెన్ తిలక్ వర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఆదివారం (సెప్టెంబర్ 9 నుంచి) నుంచి మొదలకానున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్తో సౌత్జోన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇక నార్త్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సౌత్జోన్ 312 పరుగులకు ఆలౌట్ కాగా, తిలక్ వర్మ అజేయ సెంచరీతో మెరిశాడు. దీంతో సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 117 పరుగుల ఆధిక్యం లభించింది. తమ రెండో ఇన్నింగ్స్లో నార్త్జోన్ 297 పరుగులకు ఆలౌట్ కావడంతో సౌత్జోన్ ముంగిట 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. South Zone cruise into the final 🙌They chase down 181 and beat North Zone by 7 wickets 👌Scorecard ▶️ https://t.co/AGjIStrDAT#DuleepTrophy | #SZvNZ pic.twitter.com/UXTDC4wdF4— BCCI Domestic (@BCCIdomestic) September 2, 2026Read: ‘సీఎం సార్ ప్లీజ్ ఒక్క ఫొటో’.. కేరళలో రొనాల్డో సోదరి -
ప్రిటోరియస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా వరుస విజయాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా విండ్హక్ వేదికగా మంగళవారం జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా 43 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ లుహాన్ ప్రిటోరియస్ (51 బంతుల్లో 94; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, డెవాల్డ్ బ్రెవిస్ (41) మూడో మ్యాచ్లోనూ అదరగొట్టాడు. జోర్డాన్ హెర్మన్ (28) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో వెస్లే మధవెరె 3 వికెట్లు తీయగా, బ్రాడ్ ఎవన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 17.4 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సికందర్ రజా (45) టాప్ స్కోరర్గా నిలవగా, ఇన్నోసెంట్ కాయా (18), నైమూరి (27) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో జోర్న్ ఫోర్టున్ 4 వికెట్లు తీయగా, డాన్ జాసన్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింట గెలిచి పట్టికలో టాప్లో ఉండగా, జింబాబ్వే మూడింటిలో రెండు ఓడి మూడో స్థానంలో ఉంది. ఇక నమీబియా 2 మ్యాచ్ల్లో ఒక గెలుపు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.South Africa make it two wins over Zimbabwe in three days, cruising to a 43-run win in Windhoek.Lhuan-dre Pretorius smashed a career-best 94 👏 pic.twitter.com/lxcsc2Idpb— Cricbuzz (@cricbuzz) September 1, 2026Read: మెస్సీ కంటతడి బాధ కలిగించింది: క్రిస్టియానో రొనాల్డో -
40 బంతుల్లోనే శతకం.. విండీస్ హిట్టర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హెట్మైర్ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్ 2026)లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సీపీఎల్లో గయానా అమెజాన్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్మైర్ ట్రిన్బాగో నైట్రైడర్స్పై 40 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ బాదాడు. 43 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచిన హెట్మైర్ ఖాతాలో 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 40 బంతుల్లోనే శతకం మార్క్ అందుకున్న హెట్మైర్ సీపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో ఆండ్రీ రసెల్ (40 బంతుల్లో), టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో) ఈ ఫీట్ సాధించగా.. తాజాగా హెట్మైర్ కూడా 40 బంతుల్లోనే సెంచరీ సాధించి వారితో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు.Photo Credit: CPL Twitterషెయ్ హోప్ 41 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని రెండో స్థానంలో ఉండగా, 42 బంతుల్లో శతకం సాధించిన రసెల్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక హెట్మైర్ సాధించిన 111 పరుగుల్లో 86 రన్స్ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే రావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా వారియర్స్ 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. హెట్మైర్ (111 నాటౌట్)తో పాటు షెపర్డ్ (7 బంతుల్లో 22 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. నైట్రైడర్స్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్, అకిల్ హొసెన్, సునీల్ నరైన్, లాహిరు కుమారాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ట్రిన్బాగో నైట్రైడర్స్ చివరి దాకా పోరాడినప్పటికీ 16 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకు పరిమితమై 9 రన్స్తో ఓటమి చవి చూసింది. అలెక్స్ హేల్స్ (55), కెప్టెన్ నికోలస్ పూరన్ (43) రాణించారు. గయానా బౌలర్లలో మహ్మద్ నబీ మూడు వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్ 2026 సీజన్లో విఫలంఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన హెట్మైర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 78 పరుగులే సాధించిన హెట్మైర్ అత్యధిక స్కోరు 22గా ఉంది. ఆ తర్వాత మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) టోర్నీలోనూ హెట్మైర్ వైఫల్యం కొనసాగింది. 10 ఇన్నింగ్స్ల్లో 164 పరుగులు చేసిన హెట్మైర్ ఒక్క మ్యాచ్లో మాత్రమే (33 బంతుల్లో 79 పరుగులు) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో పర్వాలేదనిపించాడు. మూడు మ్యాచ్లు కలిపి 85 పరుగులు సాధించాడు. అయితే సీపీఎల్లో మాత్రం హెట్మైర్ తన పూర్వ ఫామ్ను అందుకున్నాడు. ప్రస్తుతం నాలుగు మ్యాచ్ల్లోనే 248 స్ట్రైక్రేట్తో 186 పరుగులు సాధించాడు. TAKE. A. BOW! 👏Shimron Hetmyer records the joint-fastest CPL century! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/Wcc9PTEbRg— CPL T20 (@CPL) September 1, 2026- 105(61)* by Tim Siefert vs Trinbago.- 111(43)* by Shimron Hetmyer vs Trinbago.2ND HUNDRED SCORED AGAINST TRINBAGO IN CPL 2026..!! 🥶#CPL | #Cricket pic.twitter.com/uEKmc21xm6— Rana Ahmad. (@AhmadRana056) September 1, 2026చదవండి: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తిలక్ వర్మ! -
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తిలక్ వర్మ!
ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తిలక్ వర్మ ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వచ్చే ఐపీఎల్ సీజన్లోగా పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం జట్టు మేనేజ్మెంట్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గత సీజన్లో కెప్టెన్గా, ప్లేయర్గా పూర్తిగా విఫలమైన పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ చేయనుందనే వార్తలు వచ్చాయి. అటు పాండ్యా కూడా సీఎస్కే లేదా కేకేఆర్ జట్టులోకి వెళ్తాడని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ వాటన్నింటికి తెరదించుతూ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను తమతోనే అట్టిపెట్టుకోవాలనే భావిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్గా విఫలమైనప్పటికీ, ఆల్రౌండర్గా పాండ్యా ముంబై ఇండియన్స్కు గతంలో కీలక ఆటగాడిగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను యువ బ్యాటర్ తిలక్ వర్మకు అప్పగించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తుందట.అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ తిలక్ వర్మ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తుండటంతో అతడిపై యాజమాన్యానికి నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది. తిలక్లో నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ముంబయి భావిస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాడికి కెప్టెన్సీ అప్పగిస్తే.. జట్టును దీర్ఘకాలం పాటు బలమైన యూనిట్గా తీర్చిదిద్దవచ్చని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జట్టులో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడంతో, వారి దిశానిర్దేశంలో తిలక్ వర్మ జట్టును విజయవంతంగా నడిపిస్తాడని ముంబై ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ, త్వరలోనే ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్గా తిలక్ వర్మను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.TILAK VARMA AS MUMBAI INDIANS CAPTAIN 💙- Tilak Varma is top contenders for Mumbai Indians captaincy in IPL 2027. pic.twitter.com/n1q3dQWh4g— Cricket Central (@CricketCentrl) September 1, 2026Read: ఆఫ్గన్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన -
ఆఫ్గన్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.ఆఫ్గన్తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్లో ఆడతారా? లేదా?అనేది ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు.ఇక ఆఫ్గన్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*India’s squad for Afghanistan T20I series announced. #TeamIndia will play three T20Is against Afghanistan at New Delhi, beginning September 13.#AFGvIND pic.twitter.com/UqTUeZyHz8— BCCI (@BCCI) September 1, 2026Read: పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా! -
పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా!
పాకిస్థాన్ క్రికెట్లో మరోసారి సంక్షోభం నెలకొంది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో రెండు వరుస ఓటములు ఆ జట్టులో ముసలం పుట్టించింది. టెస్టు సిరీస్లో పాక్ వరుస ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్ను మార్చడం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన పాకిస్తాన్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ప్రకటించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించలేదు.అసలేం జరిగింది?లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెలక్టర్లను సంప్రదించకుండానే టెస్టు జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. టెస్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్లను కూడా వారి పదవుల నుంచి తొలగించినట్లు సమాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు.పాక్ జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లలో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్తో పాటు కేవలం 10 మ్యాచ్ల ఉమ్మడి అనుభవం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది.జట్టులోకి వచ్చిన ఐదుగురు కొత్త ఆటగాళ్లు: అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా.2019లో పాకిస్తాన్ హెడ్కోచ్ పదవిపాకిస్తాన్ అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్గా పేరు పొందిన మిస్బా ఉల్ హక్ వీడ్కోలు అనంతరం పీసీబీలో పలు కీలక పదవులు నిర్వహించాడు. 2019లో పాకిస్తాన్ హెడ్కోచ్ సహా చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికయ్యాడు. అయితే కోచింగ్ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి 2020 అక్టోబర్లో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2021లో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.2023లో, మిస్బా అప్పటి తాత్కాలిక నిర్వహణ కమిటీ అధిపతి జకా అష్రఫ్ ఆధ్వర్యంలో సలహాదారుగా పీసీబీకి తిరిగొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ఆకిబ్ జావేద్, సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిక్లతో పాటు మిస్బా నలుగురు సభ్యుల జాతీయ ఎంపిక కమిటీలో చేరాడు. దీంతోపాటు సంవత్సరానికి 180 రోజులు బ్యాటింగ్ కన్సల్టెంట్గా పనిచేస్తానని పీసీబీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ తమ చివరి టెస్టును సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా ఆడనుంది.Misbah-ul-Haq has offered his resignation from the Pakistan men's national selection committee a day after the PCB made wholesale changes to the Test squad and team management https://t.co/Yc5oSoUL0S pic.twitter.com/oApQR5kzRj— Cricinfo (@cricinfo) September 1, 2026చదవండి: గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్జోన్ -
గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్జోన్
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోకి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) అజేయంగా నిలిచి ఈస్ట్జోన్ను గెలిపించారు. వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (40) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక సెంట్రల్ జోన్ తమ ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్లో షమీ, ముకేశ్ కుమార్ మెరుపులతో సెంట్రల్ జోన్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలింది. అయితే ఛేదనలో ఈస్ట్జోన్ కాస్త తడబడినప్పటికీ, ముందు వైభవ్.. చివర్లో ఇషాన్, షమీలు బాధ్యతగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.139 పరుగుల ఆధిక్యంలో నార్త్జోన్మరోవైపు నార్త్జోన్, సౌత్జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్జోన్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్జోన్ 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. నిషాంత్ సింధూ (20), అన్షుల్ కంబోజ్ (29) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైంది.𝐄𝐀𝐒𝐓 𝐙𝐎𝐍𝐄 𝐀𝐑𝐄 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐃𝐔𝐋𝐄𝐄𝐏 𝐓𝐑𝐎𝐏𝐇𝐘 𝐅𝐈𝐍𝐀𝐋! 🔥🏆A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! 💥👏 pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026Read: రిటైర్మెంట్ విషయంలోనూ మెస్సీ రికార్డు -
35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్ చేసినోళ్లకు హెచ్చరిక
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో షమీ తీసిన మూడు వికెట్లు తీయగా.. అందులో క్రీజులో పాతుకుపోయిన హర్ష్ దూబేని అద్భుత రీతిలో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చడం విశేషం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ షమీ యార్కర్ బాల్ వేశాడు. హర్ష్ దూబే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి ఎడ్జ్ అయి షమీ వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన షమీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడంతో హర్ష్ దూబే షాక్ తిన్నాడు. Photo Credit: BCCI Twitterఅప్పటికే హర్ష్ దూబే 51 బంతుల్లో 24 పరుగులతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. హర్ష్దూబే వెనుదిరిగిన వెంటనే సెంట్రల్ జోన్ ఆలౌటైంది. షమీ 56 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో 158 పరుగులకు ఇన్నింగ్స్ను ముగించింది. 35 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్నెస్తో అదరగొడుతున్న షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం అభినందించాల్సిన విషయం.గతేడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఏడు ఇన్నింగ్స్లు కలిపి 15 వికెట్లు పడగొట్టాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్లో షమీ బెంగాల్ తరఫున ఏడు మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలోనూ షమీ ఏడు మ్యాచ్ల్లోనే 37 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపాడు.షమీ భారత్ తరఫున చివరిసారి 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి షమీ మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. 2023లో భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో షమీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ టోర్నీలో 24 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, గాయాలు అతడిని తరచూ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అదే గాయాల సాకుతో టీమిండియా మేనేజ్మెంట్ షమీని పూర్తిగా పక్కనబెట్టేయడం గమనార్హం.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026Read: కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్పై వేటు -
సిరీస్ ఓటమి; పాక్ జట్టులో మార్పులు.. కోచ్ పదవి ఊస్ట్!
ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 0-2తో ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు ముందు జట్టులో కీలకమార్పులతో పాటు ప్రధానంగా రెడ్బాల్ కోచ్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ పదవి ఊస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో వైట్బాల్ కోచ్గా వ్యవహరిస్తున్న మైక్ హసన్కే టెస్టు కోచ్ బాధ్యతలు అప్పజెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తోంది. ఇదే గనుక జరిగితే మైక్ హసన్ మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్గా ఉండనున్నాడు.వరుస పరాజయాల నేపథ్యంలో టెస్ట్ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్పై పీసీబీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రస్తుతం లండన్లోనే ఉన్న మైక్ హెసన్, ఆకిబ్ జావేద్తో కలిసి ప్రిన్స్ చార్లెస్ ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ పర్యటనలోనే ఆయనకు టెస్ట్ జట్టు బాధ్యతలను కూడా అప్పగించే ప్రక్రియ వేగవంతమైంది.సెప్టెంబర్ 9 నుంచి బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే మైక్ హెసన్ పాకిస్తాన్ జట్టుతో కలవనున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడో టెస్ట్ సమయంలో హెసన్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది సర్ఫరాజ్ అహ్మద్ పదవికి ముగింపు కార్డు పడినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 18న బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్కు ముందు సర్ఫరాజ్ అహ్మద్ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా నియమించారు. అయితే ఆయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా తయారైంది. మొదటి అసైన్మెంట్లోనే బంగ్లాదేశ్ చేతిలో సొంత గడ్డపై వైట్వాష్కు గురైంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో 2 టెస్టుల సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో మరో వైట్వాష్ దిశగా ప్రయాణిస్తుండటంతో పీసీబీ వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. తాజాగా బాబర్ గైర్హాజరీలో మొదటి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘాను కూడా పీసీబీ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో సల్మాన్ అఘా స్వదేశానికి తిరిగి రానున్నాడు.🚨SARFARAZ AHMED SACKED FROM TEST COACH 🚨 - Pakistan current Test coach Sarfaraz Ahmed & bowling coach Umar Gul sidelined from test team. - Mike Hesson asked for take charge of Pakistan test team. pic.twitter.com/fDY7iF8fkv— Cricket Central (@CricketCentrl) August 31, 2026చదవండి: సచిన్ను వెంటాడిన ఫోబియా వైభవ్కు అంటుకుందా? -
సచిన్ను వెంటాడిన ఫోబియా వైభవ్కు అంటుకుందా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు (అన్ని ఫార్మాట్లు) సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉండేది. ఈ కారణంగా సచిన్ చాలాసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఒకవేళ సచిన్కు 90 ఫోబియా లేకపోయుంటే అతడి ఖాతాలో 150 సెంచరీలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా చిన్న వయసులోనే క్రికెట్లో అడుగుపెట్టి సచిన్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీని కూడా 90 ఫోబియా చుట్టుముట్టేసింది. ఈ మధ్యకాలంలో వైభవ్ తొంభైల్లో చాలాసార్లు ఔటయ్యాడు.ఇటీవలి కాలంలో ఐపీఎల్ నుంచి దేశవాళీ టోర్నీలు, అనధికారిక మ్యాచ్లు చూసుకుంటే వైభవ్ వరుసగా 93 (38 బంతుల్లో), 97 (29 బంతుల్లో), 96 (47 బంతుల్లో), తాజాగా దులీప్ ట్రోఫీలో 92 పరుగుల వద్ద సెంచరీలకు అతి సమీపంలోకి వచ్చి అవుట్ అయ్యాడు. ఇలా ఇప్పటికే నాలుగు సెంచరీలను చేజార్చుకున్నాడు.ఏమిటీ నెర్వస్ నైంటీస్?90 ఫోబియాను క్రికెట్ పరిభాషలో "నెర్వస్ నైంటీస్" (Nervous Nineties) అని పిలుస్తారు. ఒక బ్యాటర్ సెంచరీ (100 పరుగులు) మైలురాయికి చేరుకునే ముందు, 90 నుండి 99 పరుగుల మధ్య ఒత్తిడికి గురై అవుట్ అవ్వడాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా బ్యాటర్లు 90ల్లోకి రాగానే సెంచరీ కోసం కాస్త నెమ్మదిగా ఆడతారు. ఈ తరుణంలో అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్ను ఇచ్చేసుకుంటారు. సచిన్ తన కెరీర్లో చాలాసార్లు ఈ నెర్వస్ నైంటీస్ను ఎదుర్కొన్నాడు. తాజాగా వైభవ్ను కూడా నెర్వస్ నైంటీస్ ఫోబియా చుట్టుముట్టినట్లుగా అనిపిస్తోంది.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (5), ఆర్యన్ పాండే (4) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 43 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌటైంది.HEARTBREAKING MOMENT FOR VAIBHAV SOORYAVANSHI !💔Vaibhav Suryavanshi missed his maiden century in the Duleep Trophy by just 8 runs. - Just look at the reaction of Vaibhav Suryavanshi 😭😭 pic.twitter.com/BYA3KPUSc3— lndian Sports Network (@IS_Netwrk29) August 31, 2026Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్ -
కౌంటీల్లో ఆడనున్న కేఎల్ రాహుల్ బెస్ట్ ఫ్రెండ్
టీమిండియా సీనియర్ ఆటగాడు, కేఎల్ రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ మయాంక్ అగర్వాల్ కౌంటీ చాంపియన్షిప్లో ఆడనున్నాడు. ఈ మేరకు 35 ఏళ్ల మయాంక్ డుర్హమ్ క్రికెట్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే కౌంటీ చాంపియన్షిప్ 2026లో డుర్హమ్ తరఫున చివరి నాలుగు మ్యాచ్లకు అందుబాటులో ఉండనున్నాడు. అయితే ఏడాది కింద ఇదే మయాంక్ అగర్వాల్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో యార్క్షైర్కు ప్రాతినిధ్యం వహించాడు. సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో డేవిడ్ బెడింగ్హమ్ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆడనున్నట్లు డుర్హమ్ క్రికెట్ క్లబ్ తెలిపింది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన మయాంక్కు డుర్హమ్ క్లబ్ ఘనస్వాగతం పలికింది.ఇక కౌంటీ క్రికెట్లో మయాంక్ అగర్వాల్కు మంచి రికార్డే ఉంది. గతేడాది యార్క్షైర్ తరఫున ఆడిన మయాంక్ మూడు మ్యాచ్ల్లో 50 సగటుతో 201 పరుగులు సాధించాడు. లీడ్స్ వేదికగా జరిగిన సీజన్ 70వ మ్యాచ్లో అగర్వాల్ ఒక్క ఇన్నింగ్స్లోనే 175 పరుగులు చేయడం విశేషం. యాదృశ్చికంగా అప్పుడు యార్క్షైర్ తరఫున ఇదే డుర్హమ్ క్లబ్పై సెంచరీ సాధించిన మయాంక్కు కౌంటీ క్రికెట్లో ఇదే మెయిడెన్ శతకం కావడం విశేషం. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ కెరీర్లో మయాంక్కు అది 19వ సెంచరీ.ఈ ఏడాది డుర్హమ్ క్లబ్ తరఫున ఆడనున్న మయాంక్ 2026 సీజన్లో మిగిలిన నాలుగు మ్యాచ్లు ఆడనున్నాడు. తొలుత డుర్హమ్ క్లబ్ సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు నార్తాంప్టన్ వేదికగా నార్తాంప్టన్షైర్తో ఆడనుంది. ఆ తర్వాత చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు మిడిలెసెక్స్తో, సెప్టెంబర్ 15 నుంచి వోర్సెష్టర్షైర్తో, చివరగా లంకాషైర్తో మ్యాచ్లు ఆడనుంది. ఇక 2022లో భారత్ తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడిన మయాంక్ అగర్వాల్ ఓవరాల్గా టీమిండియాకు 21 టెస్టులాడి 1,488 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్ -
దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్
భారత జట్టులో చోటు కోల్పోయినప్పటికీ సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లో తన బౌలింగ్తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్ జోన్పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ఫస్ట్క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో కలిపి షమీ 900 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు సాధించిన ఆరో బౌలర్గా షమీ రికార్డులకెక్కాడు. ఇక షమీ ఖాతాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 283 వికెట్లు, టీ20ల్లో 238 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రొఫెషనల్ క్రికెట్లో భారత పేసర్లలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తొలి స్థానంలో ఉన్నాడు. కపిల్దేవ్ ఖాతాలో 1170 వికెట్లు ఉన్నాయి. రెండో స్థానంలో జహీర్ ఖాన్ (1168 వికెట్లు), జయదేవ్ ఉనద్కత్ (941 వికెట్లతో) మూడవ స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 940 వికెట్లతో నాలుగవ స్థానం, వినయ్ కుమార్ 923 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.షమీ చివరిసారిగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో ఆడాడు. అప్పటి నుంచి అతనికి జాతీయ జట్టులో అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ యువ ఆటగాళ్లపైనే దృష్టి సారించడంతో షమీని పట్టించుకోవడం లేదు.ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 900 వికెట్ల మార్క్ అందుకున్న షమీకి కృతజ్ఞతలు తెలిపింది. "మహ్మద్ షమీకి అభినందనలు. ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు తీసిన ఆరో భారత పేసర్గా నిలవడం అంత సులభం కాదు. షమీ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్ ఎ క్రికెట్లో 283, టీ20లలో 238 వికెట్లు పడగొట్టాడు. అతని ఈ ఘనతకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోంది." అని పేర్కొంది.THE CLASS OF SHAMI 🫡🔥- He completed 900 wickets in Professional cricket. pic.twitter.com/0t4jUs6fMZ— Johns. (@CricCrazyJohns) August 31, 2026Read: జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం! -
గాయం పేరుతో నాటకమా? నిజమని తేలితే నిషేధమే!
పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ గాయం విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రత్యేక అధికారుల బృందం సీరియస్ విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. పిక్క కండరాల గాయంతో ఇమామ్-ఉల్-హక్ మూడో టెస్టు ఆడకుండానే స్వదేశానికి తిరుగుపయనమ య్యాడు. లార్డ్స్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇమామ్ పిక్క కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే స్కానింగ్లో ఇమామ్కు స్వల్ప గాయం మాత్రమే అయినట్లు నిర్థరాణ అయింది. నిజానికి ఇమామ్ ఉల్ హక్కు పెద్దగా గాయం కాలేదని, కానీ కఠిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి భయపడి గాయం పేరుతో ఇలా నాటకాలు ఆడినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. ఇంగ్లండ్ గడ్డపై ఆడేందుకు భయపడే ఇమామ్-ఉల్-హక్ నకిలీ గాయం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశాడని మాజీ పాక్ క్రికెటర్లు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పీసీబీ ఇమామ్ గాయం నిజామా? కాదా? అన్నది తేల్చేందుకు అధికార యంత్రాంగంతో విచారణ ప్రారంభించనుంది.గతంలోనూ ఇలాగే..ఇమామ్ ఉల్ హక్పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదేమీ కొత్త కాదు. 2025లో న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా నేపియర్ వేదికగా తొలి వన్డేకు ముందు తన కాలి కుడి బొటనవేలిలో తీవ్రమైన నొప్పి ఉందని పీసీబీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఎక్స్-రేల్లో మాత్రం బొటనవేలులో ఎలాంటి చీలిక లేదా స్థానభ్రంశం జరిగినట్లు ఆధారాలు కనిపించలేదు. పాక్ క్రికెట్ వైద్య బృందం ప్రకారం, ఇమామ్ కాలి బొటనవేలు నుంచి వచ్చింది రక్తం కాదని, అది సిరా గుర్తు అని తమ నివేదికలో తేలినట్లు అప్పట్లో పేర్కొంది. కేవలం న్యూజిలాండ్లోని పేస్ పిచ్లపై బ్యాటింగ్ చేయడాన్ని తప్పించుకోవడానికే ఇమామ్ ఉల్ హక్ గాయమైనట్లు నటించాడని వార్తలు వచ్చాయి. అవసరమైతే నిషేధం..పీసీబీ విచారణ సమయంలో వారి వద్దకు వచ్చినప్పుడు ఇమామ్ కుంటుతూ నడిచాడని, వాళ్లు వెళ్లిపోయాక బయటకు మాత్రం యథావిధిగా నడుచుకుంటూ వచ్చాడని సమాచారం అందింది. అందుకే ఈసారి పీసీబీ దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ఇమామ్కు గాయం నిజమైతే పర్వాలేదు కానీ, ఒకవేళ గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికీ, నటించినట్లు తేలితే మాత్రం ఈసారి అతడిపై కఠిన చర్యలకు ఆస్కారం ఉంటుంది. అవసరమైతే జట్టు నుంచి సస్పెండ్ చేసే యోచనలో ఉన్నాం’’ అని పీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇక ఇంగ్లండ్తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ఇమామ్ ఉల్ హక్తో పాటు సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఇక మూడో టెస్టు కోసం పాకిస్తాన్ జట్టులో స్వల్ప మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే చివరి టెస్టు కోసం సయీమ్ అయూబ్, అరాఫత్ మిన్హాస్ సహా ఆరుగురు ఆటగాళ్లను ఇంగ్లండ్కు పిలిపించింది. సర్ఫరాజ్ అహ్మద్పై వేటు!ఇక ప్రస్తుతం రెడ్బాల్ క్రికెట్ కోచ్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పటే అవకాశాలున్నాయి. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో ప్రస్తుతం వైట్బాల్ క్రికెట్ కోచ్గా వ్యవహరిస్తున్న మైక్ హసన్కే బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఇంగ్లండ్కు 2-0తో సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ మూడో టెస్టును ఎడ్జ్బాస్టన్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆడనుంది.Read: యూరోపియన్ లీగ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ విధ్వంసం -
యూరోపియన్ లీగ్లో ముంబై ఇండియన్స్ బౌలర్ విధ్వంసం
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్-2026)లో న్యూజిలాండ్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ బౌలర్ మిచెల్ సాంట్నర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బౌలింగ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చిన సాంట్నర్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఫలితంగా ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ 4 వికెట్ల తేడాతో డబ్లిన్ గార్డియన్స్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన డబ్లిన్ గార్డియన్స్ 18 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జేమ్స్ విన్స్ (40), సంజయ్ కృష్ణమూర్తి (24) మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ఐదు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనను ఆరంభించిన ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు రాస్ అడైర్ (24), జేజే స్మట్స్ (33) రాణించగా, ఆఖర్లో లారి ఎవన్స్ (19), గారెత్ డెలాని (10) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఎడిన్బర్గ్ తరఫున సాంట్నర్కు ఇది రెండో ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.Mitchell Santner puts on a spin-bowling clinic 🙌#ETPL pic.twitter.com/9c6dFwpHnG— European T20 Premier League (ETPL) (@etplofficial) August 30, 2026Read: వాళ్లతో పోటీ ఏంటి?: పాక్ పరువు తీసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్! -
షెఫాలీ వర్మ విధ్వంసం.. థాయ్లాండ్ టార్గెట్ 160 రన్స్
మహిళల ఆసియా కప్లో భాగంగా థాయ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఓపెనర్ షెఫాలీ వర్మ (36 బంతుల్లో 64) అర్ధసెంచరీతో చెలరేగగా, డెబ్యూ బ్యాటర్ ప్రతీక రావల్ (22) ఆకట్టుకుంది. భారత ఓపెనర్ స్మృతి మంధాన (19; 10 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయింది. భారతీ 13 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తి శర్మ (5), రిచా ఘోష్ (0) నిరాశపర్చారు. చివర్లో క్రాంతి గౌడ్ (15 నాటౌట్), శ్రీచరణి (6 నాటౌట్) ధాటిగా ఆడడంతో భారత్ 150 పరుగుల మార్క్ను దాటింది.థాయ్లాండ్ బౌలర్లలో సుప్లీపోర్న్ 3 వికెట్లు పడగొట్టింది.మ్యాచ్లో టాస్ గెలిచిన థాయ్లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్కు అవకాశం వచ్చినట్లు హర్మన్ప్రీత్ తెలిపింది.చదవండి: థాయ్లాండ్తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు -
టీ20 క్రికెట్లో దీప్తి శర్మ అరుదైన ఫీట్
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్లాండ్ వుమెన్తో మ్యాచ్కు ముందే భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డు సాధించింది. థాయ్లాండ్తో మ్యాచ్ దీప్తి శర్మకు 150వ టీ20 కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత్ తరఫున మహిళల క్రికెట్లో 150 టీ20 ఆడిన మూడో ప్లేయర్గా దీప్తి శర్మ నిలిచింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (202 మ్యాచ్లు), స్మృతి మంధన (171 మ్యాచ్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఒక ఓవరాల్గా మహిళల క్రికెట్లో 150 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన 12వ క్రికెటర్గా దీప్తి శర్మ నిలిచింది. ఇప్పటివరకు దీప్తి శర్మ 149 టీ20 మ్యాచ్ల్లో 1270 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 168 వికెట్లు పడగొట్టింది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన థాయ్లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్కు అవకాశం వచ్చినట్లు హర్మన్ప్రీత్ తెలిపింది.From 1st T20I to 1⃣5⃣0⃣th 🙌From a young debutant to an experienced all-rounder 👌Deepti Sharma is all set for a special game today 🤗 - By @mihirlee_58#TeamIndia | #WomensAsiaCup | @Deepti_Sharma06 pic.twitter.com/73HWwNQyUr— BCCI Women (@BCCIWomen) August 30, 2026Read: థాయ్లాండ్తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు -
థాయ్లాండ్తో మ్యాచ్.. స్మృతి మంధన ప్రపంచ రికార్డు
ఆసియా కప్ టోర్నీలో భాగంగా థాయ్లాండ్ వుమెన్తో మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మంధన రెండో స్థానానికి చేరుకుంది. మ్యాచ్లో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సుజీ బేట్స్ (10,740 పరుగులు)ను అధిగమించింది. ప్రస్తుతం మంధన మూడు ఫార్మాట్లు కలిపి 10,750 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక తొలి స్థానంలో భారత దిగ్గజం మిథాలీరాజ్ (10,868 పరుగులు) ఉండగా, సుజీ బేట్స్ మూడో స్థానంలో ఉంది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (10, 273 పరుగులు), స్టెఫానీ టేలర్ (10,007 పరుగులు) నాలుగు, ఐదో స్థానాల్లో కొనసాగుతున్నారు.దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన థాయ్లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్ను అందుకుంది. గాయంతో జెమీమా దూరం కావడంతో ఆమె స్థానంలో ప్రతీక రావల్కు అవకాశం వచ్చినట్లు హర్మన్ప్రీత్ తెలిపింది.Read: టాస్ గెలిచిన థాయ్లాండ్.. ప్రతీక రావల్ అరంగేట్రం -
టాస్ గెలిచిన థాయ్లాండ్.. ప్రతీక రావల్ అరంగేట్రం
మహిళల ఆసియా కప్లో భాగంగా ఆదివారం భారత్, థాయ్లాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన థాయ్లాండ్ వుమెన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత్ తరఫున ప్రతీక్ రావల్ టీ20ల్లో అరంగేట్రం చేసింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ప్రతీక రావల్ క్యాప్ను అందుకుంది. టాస్ అనంతరం హర్మన్ మాట్లాడుతూ.. ఒకవేళ తాము టాస్ గెలిచి ఉంటే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని హర్మన్ తెలిపింది. దుబాయ్లో తమకు ఇదే తొలి మ్యాచ్ అని పేర్కొన్న హర్మన్, మ్యాచ్లో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. జెమీమా అందుబాటులో లేకపోవడంతోనే ప్రతీక రావల్కు అవకాశం వచ్చిందని హర్మన్ తెలిపింది.టీమిండియా ఉమెన్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందిని శర్మ.థాయ్లాండ్ వుమెన్ (ప్లేయింగ్ XI): అఫిసర సువాన్చోంరాతి, నట్టకాన్ చంతమ్, ఫన్నిత మాయ, నన్నపట్ కొంచరోయెంకై(వికెట్ కీపర్), చనిదా సుత్తిరువాంగ్, నవోమి హామిల్టన్, సులీపోర్న్ లావోమి, నన్నఫట్ చైహాన్, సునిదా చతురోంగ్రత్తనా, తిపచ్చో పుత్థూవాంగ్ (కెప్టెన్), ఒన్నిచా కంచోంపు.A look at #TeamIndia's playing XI for the opening game. Pratika Rawal makes her debut. #AsiaCup #INDvTHAI pic.twitter.com/QYOn1U616T— BCCI Women (@BCCIWomen) August 30, 2026Read: లార్డ్స్లో పాక్ బౌలర్ అరుదైన ఫీట్.. అక్రమ్ వల్ల కాలేదు! -
లార్డ్స్లో పాక్ బౌలర్ అరుదైన ఫీట్.. అక్రమ్ వల్ల కాలేదు!
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఫీట్ సాధించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన ఏడో పాకిస్తాన్ బౌలర్గా రికార్డులకెక్కాడు. అయితే పాక్ దిగ్గజ బౌలర్గా పేరొందిన వసీం అక్రమ్కు లార్డ్స్ మైదానంలో ఒక్క ఐదు వికెట్ల హాల్ లేకపోవడం గమనార్హం.లార్డ్స్ లో 5 వికెట్లు తీసిన పాక్ బౌలర్లు👉ఖాన్ మొహమ్మద్ (1956లో)👉ముదస్సర్ నజర్ (1982లో)👉వకార్ యూనిస్ (1992లో)👉ముస్తాక్ అహ్మద్ (1996లో)👉మొహమ్మద్ ఆమిర్ (2010లో)👉యాసిర్ షా (2016లో)👉తాజాగా మొహమ్మద్ అబ్బాస్ (2026లో)అంతేకాదు అబ్బాస్ ఐదు వికెట్ల ఫీట్తో లార్డ్స్ హానర్స్ బోర్డులోనూ చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్పై టెస్టుల్లో అబ్బాస్కు ఇదే మొదటి ఐదు వికెట్ల హాల్ కాగా, టెస్టుల్లో ఇది 8వ ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. గతంలో సౌతాఫ్రికా గడ్డపై, బంగ్లాదేశ్ గడ్డపై, వెస్టిండీస్ గడ్డపై.. తాజాగా ఇంగ్లండ్ గడ్డపై కూడా ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన అబ్బాస్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓవరాల్గా మొమహ్మద్ అబ్బాస్ పాకిస్తాన్ తరఫున 32 టెస్టుల్లో 128 వికెట్లు పడగొట్టాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. సాద్ షకీల్ (23), షాన్ మసూద్ (15) క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌట్ అయింది.MOHAMMAD ABBAS GETS 5Mohammad Abbas enters the Lord's Honours Board 👏 pic.twitter.com/7HiUwWaFVO— PctMedia (@PctMediaa) August 30, 2026చదవండి: ఆసీస్తో టెస్టు సిరీస్కు స్టార్ ప్లేయర్ దూరం.. షాక్లో సౌతాఫ్రికా! -
గాయంతో కీలక బ్యాటర్ ఔట్.. పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ!
ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. కానీ పాక్కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ విధించిన 389 పరుగులు టార్గెట్ను పాకిస్తాన్ ఛేదిస్తుందా లేక చతికిలపడుతుందా అన్నది పక్కనబెడితే, ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్కు రాకపోతే అప్పుడు పాక్ పది మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఇది పాక్కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఆట తొలిరోజే ఇమామ్ గాయపడడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్కు రాలేకపోయాడు. అయితే స్కానింగ్లో ఎడమ తొడ కండరాల్లో చీలిక వచ్చినట్లు తేలింది. ఇది గ్రేడ్ -1 టియర్గా వైద్యులు పరిగణించారు. దీంతో ఇమామ్-ఉల్-హక్కు పది రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అయితే ఇమామ్ ఉల్ హక్ గాయం విషయమై పీసీబీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మేనేజ్మెంట్ మాత్రం రిస్క్ తీసుకోవద్దనే భావిస్తోంది. దీంతో ఇమామ్ ఉల్ హక్ సిరీస్లో చివరి టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దగా ఫామ్లో లేకపోయినప్పటికీ, స్పెషలిస్ట్ బ్యాటర్గా పేరున్న ఇమామ్ గాయంతో దూరమవ్వడం పాక్కు ఇబ్బంది కలిగించనుంది. రెండో టెస్టులో 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్తో సిరీస్లో రెండు మ్యాచ్లు కలిపి కేవలం 89 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్, రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ 208 ఆలౌట్..ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (54) అర్ధసెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ (34), ఎమియో గే (31), రూట్ (24) పర్వాలేదనిపించారు. మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు తీయగా, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ ముంగిట 389 పరుగుల లక్ష్యం విధించింది. ఛేదనలో పాకిస్తాన్ తడబడుతోంది. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఓటమి దిశగా పయనిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, పాకిస్తాన్ 110 పరుగులకే కుప్పకూలింది.Read: ‘నోబాల్ వేస్తే ఫ్రీ హిట్ కాదు.. కఠిన శిక్షలు వేయాలి’ -
‘నోబాల్ వేస్తే ఫ్రీ హిట్ కాదు.. కఠిన శిక్షలు వేయాలి’
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ను టీమిండియా 1-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, ఆట చివరి రోజు నాలుగు వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో లంక మ్యాచ్ను డ్రా చేసుకోగా, భారత్కు విజయం చేజారింది. ఈ విషయం పక్కనబెడితే, శ్రీలంకతో టెస్టు సిరీస్లో టీమిండియా బౌలర్లు నోబాల్స్ ఎక్కువగా వేశారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువగా నోబాల్స్ నమోదైన టెస్టు సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్ టెస్టుల్లో నోబాల్స్ను కంట్రోల్ చేసేందుకు ఫ్రీహిట్ లాంటిది సరిపోవని, మరేదైనా కఠిన రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.గావస్కర్ మాట్లాడుతూ.. "టెస్టు క్రికెట్లో బ్యాటర్లకు పరుగులు చేయడం ఇప్పటికే చాలా సులభంగా మారింది. ఓవర్కు రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీ లైన్లను దగ్గరకు జరపడం వంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీ హిట్లు ప్రవేశపెట్టి బ్యాటింగ్ను మరింత సులభతరం చేయొద్దు. నో బాల్స్ వేయకుండా ఉండటం అనేది పూర్తిగా ఆటగాళ్ల నియంత్రణలో ఉండే అంశం. టేప్ మెజర్తో రనప్ మార్క్ చేసుకునే ఈ ఆధునిక రోజుల్లో ఇలాంటి పొరపాట్లకు క్షమాపణలు ఉండవు" అని చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా టెస్టుల్లో నోబాల్స్ సమస్యను తప్పించుకోవడానికి గవాస్కర్ పలు కీలక సూచనలు చేశాడు."నో బాల్ వేసిన ఆటగాడికి భారీ జరిమానా విధించాలి. అదే తప్పు మళ్లీ పునరావృతం చేస్తే ఆ జరిమానాను రెట్టింపు చేయాలి. అంతటితో ఆగకుండా, ఆటగాడి జరిమా నాలో సగం మొత్తాన్ని బౌలింగ్ కోచ్కు కూడా విధించాలి. అప్పుడే బాధ్యత పెరుగుతుంది" అని అన్నాడు. ఈ జరిమానాల ద్వారా వసూలైన మొత్తంతో సిరీస్ చివరలో టీమ్ సభ్యులందరికీ డిన్నర్ ఏర్పాటు చేయవచ్చని, ఇది జట్టులో బంధాన్ని మరింత పెంచుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2021 నుంచి టెస్టుల్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 85 కంటే ఎక్కువ నోబాల్స్ వేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీనిలో భాగంగానే సునీల్ గావస్కర్ తాజాగా నోబాల్స్ వ్యవహారంపై సీరియస్గా స్పందించాడు.Read: ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. పాక్కు ఓటమి తప్పదా? -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్
త్వరలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్ అందాయి. ఈ సిరీస్కు భారత జట్టును సెప్టెంబర్ 3న ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఆ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం ఖరారైనట్లు సమాచారం. అదే రోజే జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే.ఏషియన్ గేమ్స్ జట్టునే కొనసాగిస్తారా..?నివేదికల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగిస్తారని తెలుస్తుంది. అయితే కొందరు కీలక ఆటగాళ్ల ఫిట్నెస్పై స్పష్టత రావాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ నివేదికల కోసం సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారు. వీరు ముగ్గురు ఇటీవల గాయాల బారిన పడి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నారు.వీరితో పాటు వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా కూడా సీఓఈలోనే ఉన్నారు. వీరిలో వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.ఒకవేళ బుమ్రా, హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోతే వారి స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్లను తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అంచనా)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీచదవండి: Asia Cup 2026: రికార్డు విజయంతో శ్రీలంక బోణీ -
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం.. పాక్కు ఓటమి తప్పదా?
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఇంగ్లండ్ 350 పరుగుల లీడ్కు చేరువలో ఉంది. టీ విరామ సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులతో ఆడుతోంది. డాన్ లారెన్స్ (37), గస్ అకిన్సన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 342 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆటకు మరో రెండు రోజులు సమయం ఉండడంతో పాక్కు మరో ఓటమి తప్పేలా లేదనిపిస్తోంది. నాసిరకం బ్యాటింగ్తో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ లార్డ్స్ పిచ్పై రెండో బ్యాటింగ్ చేసి 350కి పైగా పరుగుల టార్గెట్ను ఛేదించడం కష్టం, ఆ జట్టు బ్యాటర్లు ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అసాధ్యమని చెప్పొచ్చు. మూడో రోజు ఆటకు వరుణుడు పదే పదే అడ్డు తగలడంతో ఇంగ్లండ్కు బ్యాటింగ్కు పెద్దగా అవకాశం రాలేదు. ఓవర్నైట్ స్కోరు 81-3తో మూడోరోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ రూట్ (24) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుణుడు దంచికొట్టడంతో ఆట నిలిచిపోయింది. వర్షం విరామం అనంతరం ఆట మొదలవ్వగా, హ్యారీ బ్రూక్ (34), డాన్ లారెన్స్ (37 బ్యాటింగ్) ఐదో వికెట్కు 45 పరుగులు జోడించారు. ఆ తర్వాత జేమీ స్మిత్ (7) తొందరగానే ఔటయ్యాడు. మరోసారి వర్షం దంచికొట్టడంతో ఇంగ్లండ్ టీ విరామానికి వెళ్లింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 3 వికెట్లు తీయగా, కుర్రమ్ షెహజాద్ 2 వికెట్లు పడగొట్టాడు.🚨 BIG WICKET FOR PAKISTAN! 🇵🇰- Mohammad Abbas dismisses Harry Brook.A brilliant catch by Mohammad Rizwan! England were 84/4, and Pakistan got their 5th wicket at 128 runs..A HUGE WICKET FOR PAKISTAN! pic.twitter.com/2ODRcq6SZj— Talha Nawaz (@TalhaDigital007) August 29, 2026Read: డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం -
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. జింబాబ్వేపై సౌతాఫ్రికా ఘన విజయం
పసికూన నమీబియా ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న సౌతాఫ్రికా టీ20 ట్రై సిరీస్లో బోణీ కొట్టింది. శనివారం విండ్హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే విధించిన 145 పరుగుల టార్గెట్ను సఫారీలు 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాల్డ్ బ్రెవిస్ (32 బంతుల్లో 75 నాటౌట్, 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించి ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఓపెనర్లు ప్రిటోరియస్ (22), జోర్డాన్ హెర్మన్ (20) పర్వాలేదనిపించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవన్స్, బ్లెసింగ్ ముజరబానీ, నైమురి తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (34) టాప్ స్కోరర్ కాగా, మరుమనీ (13 బంతుల్లో 30, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఆఖర్లో మెరవడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్ 3 వికెట్లు తీయగా, సుబ్రయెన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్లో బోణీ కొట్టగా, తర్వాతి మ్యాచ్ సోమవారం జింబాబ్వే, నమీబియా మధ్య జరగనుంది.🇿🇦𝐒𝐎𝐔𝐓𝐇 𝐀𝐅𝐑𝐈𝐂𝐀 𝐁𝐄𝐀𝐓 𝐙𝐈𝐌𝐁𝐀𝐁𝐖𝐄 𝐁𝐘 𝟕 𝐖𝐈𝐂𝐊𝐄𝐓𝐒🔥South Africa chased down 145 with ease, winning by 7 wickets.🔹️Dewald Brevis — 75 (32)*🔹️A match-winning knock to finish the chase in style.#SAvZIM #DewaldBrevis pic.twitter.com/LRxxAbmpS0— Sports Nexus (@SportsNexusNews) August 29, 2026Read: ఆసియా క్రీడలకు ముందే బిగ్షాక్.. పతకం పోయినట్లే! -
బుమ్రా, పాండ్యా విషయంలో కీలక అప్డేట్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగించుకున్న టీమిండియా స్వదేశానికి చేరుకుంది. సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య అఫ్గానిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్తో పాటు సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఆసియా గేమ్స్లో టీమిండియా పురుషుల జట్టు మ్యాచ్లు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. అయితే ఈ రెండు టోర్నీలకు భారత జట్టులో కీలకమైన స్పీడస్టర్ బుమ్రా, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడే విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లోనే రీహాబిలిటేషన్లో గడుపుతున్నారు. బుమ్రా ఎడమ మోకాలి గాయంతో బాధపడుతుండగా, పాండ్యా వెన్నునొప్పి నుంచి కోలుకున్నప్పటికీ, కాలి పిక్క కండరాల గాయం తిరగబెట్టడంతో సీవోఈలోనే ఉండిపోయాడు.తాజా నివేదికల ప్రకారం ఈ ఇద్దరి గాయాలపై కానీ, ఎప్పుడు కోలుకుంటారనే దానిపై కానీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరోవైపు అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్కు వీరిద్దరు ఆడకపోవచ్చు. ఇక ఆసియా గేమ్స్కు కూడా టీమిండియా-బి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు బీసీసీఐ ఇప్పటికే పేర్కొంది. మరి అప్పటివరకు బుమ్రా, పాండ్యా కోలుకుంటే ఆసియా గేమ్స్లో ఆడుతారా అంటే అది కూడా అనుమానమే. బి- జట్టును సిద్ధం చేస్తే మాత్రం బుమ్రా, పాండ్యాలు మరికొంత కాలం రీహాబిలిటేషన్ కేంద్రంలోనే గడపాల్సి ఉంటుంది. మరోవైపు గాయం నుంచి కోలుకున్న ప్రిన్స్ యాదవ్ ఆఫ్గన్తో టీ20 సిరీస్కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం అందింది. ఇది భారత పేస్ బౌలింగ్ దళానికి గుడ్న్యూస్ అని చెప్పొచ్చు.Read: చెస్ ఆడాలని చాలెంజ్.. ‘సారీ బ్రో రిటైరయ్యా’ -
‘బాయ్కాట్ విషయమే తెలీదు.. అప్పుడు భోజనం చేస్తున్నాం’
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులను స్కై స్పోర్ట్స్ ఇంటర్య్వూ చేయడాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ లార్డ్స్ టెస్టును బహిష్కరిస్తామని పీసీబీ పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. ఈ విషయాలేవీ తమకు తెలియదని, ఆటపై మాత్రమే దృష్టి పెట్టామని, ఆ సమయంలో తాము భోజనం చేస్తున్నామని చెప్పడం ఆసక్తి కలిగించింది.అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా తొలి రోజు ఆట సమయంలో మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ అథర్టన్, ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిమ్, సులేమాన్లను ఇంటర్వ్యూ చేశాడు. జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని, కంటిచూపు కూడా తగ్గుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, పాక్ ప్రభుత్వంలో హోం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ఈ ఇంటర్వ్యూపై పాక్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూను ఆపకపోతే మధ్యాహ్నం సెషన్ నుంచి ఆటను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) యూకే ప్రభుత్వ సలహా తీసుకుని, కొద్దిసేపటి విరామం తర్వాత లంచ్ సమయంలో ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. పాకిస్తాన్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ప్రసారాన్ని నిలిపివేశారు. అయితే పీసీబీ బెదిరింపులు ఎలా ఉన్నప్పటికీ, పాక్ ప్లేయర్స్ మాత్రం తొలిరోజు లంచ్ తర్వాత యథావిధిగా మైదానంలో అడుగుపెట్టారు. అయితే మ్యాచ్ బహిష్కరిస్తామని పీసీబీ హెచ్చరించిందనే వార్తలను సర్ఫరాజ్ అహ్మద్ తోసిపుచ్చాడు. పీసీబీ నిరసనపై తమకు లేదా తమ ఆటగాళ్లకు ఎలాంటి సమాచారం లేదని, ఆ సమయంలో తామంతా లంచ్ చేస్తున్నామని వివరణ ఇచ్చాడు. తాము ఇలాంటి వివాదాలపై ఎప్పుడు దృష్టి సారించబోమని, కేవలం ఆటపైనే తమ ఫోకస్ ఉంటుందని సర్ఫరాజ్ వెల్లడించాడు.ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించడంతో మూడోరోజు ఆట మొదలుకాలేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం పాకిస్తాన్ 110 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. ఎమియో గే (30), హారీ బ్రూక్ (7) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 261 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: ‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’ -
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ (ట్రాన్స్జెండర్) క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఎలైట్ క్రికెట్లో ఆడేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మారిజనే కాప్ మాత్రం అనయా బంగర్ మహిళల క్రికెట్లో ఆడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ట్రాన్స్జెండర్కు మహిళల క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించిన ఆమె.. "ఇది పూర్తిగా హాస్యాస్పదం.. అనుమతించడానికి వీల్లేదు" అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తాజాగా కాప్ విమర్శలపై అనయా బంగర్ స్పందించింది. "ఆమె (మరిజాన్ కాప్) వాదనలో ఉన్న బాధ నాకు అర్థమైంది. మాంచెస్టర్ యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ నాకు పరీక్షలు నిర్వహించింది. ఒక సంవత్సరం పాటు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న తర్వాతే, నా శరీరం అథ్లెటిక్ సామర్థ్యాలకు సంబంధించి వాళ్లు నాకు 12 వారాల పాటు టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిస్జెండర్ ఫీమేల్ అథ్లెట్ రేంజ్ పరిధికి లోబడే నా ఫిజికల్ పారామీటర్స్ ఉన్నాయి. నేను ప్రొఫెషనల్ మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టడం వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయమైన ప్రయోజనం ఉండదు. అందుకు నా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మహిళల క్రీడల్లో సమ్మిళితత్వం, నిష్పక్షపాతం, గౌరవాన్ని కాపాడటంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన విధానాలను రూపొందించింది. నేను ఇప్పటికే ఆ మార్గదర్శకాలను పాటిస్తున్నాను. అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి నా శరీరం టెస్టోస్టెరాన్ను ఉత్పత్తి చేయడం లేదు. నా టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 నానోమోల్స్గా ఉన్నాయి. ఎవరినీ మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా నాకు అనుమతి ఇచ్చిందన్న వార్త వినడం, ప్రాథమికంగా మహిళల క్రికెట్ ఆడేందుకు నాకు ఒక మార్గాన్ని చూపించడం చాలా గొప్ప విషయం.’’ అని చెప్పుకొచ్చింది.చదవండి: ఎలా అనుమతిస్తారు? సంజయ్ బంగర్ కుమార్తెపై విమర్శలు! -
మ్యాక్స్వెల్కు వార్నింగ్
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో లెవల్-1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు వార్నింగ్ వచ్చింది. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ వోల్వ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న మ్యాక్సీ.. డబ్లిన్ గార్డియన్స్తో జరిగిన మ్యాచ్లో అసభ్య పదజాలం వినియోగించాడు. ఫలితంగా నిర్వహకులు అతడిపై చర్యలు తీసుకున్నారు.ఈ విషయానికి సంబంధించి మ్యాక్స్వెల్ తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండా మందలింపుతో సరిపెట్టారు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ బ్యాట్తో చెలరేగి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. కేవలం 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.బెల్ఫాస్ట్ జట్టులో మ్యాక్స్వెల్తో పాటు మార్క్ చాప్మన్ (54) కూడా రాణించాడు. డబ్లిన్ బౌలర్లలో క్రిస్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. జోష్ లిటిల్ 2, హోలార్డ్, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.అనంతరం 185 పరుగుల లక్ష్య ఛేదనలో డబ్లిన్ జట్టు చేతులెత్తేసింది. మార్క్ అదైర్ (2-26), ఫ్రెడ్ క్లాస్సెన్ (2-26), హంఫ్రేస్ (2-23), నేత్రావాల్కర్ (1-24), క్రిస్ జోర్డాన్ (1-30) ధాటికి 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. తద్వారా బెల్ఫాస్ట్ జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మెరుపు అర్ద శతకంతో సత్తా చాటిన మ్యాక్స్వెల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.చదవండి: వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం -
వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు వినియోగిస్తానని ప్రకటించాడు. అలాంటి విద్యార్థులు లేదా వారి గురించి తెలిసిన వారు తనను సంప్రదించాలని కోరాడు.I want to use my X payout to support a needy student’s education📚If you or someone you know is a genuinely deserving student who is struggling financially with school/college expenses, please come forward or tag them here.I’d be happy to help in whatever way I can. Let’s… https://t.co/dVuZgwJhSy— Vaibhav Sooryavanshi (@Vaibhavsooryava) August 29, 2026నాకు సాధ్యమైన విధంగా సహాయం చేయడానికి సంతోషిస్తాను. తాను చేయబోయే సహాయానికి ఒక అర్థవంతమైన ప్రయోజనం కల్పిద్దామని పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఇవాళ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయాన్ని వైభవ్ నిన్ననే (ఆగస్ట్ 28) ఎక్స్ ద్వారా వెల్లడించాడు. 'గొప్ప విషయాలు రాబోతున్నాయి. చూస్తూ ఉండండి' అంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు. గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు.వైభవ్ గొప్ప మనసుకు సమస్త ప్రజానీకం ఫిదా అవుతుంది. 15 ఏళ్ల వయసులో వైభవ్ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడని జనాలు కొనియాడుతున్నారు. వైభవ్ చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అతడికి ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా, వైభవ్ స్వతహాగా ఇంకా స్కూలింగ్ కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం అతడు 10వ తరగతి విద్యార్ది. క్రికెట్పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు అతడు ఈ ఏడాది బోర్డు పరీక్షలను వాయిదా వేసుకున్నాడు. వైభవ్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. తాజాగా నార్త్ ఈస్ట్ జోన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బ్యాట్తో రాణించలేకపోయినా, బంతితో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో అతడు 4 బంతుల వ్యవధిలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో గెలుపొందిన ఈస్ట్ జోన్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్లో ఆ జట్టు సెంట్రల్ జోన్తో తలపడనుంది. చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా -
పాఠాలు నేర్వని పాక్.. ఇంగ్లండ్ దెబ్బకు 110 రన్స్కే ఆలౌట్
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో భాగంగా పాకిస్తాన్ తమ దారుణ ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పరాజయం చవిచూసిన పాకిస్తాన్ రెండో టెస్టులో పాఠాలు నేర్వలేదు. లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో పాకిస్తాన్ 37.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు వణికిపోయారు. ఓపెనర్ అజాన్ అవైస్ (46), సాద్ షకీల్ (16) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ 4 వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్ 3, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లండ్కు 180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. గాయం కారణంగా ఇమామ్-ఉల్-హక్ బ్యాటింగ్కు రాకపోవడంతో పాకిస్తాన్ 9 మంది బ్యాటర్లతోనే ఆటను కొనసాగించింది. దీంతో తొమ్మిదో వికెట్ పడిన తర్వాత పాక్ ఆలౌటైనట్లు అంపైర్లు ప్రకటించారు.Another humiliating defeat confirmed for Pakistan. 💔- Bowled out for 110 runs, with England leading by 180 runs. Congratulations to England in advance. pic.twitter.com/aAZplAxS9h— Abdullah (@Abdullahhhh_56) August 28, 2026చదవండి: టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన పసికూన -
టీ20 క్రికెట్లో సంచలనం.. సౌతాఫ్రికాకు షాకిచ్చిన నమీబియా
టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. ట్రై సిరీస్లో భాగంగా సౌతాఫ్రికా జట్టుకు పసికూన నమీబియా ఊహించని షాక్ ఇచ్చింది. విండ్హోక్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో నమీబియా 18 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. టీ20ల్లో సఫారీలను చిత్తు చేయడం నమీబియాకు ఇది రెండోసారి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ట్రై సిరీస్కు సౌతాఫ్రికా తమ బి జట్టును ఆడేందుకు పంపించింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్ ఫ్రైలింక్ (38 బంతుల్లో 60), లోరెన్ స్టీన్కాంప్ (29 బంతుల్లో 41) తొలి వికెట్కు 84 పరుగులు జోడించి పటిష్ట పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో గెర్హార్డ్ ఎరాస్మస్ (19), అలెక్సాండర్ (13 నాటౌట్) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రినెలన్ సుబ్రయెన్ 3 వికెట్లు తీయగా, డాన్ జాన్సెన్, జోర్న్ ఫోర్టున్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. డెవాల్డ్ బ్రెవిస్ (50 బంతుల్లో 75) రాణించినప్పటికీ మిగతావాళ్ల నుంచి సహకారం కరువైంది. చివర్లో డాన్ జాసన్ (17 బంతుల్లో 25 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెలమన్, జేజే స్మిత్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. సరిగ్గా పది నెలల క్రితం ఇదే వేదికపై సౌతాఫ్రికాను నమీబియా తొలిసారి టీ20ల్లో మట్టికరిపించడం విశేషం.Read: నైట్క్లబ్ ఉదంతం.. స్టోక్స్ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్? -
నైట్క్లబ్ ఉదంతం.. స్టోక్స్ను చావుదెబ్బ తీసిన భారత బౌలర్?
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో బిజీగా గడుపుతున్నాడు. నైట్క్లబ్ ఉదంతంతో ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయిన స్టోక్స్ రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కౌంటీ చాంపియన్షిప్లో స్టోక్స్ డుర్హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇదే టోర్నీలో గ్లౌసెస్టర్షైర్ జట్టుకు భారత బౌలర్ సాయి కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మ్యాచ్ సమయంలో వీరిద్దరి మధ్య ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసలై నైట్క్లబ్ ఉదంతంతో అవమానం పాలైన స్టోక్స్ను సాయి కిషోర్ చావుదెబ్బ తీశాడు. గ్లౌసెస్టర్షైర్ ఇన్నింగ్స్ సమయంలో సాయికిషోర్ బ్యాటింగ్కు రాగా, అతడిని స్టోక్స్ డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. తనను ఔట్ చేసిన స్టోక్స్పై ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న సాయికిషోర్కు ఆ వెంటనే బదులు తీర్చుకునే అవకాశం కలిగింది. PC: Twitterడుర్హమ్ జట్టు తరఫున 45 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ను సాయి కిషోర్ తెలివైన బంతితో క్లీన్బౌల్డ్ చేశాడు. ఫ్లైటెడ్ డెలివరీగా వచ్చిన బంతిని డిఫెన్స్ ఆడే యత్నంలో స్టోక్స్ మిస్ చేయడంతో వికెట్లను గిరాటేసింది. దీంతో తనను ఔట్ చేసిన స్టోక్స్ను పెవిలియన్ చేర్చిన ఆనందంలో సాయి కిషోర్ ఎగిరి గంతేశాడు. పనిలో పనిగా తన రివేంజ్ను కూడా తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గ్లౌసెస్టర్షైర్ 42 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ జేమ్స్ బ్రాసీ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఓలీ ప్రైస్ (27) పర్వాలేదనిపించాడు. డుర్హమ్ బౌలర్లలో కాసీ అల్డ్రిడ్జ్ 5 వికెట్లు తీయగా, బైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం డుర్హమ్ 60 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఓలీ రాబిన్సన్ (28), కేసీ ఆల్డ్రిడ్జ్ (3) పరుగులతో ఆడుతున్నారు. డేవిడ్ బెల్లింగ్హమ్ (122) సెంచరీ సాధించగా, బెన్ స్టోక్స్ (45) రాణించాడు. ప్రస్తుతం డుర్హమ్ 160 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సాయి కిషోర్, జేమ్స్ థామస్, జలాల్ అహ్మద్లు తలా రెండు వికెట్లు తీశారు.Sai Kishore... ladies and gentlemen! Ben Stokes is bowled, and there isn't a lot you can do about deliveries like that!#BecomeGlorious pic.twitter.com/b8WbN3jXEy— Gloucestershire Cricket (@Gloscricket) August 28, 2026Day 1: Sai Kishore b Ben StokesDay 2: Ben Stokes b Sai Kishore🔄#CountyChampionship pic.twitter.com/OLlvP2aC7e— Cricbuzz (@cricbuzz) August 28, 2026Read: ఆర్చర్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే! -
ఆర్చర్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే!
లార్డ్స్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఒక ఓవర్లో ఆరు బంతులు గంటకు 90 మైళ్ల వేగంతో విసిరి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఇందులో ఐదు బంతులు గంటకు 92 మైళ్ల వేగంతో విసరగా, మరో బంతిని 94 మైళ్ల వేగంతో వేయడం విశేషం. ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన బౌలింగ్లోనూ పాక్ బ్యాటర్ అజన్ అవైస్ ఒక ఫోర్ కూడా కొట్టడం గమనార్హం. ఇక ఓవర్ విషయానికి వస్తే.. ఆర్చర్ తన తొలి బంతిని గంటలకు 92 మైళ్ల వేగంతో, రెండో బంతిని గంటకు 94 మైళ్ల వేగంతో, మూడో బంతిని గంటకు 92 మైళ్ల వేగంతో, నాలుగు, ఐదు, ఆరు బంతులను కూడా గంటకు 92 మైళ్ల వేగంతో విసిరి సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. ఇక ఆర్చర్ ఒక ఓవర్ యావరేజ్ వేగం 92.33గా నమోదైంది.టెస్టు క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు బంతులను తొంబైకి పైగా వేగంతో విసరడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2024 జూలైలో వెస్టిండీస్తో టెస్టు మ్యాచ్లో మార్క్వుడ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఆనాటి మ్యాచ్లో మార్క్వుడ్ ఒకే ఓవర్లో ఆరు బంతులను వరుసగా గంటకు 93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2 మైళ్లవేగంతో విసిరాడు. ఇక ఓవర్లో వేగం యావరేజ్ 94.7గా నమోదైంది. తద్వారా తొలి క్రికెటర్గా మార్క్వుడ్ నిలిస్తే.. తాజాగా పాక్తో టెస్టులో ఓవర్లో ఆరు బంతులు 90కి పైగా స్పీడుతో విసిరిన ఆర్చర్ రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (61), జోర్డాన్ కాక్స్ (55) అర్ధసెంచరీలు సాధించగా, గస్ అకిన్సన్ (45), జోష్ టంగ్ (30 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 4 వికెట్లు తీయగా, మొహమ్మద్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.Watch out, Jofra's about! 🚨Shan Masood departs ☝️Match Centre: https://t.co/Z9bsIoMyb6 pic.twitter.com/0IaDNgRU5L— England Cricket (@englandcricket) August 28, 2026Ball 1: 92 MPHBall 2: 94 MPHBall 3: 92 MPHBall 4: 92 MPHBall 5: 92 MPHBall 6: 92 MPHJofra Archer steaming in⚡️ pic.twitter.com/s7jnNHV6zC— PctMedia (@PctMediaa) August 28, 2026 Ball 1: 92 MPHBall 2: 94 MPHBall 3: 92 MPHBall 4: 92 MPHBall 5: 92 MPHBall 6: 92 MPHJofra Archer steaming in⚡️ pic.twitter.com/s7jnNHV6zC— PctMedia (@PctMediaa) August 28, 2026Read: 'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!' -
'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!'
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే చివరి రోజు ఆటలో నాలుగు వికెట్లు కూల్చడంలో విఫలమైన భారత్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో సైంధవుడిలా మారి భారత విజయాన్ని ఒంటిచేత్తో అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్న వేళ మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొలంబో టెస్టులో విరాట్ కోహ్లి ఆడి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని, ఆ సైంధవుడి (సోనల్ దినూష) ఆటలు సాగేవి కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు."టెస్టు క్రికెట్ ఆడడం అంత సులువు కాదు. లాంగ్ ఫార్మాట్ గేమ్గా పిలువబడే ఆటలో ఓపిక, సహనం చాలా అవసరం. అలసిపోయినా గంటల కొద్ది ఓవర్లు బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో కోహ్లి ఆడి ఉంటే ప్రతీసారి జట్టును ఎంకరేజ్ చేస్తూ గెలుపుకోసం పోరాడుదామని ప్రేరణనిస్తూ జట్టులో స్ఫూర్తిని నింపేవాడేమో. కోహ్లి ఆడి ఉంటే సోనల్ దినూషను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అతడిని ఔట్ చేసేందుకు పదేపదే బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టేవాడు. కోహ్లి ఉంటే ప్రత్యర్థిని తన వ్యూహాలతో బోల్తా కొట్టించి వాళ్లను ఒత్తిడిలోని నెట్టేసేవాడు. లాంగ్ఫార్మాట్ అయిన టెస్టుల్లో కొన్నిసార్లు మనం బౌలింగ్ చేస్తూనే పోతాం.. బంతి బాగా టర్న్ అయ్యి వికెట్పడుతుందిలే అనుకొని పొరపాటు పడతాం. కొలంబో టెస్టులో ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఫలితం ఇలా వచ్చిందేమో." అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ఇక 2025 మేలో విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే పరిమితమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం కోహ్లి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశముంది. 123 టెస్టులాడిన కోహ్లి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.Read: ‘పబ్జీ’ మొబైల్ గేమ్ సృష్టికర్త మృత్యువాత! -
ఎలా అనుమతిస్తారు? సంజయ్ బంగర్ కుమార్తెపై విమర్శలు!
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రాన్స్జెండర్ పాలసీ కింద అనయా బంగర్ తన టెస్టోస్టిరాన్ లెవెల్స్కు సంబంధించి రిపోర్ట్స్ పంపిస్తే ఎలైట్ క్రికెట్ ఆడడంతో పాటు మహిళల బిగ్బాష్ ఆడేందుకు అనుమతిస్తామని సీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా స్టార్ ఆల్రౌండర్ మారిజనే కాప్ బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేసింది. "ట్రాన్స్జెండర్ అథ్లెట్గా అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు అనుమతించొద్దు. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆవలంబిస్తున్న వైఖరి పట్ల నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. అనయా బంగర్ మహిళా క్రికెటర్ ఎంతమాత్రం కాదు. ఆమె ఒక ట్రాన్స్జెండర్ అథ్లెట్. ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఆమె క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించొద్దని బహిరంగంగా పేర్కొంటున్నా" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.ఇక భారత మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, ఈ ఏడాది మార్చిలో లింగ నిర్థారణ శస్త్రచికిత్స చేయించుకుంది. అనయా బంగర్కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్జెండర్, లింగ వైవిధ్య క్రీడాకారుల చేరిక విధానంలో అనయా బంగర్కు తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది.క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ తాము కోరిన విధంగా ఆమె చేయించుకున్న పరీక్షల్లో రిపోర్ట్స్ అన్నీ అనుకూలంగా ఉంటే 2027 మార్చి నుంచి ఆస్ట్రేలియా ఎలైట్ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనయా బంగర్కు అర్హత లభిస్తుంది అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా జాక్వి పార్ట్రిడ్జ్ (CA, హెడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ), ఎమిలీ యేట్స్ (CA, ఇంటిగ్రిటీ పార్టనర్, లీగల్), పీటర్ రోచ్ (CA హెడ్ ఆఫ్ షెడ్యూలింగ్, ఆపరేషన్స్ అండ్ డొమెస్టిక్ క్రికెట్), డాక్టర్ పీటర్ హార్కోర్ట్ (CA, యాంటీ-డోపింగ్ మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పిప్ ఇంగే (CA టీమ్ డాక్టర్)లతో కూడిన నిపుణుల ప్యానెల్ అనయా బంగర్ కేసుపై దృష్టి సారించి, మెడికల్ రిపోర్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.ఇదే విషయంపై అనయా బంగర్ స్పందిస్తూ.. "అర్హత అనేది ఎంపిక కాదు. ట్రాన్స్జెండర్లకు ఎక్కడా ఆడే వీలు లేని సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అంతమాత్రానా నాకు జట్టులో స్థానం లభించినట్లు కాదని గుర్తుంచుకోండి. వాళ్లు పెట్టిన షరతులన్నీ అంగీకరించడంతో పాటు టెస్టుల్లో అనుకూల ఫలితాలు వస్తేనే నేను విజయవంతమైనట్లుగా భావిస్తాను. అన్నీ సక్రమంగా జరిగి ఎంపికైనా గెలుపు సాధించినట్లు కాదు. స్థానం నిలబెట్టుకోవాలంటే నేను ఇంకా శిక్షణ పొందాలి, పోటీ పడాలి, రాణించాలి. ఒక క్రికెటర్గా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని నేను కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది. ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది.#WATCH | Mumbai, Maharashtra: On making a comeback in cricket, Anaya Bangar, a cricketer and the daughter of former Indian international cricketer and national batting coach, Sanjay Bangar, said, "...I am preparing to return to women's cricket in Australia with the aim of… pic.twitter.com/NVgrICOjgT— ANI (@ANI) August 27, 2026🚨South African cricketer Marizanne Kapp criticizes Anaya Bangar's inclusion in women's cricket🚨Marizanne Kapp:🗣️ I honestly don't think it's fair to the other women cricketers. Cricket Australia's decision to allow Anaya Bangar to play in the Women's Big Bash is hard to… pic.twitter.com/GodPoWTykc— Central Cricket (@arshdeep3444) August 28, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
జడేజా ఖాతాలో ఊహకు కూడా అందని చెత్త రికార్డు!
టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో ఊహకు అందని విధంగా అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. డీఆర్ఎస్ కోరడంలో 22 సార్లు విఫలమై చెత్త రికార్డు మూటగట్టుకున్న జడేజా ఖాతాలో ఇప్పుడు నోబాల్స్ రికార్డు కూడా వచ్చి చేరడం గమనార్హం. 2021 నుంచి ఐదేళ్ల కాలంలో జడేజా అత్యధిక నోబాల్స్ వేసిన స్పిన్నర్గా నిలిచాడు. అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం సర్వ సాధారణం. ఎందుకంటే రనప్లో తేడా వచ్చిన ప్రతీసారి వాళ్లు నోబాల్స్ వేయడం కనిపిస్తుంది. కానీ స్పిన్నర్లు మాత్రం వీలైనంత తక్కువగానే నోబాల్స్ వేయడం చూస్తుంటాం.కానీ జడేజా విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. 2021 నుంచి ఇప్పటివరకు జడేజా 88 నో బాల్స్ వేయడం గణాంకాల పరంగా ఆందోళన కలిగించే అంశం. తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జడేజా నో-బాల్ వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇదే టెస్టులో భారత స్పిన్నర్లు ఇప్పటివరకు మొత్తం 10 నో-బాల్స్ వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.నో-బాల్స్ జాబితాలో జడేజా టాప్2021 నుంచి టెస్టు క్రికెట్ లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్ గణాంకాలను పరిశీలిస్తే జడేజా అందరికంటే ముందున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 40 నోబాల్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా వేసిన నో-బాల్స్ సంఖ్య తన తర్వాతి స్థానంలో ఉన్న బౌలర్కు రెట్టింపు సంఖ్యలో ఉండడం గమనార్హం.2021 నుంచి టెస్టుల్లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్:👉రవీంద్ర జడేజా (భారత్): 88👉నోమన్ అలీ (పాకిస్థాన్): 40👉లసిత్ ఎంబల్దేనియా (శ్రీలంక): 33👉జాక్ లీచ్ (ఇంగ్లాండ్): 19👉జోమెల్ వార్రికాన్ (వెస్టిండీస్): 17👉జహిర్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్): 17ఇక మ్యాచ్ విషయానికొస్తే కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది.Most no-balls by spinners in Tests since 2021: 88* - Ravindra Jadeja. 40 - Noman Ali. 33 - Lasith Embuldeniya. pic.twitter.com/y9EsOgImCP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2026Read: 21 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ -
21 ఏళ్ల కెరీర్కు గుడ్బై చెప్పిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ బుధవారం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో ఎసెక్స్ తరఫున ఆడుతున్న డీన్ ఎల్గర్, 2026 కౌంటీ సీజన్ తనకు చివరి టోర్నీ అని, ఆ తర్వాత క్రికెట్కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2012లో సౌతాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన డీన్ ఎల్గర్ 2024లో కేప్టౌన్లో భారత్తో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018లో చివరి వన్డే ఆడాడు. అప్పటినుంచి కౌంటీల్లో కొనసాగుతూ వచ్చాడు. తాజాగా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఎల్గర్ ప్రకటన విడుదల చేశాడు.2012 నుంచి 2024 మధ్య సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డీన్ ఎల్గర్ నిఖార్సైన టెస్టు క్రికెటర్గా గుర్తింపు పొందాడు. తన 12 ఏళ్ల కెరీర్లో టెస్టులకు మాత్రమే పరిమితమైన డీఎన్ ఎల్గర్ 2017లో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సమయంలో రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ వ్యక్తిగత కారణాలతో దూరమైనప్పుడు అతడి స్థానంలో ఎల్గర్ బాధ్యతలు చేపట్టాడు. 2021లో వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు డీన్ ఎల్గర్ తొలిసారి టెస్టు కెప్టెన్గా పూర్తి బాధ్యతలు తీసుకున్నాడు. అతడి సారథ్యంలో దక్షిణాఫ్రికా 18 టెస్టులు ఆడగా, ఇందులో 9 విజయాలు, ఏడు ఓటములు, రెండు డ్రాలు ఉన్నాయి. కెప్టెన్గా డీన్ ఎల్గర్ సక్సెస్ రేటు 50శాతం ఉండడం గమనార్హం.21 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో డీన్ ఎల్గర్ 278 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 18,925 పరుగులు, 178 లిస్ట్-ఏ క్రికెట్ మ్యాచ్ల్లో 6,264 పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా తరఫున డీన్ ఎల్గర్ 86 టెస్టుల్లో 5,347 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి.కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్లో ఎసెక్స్ మరో ఐదు మ్యాచ్లు ఆడనుంది , ఇందులో భాగంగా సర్రేతో వారి మ్యాచ్ ఆగస్టు 27న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 24న గ్లామోర్గాన్తో జరిగే మ్యాచ్తో ఎసెక్స్ తమ సీజన్ను ముగించనుంది. దీంతో ఎల్గర్ ప్రొఫెషనల్ కెరీర్కు కూడా ఎండ్కార్డ్ పడనుంది.చదవండి: అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం! -
అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో, భారత్ గెలుపు లాంచనమే అయినప్పటికీ, వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో ఐదో రోజు ఆటలో ఒక్క బంతి కూడా సాధ్యపడకపోతే అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది. మరి మ్యాచ్ డ్రా అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో భారత్కు ఎదురయ్యే అడ్డంకులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో (PCT) ఐదవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, శ్రీలంకపై గెలిస్తే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ డ్రా అయితే మాత్రం, భారత్ 51.52 శాతం పాయింట్ల తేడాతో ఐదవ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్కు మరో ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 10 టెస్టుల్లో ఇప్పటికే నాలుగింటిలో ఓడిపోయిన శుభ్మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు, ఇక నుంచి ప్రతీ టెస్టు నాకౌట్ లాంటిదే. ఈ ఏడాది నవంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ న్యూజిలాండ్కు వెళ్లనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2027 సీజన్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ నెగ్గడంతో, భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో ఏడు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు లంకతో రెండో టెస్టు వర్షం వల్ల డ్రా అయితే మాత్రం భారత్ కచ్చితంగా ఏడింటికి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్లు 68.52గా ఉండడంతో పాటు ఫైనల్ ఆడేందుకు చాన్స్ ఉంటుంది. అంతేకాదు భారత్కు రాబోయే ఏడు టెస్టుల్లో ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లభించకపోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్! -
దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్లో జడేజా, సిరాజ్ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది. క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు. మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. లంక తమ రెండో ఇన్నింగ్స్లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.pic.twitter.com/jFfDPp6M6B— crictalk (@crictalk7) August 26, 2026Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం! -
టీమిండియా కొంపముంచిన ప్రసిధ్.. గంభీర్, జడేజా ఆగ్రహం!
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫాలో ఆన్లో మాత్రం లంక జాగ్రత్తగా ఆడుతోంది. భారత్కు విజయం దక్కనివ్వొద్దనే కాంక్షతో లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్ను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్లు జారవిడవడం కూడా లంకకు కలిసొచ్చింది. ముఖ్యంగా పసిందు సూరియబండారా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం 90 పరుగులతో ఆడుతున్న సూరియబండారా 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన క్యాచ్ను ప్రసిధ్ క్రిష్ణ వదిలేయడం భారత్ కొంపముంచింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జడేజా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని పసిందు బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిధ్ క్యాచ్ అందుకోవడం కష్టతరమైనప్పటికీ, కాస్త ముందుకు డైవ్ చేసి ఉంటే సులువుగా క్యాచ్ తీసుకునేవాడే. కానీ అతడు ప్రయత్నం చేయకపోవడంతో బంతి అతని చేతి వేళ్లను తాకుతూ పక్కకు వెళ్లిపోయింది. ఇది చూసిన జడేజా..‘ అరె బాయ్.. ఏ క్యా హై?’ అంటూ ప్రసిధ్పై ఆగ్రహం వ్యక్తం చేయడం స్టంప్ మైక్లో రికార్డయింది. ఇదే సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి గమనిస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రసిధ్ క్యాచ్ జారవిడవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలా క్యాచ్ డ్రాప్తో బతికిపోయిన పసిందు సూరియబండారా ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు. తనకు వచ్చిన లైఫ్ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత ఫిఫ్టీ సాధించడంతో పాటు తన జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు ఇచ్చిన క్యాచ్ను ప్రసిధ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.pic.twitter.com/YHn9sJJyfU— crictalk (@crictalk7) August 26, 2026Read: నంబర్వన్ బౌలర్గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి -
నంబర్వన్ బౌలర్గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇప్పటిదాకా నంబర్వన్గా ఉన్న టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టిన స్టార్క్ టెస్టుల్లో నంబర్వన్ బౌలర్గా అవతరించాడు. ఇటీవలే బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో భాగంగా మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు) నమోదు చేసిన స్టార్క్ తొలిసారి తన 16 ఏళ్ల కెరీర్లో టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకును అందుకోవడం విశేషం. అది కూడా 36 ఏళ్ల వయసులో స్టార్క్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ప్రస్తుతం స్టార్క్ 872 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్ బౌలర్ మాట్ హెన్రీ 861 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టాప్-10లో ఆస్ట్రేలియా నుంచే స్టార్క్ సహా మొత్తం ఐదుగురు బౌలర్లు చోటు దక్కించుకోవడం విశేషం. కెప్టెన్ కమిన్స్ నాలుగో స్థానంలో ఉండగా, స్కాట్ బోలండ్ ఏడో స్థానంలో, హాజిల్వుడ్, నాథన్ లియోన్లు 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్, రబాడలు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా, పాకిస్తాన్కు చెందిన నోమన్ అలీ 8వ స్తానంలో ఉన్నాడు. ఇక టీమిండియా నుంచి బుమ్రా మినహా ఏ ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మహ్మద్ సిరాజ్ 4 స్థానాలు దిగజారి 18వ స్థానంలో, జడేజా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో స్టార్క్ రెండు టెస్టులు కలిపి 12 వికెట్లు తీయగా.. ఇందులో 10 వికెట్లు ఒకే టెస్టులో పడగొట్టడం విశేషం.2010లో ఆస్ట్రేలియా తరఫున 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిస మిచెల్ స్టార్క్ స్టార్ బౌలర్గా ఎదిగాడు. ఇప్పటివరకు 107 టెస్టులాడి 445 వికెట్లు, 130 వన్డేల్లో 247 వికెట్లు, 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు. A change at the top of the rankings for Test bowlers as an Australian quick claims the No.1 spot for the very first time 😲https://t.co/fvecGLHkbT— ICC (@ICC) August 26, 2026Read: 22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్ జాగ్రత్త! -
ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదల
ఏషియన్ గేమ్స్ 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. పురుషుల విభాగంలో 10 జట్లు.. మహిళల విభాగంలో 8 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.పురుషుల విభాగం విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్, జపాన్, నేపాల్ జట్లు.. గ్రూప్-బిలో హాంగ్కాంగ్-చైనా, మలేషియా, ఒమన్ జట్లు పోటీపడనున్నాయి. సీడెడ్ జట్లైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించాయి.భారత్, పాకిస్తాన్ జట్లు తమ తమ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో గెలుపొందితే అక్టోబర్ 1న జరిగే సెమీఫైనల్లో తలపడే అవకాశం ఉంది.పురుషుల క్రికెట్ షెడ్యూల్క్వాలిఫయర్స్సెప్టెంబర్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ జపాన్ హాంకాంగ్-చైనా వర్సెస్ మలేషియా సెప్టెంబర్ 25- హాంకాంగ్-చైనా వర్సెస్ ఒమన్ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ నేపాల్ సెప్టెంబర్ 26- జపాన్ వర్సెస్ నేపాల్ మలేషియా వర్సెస్ ఒమన్ క్వార్టర్ఫైనల్స్ సెప్టెంబర్ 28 (తొలి క్వార్టర్ ఫైనల్)- పాకిస్తాన్ వర్సెస్ గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచే జట్టుసెప్టెంబర్ 28 (రెండో క్వార్టర్ ఫైనల్)- భారత్ వర్సెస్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచే జట్టుసెప్టెంబర్ 29 (మూడో క్వార్టర్ ఫైనల్)- శ్రీలంక వర్సెస్ గ్రూప్-ఏ విన్నర్సెప్టెంబర్ 29 (నాలుగో క్వార్టర్ ఫైనల్)- బంగ్లాదేశ్ వర్సెస్ గ్రూప్-బి విన్నిర్అక్టోబర్ 1- సెమీఫైనల్స్ అక్టోబర్ 3- కాంస్య పతక మ్యాచ్, ఫైనల్ |మహిళల విభాగం విషయానికొస్తే.. భారత్, జపాన్, బంగ్లాదేశ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఒక గ్రూపులో.. పాకిస్తాన్, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్ మరో గ్రూప్లో ఉన్నాయి. ఈ పోటీలు నేరుగా క్వార్టర్ ఫైనల్స్తో మొదలవుతాయి.సెప్టెంబర్ 17- క్వార్టర్ ఫైనల్ 1- బంగ్లాదేశ్ వర్సెస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా క్వార్టర్ ఫైనల్ 2- పాకిస్తాన్ వర్సెస్ థాయ్లాండ్సెప్టెంబర్ 18- క్వార్టర్ ఫైనల్ 3- శ్రీలంక వర్సెస్ మలేషియాక్వార్టర్ ఫైనల్ 4- భారత్ వర్సెస్ జపాన్సెప్టెంబర్ 20- సెమీఫైనల్స్ (1,2)సెప్టెంబర్ 22- కాంస్య పతకం మ్యాచ్, ఫైనల్స్చదవండి: బ్రెజిల్కు ముందు మరో ప్రపంచకప్ జట్టుతో భారత్ మ్యాచ్ -
భువీ విజృంభణ
యూపీ టీ20 లీగ్ 2026లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభిస్తున్నాడు. ఈ టోర్నీలో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న డిఫెండింగ్ ఛాంపియన్స్ కాశీ రుద్రాస్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా అతడి జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపు లక్నో ఫాల్కన్స్కు వరుసగా మూడవది. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనకు గానూ భువీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.ఈ మ్యాచ్లో లక్నో ఫాల్కన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. భువీ కొత్త బంతితో చెలరేగిపోయాడు. పవర్ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి కాశీ రుద్రాస్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువీతో పాటు అభినందన్ సింగ్ (3-16) కూడా సత్తా చాటడంతో రుద్రాస్ 19.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. రుద్రాస్ తరఫున శుభమ్ చౌబే (32 బంతుల్లో 46 పరుగులు) ఒంటరి పోరాటం చేశాడు.అనంతరం 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. హిమాన్షు సింగ్ (64) మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 16 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.కాగా, యూపీ టీ20 లీగ్లో భువనేశ్వర్ కుమార్ తన అసమాన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్లో అదిరిపోయే స్పెల్స్తో సత్తా చాటుతున్న అతడు.. టోర్నీ చరిత్రలోనే (నాలుగు సీజన్లు) 400 డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్గా అవతరించాడు. ఈ టోర్నీ 2024 ఎడిషన్లో భువీ వేసిన స్పెల్ (4-1-4-0) టీ20ల చరిత్రలోనే అత్యుత్తమమైన స్పెల్స్లో ఒకటిగా చలామణి అవుతుంది.ప్రస్తుతం భువీకి భారత జట్టులో చోటు లేనప్పటికీ.. ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఆర్సీబీ వరుసగా రెండు సీజన్లలో టైటిల్ సాధించడంలో భువీది కీలకపాత్ర. -
రుతురాజ్కు కొత్త అనుభవం
టీమిండియా ప్రామిసింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్కు ఓ కొత్త అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడు.. ఫస్ట్క్లాస్ కెరీర్లో తొలిసారి రనౌటయ్యాడు. ఈ టోర్నీలో వెస్ట్ జోన్కు నాయకత్వం వహిస్తున్న రుతు.. నార్త్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో కీలకమైన 66 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు.రుతు 47 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో మునుపెన్నడూ రనౌట్ కాలేదు. 44.51 సగటున 9 సెంచరీలు, 17 అర్ద సెంచరీల సాయంతో 3294 పరుగులు చేసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.FIRST TIME IN HIS CAREER 💔- Ruturaj Gaikwad has been run-out for the first time in his FC cricket. pic.twitter.com/cVYjjwaIbH— Johns. (@CricCrazyJohns) August 25, 2026మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్ట్ జోన్ జట్టు విజయానికి ముంగిట్లో ఉంది. ఆ జట్టు మరో 67 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది. అయితే చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఉర్విల్ పటేల్ (17) క్రీజ్లో ఉన్నాడు. తనుశ్ కోటియన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే బ్యాటింగ్కు రావాల్సి ఉంది.287 పరుగుల లక్ష్య ఛేదనలో రుతురాజ్ ధాటిగా ఆడి 70 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి తన జట్టును విజయానికి చేరవ చేశాడు. యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ అత్యంత కీలకమైన 96 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 251 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్ జోన్ 187 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ జోన్ షమ్స్ ములానీ (4-78), తనుశ్ కోటియన్ (4-46) ధాటికి 222 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 287 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ జోన్ 28 పరుగులకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయినప్పటికీ.. ముషీర్ ఖాన్, రుతురాజ్ ఆదుకున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 220-7గా ఉంది.ఇదిలా ఉంటే, నిన్ననే ముగిసిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆగస్ట్ 30న మొదలయ్యే తొలి సెమీస్లో ఈస్ట్ జోన్ జట్టు సెంట్రల్ జోన్ను ఢీకొట్టనుంది. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ మ్యాచ్ విజేత ఆగస్ట్ 30ననే మొదలయ్యే రెండో సెమీస్లో సౌత్ జోన్లో తలపడుతుంది. చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్ జాగ్రత్త!
భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. అశ్విన్తో కలిసి బౌలింగ్ను పంచుకున్న జడేజా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. వేగంగా ఓవర్లు పూర్తి చేయడంలో జడేజా సిద్ధహస్తుడు. ఇక వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం జడ్డూ శైలి కావడంతో బ్యాటర్లు ఎక్కువగా ఎల్బీడబ్ల్యూగానే వికెట్ ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు అదే ఎల్బీడబ్ల్యూలకు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విషయంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గణాంకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ.. డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం)లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ అతడు వరుసగా 22 రివ్యూలను కోల్పోయాడు. వీటిలో నాలుగు దఫాలు మాత్రమే అంపైర్ కాల్గా వెళ్లాయి. గత మూడేళ్ల కాలంలో జడేజా 22 సార్లు డీఆర్ఎస్లు తీసుకోగా.. అందులో 18 రివ్యూలు వృథా అయ్యాయి.దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్రౌండర్గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చివరిసారిగా 2023లో జడేజా తీసుకున్న రివ్యూ విజయవంతమైంది. ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్పై తొలి ఇన్నింగ్స్లో రివ్యూతో కీమర్ రోచ్ వికెట్ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జడేజా మళ్లీ రివ్యూల్లో సక్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్గా గిల్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఆటగాళ్లు పట్టుబట్టినా రివ్యూలు తీసుకోని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గిల్ నేర్చుకోవాల్సిన అవసరముంది. ఇక జడేజా ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,117 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15సార్లు ఐదు వికెట్లు, మూడు దఫాలు పది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.Ravindra Jadeja has had his last 22 DRS reviews struck down as a bowler in Tests. Only four of them have turned out to be umpire's call 🤯His last successful review as a bowler came in the West Indies' first innings in the Dominica Test in July 2023, with the dismissal of Kemar… pic.twitter.com/H6uqCc0OCR— Cricinfo (@cricinfo) August 25, 2026చదవండి: జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు! -
జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు!
కొలంబో వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయినప్పటికీ దినూష వికెట్ తీయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం దినూష 85 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన దినూష రెండో టెస్టులోనూ లంక పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, దినూష మాత్రం తన బ్యాటింగ్తో భారత్కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోనల్ దినూష టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.భారత్తో జరిగిన టెస్టుల్లో తొలి మూడు ఇన్నింగ్స్ల్లో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో బ్యాటర్గా దినూష నిలిచాడు. తొలి టెస్టులో దినూష మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్లో 84 పరుగులు, తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 85 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్ (176, 96, 235 నాటౌట్), ఎవర్టన్ వీక్స్ (128, 194, 162) భారత్పై ఈ ఫీట్ అందుకున్నారు. అయితే భారత్పై టెస్టుల్లో తొలి నాలుగు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్గా ఎవర్టన్ వీక్స్ నిలిచాడు.స్వీప్ షాట్లతో మరో రికార్డుపనిలో పనిగా దినూష మరో రికార్డు కూడా అందుకున్నాడు. అదేంటంటే, ఒక టెస్టు సిరీస్లో స్పిన్నర్ల బౌలింగ్లో స్వీప్ షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినూష (106 పరుగులు) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానం కూడా జో రూట్దే.2021లో శ్రీలంకతో టెస్టు సిరీస్లో రూట్ స్పిన్నర్ల బౌలింగ్లో స్వీప్ షాట్లు ఆడి 160 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మరో ఇంగండ్ బ్యాటర్ బెన్ డకెట్ 2022లో పాకిస్తాన్ తో టెస్టు సిరీస్లో స్వీప్ షాట్ల రూపంలో 112 పరుగులు సాధించాడు. దినూష తర్వాత యూనిస్ ఖాన్ (103 పరుగులు), మిస్బా ఉల్ హక్ (103 పరుగులు) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.లంక తరఫున రెండో బ్యాటర్గాశ్రీలంక తరఫున భారత్పై తొలి మూడు టెస్టు ఇన్నింగ్స్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్గానూ సోనల్ దినూష నిలిచాడు. గతంలో 1982లో దులీప్ మెండిస్ భారత్పై వరుసగా 105, 105, 51 పరుగులు సాధించాడు. సోనల్ దినూష స్పిన్ బౌలింగ్లో సాధించిన 284 పరుగుల్లో 122 రన్స్ (42.95 శాతం) స్వీప్, స్లాగ్, రివర్స్ షాట్ల ద్వారా సాధించడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోనల్ దినూష (85), లాహిరు కుమారా (8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో 3 వికెట్లు తీశారు. లంక మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్ను 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో చెలరేగారు.Sonal Dinusha keeps Sri Lanka’s hopes alive against India in Colombo 👊#WTC27 📝: https://t.co/8NP3Qr1pnQ pic.twitter.com/3HMx47B3av— ICC (@ICC) August 25, 2026Sonal Dinusha is only the second Sri Lankan batter to score three consecutive 50+ scores in his first three Test innings against India! 🇱🇰🤍🌟#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/DlAq45rejU— Sportskeeda (@Sportskeeda) August 25, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె!
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ (ట్రాన్స్జెండర్) సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ తరఫున క్రికెట్ఆ డబోయేది లేదని, ఆస్ట్రేలియా తరఫునే ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపె ట్టింది. మంగళవారం ఒక మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయా బంగర్ మాట్లాడుతూ.. ఒక దశలో తాను క్రికెట్లోకి తిరిగి వచ్చే ఆశలను పూర్తిగా కోల్పోయానని, ఆ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తనకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. "నేను క్రికెట్ ఆడగలనని తెలిసిన రోజు నాకు స్పెషల్ డే. నేను మళ్లీ క్రికెట్ ఆడలేనేమో అనుకున్న రోజులున్నాయి. కానీ ఇవాళ ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు కృతజ్ఞతలు. ఇది నాకు కచ్చితంగా మరో అవకాశం లాంటిది” అని చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్లాండ్లో అనయా బంగర్ ట్రాన్స్జెండర్ మార్పిడి ఆపరేషన్ (వెగినోప్లాస్టీ) చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. సర్జరీ పూర్తయ్యి ఆరు నెలల కావడంతో ఇప్పుడు అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక షరతుతో అనయా బంగర్ తమ దేశం తరఫున ఎలైట్ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుంది.అయితే బీబీఎల్ (బిగ్బాష్ లీగ్) వంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే మాత్రం టెస్టోసిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి.ఇప్పటికే అనయా బంగర్కు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు సంబంధించిన లేఖను పంపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రెటీ హెడ్ జాక్వి పార్టిడ్జ్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున అనయా బంగర్ ఎలైట్ క్రికెట్లో ఆడాలనుకుంటే, మీ సీరం టెస్టోస్టెరాన్ గాఢత 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) తక్కువగా ఉన్నట్లు నిరూపిస్తూ వివరాలు అందించాలని కోరుతున్నాం. ఒకవేళ షరతులకు లోబడి నివేదిక ఉంటే అర్హత ప్రకారం ఆడేందుకు అనుమతిస్తాం.’’ అని చెప్పుకొచ్చారు. ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. దీంతో మన దేశంలో ట్రాన్స్జెండర్ల క్రికెటర్ల భవిష్యత్తుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే గతంలో అనయా బంగర్.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి క్రికెటర్లతో కలిసి ముంబై క్రికెట్కు ప్రాతినిధ్యం వహించారు.🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026Read: వైఫల్యాలను దాచిపెట్టడానికి సిగ్గుండాలి: హాకీ దిగ్గజం -
అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతు రెండో టెస్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పటికే జైస్వాల్, అసితా ఫెర్నాండో వివాదంపై సీరియస్ అయిన ఐసీసీ వారిద్దరికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ ప్రబాత్ జయసూరియా కూడా చేరిపోయాడు. రెండో రోజు ఆట చివర్లో వెలుతురు మందగించడంతో తాము ఆడలేమంటూ జయసూరియా అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ అంపైర్లు ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్లతో వాదన జరిగిన మరుక్షణమే ప్రబాత్ ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ వెళుతూ బౌండరీ లైన్ వద్ద కోపంతో బ్యాట్ను నేలకేసి కొడుతూ, గ్లౌజులను విసిరేశాడు. ప్రబాత్ జయసూరియా చర్యలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో చర్యలకు ఉపక్రమించింది.‘‘అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రబాత్ జయసూరియా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. అందుకే క్రమశిక్షణా చర్య కింద ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నాం. గత రెండేళ్లలో అతడికి ఇదే మొదటి ఉల్లంఘన కావడంతో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్తో సరిపెడుతున్నాం’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ప్రబాత్ జయసూరియ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే?భారత్ తొలి ఇన్నింగ్స్ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. లంక తొలి వికెట్ కోల్పోవడంతో నైట్వాచ్మెన్గా వచ్చిన ప్రబాత్ జయసూరియా వెలుతురు సరిగా లేదని, ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.Nightwatchman sent packing! 🚶➡️ Manav Suthar strikes to pick up the wicket of Prabath Jayasuriya and wrap up the day on a high! 💥 Watch #SLvIND, 2nd Test, Day 3, Tomorrow, 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/pAKsoOncyK— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026🚨Prabath Jayasuriya has been sanctioned by the ICC for breaching the Code of Conduct during the 2nd Test vs India.• Breached Article 2.2 pic.twitter.com/R6d4b8qPsD— TheWicketReport (@WicketReport) August 25, 2026Read: లంక కెప్టెన్ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే? -
లంక కెప్టెన్ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే?
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసిన లంక మరో 299 పరుగులు వెనుకబడి ఉంది. ఈ విషయం పక్కనబెడితే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా వికెట్ తీయడంలో సర్ఫరాజ్ ఖాన్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మానవ్ సుతార్ బౌలింగ్లో ధనంజయ వెనుదిరగడానికి ముందు షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన మాటలతో లంక కెప్టెన్ను కన్ఫ్యూజన్కు గురి చేశాడు."బ్రో ఇక్కడేం లేదు బ్రో, స్ట్రెయిట్గా చూడు. ఎందుకు ప్రతీసారి లెఫ్ట్, రైట్ (లాంగాన్, లాంగాఫ్) చూస్తున్నావు. నువ్వు టైం మొత్తం వృథా చేస్తున్నావు. భయపడకుండా ఆడు బ్రో. నువ్వు ఒక జట్టుకు కెప్టెన్ అన్న విషయం గుర్తుంచుకో. నువ్వు ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నావు" అని చెప్పడం మైక్స్టంప్లో రికార్డయింది. ఆ వెంటనే సుతార్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో, ఎడ్జ్ అవ్వడంతో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 8 పరుగులు మాత్రమే చేసిన ధనంజయ డిసిల్వా పెవిలియన్ బాట పట్టాడు. ఇక తొలి టెస్టులో జైస్వాల్ కూడా లంక బ్యాటర్ను ఇలాగే కన్ఫూజన్కు గురి చేసి అతడు ఔటవ్వడంలో కీలకపాత్ర పోషించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్లు శతకాలతో విరుచుకుపడ్డారు. గిల్, పంత్ అర్ధసెంచరీలు సాధించారు. ఇక లంక రెండో రోజు ఆటలో టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52), కెషారా నువంతా (13) బ్యాటింగ్ చేస్తున్నారు.pic.twitter.com/7F5qE7iWGR— crictalk (@crictalk7) August 25, 2026 “You are wasting time bro, don’t be scared… YOU ARE THE CAPTAIN!”— Sarfaraz Khan to De Silva.Two balls later… DE SILVA DEPARTS!😭💀🔥Sarfaraz’s words aged like fine wine! 😂🏏. 📷: SonyLiv. #SrilankaVsIndia #2ndTestMatch #SarfarazKhan #DeSilva #Wickets #Cricket… pic.twitter.com/Clhw6ArMe5— Cricket Gyan (@cricketgyann) August 25, 2026చదవండి: అన్మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్కు సౌత్ ఢిల్లీ -
అన్మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్కు సౌత్ ఢిల్లీ
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో సౌత్ఢిల్లీ సూపర్స్టార్స్ 5 వికెట్ల తేడాతో న్యూఢిల్లీ టైగర్స్పై విజయాన్ని అందుకుంది. బౌలింగ్లో దివాన్ష్ రావత్ 4 వికెట్లు తీయగా, ఆ తర్వాత బ్యాటింగ్లో అన్మోల్ శర్మ (57) అర్ధసెంచరీతో సౌత్ ఢిల్లీ సునాయస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ ఢిల్లీ టైగర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. లక్ష్య తరేజా (62) హాఫ్ సెంచరీ చేయగా, కెప్టెన్ హిమ్మత్ సింగ్ (24) పర్వాలేదనిపించాడు. చివర్లో పార్థ్ బాలి (22) మెరిశాడు. సౌత్ ఢిల్లీ బౌలర్లలో దివాన్ష్ రావత్ 4 వికెట్లు తీయగా, అంకిత్ దబాస్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్ఢిల్లీ సూపర్స్టార్స్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అన్మోల్ శర్మ (57) ఫిఫ్టీ చేయగా, చివర్లో ఎకాన్ష్ దోబల్ (18 బంతుల్లో 38 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నార్త్ ఢిల్లీ బౌలర్లలో పార్ధ్ బాలి 3 వికెట్లు తీయగా, మనీష్ షెరావత్, యష్జీత్ చెరొక వికెట్ పడగొట్టారు. -
‘దమ్ముంటే సెంచరీ చెయ్యు’.. లంక ప్లేయర్కు జురెల్ స్ట్రోక్!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 99 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 22 బంతులాడినప్పటికీ, మరిచిపోలేని అనుభూతిని పొందాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై వివరణ ఇచ్చిన ధ్రువ్ జురెల్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు. తాను సెంచరీ చేయడం వెనుక లంక ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో జురెల్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్వెల్లా నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ నువ్వు అది చేయలేవు అని సవాల్ విసిరాడు. కానీ ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్తో సమాధానం చెప్పాలని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు.’’ అని చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.This DJ’s got some crazy drops! 🎧💯Second Test ton for Dhruv Jurel, with a little late drama for good measure! 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EPPFd2doQS— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026Read: సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన! -
సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్గా జురెల్ రికార్డులకెక్కాడు. సెంచరీ చేసిన వెంటనే గాలిలోకి పిడికిలి బిగించిన జురెల్, ఆ తర్వాత హెల్మెట్ తీసేసి కండలను ప్రదర్శించడం హైలైట్గా నిలిచింది. అయితే అతడి ఎడమ చేతి బైసిప్స్పై పచ్చబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జురెల్ చేతిపై ఉన్న టాటూ ఏంటా అని అభిమానులు ఆరా తీయగా.. ‘జై జవాన్.. జై కిసాన్’ అని రాసి ఉండడం కనిపించింది.సెంచరీ చేయగానే సెలబ్రేషన్స్లో భాగంగా జురెల్ కండలు చూపించాడనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. నిజానికి అతను ప్రదర్శించిన పచ్చబొట్టు వెనుక చిన్న కథ దాగుంది. తాజాగా మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కండలను ప్రదర్శించడం వెనుక దాగున్న అసలు విషయాన్ని ధ్రువ్ జురెల్ పంచుకున్నాడు.‘కండల ప్రదర్శన ఊరికే చేయలేదు. మా తాత రైతు, తండ్రి సైనికుడు. వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే కండల ప్రదర్శనతో సెలబ్రేషన్ చేసుకున్నా. ఆ టాటు వెనుక ఉన్న అర్ధం కూడా అదే’ అని జురెల్ చెప్పుకొచ్చాడు. సెంచరీ తర్వాత తాను చేసిన సెలబ్రేషన్స్ కూడా తన కుటుంబానికి అంకితం చేశానని జురెల్ పేర్కొన్నాడు.జురెల్ గతంలోనూ భారత్ తరపున హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసిన సందర్భాల్లో తన తండ్రికి నివాళిగా ఆర్మీ సెల్యూట్ చేసేవాడు. ఇప్పుడు టాటూను చూపిస్తూ చేసిన కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం వెనుక, తన కుటుంబ నేపథ్యం ముడిపడి ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.HUNDRED MOMENT OF DHRUV JUREL! 💯🇮🇳DHruv Jurel’s 2nd Test century — and both times, Mohammed Siraj was at the non-striker’s end to celebrate with him. Truly special!🥹❤️pic.twitter.com/9Fo8bBKIHu— Cricket Apna 🇮🇳 (@cricketapna1) August 24, 2026 "जय जवान, जय किसान"🗣️ My grandfather was a farmer and my father, a soldier.🫡Dhruv Jurel reveals the reason behind the special celebration and the tattoo on his arm after reaching his 💯 👌#TeamIndia | #SLvIND | @dhruvjurel21 pic.twitter.com/pQlM1r84hN— BCCI (@BCCI) August 24, 2026చదవండి: నిరాశపరిచిన భారత్.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట -
హద్దుమీరిన జైస్వాల్; ఇది రెండోసారి.. నిషేధం తప్పదా?
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి లంక ఆటగాళ్లను రెచ్చగొట్టే చర్యతో వివాదంలో చిక్కుకున్నాడు. లంక ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు వికెట్ పడిన సందర్భంలో జైస్వాల్ శ్రుతిమించిపోయాడు. ప్రసిధ్ క్రిష్ణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లాహిరు ఉదారా ఔటయ్యాడు. ఇన్స్వింగర్ అయిన బంతిని లాహిరు ఉదారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో అతడి బ్యాట్ ఎడ్జ్కు తగిలింది. మూడో స్లిప్లో ఉన్న జైస్వాల్ వైపు బంతి దూసుకెళ్లింది. అంతే వేగంగా స్పందించిన జైస్వాల్ కుడివైపుకు పూర్తిగా డైవ్ చేసి అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, అసలు కథ ఇక్కడే మొదలైంది. లాహిరు ఉదారా క్యాచ్ పట్టిన జైస్వాల్ గట్టిగా అరుస్తూ బంతిని గాల్లోకి విసిరాడు. అంతటితో ఆగకుండా లంక బ్యాటర్ను ఉద్దేశించి మాటల తూటాలు వదిలి మరోసారి ఐసీసీ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లఘించాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా లేదా అనుచితంగా సంబరాలు చేసుకునే ఆటగాళ్లు హద్దులు దాటి, అవుటైన బ్యాటర్ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సదరు ఆటగాళ్లను ఐసీసీ శిక్షిస్తుంది.ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ అవుటైన తర్వాత అతని నుంచి తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తించే విధంగా ఆటగాళ్లు భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడాన్ని ఐసీసీ ఉపేక్షించదు. బ్యాటర్కు దగ్గరగా అతి ఉద్వేగభరితంగా లేదా దూకుడుగా సెండ్-ఆఫ్ చేయడం, లేదా ఆటగాడి ముఖం వద్దకు పరుగెత్తుకు వెళ్లడం వంటివి లెవెల్ 1 ఉల్లంఘన కిందకు వస్తోంది. దీని ఫలితంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 15 నుంచి 50 శాతం వరకు జరిమానాతో పాటు అదనపు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడవచ్చు.ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ సమయంలో అసితా ఫెర్నాండో కారణంగా ఐసీసీ నుంచి జరిమానా ఎదుర్కొన్న జైస్వాల్ను తాజా వివాదం ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి. ఒకవేళ జైస్వాల్ చర్యను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం జైస్వాల్కు ఈసారి భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు.Looks like Yashasvi Jaiswal has found his favourite opponent! 👀Just look at his reaction after taking that catch 😤#Cricket #SLvIND #yashasvijaiswalpic.twitter.com/9gRxm3SXNv— CREX (@Crex_live) August 24, 2026 🔴 PEAK AGGRESSION FROM YASHASVI JAISWAL 🤯- Looks like he still hasn’t forgotten the sledging from the Sri Lankan players 😭 pic.twitter.com/HBgvEmKvRN— Sam (@cricsam02) August 24, 2026Read: దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ బౌలర్ సంచలనం -
అభిజిత్ పాంచ్ పటాకా.. ఈస్ట్జోన్కు భారీ ఆధిక్యం
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్జోన్ భారీ ఆధిక్యం సాధించింది. ఈస్ట్జోన్ బౌలర్లు అభిజిత్, షాబాజ్ అహ్మద్ ధాటికి నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్ (32) టాప్ స్కోరర్గా నిలవగా, రాంగ్సన్ జొనాథన్ (21) పర్వాలేదనిపించాడు. అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 356 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండా నార్త్ ఈస్ట్ను ఫాలోఆన్ ఆడిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్ జోన్ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ (185 బంతుల్లో 146), షాబాజ్ అహ్మద్ (244 బంతుల్లో 167) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా (55) అర్ధసెంచరీ సాధించాడు. నార్త్ ఈస్ట్ బౌలర్లలో ఫిరోజైమ్ జొతిన్, ఆకాశ్ చౌదరీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.ఎవరీ అభిజిత్ సర్కార్?త్రిపురకు చెందిన అభిజిత్ సర్కార్ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అభిజిత్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్పై మూడు వికెట్ల ప్రదర్శనతో టోర్నమెంట్ను ప్రారంభించిన అభిజిత్, నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ సీజన్లో త్రిపుర తరఫున అభిజిత్ ఏడు ఇన్నింగ్స్ల్లోనే 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విదర్భపై ఆరు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శన ఉంది. ఇక 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో కేవలం ఆరు ఇన్నింగ్స్లలోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో బరోడాపై ఐదు వికెట్ల ప్రదర్శనలతో మెరిశాడు.pic.twitter.com/fNCliUpmou 🚨 THREE WICKETS IN ONE OVER! 🔥🔥🔥Abhijit Sarkar completes his five-wicket haul in style, ripping through the batting with three wickets in the over! 🎯That’s how you finish a fifer! 💥#DuleepTrophy #3rdManView— Third Man View (@3rdManView) August 24, 2026Read: కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం -
కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి రోజులాగే రెండో రోజు ఆటలో కూడా భారత్దే ఆధిపత్యం. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్లో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెలరేగడంతో లంకకు ఆదిలోనే షాకులు తగిలాయి.అంతకముందు తమ తొలి ఇన్నింగ్స్ను టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే? -
పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలు.. భారత్ 503/9 డిక్లేర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు.మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. పంత్తో కలిసి సెంచరీ భాగస్వామ్యంఅయితే మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్తో కలిసి పంత్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీ బలపడుతున్న తరుణంలో కెషారా నువంతా బౌలింగ్లో పంత్ (63) వెనుదిరిగాడు. టెస్టు కెరీర్లో రెండో సెంచరీఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మానవ్ సుతార్ (18) సాయంతో ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ పరుగులు పెట్టించాడు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే? -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్గా మారిపోయింది. ఇక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్ను ఇచ్చి ఉంటే మ్యాచ్లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన! -
రెండో రోజు ముగిసిన ఆట.. రెండు వికెట్లు కోల్పోయిన లంక
Sri Lanka Vs India 2nd Test Match, Day 2: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు. లంకకు ఆదిలోనే షాక్రెండో ఇన్నింగ్ ఆరంభించిన శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో లాహిరు కుమారా (1) వెనుదిరగడంతో లంక రెండు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం లంక వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది.భారత్ 503/9 డిక్లేర్కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. కాగా 300/5 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండోరోజు ఆటలో భాగంగా రిషభ్ పంత్ అర్ధ శతకం (63)తో మెరవగా.. ధ్రువ్ జురెల్ శతక్కొట్టాడు. మొత్తంగా 177 బంతుల్లో 115 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక తొలిరోజు ఆటలో పడిక్కల్ శతకం (117) సాధించగా.. కెప్టెన్ శుబ్మన్ గిల్ హాఫ్ సెంచరీ (50) చేశాడు. కాగా శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూర్య, కుశారా నువాంత చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది. Updatesజురెల్ సెంచరీ.. భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్తొమ్మిదో వికెట్ డౌన్136.1వ ఓవర్: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయిన తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన సిరాజ్ (3). అతడి స్థానంలో ప్రసిద్ కృష్ణ క్రీజులోకి రాగా.. జురెల్ 106 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 489-8. ఆరు గంటల వరకు మ్యాచ్వాన తెరిపినివ్వడంతో.. తిరిగి సాయంత్రం 4.24 నిమిషాలకు మ్యాచ్ మొదలైంది. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగగా.. పరిస్థితిని బట్టి ఆరు గంటల వరకు మ్యాచ్ నిర్వహించనున్నారు.టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 475/8(131.2)వరుణుడు ఎంట్రీభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగింది. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది.ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్458 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (18) ఔటయ్యాడు. జురెల్ 79 పరుగుల వద్ద క్రీజ్లో ఉన్నాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్112.1వ ఓవర్: భోజన విరామం తర్వాత తొలి బంతికే పంత్ అవుటయ్యాడు. కేశారా నువాంత బౌలింగ్లో లాహిరు కుమారకు క్యాచ్ ఇచ్చి 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. దీంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.పంత్ స్థానంలో ఆల్రౌండర్ మానవ్ సుతార్ క్రీజులోకి రాగా.. జురెల్ 59 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 419-7. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6రెండో రోజు లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 419-6గా ఉంది. రిషబ్ పంత్ 63, ధ్రువ్ జురెల్ 59 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. జురెల్ ఫిఫ్టిజురెల్ 97 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ స్కోర్ కూడా 400 మార్కు దాటింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్రిషబ్ పంత్ 81 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ధ్రువ్ జురెల్ (49) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 109 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 397-6గా ఉంది.డ్రింక్స్ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు: 354-6 (97)పంత్ 30, జురెల్ 27 పరుగులతో ఉన్నారు.నిలకడగా ఆడుతున్న జురెల్, పంత్రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే సరాన్ష్ వికెట్ కోల్పోయాక భారత బ్యాటర్లు రిషబ్ పంత్ (19), ధ్రువ్ జురెల్ (26) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 342-6గా ఉంది. ఆరో వికెట్ కోల్పోయిన భారత్రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే భారత్కు షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్ సరాన్ష్ జైన్ (6) అసిత ఫెర్నాండో బౌలింగ్లో కమిల్ మిషారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 307-6గా ఉంది. ధ్రువ్ జురెల్కు (11) జతగా తొలి రోజు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన రిషబ్ పంత్ (3) క్రీజ్లోకి వచ్చాడు.రెండో రోజు మొదలైన ఆటభారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆట మొదలైంది. సరాన్ష్ జైన్ 4), ధ్రువ్ జురెల్ (7) క్రీజ్లోకి వచ్చారు. ఓవర్నైట్ స్కోర్ 300-5 వద్ద భారత్ ఆట మొదలుపెట్టింది. తుది జట్లు..భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సరాన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో -
WTC : కీలక మలుపు.. బంగ్లా ఓటమితో భారత్కు లక్కీ చాన్స్!
ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన బంగ్లాదేశ్ రెండో టెస్టులో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకున్న బంగ్లాదేశ్ డబ్ల్యూటీసీ పట్టికలో స్థానం మారనప్పటికీ, పాయింట్లు భారీగా కోల్పోయింది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం రెండో టెస్టులో విజయంతో 80 పాయింట్లు సాధించి డబ్ల్యూటీసీ పట్టికలో తన తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక రెండో స్థానంలో సౌతాఫ్రికా (75 పాయింట్లు) ఉండగా, 72.22 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ఓటమి తర్వాత భారత్కు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎంత ఉన్నాయి? ఏ లెక్కన భారత్ ఫైనల్కు అర్హత సాధిస్తుందనేది మరోసారి తెలుసుకుందాం.పాయింట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ఆసీస్తో టెస్టు సిరీస్కు ముందు బంగ్లాదేశ్ 66.6 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. అయితే రెండో టెస్టులో ఓటమి తర్వాత బంగ్లాదేశ్ 11.1 పాయింట్లు కోల్పోయి 55.5 పాయింట్లకు పరిమితమైంది. అదే సమయంలో తొలి టెస్టులో భారీ విజయం సాధించిన టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతుండగా, భారత్ ఖాతాలో 53.3 పాయింట్లు ఉన్నాయి.ఒకవేళ లంకతో రెండో టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ పట్టికలో బంగ్లాను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంటుంది. లంకతో టెస్టు సిరీస్ తర్వాత 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇప్పటికే పది టెస్టులాడిన భారత్ నాలుగింట ఓడిపోయింది. లంకతో సిరీస్ అనంతరం న్యూజిలాండ్ పర్యటనలో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఎనిమిదిలో ఏడు గెలిస్తేనే..ఆ తర్వాత ఐపీఎల్ 2027 ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు కఠినమైన సిరీస్లు కావడం భారత్కు ఇబ్బంది కలిగించే అంశం. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో కనీసం ఏడింటిలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే డబ్ల్యూటీసీ పట్టికలో 68.52 పర్సంటైల్తో ఉంటుంది. ఒకవేళ ఆరు విజయాలు, రెండు ఓటములు ఎదురైతే అప్పుడు 62.96 పాయింట్లకు పరిమితమవుతుంది. భారత్కు రెండే దారులు..ఈ రెండు దారులు తప్ప టీమిండియా ఫైనల్ చేరేందుకు మరో అవకాశం లేదు. అయితే రాబోయే 8 టెస్టుల్లో ఒక పెనాల్టీ పాయింట్ వచ్చినా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్తంతయినట్లే. కాబట్టి గిల్ సేన ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలనుకుంటే మాత్రం ప్రతీ మ్యాచ్లో విజయం సాధించాల్సిన అవసరముంది.Read: జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి! -
జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఔటైన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిత ఫెర్నాండో బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయిన జైస్వాల్ పెవిలియన్ వెళుతున్న సమయంలో లంక బౌలర్ తన మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కితిరిగి అసిత ఫెర్నాండోవైపు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో జైస్వాల్.. ఫెర్నాండో కళ్లలోకి చూస్తూ తన హెల్మెట్తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్గా మారుతుందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా జైస్వాల్ను పక్కకు తీసుకెళ్లి అక్కడి నుంచి పంపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జైస్వాల్ ఔటవ్వడానికి ముందు ఫెర్నాండో బౌలింగ్లోనే వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే ఫెర్నాండో తన మరుసటి బంతికే జైస్వాల్ను క్లీన్బౌల్డ్ చేయడంతో లంక బౌలర్ కోపంతో పరిధి దాటి కామ్గా వెళుతున్న జైస్వాల్ను గెలికి మరి కయ్యం పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్లో జైస్వాల్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించాడు. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు ఉండడం విశేషం. Body contact between Jaiswal and Asitha Fernando.. #SLVIND pic.twitter.com/w3Q905WUIf— Nibraz Ramzan (@nibraz88cricket) August 23, 2026 HEATED MOMENT BETWEEN JAISWAL & ASITHA 🤯 pic.twitter.com/SzgcNjYDUN— Johns. (@CricCrazyJohns) August 23, 2026Read: 95 రన్స్కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం -
95 రన్స్కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం
బంగ్లాదేశ్తో మొదలైన రెండో టెస్టును ఆస్ట్రేలియా రోజున్నర వ్యవధిలోనే ముగించింది. మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ రెండో ఇన్నింగ్స్లోనూ అదరగొట్టాడు. 4 వికెట్లు తీసిన స్టార్క్ ఓవరాల్గా రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్ల హాల్ నమోదు చేసి బంగ్లాదేశ్ నడ్డి విరిచాడు. 146 పరుగుల వెనుకంజతో తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31) టాప్ స్కోరర్గా నిలవగా, ముష్ఫికర్ రహీమ్ (29 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4, కమిన్స్, నాథన్ లియోన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ను 1-1తో డ్రాగా ముగించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలవగా, రెండో టెస్టులో మాత్రం ఆసీస్ నంబర్వన్ ఆటను ప్రదర్శించి తొలి టెస్టు ఓటమికి బదులు తీర్చుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ పట్టికలో తమ తొలి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.అంతకముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ ఏడు వికెట్లతో చెలరేగగా, కామెరాన్ గ్రీన్ అర్ధసెంచరీతో రాణించాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 64 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. ఇక రెండు ఇన్నింగ్స్లు కలిపి 10 వికెట్లు తీసిన స్టార్క్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా లబించింది.సంక్షిప్త స్కోర్లు:బంగ్లాదేశ్: 64&95 ఆలౌట్ఆస్ట్రేలియా: 210 ఆలౌట్ 🚨 2nd Test AUSTRALIA vs BANGLADESH 🚨Bangladesh 🇧🇩 : 6️⃣4️⃣&9️⃣5️⃣Australia 🇦🇺 : 2️⃣1️⃣0️⃣Australia 🇦🇺 Won by an Innings & 5️⃣1️⃣ Runs#AUSvBAN #BANvAUS #Cricketpic.twitter.com/x2tMdzP3Ol https://t.co/x2tMdzP3Ol https://t.co/7R4xh4Fo88— Cricket Lover 🏏 (@Crick97924Lover) August 23, 2026Australia dominate in Mackay to level the #WTC27 series against Bangladesh 🙌📝: https://t.co/PQuffFjsha pic.twitter.com/009daojhOI— ICC (@ICC) August 23, 2026Read: అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్? -
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూసారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.Photo Credit: BCCI Twitterఎవరీ సారాంశ్ జైన్?తన ఆఫ్ స్పిన్ బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. Photo Credit: BCCI Twitterఇక 2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.A new chapter begins. 🧢 Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨ Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026 The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. సారాంశ్ జైన్ అరంగేట్రం -
SL Vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్దే పైచేయి
Sri Lanka Vs India 2nd Test Match Updates: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్త్ పడిక్కల్(117) సెంచరీతో కదం తొక్కగా.. శుబ్మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన జడేజా.. ఫెర్నాండో బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి డెబ్యూ ఆటగాడు సారాన్ష్ జైన్ వచ్చాడు. 85 ఓవర్లకు భారత్ స్కోర్: 300/5నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా117 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడు. కేషర నువంత బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజాకు (36) జతగా ధ్రువ్ జురెల్ (5) క్రీజ్లోకి వచ్చాడు. పడిక్కల్ సెంచరీకొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా యువ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో పడిక్కల్ తన రెండో సెంచరీ మార్క్ను అందుకున్నాడు.రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ కొలంబో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్దు చేతి గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 59.4 ఓవర్లకు భారత్ స్కోర్: 215-3టీ బ్రేక్కు టీమిండియా స్కోరెంతంటే?టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో దేవ్దత్త్ పడిక్కల్(63), రిషబ్ పంత్(0) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్శుబ్మన్ గిల్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన గిల్.. అషితా ఫెర్నాండో బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులో రిషబ్ పంత్ వచ్చాడు.గిల్ ఫిప్టీభారత కెప్టెన్ శుబ్మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 184/2150 రన్స్ మార్క్ దాటిన భారత్పడిక్కల్ (50) అజేయ అర్ధసెంచరీకి తోడు గిల్ (40) నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 150 పరుగుల మార్క్ దాటింది. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్కు అజేయంగా 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.సెంచరీ మార్క్ దాటిన టీమిండియాకొలంబో వేదికగా లంకతో రెండో టెస్టులో టీమిండియా సెంచరీ మార్క్ దాటింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. గిల్ (25), పడిక్కల్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ అనంతరం ఆట మొదలైంది. 27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పడిక్కల్ (15), గిల్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ బ్రేక్లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పడిక్కల్ (13), శుబ్మన్ గిల్ (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జైస్వాల్ (45) దూకుడు ఆటతీరును ప్రదర్శించగా, కేఎల్ రాహుల్ (18) ఆకట్టుకోలేకపోయాడు.రెండో వికెట్ డౌన్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45) అశితా ఫెర్నాండో బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 3 పరుగులతో ఆడుతున్నాడు.జైస్వాల్ దూకుడు.. టీమిండియా స్కోరెంతంటే?లంకతో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరు ప్రదర్శిస్తున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడుతున్న జైస్వాల్ 51 బంతుల్లో 41 పరుగులతో ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.తొలి వికెట్ డౌన్18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ లాహిరు కుమారా బౌలింగ్లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ (19), పడిక్కల్ క్రీజులో ఉన్నారు.నిలకడగా భారత్ బ్యాటింగ్లంకతో మొదలైన రెండో టెస్టులో భారత్ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. జైస్వాల్ 14, కేఎల్ రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.టాస్ గెలిచిన టీమిండియాశ్రీలంక, భారత్ మధ్య కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సారాంశ్ జైన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఆల్రౌండర్ జడేజా చేతుల మీదుగా సారాంశ్ క్యాప్ అందుకున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించని కుల్డీప్ యాదవ్పై వేటు పడింది. అతడి స్థానంలోనే సారాంశ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు అదొక్కటే మార్పు. శ్రీలంక కూడా రెండు ఛేంజెస్ చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేయగా.. చండిమాల్ స్థానంలో పసిందు సూరియబండారా వచ్చాడు.భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శరన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండోA look at #TeamIndia's Playing XI for the 2nd #SLvIND Test 👌👌Saransh Jain makes his international debut 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/WOCtWZ9YcP— BCCI (@BCCI) August 23, 2026Read: బీసీసీఐకి కొత్త తలనొప్పి! -
‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’
టీమిండియా టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తనను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై మరోసారి స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు బాధపడలేదు.. కానీ జట్టులో తన పేరు లేనప్పుడు మాత్రం బాగా నవ్వుకున్నా అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహించిన "బాత్ అండ్ బోల్" కార్యక్రమానికి హాజరైన సూర్యకుమార్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘సూర్యకుమార్, టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు నువ్వు కెప్టెన్గా ఉన్నావు. కానీ ఆ తర్వాతి సిరీస్లోనే నిన్ను కెప్టెన్సీ నుంచి తొలగించడమే గాక, జట్టు నుంచి కూడా తీసేశారు. అప్పుడు నీకు ఏమనిపించింది అని ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. దీనికి సూర్యకుమార్ బదులిస్తూ.. ‘ఒక కెప్టెన్గా నేను టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించినందుకు గర్వపడుతున్నా. అయితే జట్టులో నా పేరు లేనప్పుడు నేను ఎలా నవ్వుతానో అలాగే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు కూడా అలాగే నవ్వుకున్నా. జట్టు యాజమాన్యం, కోచ్, సెలెక్టర్లకు వారి సొంత ఆలోచన ఉందని నేను అర్ధం చేసుకున్నా. భవిష్యత్తులో జట్టుకు ఇది మంచి నిర్ణయం అవుతుందనే కారణంతోనే నన్ను జట్టు నుంచి తొలగించారు. వారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ జట్టుకు ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్ధమే’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. ‘వరుసగా రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఏ జట్టు గెలవలేదు, మూడుసార్లు ట్రోఫీని అందుకోలేదు, సొంతగడ్డపై ఇప్పటివరకు ఏ జట్టు కూడా టీ20 ప్రపంచకప్ టైటిల్ను అందుకోలేదు. కానీ భారత్ మాత్రం ఈ ఘనత సాధించినందుకు మీకు ఎలా ఉంది? అని ప్రశ్నించాడు.‘అది జరగాలని (భారత్ టీ20 వరల్డ్కప్ టైటిల్ గెలవడం) రాసిపెట్టి ఉంటే జరిగి తీరుతుంది. సొంతగడ్డపై వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ అందుకోవడం గొప్ప విషయం. ముఖ్యంగా సంజూ శాంసన్ లీగ్ దశలో విఫలమైనా అతడిపై నమ్మకంతో జట్టులో కొనసాగించాము. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ నేను అతడికి మద్దతుగా ఉన్నా. కానీ సెమీస్తో పాటు ఫైనల్లో అతడు ఆడిన ఇన్నింగ్స్లు గొప్పవి. అంతేకాదు అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడంతో శాంసన్పై గౌరవం రెట్టింపు అయింది. ఇక బుమ్రా మాకు అప్పుడు ప్రధాన ఆయుధం.. అతడు రాణించడంతో మా పని సులువయ్యింది’ అని పేర్కొన్నాడు. 2023లో వన్డే ప్రపంచకప్లో భారత్ ఓటమి చెందినప్పుడు మీరు టీమ్లోనే ఉన్నారు. ఈ సమయంలో జట్టులో పరిస్తితి ఎలా ఉంది అని ఆకాశ్ ప్రశ్నించాడు. ‘2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. కానీ ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో సొంతగడ్డపై టైటిల్ అందుకోలేదన్న అపవాదు మూటగట్టుకున్నాం. కానీ మూడేళ్ల తర్వాత ఏ గ్రౌండ్లో అయితే ఓడిపోయామో అదే అహ్మదాబాద్లో టీ20 ప్రపంచకప్ సాధించి ఆ అపవాదును తుడిచేశాము’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. 🚨Suryakumar Yadav Breaks Silence on Losing Team India Captaincy🚨Akash Chopra 🗣️:SKY, you were the captain when Team India won the T20 World Cup trophy, but in the very next series, you were removed as captain and were also dropped from the team. Suryakumar Yadav 🗣️:I just… pic.twitter.com/Kf8am9mxBW— Central Cricket (@arshdeep3444) August 22, 2026Read: బంగ్లా బౌలర్ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్ -
బంగ్లా బౌలర్ సరికొత్త చరిత్ర.. ఆస్ట్రేలియా 210 ఆలౌట్
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ బౌలర్ షోరిఫుల్ ఇస్లామ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో షోరిఫుల్ 7 వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 210 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (67) కీలక అర్ధసెంచరీతో రాణించగా, స్టీవ్ స్మిత్ (42) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో నాథన్ లియోన్ (32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్తో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్ 7 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లామ్, మెహదీ హసన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ నజ్ముల్ 12, తంజిద్ హసన్ (8) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన స్టార్క్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు కనబరుస్తూ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ 125 పరుగులు వెనుకబడి ఉంది.రెండో బౌలర్గా రికార్డుఇక ఏడు వికెట్లతో మెరిసిన షోరిఫుల్ ఇస్లామ్కు ఇదే తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఆస్ట్రేలియా గడ్డపై ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో బౌలర్గా షోరిఫుల్ నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బౌలర్గా హసన్ మహ్ముద్ నిలిచాడు. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనే హసన్ మహ్ముద్ (6/55) ఈ ఫీట్ను అందుకున్నాడు.టెస్టుల్లో బంగ్లాదేశ్ పేసర్ల అత్యుత్తమ గణాంకాలు👉షోరిఫుల్ ఇస్లామ్ (7/48) 2026లో ఆస్ట్రేలియాపై👉షాహదత్ హొసెన్ (6/27) 2008లో సౌతాఫ్రికాపై👉ఎబాదత్ హొసెన్ (6/46) 2022లో న్యూజిలాండ్పై👉హసన్ మహ్ముద్ (6/55) 2026లో ఆస్ట్రేలియాపై👉తస్కిన్ అహ్మద్ (6/64) 2024లో వెస్టిండీస్పైSEVEN-FOR SHORIFUL! 🔥🔥🇧🇩 What a performance! Shoriful Islam is tearing through the Australian batting lineup with a sensational 7-wicket haul! 🎯💥Take a bow, Shoriful! 👏🏏Australia 🆚 Bangladesh | 2nd Test#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/4EYAIt25Fd— Bangladesh Cricket (@BCBtigers) August 23, 2026 Shoriful Islam went bang to claim his first Test five-wicket haul, before topping it with an even better sixth! #MilestoneMoment | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/kmK6ZOZupX— cricket.com.au (@cricketcomau) August 22, 2026Read: ‘బాధపడలేదు.. పేరు లేనందుకు నవ్వుకున్నా’ -
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో పూరన్ విధ్వంసం
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సెంట్ లూసియా కింగ్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం జరిగిన మ్యాచ్లో జమైకా కింగ్స్మెన్పై సెంట్ లూసియా కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట మాథ్యూ ఫోర్డ్ ఐదు వికెట్లతో బౌలింగ్లో చెలరేగాడు. అనంతరం 170 పరుగుల లక్ష్య ఛేదనలో సెంట్ లూసియా కింగ్ ఓపెనర్ కమిల్ పూరన్ (49 బంతుల్లో 81 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో ఒబుస్ పియెన్నార్ (14 బంతుల్లో 34 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జమైకన్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్కేసీ కార్తి (45 బంతుల్లో 50) అర్ధసెంచరీ సాధించగా, ఆండ్రీ రసెల్ (25), ఓడియన్ స్మిత్ (27 నాటౌట్) ఆఖర్లో ధాటిగా ఆడడంతో జమైకా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మాథ్యూ ఫోర్డ్ 5 వికెట్లు తీయగా, షెడ్లే, మహీష్ తీక్షణ, జోషువా బిషప్లు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సెంట్ లూసియా కింగ్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. విటెల్ లూయిస్, హునెయిన్ షా చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సెంట్ లూసియా జట్టు 6 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, ఆడిన ఆరు మ్యాచ్ల్లో రెండు విజయాలు, 4 ఓటములతో జమైకా ఐదో స్థానంలో కొనసాగుతోంది.Pulverized by Pooran 💪💥A second CPL fifty for Kamil Pooran! 🇱🇨 x 🇯🇲#CPL26 #SLKvJK #BiggestPartyInSport #CricketPlayedLouder #BYD pic.twitter.com/0JYbqFl0X7— CPL T20 (@CPL) August 22, 2026Making the most of the opportunity! 👏 Kamil Pooran rose to the occasion! 🇱🇨 x 🇯🇲#CPL26 #SLKvJK #BiggestPartyInSport #CricketPlayedLouder pic.twitter.com/1HY0Suw0xo— CPL T20 (@CPL) August 22, 2026చదవండి: '6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్లో జెన్-జెడ్, జెన్-ఆల్ఫా శకం! -
'6-7'తో మత్తెక్కిస్తోన్న చిన్నది.. క్రికెట్లో జెన్-జెడ్, జెన్-ఆల్ఫా శకం!
మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లీగ్ ప్రారంభమైన తొలి రోజునే సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ ప్లేయర్ మేధావి బిధురి తన చర్యతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయంలోకి వెళితే ఆగస్టు 20న టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్ సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్, సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ మధ్య జరిగింది. మ్యాచ్లో మేధావి బిధురి రెండు వికెట్లతో మెరిసింది. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నిషిక సింగ్ను అవుట్ చేసిన తర్వాత మేధావి బిధురి జెన్-జీ తరంలో ట్రెండింగ్లో ఉన్న '6-7' సెలబ్రేషన్తో సోషల్ మీడియాను షేక్ చేసింది.ఏమిటీ 6-7 సెలబ్రేషన్?జెన్-జీ 6-7 సెలబ్రేషన్స్లో భాగంగా "ఆరు-ఏడు" అని చెబుతూ, చేతులు (See Saw) పైకి కిందకీ ఊపుతారు. ఈ సంజ్ఞకు ఒక నిర్దిష్టమైన అర్థం లేనప్పటికీ, ఇది జెన్ జెడ్ (2000-2012), జెన్ ఆల్ఫా (2013 నుంచి ప్రస్తుతం) వర్గాల్లో ఒక ప్రధాన ఇంటర్నెట్ మీమ్గా మారిపోయింది. ఇప్పుడీ ఈ ట్రెండ్ క్రీడల్లోకి కూడా ప్రవేశించింది.ఇప్పటికే మాజీ క్రికెటర్లు కెవిన్ పీటర్సన్, డేవిడ్ వార్నర్ కాసెమిరో వంటి స్టార్ ఆటగాళ్లు ఈ 6-7 సెలబ్రేషన్స్తో మెరిశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, మేధావి బిధురి ధరించిన జెర్సీ నెంబర్ కూడా 67 కావడం సెలబ్రేషన్స్కు మరో కారణం.ఎవరీ మేధావి బిధురి?ఢిల్లీకి చెందిన మేధావి బిధురి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. ఢిల్లీ క్రికెట్తో పాటు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లిస్ట్ క్రికెట్లో పాల్గొంది. 2024 మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలోనూ మేధావి బిధురి తన పేరును రిజిస్టర్ చేసుకుంది. 2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఎడిషన్లో మేధావి బిధురి ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లతో సత్తా చాటింది. 2026 సీజన్కు ముందే ఆమె సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్కు మారింది.Absolute queen behaviour 🫰Central Delhi Queens’ Medhavi Bidhuri stole the show with a sensational 2/24 against South Delhi Superstarz! 😍Watch Women's Delhi Premier League 2026 | LIVE on Star Sports & JioHotstar! pic.twitter.com/TeJG5fstGV— Star Sports (@StarSportsIndia) August 21, 2026 Meet Medhavi BidhuriGenz cricketer 🏏 Jersey no. 67>She went famous for her trending celebration 💃 >She comes as a package > She is cute>She is cricketer >She wears yellow jersey 🟡 pic.twitter.com/kBGZItEdj9— Kiara (@Kiara_X_X1) August 21, 2026Read: గిల్, జైస్వాల్ ఫామ్పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు! -
గిల్, జైస్వాల్ ఫామ్పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!
కొలంబో వేదికగా ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే జోరు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్లు రాణించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. అయితే గిల్ మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు సాధించిన గిల్ తిరిగి ట్రాక్ ఎక్కేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే కెప్టెన్గా గిల్ 10 టెస్టుల్లో 1100 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్గా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్గా విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ను గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇటీవలే స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ను గిల్ సారథ్యంలోనే టీమిండియా నెగ్గింది. ఇక జైస్వాల్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత 8 ఇన్నింగ్స్ల్లో కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. ఆ ఒక్కటి కూడా గతేడాది న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్పై సాధించాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్లో రాహుల్తో సమన్వయలోపంతో రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. Read: లైవ్ మ్యాచ్.. ప్రత్యర్థి గూబ గుయ్మనిపించిన మెస్సీ! -
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే కుప్పకూలిన బంగ్లా
మాకే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ 64 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్ బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. షోరిఫుల్ ఇస్లామ్ (14) టాప్ స్కోరర్గా నిలవగా, ఆసీస్ బౌలర్ల ధాటికి నలుగురు బంగ్లా బ్యాటర్లు డకౌట్గా వెనుదిరగడం గమనార్హం. మరో ముగ్గురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.స్టెయిన్ను అధిగమించిన స్టార్క్ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లతో చెలరేగితే, కమిన్స్ మూడు, హాజిల్వుడ్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో స్టార్క్ టెస్టుల్లో మరో రికార్డు అందుకున్నాడు. ఆరు వికెట్లు తీసిన స్టార్క్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్-10లోకి ప్రవేశించాడు. 107 టెస్టుల్లో 441 వికెట్లు తీసిన స్టార్క్.. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ (440 వికెట్లు)ను అధిగమించాడు. ఇక మురళీధరన్ (800 వికెట్లు) తొలి స్థానంలో ఉండగా, షేన్ వార్న్ (708 వికెట్లు), అండర్సన్ (704 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాప్-10లో ఉన్న బౌలర్లలో నాథన్ లియోన్ (568 వికెట్లు) , స్టార్క్ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు. ఇక టెస్టుల్లో బంగ్లాదేశ్కు ఇది నాలుగో అత్యల్ప స్కోరు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.🚨 AUSTRALIA vs BANGLADESH SECOND TEST MATCH!! Bangladesh 1st inning: 64 all out- 6 Wickets for Mitchell Starc - 3 Wickets for Pat Cummins - 1 Wickets Josh Hazlewood pic.twitter.com/6e7owsoPJS— Talha Nawaz (@TalhaDigital007) August 22, 2026చదవండి: ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్కు కలిసొచ్చిన పాక్ ఓటమి! -
ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ; భారత్కు కలిసొచ్చిన పాక్ ఓటమి!
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ పాకిస్తాన్ సున్నా పరుగు వద్దే తొలి వికెట్ను కోల్పోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్లో ఓలి రాబిన్సన్ బౌలింగ్లో అజన్ అవైస్ డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో ఆర్చర్ బౌలింగ్లో ఇమామ్-ఉల్-హక్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో 149 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లోనూ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోవడం పాక్కు ఇది ఏడోసారి. ఈ నేపథ్యంలో అత్యధిక సార్లు సున్నా పరుగుల వద్ద వికెట్ కోల్పోయిన చెత్త జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. పాక్ తర్వాత ఇంగ్లండ్ (5 సార్లు), ఆస్ట్రేలియా (4 సార్లు), భారత్ (రెండు సార్లు), న్యూజిలాండ్ ఒకసారి ఈ ఫీట్ను నమోదు చేశాయి.ఇక ఇంగ్లండ్ చేతిలో పాక్ ఓటమి వల్ల డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పు లేకపోయినప్పటికీ, భారత్కు మాత్రం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ చేతిలో ఓటమితో డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లో పాకిస్తాన్కు ఇది ఐదో ఓటమి. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాక్ 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, పాక్పై విజయంతో ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇరు జట్లు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75 శాతం), న్యూజిలాండ్ (72.22 శాతం) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 53.33 శాతం పాయింట్లతో 5వ స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతం పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాయి. శ్రీలంకపై జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత్ రెండో మ్యాచ్లోనూ గెలిచి, అటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ ఓడిపోతే, భారత్ 57.57 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోవడంతో ఫైనల్ రేసుకు మరింత దగ్గరయినట్లవుతుంది.ఇక హెడ్డింగే వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్ను మట్టికరిపించింది. తొలి ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 171 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 409 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్లో 238 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో పాకిస్తాన్ 135 పరుగులకే కుప్పకూలింది.జోఫ్రా ఆర్చర్, ఒల్లీ రాబిన్సన్, జోష్ టంగ్, గుస్ అట్కిన్సన్ల ధాటికి పాకిస్థాన్ బ్యాటర్లు నిలవలేకపోయారు. రాబిన్సన్, టంగ్లు చెరో 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 27నుంచి లార్డ్స్ వేదికగా జరగనుంది.Read: స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి -
స్టార్క్ దెబ్బకు బంగ్లాదేశ్ విలవిల.. 149 ఏళ్లలో ఇదే తొలిసారి
ఆసీస్ గడ్డపై తొలి టెస్టులో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ మాకే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తొలి టెస్టులో అనూహ్య ఓటమిని చవిచూసిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో మాత్రం నంబర్వన్ ఆటను ప్రదర్శిస్తోంది. మిచెల్ స్టార్క్(6-4-5-5) బంతితో నిప్పులు చెరగడంతో బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ఫలితంగా బంగ్లాదేశ్ 21 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో స్టార్క్ ఖాతాలో ఐదు వికెట్లు ఉండగా, కమిన్స్కు ఒక వికెట్ దక్కింది. ఈ క్రమంలోనే స్టార్క్ 149 టెస్టు క్రికెట్ చరిత్రను తిరగరాశాడు. అదేంటంటే, టెస్టు మ్యాచ్లో తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీయడం స్టార్క్కు ఇది నాలుగో సారి. గతంలో కరుణరత్నే (2016లో), రోరీ బర్న్స్ (2021లో), జైస్వాల్ (2024లో) తొలి బంతికే ఔట్ చేశాడు. వెస్టిండీస్ బౌలర్ పెడ్రో కొలిన్స్ కూడా టెస్టుల్లో మూడుసార్లు తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ తీశాడు. తాజా ఫీట్తో కొలిన్స్ను అధిగమించిన స్టార్క్ తొలి స్థానంలో నిలిచాడు. దీంతో పాటు టెస్టుల్లో తొలి ఓవర్లో స్టార్క్ వికెట్ తీయడం ఇది 28వ సారి కావడం విశేషం.ఇక స్టార్క్ తన తొలి నాలుగు ఓవర్లలో ఓవర్కు ఒక వికెట్ చొప్పున తీశాడు. కేవలం 22 బంతుల్లోనే స్టార్క్ ఐదు వికెట్ల మార్క్ను అందుకున్నాడు. ఈ క్రమంలో స్టార్క్ రెండోసారి టెస్టుల్లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్ సాధించాడు. గతంలో స్టార్క్ 2025లో వెస్టిండీస్తో టెస్టులో 15 బంతుల వ్యవధిలోనే ఐదు వికెట్ల మార్క్ అందుకోవడం విశేషం. స్టార్క్ తర్వాత ఎరిన్ టోషక్ (1947లో భారత్పై), స్టువర్ట్ బ్రాడ్ (2015లో ఆసీస్పై), స్కాట్ బోలండ్ (2021లో ఇంగ్లండ్పై)లు 19 బంతుల వ్యవధిలో ఐదు వికెట్ల హాల్ నమోదు చేసి రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.ఇక టాస్ గెలిచిన కమిన్స్ బంగ్లాదేశ్కు బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కాసేపటికే పిచ్ పరిస్థితి ఏంటన్నది బంగ్లాకు పూర్తిగా అర్ధమైంది. స్టార్క్ నిప్పులు చెరిగే బంతులకు తోడు కమిన్స్, హాజిల్వుడ్లు చెరో ఎండ్ నుంచి తమ పేస్ అటాకింగ్తో ఇబ్బంది పెట్టడంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ 23 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 35 పరుగులతో ఆడుతోంది. హసన్ మహ్ముద్ (8), మెహదీ హసన్ (11) క్రీజులో ఉన్నారు.FIRST BALL OF THE TEST MITCHELL STARC HAS DONE IT AGAIN! #PlayoftheDay | @NRMAInsurance | #AUSvBAN pic.twitter.com/DzLjzE60un— cricket.com.au (@cricketcomau) August 22, 2026 6⃣-4⃣-5⃣-5⃣Mayhem from Mitchell Starc in his first spell today 🤯🔥#AUSvsBAN pic.twitter.com/k9jVe6aYGK— Cricbuzz (@cricbuzz) August 22, 2026Read: మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీరజ్ చోప్రాకు రజతం -
అర్జున్ టెండూల్కర్ కీలక నిర్ణయం
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్ భవితవ్యంపై వస్తున్న ఊహాగానాల మధ్య అర్జున్ టెండూల్కర్ మరోసారి గోవా తరఫున ఈ ఏడాది దేశవాళీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒమన్లో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన గోవా జట్టుతో పాటు అర్జున్ వెళ్లలేదు.దీంతో అతడు జట్టుతో కొనసాగుతున్నాడా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వార్తలను ఖండించిన గోవా క్రికెట్ అసోసియేషన్ అర్జున్ జట్టులోనే కొనసాగుతాడని ధ్రువీకరించింది. ఇక 2022-23 సీజన్కు ముందు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి గోవాకు మారిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో అంతగా రాణించనప్పటికీ, అర్జున్ టెండూల్కర్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం మంచి ప్రదర్శనే కనబరిచాడు. గోవా తరఫున అర్జున్ 50 వికెట్లు తీయడంతో పాటు గతేడాది రంజీ సీజన్లో రాజస్తాన్పై సెంచరీ కూడా సాధించాడు.ఇక ఐపీఎల్లో ఆరంభంలో ముంబై ఇండియన్స్కు ఆడిన అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం లక్నో సూపర్జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన అర్జున్ టెండూల్కర్ 4 వికెట్లు పడగొట్టాడు. 2026 సీజన్లో లక్నో తరఫున ఏకైక మ్యాచ్ ఆడిన అర్జున్ ఒక వికెట్ తీశాడు.Read: ‘తులసి మొక్కలో గంజాయి వనం’.. పోలికలు అవసరమా! -
‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లినే గొప్ప అని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పోలిక చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సచిన్, కోహ్లిలను ఒకరితో ఒకరిని పోల్చలేమని, ఎవరికి వారే గొప్ప అని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ఏబీ డివిలియర్స్ పోలికను తీవ్రంగా ఖండించాడు. డివిలియర్స్ తులసి వనంలో గంజాయి మొక్క లాంటోడని, ఇద్దరు గొప్ప క్రికెటర్ల మధ్య పోలికలు చెప్పి అనవసర చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించాడు. సచిన్ ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని, భారత్ క్రికెట్లో అతడికి ప్రత్యేక స్థానం ఉందని దొడ్డ గణేశ్ గుర్తు చేశాడు. అందుకే తన ‘ఎక్స్’ వేదికగా పాస్ ఆన్ ది వీడ్ (గంజాయి అందించకు బ్రదర్) అని రాసుకొచ్చాడు. సచిన్, కోహ్లిల మధ్య వింత పోలికను తీసుకొచ్చి చిచ్చురేపే ప్రయత్నం చేసినందుకే ఇలాంటి కామెంట్ పెట్టినట్లు గణేశ్ వెల్లడించాడు.Pass on the weed, brother. https://t.co/3XOy6o6x9t— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 20, 2026ఇద్దరు ఇద్దరే..ఇక సచిన్ టెండూల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ చర్చకు ముగింపు ఉండదు. టెండూల్కర్ సుదీర్ఘ కెరీర్, రికార్డు స్థాయిలో సాధించిన 15921 టెస్ట్ పరుగులు, 51 సెంచరీలు అతనికి సాటిలేని గణాంక వారసత్వాన్ని అందించాయి. మరోవైపు, భారత టెస్ట్ సంస్కృతిపై, విదేశీ ప్రదర్శనలపై కోహ్లీ చూపిన ప్రభావం అతడిని దేశంలోని అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకడిగా నిలబెట్టింది.భారత బ్యాటర్లు విదేశాల్లో కూడా ఆధిపత్యం చెలాయించగలరని టెండూల్కర్ ఎప్పుడో నిరూపిస్తే.. కోహ్లీ దానిని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు తమ కఠోర శ్రమ, పట్టుదలతో గొప్ప పేరును పొందారు. వీరిద్దరిని ఒకరితో ఒకరు పోల్చడం తగదు.సచిన్ విదేశాల్లో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 8705 పరుగులు రాబట్టాడు. ఇక కోహ్లి 4774 పరుగులు చేశాడు. అదే విధంగా SENA దేశాల్లో సచిన్ టెండుల్కర్ 63 టెస్టులు ఆడి సగటు 5387 పరుగులు సాధించాడు. ఇందులో 17 శతకాలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లి SENA దేశాల్లో 46 టెస్టు మ్యాచ్లు ఆడి 3661 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 14 ఫిఫ్టీలు ఉన్నాయి. అయితే సచిన్ కెప్టెన్సీలో భారత్ పెద్దగా విజయాలు అందుకోలేదు. కానీ కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ దశకు చేరుకుంది. ముఖ్యంగా విదేశాల్లో మంచి విజయాలు నమోదు చేసింది.చదవండి: ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్ -
ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర తిరగరాసిన పాక్ స్పిన్నర్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ చరిత్రను తిరగరాశాడు. హెడ్డింగే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 33 ఏళ్ల ఈ ఆల్రౌండర్ 23 ఓవర్లు వేసి 92 పరుగులిచ్చి 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్న అలీ ఉస్మాన్ ఒకే ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి పాక్ లెఫ్టార్మ్ స్పిన్నర్గా నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ గడ్డపై పర్వేజ్ సాజద్ ఐదు ఇన్నింగ్స్ల్లో 5 వికెట్లు పడగొట్టగా, ఇక్బాల్ ఖాసిమ్, షుజాహుద్దీన్లు చెరో మూడు ఇన్నింగ్స్ల్లో నాలుగేసి వికెట్లు, ఫవద్ ఆలం ఒక ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్గా ఇంగ్లండ్ గడ్డపై తక్కువ ఎకానమీతో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్గా అలీ ఉస్మాన్ బెస్ట్ ఫిగర్స్ కూడా నమోదు చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ ఇప్పటికైతే పైచేయిలోనే ఉంది. జో రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది.Only Positive From Pakistan Side Today> ALI USMAN ✨23 Overs • 92 Runs • 5 Wickets pic.twitter.com/kIV1m2vcdB— Usman (@UsmanOffical56) August 20, 2026 A maiden five-wicket haul in Tests for Ali Usman ✨#WTC27 📝: https://t.co/bmrVSU3KD6 pic.twitter.com/N1q4BiyWHg— ICC (@ICC) August 20, 2026చదవండి: 22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్ -
22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ 22 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2004లో జాకబ్ మార్టిన్ పాస్పోర్ట్ ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్లు 420, 468, 471, 120బితో పాటు పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద జాకబ్ మార్టిన్పై అభియోగాలు మోపబడ్డాయి.తాజాగా 22 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జాకబ్ మార్టిన్ పాస్పోర్ట్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ముఖ్యులైన పలువురు సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించడంలో విఫలమయ్యారని, అందుకే జాకబ్ మార్టిన్ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పాటియాలా కోర్టు తమ తీర్పును వెల్లడించింది. తాను నిర్దోషిగా విడుదలవ్వడంపై జాకబ్ మార్టిన్ మీడియాతో స్పందించాడు. "2004లో యూకే పర్యటనకు వెళ్లిన జట్టులో ఒక సభ్యుడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అయితే నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ పొంది భారత్కు తిరిగి రావడంతోనే పట్టుబడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఎఫ్ఐఆర్లో మొదట నా పేరు లేదు. కానీ విచారణ సమయం వచ్చేనాటికి నా పేరును కేసులో చేర్చారు. తాను అంతర్జాతీయ క్రికెటర్గా ఎదగకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏ తప్పు చేయనప్పటికీ నేను దోషిగా తేలడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రికెటర్గా ఎదగలేకపోయానన్న బాధ ఒత్తిడికి గురయ్యాను. తాజాగా 22 ఏళ్ల తర్వాత కేసులో నిర్దోషిగా బయటికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని చెప్పుకొచ్చాడు.1999లో అంతర్జాతీయ అరంగేట్రంఇక కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ 1999 సెప్టెంబర్లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో జరిగిన ట్రై సిరీస్లోనూ పాల్గొన్నాడు. తదనంతరం ఫామ్ కోల్పోవడంతో జాకబ్ జట్టులో చోటు కోల్పోయాడు.టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడిన జాకబ్ మార్టిన్ 22.57 సగటుతో 158 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్క్లాస్ కెరీర్లో 138 మ్యాచ్లాడి 9,192 పరుగులు సాధించిన జాకబ్ మార్టిన్ 23 శతకాలు సాధించాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో 104 మ్యాచ్లాడి 2,948 పరుగులు చేశాడు.Read: భారీ నష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు -
భారీ నష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు!
క్రికెట్లో బ్లాక్క్యాప్స్గా పిలుచుకునే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆర్థిక కష్టాల్లో పడింది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను చవిచూసినట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో 7.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 69 కోట్లు) ప్రాథమిక లోటు ఉన్నట్లు తెలిపింది. జూలై 31, 2026తో ముగిసిన గతేడాది ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో అంచనా వేసిన రూ. 1.8 మిలియన్ల నష్టం కంటే ఇది చాలా ఎక్కువ. స్పాన్సర్షిప్లు తగ్గడం, అకౌంటింగ్ సర్దుబాట్లు , ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని కివీస్ బోర్డు తెలిపింది. ముఖ్యంగా డ్రీమ్ 11 స్పాన్సర్షిప్ను కోల్పోవడం వల్ల ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఖర్చులు పెరిగినట్లు స్పష్టం చేసింది.అయితే ఈ ఏడాది చివర్లో స్వదేశంలో టీమిండియా పర్యటన వల్ల సుమారు 10 మిలియన్ డాలర్లు వస్తాయని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆశాభావం వ్యక్తం చేస్తోంది. సూపర్ స్మాష్ పోటీ స్థానంలో 2027-28 సీజన్ కోసం ప్రతిపాదిత టీ20 ఫ్రాంచైజీ లీగ్కు సంబంధించి ప్రణాళికలు రచిస్తోంది. ఈ వేసవిలో జరిగే సూపర్ స్మాష్ పోటీల్లో మొత్తం 64 మ్యాచ్ల్లో ఫైనల్ సహా 24 మ్యాచ్లను డబుల్ హెడర్గా ప్రసారం చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కార్యనిర్వహణాధికారి జియోఫ్ అల్లట్ స్పష్టం చేశాడు. ఇక డిసెంబర్-జనవరి నెలలో జరిగే సూపర్ స్మాష్ పోటీలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ఇంగ్లండ్పై టెస్టు సిరీస్, వెస్టిండీస్పై వన్డే సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ స్వదేశంలో భారత్తో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు,ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.Read: భారీగా యూఎస్ ఓపెన్ ప్రైజ్మనీ.. సింగిల్స్ విజేతకు 52 కోట్లు -
టీమిండియా, బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సిరీస్ వాయిదా!
బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే సిరీస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి బీసీబీ ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చలు జరుపుతుందని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. వాస్తవానికి గతేడాది ఆగస్టులోనే టీమిండియా.. బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉండగా, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్కు వాయిదా వేశారు. ఢాకా, చట్టోగ్రామ్ వేదికలుగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుందని బీసీబీ ఈ ఏడాది జనవరిలో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సిరీస్పై బీసీసీఐ మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. మరోవైపు బీసీబీ మాత్రం టీమిండియాతో సిరీస్ నిర్వహణకు సిద్దమైనట్లు తెలిపింది. పర్యటనలో భాగంగా ఆగస్టు 28న బంగ్లాదేశ్లో అడుగుపెట్టనున్న భారత్ సెప్టెంబర్ 1, 3, 6 తేదీల్లో మూడు వన్డేలు, సెప్టెంబర్ 9, 12, 13 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది.ఈ నేపథ్యంలో సిరీస్కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండగా, అసలు సిరీస్ జరుగుతుందా? లేదా అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఇదే విషయమై తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. "టీమిండియాతో సిరీస్ గురించి ఇరు బోర్డులు ఇంకా చర్చలు జరుపుతున్నాయి. టోర్నీ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, అయితే షెడ్యూల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. టోర్నీ మొత్తం మీర్పూర్ వేదికగా జరగాలని నిర్ణయిస్తే మాత్రం వేదికను బసుంధర గ్రౌండ్కు మారుస్తాం. సిరీస్ నిర్వహణపై అధికారిక ప్రకటన వస్తే దానికి అనుగుణంగా షెడ్యూల్ను ప్లాన్ చేస్తాము’’ అని చెప్పుకొచ్చాడు.ఈ ఏడాది జనవరిలో బీసీబీ భారత పర్యటనను అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా, కేకేఆర్ బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ను తప్పించడంతో రెండు క్రికెట్ బోర్డుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతరం, అమీనుల్ ఇస్లాం నేతృత్వంలోని బీసీబీ, భారత్ సహ-ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్కు తమ జట్టును పంపకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఇటీవల బీసీబీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తమీమ్ ఈ నెల ప్రారంభంలో భారత్ను సందర్శించిన తర్వాత రెండు బోర్డుల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగయ్యాయి.Read: రూట్ ప్రపంచ రికార్డు.. పాక్తో టెస్టులో భారీ ఆధిక్యం -
రూట్ ప్రపంచ రికార్డు.. పాక్తో టెస్టులో భారీ ఆధిక్యం
పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. మ్యాచ్లో హాఫ్ సెంచరీ (66 పరుగులు) సాధించిన రూట్ టెస్టు క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో సచిన్తో (200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు) కలిసి రూట్ (167 టెస్టుల్లోనే) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. మరో అర్ధసెంచరీ సాధిస్తే రూట్ టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతు న్నాడు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా రూట్కు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈతరం ఫ్యాబ్-4లో (కోహ్లి, స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్) ఇద్దరు ఇప్పటికే రిటైరవ్వగా.. రూట్, స్మిత్ మాత్రమే యాక్టివ్గా ఉన్నారు.టెస్టు కెప్టెన్గా మరో రికార్డుదీంతో పాటు రూట్ టెస్టుల్లో మరో రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెప్టెన్గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రూట్ (42 ఫిఫ్టీలు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ (61), ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, పాక్ మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (43 ఫిఫ్టీలు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు. పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది.Joe Root 66(112) Vs Pakistan | 1st Test, 2026 - Leeds | Ball By Ball Highlights pic.twitter.com/gbkZ20BOwC— PctMedia (@PctMediaa) August 20, 2026Most fifties in Test cricket:Joe Root - 68*. Sachin Tendulkar- 68. pic.twitter.com/dScWCVxvSn— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2026 -
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.సిరాజ్ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్ను వివరించాడు. పేస్ అటాకింగ్ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు. అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026చదవండి: పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్! -
పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్!
ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు బలహీనంగా ఉందని, ఇంగ్లండ్ గడ్డపై ఆ జట్టుకు టెస్టు సిరీస్లో మరోసారి వైట్వాష్కు తప్పదనిపిస్తుందని బ్రాడ్ అంచనా వేశాడు. ‘ఫర్ ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్య్వూలో బ్రాడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచి ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.‘కెరీర్ చివరి దశలో ఉన్న 36 ఏళ్ల మహ్మద్ అబ్బాస్ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. దీన్నిబట్టే పాక్ జట్టు ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. గత పర్యటనల్లో ఎదురైన అనుభవమే ఈసారి కూడా పాకిస్తాన్కు ఎదురయ్యే అవకాశముంది. ఈసారి మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-0తో పాక్ను వైట్వాష్ చేస్తుందని భావిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు.ఆరింటిలో నాలుగు ఓటమిఅయితే బంగ్లాదేశ్ పర్యటనకు ముందే మహ్మద్ అబ్బాస్ను టెస్టు జట్టులోకి తిరిగి తీసుకొచ్చారు. అయితే పాక్ జట్టు ఓటములు చవిచూసినప్పటికీ, మహ్మద్ అబ్బాస్ మాత్రం అసాధారణ ప్రదర్శన చేశాడు. తాను ఆడిన మూడు టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. కానీ బ్రాడ్ వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో పాకిస్తాన్ ఆశించినంత మేర రాణించలేకపోతుంది. బంగ్లాదేశ్ చేతిలో వైట్వాష్కు గురవ్వడంతో పాటు ఆరు టెస్టుల్లో నాలుగింట పరాజయం చవిచూసింది.హెడ్డింగే వేదికగా ఇవాళ్టి నుంచే తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ తమ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజం లేకుండానే బరిలోకి దిగుతోంది. విండీస్ పర్యటనలో తన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న బాబర్ ఆజం.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు బెకెన్హమ్లో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కుడి చేతికి గాయమైంది. తొలి టెస్టుకు బాబర్ దూరంగాయం తీవ్రత ఎక్కువగా లేనప్పటికీ, పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో ఇంగ్లండ్తో తొలి టెస్టుకు బాబర్ దూరమయ్యాడు. దీంతో బాబర్ ఆజం గైర్హాజరీ పాక్ బ్యాటింగ్ ఆర్డర్ను బలహీనం చేసినట్లయింది. బంగ్లాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టులో చాలా మార్పులు చేసింది. షాన్ మసూద్ స్థానంలో బాబర్ ఆజమ్కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే గాయంతో బాబర్ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు దూరం కావడంతో సల్మాన్ అగా తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అదే సమయంలో విండీస్తో టెస్టు సిరీస్కు షహీన్ అఫ్రిది, హసన్ అలీ, నసీమ్ షాలకు బదులు మహ్మద్ అబ్బాస్, ఖుర్రమ్ షెహజాద్లను ఆడించి మంచి ఫలితాన్ని అందుకుంది. తొలి టెస్టులో ఓడినప్పటికీ, రెండో టెస్టులో బాబర్ ఆజం సేన అద్భుత విజయాన్ని అందుకొని సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. ఇక బెకెన్హమ్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్లో సౌద్ షకీల్, అబ్దులా షఫీక్, ఉస్మాన్ అలీ, మహమ్మద్ అలీ రాణించడం పాకిస్తాన్కు సానుకూలాంశమని చెప్పొచ్చు. ఇక 2024లో చివరిసారి పాక్ గడ్డపై ఇంగ్లండ్తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన -
సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు (ట్రాన్స్జెండర్) అనయ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో మహిళల క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా కొత్త చాప్టర్ను ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ‘మీ అందరికీ ఒక శుభవార్త. నేను 2027లో మహిళల ఎలైట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీని గురించి చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పలేను. నాకు ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం చేయగలను.’ అని చెప్పుకొచ్చింది.ట్రాన్స్జెండర్లను ఉమెన్స్ క్రికెట్లోకి అనుమంతించేది లేదంటూ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని అనయ బంగర్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ట్రాన్స్జెండర్లకు మహిళల క్రికెట్లో ఆడే హక్కు ఎందుకు ఉండదో చెప్పాలని ఐసీసీని ప్రశ్నించింది. అంతేకాదు లింగమార్పిడి తర్వాత మహిళా క్రికెటర్లతో సమానంగా తన శారీరక స్థితి ఉందని పేర్కొన్న అనన్య బంగర్, తన రిపోర్టుల్లో మహిళా క్రికెటర్లకు ఉండే కండబలం, గ్లూకోస్, ఆక్సిజన్ లెవల్స్.. తనకు అలానే ఉన్నాయని నిరూపించుకుంటానని సవాల్ చేస్తూ బీసీసీఐ, ఐసీసీకి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే అనయ బంగర్ మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో చేయించుకున్న అదనపు రక్త పరీక్షలు, శస్త్ర చికిత్స వివరాలు సహా వైద్య, శారీరక సమాచారాన్ని ఒక సంస్థ (పేరు చెప్పలేని) పరిశీలించింది. ‘అనయ బంగర్ రిపోర్ట్స్ను సుశితంగా పరిశీలించాం. ట్రాన్స్జెండర్ అయినప్పటికీ, మహిళలతో సమానంగా శారీరక స్థితి ఉండడంతో అనయకు మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందే’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే అనయ బంగర్ తాను మహిళల ఎలైట్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, భారత మహిళల జట్టుకు ఆడడం మాత్రం కష్టమే. క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్జెండర్లకు అనుమతి లేదనే ఐసీసీ నిబంధనలే ఇందుకు కారణం. పురుష దశ దాటిన తర్వాత లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనేందుకు అర్హులు కారు అని ఐసీసీ పేర్కొంది. ఇక అనయ తండ్రి సంజయ్ బంగర్ టీమిండియా తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2014 నుంచి 2019 వరకు సంజయ్ బంగర్ టీమిండియా బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించాడు. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ తన కుటుంబం మద్దతుతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT), జెండర్-అఫర్మింగ్ సర్జరీ పూర్తి చేసుకుని అనయా బంగర్గా గుర్తింపు పొందింది.😇 pic.twitter.com/pDOjd2B5mB— Anaya Bangar (@anayabangarbnxf) August 17, 2026Anaya Bangar gets candid on her upcoming debut in women’s cricket: I had given up on the hope of ever playing againFor Anaya Bangar, life has been a relentless battle of resilience, grit, and unwavering authenticity.Following her post-transition journey and a deeply personal… pic.twitter.com/h1xH292uAZ— Ritam English (@english_ritam) August 18, 2026Read: జడ్డూ చర్యపై గంభీర్ అసహనం! -
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినూష (84) టాప్ స్కోరర్గా నిలవగా, ధనంజయ డిసిల్వా (59) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు, జడేజా, సిరాజ్లు చెరో వికెట్ పడగొట్టారు. టెస్టులో రెండు ఇన్నింగ్స్లు కలిపి మానవ్ సుతార్ పది వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది.సంక్షిప్త స్కోర్లుభారత్ 462 & 193 ఆలౌట్శ్రీలంక 284 & 206 ఆలౌట్తొమ్మిదో వికెట్ డౌన్అంకతముందు మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంక 199 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ ఒక్క వికెట్ దూరంలో ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో ప్రబాత్ జయసూరియా గోల్డెన్ డకౌట్ కావడంతో శ్రీలంక 199 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో డిక్వెల్లా వెనుదిరిగాడు. భారత్ విజయానికి మరో 2 వికెట్లు అవసరం.లంచ్ తర్వాత మొదలైన ఆటశ్రీలంక స్కోరు: 196/6(74)దినుష 81, కేశారా 13 పరుగులతో ఉన్నారులంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 67 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సోనాల్ దినూష (65 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా, కెషారా నువంతా 8 పరుగులతో ఆతడికి సహకరిస్తున్నాడు. ప్రసిధ్ క్రిష్ణ, మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. ఇంకా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉన్న లంక గెలుపుకు 197 పరుగులు అవసరం. ఆరో వికెట్ డౌన్10 పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా ప్రసిధ్ బౌలింగ్లో వెనుదిరగడంతో లంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దినూష (54) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.ఐదో వికెట్ డౌన్జడేజా బౌలింగ్లో ధనంజయ డిసిల్వా (59) ఔట్ కావడంతో శ్రీలంక 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, గెలుపుకు లంక 230 పరుగుల దూరంలో ఉంది.లంక బ్యాటర్ల అర్ధశతకాలులంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 231 పరుగులు అవసరం.వంద పరుగుల మార్క్ దాటిన లంక372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వంద పరుగుల మార్క్ను దాటింది. 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ధనంజయ (40), దినూష (33) క్రీజులో ఉన్నారు.ఐదోరోజు ఆట మొదలుగాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఐదో రోజు ఆట ప్రారంభం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం. 372 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్లా 39 పరుగులు, సోనాల్ దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL: నాలుగో రోజు ఆట సాగిందిలా! -
లైవ్ మ్యాచ్లో భయానక ఘటన.. ఐసీయూ బెడ్పై అంపైర్!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, న్యూఢిల్లీ టైగర్స్ మధ్య మ్యాచ్లో భయానక సంఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆశిష్ మీనా వేసిన 18వ ఓవర్లో బ్యాటర్ లక్ష్య థరేజా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ నేరుగా అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ ముఖాన్ని బలంగా తాకింది. దీంతో అంపైర్ నొప్పితో విలవిల్లాడిపోయారు. అదే సమయంలో తాను కొట్టిన బంతి అంపైర్కు బలంగా తాకడంతో లక్ష్య థరేజా బాధను వ్యక్తం చేశాడు. అయితే తాజా నివేదిక ప్రకారం అంపైర్ భరద్వాజ్ పరిస్థితి సీరియస్గా ఉండడంతో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే మ్యాచ్లో అంతకముందే అంపైర్ భుజం గాయానికి గురయ్యారు.మ్యాచ్ విషయానికొస్తే ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 36 పరుగుల తేడాతో న్యూఢిల్లీ టైగర్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మయాంక్ రావత్ (40) టాప్ స్కోరర్గా నిలవగా, వాన్స్ మెహ్రా (35), అర్పిత్ రానా (33) రాణించారు. న్యూఢిల్లీ టైగర్స్ బౌలర్లలో రిషబ్ శర్మ 3 వికెట్లు తీయగా, లక్ష్మణ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో న్యూఢిల్లీ టైగర్స్ 19.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హిమ్మత్ సింగ్ (31), లక్ష్య థరేజా (21) పర్వాలేదనిపించారు. ఈస్ట్ ఢిల్లీ బౌలర్లలో ఆశిశ్ మీనా, మయాంక్ యాదవ్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు.చదవండి: జైలు శిక్ష తప్పించుకున్న వార్నర్.. కానీ ఒక కండిషన్! -
లంకకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ క్రికెటర్!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆ జట్టు ఆటగాడు దినేశ్ చందిమల్ గాయానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్షాట్ను అడ్డుకునే ప్రయత్నంలో బౌండరీ లైన వద్ద ఉన్న రోప్ అడ్డుతగలడంతో అతడి మెడ బాగానికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి చందిమల్ను పరీక్షించారు. నొప్పితో బాధపడుతున్న చందిమల్ను తదుపరి స్కానింగ్ల కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో పసిందు సూరియబండారా సబ్స్టిట్యూట్ ఫీల్డర్గాఆ వచ్చాడు. తాజా గాయంతో లంక రెండో ఇన్నింగ్స్ సమయంలో చందిమల్ బ్యాటింగ్కు వస్తాడా రాడా అనేది అనుమానంగా మారింది. ‘‘నాలుగో రోజు తొలి సెషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌండరీని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు దినేష్ చండిమాల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. మైదానంలోనే జట్టు ఫిజియోథెరపిస్ట్, వైద్యులు అతడిని పరీక్షించారు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి) తెలిపింది.నాలుగో ఇన్నింగ్స్ సమయానికి చందిమల్ కోలుకోకపోతే మాత్రం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే చందిమల్ దూరమైతే అప్పుడు లంక జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు లంక సీనియర్ బ్యాటర్ అయిన చందిమల్కు భారత్పై మంచి రికార్డు ఉంది. టీమిండియాపై 9 టెస్టులాడిన చందిమల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.Sri Lanka batter Dinesh Chandimal has been taken to the hospital for a precautionary scan after injuring his right shoulder and neck while diving to save a boundary on day four of the first Test against India at the Galle International Stadium on Tuesday."Dinesh Chandimal… pic.twitter.com/30cqMwPpcY— IANS (@ians_india) August 18, 2026Read: రాహుల్ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం! -
రాహుల్ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ తెలివైన నిర్ణయంతో కాపాడాడు. విషయంలోకి వెళితే.. భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ ప్రబాత్ జయసూరియా వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని 25 పరుగులతో ఆడుతున్న రాహుల్ భారీ సిక్సర్గా మలిచాడు. అయితే మరుసటి బంతిని రాహుల్ మిస్ చేయడంతో బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే మొదట కేఎల్ రాహుల్ తాను ఔటయ్యానని భావించి రివ్యూ తీసుకోవడానికి ఆలోచించాడు. అదే సమయంలో నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న పడిక్కల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని రాహుల్కు సైగ చేశాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. ఇక రివ్యూలో బంతి బ్యాట్కు ఎక్కడా తగల్లేదు, కానీ లైన్లోనే వెళ్లడంతో మొదట ఔట్ అనిపించినప్పటికీ, బంతి స్టంప్స్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోగా, కేఎల్ రాహుల్ మాత్రం పడిక్కల్ వద్దకు వచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు. రివ్యూ తీసుకోమని చెప్పినందుకు థాంక్స్ అన్నట్లుగా రాహుల్ అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్ చేయడం కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవేళ పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని చెప్పకపోయుంటే రాహుల్ పెవిలియన్ బాట పట్టేవాడే. అయితే తనకు లభించిన అవకాశాన్ని రాహుల్ వినియోగించు కోలేకపోయాడు. మళ్లీ అదే ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షషాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.KL Rahul hugged Devdutt Padikkal for asking Him to go upstairs to review the decision which was given out on-field. A beautiful moment. #SLVIND pic.twitter.com/ZhtI0jBzb2— Nibraz Ramzan (@nibraz88cricket) August 18, 2026KL Rahul hugging Devdutt Paddikal after a successful DRS suggested by him 😂 #SLvIND pic.twitter.com/vLEys0Vgk3— Prateek (@prateek_295) August 18, 2026 -
జైస్వాల్ ఏంటా పిచ్చి షాట్లు? రిపీటయితే అడ్రస్ గల్లంతే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్లో కట్షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు. 2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది."Yashasvi jaiswal Got out on 0 runs 😢He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026Read: సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం! -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్లో ప్రసిద్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్ను టార్గెట్గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పడిక్కల్ సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్, జురెల్ అర్ధశతకాలు సాధించారు.🚨 Heated exchange between Mohammed Siraj & Niroshan Dickwella during the live match 🚨Mohammed Siraj was continuously beating Dickwella’s bat with his deliveries and kept troubling the Sri Lankan batter.After Dickwella appeared to lose his cool, the two players were involved… pic.twitter.com/kvGVWVo1sK— Central Cricket (@arshdeep3444) August 17, 2026 -
‘వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి’
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పట్టు బిగించింది. కానీ ఆటకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం, వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాలేలో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులకు మరో 172 పరుగులు జోడిస్తే 350 పరుగుల దాకా వస్తాయి. మ్యాచ్కు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి 40 ఓవర్లలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు ఓవర్కు ఐదు రన్స్ చొప్పున (దాదాపు 200 పరుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్నది టెస్టు మ్యాచ్ అయినప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన బ్యాటర్లు ఆటను టెస్టు నుంచి వన్డే గేర్కు మార్చుకోవాలి. ఓపెనర్లుగా వచ్చే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్లో దూకుడు ప్రదర్శించాలి. టీ20 క్రికెట్ కాకపోయినా, కనీసం వన్డే తరహాలో కాస్త ఫాస్ట్గా ఆడేందుకు ప్రయత్నించాలి. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోతే సమస్య లేదు. కానీ వర్షం పడితే మాత్రం భారత్కు దెబ్బ పడుతుంది. కాబట్టి వీలైనంత మేర ఫాస్ట్గా ఆడేందుకు యత్నించాలి. వర్షం పడే అవకాశం ఉండడంతో నేనైతే భారత్కు రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లు ఇస్తాను. 150 నుంచి 175 పరుగులు చేశాకే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వర్షం పడకపోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవర్లు, చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫలితం అనుకూలంగా లేదా ప్రతికూలంగా వచ్చేందుకు కూడా అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు -
Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు
ఆగస్టు 18, 2008.. శ్రీలంకతో మ్యాచ్లో ఒక 19 ఏళ్ల కుర్రాడు 18వ నెంబర్ జెర్సీ మైదానంలో బరిలోకి దిగాడు. నునుగు మీసాలతో ఉన్న ఆ కుర్రాడు మ్యాచ్లో 22 బంతులాడి 12 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే ఆ కుర్రాడే భారత క్రికెట్ను ఏలబోతున్నాడన్న విషయం అతడితో సహా అక్కడున్న వారికి ఎవరికీ తెలియదు. కట్చేస్తే 18 ఏళ్లు తిరిగేసరికి అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) కలిపి 28,359 పరుగులు చేసి ఆల్టైమ్ అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 85 సెంచరీలు, 125 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. 18 ఏళ్ల ప్రయాణంలో కోహ్లి ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. (18 Years Of Virat Kohli In International Cricket)విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలై ఇవాళ్టితో (ఆగస్టు 18) 18 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కోహ్లి లక్కీ నంబర్ 18 అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతడు వేసుకునే జెర్సీ నెంబర్ 18.. ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ సాధించింది 18వ ఎడిషన్లోనే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కోహ్లికి 18వ సంఖ్య అంటే బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుందాం. (Virat Kohli Greatness)1) తండ్రి మరణం2006 రంజీ ట్రోఫీ మ్యాచ్లో, 18 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు. డిసెంబర్ 19న 40 పరుగులతో ఆడుతున్న సమయంలో తన తండ్రి మరణవార్త తెలిసినప్పటికీ కోహ్లి ఆ వార్తను దిగమింగి 90 పరుగులతో ఢిల్లీ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.2) అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్మలేషియాలోని కౌలాలంపూర్లోని వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లి తొలిసారి తనలోని వ్యూహాత్మకను ప్రదర్శించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లలో 116 పరుగుల సవరించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్లో భారత బౌలర్లలో ప్రతీ ఒక్కరు పది కంటే ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు. కానీ ఇక్కడే కోహ్లి తన తెలివిని ఉపయోగించి అజితేష్ అర్గల్ను సరైన సమయంలో వాడుకున్నాడు. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు మాత్రమే ఇచ్చిన అజితేష్ రెండు వికెట్లు తీయడంతో పాటు ఇండియాకు టైటిల్ అందించాడు.3) 2011 వన్డే ప్రపంచకప్2011 వన్డే ప్రపంచకప్ను టీమిండియా సొంతం చేసుకుంది. లంకతో జరిగిన ఆనాటి ఫైనల్లో కోహ్లి 35 పరుగులే చేసినప్పటికీ, గంభీర్తో కలిసి ఒత్తిడిలో అతడు ఆడిన ఇన్నింగ్స్ విలువైనది. కోహ్లి ఇన్నింగ్స్లో పెద్ద సంచలనం లేకపోయినా, తర్వాతి కాలంలో అతడు అద్భుతమైన క్రికెటర్గా మారడానికి ఇదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.4) 2012లో హోబార్ట్ వీరోచిత ఇన్నింగ్స్2012 ఫిబ్రవరి 28న, హోబర్ట్లో, విరాట్ కోహ్లీ శ్రీలంకపై 86 బంతుల్లో 133* పరుగులతో తన కెరీర్లోనే ఒక చిరస్మరణీయమైన వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో నిలవాలంటే, శ్రీలంక చేసిన 320/4 పరుగులను భారత్ కేవలం 40 ఓవర్లలోనే ఛేదించాల్సి వచ్చింది. అయితే భారత్ 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేధించడం విశేషం. ఇక లసిత్ మలింగ వేసిన ఒక ఓవర్లో కోహ్లి 24 పరుగులు రాబట్టడం విశేషం.5) 2012 ఆసియా కప్2012 ఆసియా కప్ సందర్భంగా మీర్పూర్లో పాకిస్థాన్పై విరాట్ కోహ్లి 183 పరుగులు చేశాడు. కోహ్లి ఇన్నింగ్స్తో 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఆరు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కోహ్లి వన్డే కెరీర్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు.6) 2012 ఫిట్నెస్ విప్లవం2012 ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత, విరాట్ కోహ్లీ తాను తన శరీరాకృతిని ఎంతగా కోల్పోయాడో గ్రహించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మారుతున్న ప్రమాణాలను గ్రహించిన కోహ్లీ, స్వీట్లు, జంక్ ఫుడ్, అర్ధరాత్రి పూట తినే స్నాక్స్ను మానేసి, ఆహార పరిమాణాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ, ప్రతిరోజూ తీవ్రమైన వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు.7) 2014 పీడకల2014 ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటన విరాట్ కోహ్లీ మానసిక స్థైర్యానికి, ఏకాగ్రతకు పెద్ద దెబ్బగా మారింది. ఇంగ్లీష్ పేసర్ జేమ్స్ అండర్సన్, కోహ్లీకి ఆఫ్-స్టంప్ బయట బౌలింగ్ చేసే బలహీనతను నిరంతరం ఉపయోగించుకున్నాడు. అతను నాలుగు సార్లు ఔటయ్యాడు, 10 ఇన్నింగ్స్లలో కేవలం 134 పరుగులకే పరిమితమయ్యాడు.8) సాంకేతిక విప్లవంవిరాట్ కోహ్లీ తన స్టాన్స్ను వెడల్పుగా ఉంచి, బంతి వేగాన్ని తగ్గించడానికి ఫార్వర్డ్ ప్రెస్ మూవ్మెంట్ను ఉపయోగించడం ద్వారా తన సాంకేతిక సామర్థ్యాలను పునఃసమీక్షించుకున్నాడు. BGT తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు, అడిలైడ్లో తన టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలో కోహ్లీ 115, 141 పరుగులు చేశాడు.9) 2022 టీ20 ప్రపంచ కప్పాకిస్థాన్పై కోహ్లీ చేసిన అజేయమైన 82* పరుగులు ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. కేవలం 3.1% గెలుపు శాతంతో ఆ దేశానికి 8 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా, కోహ్లీ దానిని సాధ్యం చేశాడు.10) 2016 ఐపీఎల్ సీజన్దేశీయ టీ20 లీగ్లో విరాట్ కోహ్లీ మరియు ఒక బ్యాటర్గా అతని అత్యుత్తమ ప్రదర్శన అది. అద్భుతమైన నిలకడతో, అతను 16 ఇన్నింగ్స్లలో నాలుగు సెంచరీలతో పాటు ఏడు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ సీజన్లో అతను 973 పరుగులు చేశాడు, ఇది ఆ టోర్నమెంట్ యొక్క ఒక ఎడిషన్లో ఇప్పటివరకు ఒక బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు.11) 2018లో ఫామ్లోకి వచ్చిన కోహ్లి2014 పర్యటన తర్వాత నాలుగేళ్లకు తిరిగి వచ్చిన కోహ్లీ, 59 సగటుతో 594 పరుగులు సాధించాడు. అతను తన టెక్నిక్, సహనం, ఆత్మాభిమానంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, తన బ్యాటింగ్ విధానాన్ని పునరుద్ధరించుకోవడం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు.12) ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంవిరాట్ సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియా గడ్డపై మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఇది ఆసియా రెడ్-బాల్ క్రికెట్లో ఒక మైలురాయి వంటిది. అతను 4 మ్యాచ్లలో 282 పరుగులు చేసి ఆదర్శంగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ల నుండి పుజారా తీవ్రమైన దెబ్బలు తిన్న వివాదాస్పద సిడ్నీ టెస్ట్ కూడా ఇందులో ఉంది.13) 60 ఓవర్లపై స్పందనకోహ్లీ తన దూకుడును శక్తిగా మలచి, ఇతరులను బలోపేతం చేయడానికి తన తీవ్రతను ఉపయోగించాడు. 2021లో ఇంగ్లాండ్తో జరిగిన ఓవల్ టెస్టులో, తన సహచరులకు అతను చేసిన ప్రసిద్ధ '60 ఓవర్ల నరకం' ప్రసంగం, భారత్ను ఉత్తేజపరిచి నాటకీయ విజయాన్ని సాధించేలా చేసింది. అది కెప్టెన్గా కోహ్లీ యొక్క తీవ్రమైన, రాజీపడని ప్రతిబింబాన్ని చాటింది.14) 2022 ఆసియా కప్లో 71వ సెంచరీ2019లో ఏడు సెంచరీలు చేసిన తర్వాత, కోహ్లీ 2020, 2021లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆ తర్వాత రెండేళ్లకు, 2022 ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో పునరాగమనం చేశాడు. అది అతని తొలి టీ20ఐ సెంచరీ కూడా.15) 2023 వన్డే ప్రపంచకప్స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో అతను 765 పరుగులు చేసి, ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగుల కోసం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు, ఈ ఫార్మాట్లో అత్యధికమైన తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.16) 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్2024 టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ అంతటా 1, 4, 0, 24, 37, 0, 9 పరుగులు చేసిన తర్వాత, కోహ్లీ అత్యంత కీలకమైన సమయంలో రాణించాడు. ఫైనల్లో అతను 59 బంతుల్లో 76 పరుగులు చేసి, 12 ఏళ్ల తర్వాత భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవడంలో సహాయపడ్డాడు.17) ఆర్సీబీకి తొలి టైటిల్ ఐపీఎల్లో 18 సీజన్ల తర్వాత ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లి తొలి ఐపీఎల్ టైటిల్ అందుకున్న క్షణంలో భావోద్వేగానికి గురయ్యాడు.18) టెస్టు రిటైర్మెంట్పై కోహ్లీ స్పందనతన రెండో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందు, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మీడియాలో చక్కర్లు కొట్టిన అన్ని ఊహాగానాలకు కోహ్లీ సమాధానమిచ్చాడు. ‘నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నాను, కొనసాగించాలనుకుంటున్నాను. భారత్ తరఫున ప్రపంచ కప్ ఆడటం అద్భుతం. కానీ దాని విలువ స్పష్టంగా ఉండాలి” అని చెప్పుకొచ్చాడు. -
క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, డ్వేన్ బ్రావోలకు అరుదైన గౌరవం లభించింది. కరీబీయన్ ప్రీమియర్ లీగ్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఈ ఇద్దరిని చేర్చారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక ప్లేయర్ కేటగిరీలో బ్రావో తొలి క్రికెటర్గా హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకోగా, నాన్ ప్లేయర్ కేటగిరీలో ఇయాన్ బిషప్కు చోటు కల్పించడం జరిగింది. విండీస్ స్టార్ ఆల్రౌండర్గా పేరు పొందిన డ్వేన్ బ్రావో కరీబియన్ ప్రీమియర్ లీగ్లో 100కు పైగా మ్యాచ్లు ఆడాడు. 2013లో ప్రారంభమైన కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మొదటి సీజన్ నుంచి ఆడుతూ వచ్చిన బ్రావో 2024 వరకు లీగ్లో ఆటగాడిగా కొనసాగాడు. అదే సమయంలో ఇయాన్ బిషన్ 2013 నుంచి కరీబియన్ ప్రీమియర్ లీగ్లో లీడింగ్ కామెంటేటర్గా కొనసాగుతూ వస్తున్నాడు.ఇక ఈతరం టీ20 బెస్ట్ ఆల్రౌండర్లలో డ్వేన్ బ్రావో పేరు తప్పకుండా ఉంటుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వెస్టిండీస్ సాధించిన రెండు టీ20 ప్రపంచకప్పుల్లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్లో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించాడు. వీటితో పాటు బీబీఎల్, బీపీఎల్ కూడా ఆడాడు. ఇక కరీబియన్ ప్రీమియర్ లీగ్లో 107 మ్యాచ్లాడిన బ్రావో ఇందులో ఒక్క ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరఫునే 89 మ్యాచ్లు ఆడడం విశేషం. ఇక 107 మ్యాచ్ల్లో వెయ్యికి పైగా పరుగులు, 129 వికెట్లు పడగొట్టాడు. తన సీపీఎల్ కెరీర్లో ఐదుసార్లు టైటిల్స్ అందుకున్న బ్రావో.. నాలుగుసార్లు నైట్రైడర్స్ తరఫున, ఒక్కసారి సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్గా సీపీఎల్ టైటిల్ అందుకున్నాడు.ఇక ఇయాన్ బిషప్ క్రికెటర్గా కంటే కామెంటేటర్గానే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వెస్టిండీస్ గెలిచిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చిరస్మరణీయం. ఆనాడు బిషప్ చేసిన క్రికెట్ వ్యాఖ్యానం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ క్షణాల్లో ఒకటిగా గుర్తుండిపోనుంది.ఇదే మొదటిసారిలీగ్కు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, వారి సేవలను గుర్తించే ప్రయత్నంలో, సీపీఎల్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా CPL హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మొట్టమొదటి CPL హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చే నెల సెప్టెంబర్ 15న నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలోనే డ్వేన్ బ్రావో, ఇయాన్ బిషప్లు తమ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకోనున్నారు. The Republic Bank CPL today confirmed Dwayne Bravo and Ian Bishop as the two inaugural inductees into the newly established CPL Hall of Fame. They will be honoured in a Gala Dinner in Barbados on 15 Sep 2026. READ MORE: https://t.co/F9zsnxUMxk#CPL26 #CricketPlayedLouder pic.twitter.com/0t7gjeLgfJ— CPL T20 (@CPL) August 17, 2026 -
టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డు
శ్రీలంక వికెట్కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా టెస్ట్ క్రికెట్లో అరుదైన రికార్డును కొనసాగిస్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా లేకుండానే కెరీర్ను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు 55 టెస్ట్లు ఆడిన అతడు.. 23 అర్ద సెంచరీల సాయంతో 2837 పరుగులు చేసి జట్టులో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) డిక్వెల్లా మరోసారి సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ స్పెషలిస్ట్ బ్యాటర్ ఇన్ని మ్యాచ్లు ఆడి సెంచరీ లేకుండా మనుగడ సాగించలేదు. డిక్వెల్లాకు మాత్రమే ఇది సాధ్యమైంది.సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ (3154) పేరిట ఉన్నప్పటికీ.. అతడు స్పెషలిస్ట్ బ్యాటర్ కాదు. అతడు తన అత్యుత్తమ లెగ్ స్పిన్ బౌలింగ్కు తోడుగా ఈ పరుగులు సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి వార్న్ తర్వాతి స్థానంలోనే డిక్వెల్లా కొనసాగుతున్నాడు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో సెంచరీ లేకుండానే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డిక్వెల్లా చలామణి అవుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలో మిచెల్ స్టార్క్ (106 టెస్ట్ల్లో (2497) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. డిక్వెల్లా సెంచరీ చేయకుండానే ఔటైనప్పటికీ శ్రీలంక పరువు కాపాడాడు. సోనల్ దినుషాతో (86 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు 146 పరుగులు జోడించి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంకను డిక్వెల్లా-దినుషా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ప్రతిఘటించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.ప్రస్తుతం దినుషాకు జతగా ప్రభాత్ జయసూర్య (0) క్రీజ్లో ఉన్నాడు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు శ్రీలంక ఇంకా 212 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (167) భారీ శతకంతో సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ (82), ధృవ్ జురెల్ (51) అర్ద సెంచరీలతో రాణించారు. రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ శ్రీలంకలో పర్యటిస్తుంది. -
ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘన్ జట్టు ప్రకటన.. రషీద్కు నో ప్లేస్
2026 ఏషియన్ గేమ్స్ కోసం 15 మంది సభ్యుల ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ ప్రకటించారు. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో దర్విష్ రసూలీ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన స్థానిక టోర్నీలో (షపగీజా క్రికెట్ లీగ్) రాణించిన పలువురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.రషీద్ ఖాన్కు చోటు లేదుఆఫ్ఘనిస్తాన్ రెగ్యులర్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ జట్టులో లేడు. స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్, ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా ఆసియా గేమ్స్కు దూరంగా ఉండనున్నారు.అయితే అనుభవజ్ఞులైన నజీబుల్లా జద్రాన్, కరీమ్ జనత్ జట్టులో కొనసాగనున్నారు. వీరి అనుభవం యువ ఆటగాళ్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.షపగీజా లీగ్లో అదరగొట్టిన ఆటగాళ్లకు అవకాశంటాపార్డర్ బ్యాటర్ మొహమ్మద్ అక్రమ్ షపగీజా లీగ్లో అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించాడు. ఎనిమిది ఇన్నింగ్స్ల్లో అతడు 339 పరుగులు, ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు.ఆల్రౌండర్ ఇస్మత్ ఆలం కూడా లీగ్లో 294 పరుగులతో పాటు 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. అతడికి షపగీజా లీగ్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా లభించింది.వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ ఇషాక్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది.ఏషియన్ గేమ్స్కు ఆఫ్ఘనిస్తాన్ జట్టుదర్విష్ రసూలీ (కెప్టెన్), మొహమ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), మొహమ్మద్ అక్రమ్, హసన్ ఈసాఖైల్, ఖాలిద్ తానివాల్, ఇమ్రాన్ మిర్, ఫైసల్ ఖాన్ షినోజాదా, నజీబుల్లా జద్రాన్, ఫర్మానుల్లా సఫీ, ఇస్మత్ ఆలం, కరీమ్ జనత్, నంగ్యాల్ ఖరోటీ, అరబ్ గుల్ మొమంద్, ఫరీదూన్ దావుద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్.ఏషియన్ గేమ్స్కు ముందు ఆఫ్ఘనిస్తాన్ భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (ఢిల్లీలో) ఆడనుంది. దీంతో ఆసియా గేమ్స్కు ఎంపికైన యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవం పొందే అవకాశం కూడా లభించనుంది. -
విండీస్ వీరుడి విధ్వంసం.. చివరి ఓవర్లో గట్టెక్కారు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో బార్బడోస్ ట్రైడెంట్స్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్పై బార్బడోస్ ట్రైడెంట్స్ 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, బ్రాండన్ కింగ్ (39), క్వింటన్ డికాక్ (38) రాణించారు. 90 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో రివాల్డో క్లార్క్ (23)తో కలిసి రూథర్ఫోర్డ్ ఇన్నింగ్స్ నడిపించాడు. నాలుగో వికెట్కు ఈ జోడి 79 పరుగులు జోడించడంతో బార్బడోస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సెంట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, షెడ్లే వాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో సెయింట్ లూసియా కింగ్స్ 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అకీమ్ ఆగస్టీ (34 బంతుల్లో 63) సిక్సర్లతో రెచ్చిపోయినప్పటికీ లాభం లేకపోయింది. రోస్టన్ చేజ్ (34), మాథ్యూ ఫోర్డ్ (24 నాటౌట్) చివరకు వరకు అజేయంగా నిలిచినప్పటికీ లాభం లేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు పడడంతో సెయింట్ లూసియా ఛేదనలో తడబడింది. ట్రైడెంట్స్ బౌలర్లలో గుదకేశ్ మోతి 3 వికెట్లు తీయగా, ముజీబ్ ఉర్ రెహ్మన్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ సాధించిన రూథర్ఫోర్డ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.Ruthless Rutherford has unleashed! 😮💨Back to Back fifties for Sherfane! 🇱🇨 x 🇧🇧#CPL26 #SLKvBT #CricketPlayedLouder #BiggestPartyInSport #BYD pic.twitter.com/7SJWiO3s4Z— CPL T20 (@CPL) August 17, 2026CPL 2026 - Barbados Tridents defeated Saint Lucia Kings by 9 runs 🇧🇧 [DLS]Sherfane Rutherford hammered 61 in 31 balls and named as POTM for game defining inning.🎖️Ackeem Auguste smashed 63 from 34 balls 🇱🇨 pic.twitter.com/x1o95OKsIQ— Maina Singh (@Maina_Singhx77) August 17, 2026Read: 'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే' -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్మన్ గిల్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్గా మారే సత్తా మానవ్ సుతార్కు ఉంది. లంక పిచ్లపై అతడు అద్భుతమైన టర్న్ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
తప్పించాలని డిమాండ్లు; బ్యాట్తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అర్ధశతకంతో మెరిశాడు. అయితే గత ఏడు ఇన్నింగ్స్ల్లో జురెల్ బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కు అవకాశమివ్వాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం జురెల్పై నమ్మకాన్ని ఉంచింది. అందుకే జురెల్ హాఫ్ సెంచరీ చేయగానే కోచ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చప్పట్లు కొడుతూ అభినందించడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తాజాగా జురెల్ లంకతో తొలి టెస్టులో ఫిఫ్టీ మార్క్ సాధించి జట్టుతో పాటు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జురెల్ తన ప్రదర్శనపై స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భారత్కు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయంగా భావిస్తున్నా. నా ఆట విషయంలో అటు కోచ్.. ఇటు కెప్టెన్ అన్ని వేళలా మద్దతుగా నిలిచారు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ఆడాలని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్లే పరిస్థితులకు తగినట్లుగా ఆడి ఇవాళ అర్ధశతకంతో మెరిశాను. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. జట్టుకు ఏం కావాలో అది చేయడమే నా పని. ఇండియా-ఏ తరఫున మ్యాచ్ ఆడేందుకు పది రోజుల ముందే శ్రీలంకలో అడుగుపెట్టాము. కొలంబోలో ప్రాక్టీస్ చేయడం సహా గాలేలోనూ మ్యాచ్ ఆడాము. దీంతో రెండు వేదికలపై పూర్తి అవగాహన వచ్చింది, అది ఇవాళ బ్యాటింగ్లో రాణించేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాదు ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కూడా ఎంతో దోహదపడింది’’ అని చెప్పుకొచ్చాడు. Gautam Gambhir and Ajit Agarkar keeping an eye on Dhruv Jurel’s 50.He will definitely be in consideration for white-ball cricket. pic.twitter.com/72d1IXjZ2h— AS4 (@lostbeyond777) August 16, 2026చదవండి: భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు -
భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కెషారా నువంతా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్గా కెషారా నిలిచాడు. భారత తొలి ఇన్నింగ్స్లో 39 ఓవర్లు వేసిన కెషారా నువంతా మూడు వికెట్లు తీసి 175 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక లంక తరఫున అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా సూరజ్ రన్దివ్ నిలిచాడు. 2010లో కొలంబో వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో 73 ఓవర్లు వేసిన సూరజ్ రన్దివ్ రికార్డు స్థాయిలో 222 పరుగులు సమర్పించుకున్నాడు. 2025లో గాలే వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టులో తరిందు రత్ననాయకే 49.2 ఓవర్లలో 196 పరుగులు సమర్పించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. 1999లో ఢాకా వేదికగా పాక్తో టెస్టులో ఉపుల్ చందన 47.5 ఓవర్లలో 179 పరుగులిచ్చుకొని మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2020లో సౌతాఫ్రికాతో టెస్టులో 171 పరుగులు సమర్పించుకున్న వనిందు హసరంగ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.టీమిండియా ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం' -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్లో జురెల్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్లో గిల్కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్లో రిషభ్ పంత్కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్జెయింట్స్ ప్రయాణం మొదలై నాలుగేళ్లు అయినప్పటికీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. కానీ హండ్రెడ్ లీగ్లో మాత్రం సంజీవ్ గోయెంకాకు చెందిన మాంచెస్టర్ సూపర్జెయింట్స్ తాము ఆడుతున్న తొలి సీజన్లోనే టైటిల్ సాధించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘‘మా తొలి సీజన్లోనే మేము చాంపియన్స్గా నిలిచాం. కంగ్రాట్స్ మాంచెస్టర్ సూపర్జెయింట్స్. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో మాంచెస్టర్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ విజయం మా సూపర్జెయింట్స్ ఫ్యామిలీకి గర్వకారణం. జట్టు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. టిమ్ సీఫెర్ట్ నిజంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నూర్ అహ్మద్ తన అద్భుత బౌలింగ్తో వికెట్లు పడగొట్టి టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు. జోస్ బట్లర్ కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించడమే గాక అందరిని కలుపుకుపోయి సమిష్టిగా రాణించి టైటిల్ అందించడంలో విజయవంతమయ్యాడు. జోస్తో పాటు ప్రతీ ఆటగాడికి నా ప్రత్యేక అభినందనలు. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’’ అని గోయెంకా ముగించాడు.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గతంలో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరుతో హండ్రెడ్ టోర్నీ ఆడింది. అయితే 2025లో జట్టు అమ్మకానికి వచ్చినప్పుడు సంజీవ్ గోయెంకా 70శాతం పెట్టుబడి పెట్టడంతో జట్టు కాస్తా మాంచెస్టర్ సూపర్జెయింట్స్గా మారిపోయింది. లంకాషైర్ వాటా 30 శాతంగా ఉంది.ఇక ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మంచి ప్రదర్శన చేసింది. తొలి రెండు సీజన్లలో లక్నో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్తో విబేధాలు రావడంతో అతడిని వదులుకుంది. రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్ను కొనుగోలు చేసిన లక్నో సూపర్జెయింట్స్ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ 2025, 2026 సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరడంలో కూడా లక్నో విఫలమైంది. దీంతో పంత్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవికి రాజీనామా కూడా చేశాడు. వచ్చే సీజన్లో పంత్ స్థానంలో ఎవరు కెప్టెన్గా వ్యవహరిస్తారనేది చూడాలి.Sanjiv Goenka used to thank God for every win, now his team won the championship finally in cricket.🏆Congratulations to @DrSanjivGoenka and Manchester Super Giants🎉🎊 pic.twitter.com/qeZNY2U8Sn— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) August 16, 2026 Manchester Super Giants Clinch Maiden Hundred Title, Owner Sanjiv Goenka's Reaction Goes Viral#SanjivGoenka #ManchesterSuperGiants #Hundred https://t.co/k804UhYLHU pic.twitter.com/QxU6W8ILnd— NDTV Sports (@Sports_NDTV) August 17, 2026Read: బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్లో అభిమానులు! -
‘కామన్సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో పడిక్కల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 39 పరుగులతో టచ్లో కనిపించినప్పటికీ మరోసారి నిర్లక్ష్యంతో వికెట్ పారేసుకొని విమర్శలు మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా లంక ఆఫ్ స్పిన్నర్ కెషారా నువంతా తెలివిగా ఫ్లైటెడ్ డెలివరీలు వేసి పంత్ను బోల్తా కొట్టించాడు. దీంతో పంత్ కనీసం కామన్సెన్స్ ఉపయోగించకుండా బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ‘రిషబ్ పంత్ ఔట్ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అతని ఆట విధానమే అలా ఉంటుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే పంత్ కామన్సెన్స్ లేకుండా ఆడడమే. లంక జట్టు కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ కెషారా తెలివిగా ఫ్లైటెడ్ బంతులను డెలివరీ చేశాడు. అప్పటికే మూడుసార్లు కట్షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ విఫలమయ్యాడు. కానీ పంత్ ఇక్కడే కామన్సెన్స్ మరిచిపోయాడు. కొత్త బంతిని ఐదు నుంచి ఆరు ఓవర్ల దాకా జాగ్రత్తగా ఆడాలి. ఇది టెస్టు మ్యాచ్ అన్న సంగతి మరిచిపోయి అనవసర షాట్లకు యత్నించి పంత్ వికెట్ పారేసుకున్నాడు. అతను ఓవర్లోని మొదటి బంతికే అలా దూకుడుగా ఆడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక బ్యాటర్ 150 పరుగుల వద్ద ఉన్నప్పటికీ, కొత్త బంతి వచ్చినప్పుడు మరికొన్ని బంతులు ఆడతాడు. ఆ విషయంలో పంత్ను తప్పుబట్టాల్సిందే. లాజిక్ లేకుండా ఆడుతూ క్రికెట్ పరిజ్ఞానంలో పంత్ చాలా వెనుకబడిపోయాడనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిమానులు కూడా పంత్ నిర్లక్ష్యపు ఆటతీరును విమర్శించారు. పంత్ను పక్కనబెట్టి సర్ఫరాజ్కు అవకాశమివ్వడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రోజు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. సెంచరీ చేసిన పడిక్కల్ (167 పరుగులు) కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేయగా, ధ్రువ్ జురెల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (12), ప్రసిధ్ క్రిష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు పడగొట్టాడు. -
కివీస్ బ్యాటర్ వన్మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్ను ఈజీగా అందుకున్న సూపర్జెయింట్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్రైజర్స్ లీడ్స్ వుమెన్తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్మద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.🔴BIG REALITY CHECK FOR PAT CUMMINS & AUSTRALIA 🤯Before Bangladesh test series:Cummins🎙️: Some of our guys are saying no to half-a-million pounds for 20 days' work to go and play those two Test matches against Bangladesh.🙄After such a confident statement from Pat,… pic.twitter.com/iS79Cmc6tr— Sam (@cricsam02) August 16, 2026🔴PAT CUMMINS BLAMES THE PITCH FOR AUSTRALIA’S LOSS 🤯Cummins🎙️: The pitch was rock hard with a bit of grass, so we thought the first hour might be tough. But after that, it felt like a pretty good batting track.We expected it to crack up in the heat and spin on Days 4 and 5,… pic.twitter.com/BJmiDYGe2L— Sam (@cricsam02) August 16, 2026Read: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్
డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్లో తంజిద్, నజ్ముల్తో పాటు మెహదీ హసన్ కూడా రాణించాడు. బ్యాట్తో మెరిసిన మెహదీ హసన్ ఈసారి బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన మెహదీ హసన్ విజయంలో తన వంతు పాత్రను సమర్ధంగా పోషించాడు.ఈ నేపథ్యంలోనే ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో మెహదీ హసన్ వేసిన ఒక అద్భుత బంతికి వెబ్స్టర్ బిత్తరపోవాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. వెబ్స్టర్ 7వ స్థానంలో బ్యాటింగ్కు రాగా, మెహిదీ హసన్ మీరాజ్ తన ఆఫ్ స్పిన్తో ఆఫ్ స్టంప్ వద్దకు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బంతిని విసిరాడు, బంతి పిచ్ అయి వెంటనే నిటారుగా వికెట్ల వైపు దూసుకొచ్చింది.బ్యూ వెబ్స్టర్ బంతిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లైన్ అండ్ లెంగ్త్ ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో బంతి నేరుగా స్టంప్స్ను తాకడంతో వెబ్స్టర్ ఆశ్చర్యపోయాడు. ఇక తన అద్భుత బంతితో వికెట్ పడగొట్టిన సంతోషంలో మెహదీ హసన్ సంబరాలు షురూ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మూడో బౌలర్గా రికార్డుఇక మ్యాచ్లో మెహదీ హసన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మూడో బంగ్లా బౌలర్గా మెహదీ హసన్ నిలిచాడు. 66 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. హసన్ మహ్ముద్ (6/55), మొహమ్మద్ రఫీఖ్ (5/62) తొలి రెండు స్థానాల్లో నిలిచారు."Hellooooooooooooooooooo" - Kerry O'Keeffe enjoyed that beauty! #AUSvBAN pic.twitter.com/c6lvDgwe2P— cricket.com.au (@cricketcomau) August 16, 2026Read: లైవ్ మ్యాచ్లో వాంతి చేసుకున్న జకోవిచ్.. షాక్లో ఫ్యాన్స్! -
31 ఏళ్లలో ఇదే తొలిసారి.. రికార్డులు బద్దలు కొట్టిన బంగ్లాదేశ్
ఆస్ట్రేలియాను టెస్టుల్లో వారి సొంతగడ్డపైనే మట్టికరిపించిన బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లోనే ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.9 వికెట్లతో విజయం: వికెట్ల పరంగా బంగ్లాదేశ్కు ఇది రెండో అతిపెద్ద టెస్టు విజయం. 2024లో రావల్పిండి వేదికగా పాకిస్తాన్పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.2- బంగ్లాదేశ్కు ఆస్ట్రేలియాపై టెస్టుల్లో ఇది రెండో విజయం. గతంలో 2017 మీర్పూర్ టెస్టులో ఆసీస్ను తొలిసారి ఓడించింది. ఆసీస్ గడ్డపై మాత్రం బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం. అంతేకాదు ఆసీస్ను వారి సొంతగడ్డపైనే ఓడించడం కూడా ఇదే మొదటిసారి. కాగా ఆసీస్తో జరిగిన ఏడు టెస్టుల్లో బంగ్లాకు ఇది రెండో విజయం.SENA: సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో రెండింటి ఓడించిన జట్టుగా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 2022లో మౌంట్ మాంగనుయిలో న్యూజిలాండ్ను చిత్తు చేసిన బంగ్లా తాజాగా ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించింది.👉ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ ఇప్పటివరకు మూడు టెస్టులు మాత్రమే ఆడింది. అయితే కేవలం మూడు టెస్టుల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసిన బంగ్లాదేశ్ ఫీట్ ఆసియా జట్ల పరంగా అత్యంత వేగవంతమైనదిగా నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్కు ఏడు టెస్టుల తర్వాత, భారత్కు 12 టెస్టుల తర్వాత తొలి టెస్టు విజయం దక్కింది. ఈ రెండు దేశాలను బంగ్లాదేశ్ అధిగమించడం విశేషం. మరోవైపు శ్రీలంక మాత్రం ఆసీస్ గడ్డపై 15 టెస్టులు ఆడినప్పటికీ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది.👉1995 తర్వాత ఆస్ట్రేలియాను తమ సొంతగడ్డపై భారత్ కాకుండా మరో ఆసియా జట్టు (బంగ్లాదేశ్) ఓడించడం 31 ఏళ్లలో ఇదే తొలిసారి.👉సొంతగడ్డపై రెండుసార్లు ఆసియా జట్ల (భారత్, బంగ్లాదేశ్) చేతిలో ఓటమి చవిచూసిన తొలి కెప్టెన్గా పాట్ కమిన్స్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 2024లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా తాజాగా బంగ్లాదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది.Historic Win in Darwin! 🇧🇩🔥 Bangladesh beat Australia by 9 wickets to seal a memorable victory in the 1st Test! 🏏🏆#Bangladesh #Tigers #BANvAUS #Cricket pic.twitter.com/PDrWJS8ZEs— Bangladesh Cricket (@BCBtigers) August 16, 2026 HISTORY WRITTENBangladesh becomes the Asian team to take least number of Tests to beat Australia in #Australia 🤯#Banvsaus #Australiancricket #Bangladeshcricket #Cricket #BANVSAUS pic.twitter.com/SE42IBxCbo— PRAKASH (@CHPRAKASH07) August 16, 2026Read: ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం -
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత స్కోరెంతంటే?
Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్దత్త్ పడిక్కల్(167) టాప్ స్కోరర్గా నిలవగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియాటీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్ (11) ఆతర్వాత సుతార్ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన భారత్432 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి ధృవ్ జురెల్ (51) ఔటయ్యాడు. మానవ్ సుతార్ (21)కు జతగా సిరాజ్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా ఆరో వికెట్ డౌన్టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.టీ బ్రేక్కు భారత్ స్కోరెంతంటే?రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు.పడిక్కల్ అవుట్పడిక్కల్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్.. ప్రభాత్ జైసూర్య బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్ స్కోర్: 361/5. క్రీజులో జురెల్(19), జడేజా(1) ఉన్నారుభారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్.. నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్ స్కోర్: 335/4భారత్ మూడో వికెట్ డౌన్భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. కేశర నువాంత బౌలింగ్లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆట తిరిగి ప్రారంభంఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్: 296/2. క్రీజులో పడిక్కల్(133), రిషబ్ పంత్(32) ఉన్నారు.మళ్లీ మొదలైన వర్షంమధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. దంచుతున్న వానలంచ్ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.శాంతించిన వరుణుడు..గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్ను సాపింగ్ చేశారు.👉గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య మొదలైన తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్పై కవర్లను కప్పి ఉంచారు. 👉రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 131 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్ (36 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.👉 అంతకముందు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్తో కలిసి యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్గా వెనుదిరగగా... కెప్టెన్ శుబ్మన్ గిల్ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఏకైక వికెట్ పడగొట్టాడు. -
క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది.తొలి బ్యాటర్గా రికార్డుపడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.Virat Kohli was the only Indian batter to score a century on Republic Day, achieving the feat in 2012, which was also his maiden Test century. 🇮🇳Now, Devdutt Padikkal becomes the only Indian batter to score a century on Independence Day, and it’s his maiden Test century too!… pic.twitter.com/CxgE0Q3VnV— CREX (@Crex_live) August 15, 2026Read: మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్ -
మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ నమ్మకాన్ని ఒక్క శతకంతో పడిక్కల్ నిలబెట్టుకున్నాడు. 'లంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్కు ఎవరు వస్తున్నారు?' అనే ప్రశ్న గిల్కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం తడబడకుండా దేవదత్ పడిక్కల్ పేరును బయటికి చెప్పాడు. మూడో స్థానంలో అంతకంటే మంచి బ్యాటర్ను తాను చూడలేదని, ఈ సిరీస్లో పడిక్కల్ బ్యాటింగ్కు వెన్నుముకలా మారుతాడని గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూపర్ సెంచరీతో గిల్కు నమ్మిన బంటు అయ్యాడు పడిక్కల్.2024లో అనూహ్య పిలుపు..2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్కు ఆ అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్ షాట్లు ఆడిన పడిక్కల్... పేసర్లకు ‘నటరాజ్’ షాట్లతో బదులిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్మార్క్ పంచ్ షాట్లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్తో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ తర్వాత తన స్థానాన్ని భర్తీ చేసేందుకు పడిక్కల్కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తే మాత్రం పడిక్కల్ స్థానానికి ఢోకా ఉండదు.MAIDEN TEST HUNDRED! 💯A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA— BCCI (@BCCI) August 15, 2026Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్! -
నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్కు రాలేకపోయాడు.దీంతో లంకతో టెస్టు సిరీస్కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్నెస్పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు. A worrying moment in Galle. 😟💔KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్స్వీప్ -
ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్స్వీప్
సొంతగడ్డపై ఐర్లాండ్కు భారీ షాక్ తగిలింది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను అఫ్గానిస్తాన్ (ఒక మ్యాచ్ రద్దు) 4-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. రహమత్ షా అజేయ సెంచరీతో చెలరేగి ఆఫ్గన్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన ఐదో వన్డేలో అఫ్గానిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హారీ టెక్టర్ (53) అర్ధసెంచరీతో రాణించగా, లోయర్ ఆర్డర్లో కర్టిస్ కాంఫర్ (96) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. చివర్లో జార్జ్ డాక్రెల్ (31), జోర్డాన్ నీల్ (23 నాటౌట్) రాణించారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 3 వికెట్లు తీయగా, గజన్ఫర్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 48.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు తొందరగానే ఔటైనప్పటికీ వన్డౌన్లో వచ్చిన సేదికుల్లా (98) వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని చేజార్చుకోగా, కెప్టెన్ రహమత్ షా (133 బంతుల్లో 143 నాటౌట్) ఆఖరి దాకా నిలిచి జట్టును గెలిపించాడు. అజ్మతుల్లా (24) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో లియామ్ మెక్కార్తి 3 వికెట్లు తీశాడు.👉వన్డే క్రికెట్లో అఫ్గానిస్తాన్ ఇదే అత్యధిక పరుగుల ఛేదన కాగా, తొలి మ్యాచ్ రద్దు కారణంగా నాలుగు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆఫ్గన్ ఐర్లాండ్ను 4-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక వన్డేల్లో కెప్టెన్గా సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రహ్మత్ షా నిలిచాడు. గతంలో అస్గర్ అఫ్గాన్, షాహిదిలు సెంచరీలు బాదారు. అయితే అఫ్గానిస్తాన్ తరఫున వన్డేల్లో కెప్టెన్గా అత్యధిక వ్యక్తిగత స్కోరును రహ్మత్ షా తన పేరిట లిఖించుకున్నాడు. గతంలో ఈ రికార్డు 2026 జూన్ 20న భారత్పై మ్యాచ్లో షాహిది (102 పరుగులు) పేరిట ఉండేది.👉ఇక వన్డేల్లో అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రహ్మత్ షా ఆరో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఇబ్రహీం జర్దన్ కొనసాగుతున్నాడు. 2025లో లాహోర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఇబ్రహీం జర్దన్ 177 పరుగులు చేశాడు. రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా జర్దన్దే కావడం విశేషం. ఇక మూడో స్థానంలో రహమనుల్లా గుర్బాజ్ (151 పరుగులు) ఉన్నాడు.𝐀𝐅𝐆𝐇𝐀𝐍𝐈𝐒𝐓𝐀𝐍 𝐂𝐎𝐌𝐏𝐋𝐄𝐓𝐄 𝐀 𝟒–𝟎 𝐒𝐄𝐑𝐈𝐄𝐒 𝐕𝐈𝐂𝐓𝐎𝐑𝐘 𝐎𝐕𝐄𝐑 𝐈𝐑𝐄𝐋𝐀𝐍𝐃! 🔥AfghanAtalan produced a magnificent run chase in the fifth and final ODI and successfully chased down Ireland’s 299-run target to secure a six-wicket victory and complete a… pic.twitter.com/VrlXqRlbdu— Afghanistan Cricket Board (@ACBofficials) August 15, 2026 -
రాహుల్ దెబ్బకు మైదానం వీడిన లంక ప్లేయర్!
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు నిషాన్ మదుష్క గాయంతో మైదానం వీడడం కలకలం రేపింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రబాత్ జయసూరియా వేసిన బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో నిషాన్ మదుష్క మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో మైదానంలో కిందపడిపోయిన నిషాన్ వద్దకు ఫిజియో పరిగెత్తుకు వచ్చారు. అయితే నిషాన్ మెడపై బంతి తాకిన ప్రదేశంలో వాపు రావడంతో డాకర్లు వెంటనే అతడిని పెవిలియన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. దీంతో కంకషన్కు గురైన నిషాన్ మదుష్క స్థానంలో సూరియాబండారా సబ్స్టిట్యూట్గా వచ్చాడు. ఒకవేళ నిషాన్ మదుష్క గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే నిషాన్ స్థానంలో సూరియా బండారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఒకవేళ మదుష్క దూరమైతే మాత్రం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇటీవలే ఇండియా-ఏతో జరిగిన అనధికారిక మ్యాచ్లో ఆడిన నిషాన్ 4 ఇన్నింగ్స్లు కలిపి 256 పరుగులు సాధించాడు. అంతేకాదు శ్రీలంక తరఫున టెస్టుల్లో 64.50 సగటుతో పరుగులు సాధించిన మదుష్క ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. గాయంతో నిషాన్ మదుష్క దూరమైతే అతడి స్థానంలో రానున్న పసిందు సూరియబండారా కూడా ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 54.36 సగటుతో 4,893 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులు చేశారు. అంతకముందు జైస్వాల్ (32) రాహుల్తో సమన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు.😳 NASTY BLOW FOR NISHAN MADUSHKA!KL Rahul’s powerful sweep struck Nishan Madushka on the helmet, forcing the Sri Lankan fielder to leave the field. 🏏Hoping Madushka is absolutely fine and back on the field soon! 🙏🇱🇰#INDvsSL pic.twitter.com/MxtoXiJEuC— CricInformer (@CricInformer) August 15, 2026Read: ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్ -
ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ ఆరు వికెట్లతో చెలరేగాడు. తద్వారా టెస్టుల్లో 300 వికెట్ల మార్క్ను అందుకున్న హాజిల్వుడ్ ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన 9వ బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో 14వ సారి ఐదు వికెట్ల హల్ అందుకున్న హాజిల్వుడ్.. ప్రస్తుతం ఆసీస్ జట్టులో 300 వికెట్ల మార్క్ చేరుకున్న నాథన్ లియోన్, కమిన్స్, స్టార్క్ సరసన నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఏడో పేసర్గా హాజిల్వుడ్ నిలిచాడు. గతంలో మెక్గ్రాత్ (563 వికెట్లు), మిచెల్ స్టార్క్ (435 వికెట్లు), డెన్నిస్ లిల్లీ (355 వికెట్లు), పాట్ కమిన్స్ (316 వికెట్లు), మిచెల్ జాన్సన్ (313 వికెట్లు), బ్రెట్ లీ (310) హాజిల్వుడ్ కంటే ముందున్నారు. టెస్టుల్లో 300 వికెట్లు పడగొట్టే క్రమంలో ఆస్ట్రేలియా తరఫున తక్కువ సగటుతో ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలోనూ హాజిల్వుడ్ చోటు సంపాదించాడు. హాజిల్వుడ్ 24.02 సగటుతో 300 వికెట్ల మార్క్ చేరుకోగా, మెక్గ్రాత్ (21.64), కమిన్స్ (22.21), డెన్నిస్ లిల్లీ (23.92) ముందున్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 426 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తంజిద్ హసన్ (101) సెంచరీతో చెలరేగగా, నజ్ముల్ (84) రాణించాడు. మూడో రోజు ఆటలో మెహదీ హసన్ (65) అర్ధశతకం సాధించడంతో బంగ్లా 400 పరుగుల మార్క్ను దాటింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 228 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్వుడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్, లియోన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. స్మిత్ (37), గ్రీన్ (6) క్రీజులో ఉన్నారు. ఆసీస్ మరో 131 పరుగులు వెనుకబడి ఉంది.Josh Hazlewood joins an elite club - he becomes the 7th Australian pacer and 9th Australian bowler overall to 300 Test wickets 👏#AUSvBAN pic.twitter.com/Yag1VUY34k— Cricbuzz (@cricbuzz) August 15, 2026Josh Hazlewood also bagged his 14th fifer in Tests with his 300th scalp 🔥pic.twitter.com/7S6oFzafUq https://t.co/JB4JIGl9b7— Cricbuzz (@cricbuzz) August 15, 2026చదవండి: అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్లైన్ అప్పుడే! -
IND vs SL: తొలి రోజు భారత్దే
Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు.శుబ్మన్ గిల్ అవుట్61.5: ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్గా వెనుదిరిగిన గిల్ (16). స్కోరు 236-2. పడిక్కల్ 107 పరుగులతో ఉన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.పడిక్కల్ సెంచరీటీమిండియా వన్డౌన్బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్ 106, గిల్ 16 పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్కు గాయంటీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్ గిల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీటీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 166/1. క్రీజులో రాహుల్(53), పడిక్కల్(78) ఉన్నారు.పడిక్కల్ హాఫ్ సెంచరీదేవ్దత్త్ పడిక్కల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్తో పాటు రాహుల్(41) ఉన్నాడు.తిరిగి మొదలైన ఆట2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్లో విజయం సాధించాలని శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026 టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU— BCCI (@BCCI) August 15, 2026 -
లైవ్ మ్యాచ్లో ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్.. లక్ష జరిమానా!
తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగా, తన ప్రియురాలికి ఒక యువ బ్యాటర్ ఫోన్లో టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనలను ఉల్లంఘించినందుకు, సదరు యువ బ్యాటర్కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) రూ. 1 లక్ష జరిమానా విధించింది. ‘‘విచారణ కొనసాగుతున్నందున తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆటగాడి పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘జరిమానా విధించిన ఆటగాడు ఎడమచేతి వాటం బ్యాటర్ అని, గతేడాది రంజీ ట్రోఫీలో తమిళనాడు తరఫున రెండు అర్ధశతకాలు సాధించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అతను తన ప్రియురాలికి టెక్ట్స్ మెసేజ్లు పంపుతూ కనిపించాడు. ఇది ఎలాంటి అవినీతి ఆరోపణల కిందకు రానప్పటికీ, మ్యాచ్ జరుగుతున్నప్పుడు PMOAలో మొబైల్ ఫోన్ వాడటం నిషేధం. అందువల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే అతడికి లక్ష జరిమానా విధించాం" అని సీనియర్ అధికారి పేర్కొన్నాడు. మొదట యువ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించాలనుకున్నప్పటికీ, నేరం పెద్దది కాకపోవడంతో జరిమానాతో సరిపెట్టారు.ఐపీఎల్ 2026 సీజన్లో, రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం అప్పట్లో సంచలనం కలిగించింది. రోమీ భిందర్ పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా అతడి ఫోన్ చూస్తుండడం వైరల్గా మారింది. దీంతో మ్యాచ్ జరుగున్న సమయంలో ఫోన్ చూడడం పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. దీంతో బీసీసీఐ పీఎంవోఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. రోమీ భిందర్కు లక్ష జరిమానా విధించిన బీసీసీఐ వైభవ్ను మాత్రం హెచ్చరికలతో సరిపెట్టింది. -
సన్రైజర్స్ కొంపముంచిన క్లాసెన్.. ఫైనల్లో సూపర్ జెయింట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్రైజర్స్ లీడ్స్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్కు విక్టరీని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సన్రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది. సూపర్జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్తో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్లో మాత్రం సన్రైజర్స్కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.ఫైనల్లో సన్రైజర్స్ వుమెన్ టీంమరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో మాత్రం సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్తో సన్రైజర్స్ తలపడనుంది.SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026 -
‘సారథ్యం భారం కాదు.. ఈ టెస్టు మ్యాచ్ నాకు ప్రత్యేకం’
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అదే ప్రధాన లక్ష్యం... కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం. అరుదైన 600వ టెస్టు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్కు విరాట్ కోహ్లి కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్లు స్పిన్కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం. ప్రసిధ్కే మొగ్గు... ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు. అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. నైపుణ్యానికి కొదవలేదు... జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ ఫార్మాట్లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రిస్క్ తీసుకోలేం... ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్నెస్ తప్పనిసరి. టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే.


