breaking news
National
-
‘సమానత’లో భారత్ ఘనత
న్యూఢిల్లీ: 2011–12 కాలం నుంచి చూస్తే 2022–23 నాటికి భారత్లో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ కీర్తించింది. అత్యంత పేదరికం స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్లో 2011–12 కాలంలో 16.2 శాతంగా ఉన్న ‘అత్యంత పేదరికం’.. 2022–23 ఏడాదికల్లా ఏకంగా 2.3 శాతానికి తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో భారత్లో చేపట్టిన పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా ఇంతటి మార్పు సాధ్యమైందని నివేదిక వ్యాఖ్యానించింది. సమానత్వం విషయంలో స్లోవాక్ రిపబ్లిక్(24.1), స్లోవేనియా(24.3), బెలారస్ (24.4)దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గినీ ఇండెక్స్ స్కోర్లో చైనా, అమెరికా, బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 25.5 స్కోర్తో భారత్ ప్రపంచంలో నాలుగో అత్యుత్తమ సమానత్వ దేశంగా ఆవిర్భవించిందని ప్రపంచబ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణీ అవుతోందన్న దానిని పరిగణనలోకి సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్ స్కోర్ను ఇస్తారు. ఇండెక్స్ స్కోర్గా సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. 98 స్కోర్ వస్తే దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు కడు పేదరికంలో ఉన్నట్లు అర్థం. 167 దేశాల స్కోర్లను ప్రపంచబ్యాంక్ ప్రకటించగా చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. 25.5 స్కోర్తో భారత్ అసమానత కేటగిరీ(25–30)లో దిగువ స్థాయిలో నిలిచింది. నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు కోరల నుంచి బయటపడ్డారు. తక్కువ అసమానతల కేటగిరీలో దాదాపు 30 దేశాలున్నాయి. ఇందులో పటిష్టమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న కొన్ని యురోపియన్ దేశాలు సైతం ఉన్నాయి. వీటిలో ఐస్ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియంలతోపాటు అభివృద్దిచెందుతున్న దేశం పోలండ్, సంపన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. -
ఆ ప్రబుద్ధుడిపై కోర్టు ధిక్కరణ చర్యలు!
అహ్మదాబాద్: ఇంట్లో టాయిలెట్ సీటుపై కూర్చొని న్యాయస్థానంలో జరిగిన విచారణకు వర్చువల్గా హాజరైన వ్యక్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ ఆరోపణల కింద ఆ ప్రబుద్ధుడిపై సుమోటోగా విచారణ ప్రారంభించింది. జూన్ 20వ తేదీన కోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్.దేశాయ్ ఓ కేసులో విచారణ చేపట్టారు. ఇందులో కక్షిదారుగా ఉన్న ఓ వ్యక్తి పసుపు రంగు టి–షర్టు ధరించి ఇంటి నుంచే వర్చువల్గా హాజరయ్యాడు. కానీ, టాయిలెట్ సీటుపై కూర్చొని మాట్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వ్యక్తిని సూరత్ జిల్లాలోని కిమ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమద్గా గుర్తించారు. అతడి ప్రవర్తనపై జస్టిస్ ఏఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్టీ వచానీతో కూడిన డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. వీడియోలో అభ్యంతరకరంగా కనిపించిన అబ్దుల్ సమద్పై సుమోటోగా విచారణ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఎందుకు విచారణ జరిపి శిక్షించకూడదో ప్రశి్నస్తూ అతడికి నోటీసు జారీ చేయాలని పేర్కొంది. ఈ ఉత్తర్వును తాజాగా హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. అబ్దుల్ సమద్ ప్రవర్తన దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. సంబంధిత వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని స్పష్టంచేసింది. కోవిడ్–19 మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి లాయర్లు, కక్షిదారులు వర్చువల్గా విచారణకు హాజరయ్యేందుకు గుజరాత్ హైకోర్టు అనుమతి ఇస్తోంది. అంతేకాకుండా హైకోర్టులో జరిగే విచారణను కోర్టు యూట్యూబ్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు. -
బిహార్ యువతపై ఎన్నికల గాలం..!
సాక్షి, న్యూఢిల్లీ: మరో మూడు, నాలుగు నెలల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు అత్యంత కీలకంగా మారారు. దీంతో, వానిపి ఆకట్టుకునేందుకు అధికార జేడీయూతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్లు పోటీ పడుతున్నాయి. ఎన్నికల తాయిలాలతో వారికి గాలం వేసేందుకు తాపత్రయపడుతున్నాయి. కోటిన్నర మందికి పైగా ఉన్న యువ ఓటర్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లు కొన్ని సర్వేలు తేల్చాయి. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయిన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ప్రభుత్వం యువతకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ప్రకటించింది. వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. యువతపై హామీల వాన బిహార్లో ఉన్న 243 నియోజకవర్గాలు, 8 కోట్ల ఓటర్లలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంది. కొత్తగా నమోదైన ఓటర్లే 18 లక్షల వరకు ఉన్నారు. 18–35 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్ల సంఖ్య మొత్తం 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వయస్సు వారిలో 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్బంధన్కు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ వైపు కేవలం 0.76 శాతం మంది మాత్రమే అనుకూలంగా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి అభ్యరి్థగా తేజస్వీ యాదవ్ తన పోటీదారుల కంటే బలమైన ఆధిక్యంలో ఉన్నారు. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ.4.000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ.5,000, ఇంటర్న్షిప్లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటే 2025–26 నుంచి 2030–31 వరకు రాష్ట్రంలోని లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్షిప్లు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకే ఏటా రూ.685 కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అదనంగా యువతకు అధునాతన నైపుణ్యాలు, మెరుగైన ఉపాధి, నాయకత్వ అభివృద్ధి, బలమైన నెట్వర్కింగ్, కెరీర్ మెరుగుదలకు కొత్త అవకాశాలను అందించేందుకు అనేక పథకాలను ప్రకటించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వితంతువులు, వృద్ధాప్య పింఛన్ను రూ.400 నుంచి రూ.1,100కు పెంచారు. దీనిని ఎదుర్కొని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్జేడీ నేత తేజస్వీయాదÐవ్ ‘ఛత్ర యువ సంసద్’కార్యక్రమాలతో యువత మధ్యకు వెళుతున్నారు. తాము అధికారంలోకి వస్తే యువజన కమిషన్ను ఏర్పాటు చేస్తామని, పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను అందిస్తామని ప్రకటించారు. సైన్స్, గణితం, ఇంగ్లిష్లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇలా రెండు పార్టీల కీలక ¯óతలు యువతను ఆకట్టుకునే ఏర్పాట్లలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు సైతం యువ ఓటర్లకు గాలం వేసేందుకు తన ప్రయత్నాలను మొదలుపెట్టాయి. -
మరో 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నా
ధర్మశాల: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటిస్తారన్న వార్తలకు చెక్పెడుతూ దలైలామా శనివారం తన మనసులో మాట వెల్లడించారు. మరో 30–40 ఏళ్లు జీవించాలనే ఆశ ఉందని, తుదిశ్వాస వరకు బుద్ధుని బోధనలను శక్తివంచలేకుండా వ్యాప్తి చెందిస్తానని ఆయన ప్రకటించారు. జీవించి ఉన్నంతకాలం తానే లామాగా కొనసాగుతానని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆదివారం తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోని సుగ్లాగ్ఖాంగ్ ఆలయంలో దలైలామా ఆయుష్ష బాగుండాలంటూ శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శక్తిస్వరూపిణిగా పేర్కొనే ‘ఒరాకిల్’.. దలైలామా చెంతకొచ్చి ఆయనను ఆశీర్వదించింది. ఒరాకిల్ ఆవాహనను ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మీడియాతో మాట్లాడారు. ‘‘కాలజ్ఞానం నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తోంది. నాపై అవలోకితేశ్వర ఆశీస్సులు కురుస్తున్నట్లు తోస్తోంది. ఇప్పటికే నా శాయశక్తులా కృషిచేశా. ఇలా బుద్దుని బోధనలను వ్యాప్తి చెందించేందుకు నేను మరో 30–40 సంవత్సరాలు జీవించాలని ఆశ పడుతున్నా. నాపై అవలోకితేశ్వర ప్రభావం చిన్నతనం నుంచే ఉంది. బౌద్ధధర్మాన్ని మరికొంత కాలం ప్రపంచానికి చాటిచెబుతా. అందులోభాగంగానే 130 ఏళ్లు వచ్చేవరకు జీవిస్తాననే భావిస్తున్నా’’అని అన్నారు. -
ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి!
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ను నిర్వహించాలనుకున్న భారత్ ఆశలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నీళ్లుచల్లింది. ఈ విషయంలో భారత్కు ‘కనువిప్పు’ కలిగే రీతిలో సుతిమెత్తగా మందలించింది. ముందు మీ ‘ఇంటి’ని చక్కదిద్దుకోవాలంటూ చురకలంటించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సంస్థాగత పాలనా వైఫల్యాలు, లోపాలు, అవినీతి తాండవిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని సరిదిద్దుకోవాలంటూ హితవు పలికింది. అలాగే ఒలింపిక్స్లో భారత ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలు, డోపింగ్లో వారు పట్టుబడుతున్న వ్యవహారాలపైనా దృష్టిసారించాలని సూచించింది. స్విట్జర్లాండ్లోని లుసానేలో ఇటీవల నిర్వహించిన సమావేశానికి హాజరైన గుజరాత్ హోం, క్రీడల మంత్రి హర్‡్ష సంఘ్వీ, ఒకప్పటి భారత పరుగుల రాణి, ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందానికి ఐఓసీ తేలి్చచెప్పింది. ఐఓసీతో చర్చల్లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికతోపాటు పలు ఆంగ్ల వార్తా వెబ్సైట్లు ఈ మేరకు కథనాలు ప్రచురించాయి. అయితే భవిష్యత్తులో విశ్వక్రీడల నిర్వహణ కోసం భారత్ తన ప్రయత్నాలను కొనసాగించొచ్చని ఐఓసీ సూచించింది. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్లో భారత్ రూ. 470 కోట్ల ఖర్చుచేసి 117 మంది క్రీడాకారులను పంపినప్పటికీ మనకు కేవలం 6 పతకాలే లభించాయి. దీనికితోడు స్పాన్సర్షిప్ ఒప్పందాలు, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఐఓఏకు అందించే గ్రాంట్లను ఐఓసీ గతేడాది అక్టోబర్ నుంచి నిలిపేసింది. మరోవైపు ఐఓఏ సీఈవోగా రఘురాం అయ్యర్ నియామకంపై అంతర్గతంగా కుమ్ములాటలు నెలకొన్నాయి. కాగా, ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 2023 నాటి గణాంకాల ప్రకారం డోపింగ్ కేసుల్లో అత్యధికం భారత్వే. అర్హతలు ఉన్నా ఇవేం వ్యాఖ్యలు.. భారత్లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఐవోసీ కావాలనే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తోందని భారత ప్రతినిధి బృందం వ్యాఖ్యానిస్తోంది. భారత్లో వందలాది మంది క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నారని.. వారంతా ప్రతిభావంతులేనని స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ కమిటీ దృష్టికి ఐవోఏ తీసికెళ్లినట్లు తెలిసింది. మరోసారి జరిగే సమావేశంలో ఈ అంశంపై తాము చర్చిస్తామని భారత కమిటీ పేర్కొంది. -
పటౌడీ కుటుంబానికి షాక్
జబల్పూర్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్తోపాటు ఆయన కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగలింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులకు వారసులు ఎవరన్నదానిపై మళ్లీ విచారణ చేపట్టాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఏడాదిలోగా విచారణ పూర్తిచేయాలని నిర్దేశించింది. ఆ ఆస్తులు పటౌడీ కుటుంబానికి (సైఫ్ అలీఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా అలీఖాన్, సబా అలీఖాన్) చెందుతాయంటూ 20 ఏళ్ల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, డిక్రీని హైకోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ ద్వివేదితో కూడిన సింగిల్ బెంచ్ జూన్ 30న ఉత్తర్వు జారీ చేసింది. రూ.15,000 కోట్ల ఆస్తులకు వారసులు ఎవరో గుర్తించడానికి మళ్లీ విచారణ జరపాల్సిందేనని ట్రయల్ కోర్టుకు స్పష్టంచేసింది. అసలు ఏమిటీ వివాదం? భోపాల్ సంస్థానానికి చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా. ఆయనకు భార్య మైమూనా సుల్తాన్, ముగ్గురు కుమార్తెలు అబీదా, సాజీదా, రబియా ఉన్నారు. సాజీదా పటౌడీ సంస్థాన వారసుడు ఇఫ్తికార్ అలీఖాన్ను పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడే మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఆయన క్రికెటర్గా పేరుప్రఖ్యాతలు సంపాదించారు. బాలీవుడ్ నటి షర్మీలా ఠాగూర్ను ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి సైఫ్ అలీఖాన్, సోహా అలీఖాన్, సబా అలీఖాన్ జని్మంచారు. నవాబ్ హమీదుల్లా పెద్ద కుమార్తె అబీదా దేశ విభజన సమయంలో పాకిస్తాన్కు వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. దాంతో సాజీదా భోపాల్లోని ఆస్తులకు వారసురాలయ్యారు. అనంతరం మన్సూర్ అలీఖాన్కు.. సైఫ్ అలీఖాన్, ఆయన సోదరీమణులకు ఆ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. దివంగత నవాబ్ హమీదుల్లా కుటుంబ సభ్యులైన బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు 1999లో కోర్టుకెక్కారు. ఆస్తుల్లో తమకు వాటా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వారి విజ్ఞప్తిని భోపాల్ జిల్లా కోర్టు తిరస్కరించింది. ఆస్తులకు పటౌడీ కుటుంబమే యజమాని అంటూ 2000 ఫిబ్రవరి 14న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బేగం సురయ్యా రషీద్, నవాబ్ మెహర్ తేజ్ సాజీదా తదితరులు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నవాబ్ హమీదుల్లా వారసురాలిగా సాజీదాను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1962 జనవరి 10 సరి్టఫికెట్ జారీ చేసిందని, ఆ ఆస్తులన్నీ తమకే చెందుతాయని పటౌడీ కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు. ఈ వాదనను పిటిషనర్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు ప్రాథమికంగా 1999లో దాఖలయ్యాయి కాబట్టి మళ్లీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. -
శుభాంశు బిజీబిజీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్ఎస్లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు. నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్బేర్ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది. శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్ఎస్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు. -
వైవిధ్యమైన వాణిజ్యం
బ్యూనస్ ఎయిర్స్: తమ ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ నిర్ణయించుకున్నారు. అలాగే రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారు. మోదీ, జేవియర్ మిల్లీ శనివారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకొనేలా రెండు దేశాల నడుమ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రెండు దేశాల వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని మోదీ, జేవియర్ మిల్లీ తీర్మానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అర్జెంటీనాకు చేరుకున్నారు. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటిసారి. జేవియర్ మిల్లీతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యవసాయం, రక్షణ, ఇంధనంతోపాటు పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించామని తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, క్రీడలు తదితర రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేవియర్తో మిల్లీతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. భారత్–అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరుదేశాల ఉమ్మడి ప్రయాణం మరింత అర్థవంతంగా, ప్రగతిశీలకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు అంగీకరించారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అధికారులతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మారి్టన్ స్మారకం వద్ద మోదీ నివాళులరి్పంచారు. భారత్–అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా చక్కటి మైత్రి కొనసాగుతోంది. 2019లో అప్పటి అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రీ ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖణిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. -
ఒంటె కన్నీటి చుక్క విషానికి విరుగుడు!
బికనీర్: లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. దానిని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కల్గుతుంది. పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరికీ రక్షణగా సైతం నిలుస్తాయని తాజా అధ్యయనమొకటి గట్టిగా నమ్ముతోంది. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందని ఒక పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది. ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లే»ొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్లు చెబుతున్నారు. బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసంచేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు. ఎలా కనిపెట్టారు? ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనంచేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాముకాటు విరుగుడు తయారుచేస్తారు. అలా తయారుచేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటిలో యాంటీబాడీ పాళ్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రపంచస్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్, బికనీర్లో జరిగిన స్థాయిలో అన్నిచోట్లా పరిశోధనలు సత్ఫలితాలనిస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. భారత్లో ఏటా వేలాది మంది పాముకాటు కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే. -
ఖరీదైనవే కొంటున్నారు..
భారతదేశంలో ‘మాస్–మార్కెట్’ అన్నది క్రమంగా ‘పాష్–మార్కెట్’గా మారుతోంది. టీవీలు, స్మార్ట్ఫోన్లు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనేందుకు వినియోగదారులు ‘ఉన్నంతలోనే’ సరిపెట్టుకోవటం లేదు. ఖరీదైనవాటిని కొనడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఏడాదిలో ఖరీదైన కార్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లు, ద్విచక్ర వాహనాలు అమ్మకాలు గతేడాదితో పోలిస్తే పెరగడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్2025 జనవరి – ఏప్రిల్ మధ్య మొత్తం స్థూల అమ్మకాల్లో ఖరీదైన టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 5 శాతం పెరిగినట్లు కన్జ్యూమర్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘నీల్సన్ఐక్యూ’ వెల్లడించింది. 2025 తొలి నాలుగు నెలల్లో 55 అంగుళాల 4కె రిజల్యూషన్ టీవీల అమ్మకాలు.. మొత్తం టీవీల మార్కెట్ అమ్మకాలలో 41 శాతం. గత ఏడాది ఇదే కాలానికి ఇది 38 శాతం. అలాగే 8 కిలోలు, ఆపై సామర్థ్యం గల ఫ్రంట్–లోడింగ్ వాషింగ్ మెషీన్ల అమ్మకాలు 11 నుండి 16 శాతానికి, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు 9 శాతం 10 శాతానికి పెరిగాయని ‘నీల్సన్ ఐక్యూ’ తెలిపింది. ఫోనంటే అల్ట్రా ప్రీమియమే! ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ సంస్థ డేటా ప్రకారం స్మార్ట్ఫోన్ లలో ఈ ఏడాది జనవరి–మే మధ్యకాలంలో రూ.45,000కుపైగా ధర ఉన్న అల్ట్రా ప్రీమియం సెగ్మెంట్లో 20 శాతం, రూ. 30,000కుపైగా ధర ఉన్న ప్రీమియం సెగ్మెంట్లో 2 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ధోరణి అన్ని రకాల ఉత్పత్తుల సగటు అమ్మకపు ధర (ఎ.ఎస్.పి.) పెరగటానికి దోహదపడింది. స్మార్ట్ఫోన్ లలో ఈ ఎ.ఎస్.పి. ఈ ఏడాదిలో మొదటిసారిగా రూ.26 వేలకు చేరుకుంది. గతేడాది ఇది రూ.25వేలు. ధర తక్కువ కార్ల స్పీడు తగ్గిందిమరోవైపు – దిగువ, మధ్య ఆదాయ తరగతుల వారు.. తమ వేతనాల్లో తక్కువ పెరుగుదల, ద్రవ్యోల్బణం కారణంగా ఎంట్రీ–టు–మిడ్ సెగ్మెంట్ ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవటంతో ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం ఎలక్ట్రానిక్స్, కార్ల మార్కెట్లలో అమ్మకాలు స్పల్పంగా తగ్గాయి. ఫలితంగా, మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కార్ల అమ్మకాలు జనవరి–మే కాలంలో.. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా 51.4 శాతానికి పడిపోయాయని ‘జాటో డైనమిక్స్’ రిసెర్చ్ సంస్థ తెలిపింది. 2024 మొదటి 5 నెలల్లో ఇది 53.4 శాతం.పుంజుకోనున్న అమ్మకాలు» ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావటం, రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించటం, ఈ ఆర్థిక సంవత్సరం నుండి ఆదాయపు పన్ను రేట్లు తగ్గటం వంటి కారణాల వల్ల రాబోయే నెలల్లో అమ్మకాలు పుంజుకుంటాయని మార్కెటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. » అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ ఉన్న హై–ఎండ్ కార్ల అమ్మకాల వాటా 2023లో 2.8 శాతంగా ఉండగా, 2024లో ఐదింతలు పెరిగి 15 శాతానికి చేరుకుంది.» రూ.10 లక్షలకు పైగా ధర గల కార్ల అమ్మకాలు 2020తో పోలిస్తే.. ఈ ఏడాదిలో ఇప్పటికే సుమారు రెండింతలయ్యాయి. మొత్తం కార్ల అమ్మకాల్లో 2020లో ఇవి 25 శాతమే. 2024లో 47 శాతానికి పెరిగాయి.» ఈ ఏడాది కార్ల మార్కెట్ స్వల్పంగా తగ్గటంతో పాటు, గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్ల అమ్మకాలు క్షీణతను చవి చూడటంతో మొత్తంగా ఎలక్ట్రానిక్ అమ్మకాలు 10 శాతానికి పైగా పడిపోయాయి. అయితే అదే సమయంలో కన్సూ్యమర్ ఫైనాన్స్ వచ్చి, ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. -
సుప్రీంలో ఓబీసీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగుల నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్లు కల్పించారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. సుప్రీంకోర్టు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) సైతం రిజర్వేషన్లు కల్పించింది. సుప్రీంకోర్టులో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అలాగే దివ్యాంగులు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన వారికి సైతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఇందుకోసం సుప్రీంకోర్టు ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్(కండీషన్స్ ఆఫ్ సరీ్వస్ అండ్ కాండక్ట్) రూల్స్లో సవరణ చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేశారు. రిజర్వేషన్లు కల్పించే విషయలో రాజ్యాంగంలోని ఆరి్టకల్ 146 క్లాజ్(2) ద్వారా సంక్రమించిన అధికారాలను ఆయన ఉపయోగించుకున్నారు. -
ఒకే గోడ.. 4 లీటర్ల పెయింట్.. 233 మంది కార్మికులు
భోపాల్: దేశంలో రకరకాలుగా అక్రమాలు, మోసాలు జరుగుతున్నాయి. కానీ, ఇంతటి విడ్డూరాన్ని ఎన్నడూ చూడలేదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం. మధ్యప్రదేశ్లోని షహ్డోల్ జిల్లాలో వెలుగుచూసిందీ అంకెల గారడీ. బియోహరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సకండి గ్రామ ప్రభుత్వ పాఠశాల గోడకు నాలుగు లీటర్ల రంగు వేసేందుకు ఏకంగా 168 మంది కూలీలు, 65 మంది తాపీ పనివారిని వినియోగించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ రూ.1.07 లక్షల బిల్లు చేశాడు. ఎలాంటి పరిశీలనలు లేకుండానే అధికారులు సంతకాలు చేయడం, నగదు డ్రా చేసుకోవడం జరిగిపోయాయి. ఇలాంటిదే మరోటి..నిపనియా గ్రామంలోని స్కూలుకు 10 కిటికీలు, నాలుగు తలుపులకు 20 లీటర్ల రంగు వేసేందుకు 275 మంది కార్మీకులను, 150 మంది తాపీ పనివారిని పెట్టుకున్నారట. వీరికోసం కాంట్రాక్టర్ రూ.2.3 లక్షల మేర బిల్లు కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఓకే చెప్పేశారు. స్కూలు భవనం గోడలపై కనిపించాల్సిన వీరి పనితనం..ఉత్తుత్తి లెక్కలు రాయడంలో రాటుదేలింది. సుధాకర్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఇలాంటి కాకి లెక్కలు చూపి మే 5వ తేదీన బిల్లు చేసింది. ఈ బిల్లును ఏప్రిల్ 4వ తేదీనే స్కూలు ప్రిన్సిపాల్ ఓకే చేసినట్లు రికార్డుల్లో ఉంది. రంగు వేయడానికి ముందు, తర్వాత ఫొటోలను బిల్లులకు జత చేయడం తప్పనిసరి. ఏ ఫొటోలు లేకుండానే ఈ కంపెనీకి బిల్లులు మంజూరైపోవడం మరో ఘనత. బిల్లుల వ్యవహారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ మర్పంచి స్పందిస్తూ... సకండి, నిపనియా స్కూళ్లకు వేసిన రంగుల బిల్లు వ్యవహారం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దర్యాప్తు చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలుతీసుకుంటాం’అంటూ ముక్తసరిగా చెప్పేయడం విశేషం. -
బీఐఎస్ గుర్తింపు లేని హెల్మెట్లు వాడొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో వాహనదారుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం బీఐఎస్ గుర్తింపు గల ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు మాత్రమే వాడాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. నాణ్యతలేని హెల్మెట్లు ప్రమాదాల సమయంలోరక్షణ కలి్పంచలేకపోవటంతో ప్రాణనష్టం పెరుగుతోందని తెలిపింది. దేశంలో ద్విచక్ర వాహనాల సంఖ్య ఇప్పటికే 21 కోట్లకు పైగా ఉంది. ఈ వాహనదారుల భద్రతకు నాణ్యమైన హెల్మెట్లు కీలకం. అందుకే 2021 నుంచే బీఐఎస్ ప్రమాణం ఐఎస్ 4151:2015 కింద ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లు వాడటం తప్పనిసరి చేసింది. అయితే, రహదారుల పక్కన, స్థానిక మార్కెట్లలో నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు అధికంగా విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 176 మందికే లైసెన్సులు హెల్మెట్ల నాణ్యత విషయంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠినంగా వ్వహరిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బీఐఎస్ 30కి పైగా సెర్చ్ అండ్ సీజ్ దాడులు నిర్వహించింది. ఒక్క ఢిల్లీ నగరంలోనే లైసెన్స్ లేకుండా నాణ్యత లేని హెల్మెట్లు తయారు చేస్తున్న 9 మంది తయారీదారుల నుంచి 2,500లకు పైగా హెల్మెట్లు స్వా«దీనం చేసుకుంది. 17 రిటైల్, రోడ్సైడ్ దుకాణాల్లో సుమారు 500 నాణ్యత లేని హెల్మెట్లు సీజ్ చేశారు. ప్రస్తుతం దేశంలో 176 మంది తయారీదారులకు మాత్రమే బీఐఎస్ నుంచి హెల్మెట్ల తయారీకి లైసెన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జిల్లాధికారులు, కలెక్టర్లు హెల్మెట్ల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి, నిబంధనలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటికే చెన్నైలో ‘మానక్ మిత్ర’వలంటీర్ల ద్వారా ‘క్వాలిటీ కనెక్ట్’క్యాంపెయిన్ నిర్వహించి వినియోగదారులకు బీఐఎస్ గుర్తింపుపై ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
రెండేళ్లు ఎస్సైగా ట్రైనింగ్.. కట్ చేస్తే కటకటాల్లోకి!
రెండేళ్లు పోలీస్ అకాడమీలో ఎస్సైగా శిక్షణ తీసుకుంది. అకాడమీకి వచ్చే ఉన్నతాధికారులతో సరదాగా మాటలు కలిపింది. డైనమిక్ యంగ్ ఆఫీసర్ అంటూ వాళ్లు కూడా ఆమెను అభినందించేవాళ్లు. అంతేకాదు.. యూనిఫారమ్లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకుని సంబురపడిపోయేది. కట్ చేస్తే.. ఇప్పుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతోంది. జైపూర్లోని రాజస్థాన్ పోలీస్ అకాడమీ(RPA)లో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ పొందిన మోనా అలియాస్ మూలీ దేవి(Mooli Devi) ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మోనా బుగాలియా 2021లో ఎస్సై ఎగ్జామ్స్ రాసింది. క్వాలిఫై కాలేకపోయింది. దీంతో దొడ్డిదోవ ఎంచుకుంది. మూలీ దేవి అనే పేరుతో ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు సృష్టించి అకాడమీలో ప్రవేశించింది. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్గా తనను తాను అందరికి పరిచయం చేసుకుంది. అలా అకాడమీ పెద్దలనే బోల్తా కొట్టించి.. రెండేళ్లపాటు అధికారికంగా శిక్షణ పొందింది. ఈ రెండేళ్లలో.. అక్కడికి వచ్చే ఉన్నతాధికారులతో టెన్నిస్ ఆడుతూ ఫొటోలు దిగడమే కాకుండా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రైనింగ్ గ్రూప్లలో యాక్టివ్ మెంబర్గా ఉంటూ వచ్చింది. యూనిఫామ్లో రీల్స్ చేయడమే కాకుండా.. మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చేది. అయితే.. ఆమె ఎప్పుడూ ప్రధాన గేట్ ద్వారా కాకుండా.. అధికారుల కుటుంబాలకు ప్రత్యేకంగా ఉన్న గేట్ ద్వారా అకాడమీకి ప్రవేశించేది. ఈ వీఐపీ వేషాలపై 2023లో కొంతమంది ట్రైనీలకు అనుమానం వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లగా.. విచారణలో అసలు విషయం బయటపడింది. రెండేళ్లపాటు పరారీలో ఉన్న ఆమెను.. ఇవాళ(జూలై 5న) సికర్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి మూడు యూనిఫామ్లతో పాటు నకిలీ గుర్తింపు పత్రాలు, పోలీస్ అకాడమీకి సంబంధించిన పరీక్షా పత్రాలు స్వాధీనపర్చుకున్నారు. మోనా బుగాలియా స్వస్థలం నాగౌర్ జిల్లా అని, ఆమె తండ్రి లారీ డ్రైవర్ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుగా తన గౌరవాన్ని పెంచుకునేందుకు, తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకునేందుకే తాను ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందని ఆమె అంటోంది. మరోవైపు ఈ ఘటనతో పోలీస్ అకాడమీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండా ఎలా శిక్షణకు అనుమతించారని మండిపడుతున్నారు పలువురు. అయితే అత్యంత భద్రత కలిగిన అకాడమీలో ఇలా నకిలీ పత్రాలతో ప్రవేశించడం అంత సులువైన పని కాదని.. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
పుష్ప సినిమా నేనూ చూశా.. గడ్డం ఉంటే డైలాగూ కొట్టేవాడిని!
శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రే(Uddhav Thackeray) భావోద్వేగానికి లోనయ్యారు. శనివారం ముంబై వేదికగా జరిగిన శివసేన-ఎంఎన్ఎస్ కార్యక్రమంలో ఇది చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్ఫ సినిమాలోని డైలాగులను ఆయన తన ప్రసంగంలో రిఫరెన్స్లుగా వాడారు.ముంబై: సుమారు 20 ఏళ్ల తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్థాక్రేతో కలిసి రాజకీయ వేదిక పంచుకున్న ఉద్దవ్ థాక్రే.. భావోద్వేగానికి గురయ్యారు. శనివారం ముంబైలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం కోసం ఆత్రుతగా ఎదురు చూశా. రాజ్ అద్భుతంగా మాట్లాడాడు. ఇంక నేనేం మాట్లాడక్కర్లేదనుకుంటున్న. ఒక్కటి మాత్రం చెప్పదల్చుకున్నా. మా మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి ఇక్కడికి వచ్చాం. అధికారం రావొచ్చు.. పోవొచ్చు. కానీ, కలిసి ఉంటేనే బలం అని చాటి చెప్పడానికి వచ్చాం. ఒక్కటి కలిసి ఉండేందుకు మేం ఒక్కటయ్యాం. ఇక మీదట కలిసి కట్టుగా ముందుకు సాగుతాం. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర బడులలో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టనివ్వబోం’’ అని ఉద్దవ్ అన్నారు.పుష్ప సినిమా నేనూ చూశా. నాకు కూడా అందులో హీరోలా గడ్డం ఉండి ఉంటే.. తగ్గేదేలే అని డైలాగ్ కొట్టేవాడిని అని ఉద్ధవ్ ఉన్నారు. దీంతో అక్కడున్న ఇరుపార్టీల కార్యకర్తలు విజిల్స్ వేశారు. మరాఠీ భాషను రక్షించేందుకు తామిద్దరం ఐక్యమైనట్లు ప్రకటించిన ఉద్దవ్.. ఇది ట్రైలర్ మాత్రమే అని, ముందు చాలా ఉందన్నట్లు ఆయన చెప్పారు.పుష్ఫ సినిమాలో హీరో తగ్గేదేలే అన్నాడు. కానీ, ఇక్కడి ఓ ద్రోహి(ఏకనాథ్ షిండేను పరోక్షంగా ఉద్దేశించి) మాత్రం ‘దమ్ము ధైర్యం ఏమాత్రం లే’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఆ ద్రోహికి సొంత ఆలోచనలు లేవు. కేవలం తన బాస్ వచ్చాడు కాబట్టి ఆయన్ని మెప్పించడానికే ‘జై గుజరాత్’ అన్నాడు. అలాంటోడు మహారాష్ట్రకు, మరాఠీ భాషకు ఏం గౌరవం ఇచ్చినట్లు? అని ఉద్దవ్ మండిపడ్డారు. Mumbai, Maharashtra: Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, "Gaddar (Eknath Shinde) said ‘Jai Gujarat’ just like the actor in the movie Pushpa says ‘Jhukega nahi s*la’; but this Gaddar follows ‘Uthega nahi s*la’. He doesn’t have his own thoughts. His boss came, so to please… pic.twitter.com/s7N4a0bog0— IANS (@ians_india) July 5, 2025మరాఠీలో మాట్లాడలేదని ఓ షాపు అతనిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మరాఠీ భాష పేరుతో చేసే గుండాగిరిని సహించేది లేదని సీఎం ఫడ్నవిస్ అన్నారు. అయితే.. ఈ వ్యవహారంలో తామూ గూండాలేమేనని, మరాఠా ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ గుండాగిరి ఇలాగే కొనసాగుతుందని ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ఫ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు, అందులోని డైలాగులు.. హీరో మేనరిజానికి బాగా అడిక్ట్ అయ్యారు. అందుకే మొదటి భాగం రిలీజ్ అయ్యాక.. అందులోని డైలాగులను పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాలకు వాడుకున్నాయి. పుష్ఫ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనే డైలాగ్ను బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగించింది. -
విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..
ప్రకృతి వైపరిత్యాలు ఎవ్వరికి ఎలాంటి విషాదాన్ని ఇస్తుందో చెప్పలేం. అమాంతం ఉప్పెనలా విరుచుకపడే ఆ విలయం మిగిల్చే బాధ మాటలకందనిది. అందుకు సంబంధించి ఎన్నో ఉదంతాలను చూశాం. అలానే ఇటీవల కురిసిన భారీ వర్షాలు హిమచల్ ప్రదేశాన్ని ఎంతలా అతలా కుతలం చేశాయో తెలిసిందే. అయితే దాని కారణంగా అనాథగా మారిన ఓ చిట్టితల్లి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎలా బతికి బట్టగట్టకలిగిందంటే..అసలేం జరిగిందంటే..ఎడతెరపిలేని వర్షాలకు వరదలు సంభవించి హిమచల్ప్రదేశ్ అతలాకుతలమైన సంగతి తెలిసింది. ఈ ప్రకృతి వైరిత్యం కారణంగా భారీగా ఆస్తి, జన నష్టం జరిగింది. అయితే ఈ దుర్ఘటనలో హిమచల్ ప్రదేశ్లోని సిరాజ్ అనే ప్రాంతంలో ఓ కుటుంబం మొత్తం ఈ విపత్తుకు బలైపోయింది. ఆ కుటుంబానికి చెందిన 11 నెలల కూతురు ఒక్కత్తే బతికి బట్టగట్టగలిగింది. ఈ విపత్తు కారణంగా ఒరిగిపోయిన చెట్లు, భవనాల శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఆ చిన్నారి లభించడం విశేషం. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వచ్చిన వరదలకు ఆ చిన్నారి ఇల్లు తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో ఆమె తల్లి, తండ్రి, నానమ్మ చనిపోగా, ఆ చిన్నారి ఒక్కత్తే అనాథగా మిగిలిపోయింది. ఇవేమి ఆ చిన్నారికి తెలియక అమాయకంగా అందరిని చూస్తున్న తీరు అందరిని కలచివేస్తోంది. శిథిలంగా మారిన ఆ ఇల్లు పర్వాడ గ్రామానికి చెందని రమేష్ ఇల్లుగా గుర్తించారు. ఆ ఇల్లు డ్రెయిన్ సమీపంలో ఉండటంతో, జూన్ 30న కురిసిన వర్షాలకు నీటి ఉద్ధృతి ఎక్కువై కొట్టుకుపోయింది. అయితే దీనిని ముందుగానే గమనించి రమేష్ కూతురిని ఇంటిలోపల పడుకోబెట్టి, తన భార్య తల్లితో కలిసి ఇంటి వెనకకు వెళ్లాడు. అంతే ఆ వరద ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారు. ఐతే చిన్నారి ఇంటిలోనే ఉండటంతో సురక్షితంగా శిథిలాల కింద బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఉందని చెబుతున్నారు అధికారులు. ఆ చిన్నారి పేరు నిఖితగా గుర్తించారు. అయితే రెస్క్యూ సిబ్బంది ఆ చిన్నారి తండ్రి మృతదేహాన్ని వెలికితీశారు కానీ తల్లి, భార్య మృతదేహాలు మాత్రం కానరాలేదు. అందుకోసం ముమ్మరంగా గాలించేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఆ చిన్నారి మేనత్త తారాదేవి సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఈ హృదయవిదారక ఘటన గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ చిన్నారిని దత్తత తీసుకుంటామంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున అభ్యర్థనలు రావడం విశేషం. విత్తుల సహాయ నిర్వహాణ అధికారి స్మృతికా నేగి ఆ చిన్నారి నికితా బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఆ చిన్నారి తన మేనత్త పర్యవేక్షణలో ఉందని తెలిపారు. కాగా, ఈ హిమచల్ప్రదేశ్ వర్ష బీభత్సానికి సుమారు 700 కోట్ల మేర ఆస్తి నష్టం తోపాటు 69 మంది దాక మృత్యువాత పడ్డారు.(చదవండి: Droupadi Murmu: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాఠాలు..! రోజు ఎలా మొదలవుతుందంటే...) -
ఫడ్నవిస్ వల్లే మేం ఇలా! ఇక ఒక్కటిగానే..: థాక్రే సోదరుల ప్రకటన
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే మళ్లీ ఏకతాటిపైకి వచ్చారు. ఒక్కటిగా ఉంటాం.. ఇక ఒక్కటిగానే ముందు సాగుతాం అంటూ ఇద్దరు సోదరులు సంయుక్త ప్రకటన చేశారు.శనివారం హిందీ భాష అమలును వ్యతిరేకిస్తూ జరిగిన అవాజ్ మరాథిచా కార్యక్రమం.. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ అపూర్వ కలయికకు వేదికైంది. ఈ సందర్భంగా జాతీయ నూతన విద్యావిధానంలో భాగంగా హిందీని మహారాష్ట్రలో ప్రవేశపెట్టనివ్వబోమని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఈ ఇద్దరూ అల్టిమేటం జారీ చేశారు.బాల్ థాక్రే వల్ల కూడా కాలేదు..మా ఇద్దరినీ ఒక్క తాటిపై తీసుకురావాలని శివసేన వ్యవస్థాపకులు బాల్థాక్రే ఎంతో ప్రయత్నించారు. కానీ, ఆయన వల్ల కాలేదు. అది ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ వల్ల అయ్యింది. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. మా మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టాం అని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే ప్రకటించారు.మహారాష్ట్రలో ప్రాథమిక పాఠశాలలో హిందీ తప్పనిసరిని చేస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే హిందీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శివసేన యూబీటీ-ఎంఎన్ఎస్లు సంయుక్తంగా ఈ సభను నిర్వహించాలనుకున్నాయి. ఈలోపు ఫడ్నవిస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. హిందీని కేవలం ఆప్షన్ భాషగానే ప్రకటించింది. దీంతో భారీ విజయంగా పేర్కొంటూ ఇరు పార్టీలు ఈ సభను ముంబైలో ఇవాళ నిర్వహించారు.మీకు చట్ట సభలో అధికారం ఉండొచ్చు. కానీ మా శక్తి రోడ్లపై ఉంది. త్రిభాషా విధానంతో ముంబైను మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ, మరాఠా ప్రజల బలమైన ఐకమత్యం కారణంగానే ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దమ్ముంటే.. మహారాష్ట్రను టచ్ చేసి చూడండి.. ఏం జరుగుతుందో తెలుస్తుంది అని రాజ్ థాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంతకు ముందు.. శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నేత రాజ్ థాక్రే ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహారాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామని ఇరువురు సంయుక్తంగా పని చేస్తామని ప్రకటించారు.రాజ్ థాక్రే చివరిసారిగా 2005లో ఉద్దవ్తో రాజకీయ వేదికను పంచుకున్నారు. అదే ఏడాది శివసేనను విడిచి ఎంఎన్ఎస్ను స్థాపించుకున్న సంగతి తెలిసిందే. महाराष्ट्राने मनात जपलेला सुवर्णक्षण...! pic.twitter.com/kugbSPx0JU— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 5, 2025శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. -
పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. -
మాల్లో మంటలు.. లిఫ్ట్లో విద్యార్థి చిక్కుకుని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో లిఫ్ట్లో చిక్కుకున్న ఒక విద్యార్థి దుర్మరణం చెందాడు. నాలుగు అంతస్తుల వాణిజ్య సముదాయ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాలుగు అంతస్తుల వాణిజ్య భవనంలోని రెండవ అంతస్తులో మంటలు చెలరేగాయి. తొలుత ఫ్యాబ్రిక్, కిరాణ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఆ లిఫ్ట్లో చిక్కకున్నవిద్యార్థి కుమార్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్(25) ప్రాణాలు కోల్పోయాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను చల్లార్చేందుకు పలు ఇబ్బందులు పడ్డారు. ఈ భవనంలో ఒకే ప్రవేశ మార్గం, ఒకే నిష్క్రమణ మార్గం ఉంది. వివిధ వస్తువుల స్టాక్తో మెట్ల మార్గం అంతా మూసుకుపోయింది.దీంతో పైఅంతస్తులకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ వెంటిలేషన్ను అడ్డుకుంది. దీంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు గోడను బద్దలు కొట్టవలసి వచ్చింది. మొత్తం పదమూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే పనిలో పాల్గొన్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ అనే అనుమాలున్నప్పటికీ, దర్యాప్తు తర్వాత అసలు కారణం వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన మరోసారి వాణిజ్య ప్రదేశాలలో పటిష్టమైన భద్రతా అవసరాలను గుర్తుచేస్తోంది. ఇది కూడా చదవండి: Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల -
Jharkhand: కూలిన బొగ్గు గని.. ఒకరు మృతి.. పలువురు విలవిల
రామ్గఢ్: జార్ఖండ్లోని రామ్గఢ్లో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఒక బొగ్గు గనిలో కొంత భాగం కూలిపోవడంతో ఒకరు మృతిచెందారు. వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం గనిలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. One killed, many feared trapped after portion of coal mine collapses in Jharkhand's Ramgarh: Police. pic.twitter.com/m7sQrlflqk— Press Trust of India (@PTI_News) July 5, 2025అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామ్గఢ్ జిల్లాలోని కర్మ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి తెలియగానే ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపామని, రామ్గఢ్ డిప్యూటీ కమిషనర్ (డిసి) ఫైజ్ అక్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. ఘటనా స్థలంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు వెల్లడించారు. గనిలో చాలామంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు గ్రామస్తులు బొగ్గు అక్రమ తవ్వకాలలో పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.ఇది కూడా చదవండి: ‘ట్రంప్కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు -
‘ట్రంప్కు ప్రధాని మోదీ తలొగ్గుతారు?’.. రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం జూలై తొమ్మిదిలోగా ఖరారయ్యే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలకు సంబంధించి నిర్దేశించిన గడువుకు ప్రధాని మోదీ సాత్వికంగా తలొగ్గుతారని రాహుల్ వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోతే, దానిని ఖరారు చేసేందుకు భారత్ తొందరపడదంటూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటనను రాహుల్ గుర్తుచేశారు. పీయూష్ గోయల్ ఈ విధమైన ప్రకటన చేసినప్పటికీ, ప్రధాని మోదీ అమెరికా విధించిన సుంకాల గడువుకు మృదువుగా తలొగ్గుతారని రాహుల్ పేర్కొన్నారు. Piyush Goyal can beat his chest all he wants, mark my words, Modi will meekly bow to the Trump tariff deadline. pic.twitter.com/t2HM42KrSi— Rahul Gandhi (@RahulGandhi) July 5, 2025ప్రతిపాదిత తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై భారత్- అమెరికన్ అధికారుల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయి. ట్రంప్ యంత్రాంగం విధించిన పరస్పర సుంకాలపై 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. అప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరని పక్షంలో.. అమెరికన్ వస్తువులపై భారత సుంకాలకు ప్రతిగా ట్రంప్ విధించిన మునుపటి అమెరికా సుంకాలు తిరిగి అమలయ్యే అవకాశాలున్నాయి. ట్రంప్ యంత్రాంగం భారత ఎగుమతుల శ్రేణిపై 26 శాతం సుంకాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై చర్చలు ప్రారంభించిన దరిమిలా ఈ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు.న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ పరస్పరం ప్రయోజనకరమైన, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించే అమెరికా వాణిజ్య ఒప్పందంపై మాత్రమే సంతకం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఇది విన్-విన్ ఒప్పందంగా ఉండాలని, జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అమెరికాతో సరైన ఒప్పందం ఏర్పడితే, అభివృద్ధి చెందిన ఆ దేశంతో భారత్ సన్నిహితంగా ఉండటానికి సిద్ధంగా ఉంటుందని గోయల్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం -
ఇదేందయ్యా ఇదీ.. మొన్న 90 డిగ్రీల బ్రిడ్జి.. నేడు పాము మెలికల వంతెన
భోపాల్: మధ్యప్రదేశ్లో వంతెనల నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. మొన్నటికి మొన్న భోపాల్లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన ఓ రైల్వే వంతెన చర్చనీయాంశం కాగా.. తాజాగా మరో వంతెన తెరపైకి వచ్చింది. భోపాల్లోనే పాములా మెలికలు తిరిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. సదరు వంతెనపై ప్రయాణాల కారణంగా ఎనిమిది గంటల సమయంలోనే రెండు ప్రమాదాలు జరగడంతో.. వంతెన నిర్మించిన ఇంజినీర్, బీజేపీ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వాహనదారులు.వివరాల ప్రకారం.. భోపాల్లోని సుభాష్నగర్లో రూ.40 కోట్లతో ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను పాములా మెలికలు తిరిగినట్టు నిర్మించడం గమనార్హం. భోపాల్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు ఈ వంతెన మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ వంతెన వల్ల సుభాష్ నగర్ ప్రాంతంలో రద్దీ తగ్గినప్పటికీ దాని నిర్మాణం పలుచోట్ల మెలికలు తిరిగి ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వంతెనపైకి ఎక్కిన కొన్ని సెకన్లలోనే పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొన్నారు. దీనివల్ల రాత్రి సమయాల్లో, అధిక వేగంతో ప్రయాణించే వాహనదారులు మలుపుల వద్ద నియంత్రణ కోల్పోయి.. ప్రమాదాల బారినపడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.A speeding car lost control and overturned on the Subhash Nagar Bridge in Bhopal, leaving two passengers injured.The vehicle hit the divider with such force that its front tyres detached.A live video of the dramatic accident has surfaced, highlighting the dangers of reckless… pic.twitter.com/jd1tnuBiD9— The Sentinel (@Sentinel_Assam) July 2, 2025ఇక, ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టి గాలిలో పల్టీలు కొట్టింది. మరోసారి ఓ స్కూల్ వ్యాన్ డివైడర్ను ఢీకొట్టడంతో అందులోని విద్యార్థులకు గాయాలయ్యాయన్నారు. దీంతో, వంతెన నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని ప్రమాదాలు జరగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకొని.. మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వాన్ని కోరారు. వంతెనలు ఇలా నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. రాజధాని భోపాల్లో ఐష్బాగ్ వద్ద రూ.18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే, అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్ స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గం లేదని వివరణ ఇచ్చింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా ఏడుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజినీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. #WATCH | Madhya Pradesh | A newly-built bridge constructed in Bhopal's Aishbagh features a 90-degree turn pic.twitter.com/M1xrJxR45e— ANI (@ANI) June 12, 2025 -
అమర్నాథ్ యాత్రలో అపశృతి.. సహాయక చర్యలు ముమ్మరం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జూలై మూడు నుంచి ప్రారంభమైన అమర్నాథ్ యాత్రలో తాజాగా స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. రాంబన్లోని చందర్కోట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పలువులు యాత్రికులు గాయపడ్డారు. ఇక్కడి నుంచి పహల్గామ్నకు వెళ్లే రహదారిలో ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది భక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.యాత్రా కాన్వాయ్లో ఈ బస్సులు బ్రేక్ ఫెయిల్ కావడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు వివరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యాత్రికులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 9 వరకు అంటే రక్షా బంధన్ వరకూ కొనసాగనుంది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర గుహకు యాత్రికులు రెండు మార్గాల ద్వారా చేరుకుంటారు. వాటిలో ఒకటి పహల్గామ్ మార్గం. రెండవది బాల్తాల్ మార్గం. Shri Amarnath Yatra Bus Collision in Ramban, J&KOver 30 pilgrims sustained minor injuries when five buses in a Pahalgam-bound convoy for the Shri #AmarnathYatra collided near the Chanderkote langar site in Ramban district, #JammuAndKashmir The Deputy Commissioner of Ramban… pic.twitter.com/VFA33YyE0p— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) July 5, 20256,979 మంది యాత్రికుల బృందం శనివారం జమ్ము నుండి కాశ్మీర్కు గట్టి భద్రత మధ్య అమర్నాథ్ యాత్రకు బయలుదేరింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజులపాటు జరగనుంది. గడచిన రెండు రోజుల్లో 26,800 మందికి పైగా భక్తులు అమర్నాథ్ను దర్శించుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొత్త బ్యాచ్ భగవతి నగర్ యాత్ర నివాస్ నుండి 312 వాహనాలతో కూడిన రెండు ఎస్కార్ట్ కాన్వాయ్లలో బయలుదేరింది. ఈ యాత్రికులలో 2,753 మంది బాల్టాల్ బేస్ క్యాంప్కు వెళుతుండగా, 4,226 మంది నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్కు బయలుదేరారు. ఇది కూడా చదవండి: ‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు -
‘బెట్టింగ్ యాప్’ వరుడు పరార్.. ఈడీ అదుపులో అతిథులు
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఇటీవలి రోజులలో అది మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిపోతోంది. చివరికి పెళ్లిపీటల మీదే తెగతెంపులవుతున్న వ్యవహారాలూ కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది.జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో గల ప్రముఖ ఫెయిర్మాంట్ హోటల్లో గతంలో ‘వార్తల్లో’ నిలిచిన సౌరభ్ అహుజా వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. వేడుకలోని ఒక్కక్క కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతూ వస్తోంది. ఇక కొద్ది క్షణాల్లో నూతన వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం జరగనుంది. ఇంతలో హఠాత్తుగా వరుడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. సౌరభ్ అహుజా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వాంటెడ్ నిందితుడు. ఇతను ఫెయిర్మాంట్ హోటల్లో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరరేట్(ఈడీ) అధికారులు మండపానికి చేరుకున్నారు.ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిందితుడు సౌరభ్ అహుజా ఏడడుగుల తంతుకు ముందు పరారయ్యాడు. దీంతో ఈడీ అధికారులు నూతన వధువుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో అహుజా వాంటెడ్ నిందితుడు. అతన్ని అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. మహాదేవ్ యాప్ ప్రాథమిక ఆపరేటర్లలో అహుజా ఒకడు. అతిథులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు పెళ్లి దుస్తుల్లోనే పరారయ్యాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సౌరభ్ కొంతకాలంగా ఈడీ అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. కల్యాణ మండపం నుంచి అతను పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది కూడా చదవండి: అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ -
రౌడీషిటర్తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
తమిళనాడు: వీసీకే మహిళా కౌన్సిలర్ దారుణ హత్యకు గురైంది. రౌడీషిటర్తో ఇన్స్ట్రాగామ్లో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడంతో భర్త, పిల్లలను వదిలి రౌడీషిటర్తో సహజీవనం కొనసాగించడానికి సిద్ధమైన మహిళా కౌన్సిలర్ను భర్త దారుణంగా హతమా ర్చాడు. తిరువళ్లూరు జిల్లా తిరునిండ్రవూర్ పెద్దకాలనీకి చెందిన కోమది(28) తిరునిండ్రవూర్ 26వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా పని చేస్తున్నారు. ఈమె భర్త స్టీఫెన్రాజ్(38) తిరునిండ్రవూర్ పట్టణ వీసీకే కార్యదర్శిగా కొనసాగు తున్నారు. వీరిద్దరు 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు. కాగా స్టీఫెన్రాజ్, భార్య కోమది, అతని సోదరుడు అజిత్, తల్లిదండ్రులు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కోమదికి తిరునిండ్రవూర్ రామదాస్పురం ప్రాంతానికి చెందిన రౌడీషిటర్ మోసస్దేవతో ఇన్స్ట్రాగామ్లో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే రెండు నెలల క్రితం మోసస్దేవాతో కోమది సన్నిహితంగా ఉన్న ఫొటోలను అజిత్ సెల్ఫోన్కు పంపినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు మొదలయ్యా యి. ఈ విషయమై కోమదిని భర్త స్టీఫెన్రాజ్ ప లుమార్లు మందలించినా మరింత సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి ఆటోలో కోమ ది బయలుదేరింది. అజిత్, స్టీఫెన్రాజ్ ఆమెను వెంబడించారు. కోమది ఆవడి సమీపంలోని నడుకుత్తగై ప్రాంతంలో మోసస్దేవాతో సన్నిహితంగా ఉన్నట్టు స్టీఫెన్రాజ్ గుర్తించి ఆగ్రహించి కత్తితో కోమదిని దారుణంగా నరికి పరారయ్యారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి రౌడీ షీటర్ పరారయ్యాడు. విషయం తెలిసి అసిస్టెంట్ కమిషనర్ గిరి, పోలీసులు మృతదేహాన్ని ప్రభు త్వాస్పత్రికి తరలించారు. స్టీఫెన్రాజ్, అజిత్, తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. -
శానిటరీ నేప్కిన్స్ ప్యాకెట్లపై రాహుల్ బొమ్మ
పట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహిళలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విమర్శలపాలైంది. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ను పంపిణీ చేయాలని పార్టీ తలపెట్టింది. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 అందజేయడంతోపాటు ఉచితంగా నేప్కిన్లు అందజేస్తామని ప్రకటించింది. ఆ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ బొమ్మను ముద్రించడం వివాదం రేపింది. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు ఇదో ఉదాహరణ అంటూ అధికార జేడీ(యూ) మండిపడింది -
బీహార్లో ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ నేత దారుణ హత్య
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కాపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గోపాల్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బీజేపీ నాయకుడు గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలోని తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇంటి వద్ద కొందరు దుండగులు.. ఆయనపై కాల్పులు జరిపారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. గోపాల్.. హోటల్కు ఆనుకుని ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. నిందితుడు ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కాల్పుల్లో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్ కేసింగ్ను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిటీ ఎస్పీ దీక్ష మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ ఖేమ్కాపై కాల్పులు జరిగినట్టు మాకు సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. ఈ హత్య వెనుక కారణం ఇంకా తెలియలేదు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.VIDEO | Patna, Bihar: Businessman Gopal Khemka shot dead near his house. Visuals from his residence. Police investigation on.#BiharNews #PatnaNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/ZkHIzWJbnE— Press Trust of India (@PTI_News) July 5, 2025ఇదిలా ఉండగా.. ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా మూడేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. మరోవైపు.. పూర్నియాకు చెందిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్లో ఎవరూ సురక్షితంగా లేరు. బీహార్ నేరస్థులకు స్వర్గధామంగా మారింది. నితీష్ జీ.. దయచేసి బీహార్ను విడిచిపెట్టండి. గుంజన్ ఖేమ్కా హత్యకు గురైనప్పుడే నేరస్థులపై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు గోపాల్ ఖేమ్కాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | Patna, Bihar | On businessman Gopal Khemka being shot dead, SP Patna Diksha says, "On the night of July 4, at around 11 pm, we received information that businessman Gopal Khemka has been shot dead in the south area of the Gandhi Maidan... The crime scene has been… pic.twitter.com/o8C0gVoz7B— ANI (@ANI) July 5, 2025 -
క్షమాపణ చెప్పండి.. పరిహారం చెల్లించండి
ముంబై: సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కొల్హాపురి చెప్పుల డిజైన్ను అనుమతి లేకుండా వాడుకున్న ఫ్యాషన్ బ్రాండ్ ప్రాడాపై పిల్ దాఖలైంది. మేధో సంపత్తి హక్కుల రంగంలో పనిచేసే ముంబై, పూణేలకు చెందిన న్యాయవాదుల బృందం ఈ పిటిషన్ను దాఖలు చేసింది.ఈ సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ ఏఐ ఉత్పత్తిని అనధికారికంగా ఉపయోగించడాన్ని అంగీకరిస్తూ, ప్రాడా గ్రూప్, ప్రాడా ఇండియా ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఏఐలను అనధికారికంగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని పిటిషన్ కోరింది. భారతీయ కళాకారుల హక్కులను గుర్తించాలని డిమాండ్ చేసింది. కళాకారుల ప్రతిష్ట, ఆర్థిక నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా పిటిషన్ కోరింది.జూన్ 22న ఇటలీలోని మిలన్లో జరిగిన అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్.. స్ప్రింగ్ సమ్మర్ మెన్స్ కలెక్షన్–2026 సందర్భంగా ‘కొల్హాపురి చప్పల్’ను ప్రాడా బ్రాండ్ ఉపయోగించింది. ఫ్యాషన్ షో వీడియోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. ప్రదర్శనలో ప్రాడా మోడల్స్ ధరించిన పాదరక్షలు అచ్చం సంప్రదాయ కొల్హాపురి చెప్పుల మాదిరిగానే ఉన్నాయి. వాటి డిజైన్లకు శతాబ్దాల వారసత్వం కలిగిన సంప్రదాయ పాదరక్షల నుంచి ప్రేరణ పొందినట్టు ప్రాడా కూడా అంగీకరించింది. -
6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది. -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్ను విడిచి భారత్కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రతి రూపాయికి ప్రతిఫలం రూ.2.54..!
న్యూఢిల్లీ: దేశ అంతరిక్ష కార్యక్రమం ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ ఎస్.సోమ్నాథ్ చెప్పారు. ఇస్రోలో పెట్టే ప్రతి రూపాయిపై రూ.2.54 మేర ఆదాయం వస్తోందని వెల్లడించారు. శుక్రవారం ఆయన ‘ఆక్స్ఫర్డ్ ఇండియా బిజినెస్ ఫోరం’లో ప్రసంగించారు. బడ్జెట్ తక్కువే అయినప్పటికీ అద్భుతమైన సామర్థ్యం కలిగిన భారత అంతరిక్ష రంగం ప్రపంచ గుర్తింపు సాధించిందని ఆయన వివరించారు. ‘మేం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అందుతున్న ప్రతిఫలం రూ.2.54. బడ్జెట్లో పెద్దగా కేటాయింపులు లేకున్నా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుని, ఉపగ్రహాలను నిర్మించి విజయవంతంగా ప్రయోగించాం’అని తన హయాంలో అనుభవాన్ని ఆయన తెలిపారు. చంద్రయాన్–3 లూనార్ ల్యాండింగ్, ఆదిత్య ఎల్–1 మిషన్ వంటి ఇస్రో సాధించిన మైలురాళ్లు అంతరిక్ష అన్వేషణలో భారత్ సత్తాకు నిదర్శనాలని చెప్పారు. ప్రైవేట్ రంగం గణనీయ వృద్ధి ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి సాధించిందని సోమ్నాథ్ చెప్పారు. ‘2014కు పూర్వం ఈ రంగంలో దేశంలో ఒకే ఒక్క స్టార్టప్ కంపెనీ ఉండేది. ఇప్పుడవి 250కి పెరిగాయి. ఉపగ్రహాలు, రాకెట్లను నిర్మించడంతోపాటు కక్ష్యలోకి ప్రవేశపెట్టే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఈ రంగంలో అనుబంధ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ తన వాటాను పెంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది’అని సోమ్నాథ్ తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో భారతీయుడిని చంద్రుడిపైకి పంపి, అక్కడ ల్యాండ్ చేయించడంతోపాటు తిరిగి తీసుకువచ్చే బృహత్తర ప్రణాళిక ఇస్రో వద్ద ఉందన్నారు. ఇందులో పునర్వినియోగ రాకెట్ల నిర్మాణం, భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, అంతరిక్షంలోకి భారతీయులను పంపడం, చంద్రుడితోపాటు గురుగ్రహంపైకి అన్వేషణలను చేపట్టడం వంటివి కూడా ఉన్నాయని వివరించారు. ఇతర దేశాలకు సైతం సాయం నేపాల్, భూటాన్, ఒమన్, దక్షిణాఫ్రికాతోపాటు ఆసియాన్ దేశాల అంతరిక్ష అన్వేషణ సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, పెంచేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. పునరి్వనియోగ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం, పరిశోధన–అభివృద్ధి వ్యయాన్ని పెంచడం, వ్యూహాత్మక అంతరిక్ష రంగంలో మరింత పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికతలో భారత్ను అగ్ర స్థానానికి తీసుకెళ్లాలన్నదే ఇస్రో లక్ష్యమని సోమ్నాథ్ చెప్పారు. -
ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వరుస దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించింది. ప్రభుత్య వ్యవహారశైలి, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, ఎంపేడులో ఎస్టీల మీద జరిగిన దాడులపై వైఎస్సార్సీపీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. అమాయకులపై దాడులు జరిగినా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడంలేదని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె కమిషన్కు అందచేశారు. దీనిపై కమిషన్ స్పందిస్తూ సంబంధిత కలెక్టర్, ఎస్పీలకు సమన్లు జారీచేసింది. తాము ఈనెల 8న విచారణ నిర్వహించనున్నామని, ఆ విచారణకు హాజరుకావాలని, లేనిపక్షంలో చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించింది. -
అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుత అనుభూతి
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వారం రోజులు పూర్తి చేసుకున్నారు. సహచర వ్యోమగాములతో కలిసి ఇప్పటికే భూమిని 113 సార్లు చుట్టేశారు. 40.66 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 12 రెట్ల దూరంతో సమానం. ఐఎస్ఎస్లో తన అనుభవాన్ని శుభాంశు శుక్లా శుక్రవారం పంచుకున్నారు. మన భారతీయ ఆమ్ రస్, గాజర్కా హల్వా, మూంగ్దాల్ హల్వా రుచులు ఆస్వాదిస్తున్నానని, వాటిని సహచరులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఇతర దేశాల వంటకాలను సైతం రుచి చూస్తున్నానని తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఐఎస్ఎస్ నుంచి సంభాషించారు. అలాగే హామ్ రేడియో ద్వారా బెంగళూరులోని యూఆర్ఎస్సీ సైంటిస్టులతో మాట్లాడారు. ఇక్కడంతా అద్భుతంగా ఉందని, తామంతా చక్కగా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ఆహార పదార్థాలను ఒకరికొకరం పంచుకుంటున్నామని వెల్లడించారు. వేర్వేరు దేశాల వ్యక్తులతో కలిసి పని చేయడం ఉత్సాహకరమైన అనుభవమని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూగోళాన్ని కళ్లారా వీక్షించడం మాటల్లో చెప్పలేని అద్భుత అనుభూతిని ఇస్తోందని వివరించారు. అత్యంత ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. శుభాంశు శుక్లా ఆ రికార్డును అధిగమించారు. -
‘బ్లూటూత్’ స్పీకర్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ: మీరు బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు, ఇయర్బడ్లు ఉపయోగిస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. బ్రాండ్ ఏదైనా కానీ.. బ్లూటూత్ ఆధారిత స్పీకర్లు ముప్పు కలిగిస్తాయని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘‘హ్యాకర్లు ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకోవడానికి, సంభాషణలపై నిఘా పెట్టడానికి, కాల్ను హైజాక్ చేసి పరికరాన్ని రిమోట్గా నియంత్రించడానికి బ్లూటూత్ కారణమవుతుంది. ఐరోహా సిస్టమ్స్ చిప్ ఉన్న బ్లూటూత్ హెడ్ఫోన్లు, స్పీకర్లు, కార్ ఇన్ఫోటైన్మెంట్ సిçస్టమ్ వినియోగదారులకు ఈ ప్రమాదం ఎక్కువ. బ్లూటూత్ ఇయర్బడ్, సోనీ, బోస్, సెన్హైజర్, బోట్ వంటి పెద్ద బ్రాండ్ల స్పీకర్లను వాడుతున్నా ప్రమాదమే. బ్లూటూత్తో దాడి చేసి ఫోన్ మెమరీని చదివే, మైక్రోఫోన్ ద్వారా వినే, కాల్ డేటా, కాంటాక్ట్లను దొంగిలించే అవకాశముంది. హానికరమైన ఆదేశాలు కూడా ఇవ్వొచ్చు. హ్యాకర్ బ్లూటూత్కు కనెక్ట్ అయి మీతకు తెలియకుండానే డివైజ్ మీద పూర్తి నియంత్రణ తీసుకోవచ్చు. వీటినుంచి బయటపడాలంటే బ్లూటూత్ పరికరాలకు ఫర్మ్వేర్ను అప్డేట్ చేయండి. డివైజ్ తయారీదారు విడుదల చేసిన వెంటనే అప్డేట్స్ను ఇన్స్టాల్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో పరికరాలను బ్లూటూత్కు జత చేయకుండా ఉండండి’’ అని సూచించింది. -
హిమాచల్లో వర్షాలతో నష్టం
న్యూఢిల్లీ: గడిచిన రెండు వారాలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర నష్టం సంభవించింది. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 43 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. ఒక్క మండి జిల్లాలోనే 17 మంది చనిపోగా, 31 మంది గల్లంతయ్యారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది. వచ్చే మంగళవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్లోని భిమ్టల్లో గురువారం ఉప్పొంగుతున్న జలాశయంలో మునిగి నేవీకి చెందిన ఇద్దరు సిబ్బంది చనిపోయారు. పఠాన్ కోట్కు చెందిన ప్రిన్స్ యాదవ్(22), బిహార్లోని ముజఫర్పూర్కు చెందిన సాహిల్ కుమార్(23)గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చిన 8 మంది ఐఏఎఫ్ సిబ్బందిలో వీరున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులను మూసివేశారు. చార్ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లే జాతీయ రహదారిపై ఐదు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడి ఈ రహదారిపైనున్న సిలాయి మలుపు వద్ద 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో, 9 మంది నిర్మాణ కార్మికులు కొట్టుకుపోయారు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. మరోవైపు, ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జబల్పూర్–మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా, రాజస్తాన్లోని జైసల్మీర్ జిల్లా పొఖ్రాన్లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. -
నేవీలో మొట్టమొదటి మహిళా ఫైటర్ ఫైలట్గా పునియా
న్యూఢిల్లీ: నావికా దళంలోని యుద్ధ విమానం మొట్టమొదటి మహిళా పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పునియా రికార్డు సృష్టించనున్నారు. నేవీలో మహిళా యుద్ధ విమాన పైలట్ల నూతన శకానికి ఆమె నాంది పలకనున్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్టణ తీరంలోని ఐఎన్ఎస్ డేగాపై సెకండ్ బేసిక్ హాక్ కన్వెర్షన్ కోర్సు స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ అతుల్ ధుల్, సబ్ లెఫ్టినెంట్ పునియాకు ప్రతిష్టాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ అందుకున్నారు. దీంతో, నావికాదళ యుద్ధ విమానాలలోకి ప్రవేశించిన మొదటి మహిళగా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా నిలిచారు. త్వరలోనే ఆమె ఫైటర్ పైలట్గా శిక్షణను అందుకోనున్నారు. నేవీలో ఇప్పటికే మహిళా పైలట్లు, ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నారు. -
టేకు ఆకుతో లేజర్ తీవ్రతకు చెక్..!
టేకు అనగానే.. అందమైన ఫర్నీచర్లో ఇమిడిన విలువైన కలప గుర్తొస్తుంది. టేకు చెట్టులో కలప తప్ప ఆకులు ఎందుకూ పనికిరావని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లు. కానీ ఈ పత్రాలకు కూడా గొప్ప ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తీవ్రమైన లేజర్ కిరణాల రేడియేషన్ను అడ్డుకునే శక్తి టేకు ఈ ఆకుల్లో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లోనూ.. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ.. టేకు ఆకుల్లోని ప్రత్యేక శక్తిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యంత ప్రభావశీలమైన లేజర్ కిరణాల రేడియేషన్ నుంచి చర్మాన్నీ, కంటినీ, సున్నితమైన ఆప్టికల్ పరికరాలను సైతం రక్షించే శక్తి టేకు ఆకులకు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లో లేజర్ రేడియేషన్దే ప్రధానపాత్ర. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ లేజర్ కిరణాలే కీలకం. అయితే, వీటిని ఉపయోగించే సమయంలో పొరపాటున ఆ కిరణాలు మనుషుల కళ్లకు, శరీరానికి హాని జరగనీయకుండా అడ్డుపడే కవచాన్ని రూపొందించేందుకు టేకు ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులతో పరిశోధనలు చేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)’ శాస్త్రవేత్తల పరిశోధనలో టేకు ఆకు ప్రయోజకత్వం వెల్లడైంది. ఆర్ఆర్ఐను ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ స్థాపించారు.ప్రత్యేక లక్షణాలు టేకు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని ప్రత్యేక రసాయనాల్లో నానబెట్టి, శుద్ధి చేసిన తర్వాత గోధుమ–ఎరుపు రంగు ద్రవాన్ని వెలికితీశారు. ఈ వర్ణద్రవ్యానికి లేజర్ కాంతి లక్షణాలు మార్చి, తీవ్రతను తగ్గించే నాన్లీనియర్ ఆప్టికల్ (ఎన్ఎల్ఓ) గుణాలు ఉన్నట్టు ఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక తీవ్రతల వద్ద కాంతి ప్రసారాన్ని తగ్గించడానికి.. మన శరీరం, కళ్ళను కాపాడటానికి నాన్ లీనియర్ వస్తువుల్లో ఉండే ఆప్టికల్ పవర్ లిమిటింగ్ ఉపయోగపడుతుంది. ఇవే లక్షణాలు టేకు ఆకుల్లోనూ ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.‘సింథటిక్’ పదార్థాలకు బదులుగా..ఇప్పటివరకు వాడుతున్న గ్రాఫీన్, ఫుల్లెరెన్స్, మెటల్ నానోపార్టికల్స్ వంటి ప్రకృతికి హాని కలిగించే ఖరీదైన సింథటిక్ ఆప్టికల్ పదార్థాలకు బదులు టేకు ఆకుల్లోని రంగులను వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహజమైన, కుళ్లి ప్రకృతిలో కలిసిపోయే పర్యావరణ ప్రియమైన, విరివిగా లభించే టేకు ఆకులను ఉపయోగించటం ద్వారా లేజర్ రక్షక కళ్లజోళ్లు, ఇతర ఆప్టికల్ పరికరాలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.లేజర్ రేడియేషన్ ఉపయోగాలులేజర్ రేడియోషన్ లేదా లేజర్ కాంతి ఎంత ప్రయోజనకరమైనదో అంతే ప్రమాదకరమైనది. దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించాలి. లేజర్ కాంతి కంటిని నేరుగా తాకితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక శక్తి గల లేజర్లు చర్మాన్ని కూడా కాల్చేయగలవు. దీన్ని అనేక రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.» వైద్యరంగంలో కన్ను, చర్మ సంబంధ శస్త్ర చికిత్సలు; డయాగ్నొస్టిక్స్లో...» పరిశ్రమల్లో కటింగ్, వెల్డింగ్, లేజర్ మార్కింగ్, లేజర్ స్కాన్లలో..» శాస్త్రీయ పరిశోధనలో కాంతి లక్షణాలను అధ్యయనం చేయడానికి..» సీడీ ప్లేయర్లు, లేజర్ పాయింటర్లు, బార్కోడ్ స్కానర్ వంటి వినియోగదారుల ఉత్పత్తుల్లో..» రక్షణ రంగంలో కమ్యూనికేషన్, శత్రువుల క్షిపణులను కూల్చడం వంటి వాటికి.. » వినోద రంగంలో లేజర్ లైట్ షోలు, స్పెషల్ ఎఫెక్టుల కోసం.. -
దక్షిణాది మహిళకే బీజేపీ పగ్గాలు?
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పానికి నిదర్శనంగా బీజేపీ చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ చరిత్రలో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు ఒక మహిళకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు ఈసారి దక్షిణాదికి చెందిన మహిళా నేతకే దక్కుతాయని ఢిల్లీలో ఉహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రేసులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళా నేతలు ఉన్నారనే చర్చ జరుగుతోంది.వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు.. మహిళకు పార్టీ పగ్గాలు కట్టబెట్టేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) కూడా ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. ఏడాదిన్నర కాలంగా జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కొద్దిరోజుల్లో తెరదించేలా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముందంజలో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లను కలిశారు. కమలం పార్టీ అధ్యక్ష పీఠం కోసం జరుగుతున్న రేసులో ఆమె ముందువరుసలో ఉన్నారనే చర్చ మొదలైంది. సీనియర్ నేతగా, గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అనుభం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు వీలవుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రేసులో పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ నిర్మలా సీతారామన్ తర్వాత.. కేంద్ర మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. ఆమెకు పలు భాషల్లో ప్రావీణ్యం ఉంది. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞురాలు. అలాగే బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేరు కూడా ప్రచారంలో ఉంది. తమిళనాడుకు చెందిన ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. ప్రస్తుతం కోయంబత్తూర్ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్ హాసన్పై విజయం సాధించారు. 1993లో బీజేపీలో చేరిన నాటినుంచి ఎన్నో కీలక పదువులు చేపట్టారు.2020లో మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి చేరుకున్న మొదటి తమిళనాటు మహిళా నేత వనతి. కాగా.. ఢిల్లీలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ల సమావేశాలు నిర్వహిస్తోంది. ఆర్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ లు పాల్గొంటున్నారు. ఈ సమావేశాల్లో బీజేపీ కొత్త అధ్యక్ష ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం. -
కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు
పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్ కూడా ఫోన్లో టైప్ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి అత్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.పూణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్ బీ బ్యాక్( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్ను కూడా ఆమె టైప్ చేసింది’ అని చెప్పారు.మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? డెలివరీ బాయ్ పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్ తనపై పెప్పర్ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. -
బీజేపీపై ఆర్ఎస్ఎస్ పట్టు బిగిస్తోందా?
దశాబ్దకాలంగా బీజేపీలో అప్రతిహత నిర్ణయాలు తీసుకున్న మోదీ - షా ద్వయం ఈ సారి మాత్రం ఆర్ఎస్ఎస్ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. 2024 ఎన్నికల్లో బిజెపి సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో కమలదళంపై ఆర్ఎస్ఎస్ తిరిగి పట్టు బిగించడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ సహకారం లేకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందనే విషయాన్ని గమనించిన మోదీ-షా ద్వయం ఆర్ఎస్ఎస్తో సంప్రదింపులు, ఆమోదం తర్వాతే పార్టీ నియామాకాలకు ముందుకువెళుతున్నారు. అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు ఏడాదిగా ఈ నియామకం పెండింగ్లో పడింది. అయితే ఎట్టకేలకు గత రెండువారాల నుంచి ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో రాష్ట్రాల అధ్యక్షుల నియామాకాలు జరిగాయి. దాదాపు తొమ్మిది రాష్ట్రాలకు నూతనంగా బిజెపి అధ్యక్షుల నియామకం. ఈ నియామాకాలన్నింటిలో స్పష్టంగా ఆర్ఎస్ఎస్ ముద్ర కనిపించింది. ప్రత్యేకించి రెండు తెలుగురాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకంలో ఆర్ఎస్ఎస్ తిరుగులేని తన ఆధిపత్యాన్ని నిరూపించింది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో సుదీర్ఘకాలం పనిచేసి ఆ తర్వాత బిజెపిలోకి ప్రవేశించిన మాజీ ఎమ్మెల్సీలు రాంచందర్రావు, పివిఎన్.మాధవ్కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ అధ్యక్ష పదవికోసం హేమాహేమీలు పోటీపడినా, రేసులో లేని రాంచందర్రావుకే నాయకత్వ పగ్గాలు అప్పగించారు. పార్టీలో విపరీతమైన గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎవరికి పదవి అప్పగించినా, మరొకరు వారిని దెబ్బకొట్టే పరిస్థితి నెలకొనడంతో అందరినీ సమన్వయం చేసేందుకు సంస్థాగత నాయకుడిని సెలెక్ట్ చేసుకుంది.ఏ గ్రూపులలో లేకపోవడం, వివాదాలకు దూరంగా ఉండడం, సంఘ్ పరివార్ ఆశీస్సులు ఉండడం రాంచందర్రావుకు కలిసొచ్చింది. అలాగే పార్టీ వ్యవహారాలు తమ చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో సీనియర్లు కూడా రాంచందర్రావుకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఎంపీలు అధ్యక్షపదవిని ఆశించినా, వారిని కాదని బ్రాహ్మణ వర్గాన్నే అధ్యక్ష పదవి వరించింది. ప్రతిపక్షంలో ఉండే ఏ పార్టీకైనా దూకుడుగా ఉండే నాయకుడు అవసరమనేది అభిప్రాయముంది. కానీ ఈసారి దూకుడు కంటే , గ్రూపిజం లేని వ్యక్తికే పగ్గాలు అప్పగించడం ద్వారా సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసేవారికే పెద్దపీట వేసింది. అన్ని గ్రూపుల మధ్య బ్యాలెన్స్ కోసమే ఈ నియామకం చేసినట్లుగా కనిపిస్తోంది.ఇటు ఆంధ్రప్రదేశ్లో సైతం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్కు బిజెపి సారథ్య బాధ్యతలు అప్పగించడంలో ఆర్ ఎస్ ఎస్ చక్రం తిప్పింది. మొన్నటిదాకా అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి మరోసారి తనకు అధ్యక్ష పదవి పొడగించాలని కోరారు. అయితే అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పార్టీ నిర్మాణం, పార్టీ కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించలేదని అధిష్టానానికి నివేదికలందాయి. దాంతో ఆమెను కొనసాగించేందుకు అధిష్టానం అంగీకరించలేదు. ఆమె స్థానంలో ఆర్ఎస్ఎస్కు చెందిన మాధవ్ను నియమించడం ద్వారా సంస్థాగత నిర్మాణంపై వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఏపీలో అధ్యక్ష పదవికోసం పెద్దగా పోటీ లేనప్పటికీ వలస నేతలకు కాకుండా ఒరిజినల్ నేతలకే కీలక బాధ్యతలు ఇవ్వాలన్న ఆర్ఎస్ఎస్ అభిప్రాయం మేరకే మాధవ్ నియామకం జరిగింది. వలసనేతలకు ఎన్నికలలో టికెట్ ఇచ్చి రంగంలోకి దింపాలే తప్ప, పార్టీ కోర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పెద్దగా లాభం లేదన్నది ఆర్ ఎస్ ఎస్ అభిప్రాయంగా ఉంది.గత పదేళ్ల నుంచి బిజెపిలో నియామకాలన్నీ దాదాపుగా నరేంద్రమోడీ, అమిత్షా ద్వయమే ఫైనల్ చేసేది. అన్ని నియామాకాల్లోనూ వారి మాటే నెగ్గేది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో మోడీ-షా ద్వయం కీలకపాత్ర పోషించింది. దాంతో వారూ కోరుకున్నట్లుగానే ఆర్ ఎస్ ఎస్ సైతం బిజెపి నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అయితే ఒక్కసారిగా 2024లో పరిస్థితి మారిపోయింది. అబ్కీ బార్ చార్ సౌ పార్ ...ఈసారి 400 సీట్లు అనే గట్టి ప్రచారం చేసినా అది వర్కవుట్ కాలేదు. 2019లో వచ్చిన 304 సీట్ల నుంచి 2024కల్లా 240 సీట్లకు పడిపోవడంతో మోదీ-షా ద్వయం ప్రభ సన్నగిల్లడం మొదలైంది. మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, పార్టీలో మాత్రం మోడీ-షా నిర్ణయాలకు ఆర్ఎస్ఎస్ ఆమోదం తప్పనిసరిగా మారింది. దాని వల్లే బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా పదవీకాలం ముగిసినా కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది. జాతీయ అధ్యక్షుడి నియామకానికి దేశంలోని సగం రాష్ట్రాలలో బిజెపి అధ్యక్షుల నియామకం జరగాలనే నిబంధన ఉంది. దీనివల్లే నియామకం చేయడం లేదని బిజెపి అగ్రనేతలు బయటికి చెప్పుకున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం కొత్త బిజెపి అధ్యక్షుడి నియామకంపై మోడీ-షా, ఆర్ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధానకారణం. తమ ఆమోదం లేకుండా నియమిస్తే, రానున్న ఎన్నికల్లలో సహకారం ఉండదనిసంకేతాలిచ్చింది. ఇప్పటికే లోక్సబ ఎన్నికల్లో మెజారిటీ రాక, మిత్రపక్షాల బలంపై ఆధారపడిన మోడీ ప్రభుత్వం ఆర్ ఎస్ ఎస్ సహకారం కోల్పోతే పరిస్థితి మరింత జఠిలమవుతుంది. దాంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తొలిసారిగా నాగ్పూర్లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి తన విధేయతను చాటారు. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అన్ని నియామాకాలు ఆర్ ఎస్ ఎస్ ఆమోదంతో కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర బిజెపి చీఫ్గా రవీంద్ర చవాన్, ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్గా మహేంద్రభట్, హిమాచల్ప్రదేశ్ అధ్యక్షుడిగా రాజీవ్ బిందల్, మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా హేమంత్ ఖండేల్వాల్, పుదుచ్చేరికి రామలింగం, మిజోరాంకు కె.బెచువా, అండమాన్ నికోబార్కు అనిల్ తివారిని అధ్యక్షులుగా నియమించింది. వీరంతా ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులే. ఈ నియామకాల ద్వారా ఆర్ ఎస్ ఎస్ తిరిగి బిజెపి పై పట్టు బిగించినట్లయింది.సగం రాష్ట్రాలకు కొత్తగా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో బిజెపి రాజ్యాంగం ప్రకారం జాతీయ అధ్యక్షుడి నియామకానికి లైన్ క్లియరైంది. అయితే అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేదానిపై రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కేంద్ర మంత్రులు శివరాజ్సింగ్ చౌహన్, ధర్మేంద్ర ప్రదాన్, మనోహర్లాల్ ఖట్టర్, భూపేంద్ర యాదవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరంతా ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నుంచే బిజెపిలోకి రాజకీయ ప్రవేశం చేసి వివిధ హోదాలలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తొలిసారిగా అధ్యక్ష పదవి మహిళకు అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, శోభా కరద్లాంజె, మహిళామోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన ఎంపికలు చేసే మోదీ-షా ద్వయం ఈసారి ఆర్ఎస్ఎస్తో సమన్వయంతో వెళ్లాల్సి ఉంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది. దాదాపు ఏడాదికి పైగా జాతీయ అధ్యక్షుడి నియామకంపై అనిశ్చితి కొనసాగుతోంది. బిజెపి అగ్రనాయకత్వం- ఆర్ ఎస్ ఎస్ మధ్య ఏకాభిప్రాయం లేని కారణంగానే ఆలస్యమయ్యింది. అయితే ఢిల్లీలో జరుగుతున్న ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ల సమావేశం తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి సంఘ్ సంపూర్ణ ఆశీస్సులున్న వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు అందబోతున్నాయి-వెంకటేష్ నాగిళ్ల, డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ ఢిల్లీ -
శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం
లక్నో: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) శుక్రవారం కొట్టేసింది. మథురలో శ్రీకృష్ణ జన్మభూమి నేపథ్యంగా సాగుతున్న కేసులో భాగంగా.. ఈ పిటిషన్ సైతం దాఖలైంది.షాహీ ఈద్గా అక్రమ కట్టడమని, కాబట్టి వివాదాస్పద స్థలంగా ప్రకటించాలని, ఈ కేసు విచారణ ముగిసే దాకా కోర్టు రికార్డుల్లో అలాగే ప్రస్తావించేలా కోర్టు సిబ్బందిని ఆదేశించాలని హిందూ సంఘాల తరఫున మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు లాయర్ ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్ను కొట్టేసింది.శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో వివిధ హిందూ సంఘాలు కోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆ పిటిషన్లో శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసులో,కోర్టు పత్రాల్లో భవిష్యత్ విచారణలలో షాహీ ఈద్గా మసీదు అనే పదాన్ని ఉపయోగించకుండా, దాని స్థానంలో వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశించమని పేర్కొన్నారు. ఇదే పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టంది. తదుపరి విచారణ ఆగస్టు 2కి వాయిదా వేసింది. #WATCH | Prayagraj, Uttar Pradesh: On Allahabad High Court dismissing an application seeking to substitute the term 'Shahi Idgah Mosque' with 'disputed structure,' Advocate Saurabh Tiwari says, "The High Court has rejected the application of considering it as the disputed… pic.twitter.com/uXy4TXyvZi— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2025 -
20 మంది గాళ్ఫ్రెండ్స్, ఇద్దరు భార్యలు..
ఇలా ఎలారా.. అని అవాక్కయ్యారా? ఒక్కరితోనే వేగలేక చస్తున్నాం, ఇంత మందిని ఎలా మేనేజ్ చేశావ్ బ్రో అంటూ బుర్ర బద్దలు కొట్టుకోకండి. పాపం ఎప్పటికైనా పండుతుంది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. నౌషాద్ త్యాగి విషయంలోనూ అదే జరిగింది. మహిళల జీవితాలతో చెలగాటమాడిన ఈ కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.ఎవరీ నౌషద్?ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలోని చార్తవాల్ ప్రాంతంలో జూలై 1న నౌషాద్ త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి పలువురు మహిళలను మోసం చేయడంతో పోలీసులు అతడికి బేడీలు వేశారు. యూపీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో కానిస్టేబుల్గా నటిస్తూ, మారు పేర్లతో కొన్నేళ్లుగా వంచనకు పాల్పడినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. త్యాగికి ఇద్దరు భార్యలు, 20 మంది స్నేహితురాళ్లు ఉన్నారని.. వీరిలో 10 మందితో శారీరక సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.వారే త్యాగి టార్గెట్..వితంతువులు, భర్తల నుంచి విడిపోయిన మహిళలను లక్ష్యంగా చేసుకుని త్యాగి మోసాలకు పాల్పడ్డాడు. తాను లక్ష్యంగా చేసుకున్న మహిళ మతం ఆధారంగా తన వేషం మారుస్తాడు. హిందూ మహిళలకు రాహుల్ లేదా రికీగా, ముస్లిం మహిళలకు నౌషాద్గా పరిచయం చేసుకుని దగ్గరవుతాడు. తర్వాత వారి నుంచి డబ్బు, బంగారం, ఖరీదైన వస్తువులు దోచుకుని ఉడాయిస్తాడు. ముజఫర్నగర్లో మొదటి భార్య, ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో అతడి రెండవ భార్య ఉంటారు. వీరిద్దరికీ తెలియకుండా త్యాగి వంచన పర్వం కొనసాగించాడు. మొదటి భార్య అతడి కంటే 23 సంవత్సరాలు పెద్ద.నాలుగు రాష్ట్రాల్లో మోసాలుయూపీతో పాటు ఢిల్లీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల్లో ఆరేళ్లుగా నౌషాద్ త్యాగి మోసాలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్, బులంద్షహర్, మధుర, సంభాల్, ముజఫర్నగర్ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో అతడు వంచన పర్వం సాగించినట్టు తెలిపారు. అంతేకాదు పోలీసు యూనిఫాం ధరించి జనాన్ని బెదిరించి డబ్బులు గుంజేవాడని చెప్పారు. సంబంధిత సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. తన మోసపూరిత చర్యలకు ఉపయోగించిన యూనిఫామ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.దొరికాడిలా..ముజఫర్ నగర్లో దుకాణం నడుపుతున్న ఒక వితంతువును త్యాగి వలలో వేసుకోవడంతో ఈ దురాగతం బయటపడింది. తనను రాహుల్ త్యాగిగా పరిచయం చేసుకుని, ఆమె దుకాణానికి తరచుగా వెళ్లేవాడు. ఆమెపై ప్రేమ నటించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2 లక్షల 75 వేల రూపాయలు గుంజాడు. తాకట్టులో ఉన్న 3 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను విడిపించేందుకు ఆమెను ఒప్పించాడు. అయితే పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా అతడు తప్పించుకోవడానికి చూసేవాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయట పడింది. అప్పటికే విషయం అర్థమై కొత్త 'తోడు' కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఉండగా పోలీసులు త్యాగి ఆట కట్టించారు. అతడి మొబైల్ ఫోన్లో అనేక మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. మారు పేర్లతో అతడు తయారు చేయించిన నేమ్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.చదవండి: ఎంత నరకం అనుభవించాడో..ఫ్రెండ్ యూనిఫాంతో మోసాలు..పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తున్న స్నేహితుడితో ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో నౌషద్ త్యాగి నివసించేవాడు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అతడి ఫ్రెండ్ మధ్యప్రదేశ్కు వెళ్లాల్సి వచ్చింది. అతడు అనుకోకుండా యూనిఫాం, ఇతర వస్తువులను త్యాగి వద్ద వదిలి వెళ్లాడు. వీటితో నౌషద్ మోసాలకు తెర తీశాడు. ముజఫర్నగర్కు మకాం మార్చి.. తనకు తాను పోలీసు కానిస్టేబుల్గా చెప్పుకుంటూ చెలరేగిపోయాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్కు చైనా, తుర్కియే సాయం
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్కు దాని మిత్రదేశం చైనా సహకరించిందా? ఇండియాకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసిందా? అంటే అవుననే చెబుతున్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్.సింగ్. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7 నుంచి 10వ తేదీ దాకా నాలుగు రోజులపాటు ఆ ఆపరేషన్ కొనసాగింది. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలు, లాండ్ప్యాడ్లు ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో పాకిస్తాన్కు చైనా సహకరించిందని, ఇండియన్ ఆర్మీ కదలికలకు సంబంధించి రియల్ టైమ్ సమాచారం చేరవేసిందని రాహుల్ ఆర్.సింగ్ తెలియజేశారు. తుర్కియే సైతం పాక్కు అండదండలు అందించిందని, కొన్ని రకాల ఆయుధాలు సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ‘నూతన తరంలో సైనిక సాంకేతికతలు’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భా రత సైన్యం దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకి స్తాన్కు చైనా, తుర్కియేలు చేతనైనంత సాయం చేశాయని పేర్కొన్నారు. ఆ మూడు దేశాల కుట్రను తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. తెరపైన కనిపించింది పాకిస్తాన్ కాగా, తెరవెనుక చైనా, తుర్కియే ఉన్నాయని వెల్లడించారు. #WATCH | Delhi: At the event 'New Age Military Technologies' organised by FICCI, Deputy Chief of Army Staff (Capability Development & Sustenance), Lt Gen Rahul R Singh says, "Air defence and how it panned out during the entire operation was important... This time, our population… pic.twitter.com/uF2uXo7yJm— ANI (@ANI) July 4, 2025అరువు తెచ్చుకున్న కత్తి చైనా తన ఆయుధాల సామర్థ్యం పరీక్షించుకోవడానికి పాకిస్తాన్ను ప్రయోగశాలగా వాడుకుంటోందని రాహుల్ ఆర్.సింగ్ స్పష్టంచేశారు. ఆ ఆయుధాలను చైనా గడ్డపై నుంచి ఇతర దేశాలపైకి ప్రయోగిస్తోందన్నారు. పాక్కు చైనా సహకరించడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. గత ఐదేళ్ల గణాంకాలు చూస్తే పాకిస్తాన్కు 81 శాతం మిలటరీ హార్డ్వేర్ చైనా నుంచే వచ్చినట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. పాక్ భూభాగం చైనాకు లైవ్ ల్యాబ్గా మారినట్లు తేల్చిచెప్పారు. యుద్ధక్షేత్రంలోకి నేరుగా అడుగుపెట్టకుండా ఇండియాపైకి పాకిస్తాన్ను ఉసిగొల్పడమే డ్రాగన్ వ్యూహమని రాహుల్ ఆర్.సింగ్ తెలిపారు. ‘అరువు తెచ్చుకున్న శక్తితో శత్రువును చంపడం’ చైనా ప్రాచీన యుద్ధతంత్రంలో భాగమని గుర్తుచేశారు. సరిహద్దుల్లో ఘర్షణ పడడం కంటే పాకిస్తాన్ను ముందుపెట్టి భారత్కు ఇబ్బందులు సృష్టించడం చైనా ధ్యేయంగా కనిపిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ అమల్లోకి వచ్చిన కొద్దిరోజులకే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అప్పట్లో వారు నిర్ణయించుకున్నారు. తుర్కియే అందిస్తున్న సహకారానికి షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘ప్యాడ్ మ్యాన్’గా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ప్రచారంపై రాజకీయ దుమారం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ చేపట్టిన ఎన్నికల వ్యూహం బెడిసికొట్టిందా?. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ప్యాడ్ మ్యాన్ సినిమా స్పూర్తితో కాంగ్రెస్ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్కు భంగపాటు ఎదురైనట్లు సమాచారం. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మై బహన్ మాన్ యోజన కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ బీహార్లోని ఐదులక్షల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంగానే ఉన్నా.. మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్లపై వివాదం రాజుకుంది. శానిటరీ ప్యాడ్ కవర్పై రాహుల్ గాంధీ ఫోటోతో పాటు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఉన్నాయి.కాంగ్రెస్ పార్టీ మహిళలకు అందించే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడంపై బీజేపీ, ఇతర పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మహిళల్ని కించపరిచేలా, వారి గౌరవాన్ని తక్కువ చేసేలా ప్రచారం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి ‘రాహుల్ ఫోటోతో శానిటరీ ప్యాడ్ పంపిణీ చేయడం మహిళల్ని అవమానించినట్లేనని ’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం బీజేపీ విమర్శల్ని ఖండిస్తోంది. నెలసరి సమయంలో మహిళల బాధల్ని ప్రపంచానికి చూపేలా శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. మై బహన్ మాన్ యోజన పథకం వివరాలు ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు నెలకు రూ.2,500 నేరుగా నగదు సహాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్లు చెప్పింది. మహిళల గౌరవాన్ని, ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ పథకం పేరు మై బహన్ మాన్ అని పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా మహిళా సంభాషణ అనే కార్యక్రమం ద్వారా 2 కోట్ల మహిళలతో నేరుగా సంప్రదింపులు జరుపుతోంది. -
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. -
హిమాచల్పై వరుణుడి పంజా.. 63 మరణాలు, 400 కోట్ల నష్టం
సిమ్లా: ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. కుండపోత వర్షంతో హిమాచల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. రాష్ట్రంలోని బియాస్ నది సహా ప్రధాన నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికి 63 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై ఏడో తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.హిల్స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు మండి జిల్లా తీవ్ర విధ్వంసానికి గురైంది. భారీ వర్షాలు, వరదలకు దాదాపు 400కుపైగా రోడ్లను అధికారులు మూసివేశారు. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 63కి పెరిగింది. మరో 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. రూ.400 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.VIDEO | Himachal Pradesh: Flash flood triggered by cloudburst causes severe damage in Thunag tehsil of Mandi district. Several houses damaged.#HimachalCloudburst #HimachalNews(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/XjM8R2jJHA— Press Trust of India (@PTI_News) July 4, 2025 शिमला : ढली के लिंडीधार में भारी लैंडस्लाइड - फोरलेन का डंगा गिरा - सैंकड़ों सेब के पेड़ दबे।घर छोड़ भागे लोग, 5 घरों को खतरा।#Shimla #Dhali #Landslide #HimachalNews #DDNewsHimachal pic.twitter.com/dKaekscobU— DD News Himachal (@DDNewsHimachal) July 3, 2025మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. జూలై 5న సిమ్లా, సోలన్, సిర్మౌర్, జూలై 6న ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, చంబా, మండి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే వర్షప్రభావం ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితం ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.Whoahh, that was close!!A massive landslide hit the Shillai area of Sirmaur district, Himachal Pradesh, India today, along National Highway 707 👀pic.twitter.com/nVvfZWty90— Volcaholic 🌋 (@volcaholic1) May 30, 2025Big houses, rocks all got washed away in the flood but "Pandav Shila" in Himachal Pradesh did not move from the place where it was, this is no less than a miracle. pic.twitter.com/pnhWE9Rp3I— Frontalforce 🇮🇳 (@FrontalForce) July 4, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు
తమిళనాడులో సంచలనం రేపిన అజిత్ కుమార్ (29) కస్టడీ డెత్(Custodial Death) కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్ కుమార్ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్ కుమార్ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్ కుమార్ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. ఏం జరిగిందంటే.. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్ ఆలయానికి జూన్ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్కుమార్(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్ చేశారు. అజిత్ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నాకు భద్రత ఇవ్వండిఅజిత్ కుమార్ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్ డీజీపీకి లేఖ రాశారు.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025 -
తీపి వద్దు.. సున్నా ముద్దు.. ఈ డ్రింక్స్కు భారీ డిమాండ్
చక్కెర లేని పానీయాల వినియోగం భారత్లో క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 మహమ్మారి తర్వాత ప్రధానంగా పట్టణాలూ, నగరాల్లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. గత 5 ఏళ్ల కాలంలో.. భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. కేవలం మూడు నెలల్లోనే కోకా–కోలా తయారీ ‘షుగర్ ఫ్రీ థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్’ అమ్మకాలు రికార్డు స్థాయిలో 25 లక్షల యూనిట్ కేసులు నమోదుకావడమే ఇందుకు ఒక ఉదాహరణ.ప్రముఖ మార్కెట్ పరిశోధన సంస్థ ‘మింటెల్ గ్రూప్’ రూపొందించిన గ్లోబల్ న్యూ ప్రొడక్ట్స్ గణాంకాల ప్రకారం 2019 జూలై– 2024 జూన్ మధ్య కాలంలో భారతీయ నాన్–ఆల్కహాల్ పానీయాల బ్రాండ్లు తక్కువ చక్కెర లేదా చక్కెర లేని డ్రింక్స్ను ఎక్కువగా ప్రవేశపెట్టాయి. దేశంలో తక్కువ చక్కెర, తగ్గించిన చక్కెర పేరుతో విడుదల చేసిన ఉత్పత్తుల సంఖ్య 5 ఏళ్లలో 483% పెరిగింది. చక్కెర రహిత ఉత్పత్తులు 142% అధికం అయ్యాయి. 2024లో అత్యధికంగా సుమారు రూ.750 కోట్ల పానీయాల అమ్మకాలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని వినియోగదారులు ఈ జోరును నడిపిస్తున్నారు. ‘చిన్న వయసు వారిలో కూడా ఊబకాయం, మధుమేహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శారీరక ఆరోగ్య స్పృహ పెరుగుతోంది’ అని మింటెల్ ఇండియా ఫుడ్, డ్రింక్ సీనియర్ అనలిస్ట్ అనామిక బెనర్జీ అన్నారు.జీరో షుగర్ప్రపంచంలోనే అతిపెద్ద పానీయాల కంపెనీ అయిన కోకా–కోలాతోపాటు సమీప ప్రత్యర్థి పెప్సికో, అలాగే రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్.. కేలరీలను లెక్కించే కస్టమర్ల కోసం జీరో–షుగర్ వేరియంట్స్ను ఆఫర్ ఉన్నాయి. డైట్, కేలరీలు లేని వేరియంట్స్ అయిన కోక్ జీరో, డైట్ కోక్, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్ఫోర్స్ వంటి వాటికి భారత్లో డిమాండ్ దూసుకెళుతోందని కోకా–కోలా తెలిపింది. ప్రధానంగా యువతలో వీటి వినియోగం ఎక్కువని వివరించింది. మారుతున్న జీవనశైలి, అందుబాటులో విభిన్న ఉత్పత్తులు ఉండడం ఈ వృద్ధిని నడిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతానికి నగరాలూ పట్టణాల్లోనే.. ఎలక్ట్రోలైట్స్తో కూడిన పానీయం బాడీఆర్మర్ లైట్, స్పోర్ట్స్ డ్రింక్ ఛార్జ్డ్తోపాటు హానెస్ట్ టీ ఉత్పత్తులను ఇటీవలే కోకా–కోలా అందుబాటులోకి తెచి్చంది. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘కాంటార్’ అధ్యయనం ప్రకారం చక్కెర లేని పానీయాలను వినియోగించే భారతీయ కుటుంబాల సంఖ్య నాలుగేళ్లలో 78% పెరిగింది. అయితే ఈ ఉత్పత్తులు ఇప్పటికీ నగరాలు, పెద్ద పట్టణాలకే పరిమితమయ్యాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలకు చేరుకోవడానికి ఇంకా చాలా కాలం పడుతుందని ‘కాంటార్’ వరల్డ్ ప్యానెల్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ (దక్షిణాసియా) కె.రామకష్ణన్ అన్నారు. మహమ్మారి తర్వాత.. పెప్సికో పానీయాల విక్రయాల్లో గత ఏడాది సెవెనప్, పెప్సి, గాటోరేడ్ వంటి బ్రాండ్ల తక్కువ–చక్కెర, చక్కెర లేని విభాగం ఉత్పత్తుల వాటా పరిమాణం పరంగా 44% ఉంది. ఆఫ్రికా, నేపాల్, శ్రీలంకతో కలిపి.. తక్కువ–చక్కెర, చక్కెర లేని ఉత్పత్తుల అమ్మకాలు సంస్థ మొత్తం పరిమాణంలో 53% వాటాను కలిగి ఉన్నాయని భారత్లో పెప్సికో ఉత్పత్తులను తయారు చేస్తున్న వరుణ్ బెవరేజెస్ తెలిపింది. కంపెనీ పోర్ట్ఫోలియోలో తక్కువ–కేలరీ, జీరో–షుగర్ ఉత్పత్తులు 50% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. చక్కెర రహిత, తక్కువ చక్కెర పానీయాల పట్ల వినియోగదారులకు కొంత ఆసక్తి ఉన్నప్పటికీ.. కోవిడ్–19 మహమ్మారి తర్వాత వీటి వినియోగంలో గుర్తించదగిన మార్పు వచ్చిందని వివరించారు. ‘కోవిడ్ సమయంలో ఇంటి భోజనానికి, శారీరక శ్రమకు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్రీ ఆధారిత ఉత్పత్తుల తయారీకి మొగ్గు చూపేలా చేసింది’ అని తెలిపారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిమితులు.. చక్కెర శాతం, కేలరీల సంఖ్య, ఉపయోగించే స్వీటెనర్ రకాన్ని బట్టి సాధారణ, ఆరోగ్యకర పానీయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఇటీవలి కాలంలో కృత్రిమ స్వీటెనర్ల వాడకం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. వీటి ప్రభావం భారతీయులపై ఏ మేరకు ఉందో పరిశీలిస్తామని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. స్టీవియా, ఎసిసల్ఫేమ్ పొటా షియం, అస్పాటేమ్, సుక్రలోజ్ వంటి నాన్–కెలోరిక్ స్వీటెనర్ల వాడకానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ భద్రతా పరిమితులను కూడా నిర్దేశించింది. -
ఉదయం పెళ్లి.. సాయంత్రం ప్రియుడితో నవ వధువు జంప్
అన్నానగర్: పెళ్లి రోజున బ్యూటీ సెలూన్కు వెళుతున్నట్లు చెప్పి ప్రియుడితో నవ వధువు పరారైంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పెళ్లింట ఇలా వధువు వెళ్లిపోయిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం..పెరంబూర్లోని అంబేడ్కర్ నగర్కు చెందిన అర్చనకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ మేరకు బుధవారం ఉదయం బెసెంట్నగర్ ఆలయంలో వారి వివాహ వేడుక జరిగింది. తర్వాత వధూవరులు ఇంటికి వెళ్లారు. సాయంత్రం వివాహ విందుకు ఏర్పాట్లలో రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. అర్చన తన తల్లిదండ్రులకు రిసెప్షన్ కోసం బ్యూటీ సెలూన్కు వెళుతున్నానని చెప్పి, తన కొంతమంది స్నేహితులతో వెళ్లింది.అనంతరం, అర్చన ఇంటికి తిరిగి రాలేదు. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండడంతో ఆందోళన చెందిన ఆమె తల్లిదండ్రులు అర్చన సెల్ఫోన్కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ ఆఫ్లో ఉంది. ఆమెతోపాటు వచ్చిన ఆమె స్నేహితులు కూడా అదృశ్యమయ్యారు. ఆమె తల్లిదండ్రులు విచారించగా, అర్చన ఇప్పటికే ఎరుకంజేరికి చెందిన ఒక యువకుడిని ప్రేమించిందని, పెళ్లి తర్వాత అతనిని వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసిందని వారికి తెలిసింది.ఈ క్రమంలో బ్యూటీ సెలూన్కు వెళ్లే నెపంతో ఆమె తన ప్రియుడితో పారిపోయిందని కూడా తేలింది. వధువు అదృశ్యం కావడంతో వరుడు, అతని బంధువులు ఒక్కసారిగా షాకై దిగ్భ్రాంతి చెందారు. దీంతో వివాహ రిసెప్షన్ రద్దు చేసుకున్నారు. ఈ విషయమై అర్చన తల్లి తిరు.వి.కె.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన నవ వధువు, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. నిర్మల ముందంజ..అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. వనతి శ్రీనివాసన్..తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్ కనిపించే అవకాశం ఉంది.పురందేశ్వరిరాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.ఆర్ఎస్ఎస్ ఆమోదంమహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో వరంగల్లోని ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లు తేలింది. వరంగలకు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాల తీసుకున్నట్లు సమాచారం.ఈ స్కాంలో 36 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీ తనిఖీలలో అక్రమాలు బయటపడ్డాయి. చత్తీస్గఢ్కు చెందిన రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.రెండు దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కొమ్మిరెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి 50 లక్షల వసూలు చేసినట్లు తేలింది. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు సీబీఐ గుర్తించింది. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి రెండు విడతలగా డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ చెందిన డాక్టర్ అంకం రాంబాబు, విశాఖపట్నం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్లను మధ్యవర్తులుగా సీబిఐ గుర్తించింది. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ.60 లక్షలు ముట్టజెప్పినట్లు సీబీఐ గుర్తించింది. -
19న అఖిలపక్ష సమావేశం: రిజిజు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండు రోజులు ముందుగా 19వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్ట్ 21 వరకు నెల రోజులపాటు జరగనున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారని కిరణ్ రిజిజు ‘ఎక్స్’లో వెల్లడించారు. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 13, 14వ తేదీల్లో సమావేశాలు ఉండవని చెప్పారు. పార్లమెంటు సమావేశాలను ఆగస్ట్ 12వ తేదీతోనే ముగించాలని ముందుగా నిర్ణయించారు. అయితే కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన వాటిని అమలు చేయడానికే సమావేశాల వ్యవధిని మరో తొమ్మిది రోజులు పొడిగించినట్లు సమాచారం. సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సంక్షేమానికి సంబంధించిన బిల్లులతో సహా పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
బలమైన భారత్తో స్థిరమైన ప్రపంచం
ఆక్రా: భారతదేశం బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండియా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి ప్రపంచ ప్రగతికి ఉ్రత్పేరకంగా మారిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచానికి ఒక బలమైన మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. భారత్ మరింత బలోపేతమైతే ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి తిరుగు ఉండదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నినాదాలకు మించిన కార్యాచరణ ‘‘అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. స్థిరమైన పాలన, రాజకీయ వ్యవస్థ అనే పునాదిపై ఇండియా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. గ్లోబల్ సౌత్లో మా వాటా 16 శాతంగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మా దేశంలోనే ఉంది. ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్గా మారింది. పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ప్రపంచానికి కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటివి సమస్యగా మారాయి. గత శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు వీటిని పరిష్కరించలేకపోతున్నాయి. అందుకే గ్లోబల్ గవర్నెన్స్లో విశ్వసనీయమైన, ప్రభావంతమైన సంస్కరణలు కచి్చతంగా రావాలి. ప్రపంచం బాగు కోసం గ్లోబల్ సౌత్కు మరింత బలం చేకూరాలి. నినాదాలకు మించిన కార్యాచరణ కావాలి. జీ20 కూటమికి మేము సారథ్యం వహించినప్పుడు ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే విజన్తో పనిచేశాం. మా హయాంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యదేశంగా మారింది. ఆఫ్రికా అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకొనేందుకు ఇండియా కట్టుబడి ఉంది. ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం ఆఫ్రికా అభివృద్ధి ఎజెండా–2063కు మద్దతిస్తున్నాం. ఆఫ్రికా లక్ష్యాలు మాకు ప్రాధాన్యతలు. కలిసి పనిచేస్తూ సమానంగా ఎదగాలన్నదే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం కొనసాగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తాం. ఆఫ్రికాలో కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు, స్థానిక ప్రజల సాధికారతే మా ధ్యేయం. స్ఫూర్తిదాయకమైన చరిత్ర కలిగిన ఘనాలో పర్యటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్. మాకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు.. మా ప్రాథమిక విలువల్లో అదొక అంతర్భాగం. ఇండియాలో ప్రజాస్వామ్యానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం చర్చ, సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అది ప్రజలను ఐక్యం చేస్తుంది. గౌరవం, మానవ హక్కులకు అండగా నిలుస్తుంది. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఆత్మలాంటివి. ఇండియాలో ఎన్నికల సంఘం పనితీరును దగ్గరగా గమనించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో ఘనా–ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సొసైటీని స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఇండియాలో 2,500 రాజకీయ పారీ్టలున్నాయని మోదీ చెప్పగా ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భారత్–ఘనా మధ్య ‘సమగ్ర భాగస్వామ్యం’ భారత్–ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్–ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. తొలుత ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతోపాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు.మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఎంతో గర్వకారణమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనా జాతీయ గౌరవ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.ముగిసిన ఘనా పర్యటనభారత ప్రధానమంత్రి ఘనాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. -
ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు
మౌ: ఉత్తరప్రదేశ్లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది. ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. -
కొనసాగుతున్న జడ్జీల ఎంపిక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్ట్లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తన ఎంపిక విధానాన్ని మరింతగా కఠినతరం చేసింది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లో 54 మంది అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమగ్ర వివరాలను కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన కోలీజియం జూలై 1, 2 తేదీల్లో అభ్యర్థులతో విస్తృతంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొదటి రోజున 20 మందితో, రెండో రోజున 34 మందితో సమావేశమైంది. అభ్యర్థుల పనితీరు, బయోడేటా, అనుభవం వంటి అంశాలపై అరగంటపాటు ప్రశ్నలు సంధిస్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటివరకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టులు, అలాగే సంబంధిత హైకోర్టులకు చెందిన సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలపైనే ఆధారపడుతూ నియామకాలు జరిగేవి. కొలీజియం ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో సిఫారసుల ఆమోదంలో ఆలస్యాలు రావడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. కొంతమంది అభ్యర్థులు వీలైనంతకాలం ఎదురు చూడలేక తమ అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది. అయితే ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన అప్రకటిత నగదు కేసు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు వంటి పరిణామాల నేపథ్యంలో కొలీజియం ఈసారి తన పరిశీలనను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, జిల్లా న్యాయవ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఒక రోజు, బార్ అభ్యర్థుల కోసం మరొక రోజు కేటాయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలుండగా ఇందులో తెలంగాణ హైకోర్టులో 16, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
బిహార్లో ఒంటరి పోరు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం విపక్ష ఇండియా కూటమికి ఝలక్ ఇచ్చే కీలక ప్రకటన చేశారు. వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలకు ఉద్దేశించింది మాత్రమేనని పేర్కొన్నారు. ‘ఆప్ బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇండియా కూటమి లోక్సభ ఎన్నికలకు మాత్ర మే. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు లేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్ పార్టీ గుజరాత్లోని విశావదర్ ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేసింది. కాంగ్రెస్ కేవలం ఆప్ను ఓడించేందుకు పోటీ చేసింది. ఆప్ను ఓడించేందుకు, ఓట్లను తగ్గించేందుకు కాంగ్రెస్ను బీజేపీ పంపింది’అని అహ్మదాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బిహార్లో ఆప్ తన ఎన్నికల అరంగేట్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టిందన్నారు. తమ నిర్ణయం ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను సవాల్ చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైన చర్యగా అభివరి్ణంచారు. అదే సమయంలో గుజరాత్లో ఆప్ రాజకీయ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘గుజరాత్లో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు. అయినప్పటికీ బీజేపీ పదేపదే గెలుస్తోంది. దీనికి కారణం అక్కడ బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ బీజేపీ జేబులో ఉంది. ఒకవిధంగా బీజేపీని గెలిపించే కాంట్రాక్ట్ను కాంగ్రెస్ తీసుకుంది. ప్రజలు కాంగ్రెస్ను నమ్మరు. కాంగ్రెస్కు ఓటేస్తే గెలవరని, గెలిచినా బీజేపీలోకి వెళ్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఆప్ను ప్రజలు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. గుజరాత్ను మొదటి 30 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత 30 ఏళ్లు బీజేపీ పాలించాయి. ఇప్పుడు ఆప్కు అవకాశం వస్తుంది’అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు దెబ్బేఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రధానంగా యాదవులు, ముస్లింలు, దళితుల ఓట్లపైనే ఆధారపడ్డాయి. కాంగ్రెస్ ఎక్కువగా పట్టణ, దళిత నియోజకవర్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆప్ సైతం ఈ ఓట్లపైనే దృష్టి పెట్టే అవకాశముంది. విద్య, ఆరోగ్యం, విద్యుత్ వంటి అంశాలపై బిహార్లో ప్రజల వద్దకు వెళ్తామని, పట్టణ పేదలు, గ్రామీణుల ప్రజలను చేరుకునేలా తమ వ్యూహం ఉంటుందని కేజ్రీవాల్ ఇదివరకే ప్రకటించారు. ఆప్ నిజంగా అదే వ్యూహంతో ముందుకెళితే ఇండియా కూటమి ఓట్లకు భారీగా గండి పడే అవకాశాలున్నాయి. గడిచిన లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఇండియా కూటమి 9 స్థానాలను గెలుచుకుంది. ఆప్ పోటీలో నిలిస్తే కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్ల వాటాను దెబ్బతీసే అవకాశాలున్నాయి. ఇది పరోక్షంగా ఎన్డీఏకు ప్రయోజనం చేకూర్చనుంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 52 శాతం, ఇండియా కూటమి 42 శాతం ఓట్లను సాధించాయి. ఇప్పుడు ఆప్ పోటీలో ఉంటే ఇండియా కూటమికు నష్టం జరిగే అవకాశం ఉంది. సంక్లిష్టమైన కుల సమీకరణాలు, బలమైన ప్రాంతాయ పార్టీల ఆధిపత్యం ఉండే బిహార్ రాజకీయాల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ఆప్ నిర్ణయం ఇండియా కూటమికి నష్టం కలిగించేదేనని రాజకీయ విశ్లేషకులు సైతం లెక్కలు వేస్తున్నారు. ఆప్ కనీసంగా 5–10శాతం ఓట్లు సాధించినా, అది ఎన్డీఏకే కలిసొస్తుందని అంటున్నారు. ఈ ఓట్ల శాతం రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయంగా తనను ప్రకటించుకునేందుకు ఆప్కు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
‘మరాఠిని అవమానిస్తే ఉపేక్షించం’
ముంబై: ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠీ భాషకు సంబంధించి రగడ మొదలైంది. ఇప్పటికే త్రి భాషా పాలసీ తీర్మానాన్ని రద్దు చేయించడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రతిపక్ష పార్టీలు.. ఇప్పుడు మరాఠి భాషను ఎవరైనా అవమానిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపుతున్నాయి. . ఓ షాపు కీపర్ మరాఠి భాష మాట్లాడలేదనే కారణంతో అతనిపై ఓ వర్గం దాడికి దిగడంపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మాట్లాడారు. ఎవరూ కూడా ఈ తరహా దాడులు చేసి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూనే మరాఠీ భాషను మహారాష్ట్రలో ఉండేవారు ఎవరైనా అవమానిస్తే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఒకవేళ అలా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఎమ్మెన్నెస్కు చెందిన కార్యకర్తలు పలువురి కలిసి ఓ స్టీట్ షాపు కీపర్పై దాడి చేశారు. సదరు షాప్ కీపర్ మరాఠీ మాట్లాడనందుకు, ఆ భాషా మాట్లాడటం ఏమైనా తప్పనిసరి చేశారా? అని ప్రశ్నించినందుకు ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జరిగి ఒక రోజు తర్వాత ఆదిత్యా ఠాక్రే మాట్లాడారు. ఎవరైన మరాఠీ భాషను అవమానిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఎవరూ భౌతిక దాడులకు దిగవద్దని, మరాఠీ భాషన అవమానించే వారికి చట్టపరంగా బుద్ధి చెబుదామన్నారు.ఇప్పుడు దీనిపై అధికార బీజేపీకి ప్రతిసక్ష పార్టీలకు మహారాష్ట్రలో తీవ్ర రగడ జరుగుతోంది. మరాఠీ భాష మాట్లాడడం అనేది తప్పనిసరిక, కానీ ఇలా భాష మాట్లాడలేదని దాడులకు దిగి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతమాత్రం తగదని మహారాష్ట్ర మంత్రి,, శివసేన నాయకుడు యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. #WATCH | Mumbai | On a viral video of a shop owner in Thane assaulted for purportedly refusing to speak in Marathi, Maharashtra Minister Yogesh Kadam says, "In Maharashtra, you have to speak Marathi. If you don't know Marathi, your attitude shouldn't be that you won't speak… pic.twitter.com/kSXV1JekAn— ANI (@ANI) July 3, 2025 -
ప్రజాగ్రహం దెబ్బకు తలొగ్గిన ఢిల్లీ ప్రభుత్వం
సాక్షి,ఢిల్లీ: ప్రజాగ్రహంతో ఢిల్లీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇటీవల ప్రకటించిన ‘ఎండ్ ఆఫ్ లైఫ్’ (EOL) వెహికల్ పాలసీపై తీవ్ర విమర్శల నేపథ్యంలో.. పాత వాహనాలపై నిషేధంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలు నష్టపోకుండా.. ప్రయోజనం చేకూరేలా కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.వాహనం వయస్సు ఆధారంగా కాకుండా వాతావరణం కాలుష్యం చేసే వాహనాలపై మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. వాహనాల కాలుష్యం విషయంలో యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చేలా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ విధానం ఢిల్లీతో పాటు ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ అమలు చేయాలన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది.క్వాలిటీ ఎయిర్ మేనేజ్మెంట్ నుంచి తదుపరి మార్గదర్శకాలు వచ్చే వరకు పాలసీ అమలును నిలిపి వేయనుంది. ఇది వాహన యజమానులకు తాత్కాలిక ఊరట కలిగించినా, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. Delhi Environment Minister Manjinder Singh Sirsa writes to the Commission for Air Quality Management to place on hold the enforcement of Direction No. 89, which mandates the denial of fuel to End-of-Life (EOL) vehicles in Delhi"We urge the Commission to put the implementation… pic.twitter.com/mgg1Ymdaes— ANI (@ANI) July 3, 2025 -
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది. -
F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. -
కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు. -
మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025 -
రామ్దేవ్ పతంజలికి డాబర్ దెబ్బ
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్ప్రాష్(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్ యాడ్ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. న్యూఢిల్లీ: చ్యవన్ప్రాష్ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్ప్రాష్లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. చ్యవన్ప్రాష్ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం. ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. -
యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
మీరట్: ఉత్తరాదిన జూలై 11న ప్రారంభమయ్యే వార్షిక కన్వర్ యాత్ర నేపధ్యంలో యూపీలోని మీరట్ జిల్లా యంత్రాంగం పలు నిబంధనలను విధించింది. కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఫుడ్ కోర్టులు తాము విక్రయించబోయే ఆహార పదార్థాల జాబితా, వాటి ధరలతో సహా ఇతర కీలక సమాచారాన్ని బహిరంగంగా ప్రదర్శించాలని మీరట్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గత ఏడాది ఇటువంటి నిబంధనల నేపధ్యంలోనే ప్రభుత్వానికి వ్యాపారులకు మధ్య వివాదం తలెత్తింది. మీరట్ డివిజనల్ కమిషనర్ హృషికేష్ భాస్కర్ యశోద్ మీడియాతో మాట్లాడుతూ కన్వర్ యాత్రామార్గంలోని అన్ని ఆహారశాలల వెలుపల ఆహార పదార్థాల ధరల జాబితాను ప్రదర్శించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. దీని వలన భక్తుల నుంచి అధిక ఛార్జీలు తీసుకునేందుకు అవకాశం ఉండదు. అలాగే తమకు కావలసిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఆహారశాలల యజమానులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, ఆహార భద్రత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను బహిరంగంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని హృషికేష్ భాస్కర్ యశోద్ తెలిపారు. ఆహార భద్రతా చట్టం, 2006లోని సెక్షన్ 55 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. #WATCH | Meerut, UP | Commissioner Meerut Division, Dr Hrishikesh Bhaskar Yashod says, "The district administration is ensuring that a list of food items and their prices is displayed outside all the food joints along the Kanwar yatra route. The food safety department will ensure… pic.twitter.com/9wrpzdS7rp— ANI (@ANI) July 2, 2025కన్వర్ యాత్రను శివ భక్తులు చేపడుతుంటారు. శ్రావణ మాసంలో గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి. శివునికి అభిషేకం చేస్తుంటారు. ఈ యాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కాగా 2024లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార బండ్లు నిర్వహించేవారు తమ పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. అయితే ఇది వివాదాస్పందంగా మారి, సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వ చర్యను నిలిపివేసింది. ఆహారశాలల యజమానులు తాము అందించే ఆహార పదార్థాలను సూచిస్తే సరిపోతుందని, యజమానుల పేర్లు, వారి గుర్తింపులను ప్రదర్శించాలంటూ ఒత్తిడి చేయవద్దని పేర్కొంది.ఇది కూడా చదవండి: అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. అంతటా ‘హర్ హర్ మహదేవ్’ నినాదాలు -
భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్సింగ్తో తరచూ టచ్లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చదవాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉంటున్నాడట. హర్యానా ఫరీదాబాద్లో మంగళవారం ఉదయం ఈ ఘటన చోట చేసుకుంది. నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్ను ఆశ్రయించాడు. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. ఈ క్రమంలో.. జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్తో కలసి జిమ్కు వెళ్లాడు. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఆ శబ్దానికి జిమ్లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా ఛానెల్స్కు చేరింది. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఎక్సర్సైజులు చేసేప్పుడు ఈ కింది విషయాలు గుర్తుంచుకోండిశరీర సామర్థ్యానికి మించి వ్యాయామాలు ప్రమాదకరంస్టెరాయిడ్స్, సప్లిమెంట్స్లాంటి వాటిని వీలైనంత దూరంగా ఉండాలి హార్ట్బీట్, బీపీలను నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలివ్యాయామాలకు ఉదయం సరైన సమయంజిమ్ చేసే టైంలో.. గుండె వేగంగా కొట్టుకున్నట్లు(గుండె దడ) అనిపిస్తే వెంటనే ఆపేయాలిఅలసిపోయినప్పుడు, జ్వరం లేదంటే బలహీనంగా అనిపించినా జిమ్కు వెళ్లకూడదుజిమ్ను కొత్తగా ప్రారంభించేవాళ్లు.. నిపుణుల సమక్షంలోనే మొదలుపెట్టడం ఉత్తమంభారీ బరువులు ఎత్తే ముందుకు సరైన శిక్షణ తీసుకుని ఉండాలి.. లేకుంటే ఎత్తకూడదుట్రెడ్మిల్ పరిగెత్తడానికి పరిమితి ఉండాలి.. అదే పనిగా చేయకూడదుఎక్సర్సైజుల మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ
బుల్లితెర, వెండితెర, రాజకీయం.. అన్నిచోట్లా తనదైన మార్క్ చూపించారు స్మృతి ఇరానీ (Smriti Irani). సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్మృతి చిన్న వయసులోనే జీవితాన్ని చదివేశారు. కష్టాలు, తిరస్కరణలు తనను రాటు దేల్చాయి. అందుకే నటిగా మొదలైన తన ప్రయాణం కేంద్రమంత్రిని చేసింది. స్మృతి ఇరానీ మొదట యాడ్స్లో.. తర్వాత సీరియల్స్లో నటించారు. నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సీరియల్స్ కూడా నిర్మించారు. నా జీవితం అగ్నిపథ్ సినిమావంటిదిజై బోలో తెలంగాణ సహా పలు చిత్రాల్లో యాక్ట్ చేశారు. రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ బీజేపీలో కేలక నేతగా ఎదిగారు. ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగానూ సేవలందించారు. తాజాగా స్మృతి ఇరానీ దర్శకనిర్మాత కరణ్ జోహార్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ జీవితాన్ని ప్రతిబింబించే పాట ఏది? అన్న ప్రశ్నకు స్మృతి.. పాట సంగతేమోకానీ, కుచ్ కుచ్ హోతా హై మూవీ నుంచి నా లైఫ్ సడన్గా అగ్నిపథ్ మూవీగా మారిపోయిందని బదులిచ్చారు. అమ్మకు అన్యాయంఏదైనా ప్రేమగీతం చెప్తారనుకుంటే ఇలా ప్రతీకారంతో రగిలిపోయే సినిమాను ఎంపిక చేసుకున్నారేంటని కరణ్ తిరిగి ప్రశ్నించారు. అందుకు స్మృతి స్పందిస్తూ.. తల్లి లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కొడుకు చేసే ప్రయత్నాలను అగ్నిపథ్లో చూపిస్తారు. అమ్మకు అన్యాయం జరిగిందన్నది అతడి ఆవేదన. నా లైఫ్లోనూ అదే జరిగింది. మా అమ్మకు అన్యాయం జరిగిందని నేను భావిస్తాను. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఎందుకో తెలుసా? తను కొడుకును కనివ్వలేదని!అద్దె ఇంట్లో ఉన్న అమ్మకు..అగ్నిపథ్ సినిమాలోలాగే నేను కూడా నా తల్లికి న్యాయం చేయాలనుకున్నాను. ఆ ఇంటికి అమ్మను తిరిగి తీసుకెళ్లాలనుకున్నాను. ఎప్పటికైనా ఆ ఇల్లు కొనివ్వాలని డిసైడయ్యాను. దాదాపు అమ్మ జీవితమంతా అద్దింట్లోనే ఉంది. ఆరేళ్ల క్రితం తనకు ఇల్లు కొనిచ్చాను. కానీ, ఫ్రీగా ఉండటం ఇష్టం లేక ప్రతి నెలా నాకు రూ.1 అద్దె కడుతోంది అని చెప్పుకొచ్చారు.కష్టాలతో సావాసంమరో ఇంటర్వ్యూలోనూ తన పేరెంట్స్ కష్టాలు బయటపెట్టారు స్మృతి ఇరానీ. నాన్న ఆర్మీ క్లబ్ బయట పుస్తకాలు అమ్మేవాడు. అమ్మ ఇంటింటికీ తిరిగి మసాలా దినుసులు అమ్మేది. నాన్న పెద్దగా చదువుకోలేదు. కానీ, అమ్మ డిగ్రీదాకా చదివింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు రూ.150 మాత్రమే వారి చేతిలో ఉన్నాయి. గేదెల కొట్టంలోని ఓ గదిలో వారు నివసించేవారు అని పేర్కొన్నారు. కాగా స్మతి పేరెంట్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగా.. కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.చదవండి: ఓటీటీలోకి సడన్గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే? -
అమర్నాథ్ యాత్ర షురూ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహలోని మంచు స్ఫటిక శివలింగ దర్శనానికి వేళయ్యింది. అత్యంత కఠినమైన, అననుకూల వాతావరణం మధ్య మొత్తం 38 రోజులపాటు సాగే అమర్నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. ఉదయం 3,880 మీటర్ల ఎత్తులోని అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీకి తొలి హారతి కార్యక్రమం నిర్వహించారు. వందలు, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన భక్తుల్లో మొదటి యాత్రికుల బృందం పహల్గాం, బాల్టాల్ బేస్ క్యాంప్ల నుంచి ‘హర్ హర్ మహాదేవ్’, ‘బమ్ బమ్ భోలే’ నినాదాలతో గుహ దిశగా ప్రయాణం ప్రారంభించారు. బుధవారం జమ్మూలోని భగవతీ నగర్ క్యాంప్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపడంతో 168 వాహనాల్లో 5,892 మందితో కూడిన యాత్రికుల తొలి బృందం పయనమైంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీన రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. ఇప్పటికే 3.5 లక్షలకుపైగా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జమ్మూలోని సరస్వతీ ధామ్, వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ సభ వంటి కేంద్రాల్లో రోజూ సుమారు 2,000 మంది రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. 2011లో అత్యధికంగా 6.34 లక్షల మంది భక్తులు అమర్నాథుని దర్శించుకున్నారు. ఈసారి ఇప్పటి వరకు యాత్రకు 3.5 లక్షల మంది ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు.The first batch of Shri #AmarnathYatra2025 pilgrims was flagged off by Srinagar Police and the CRPF from the Pantha chowk base camp and directed to the Baltal base camp.#spiritualjourney #amarnathcave #yatra2023 #jammukashmir #DivineJourney #religioustourism #mountainpilgrimage pic.twitter.com/KHI1zN9Z4t— crpf_fan (@CrprepostFan) July 2, 2025ఘనమైన భద్రతా ఏర్పాట్లు1990 నుంచి 2017 వరకు అమర్నాథ్ యాత్ర మార్గంలో 36 వరకు ఉగ్రవాద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 53 మంది యాత్రికులు మరణించగా, మరో 167 మంది గాయపడ్డారు. 2000లో అమర్నాథ్ యాత్రపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ఏడాది యాత్రను ప్రశాంతంగా పూర్తి చేయడానికి జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశాయి. ప్రధానమైన పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో కాంక్రీటు బంకర్లు, చెక్పోస్టులు, డ్రోన్ల ద్వారా నిత్యం నిఘా కొనసాగిస్తున్నారు. యాత్రికుల వాహనాలు పాస్ల ద్వారా మాత్రమే అనుమతులు పొందుతున్నాయి. పలు అంశల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రతి దశలో మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్లతో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు.రెండు రూట్ల ద్వారా యాత్రపహల్గాం రూట్: 48 కిలోమీటర్ల దూరం, సుమారు 5 రోజులు పడుతుంది. పహల్గాం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందన్వాడి వరకు యాత్ర తేలిక. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న పిస్సూ టాప్, ఆపై మరో 9 కిలోమీటర్లు నడవాలి. సాయంత్రానికి శేషనాగ చేరుకుంటారు. రెండో రోజు అక్కడ్నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచతరణి చేరుకుంటారు. ఆపైన చివరిగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమర్నాథ్ గుహకు పయనమవుతారు. బాల్టాల్ మార్గం: యాత్ర సమయం తక్కువగా ఉన్న వారు ఈ మార్గంలో వెళ్లవచ్చు. సుమారు 16 కిలోమీటర్ల దూరముండే ఈ మార్గంలో సుమారు 2 రోజుల్లో పవిత్ర గుహకు చేరుకునే వీలుంది. అయితే ఇది కాస్త కఠినమైన పర్వతమయం, మలుపులతో కూడిన మార్గం. వృద్ధులకు అనువైంది కాదు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం -
పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పాక్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్ అకౌంట్స్ అన్నింటినీ భారత్లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు భారత్లో అన్బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. భారత్లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది. -
ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం
బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్లోని బార్మర్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్దేవ్కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్ మేఘ్వాల్ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్ మేఘ్వాల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్ మేఘ్వాల్కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్ మేఘ్వాల్ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్ మేఘ్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్ మేఘ్వాల్ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్ మేఘ్వాల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్ మేఘ్వాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ -
గదిలో బంధించాడు వివస్త్రను చేశాడు!
కోల్కతా: లా కాలేజీ గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు. గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది. ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్ గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి. మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు. -
SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్జెట్ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్ ఇంటీరియర్ కిటికీ ఫ్రేమ్ను బిగించామని స్పైస్జెట్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు ట్యాగ్చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. #SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu— Aatish Mishra (@whatesh) July 1, 2025 -
విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో జూన్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగిన దరిమిలా అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ముగ్గురు శిక్షణ పొందిన పైలట్లు ఎయిర్లైన్స్ బోయింగ్ 787 విమాన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ పైలట్లు విద్యుత్ వైఫల్యాలను తిరిగి సృష్టించారు. ఫలితంగా డ్యూయల్-ఇంజిన్ నిలిచిపోయంది. దీంతో విమానం టేకాఫ్ తర్వాత పైకి వెళ్లలేకపోయింది.ప్రమాద ఘటన అనంతరం జెట్లైనర్ బ్లాక్ బాక్స్ల నుండి ఇప్పటికే డేటాను డౌన్లోడ్ చేసుకున్న పరిశోధకులు, 787లోని ఇంధన స్విచ్ల స్థానాన్ని కూడా పరిశీలించనున్నారు. ఇంధన స్విచ్ల శిధిలాలతో ఈ డేటాను ధృవీకరించనున్నారు. విమానం క్లిష్టమైన దశకు చేరుకున్నప్పుడు టేకాఫ్ రన్ సమయంలో పైలట్లు అనుకోకుండా ఏదైనా స్విచ్ ఆఫ్ చేశారా? అనేదానిని నిర్ధారించడానికి రీక్రియేషన్ ఉపకరించనుంది.రీక్రియేషన్ చేసిన పైలెట్లు ఘటన జరిగిన నాటి పరిస్థితులను తిరిగి సృష్టించారు. ఈ ఫలితాలతో ట్రిమ్ షీట్ డేటాను రూపొందించారు. ట్రిమ్ షీట్ అనేది విమానం సమతుల్యతను లెక్కించడానికి, రికార్డ్ చేయడానికి ఏవియేషన్లో ఉపయోగించే విధానం. ఇది విమానపు టేకాఫ్, ల్యాండింగ్ కోసం గురుత్వాకర్షణ కేంద్రం సురక్షిత పరిమితుల్లో ఉందని నిర్ధారిస్తుంది. శిక్షణ పైలట్లు ఒకే ఇంజిన్ వైఫల్యాన్ని రీక్రియేట్ చేసి, పలు వివరాలను సేకరించారు. కాగా ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానంలోని పైలట్లకు 400 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు డ్యూయల్-ఇంజిన్ వైఫల్యం తలెత్తితే, దానిని ఎదుర్కొనేందుకు శిక్షణ అందించలేదని సమాచారం. ఇది కూడా చదవండి: బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం -
విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం.. జీపీఎస్ స్పూఫింగ్?
సాక్షి, నేషనల్ డెస్క్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. దీని వెనుక కుట్రకోణం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు సాగుతున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్మ మొహోల్ సైతం చెప్పారు. గ్లోబల్ పోజీషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సంకేతాలను తారుమారు చేసి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయేలా ఎవరైనా కుట్రలు సాగించారా? అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే 2023 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు దేశ సరిహద్దుల్లో 465 జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్సర్, జమ్మూ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. గత నెలలో ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన ఎయిర్ విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానాలు రావడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. పైలట్కు తప్పుడు సంకేతాలు భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన సి–130జే విమానం ఏప్రిల్లో మయన్మార్ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది. దాంతో అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్చేశారు. జీపీఎస్ సిగ్నళ్లలోకి అపరిచితులు, విద్రోహులు చొరబడుతున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. స్పూఫింగ్ లేదా జామింగ్ అనేది పెనువిపత్తుగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్పోర్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023–2024 మధ్య జీపీఎస్లో ఇంటర్ఫియరెన్స్ రేటు 175 శాతం, జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు 500 శాతం పెరిగాయి. స్ఫూపింగ్ లేదా జామింగ్ చేస్తే విమానం కాక్పిట్లోని పైలట్కు తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం కన్పిస్తాయి. నిర్దేశిత మార్గంలో వెళ్లాల్సిన విమానం మరో మార్గంలో వెళుతుంది. విమానం ప్రయాణించాల్సిన ఎత్తులోనూ మార్పులు వస్తాయి. దాంతో గగతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే రన్వే కిందికి దూసుకెళ్లడం కూడా జరగొచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో అధికం.. యుద్ధాలు జరిగే కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ సమస్య అధికంగా ఉంది. 2024లో ఆయా ప్రాంతాల్లో శాటిలైట్ సిగ్నల్ జామింగ్ లేదా స్పూఫింగ్ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో 2.6 లక్షలు నమోదయ్యాయి. అంటే ఏడాది కాలంలో 62 శాతం పెరిగాయి. ఈజిప్టు, లెబనాన్, నల్ల సముద్రం, రష్యా–ఎస్తోనియా, రష్యా–లాతి్వయా, రష్యా–బెలారస్ సరిహద్దుల్లో స్ఫూపింగ్ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్లైన్స్ సంస్థలు చెబుతున్నాయి. మయన్మార్తోపాటు భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వైమానిక పరిశ్రమ ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో జీపీఎస్ స్ఫూపింగ్, జామింగ్ కూడా ఒకటి. ఇలాంటి ఘటనలు తెలియపర్చడానికి అమెరికాలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఫస్ట్టైమర్లే విన్నర్లు!
బిహార్లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు. కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే.. బిహార్లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్లకు కష్టకాలమే రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.2,000 కోట్లు దోచేసే కుట్ర
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకొనే కుట్ర జరిగిందని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టవిరుద్ధంగా సొంతం చేసుకొనేందుకు ప్రయ త్నించారని వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో బుధవారం ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహల్కు 76 శాతం వాటాలున్నట్టు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ‘‘ఆ సంస్థ ద్వారా ఏజేఎల్కు కేవలం రూ.90 కోట్ల రుణమిచ్చి దాన్ని తీర్చడం లేదన్న సాకుతో ఏజేఎల్కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేశారు. యంగ్ ఇండియా స్థాపనే దురుద్దేశపూరితం’’ అన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అజిత్ కుమార్ కుటుంబాన్ని ఓదార్చిన విజయ్
సాక్షి, చెన్నై: ఒకప్పుడు ప్రజల రక్షణకు ప్రతీకగా నిలిచిన ఖాకీ యూనిఫాం.. ఇప్పుడు అమానవీయ ఘటనలకి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు శివగంగై జిల్లాలో పోలీసుల చిత్ర హింసలకు ప్రాణాలు అజిత్ కుమార్ (28) కుటుంబాన్ని తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Vijay) పరామర్శించారు. బుధవారం మదపురంలోని బాధితుడు అజిత్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. అజిత్ కుమార్ ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, విజయ్ మాట్లాడుతూ.. ఇలాంటి అమానవీయ ఘటనలు జరుగకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు (SIT) వేయాలని డిమాండ్ చేశారు.తమిళనాట యువకుడు అజిత్ కుమార్ కస్టోడియల్ డెత్ సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. అజిత్ కుమార్ (27) అనే యువకుడు శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మన్ ఆలయంలో తాత్కాలిక భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో జూన్ 27న ఓ మహిళ తన బంగారు ఆభరణాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు అజిత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. అజిత్పై పోలీసుల అమానుషంవిచారణ పూర్తి కావడంతో అజిత్ను పోలీసులు వదిలేశారు. మళ్లీ మరోసారి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 29న బాధితుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పోలీసులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. కానీ పోస్టు మార్టం నివేదికలో మాత్రం పోలీసులు తీరుపై అనుమానాలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం నివేదికలో అజిత్ కుమార్ తల, ఛాతీ, శరీరంపై 30 నుంచి 40 వరకు గాయాలైన ముద్రలు ఉన్నట్లు తేలింది. లాఠీ దెబ్బలు, చింతపండు పొడి నోట్లో, ప్రైవేట్ పార్ట్స్లో నింపడం వంటి అమానుష చర్యలు జరిగినట్లు తేలింది. సివిల్ డ్రెస్లో పోలీసులు..అజిత్పై దాడిమరణం అనంతరం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీల్లో సైతం అజిత్ కుమార్ పోలిస్ స్టేషన్కు వెళ్లే ముందు ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ పోలీసుల చిత్ర హింసలతో తీవ్రంగా గాయపడిన స్థితిలో బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు అజిత్ కుమార్ను అతను పనిచేసే భద్రకాళి అమ్మన్ ఆలయం వెనక్కి తీసుకెళ్లి కొడుతున్న దుశ్యాలు వెలుగులోకి రావడం కలకలం రేగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపై చర్యలకు ఉపక్రమించింది.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025ఎస్పీ అశిష్ రావత్పై వేటు అజిత్ కుమార్ మరణానికి కారణమైన ఐదుగురు పోలీసుల్ని తమిళనాడు పోలీస్ శాఖ అదుపులోకి తీసుకుంది. హెడ్ కానిస్టేబుళ్లు కన్నన్, ప్రభు, కానిస్టేబుళ్లు రాజా, ఆనంద్, శంకరమణికంతో పాటు వారికి సహకరించిన డ్రైవర్ రామచంద్రన్ను సస్పెండ్ చేసింది. శివగంగై ఎస్పీ అశిష్ రావత్పై వేటు వేసి.. రామనాథపురం ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.మరోవైపు లాకప్ డెత్లో మరణించిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. విచారణలో ఓ హంతకుడు కూడా ఇలా దాడి చేయడూ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం స్టాలిన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. బీజేపీ,ఏఐడీఐఏంకేతో పాటు ఇతర పార్టీలు సీబీఐ విచారణ కోరుతున్నాయి. -
విదేశీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.త్వరలోనే అమలుప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం. -
కామపిశాచులకు అడ్డాగా..
వరస ఘటనలు బెంగళూరులో మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. తమకు భద్రత కరువైందని వాపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సహోద్యోగిణి పట్ల ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ ఘటనతో ఐటీ క్యాపిల్ ఆఫ్ ఇండియా.. ఇప్పుడు కామపిశాచులకు అడ్డాగా మారుతోందన్న చర్చ నెట్టింట నడుస్తోంది. అసలేం జరిగిందంటే.. బెంగళూరు: నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా సహోద్యోగిని టాయిలెట్లో రహస్యంగా వీడియో తీసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో ఈ దారుణం జరిగింది. ఓ మహిళా ఉద్యోగి టాయిలెట్లో ఉన్న సమయంలో ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించాడు. అయితే.. పక్కనున్న క్యూబికల్ ద్వారా ఏవో కదలికలు గమనించిన ఆమె అప్రమత్తమై గట్టిగా అరిచింది. దీంతో ఆమె కొలీగ్స్ అప్రమత్తమై అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సదరు వ్యక్తిని సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్న స్వప్నిల్ నాగేశ్ మాలి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై బాధితురాలు తొలుత హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసింది. స్వప్నిల్ ఫోన్ పరిశీలించగా.. 30కి పైగా మహిళల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు నమోదు అయిన నేపథ్యంలో.. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నిందితుడిపై బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఇన్ఫోసిస్ స్పందించింది. సదరు ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరులో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే నడిరోడ్డు మీద, మెట్రో రైళ్లలో జరిగిన ఉదంతాలు సీసీఫుటేజీల ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆఫీసుల్లో.. అదీ ప్రముఖ ఐటీ కంపెనీల్లోనూ చోటు చేసుకోవడం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగళూరులో ప్రధానంగా జరిగిన కొన్ని ఘటనలు.. 2023 నవంబర్ 22 – మెట్రో స్టేషన్లో వేధింపులుమెజెస్టిక్ మెట్రో స్టేషన్.. రద్దీ సమయంలో ఓ యువతిని వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి. బాధితురాలు సహాయం కోరినా ప్రయాణికులు స్పందించలేదు. 2024 జనవరి 27 – క్యాబ్లో వేధింపులుకమ్మనహళ్లి వద్ద.. ఓ యువతి బుక్ చేసిన క్యాబ్లోకి ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ప్రవేశించి వేధించారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. Woman molested in Bengaluru while she was out on a morning walk. The man fled the spot soon after and a case against him was registered. Efforts are on to nab him.#Bengaluru pic.twitter.com/k8xlSOvXK7— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2024 కిందటి ఏడాది ఆగష్టులో.. మరో ఒంటరి మహిళపై చోటు చేసుకున్న వేధింపుల తాలుకా వీడియో ఇది.. Video Credits: Vani Mehrotra2025 ఏప్రిల్ 4 – వీధిలో వేధింపులు (BTM లేఅవుట్)సుద్దగుంటెపాళ్య, BTM లేఅవుట్ వద్ద తెల్లవారుజామున ఇద్దరు మహిళలు నడుస్తుండగా, ఓ వ్యక్తి వారిలో ఒకరిని వెనుక నుంచి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో రికార్డు, వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. అయితే, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలు నగరాల్లో సాధారణమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు, ఇది వేధింపులను ప్రోత్సహించేలా ఉందని విమర్శించారు. 2025 మే 23న.. బెంగళూరు మెట్రో రైలులో మహిళలను అసభ్యరీతిలో రహస్యంగా చిత్రీకరించి.. ఆ ఫొటోలను సోషల్ మీడియా(ఇన్స్టా)లో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఫోన్లో ఫొటోలు, వీడియోలు లభ్యం. 2025 జూన్ 22 మైలసంద్ర, బెంగళూరు శివారులో.. కిరాణా దుకాణానికి వెళ్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను రక్షించిన స్నేహితుడిపై కూడా దాడి జరిగింది. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తెలంగాణకు చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించారు.ధర్మపురి సమీపంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారిని తెలంగాణలో వనపర్తి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. విహారయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
Ahmedabad: ఎయిరిండియా విమానం ప్రమాదానికి కారణం ఏంటంటే?
సాక్షి,ఢిల్లీ: భారత విమానయాన చరిత్రలో ఘోర విషాదంగా నిలిచిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలు వెలుగులోకి వచ్చినట్లు బ్లూబెర్గ్ నివేదించింది. విమాన దుర్ఘటనకు కారణం రెండు ఇంజిన్లు విఫలం కావడం వల్లేనని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు భావిస్తున్నారు. కాబట్టే విమాన సిబ్బంది ప్రమాదాన్ని నిరోధించే ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని, తద్వారా అపార ప్రాణ నష్టానికి దారి తీసినట్లు తెలుస్తోంది. విమానంలో అత్యవసర విద్యుత్ సరఫరా కోసం ఉపయోగించే రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేషన్ యాక్టివేట్ కావడం వల్ల విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం వల్లేనని తేలింది. కానీ,సాధారణ లోపాల వల్ల ప్రమాదం జరగలేదని తేటతేల్లమైంది. వీటితో పాటు విమాన ప్రమాదానికి గల కారణాల్ని రాబట్టేందుకు ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) డేటాను విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను వెల్లడించనుంది.జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతిగృహంపై కూలిపోయింది. ఈ విషాదకర ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతిచెందగా.. 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకేఒక వ్యక్తి మృత్యుంజయుడిగా ప్రాణాలతో భయటపడ్డాడు. -
‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి?’.. డీకేఎస్ ఆసక్తికర వ్యాఖ్యలు
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన. అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన. 👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే.. 👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్లు ఈ వ్యాఖ్యలను ఖండించారు. హుస్సేన్కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు. -
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం చోటుచేసుకుంది. మహిళలపై తరచూ దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్న ప్రస్తుత సమయంలో, తాజాగా దీనికి భిన్నంగా జరిగిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళా ఉపాధ్యాయురాలు తన దగ్గర చదువుకునే 16 ఏళ్ల విద్యార్ధికి ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) ఇచ్చి, ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తోంది. ఈ విషయం బయటపడిన దరిమిలా పోలీసులు ఆ మహిళా ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. ఆమెపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పాక్సో)చట్టం, జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టం, భారత శిక్షాస్మృతిలోని నిబంధనల కింద నేరాలను మోపారు.పోలీసులు తెలిపిన ప్రకారం నిందితురాలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు. బాధిత విద్యార్థి 11వ తరగతిలో ఉన్నప్పుడు అతనికి పాఠ్యాంశాలను బోధించారు. 2023 డిసెంబర్లో జరిగిన పాఠశాల వార్షికోత్సవం సమయంలో ఆ విద్యార్థికి ఆకర్షితురాలినైనట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 2024 జనవరి నుంచి ఆ విద్యార్థితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. తొలుత ఆమె ఆ బాలుడిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికంగా వేధించేదని, తరువాత అతనికియాంటీ-యాంగ్జైటీ ముందులు ఇచ్చి లోబరుచుకునేదని పోలీసులు తెలిపారు.అయితే ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు అతని ప్రవర్తనలో మార్పును గమనించి, ప్రశ్నించగా, అసలు విషయం బయటపడిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి త్వరలోనే పాఠశాల విద్య పూర్తి చేస్తాడన్న భావనతో అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని విస్మరించారు. ఈ ఏడాది ఆ విద్యార్థి 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే ఆ ఉపాధ్యాయురాలు తిరిగి అతనిపై వేధింపులు ప్రారంభించింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబ సభ్యులు ఆ ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇది కూడా చదవండి: ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే.. -
సెలూన్లో మహిళలకు మస్కా
యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు. ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. -
ఖరీదైన ఐదు టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం ఇంటి రెనోవేషన్ ఖర్చెంతంటే..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాను యమునా నది ప్రక్షాళనతో పాటు రాజధానిలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తరచూ చెబుతుంటారు. తాజాగా ఆమె నూతన అధికారిక నివాసం గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజ్ నివాస్ మార్గ్లోని బంగ్లా నంబర్ వన్ను ఆమెకు అధికారికంగా కేటాయించగా, ఈ నెలలోనే ఆ భవన పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు రూ. రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సమాచారం.ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) జారీ చేసిన టెండర్ నోటీసులోని వివరాల ప్రకారం భవన పునరుద్ధరణలో ప్రధానంగా నూతన విద్యుత్ పరికరాలను అమర్చడంపై దృష్టి సారించనున్నారు. దీని టెండర్ కోసం బిడ్లు జూలై 4న ప్రారంభం కానున్నాయి. పునరుద్దరణ పనులు 60 రోజుల వ్యవధిలో పూర్తికానున్నాయని అధికారులు తెలిపారు. సీఎం రేఖా గుప్తాకు రెండు బంగ్లాలు కేటాయించగా, వాటిలో ఒక బంగ్లాను ఆమె నివాసానికి ఉపయోగించనున్నారు. మరొక బంగ్లాను క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించనున్నారు.జూన్ 28న జారీ చేసిన టెండర్లో రూ.60 లక్షల మొత్తంతో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు ముఖ్యమంత్రి బంగ్లాలో ఏర్పాటు చేయనున్నారు. రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇంటికి రూ. రెండు లక్షలతో నిరంతర విద్యుత్ సరఫరా (యూపీఎస్) వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ. 1.8 లక్షల ఖర్చుతో రిమోట్ కంట్రోల్తో నడిచే 23 సీలింగ్ ఫ్యాన్లను కూడా అమర్చనున్నారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.ఇది కూడా చదవండి: ‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్ నేత క్షమాణలు -
‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్ నేత క్షమాణలు
న్యూఢిల్లీ: కొందరు రాజకీయ నేతల ప్రసంగాల్లో అప్పుడప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. దీంతో వారు అభాసుపాలవుతుంటారు. తాజాగా సిక్కింనకు చెందిన కాంగ్రెస్ నేత ఇదేవిధమైన వివాదంలో చిక్కుకున్నారు. తరువాత క్షమాపణలు చెప్పడంతో పాటు పొరపాటున నోరు జారానని వివరణ కూడా ఇచ్చారు.సిక్కిం కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ సిక్కింను పొరుగు దేశం అని పేర్కొన్న ఒక వీడియో వెలుగులో రావడంతో అతని మాటలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. దీంతో అజోయ్ కుమార్ ఒక ప్రకటనలో తన నోరు జారడం వల్ల అలా జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. తాను విలేకరుల సమావేశంలో భారత్- పొరుగు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాల గురించి మాట్లాడుతూ, పొరపాటున సిక్కింను పొరుగు దేశంగా ప్రస్తావించాను. ఇది అనుకోకుండా జరిగిన మానవ తప్పిదమంటూ అజోయ్ కుమార్ తన తప్పుకు వివరణ ఇస్తూ క్షమాపణలు కోరారు. The BJP Sikkim unit vehemently denounces the outrageous and ignorant statement made by INC leader Ajoy Kumar, who shockingly referred to Sikkim as a "neighboring country" during his press conference at AICC headquarters today. It is utterly deplorable that a former IPS officer… pic.twitter.com/Uwoi6gTyV4— BJP Sikkim (@BJP4Sikkim) July 1, 2025కాంగ్రెస్ నేత అజయ్కుమార్ తప్పుడు వ్యాఖ్యలను సిక్కిం బీజేపీ సిక్కిం యూనిట్ తీవ్రంగా ఖండించింది.. ఒక మాజీ ఐపీఎస్ అధికారి, పార్లమెంటు సభ్యుడైన అజయ్ కుమార్ భారతదేశ చరిత్ర భౌగోళిక స్వరూపంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం విచారకరమని బీజేపీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అవమానకరమైన తప్పులను నివారించేందుకు, వెంటనే పార్టీ నేతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ అంశంపై బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జిన్నా అడుగుజాడలను అనుసరిస్తోందని, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇది కూడా చదవండి: ‘నితీష్కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు -
ఆకస్మిక మరణాలపై కేంద్రం కీలక ప్రకటన
గుండె సంబంధిత సమస్యలతో.. వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువాత పడుతున్న ఉదంతాలు రోజుకోటి చొప్పున చూస్తున్నాం. ప్రత్యేకించి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండానే కుప్పకూలిపోతున్నారు. అయితే కరోనా కాలం నుంచే ఇవి ఎక్కువగా నమోదు అవుతుండడంతో.. వైరస్-వ్యాక్సిన్లకు ముడిపెడుతున్నారు చాలామంది. ఈ తరుణంలో.. హఠాన్మరణాలకు గల కారణాలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.వ్యాక్సిన్ల కారణంగానే ఈ మరణాలు సంభవిస్తున్నాయని ఇటీవల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ అంశంపై విచారణ జరపడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటు చేశారాయన. మరీ ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులోపు వాళ్లు ఉన్నట్లుండి మరణించడం కలవరపెడుతోందని అన్నారాయన. అయితే గుండె సంబంధిత హఠాన్మరణాలకు.. కోవిడ్ టీకాలతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టంచేసింది. ఈ మేరకు పలు అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం వెల్లడించింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్ విస్తృతంగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. కోవిడ్ టీకాలు సురక్షితమైనవే. ఆకస్మిక మరణాలకు కింది విషయాలు కారణాలై ఉండొచ్చు.. జన్యుపరమైన లోపాలుజీవనశైలి (ధూమపానం, ఒత్తిడి, వ్యాయామపు అలవాట్లు)కోవిడ్ అనంతర ఆరోగ్య సమస్యలుఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు.. అని పేర్కొంది #HealthForAll Extensive studies by @ICMRDELHI and AIIMS on sudden deaths among adults post COVID have conclusively established no linkage between COVID-19 vaccines and sudden deathsLifestyle and Pre-Existing Conditions identified as key factorshttps://t.co/QEN1X1PKfv— Ministry of Health (@MoHFW_INDIA) July 2, 2025టీకాలపై ఇలాంటి ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు కలిగించొచ్చు. విజ్ఞానపరమైన ఆధారాలు లేని వ్యాఖ్యలు ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆధారాల ఆధారంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో నెల వ్యవధిలో 20 మంది గుండె సంబంధిత సమస్యలతో హఠాత్తుగా చనిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. గుండె సంబంధిత మరణాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ జిల్లా ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. రెండేళ్ల కాలంలో 507 గుండె పోటు కేసులు నమోదుకాగా.. అందులో 190 మంది మరణించారు. అయితే కోవిడ్ టీకాల త్వరిత ఆమోదం, పంపిణీ కూడా ఈ మరణాలకు కారణమై ఉండొచ్చు. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే.. తక్షణమే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి అని ప్రజలకు సూచించారు. అలాగే.. ఈ మరణాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక నిపుణుల బృందంతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. In the past month alone, in just one district of Hassan, more than twenty people have died due to heart attacks. The government is taking this matter very seriously. To identify the exact cause of these series of deaths and to find solutions, a committee of experts has been…— Siddaramaiah (@siddaramaiah) July 1, 2025 అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటనను తోసిపుచ్చింది. ఈ మేరకు అధ్యయనాల తాలుకా వివరాలను వెల్లడించింది. ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అధ్యయం.. 2023 మే–ఆగస్టు మధ్య 19 రాష్ట్రాల్లో 47 ఆసుపత్రుల్లో నిర్వహించారు. ఇందులో 18–45 ఏళ్ల మధ్య వయస్సు గల, ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మరణించిన వ్యక్తులపై అధ్యయనం జరిపారు. అందులో కోవిడ్ టీకాలకు సంబంధం లేదని తేలింది. అలాగే.. ఢిల్లీ AIIMS అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో గుండెపోటు (Myocardial Infarction) ప్రధాన కారణంగా గుర్తించారు. పైగా జన్యుపరమైన లోపాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రాథమిక విశ్లేషణలో తేలింది. -
‘నితీష్కు తెలివే లేదు’: తేజస్వి సంచలన వ్యాఖ్యలు
పట్నా: ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అక్కడి రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, ఎన్నికల వాతావారణానికి కొత ఊపు తెస్తున్నారు. తాజాగా బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.నితీష్ కుమార్కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆయన బీహార్ను ఇకపై పరిపాలించలేరని తేజస్వి యాదవ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం సిద్ధమవుతున్న వేళ తేజస్వి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత తన మాజీ మిత్రుడైన నితీష్పై పలు వ్యాఖ్యలు చేయడమే కాకుండా, జేడీయూ కార్యాలయంలో ఎప్పుడూ లేనిది.. ఇప్పుడు ప్రధాని మోదీ ఫొటో కనిపిస్తున్నదన్నారు. నితీష్కు తెలివే లేదు... అందుకే మోదీ ఫోటోను కార్యాలయంలో తగిలించారని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి ఒకప్పుడు ప్రధాని మోదీతో కరచాలనం చేసి, వివాదాల్లో చిక్కుకున్నారని తేజస్వి పేర్కొన్నారు.నితీష్ కుమార్ అతని హృదయం చెప్పిన మాట వినరని, ఎందులో అతనికి సమ్మతి ఉందని తేజస్వి ప్రశ్నించారు. ఆయన పార్టీ మారనని చెబుతూ, అందుకు పదే పదే ఇందుకు రుజువులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయనకు ప్రజల్లో విశ్వసనీయత లేదని,అతని వయస్సు కూడా ఇందుకు ఒక కారణమని తేజస్వి వ్యాఖ్యానించారు. బీహార్లో ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నాయని, అటువంటి సందర్భాల్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలే లేవని ఆరోపించారు.రాష్ట్రంలో ఓటర్ల జాబితాల సవరణకు రెండేళ్లు పట్టవచ్చని, ఎన్నికలకు ఆరు నెలల కన్నా తక్కువ సమయమే ఉన్నందున ఈ కసరత్తు ఇప్పుడు ఎందుకని తేజస్వి ప్రశ్నించారు. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి.నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభానికి రెండు నెలలలే మిగిలి ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎనిమిది కోట్ల మందితో కూడిన కొత్త జాబితాను కేవలం 25 రోజుల్లో తయారు చేయాలి. రాష్ట్రంలోని 73 శాతం మంది వరదల బారిన పడిన సమయంలో కొత్త ఓటర్ల జాబితా రూపకల్పన సాధ్యమవుతుందా? అని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్ -
ప్రయోగాలు మొదలెట్టిన శుభాంశు
న్యూఢిల్లీ: కోట్లాది భారతీయుల అంతరిక్ష స్వప్నాన్ని సాకారం చేస్తూ యాగ్జియం–4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా తన శాస్త్రీయ ప్రయోగాల పర్వానికి శ్రీకారం చుట్టారు. శూన్యస్థితిలో మనిషి కండర క్షీణతపై శుక్లా అధ్యయనంమొదలెట్టారు. కండరాల క్షీణతకు గురుత్వాకర్షణ ఏ మేరకు కారణమవుతుంది? ఈ రెంటి మధ్య సంబంధాలేంటి? అంశాలపై ఆయన పరిశోధనలు సాగుతున్నాయని యాగ్జియం స్పేస్ సంస్థ పేర్కొంది. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పెద్దసమస్యగా తయారైంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయతి్నస్తున్నారు. పరిశోధనలో భాగంగా త్రిమితీయ అస్థిపంజర కండరం నుంచి సూక్ష్మస్థాయిలో కణజాలాన్ని అత్యంత స్వల్పస్థాయి గురుత్వాకర్షణకు గురిచేసి మార్పులను గమనించారు. మయోడీ1, మయోజీ కణ నియంత్రకాల పనితీరు సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో ఎలా ఉందో శుక్లా పరిశీలించారు. -
ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే..
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటనకు బుధవారం శ్రీకారం చుట్టారు. తొలుత ఆయన ఢిల్లీ నుంచి ఘనాకు విమానంలో బయలుదేరారు. నేటి నుంచి జూలై 9 వరకు ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటన సాగనుంది. తన పర్యటనలో భాగంగా ఆయన నేడు, రేపు ఘనాను సందర్శించనున్నారు.మూడు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఘానా అధ్యక్షునితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఆర్ధిక, ఎనర్జీ, డిఫెన్స్ పరస్పర సహకారంపై చర్చ జరగనుంది. జూలై 3-4 తేదీల్లో ట్రినిడాడ్, టోబాగోలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన ట్రినిడాడ్ అధ్యక్షురాలు, ప్రధాని బిసెసర్తో భేటీ కానున్నారు. అలాగే ట్రినిడాడ్ పార్లమెంటులో సంయుక్త సభను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. #WATCH | Delhi: Prime Minister Modi emplanes for Ghana. PM Modi embarks on a five-nation tour including Ghana, Trinidad and Tobago, Argentina, Brazil, and Namibia. PM Modi will also participate in the BRICS Summit in Brazil.#PMModi #Trending pic.twitter.com/Zjzg9Hhp1O— TIMES NOW (@TimesNow) July 2, 2025జూలై 4-5 తేదీల్లో అర్జెంటీనాలో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేయ్తో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా డిఫెన్స్, ఖనిజాలు, వ్యవసాయం, ఎనర్జీ, వాణిజ్యంపై చర్చ జరపనున్నారు. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతంపై చర్చించనున్నారు. జూలై 5-8 తేదీల్లో బ్రెజిల్లో 17వ ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, గ్లోబల్ గవర్నెన్స్, ఏఐ, వాతావరణ మార్పులపై బ్రిక్స్ సదస్సులో చర్చ జరగనుంది. అదే సమయంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులాతో కూడా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. జూలై 9న జరిగే నమీబియా పర్యటనలో ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగించనున్నారు. -
నివసించే చోటే నమోదు చేసుకోండి
న్యూఢిల్లీ: స్వస్థలాల్లో కంటే పౌరులు ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఓటరుగా పేరు నమోదుచేసుకుంటే మంచిదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్కుమార్ మంగళవారం వ్యాఖ్యానించారు. త్వరలో బిహార్లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి అధికారులు ఓటర్ల జాబితాను తనిఖీ చేసి సవరించనున్న నేపథ్యంలో సీఈసీ ఓటర్ నమోదు అంశంపై మాట్లాడటం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో బూత్ లెవ్ ఆఫీసర్(బీఎల్ఓ)లనుద్దేశిస్తూ జ్ఞానేశ్ మాట్లాడారు. ‘‘వాస్తవానికి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారమైతే ఏ శాసనసభ నియోజకవర్గంలో అయితే ఓటరు నివసిస్తాడో అక్కడే అతనికి ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంటుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీలో నివసిస్తున్నారు. సొంతిల్లు బిహార్లోని పటా్నలో ఉంది. అయినాసరే మీరు ఢిల్లీలోనే ఓటర్గా పేరును నమోదుచేసుకోవాల్సి ఉంటుంది’’అని ఆయన అన్నారు. ‘‘కొందరు గతంలో ఉన్న ప్రాంతంలో సంపాదించిన ఓటరు కార్డును అలాగే అట్టిపెట్టుకుని, కొత్త ప్రాంతంలో మరో ఓటర్ కార్డును సాధిస్తున్నారు. పోలింగ్ వేళ పాత ప్రాంతంలో ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఇది నేరం’’అని సమావేశంలో పాల్గొన్న కొందరు అధికారులు గుర్తుచేశారు. -
మణిపూర్ను వదిలేసి విదేశీ ప్రయాణాలా?
న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న అతిముఖ్యమైన విషయాలను వదిలేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మణిపూర్లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదని, అక్కడికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించింది. అదేవిధంగా, భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే ప్రకటనలు చేస్తున్నా మోదీ మౌనంగా ఉంటున్నారంటూ మంగళవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పలు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాల కారణంగానే ఆపరేషన్ సిందూర్లో మొదటి రెండు రోజుల్లో మనకు నష్టాలు మిగిలాయని రక్షణ శాఖ అధికారులు చేస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానమివ్వడం లేదన్నారు. పహల్గాంలో దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులను 70 రోజుల తర్వాత కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు. ఇది ప్రధాని తీవ్ర వైఫల్యంగా ఆయన పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా వాటిని ఎదుర్కొని నిలబడతారు. మన ప్రధాని మాత్రం విదేశాలకు పయనమవుతారు’అని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఈ నెల 2 నుంచి 8 రోజులపాటు ప్రధాని మోదీ 5 దేశాల పర్యటించనుండటం తెల్సిందే. -
పోలీసులంటే దేవుళ్లు కాదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గత నెల 4న జరిగిన తొక్కిసలాటకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) క్రికెట్ జట్టు బాధ్యత వహించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) పేర్కొంది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి వికాశ్ కుమార్తోపాటు పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ వికాశ్ కుమార్ ‘క్యాట్’ను ఆశ్రయించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ఆయన విజ్ఞప్తిపై క్యాట్ విచారణ జరిపింది. విజయోత్సవాలకు దాదాపు 5 లక్షల మంది తరలివచ్చారని, ఇందుకు ఆర్సీబీదే బాధ్యత అని స్పష్టంచేసింది. పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోలేదని తప్పుపట్టింది. ఐపీఎల్లో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జట్టు యాజమాన్యం హఠాత్తుగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో లక్షల మంది తరలివచ్చారని, వారిని అదుపులో చేయడం పోలీసులకు సాధ్యం కాలేదని వెల్లడించింది. తగినంత సమయం లేకపోవడంతో వారు ఏర్పాట్లు చేయలేకపోయారని తెలిపింది. ‘పోలీసులు కూడా మామూలు మనుషులే. వారు దేవుళ్లు కాదు. ఇంద్రజాలికులు కూడా కాదు. వారు మాయలు మహిమలు ప్రదర్శించలేరు. పోలీసుల వద్ద అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు’’అని క్యాట్ తేలి్చచెప్పింది. వికాశ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. -
మోనోజిత్ మామూలోడు కాదు.. లా కాలేజీలో ఇన్ని జరిగాయా?
కోల్కతా: సౌత్ కోల్కత్తా లా కాలేజీలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ దారుణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా గతంలో తనపైనా లైంగిక దాడికి పాల్పడ్డాడని మరో విద్యార్థిని తెలిపింది. రెండేళ్ల క్రితం కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించింది.కాగా, అతడికి రాజకీయ పలుకుబడి, ముఖ్యంగా కాలేజీ బోర్డు అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ కుమార్ దేబ్ అండ ఉందని వివరించింది. బయటకు వెల్లడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని తల్లిదండ్రులను, సోదరిని చంపేస్తానంటూ అతడు బెదిరించాడని తెలిపింది. భయపడి ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయినట్లు తెలిపింది. తన మాదిరిగా మోనోజిత్ సుమారు 15 మంది విద్యార్థినులను వేధించాడని ఆరోపించింది. మోనోజిత్పై కొందరు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపింది.ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం మోనోజిత్ పోలీసు అధికారిపై దాడి చేయడంతోపాటు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తాజాగా వెల్లడైంది. కస్బా ప్రాంతంలోని లా కాలేజీకి సమీపంలో హెచ్డీఎఫ్సీ కియోస్క్ వద్ద ఏప్రిల్ 13న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జూన్ 28వ తేదీన లా కాలేజీలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ను కాంట్రాక్టు ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించారు. అదేవిధంగా, ఇద్దరు సహ నిందితుడు ప్రమిత్ ముఖర్జీ, జయీబ్ అహ్మద్లను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే అశోక్ కుమార్ దేబ్ సారథ్యంలో జరిగిన కాలేజీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరు ముగ్గురూ పోలీస్ కస్టడీలో ఉన్నారు.Monojit Mishra is the prime accused in Kolkata law college rape, arrested. pic.twitter.com/EdmWIg0r1b— www (@manik199) June 29, 2025ఇదిలా ఉండగా.. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార కేసులో నిందితులపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకుంది. విద్యార్థులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలను కళాశాల నుంచి బహిష్కరించినట్లు తృణమూల్ కాంగ్రెస్ నేత అశోక్ కుమార్ నేతృత్వంలోని సౌత్ కోల్కతా లా కాలేజీ పాలక మండలి మంగళవారం వెల్లడించింది. కేసులో ప్రధాన నిందితుడు, లెక్చరర్గా పనిచేస్తున్న మోనోజిత్ మిశ్ర (31) కాంట్రాక్టును తక్షణమే రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే క్రిమినల్ న్యాయవాదిగా ఆయన ప్రాక్టీసును రద్దు చేయమని కోరుతూ బార్ కౌన్సిల్కు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు బాధితురాలు కాలేజీకి ఒంటరిగా వెళ్లడం వల్లే అత్యాచారం జరిగిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎమ్మెల్యే మాదన్ మిత్రా బేషరతుగా క్షమాపణలు తెలిపారు. -
కర్ణాటక సీఎం మార్పు.. డీకే కీలక వ్యాఖ్యలు..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మంగళవారం కొట్టిపారేశారు. ప్రస్తుతం అలాంటి చర్చే లేదని అన్నారు. అవాస్తవ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు. డి.కె.శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే హెచ్.ఎ.ఇక్బాల్ హుస్సేన్కు నోటీసు ఇస్తామని, ఆయన వివరణ కోరుతామని వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదని హెచ్చరించారు. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలని స్పష్టంచేశారు. సీఎం మార్పును ఇప్పుడు ఎవరూ కోరుకోవడం లేదని, తమ దృష్టి మొత్తం 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనే ఉందని శివకుమార్ తేల్చిచెప్పారు. తన గురించి ఇతరులు మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. అలాంటి అంశాలపై ఎవరూ మీడియాతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. -
రూ.లక్ష కోట్లతో పరిశోధనాభివృద్ధి పథకం
న్యూఢిల్లీ: దేశ ప్రగతిరథ వేగం పెరిగేందుకు నూతన ఆవిష్కరణలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశోధనాభివృద్ధిలో ప్రైవేట్రంగ పెట్టుబడులే లక్ష్యంగా ఏకంగా రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) పథకానికి కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. దేశ ఆర్థిక భద్రత, వ్యూహాత్మక అవసరాలు, మరింత స్వావలంభన ధ్యేయంగా పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి విస్తృత స్తాయిలో నిధుల కేటాయింపునకు ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాతో చెప్పారు.ఆర్డీఐ రంగంలో ప్రైవేట్ సంస్థలకు తక్కువ వడ్డీకి లేదా వడ్డీరహిత రుణాలను మంజూరుచేయడం, రీఫైనాన్సింగ్ సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. రుణాలు పొందడంలో ప్రైవేట్ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలను తొలగిస్తూ వ్యూహాత్మక రంగాల్లో నూతన ఆవిష్కరణలు, కొత్త సాంకేతికతలను జోడించడం, పోటీతత్వాన్ని పెంచేలా పథకాన్ని రూపొందించామని మంత్రి చెప్పా రు. కీలక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేలా చేపట్టబోయే నూతన ప్రాజెక్టులకు సాయ పడటం, అవసరమైన అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడంలో దోహదపడటం, అందుకు కావాల్సిన రుణాల మంజూరు వేగవంతం చేయడం వంటివి ఈ పథకంలో కీలకమైన అంశాలని మంత్రి వివరించారు.ఆర్డీఐ పథకం అమలు, తీరు తెన్నులు, సమీక్ష బాధ్య తలను ప్రధాని మోదీ నేతృత్వంలోని అనుసంధాన్ జాతీయ పరిశోధనా ఫౌండేషన్ (ఏఎన్ ఆర్ఎఫ్) పాలక మండలి తీసుకుంటుంది. ఈ పథకం మార్గదర్శకాలు, రంగాల వారీగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, ఆయా ప్రాజెక్టులకు ఫండ్ మేనేజర్లుగా ఏఏ సంస్థలు వ్యవహరిస్తాయనే అంశాలపై కేబినెట్ కార్యదర్శి సారథ్యంలోని భిన్న మంత్రిత్వశాఖ కార్యదర్శుల బృందం నిర్ణయాలు తీసు కుంటుంది. ఈ పథకానికి నోడల్ విభాగంగా శాస్త్ర, సాంకేతిక శాఖ వ్యవహరిస్తుంది.ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1 లక్ష కోట్లుఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకానికి రూ.1.07 లక్షల కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ సారథ్యంలో కొనసాగే సామాజిక భద్రతా స్కీమ్ల ద్వారా వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రూ.1.07 లక్షల కోట్లతో పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. తొలిసారిగా ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు రెండు విడతల్లో గరిష్టంగా రూ.15,000 వరకు అదనపు భత్యం ఇస్తారు. వీళ్లకు రెండేళ్లపాటు సంస్థ నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మరోవైపు, తమిళనాడులో 87వ నంబర్ జాతీయ రహదారిలో భాగంగా పరమ కుడి– రామనాథపురం మధ్యలో నాలుగు వరసల రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర కేబినెట్ రూ.1,853 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో 46.7 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. -
హిమాచల్లో కుంభవృష్టి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో సోమవారం రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వాన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మికంగా సంభవించిన వరదల్లో ఐదుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయాల పాలయ్యారు. మరో 16 మంది గల్లంతయ్యారు.24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 225.38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పదకొండు చోట్ల కుండపోత వాన, నాలుగు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించగా, ఒక చోట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. -
డబ్బులు వచ్చిపడుతున్నాయ్!
రూ.11.6 లక్షల కోట్లు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు 2024–25లో మనదేశానికి పంపిన డబ్బులివి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యూఎస్ నుంచి రెమిటెన్స్ల వరద పారుతోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మనదేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపే భారతీయులు కోటిన్నరకు పైగానే ఉంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలలోని స్వదేశీయుల నుంచి భారత్కు బట్వాడా అయిన స్థూల నగదు విలువ 135.46 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.11.6 లక్షల కోట్లకుపైనే) చేరుకుందని భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తాల్లో ఇదే అత్యధికమని, మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువని కూడా ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. 2023–24లో ఇలా అత్యధిక మొత్తం అందుకున్న దేశం మనదే.ఆ మూడు దేశాల నుంచే...నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే దేశాలన్నిటి కంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులను అందుకుంటోంది. గత ఎనిమిదేళ్లలో భారత్కు ఈ నగదు ప్రవాహం రెట్టింపు అయింది. 2016–17లో మన దేశానికి అందిన నగదు మొత్తం 61 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండటం గమనార్హం. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే.. ఏటా భారత్కు బట్వాడా అవుతున్న నగదు మొత్తంలో ఈ మూడు దేశాల నుంచే దాదాపు 60 శాతం మనదేశానికి వస్తోంది. ఇదే సమయంలో జి.సి.సి. (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతోంది. (ఆధారం : ఆర్బీఐ)ప్రధానంగా ఇంటి ఖర్చులకేప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2024లో మెక్సికో 68 బిలియన్ డాలర్ల అంచనా మొత్తంతో రెండవ స్థానంలో, చైనా 48 బిలియన్లతో మూడవ స్థానంలో ఉంది. భారత్కు ప్రధానంగా వివిధ దేశాలకు వెళ్లిన స్వదేశీయుల నుంచే నగదు అందుతోంది. ఇలా దేశాలకు బట్వాడా అయే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండు రకాలుగా వర్గీకరించింది. ఒకటి ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇళ్లకు పంపిస్తున్నవి, రెండు.. ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాల బదిలీలు (ఉదా: విరాళాలు, నగదు సహాయాలు వగైరా..) భారత్ విషయంలో – నగదు బట్వాడాలు అన్నవి ప్రధానంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవేనని ఆర్బీఐ 2025 మార్చిలో తన నెలవారీ బులెటి¯Œ లో పేర్కొంది.పెట్టుబడుల కంటే ఎక్కువ!నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండే దేశాలలో భారత్ నేటికీ ఒకటిగా కొనసాగుతోందని ఆర్బీఐ డేటా వెల్లడించింది. ‘భారత్కు అందుతున్న నగదు మొత్తం భారత్కు వస్తున్న స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది. దాంతో బయటి నుంచి వచ్చే నగదు భారత్కు ఒక స్థిరమైన వనరు అయింది’ అని ఆర్బీఐ సిబ్బంది సర్వే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఆ మొత్తాలు భారతదేశ వాణిజ్య లోటు నిధుల భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రవాహం దేశంలోని 287 బిలియన్ల వాణిజ్య లోటులో దాదాపు సగంగా (47 శాతం) ఉంది. -
సుప్రీంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానంలో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ జారీ చేశారు. జూన్ 23 నుంచే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోడల్ రిజర్వేషన్ రోస్టర్, రిజిస్టర్ను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీని ప్రకారం.. సుప్రీంకోర్టులో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 7.5 శాతం కోటా కల్పిస్తారు.రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, చాంబర్ అటెండెంట్లు ఈ రిజర్వేషన్లకు అర్హులు. న్యాయమూర్తులకు ఇవి వర్తించవు. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ హైకోర్టుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. సుప్రీంకోర్టునూ అమల్లోకి తీసుకురావడం సరైన నిర్ణయమని అభిప్రాయడ్డారు. సుప్రీంకోర్టులో రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం పెంచడానికి ఈ రిజర్వేషన్లు దోహదపడతాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
పక్షులకూ భూతాపం సెగలు
ఆచార వ్యవహారాలు, సంస్కృతికి పట్టు గొమ్మ ల్లాంటి పల్లెటూర్లలో ఉదయం వెచ్చటి సూర్య కిరణ కాంతులు ఎంతటి హాయి గొల్పుతాయో అక్కడి పక్షుల కిలకిలారావాలు అంతకంటే ఎక్కువగా మనల్ని మైమరపింపజేస్తాయి. ఎలాంటి బాదరబందీలేకుండా స్వేచ్ఛగా విహరించే అలాంటి పక్షిజాతులకు ఇప్పుడు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత తదితరాలతో భూగోళం మండిపోతోంది. భూతాపోన్నతి ఏటికేడు పైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు.ఈ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఇప్పుడు పక్షులపై పడ్డాయి. అన్నెంపున్నెం ఎరుగని పక్షులను వాతావరణమార్పుల మాటున పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న కఠోర వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. వాతావరణ మార్పుల కారణంగా 500కుపైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే ప్రమాదపుటంచునకు చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ఇంగ్లండ్లోని బెర్క్షైర్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అడవుల నరికివేత కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోతున్న వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు. మూడు రెట్లు పెరిగిన ముప్పుగతంలోనూ వ్యాధులు ప్రబలడం, సహజావరణంలో ఆహారం, అస్తిత్వం కోసం పోటీ, కొత్త ప్రాంతాలకు వలసలు.. ఇలా పలు కారణాల కారణంగా కొన్ని పక్షిజాతులు అంతర్థానమయ్యాయి. అయితే 1500 సంవత్సరం నుంచి చూస్తే నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణాలతో అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.ఒంటె మెడ గొడుగు పక్షి, హెల్మెటెడ్ హార్న్బిల్ వంటి ప్రఖ్యాత పక్షిజాతులు సైతం అంతరించిపోయే ప్రమాదముంది. ‘‘ ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి. అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలి. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలి’’ అని పరిశోధనలో కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్ వ్యాఖ్యానించారు. విస్తృతస్థాయిలో పరిశోధనవాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఏఏ జాతి పక్షులపై అత్యధికంగా ఉందనేది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు పెద్ద కసరత్తే చేశారు. అంతరించిపోయే ప్రమాదమున్న శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, పక్షుల జాబితాను తెప్పించి అందులోని 10,000కుపైగా పక్షిజాతులపై సమగ్రస్థాయిలో అధ్యయనం చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు లోనయ్యే పెద్ద రెక్కల పక్షులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పెద్ద రెక్కల పక్షులు ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఈ పక్షులుండే అటవీ ప్రాంతాలు సైతం గనుల తవ్వకం, నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో కనుమరు గవుతు న్నాయి. ‘‘ ఆధునిక ప్రపంచంలో పక్షిజాతుల అంతర్థానం అనేది మరో అతిపెద్ద ముప్పు.అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం’’ అని స్టీవార్ట్ అన్నారు. ‘‘ అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలి. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయి. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయి. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయి. రోజు లెక్కలేనన్ని కీటకాలను తిని పురుగుల అతి బెడదను నివారిస్తాయి. ఆకుల్ని, పూతను తిని చెట్లను నాశనంచేసే చిన్న కీటకాలను పక్షులు వేటాడి ఆయా ప్రాంతాల్లో చెట్లను పరోక్షంగా కాపాడతాయి. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూత, కాతకు కారణమవుతాయి.అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన వందలాది పక్షిజాతులు కనుమరుగైతే జరిగే జీవావరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే తక్షణం అడవుల అనవసర నరికివేతకు స్వస్తి పలకాలి. వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలి. అరుదైన పక్షులను ప్రత్యేకంగా పెంచి వాటి సంతతిని వృద్ధి చెందించాలి’’ అని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి, ప్రొఫెసర్ మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు. -
ఆరోజు నేను మోదీతోనే ఉన్నాను.. జేడీ వాన్స్ ఫోన్ చేసి ఏమన్నారంటే..!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఎపిసోడ్పై విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పలు విషయాలను తాజాగా వెల్లడించారు. అసలు మే 9వ తేదీ రాత్రి ఏం జరిగింది?, ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అసలు ఏం మాట్లాడారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు జై శంకర్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జై శంకర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ అంశం, కాల్పుల విరమణ అంశాలకు సంబంధించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఆ రాత్రి తాను మోదీతో పాటే ఉండటంతో అక్కడ ఏం జరిగిందనేది విషయాన్ని వెల్లడించారు.‘ఆ రోజు వాన్స్ ఫోన్ చేసి మీరు కొన్ని విషయాలను ఒప్పుకోకపోతే పాకిస్తాన్ నుంచి భారీ ముప్పు చూడాల్సి ఉంటుందనే హెచ్చరించారు. అది ఏంటనేది మోదీకి కూడా తెలియదు. ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన తర్వాతే జరిగిన సంభాషణ అది. పాకిస్తాన్ ఏం చేస్తుందో చూద్దాం.. మా నుంచి కూడా ప్రతిదాడి ఉంటుంది’ అని వాన్స్కు మోదీ తెలిపారని జై శంకర్ పేర్కొన్నారు.‘ ఆ రాత్రి పాక్ నుంచి దాడులు ఆరంభం అయ్యాయి. దానికి మనం కూడా అంతే ధీటుగా బదులిచ్చాం. ఆ మరుసటి రోజు ఉదయం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ రూబియో మాకు ఫోన్ చేశారు. పాకిస్తాన్ చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. ఇలా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఇది ఆ ఘటనకు సంబంధించి ఆనాటి నా వ్యక్తిగత అనుభవం’ అని తెలిపారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాత్ర ఏమీ లేదని కొట్టిపారేశారు జై శంకర్. ట్రంప్ చెప్పుకుంటున్నట్లు ట్రేడ్ డీల్ కారణంగానే భారత్ వెనక్కి తగ్గిందనే వార్తల్లో నిజం లేదన్నారు. అసలు ట్రంప్కు కాల్పుల విరమణ అంగీకారానికి సంబంధం లేదని తేల్చిచెప్పారు జై శంకర్. -
Air India Plane: ఒక్కసారిగా 900 అడుగుల కిందకు.. విచారణకు ఆదేశం!
ఢిల్లీ: గత నెలలో అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అతి పెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇది యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరి వెళ్లే క్రమంలో సెకన్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 241 విమానంలో ఉన్నవారు చనిపోగా, ఈ దుర్ఘటన కారణంగా చనిపోయిన వారి సంఖ్య 275కు పెరిగింది. ఇది జూన్ 12వ తేదీన జరిగిన ఘటన. అయితే ఆపై మరో రెండు రోజులకు ఒక పెను ప్రమాదం తప్పిందనే వార్త తాజాగా వెలుగుచూసింది. దీతాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించడంతో పెను ప్రమాదం తప్పిందనే విషయం బయటకొచ్చింది. ఈ ఘటనను జాతీయ మీడియా హైలైట్ చేయడంతో వామ్మో మరో ఘోర ప్రమాదం తప్పిందని అనుకోవడం ప్రజల వంతైంది.అసలు విషయంలోకి వెళ్లే.. జూన్ 14వ తేదీన ఢిల్లీ నుంచి వియన్నా బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పై నుంచి కిందకు దిగిపోయింది. ఉన్నపళంగా 900 అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగి పోవడంతో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి నియంత్రణలోకి తెచ్చారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 777 AI-187 విమానం.. ఆ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నుంచి వియన్నాకు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం 900 అడుగుల కిందకు పడిపోయింది. దీంతో వార్నింగ్ సిగ్నల్ వెళ్లింది పైలట్లకు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన పైలట్లు భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతో విమానం మళ్లీ అదుపులోకి వచ్చింది. ఆపై దీన్ని సురక్షితంగా వియన్నా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల్లో వియన్నాలో ఆ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. దేశంలోని క్రీడా రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం.. కొత్త క్రీడా విధానానికి ఆమోదం తెలిపింది. ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.ఉత్పాదక రంగంలో ఉద్యోగకల్పన ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు సృష్టించే కొత్త ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా ఉద్యోగం కల్పిస్తే 15 వేల రూపాయల ప్రోత్సాహం ఇవ్వనుంది.ఈపీఎఫ్ రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది. లక్ష రూపాయల లోపు జీతం వచ్చే ఉద్యోగులకు వర్తించనుంది. కొత్తగా ఉద్యోగం ఇచ్చిన కంపెనీలకు ప్రతినెల 3 వేల రూపాయల చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్అండ్డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదంటే.. 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్న ప్రభుత్వం ఇవ్వనుంది. తమిళనాడు పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 1,853 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. -
ఒక్క నెలలో 18 గుండెపోటు మరణాలు.. ‘హసన్’పై విచారణకు ఆదేశాలు
హసన్: దేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య మరింతగా పెరుగుతూ వస్తోంది. ఇదే కోవలో కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలోనే 18 మంది గుండెపోటుతో మరణించిన దరిమిలా రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ మరణాలపై దర్యాప్తు చేప్టటాలని వైద్యాధికారులను ఆదేశించారు.కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఒక్క నెలలో 18 మంది గుండెపోటుతో మరణించగా, వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండు రావు ఈ విధమైన గుండెపోటు కేసుల పెరుగుదలను నివారించేందుకు వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారిక దర్యాప్తు జరుగుతోందని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఆందోళనకర పరిస్థితుల వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.హసన్ జిల్లాలో చోటుచేసుకున్న గుండెపోటు మరణాలపై జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్కు చెందిన డాక్టర్ సి.ఎన్. రవీంద్ర నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం అధ్యయనం చేసి, నివేదికను పది రోజుల్లోగా అందజేయనుంది. హసన్లో ఇటీవలి కాలంలో 20 నుంచి 30 ఏళ్లలోపు వయసుకలిగిన యువకులు గుండెపోటులో మృతిచెందడం గమనార్హం. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, అధిక ఒత్తిడిని కలిగించే జీవనశైలి మొదలైనవి గుండెపోటుకు ప్రధాన కారణాలని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: ‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక -
‘మహా’ యూ టర్న్ చూసి.. రెండు భాషలకు కర్నాటక
ముంబై: మహారాష్ట్ర పాఠశాలల్లో త్రిభాషా విధానం అమలు చేయాలనుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామాలను గమనించిన కర్నాటక కూడా ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)దేశవ్యాప్తంగా పాఠశాలల్లో త్రిభాషా సూత్రాన్ని సిఫార్సు చేసినప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా దానిని తిరస్కరించింది. మహారాష్ట్ర సర్కారు ప్రాథమిక పాఠశాలలకు త్రిభాషా విధానాన్ని నిలిపివేసిన దరిమిలా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ప్రభుత్వం కూడా పాఠశాల విద్యావిధానంలో ద్విభాషా సూత్రానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన సిద్ధరామయ్య తాము ద్విభాషా విధానానికి అనుకూలంగా ఉన్నామని, తమ ప్రభుత్వం దీనికే కట్టుబడి ఉంటుందని ప్రకటించారు.వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో భాషా విధానాలపై చర్చలు జరుగుతున్న సమయంలో సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక పాఠశాలల్లో ప్రస్తుతమున్న విద్యావిధానంలో.. విద్యార్థులు ఐదవ తరగతి వరకు రెండు భాషలు నేర్చుకోవాలి. ఆరవ తరగతి నుండి హిందీని మూడవ భాషగా ప్రవేశపెడతారు. ఎనిమిదవ తరగతిలో విద్యార్థులకు కన్నడ, ఇంగ్లీష్ లేదా సంస్కృతంలలో ఏదో ఒక దానిని మొదటి భాషగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యార్థి సంస్కృతాన్ని మొదటి భాషగా ఎంచుకున్న పక్షంలో, వారికి కన్నడ మూడవ భాషగా తప్పనిసరి అవుతుంది.ఇది కూడా చదవండి: ‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం -
దేవుడా.. ఎంతపని చేశావయ్యా
బాగేపల్లి(కర్ణాటక): తిరుమలలో వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుముఖం పట్టిన కుటుంబాలు కొంతసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాయి. ముగ్గురు అక్కడే చనిపోగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కురబలకోట వద్ద చెన్నామర్రి మిట్ట అనేచోట హైవేలో సోమవారం ఉదయం జరిగింది. బాగేపల్లి తాలూకాలోని శ్రీనివాసపుర (సాకోళ్ళపల్లి ) గ్రామానికి చెందిన శ్రావణి (27), హోసహుడ్యకు చెందిన హెచ్.ఎస్.చరణ్ (17), బాగేపల్లి పట్టణవాసి మేఘర్శ (17) మృతులు. అంతా భీతావహం వివరాలు.. బాగేపల్లి పట్టణంలోని గంగమ్మగుడి రోడ్డుకు చెందిన రామచంద్రప్ప, హెచ్.టి.శివప్ప, నరసింహరెడ్డి కుటుంబాలకు చెందిన 13 మంది కలిసి టెంపో ట్రావెలర్లో తిరుమల యాత్రకువెళ్లారు. దర్శనాలయ్యాక బయల్దేరారు. ఘటనాస్థలంలో యమ శకటంలా వచ్చిన భారీ లారీ ఈ టెంపోను ఢీకొట్టింది. టెంపో పూర్తిగా ధ్వంసమైంది. లోపలున్నవారు విసిరేసినట్లు బయటకు పడిపోయారు. అందరికీ తీవ్ర రక్త గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడే మరణించారు. నరసింహారెడ్డి, భార్య హెచ్.ఎన్. రూప, కుమారుడు ఆదర్శ, రామచంద్రప్ప, భార్య కళావతి, పెద్ద కుమారుడు అశోక్, కోడలు శ్రావణి, చిన్న కుమారుడు దర్శన్, టైలర్ హెచ్.టి.శివప్ప, భార్య సునందమ్మ, కుమార్తె చైత్ర, టెంపో డ్రైవర్ మంజునాథ్లు గాయపడ్డారు. రక్తగాయాలు, ఆర్తనాదాలతో ఘటనాస్థలి భయంకరంగా కనిపించింది. స్థానికులు గాయపడినవారికి దొరికిన వాహనాలలో ఆస్పత్రులకు తరలించారు. కొందరిని బెంగళూరుకు తీసుకెళ్లారు. ఘటన గురించి తెలియగానే ఇక్కడి నుంచి బంధువులు వెళ్లారు.దేవుడా..ఎంతపని చేశావయ్యాకురబలకోట: దేవుడా నీ దర్శనానికి వచ్చామే, ఎంత పనిచేశావయ్యా అని గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఢీకొన్న లారీ ఎక్కడ? టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కేసు నమోదు చేశారు. టాప్తో సహా లేచిపోయింది టెంపో ట్రావెలర్కు జరిగిన ప్రమాదం చూస్తే భయాందోళన కలగడం ఖాయం. లారీ ఢీకొన్న ధాటికి టెంపో టాప్ ఎగిరిపోయింది. బాధితులు తీవ్ర గాయాలతో అంగలార్చడం చూపరులను చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. స్థానికులు సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఇద్దరూ క్షేమం టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32), ఇతని వెనుక సీట్లో ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమలలో గుండు చేయించుకున్నాడు. ఈ యాక్సిడెంట్లో వీరిద్దరే క్షేమంగా బయటపడడం విశేషం. డ్రైవర్ మంజునా«థ తీవ్ర గాయాలతో కోమాలో ఉన్నాడు. దర్శనం తరువాత బయల్దేరాం ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాం. కొంత సేపు విశ్రాంతి తీసుకుని సోమవారం వేకువ జామున మూడు గంటల ప్రాంతంలో బయలు దేరాం. కురబలకోట మండలంలోని చెన్నామర్రి వద్ద వస్తుండగా ఉదయం 6.20 గంటల ప్రాంతంలో ఈ దుస్సంఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – ఓ క్షతగాత్రుడు -
‘భాగస్వామి’పై దారుణం.. మృతదేహంతో రెండు రోజులు సావాసం
భోపాల్: దేశంలో ఇటీవలి కాలంలో ‘రిలేషన్షిప్’ ఉంటున్న కొందరు క్షణికావేశంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి దారుణ ఉదంతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగు చూసింది. స్థానిక గాయత్రి నగర్లో రితికా సేన్(29) తన లివ్ ఇన్ పార్ట్నర్ సచిన్ రాజ్పుత్(32) చేతిలో దారుణ హత్యకు గురయ్యింది.రితికా సేన్ను గొంతుకోసి, హత్యచేసిన తరువాత సచిన్ ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజుల పాటు ఆ మృతదేహం పక్కనే పడుకున్నాడు. జూన్ 27 రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది రితకా హత్యకు దారితీసింది. ఉద్యోగం లేకుండా అల్లరిచిల్లరిగా తిరుగుతున్న రాజ్పుత్ తన భాగస్వామి రితికా సేన్పై ఎప్పుడూ అసూయ పడేవాడు. ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ యజమానితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించేవాడు. ఈ నేపధ్యంలోనే ఆమెను హత్య చేశాడు.తరువాత ఆమె మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, మంచం మీద పెట్టి, రెండు రోజుల పాటు అదే గదిలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మద్యం మత్తులో సచిన్ రాజ్పుత్ తన స్నేహితుడు అనుజ్తో తాను రితికా సేన్ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అనుజ్ పోలీసులకు ఫోన్ చేసి, విషయమంతా చెప్పాడు. వెంటనే బజారియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రితికా సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు.పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ శిల్పా కౌరవ్ మీడియాతో మాట్లాడుతూ మృతురాలు రితికా సేన్ తన ప్రియుడు సచిన్ రాజ్పుత్తో పాటు రెండున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్నదన్నారు. సచిన్కు అప్పటికే వివాహం అయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. జూన్ 27న రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగి, అది రితికా హత్యకు దారితీసిందన్నారు. సింజోర్కు చెందిన సచిన్.. రితికతో పాటు తొమ్మిది నెలల క్రితం గాయత్రి నగర్కు వచ్చి ఉంటున్నాడు. రితిక ఉద్యోగం చేస్తుండగా, సచిన్ ఆమె జీతంపై ఆధారపడేవాడు. నిందితుడు సచిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం -
ఇలా చేస్తే... వేగంగా వైఫై సిగ్నల్స్!
ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా లేవా? ఒకరిద్దరు మాత్రమే వాడుతున్నా ఇంటర్నెట్ స్లో అవుతోందా? అయితే మీ వైఫై రూటర్ ఎక్కడ పెట్టారో ఒకసారి చూసుకోండి. సరైన ప్రాంతంలో లేకపోతేనే ఈ సమస్యలన్నీ వస్తాయి మీకు! మరి.. ఇంట్లో వైఫై రూటర్ ఉంచేందుకు బెస్ట్ ప్లేస్ ఏంటి?ఇంటర్నెట్ వాడకం బాగా పెరుగుతున్న ఈ కాలంలో చాలా ఇళ్లల్లోకి వైఫై రూటర్లు వచ్చేశాయి. అయితే ఎక్కువమంది వీటిని ఎవరికీ కనిపించని చోట ఉంచేస్తూంటారు. కొందరు పుస్తకాల అలమారాలో లేదంటే టేబుళ్ల కింద కుక్కేస్తూంటారు. దీనివల్ల వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నల్స్ మన సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఫైర్ స్టిక్స్ వంటివాటికి సరిగ్గా సంకేతాలు పంపలేదు. రేడియో సిగ్నల్స్ ఓపెన్ స్పేసెస్లో బాగా ప్రయాణిస్తాయన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం. అడ్డంకులు ఎన్ని ఎక్కువ ఉంటే.. వాటి శక్తి అంత తగ్గిపోతూంటుందన్నమాట. దీంతో ఇంటర్నెట్ వేగమూ మందగిస్తుంది.వైఫై రూటర్ను నేలపై ఉంచడం కూడా సరికాదు. సిగ్నల్ స్ట్రెంగ్త్ గరిష్టంగా ఉండదు. శక్తిమంతమైన రేడియో తరంగాలు ఎక్కువగా కిందివైపు ప్రయాణిస్తూంటాయి. నేలపై ఉంచితే సిగ్నల్స్ కాస్తా నేలల్లోకి వెళ్లిపోతాయన్నమాట. ఇలా కాకుండా..ఎత్తుగా ఉన్న చోట్ల ఉంచడం మేలు.కుర్చీలు, టేబుళ్ల వెనుక ఉంచినా చిక్కే. గోడలున్నా సిగ్నల్స్ సులువుగా ప్రయాణించలేవు. ఇంకొంతమంది వైఫై రూటర్ను ఎవరికీ కనిపించకుండా ఉండాలని ఎక్కడో ఒక మూలన దాచేస్తూంటారు. దీనివల్ల కూడా వైఫై సిగ్నల్స్ పూర్తిస్థాయిలో వాడుకోలేము.ఇంట్లో రెండు వైఫై రూటర్లు ఉండి.. వాటిని పక్కపక్కనే పెట్టారనుకోండి. నెట్ వేగం పడిపోయేందుకే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే వైఫై అనేది నిర్దిష్ట స్పెక్ట్రమ్లో రేడియో తరంగాలను ప్రసారం చేస్తూంటుంది. రెండూ ఒకే స్పెక్ట్రమ్లో ప్రసారం చేస్తూంటే... ఒకదాని సిగ్నల్ ఇంకోదానితో ఇబ్బందిపడటం ఖాయం. ఏతావాతా.. ఇంట్లో వైఫై సిగ్నల్స్ బాగా ఉండాలంటే... పూర్తి సామర్థ్యం మేరకు వాడుకోవాలంటే రూటర్లను అందరికీ కనిపించేలా ఏదైనా ఎత్తైన టేబుల్ లేదా షెల్ఫ్లో ఉంచడం మేలు. వీలైనంత వరకూ వైఫైకి అడ్డుగా ఏ వస్తువు పెట్టకూడదు. గోడలకు లేదా మందంగా ఉండే ఫర్నీచర్కు ఒకట్రెండు అడుగుల దూరంలో ఉంచడం అవసరం. -
తమిళనాడులో భారీ పేలుడు.. 8 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల తయారీ ప్రముఖ కేంద్రం శివకాశిలోని ఓ గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. పేలుడు ధాటికి సత్తూరులోని బాణసంచా యూనిట్పై దట్టమైన పొగ అములుకుంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని బాణాసంచా గోడౌన్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. తరచూ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.#JUSTIN சிவகாசி அருகே சின்ன காமன்பட்டி கோகுலேஸ் பட்டாசு ஆலையில் பயங்கர வெடி விபத்து #Sivakasi #FireAccident #News18Tamilnadu | https://t.co/3v5L32pLWJ pic.twitter.com/5g7GYG6V6d— News18 Tamil Nadu (@News18TamilNadu) July 1, 2025VIDEO Credits: News18 Tamil Nadu -
గుండె తరుక్కుపోయే ఘటన..! మూడేళ్లుగా అపార్ట్మెంట్లో ఒంటరిగా..
కొన్ని ఘటనలు మానవత్వం ఇంకా ఉందా అనే సందేహానికి తావిస్తే, మరికొన్ని.. ఇంకా మంచితనం బతికే ఉంది అనిపించేలా ఉంటాయి. అలాంటి హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో చోటుచేసుకుంది. ఆ సంఘటన అందరిని మానవత్వంపై ఆలోచింప చేయడమే గాక, తోటివారికి చేతనైనా సాయం చేయాలి అనే స్పుహని కలిగించేలా చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలోనే ఒంటరిగా సాగింది. తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన అనంతరం తీవ్ర మానసిక ఆందోళనకు గురైయ్యారు. దాంతో బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్మెంట్లో ఒంటరిగా జీవించడం ప్రారంభించారు. అంతేగాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్లైన్ డెలివరీ యాప్స్పై ఆధారపడ్డారు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయటన పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం తదితరాల వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో జీవించసాగాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పందించిన అప్పార్ట్మెంట్ వాసులు..అనూప్ విషాదకర పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ సొసైటీ వాసులు వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్.ఈఏఎల్ (Social & Evangelical Association for Love) కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్ను అపార్ట్మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ప్రస్తుతం అనూప్కు మానసిక, శారీరక ఆరోగ్యం పట్ల అవసరమైన చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, మానవీయ విలువలతో కూడిన జీవితాన్ని తిరిగి అందించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పించింది. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం, కష్టాల్లో ఉన్నవారికి మానవతా మనసుతో స్పందించడం ఎంత ముఖ్యమో ఇది గుర్తుచేస్తోంది. ఒకరి బాధను గమనించి, చేయగలిగినంతలో చేయూత ఇవ్వగలిగితేనే నిజమైన మానవత్వం ప్రకాశిస్తుంది.మనం మన పరిసరాలను నిశితంగా పరిశీలిస్తే, అనూప్ వంటి వారు మన మధ్యనే ఉండవచ్చు. వారికి అండగా నిలబడి, సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని చాటి చెప్పింది. సాటి మనిషి పట్ల కరుణ, ప్రేమను చూపడం ద్వారానే మనం బలమైన సమాజాన్ని నిర్మించగలం అనే విషయాన్ని నొక్కిచెబుతోంది ఈ ఘటన.(చదవండి: కళాకారుడిగా మారిన పోలీసు..! సొంతంగా ఫోటో స్టూడియో పెట్టి..) -
Bhubaneswar: ప్రభుత్వ అధికారిపై దౌర్జన్యం.. నేటి నుంచి ఉద్యోగుల నిరవధిక సెలవు
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ అధికారికి ఘోర అవమానం ఎదురయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్యాలయంలో అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రత్నాకర్ సాహూను కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లి, అతనిపై దాడి చేస్తూ, ముఖంపై తన్నడం కనిపిస్తోంది. I am utterly shocked seeing this video. Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025ఈ ఘటన గురించి రత్నాకర్ సాహూ మాట్లాడుతూ తాను ఉదయం 11.30 గంటల సమయంలో ఫిర్యాదులు స్వీకరించే పనిలో ఉండగా, బీఎంసీ కార్పొరేటర్ జీవన్ రౌత్తోపాటు వచ్చిన ఆరుగురు తన ఛాంబర్లోకి చొరబడ్డారని, తరువాత వారు దుర్భాషలాడుతూ, తనను ఆఫీసు నుండి బయటకు లాక్కెళ్లి, వారి వాహనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారని సాహూ తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిష్ ప్రధాన్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం బిజు జనతాదళ్ (బీజేడీ)కార్పొరేటర్లు, బీఎంసీ సిబ్బంది నిరసనకు దిగారు. జనపథ్ రోడ్డు దిగ్బంధనం చేశారు.రత్నాకర్ సాహూపై దాడికి నిరసనగా ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ మంగళవారం (జూలై 1) నుండి సామూహిక నిరవధిక సెలవును ప్రకటించింది. అదనపు కమిషనర్ పై జరిగిన దాడిపై బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరారు. బీఎంసీ మేయర్ సులోచన దాస్ ఈ సంఘటనను ఖండిస్తూ నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: Madhya Pradesh: తనను దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై యువకుని ఘాతుకం -
దూరం పెట్టిందని.. నర్సింగ్ విద్యార్థినిపై ఘాతుకం
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆమె అతన్ని దూరం పెట్టింది. అది భరించలేకపోయాడా యువకుడు. ఆమెపై కక్ష కట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో పట్టపగలే అంతా చూస్తుండగా ఆమె పీక కోసి అతికిరాతకంగా చంపాడు.మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో 19 ఏళ్ల సంధ్య చౌద్రీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు అభిషేక్ కోష్టి.. ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమక్షంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరువాత తన గొంతు కోసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.నర్సింగ్ శిక్షణ పొందుతున్న సంధ్యను వెంబడించిన అభిషేక్ కోష్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఆమెను పట్టుకుని, కిందకు నెట్టివేసి, కత్తితో ఆమె గొంతు కోశాడు. తరువాత తన గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈలోపు జనం గుమిగూడడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను చూసిన ఆస్పత్రి అధికారి నళిన్ మాట్లాడుతూ.. నల్ల చొక్కా ధరించిన ఒక యువకుడు సంధ్యపై దాడి చేశాడని, తాను జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడగా, తనను అడ్డుకున్నాడని, చంపేస్తానని కూడా బెదించాడని తెలిపారు.పోలీసులు నిందితుడు అభిషేక్ను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో అతను.. రెండున్నరేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా తాము కలుసుకున్నామని పోలీసులకు తెలిపాడు. తాము ప్రేమించుకుంటున్నామని, అయితే ఇటీవలి కాలంలో సంధ్య తనను పట్టించుకోవడం మానేసిందని, తన నంబర్ను బ్లాక్ చేసిందని చెప్పాడు. ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నదని భావించి, ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని, ఆమె హత్యకు ప్లాన్ చేసినట్లు అభిషేక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. కాగా సంధ్యకు అభిషేక్తో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.సంధ్య హత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. అయితే నిందితునిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంధ్య హత్య జరిగిన రోజు ఆస్పత్రి ట్రామా సెంటర్లో 11 మంది రోగులు చేరారు. అయితే భయంతో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు మరుసటి రోజు వెళ్లిపోయారు. ఆసుపత్రి సివిల్ సర్జన్ గురుచరణ్ చౌరాసియా మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సంధ్యను హత్య చేసి, తనను తాను గాయపరచుకున్న నిందితుడు అభిషేక్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. ఎస్పీ మృగాఖి డేకా సారధ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు -
ఒక రోడ్డు... కొన్ని చెట్లు
పట్నా: నల్లగా నిగనిగా మెరిసిపోతున్న సువిశాలమైన, నున్నని తారు రోడ్డు. చూద్దామన్నా ఎక్కడా ఒక్క గుంత కూడా లేదు. రెండువైపులా ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న చెట్లు. అలాంటి రోడ్డుపై యమా స్పీడుతో దూసుకుపోవాలని ఎవరికి మాత్రం ఉండదు! అలా వెళ్లే క్రమంలో ఆ చెట్లే ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైతే? బిహార్లో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. పట్నాకు కేవలం 50 కి.మీ. దూరంలోని జెహానాబాద్లో రూ.100 కోట్ల వ్యయంతో ఓ రోడ్డును సువిశాలంగా విస్తరించారు. కానీ ఏడున్నర కి.మీ. పొడవైన ఆ రోడ్డు మధ్య ఒకచోట ఏపుగా పెరిగిన చెట్లను ఇదుగో, ఇలా వదిలేశారు. ఇదేం అనాలోచితమైన పనంటారా? దీని వెనక ఓ ఆసక్తికరమైన కథ దాగుంది. ఈ చెట్లను తొలగిస్తామంటూ రోడ్డు నిర్మాణ సమయంలో జిల్లా యంత్రాంగం అటవీ శాఖను సంప్రదించింది. అందుకు శాఖ తొలుత అనుమతి నిరాకరించింది. పదేపదే కోరిన మీదట, ఏకంగా 14 హెక్టార్ల మేరకు అటవీ భూమికి సమానమైన పరిహారం కోరింది. అంత మొత్తం సమర్పించుకోవడం తమవల్ల కాదంటూ జిల్లా యంత్రాంగం చేతులెత్తేసింది. అలాగని ప్రాజెక్టును పక్కన పెట్టడానికి కూడా మనసు రాలేదు. దాంతో అటవీ నిబంధనలను ఉల్లంఘించకుండా చెట్లను ఇలా రోడ్ల మధ్యే వదిలేస్తూ పని పూర్తి చేసి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఆ రోడ్డుపై ప్రయాణం జనానికి అక్షరాలా ప్రాణాంతకంగా మారింది. ఎందుకంటే ఆ చెట్లు రోడ్డుపై కనీసం ఒక వరుసలో కూడా కాకుండా ఇక్కడొకటి, అక్కడొకటి అన్నట్టుగా చెల్లాచెదురుగా ఉండిపోయాయి. వాటిగుండా పోవాలంటే వాహనాలను నానా వంపులూ తిప్పుతూ విచిత్రమైన ఫీట్లు చేయాల్సిందే. ఆ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కూడా. దాంతో చూస్తుండగానే ఇది మృత్యుమార్గంగా మారిపోయింది. నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఇప్పటికీ ఈ చెట్ల బెడదను తప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. మన దేశంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలేమికి ఇది మరో తిరుగులేని ఉదాహరణ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
మొదటి రోజు నుంచే వేధింపులు
కోల్కతా: కోల్కతా లా కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా, సహ నిందితులు గురించి దిగ్భ్రాంతికర విషయాలు సిట్ దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. పెళ్లి ప్రతిపాదనను నిరాకరించిందనే అక్కసుతో బాధితురాలిని కాలేజీలో జాయినయిన మొదటి రోజు నుంచే వేధించాలని పథకం వేసినట్లు తేలింది. కాగా, ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదలాయించాలంటూ సోమవారం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏడు పెండింగ్ కేసులు మోనోజిత్ హిస్టరీ షీటర్, ఇతడిపై పలు లైంగిక వేధింపుల కేసులతోపాటు ఇతర నేరారోపణలు కూడా పెండింగ్లో ఉన్నాయని పోలీసులు సోమవారం తెలిపారు. ఇప్పటికే కనీసం ఏడు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్లు ఇతడిపై కోల్కతాలోని పలు పోలీస్స్టేషన్లో నమోదై ఉన్నట్లు చెప్పారు. లా కాలేజీలో జాయిన 2013లోనే ఇతడు కాళీఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక యువకుడిని కత్తితో పొడిచినట్లు కేసు నమోదైంది. దీంతో, కాలేజీ ఇతడిని బహిష్కరించింది. అప్పటికే టీఎంసీ విద్యార్థి విభాగంలో నేతగా ఇతడు పలుకుబడి సంపాదించినట్లు కాలేజీ మాజీ విద్యార్థి ఒకరు తెలిపారు. 2016లో లా కాలేజీపై దాడి కేసులో ఇతడూ నిందితుడే. ఆ తర్వాత ఈ కేసును కొట్టివేశారని మరో మాజీ విద్యార్థి నేత చెప్పారు. 2017లో తిరిగి ఇదే కాలేజీలో ప్రవేశం పొందిన మోనోజిత్ 2022లో ఉత్తీర్ణుడయ్యే వరకు కొనసాగాడు. ఆ సమయంలో అతడు పలు విద్యార్థినులను కాలేజీ యూనియన్ ఆఫీస్లోనే వివిధ కారణాలతో వేధించేవాడని తెలిసింది. 2018లో ఇద్దరు విద్యార్థినులు ఇతడిపై వేధింపుల కేసు పెట్టారు. విచిత్రంగా, ఈ కేసులో పోలీసులు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని స్థానిక మీడియా వ్యాఖ్యానించింది. రాజకీయ పలుకుబడితో మేనేజ్ ఇలాంటి వాటిని మోనోజిత్ చేసుకునేవాడని వ్యాఖ్యానించింది. సహనిందితులదీ అదేబాట ఈ నేరంలో మిశ్రాకు సహకరించిన, సహ నిందితులు ప్రతిమ్ ముఖర్జీ, జయిద్ అహ్మద్కు గతంలో మహిళలను వేధించిన రికార్డు కూడా ఉందని వెల్లడైంది. ‘ముందుగా వేసిన పథకం ప్రకారమే జూన్ 25వ తేదీన లా కాలేజీలో బాధితురాలిపై మోనోజిత్ దాడికి, అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను చిత్ర హింసలకు గురి చేయాలని కూడా వీరు కుట్ర పన్నారు’అని ఓ అధికారి వివరించారు. గతంలో పలువురు విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఈ త్రయం వాటిని సెల్ఫోన్లలో చిత్రీకరించి, బాధితులకు వాటిని చూపి బ్లాక్మెయిల్ చేసేవారని ఆ అధికారి తెలిపారు. జూన్ 25వ తేదీన గ్యాంగ్ రేప్ ఘటన వీడియోను సైతం వీరు ఇతరులకు షేర్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, ఎవరికి షేర్ చేశారనే విషయాన్ని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల ఇళ్లలోనూ ఆదివారం సోదాలు జరిపామన్నారు. బాధిత 24 ఏళ్ల విద్యారి్థనిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షలో వెల్లడైందని పోలీసు అధికారి వివరించారు. ఘటన జరిగిన సమయంలో కాలేజీలో ఉన్న 25 మంది విద్యార్థులను గుర్తించామని, వారి నుంచీ వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.పోటాపోటీ నిరసనలు..సౌత్ కలకత్తా లా కాలేజీ వద్ద బీజేపీ, అనుబంధ విద్యార్థి విభాగం బీజేవైఎం కార్యకర్తలను వామపక్ష పారీ్టలు, అనుబంధ విద్యార్థి సంఘాల కార్యకర్తలు చేపట్టిన పోటా పోటీ నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంలకు సంబంధించిన అన్ని తరగతులను నిరవధికంగా రద్దు చేస్తున్నట్లు ఘటన చోటుచేసుకున్న సౌత్ కలకత్తా లా కాలేజీ ప్రకటించింది. విద్యారి్థనిపై గ్యాంగ్రేప్ ఘటనపై దర్యాప్తులో భాగంగా కాలేజీ ఒక గేటును, ఒక వాష్ రూంను, యూనియన్ రూం, గార్డు రూంను పోలీసులు సీజ్ చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. తరగతులను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. -
250 రోడ్లు మూసివేత.. 130 చోట్ల కరెంట్ కట్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు రాష్ట్రమంతటా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. కనీసం 130 ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వరద చేరడం, ధ్వంసం కావడం వంటి కారణాలతో 250 రోడ్లను అధికారులు మూసివేశారు. ఇందులో అత్యధికంగా సిర్మౌర్ జిల్లాలో 57, మండి జిల్లాలో 44 రోడ్లున్నాయి. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశమున్న 22 ప్రాంతాలకుగాను 18 చోట్ల ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కంగ్రా, మండి, సిర్మౌర్, సొలాన్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లను మూసివేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. పర్యాటక ప్రాధాన్యమున్న సిమ్లా–కల్కా రైలు మార్గంపైన చేరిన రాళ్లు, చెట్లను తొలగించే రాకపోకలకు వీలు కల్పించారు. గత 24 గంటల్లో చనిపోయిన ముగ్గురితో కలిపి ఈ సీజన్లో వర్షాల సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరిందని అధికారులు తెలిపారు. సిమ్లా–కల్కా ఐదో నంబర్ జాతీయ రహదారిపై కోటి సమీపంలో కొండచరియలు విరిగి పడటంతో గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. -
కలామ్ ల్యాబ్స్ కమాల్
లక్నో: భారతీయ విద్యార్థుల అంతరిక్ష పరిశోధనా సంస్థగా మొదలైన కలామ్ ల్యాబ్స్ తాజాగా దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగరగలిగే మానవ రహిత లోహవిహంగం(యూఏవీ)ని తయారుచేసి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ యూఏవీ తాజాగా సముద్రమట్టానికి 9,790 మీటర్ల ఎత్తుకు చేరుకుని కొత్త ప్రపంచ రికార్డ్ను సృష్టించింది. రెక్కల వెడల్పు రెండు మీటర్లలోపు ఉన్న ఒక యూఏవీ ఇంతటి ఎత్తుకు ఎగరడం ఇదే తొలిసారి. అయితే ఈ రికార్డ్ను ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వైమానికరంగంలో యువత ఘనతను చాటే ఉద్దేశ్యంతో అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులుండే హిమాల యాల్లో ఈ యూఏవీని ఎగరేయడం విశేషం. సము ద్రమట్టానికి 2,700 మీటర్ల ఎత్తులోని హిమాల యాల్లో దీనిని పరీక్షించారు. వైమానికరంగంలో చిన్నారులను ప్రోత్సహించాలనే లక్ష్యంగా ముగ్గురు బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థులు ఈ కలామ్ ల్యాబ్స్ అంకుర సంస్థను స్థాపించారు. వాస్తవ ప్రపంచ సవాళ్లకు స్వయంగా విద్యార్థులే పరిష్కారాలు వెతకగలరని నిరూపించేందుకు ఈ సంస్థను ఏర్పాటుచేశామని వ్యవస్థాపకులు చెప్పారు.20 నుంచి మైనస్ 60 దాకాగాలి పీడనం ఎక్కువగా ఉండే వాతావరణంతోపాటు గాలిపీడనం తక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ తమ యూఏవీ ఎగరగలదని నిరూపించేందుకు దీనిని + 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశం నుంచి నింగిలోకి ఎగిరేశారు. గరిష్టంగా అది మైనస్ 60 డిగ్రీ సెల్సియస్ పరిస్థితుల్లోనూ ఆకాశంలో చక్కర్లు కొట్టడం విశేషం. అత్యంత ఎత్తులకు వెళ్లేకొలదీ గాలి పీడనం తగ్గి యూఏవీ గాల్లోనే స్థిరంగా ఉండటం కష్టమవుతుంది. గాలి కేవలం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నా సరే ఈ యూఏవీ గాల్లో స్థిరత్వాన్ని సాధించడం గమనార్హం. దీని బరువు నాలుగు కేజీలలోపే. అత్యంత ఎత్తులో ఎగిరే, తక్కువ బరువైన డ్రోన్ల తయారీలో భారత్ స్వావలంభన దిశలో ఇలాంటి యూఏవీలు బాటలు వేయనున్నాయి. కంట్రోలర్ అవసరం లేకుండా స్వయంచాలితం(అటానమస్) గా ఈ యూఏవీ అంత ఎత్తులకు వెళ్లిరావడం విశేషం. ‘‘ భారత్లో నూతన ఆవిష్కరణలు ఎంతటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేస్తాయనడానికి ఈ యూఏవీనే గీటురాయి’’ అని కలామ్ ల్యాబ్స్ ప్రధాన ఇంజనీర్ డాక్టర్ ప్రియా శర్మ చెప్పారు. వాతావరణ పీడనం 73 శాతం తగ్గిపోయినాసరే అటానమస్గా యూఏవీ పూర్తి సామర్థ్యంతో ఎగిరిందని ప్రియ వెల్లడించారు. స్ట్రాటోస్పియర్ ఆవరణ సమీపందాకా యూఏవీ వెళ్లివచ్చింది. మైనస్ 60 డిగ్రీ సెల్సియస్నూ ఇది తట్టుకుంది. అత్యంత తేలికైన వస్తువులు, తక్కువ ఇంధనాన్ని వాడుకునే ప్రొప ల్షన్, అధునాతన థర్మల్ వ్యవస్థల కారణంగానే యూఏవీ ప్రయోగం విజయవంతమైందిన ప్రియ చెప్పారు. మరో ఐదేళ్లలో భారత డ్రోన్ పరిశ్రమ 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతున్న ఈ తరుణంలో డ్రోన్ల రంగంలో నూతన ఆవిష్కరణల ఆవిశ్యత ఎంతైనా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. -
అమల్లోకి కొత్త రైల్వే చార్జీలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత రైల్వే శాఖ రైళ్ల టికెట్ల ధరలను స్వల్పంగా పెంచింది. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఏసీ క్లాస్లలో కిలోమీటరుకు రెండు పైసలు, నాన్–ఏసీ క్లాస్లలో ఒక పైసా చొప్పున చార్జీలను పెంచారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైలు టికెట్ చార్జీలనూ స్వల్పంగా పెంచారు. జూలై ఒకటో తేదీ నుంచి ధరలు పెంచబోతున్నట్లు జూన్ 24వ తేదీనే రైల్వే శాఖ సూచనప్రాయంగా చెప్పడం తెల్సిందే. తరగతుల వారీగా పలు రకాల రైళ్లలో పెరిగిన టికెట్ చార్జీల వివరాలను సోమవారం రైల్వేశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రతిరోజూ రైళ్లలో రాకపోకలు చేసే ప్రయాణికులపై భారం మోపకుండా సబర్బన్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. 500 కిలోమీటర్లలోపు ప్రయాణాలకు ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ ధరలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కేటగిరీలో పాత ధరలే కొనసాగుతాయి. అయితే ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కిలోమీటర్లు దాటితే మాత్రం టికెట్ ధర పెరుగుతుంది. 501 నుంచి 1500 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.5 ధర పెరిగింది. 1,501 నుంచి 2,500 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ.10 పెంచారు. 2,501 నుంచి 3,000 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ.15 పెంచారు. అంటే ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కి.మీ.లు దాటి ప్రతి కిలోమీటర్కు అరపైసా ధర పెంచారు. ఆర్డినరీ స్లీపర్ క్లాస్, ఆర్డినరీ ఫస్ట్ క్లాస్లోనూ ప్రతి కిలోమీటర్కు అర పైసా ధర పెంచారు. ‘‘ ప్రీమియర్, స్పెషల్ రైలు సేవలైన రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజ్, హమ్సఫర్, అమృత్భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, జన్ శతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, ఏసీ విస్టాడోమ్ కోచ్లు, అనుభూతి కోచ్లు, ఆర్డినరీ నాన్–సబర్బన్ సర్వీసులకూ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. నాన్–ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్లో ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి ఒక పైసా ధర పెంచారు. ఏసీ క్లాస్లలో ప్రతికిలోమీటర్కు రెండు పైసలు ధర పెంచారు. అంటే మెయిల్/ఎక్స్ప్రెస్ సెకండ్ క్లాస్లో, మెయిల్/ఎక్స్ప్రెస్ స్లీపర్ కాస్లో, మెయిల్/ఎక్స్ప్రెస్ ఫస్ట్ క్లాస్లోనూ ధర ఒక పైసా పెరిగింది. ఏసీ తరగతులైన ఏసీ చైర్కార్, ఏసీ–3టయర్/3ఈ, ఏసీ –2 టయర్, ఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏ టికెట్లపైనా రెండు పైసలు ధర పెంచారు. జూలై ఒకటో తేదీన, ఆ తర్వాతి తేదీల కోసం బుక్ చేసిన టికెట్లకు ఈ సవరించిన ధరలు వర్తింపజేస్తారు. ఈ మేరకు పీఆర్ఎస్, యూటీఎస్, మాన్యువల్ టికెటింగ్ వ్యవస్థల్లోనూ సవరించిన కొత్త ధరలు కనిపించేలా సిస్టమ్స్ను అప్డేట్ చేశారు. అయితే రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ సర్చార్జీలు, ఇతర చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లోనూ ఎలాంటి మార్పు లేదని రైల్వేశాఖ పేర్కొంది. -
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
నేను స్త్రీ ద్వేషినా.. మీరు చేసిందేంటి?
నేను స్త్రీ ద్వేషినా? మరి ఆమె చేసిందేంటి? అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫైర్ అయ్యారు. ఆయన అంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యర్థులపై కాదు.. సొంత పార్టీ మహిళా ఎంపీపైనే. ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన మహువా మొయిత్రాపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ నోరు పారేసుకున్నారు. కళ్యాణ్ బెనర్జీ ఎందుకంత కోపంతో ఊగిపోయారంటే..?జూన్ 25న, సౌత్ కలకత్తా లా కాలేజీలో విద్యార్థిపై దుండగులు దారుణానికి పాల్పడిన ఘటనపై కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'స్నేహితురాలిని స్నేహితుడే చెరబడితే మేమేం చేయగలం. యువతులు ఎలాంటి వారితో తిరుగుతున్నారో గమనించుకోవాలి. బెంగాల్లో ప్రతి చోట మహిళలకు రక్షణ కల్పించడం సాధ్యం కాద'ని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా మహువా మొయిత్రా ఖండించారు. 'భారతదేశంలో స్త్రీ ద్వేషం పార్టీలకు అతీతంగా ఉంటుంది. మిగతా పార్టీలతో టీఎంసీని వేరు చేసే విషయం ఏమిటంటే, ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము ఖండిస్తామ'ని మొయిత్రా ఎక్స్లో పోస్ట్ చేశారు.మొయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.చదవండి: ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?మొయిత్రా వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని బెనర్జీ విమర్శించారు. కలిగంజ్ ఉప ఎన్నికల సమయంలో తనను ప్రచారం చేయనీయకుండా ఆమె అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడుతున్న ఆమె.. పార్టీలో మహిళా నాయకులను ఎదగనీయకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే మొయిత్రా, బెనర్జీ మధ్య విభేదాలు కొత్త కాదు. గతంలోనూ వీరిద్దరూ బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. -
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్ కాదా?
బెంగళూరు: కాంగ్రెస్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్ హైకమాండ్ కదా.. మరి పార్టీ చీఫ్ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్లా దొరికింది. అటు కాంగ్రెస్ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్ చీఫ్గా ఉన్న మీరు హైకమాండ్ కాదా?, మరి ఇంకా హైకమాండ్ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్ పంచ్లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025 -
పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
ఢిల్లీ: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు,…— PMO India (@PMOIndia) June 30, 2025 -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్కుమార్రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
ఐటీ ఉద్యోగితో పోలిస్తే వారికి రెట్టింపు ఆదాయం
కెరీర్కు బంగారు బాటగా ఇంజనీరింగ్ను పరిగణించే మన దేశంలో.. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడానికి దాదాపు రూ.10-20 లక్షలు ఖర్చు చేయాలి. అంతేకాదు జీవితంలో విలువైన 4 సంవత్సరాలు వెచ్చించాలి. ఇంత వ్యయ ప్రయాసలకు ఓరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరితే చేతికి వచ్చే జీతం ఎంతో తెలుసా? సగటున గంటకు రూ.139-186 మాత్రమే. అదేదో చిన్నాచితకా కంపెనీల్లో వీరు ఉద్యోగం చేస్తు న్నారా అంటే అదీ కాదు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో! ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్ల వంటి నిపుణులైన కార్మికుల కంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుకునే వేతనం తక్కువ.-సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ఎంట్రీ-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సగటు జీతం 2007-2010 కాలంలో సంవత్సరానికి దాదాపు రూ.3.5 లక్షలుగా ఉండేది. అప్పటితో పోలిస్తే 2024లో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలూ పెరిగోయి, కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాలామంది ప్రెసర్ల వేతనాల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. అర్బన్ కంపెనీ, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న కార్మికులైతే బీటెక్ గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలకుపైనా ఆదాయం అందుకుంటున్నారని ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ 'కెరీ ర్స్ 360' నివేదిక చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్స హించాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.బీటెక్ చదువు ఖర్చు పెరిగింది... రోజుకు 9 గంటల చొప్పుననెలలో 20 రోజుల పని దినాలకు అంటే నెలలో 180 గంటలు విధులు నిర్వర్తించారని భావిస్తే.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లో ఫ్రెషర్లు అందుకునే వేతనం కంపెనీని బట్టి గంటకు రూ. 130 నుంచి రూ.180 మధ్య ఉంది. బీటెక్ డిగ్రీ దశాబ్దన్నర క్రితం రూ.1-2 లక్షల్లో పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లకుపైనే ఖర్చు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తమ నాలుగేళ్ల చదువు కోసం అధిక సమయం. కృషి, డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, చదువు పూర్తై పట్టా చేతికొచ్చాక.. కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరితే జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.రికవరీకి 6-8 ఏళ్లు..అర్బన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన కార్మికులు సగటున గంటకు రూ.311 సంపాదిస్తున్నారు. ప్లంబర్లు. ఎలక్ట్రిష్ యన్స్, టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, డ్రైవర్లు, మసాజ్ థెరపిస్ట్ వంటి నైపుణ్యం కలిగిన ఈ కార్మి వీలు నెలకు సగటున 160 గంటలు పనిచేస్తే.. పన్నులు. కమీషన్, మెటీరియల్ వ్యయాలు పోను నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదిస్తున్నారు.ఇది కేవలం జీతాల పోలిక కాదని కెరీర్స్ 300 అంటోంది. 2010 పూర్వం బీటెక్ విద్యార్ధి తన డిగ్రీకి అయిన ఖర్చును తిరి రాబట్టుకోవడానికి రెండు మూడేళ్లు పట్టేది. ఇప్పుడు తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. ఏకంగా 5 ఏళ్లకుపైనే: పడుతోంది. మరోవైపు గగ్ ఎకానమీలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి అవకాశాలను వేగంగా, తక్కువ అడ్డంకులతో సాధిస్తున్నారని కెరీర్స్.. 360 చెబుతోంది. -
లా కాలేజీ విద్యార్థినిపై దాష్టీకం సీసీ కెమెరాలో రికార్డు
కోల్కతా: సౌత్ కోల్కతా లా కాలేజీలో విద్యార్థిపై గ్యాంగ్రేప్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఘటన చోటుచేసుకున్న జూన్ 25వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజీలో ఫస్టియర్ చదివే విద్యారి్థనిని కొందరు సెక్యూరిటీ గార్డు రూంలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందులో బాధితురాలు, ముగ్గురు నిందితుడు, సెక్యూరిటీ గార్డు కనిపించారన్నారు. అక్కడి స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్రూంలో వెంట్రుకలు, హాకీ స్టిక్ను, గుర్తు తెలియని ద్రావకం కలిగిన కొన్ని బాటిళ్లను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. గార్డు రూం, స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్ రూంలలో పెనుగులాట చోటుచేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయని వివరించారు. నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితురాలి ముఖం, మెడపై గీసుకుపోయినట్లు, ఛాతీపై కొన్ని గుర్తులు ఉన్నాయని వివరించారు. ప్రధాన నిందితుడు కాలేజీ మాజీ విద్యార్థి, టీఎంసీ విద్యార్థి నేత మోనోజిత్ మిశ్రాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులను, కాలేజీ వాచ్మ్యాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఉండగా, ఘటన చోటుచేసుకున్న లా కాలేజీకి ఆదివారం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)సభ్యురాలు అర్చనా మజుందార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై జరిగిన దారుణంపై దర్యాప్తు చేయకుండా పోలీసులు తనకు ఆటంకం కలిగించారని అనంతరం మజుందార్ ఆరోపించారు. ఘటనాప్రాంతంలో ఫొటోలు, వీడియోలు నిషేధించినట్లు చెప్పారన్నారు. కాగా, ఘటనపై దర్యాప్తునకు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోలీసు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యుల సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెల్సిందే. -
భారత కాలపు ఆయుధాలు!
జైపూర్: పొలం దున్నుతుంటేనో, కొత్త ఇంటి కోసం భూమిని తవ్వుతుంటేనో లంకెబిందెలు దొరకడం, ఎవరూ చూడకుంటే దాచేసుకోవడం, అందరికీ తెలిస్తే ప్రభుత్వపరం కావడం తెల్సిందే. మానవాళి నడిచి వచ్చిన దారుల గురించి, మన పూరీ్వకులు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, సాంస్కృతిక సంపద గురించి తెలియాలంటే ఇలా లభ్యమైన పురాతన విగ్రహాలు, పాత్రలు, కళాఖండాలే ఆధారం. తాజాగా ఏకంగా మహాభారత కాలంనాటి, అంటే దాదాపు 4,500 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు, ఆయుధాలు, పాత్రలు రాజస్తాన్లోని బీట్ జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డాయి. మౌర్యులు, శుంగ వంశ పాలనా కాలానికి చెందిన ఈ వస్తువులను పురాతత్వ శాఖ (ఏఎస్ఐ) తాజాగా తవ్వితీసింది. గత నాగరికత తాలూకు అవశేషాలు బయల్పడిన రాజస్తాన్లోని భరత్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలోని బహాజ్ గ్రామంలో ఈ తవ్వకాలు జరిపారు. ఉత్తరప్రదేశ్లోని మథుర, ఈ బహాజ్ గ్రామం, హరియాణాలోని మరికొన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి కృష్ణుడు నడయాడిన ‘బ్రజ్ భూమి’గా పిల్చుకుంటారన్నది తెలిసిందే. జనవరిలో తవ్వకాలు షురూ బహాజ్ గ్రామ భూముల్లో పురాతన ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనాతో ఈ ఏడాది జనవరిలో పురాతత్వ బృందాలు తవ్వకాలు మొదలెట్టాయి. నిరాటంకంగా ఆరు నెలలుగా తవ్వకాలు జరపగా ఎన్నెన్నో పురాతన వస్తువులు లభించాయి. రాజులు, రాజ్యాల ఘనతను చాటే విగ్రహాలు, వస్తువులు, పాత్రలు, ఆయుధాలు దొరికాయి. ఒక అస్థిపంజరం సైతం లభించింది. అది ఏ కాలపుదో తెల్సుకునేందుకు ఇజ్రాయెల్ పంపారు. కొన్ని అపురూప విగ్రహాలను జైపూర్లోని పురాతత్వ శాఖ విభాగానికి తరలించి భద్రపరిచారు. మరి కొన్నింటిని పౌరుల సందర్శనల కోసం డీగ్ జల్మహల్, ఇతర మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచారు. ‘‘తవ్వకాలకు అనుమతి రాగానే ఎంతో సంతోషిచాం. ఏమాత్రం ఆలస్యంచేయకుండా జనవరి 10వ తేదీన తవ్వకాలు మొదలెట్టాం. తవ్వకాలు ఇకమీదట కూడా కొనసాగుతాయి. సమీప ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరిపి పురాతన నాగరికత తాలూకు అవశేషాలను కనుగొంటాం. నాటి సంస్కృతిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కృషిచేస్తాం’’ అని జైపూర్ పురాతత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వినయ్ గుప్తా చెప్పారు. దశాబ్దాల క్రితం సమీప నౌ గ్రామంలో ఏఎస్ఐ బృందాలు తవ్వకాలు జరిపారు. ఆనాడు సైతం కొన్ని పురాతన వస్తువులు లభించాయి. -
Shimla: పేకమేడ కాదది.. ఐదంతస్తుల భవనం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం సిమ్లాలోని ఐదంతస్తుల భవనమొకటి కుప్ప కూలింది. పేకమేడలా నేలమట్టం అవుతున్న ఈ ఇంటికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ముందుగానే భవన యజమాని అంజనా వర్మ బిల్డింగ్లోని అందరినీ ఖాళీ చేయించడంతో పెనుముప్పు తప్పింది. Himachal Pradesh: 5-storey building collapses in Shimla after heavy rain—no casualties reported.#Viral #Trending #ViralVideo pic.twitter.com/DVa4rXYcG9— TIMES NOW (@TimesNow) June 30, 2025భవనానికి సమీపంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయని అంజనా వర్మ ఆరోపించారు. గ్రామ ఉపాధ్యక్షుడు యశ్పాల్ వర్మ కూడా సమీపంలో రోడ్డు నిర్మాణం కారణంగానే బిల్డింగ్కు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపడుతున్న కంపెనీ ఆ పనులను నిలిపివేయలేదు. ఫలితంగా ఇప్పుడు మరికొన్ని ఇళ్లు కూడా ప్రమాదం అంచున ఉన్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ వాతావరణ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి: చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్ -
అవి అస్పష్ట, గంపగుత్త ఆరోపణలు
నాగ్పూర్: క్యాన్సర్ నుంచి కోలుకుని భర్త వద్దకు వెళ్లిన తన సోదరిని అత్తింటి వారు కట్నం తేవాలంటూ వెనక్కి పంపించి వేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతీకారేచ్ఛతోనే ఈ ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని పేర్కొంది. తనతోపాటు 68 ఏళ్ల తన తల్లిపై నమోదైన కట్నం వేధింపుల కేసును కొట్టివేయాలంటూ పుణేకు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్పై జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ ప్రవీణ్ ఎస్ పాటిల్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్కు 2016లో వివాహమవగా అతడి భార్యకు క్యాన్సర్ ఉన్నట్లు 2019లో నిర్థారణయింది.అనంతరం ఆమె తన సోదరుడి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంది. వైద్యం ఖర్చు కొంత సోదరుడే భరించాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక 2020 జనవరిలో ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లింది. అయితే, రూ.8 లక్షల కట్నం తేవాలంటూ ఆమెను భర్త, అత్త వెనక్కి పంపించి వేశారంటూ సోదరుడు 2021 ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మరునాడు, అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఆమె కన్నుమూసింది. అత్తింటి వారి నుంచి క్యాన్సర్ చికిత్సకు అయిన ఖర్చులను రాబట్టేందుకే అతడు కేసు వేశాడని పిటిషనర్ తరఫు లాయర్ యోగేశ్ వైద్య వాదించారు. పిటిషనర్ తన భార్య వైద్యానికైన ఖర్చు కొంత భరించారని, వైద్య బీమా కూడా చేయించారని ధర్మాసనానికి ఆధారాలను నివేదించారు. పైపెచ్చు, పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయలేదు, ఇతరత్రా వేధింపులేవీ నమోదు కాలేదన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత భర్త వద్దకు ఆమె ఎప్పుడు వెళ్లింది వంటి వివరాలు సైతం లేవన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ భార్య సోదరుడు కక్ష సాధింపు కోసమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అస్పష్టంగా, ఎలాంటి ఆధారాల్లేకుండా గంపగుత్తగా అతడీ ఆరోపణలు చేశాడని తెలిపింది. పిటిషనర్, అతడి తల్లిపై నమోదైన కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్
బెంగళూరు: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్ ఇన్లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్ తెలిపారు. -
సిక్సర్ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్పైనే ప్రాణాలొదిలి!
పంజాబ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.మృతుడిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. కాగా ఫిరోజ్పూర్లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్జీత్.. సిక్సర్తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.సిక్సర్బాది ఆ వెంటనే కాగా సిక్సర్బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025 -
‘కస్టమ్స్’ చేతికి 16 అందమైన పాములు
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్ ఆరోపణలతో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్బర్డ్ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? -
సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.జైపూర్లోని ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్పూర్లోని తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. ఈ రాష్ట్రాలకు రెడ్, ఎల్లో అలర్ట్
ఢిల్లీ: ఉత్తర, ఈశాన్యం భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో పలువురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారు. ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. ఘటనాస్థలానికి 18 కిలోమీటర్లల దూరంలోని తిలాడీ షాహిద్ స్మారక్ వద్ద ఆ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉన్నారని, వీరిలో 20 మందిని రక్షించామని అధికారులు తెలిపారు.⛈️ Uttarakhand Cloudburst Triggers Chaos – Char Dham Yatra Halted, 9 Missing📍Uttarkashi, India –• Heavy rains and a cloudburst hit Uttarkashi, causing landslides and widespread disruption.• Nine workers missing near a hotel site on the Yamunotri Highway, search ops… pic.twitter.com/ZkxDgS2l03— Snap Media (@SnapMediaLive) June 29, 2025చార్ధామ్యాత్రపై ప్రభావం.. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించారు. అనంతరం, మళ్లీ యాత్ర ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక, హిమాచల్లోని కుల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కుల్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 🌧️ #Uttarakhand | Heavy rains caused Dhangarhi & Dhikuli canals to overflow, disrupting traffic on NH-309 between Ramnagar & Kumaon-GarhwalVehicle movement halted, police managing traffic. Administration on alert; public advised to avoid unnecessary travel🛣️ #UttarakhandRains pic.twitter.com/NniieWLzYP— The Bharat Current (@thbharatcurrent) June 29, 2025 జార్ఖండ్లోని తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 28 వరకు రాష్ట్రంలో 80 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Kullu, Himachal Pradesh | IMD issues a yellow alert for Kullu as the state continues to receive heavy rainfall. pic.twitter.com/A71nfgEyML— ANI (@ANI) June 30, 2025 రాబోయే వారం రోజులు భారీవర్షాలు: ఐఎండీబంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ ఆదివారం రెడ్ అలర్ట్ జారీచేసింది. చండీగఢ్లో ఒక్కరోజే 119.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో విద్యార్థినిపై జరిగిన అకృత్యం దేశవ్యాపంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. బాధితురాలిని ఇద్దరు నిందితులు కళాశాల లోపలికి బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుని నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించిన నేపధ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.అత్యాచార బాధితురాలిని కళాశాల గేటు నుండి కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు నిందితులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడ్డాయని కోల్కతా పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా మరో ఇద్దరు నిందితులతో తనను బలవంతంగా గార్డు గదిలోనికి తీసుకువెళ్లాలని ఆదేశించాడని బాధితురాలు చెప్పడాన్ని ఈ వీడియో క్లిప్ ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తాము ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ కేసులో నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్, కాలేజీ సెక్యూరిటీ గార్డులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మనోజిత్ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, మిగిలిన ఇద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనోజిత్ మిశ్రా తృణమూల్ యువజన విభాగంలో సభ్యునిగా ఉన్నారు. దీంతో పార్టీపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది.ఇది కూడా చదవండి: Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు -
Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు
ముంబై: మహారాష్ట ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
మెదడును నియంత్రించే ఫంగస్!
చాన్నాళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సృష్టించిన హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో అడవిలో పేద్ద చెట్టు నరికేస్తుంటే దాని జిగురులో ఒక దోమ చిక్కుకుపోయి ఉంటుంది. ఆ దోమ అప్పటికే ఒక పెద్ద డైనోసార్ను కుడుతుంది. ఆ డైనోసార్ రక్తం నుంచి సేకరించి డీఎన్ఏతో శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్కు ప్రాణప్రతిష్టచేస్తారు. అచ్చం అలాగే 9.9 కోట్ల సంవత్సరాల క్రితంనాటి ఒక జిగురులో చిక్కుకుపోయిన చీమ, ఈగల సాయంతో వాటికి సోకిన ఒక ఫంగస్ జాడను నేడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ ఫంగస్ కూడా డైనోసార్ల కాలంనాటిదిగా పరిశోధకులు భావిస్తున్నారు.జాంబీ ఫంగస్?చెట్లు సూర్యరశ్మి ద్వారా కిరణజన్యసంయోగ క్రియ జరిపి శక్తిని సంపాదిస్తాయి. అయితే ఫంగస్, కీటకాలు వంటివి సొంతంగా ఆహారాన్ని, శక్తిని సృష్టించుకోలేక ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటిని పరాన్న జీవులు అంటారు. అలాంటి పరాన్న జీవజాతులకు చెందిన కొన్ని ఫంగస్ రకాలు ఏకంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేస్తాయి. అంటే చీమ మెదడులోకి దూరి దానినే ఈ ఫంగస్ నియంత్రిస్తుంది. దాంతో ఆ చీమ ఒక ‘జాంబీ’ తరహాలో నియంత్రణ తప్పి ప్రవర్తిస్తుంది. అలాంటి జాంబీ ఫంగస్ ఈకాలంలోనేకాదు డైనోసార్ల కాలంలోనూ జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ జిగురులో చిక్కుకుపోయిన ఈగ, చీమలో కొత్త రకం ఫంగస్ల ఆనవాళ్లను గుర్తించారు. అయితే ఈ జాంబీ ఫంగస్ ఎంతటి శక్తివంతమైంది?. ఆనాటి చిన్నపాటి జీవజాలానికి ఇవి సోకి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయా అనే ప్రశ్నలకు ఇప్పుడు శాస్త్రవేత్తలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు.ఏమిటీ ఫంగస్ ప్రత్యేకత కొన్ని రకాల కీటకాలు ఎక్కువగా ఒఫియోకార్డిసెప్స్ అనే ఫంగస్ బారిన పడతాయి. ఈ కీటకాల్లోని అతిదేహి కణాల్లోకి ఫంగస్ చొరబడి నెమ్మదిగా మెదడును చేరుతుంది. మెదడు కణాలను ఫంగస్ తనకు అనువుగా పనిచేసేలా మార్చేస్తుంది. పని పూర్తయ్యాక చివరకు ఆ కీటకాన్ని ఈ ఫంగస్ కణాలు చంపేస్తాయి. కీటక ప్రపంచంలో ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ వ్యాప్తి వివరాలపై తాజాగా పరిశోధన వేగవంతంకానుంది. అయితే తాజాగా ఈ చీమ, ఈగలో కనుగొన్న ఫంగస్లను గతంలో శాస్త్రవేత్తలు ఎన్నడూ చూడలేదు. దీంతో వీటికి కొత్త పేర్లు పెట్టారు. ‘‘ 9.9 కోట్ల ఏళ్ల క్రితం నాటి జీవులకు సోకిన ఫంగస్ రకాలున్న చీమ, ఈగ లభించడం నిజంగా అత్యంత అరుదు’’ అని నైరుతి చైనాలోని యునాన్ విశ్వవిద్యాలయంలోని పురాతనజీవశాస్త్ర విభాగ డాక్టోరల్ విద్యారి్థ, ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన యుహూయీ ఝువాంగ్ చెప్పారు. ‘‘ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ పూరీ్వకులను గుర్తించడం ఇదే తొలిసారి. అందుకే వీటికి కొత్త పేర్లు పెట్టాం. చీమలో లభించిన కొత్త ఫంగస్కు పాలియోకార్డిసెప్స్ అని, ఈగకు సోకిన ఫంగస్కు పాలియోకార్డిసెప్స్ ఐరనోమేయీ అని నామకరణం చేశారు. కొన్ని ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ జాతులు ఈకాలంనాటి చీమలకూ సోకుతాయి. ఈ ఫంగస్కు ‘జాంబీయాంట్ ఫంగీ’ అనే పేరుంది. మెదడులోకి ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ వ్యాపించి తనకు అనువుగా ప్రవర్తించేలా చీమను తన వశంచేసుకుంటుంది. హెచ్బీఓ ప్రసారమైన టీవీ సిరీస్ ‘ ది లాస్ట్ ఆఫ్ అస్’కు ఈ ఫంగసే స్ఫూర్తి. కొత్త ఫంగస్ రకాలను కనుగొన్న పరిశోధనా తాలూకు వివరాలు ‘‘ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ’’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొత్త ఫంగస్ల రూపురేఖలు, లక్షణాలను తెల్సుకునేందుకు మైక్రో–కంప్యూటెడ్ టోమోగ్రఫీ ద్వారా త్రిమితీయ చిత్రాలను తీశారు. 14 నుంచి ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటి ఫంగస్గా తేల్చారు. ఈ కాలాన్ని క్రిటేసియస్ కాలంగా పరిగణిస్తారు. ‘‘ జాంబీ ఫంగస్ సోకిన కీటకాలు త్వరగా చనిపోతాయి. ఒకరకంగా ఈ రకం కీటకాల జనాభాను నియంత్రించే కారకాలుగా జంబీ ఫంగస్ను చెప్పొచ్చు’’ అని పరిశోధకుడు ఝువాంగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ జాతులకు సోకుతున్నాయి? చీమలతోపాటు ఈగ, సాలెపురుగు, పేడపురుగు, సికాడాస్ పెద్ద ఈగ జాతులకూ ఈ జాంబీ ఫంగస్ బెడద ఉందని లండన్లోని నేచరల్ హిస్టరీ మ్యూజియం పత్రాలు వెల్లడిస్తున్నాయి. గండు చీమల మెదడులోకి నేరుగా దూరిపోయి వాటిని జాంబీ చీమలుగా మారుస్తాయని వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ మ్యూజియం ఆఫ్ నేచరల్ హిస్టరీ సీనియర్ సైంటిస్ట్ కాన్రాడ్ లాబండీరీ చెప్పారు. -
బుద్ధుడిపై వియత్నాం ప్రజల్లో భక్తి, ఆప్యాయత ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు భేష్ ‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్ కీ బాత్లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. -
ప్రయాణానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది.రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణిలకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శ కంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తారు. -
దేశమంతటా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఈ సీజన్లో తొమ్మిది రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీనాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని పేర్కొంది. ఈసారి మాత్రం ముందుగానే ప్రవేశించడంతోపాటు విస్తరించాయంది. 2020లో జూన్ 26వ తేదీకల్లా దేశమంతటా రుతు పవనాల విస్తరణ పూర్తయిందని గుర్తు చేసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ యూపీ, హరియాణాల్లో వ్యాపించాయని వివరించింది.వచ్చే వారం రోజుల్లో దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా బలమైన అల్పపీడన వ్యవస్థల మద్దతుతో, రుతుపవనాలు వేగంగా ముందుకు సాగాయని తెలిపింది..అయితే, మే 29 నుంచి జూన్ 16 వరకు దాదాపు 18 రోజుల పాటు రుతు పవనాల కదలికలో స్తబ్దత ఏర్పడిందని పేర్కొంది. జూన్–సెప్టెంబర్ మధ్య ఈసారి సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది.ఉత్తరాఖండ్లో కుంభవృష్టి..ఇద్దరు మృతిఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం కురిసిన కుంభవృష్టి నిర్మాణ కార్మికులిద్దర్ని బలి తీసుకుంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ నిర్మాణం పక్కనే కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. భారీ వర్షంతో కొండచరియలు విరిగి ఈ నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఘటనలో ఇద్దరు చనిపోయారు.గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైవే దెబ్బతినడంతో ఛార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్లోనూ కుంభవృష్టి కారణంగా సిమ్లా–కల్కా రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. జార్ఖండ్లోని ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పండర్సోలిలోని ప్రైవేటు స్కూల్ ఆవరణలోకి వరద చేరడంతో లోపల కనీసం 162 మంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. -
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ వ్యవస్థను చెరబట్టారని, కీలుబొమ్మను చేసి ఆడించారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పేరిట అప్పటి ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేసిందని, లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన నాయకులు చిరస్మరణీయులని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో వారి పోరాటమే మనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ఆదివారం 123వ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మిళిత శక్తితో ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొన్ని ఆడియో రికార్డులను ప్రధానమంత్రి వినిపించారు. సంక్షోభం అంటే ఎంత భయకరంగా ఉంటుందో వీటిద్వారా తెలుస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియో, ఎమర్జెన్సీ దారుణాల గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ మాట్లాడిన ఆడియోలు ఇందులో ఉన్నాయి. నాటి దారుణాలు మరవలేం ‘‘ఇందిర హయాంలో ప్రజలపై దమనకాండ కొన్ని సంవత్సరాలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత రెండేళ్లపాటు మరింత తీవ్రంగా మారింది. ప్రజల హక్కులను హరించారు. స్వాతంత్య్రపు హక్కును అణచివేశారు. వార్తాపత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు. కోర్టులను సైతం వదల్లేదు. వాటికి అధికారాలు లేకుండా చేశారు. లక్ష మందికిపైగా జనాన్ని జైళ్లలో పెట్టారు. అక్షరాలా రాక్షస పాలన సాగించారు’’ అని మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియోలో వినిపించింది. 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అప్పటి దారుణాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.జార్జి ఫెర్నాండెజ్ చేతులకు సంకెళ్లు వేశారని, మీసా చట్టం కింద వేలాది మందిని నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. కానీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని, చివరకు విజయం సాధించారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ‘సంవిధాన్ హత్య దివస్’ జరుపుకున్నామని మోదీ తెలిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వాజ్పేయ్ ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో ఇప్పుడు జరిగిన దాన్ని కేవలం ఎన్నికలు అనలేం. ఇదొక శాంతియుత విప్లవం. ప్రజా వెల్లువ ప్రజాస్వామ్య హంతకులను కుర్చీ నుంచి కూలదోసింది. వారిని చెత్తబుట్టలోకి విసిరేసింది’’ దీనిపై మోదీ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి పోరాడిన వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు.ట్రకోమా రహిత దేశంగా భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ‘ట్రకోమా’ రహిత దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాన మోదీ అన్నారు. ఇందుకోసం కృషి చేసినవారికి అభినందనలు తెలియజేశారు. అస్సాంలోని బోడోలాండ్ ఫుట్బాల్ క్రీడాకారులుకు కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. మేఘాలయాలో ఎరీ సిల్క్కు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పట్టు పరుగులను చంపకుండా అక్కడ వ్రస్తాలు తయారు చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. -
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 16వ జన గణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 8వ జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి జన గణన అధికారికంగా ప్రారంభం కానుంది. జనాభా లెక్కల సేకరణ వీలుగా పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతిపాదించాలని కేంద్రం సూచించింది. జన గణన ప్రక్రియకు మార్పులు చేసిన పరిపాలనా యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. డిసెంబర్ 31న సరిహద్దులు ఖరారు చేస్తామన్నారు.ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పట్టణాలను ఏకరూప ఎన్యూమరేషన్ బ్లాక్లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యూమరేటన్ను నియమిస్తారు. జనాభా లెక్కల సేకరణలో పొరపాట్లు జరగకుండా వీరు చర్యలు తీసుకుంటారని వివరించారు. 3 నెలల్లోగా జన గణన పూర్తిచేయాల్సి ఉంటుంది.2027 మార్చి 1వ తేదీ లోగా రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హౌజ్లిస్టింగ్ ఆపరేషన్, రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహిస్తారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్ బ్లాక్లు ఖరారైన తర్వాత పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. దేశంలో చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత.. 2027లో జరగబోతోంది. -
రథయాత్రలో తొక్కిసలాట
పూరీ: ఒడిశాలో విఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో గుండిచా ఆలయం ఎదుట తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు.మూడు రథాల్లో కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దగ్గరి నుంచి తిలకించడానికి గుండిచా ఆలయం వద్ద భక్తులు ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు. అంతలో యాత్రా సామగ్రితో రెండు ట్రక్కులు జనం మధ్యలోకి దూసుకొచ్చాయి. దాంతో భయాందోళనకు గురై వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో బోలాగఢ్కు చెందిన బసంతి సాహూ (36), బాలిపాట్నాకు చెందిన ప్రేమకాంత్ మొహంతీ (80), ప్రవతి దాస్ (42) మరణించారు. అధికారులపై వేటు తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, ఎస్పీ వినీత్ అగర్వాల్పై బదిలీ వేటు వేశారు. డీసీపీ బిష్ణు పాటీ, కమాండెంట్ అజయ్ పాధీని సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జగన్నాథుడి భక్తులు క్షమించాలంటూ ‘ఎక్స్’లో సీఎం పోస్టు చేశారు. రథయాత్రలో తొక్కిసలాటకు భద్రతా లోపాలే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రథయాత్ర ఇన్చార్జిగా సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్ను నియమించింది.పరిస్థితి అదుపులోకి వచి్చందని న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం మనసును కలచివేసిందని పూరీ రాజు, శ్రీజగన్నాథాలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పటా్నయక్ తదితరులు సంతాపం ప్రకటించారు.ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని విమర్శించారు. పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మూడు రథాలు ప్రధానాలయం నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి శనివారం చేరుకున్నాయి. గుండిచా మాతను జగన్నాథ, బలభద్ర, సుభద్రల తల్లిగా భావిస్తారు. రథాలు జూలై 5 దాకా అక్కడే ఉంటాయి. అనంతరం బహుదా యాత్ర ద్వారా ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతాయి. -
సిలికాన్ లేకుండానే కంప్యూటర్
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ టెక్నాలజీలో రారాజుగా వెలుగొందుతున్న సిలికాన్ మూలకానికి ఉన్న ప్రాభవం భవిష్యత్తులో తగ్గిపోనుందని తాజా పరిశోధన ఒకటి స్పష్టంచేస్తోంది. ఆధునిక ఎలక్ట్రానిక్, సాంకేతిక ప్రపంచానికి ప్రాణాధారంగా నిలుస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో సిలికాన్ మూలకం అత్యంత కీలకం. ఈ మూలకం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు పురుడుపోసుకోదన్న వాదనను బద్దలుకొడుతూ అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనా బృందం ప్రపంచంలోనే తొలిసారిగా సిలికాన్రహిత కంప్యూటర్ను అభివృద్ధిచేసింది. గత అర్ధశతాబ్దకాలంతో పోలిస్తే నేటి కంప్యూటర్ల పరిమాణం తగ్గడానికి, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ వాహనాల సర్క్యూట్లలో సిలికాన్ అత్యంత ప్రధానమైన మూలకం.అలాంటి సిలికాన్ లేకుండానే ‘కాంప్లిమెటరీ మెటల్ –ఆక్సైడ్ సెమీకండక్టర్’ కంప్యూటర్ను తయారుచేశామని వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. తక్కువ పరిమాణంలో విద్యుత్తో వినియోగించుకుంటూ అత్యంత పల్చటి, వేగవంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి ఈ ద్విమితీయ వస్తువులు బాటలు వేస్తాయని పరిశోధకులు చెప్పారు. సర్క్యూట్లో ట్రాన్సిస్టర్లు ముఖ్యమైనవి. ఈ ట్రాన్సిస్టర్లను అత్యంత శుద్ధమైన సిలికాన్తో తయారుచేస్తారు. అయితే తాజా పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు సిలికాన్కు బదులుగా ఎన్–టైప్ ట్రాన్సిస్టర్ కోసం మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, పీ–టైప్ టాన్సిస్టర్ కోసం టంగ్స్టన్ డైసెలినైడ్ను ఉపయోగించారు. సారథ్యం వహించిన భారతీయుడుఈ పరిశోధనకు పెన్సిల్వేనియా వర్సిటీలోని ఇంజనీరింగ్ సైన్స్, మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్, భారతీయ మూలాలున్న సప్తర్షి దాస్ సారథ్యం వహించారు. ఈయన నేతృత్వంలోని బృందం తాజాగా ప్రాథమిక స్థాయిలో కాంప్లిమెంటరీ మెటల్–ఆక్సైడ్ సెమీకండక్టర్ (సీఎంఓఎస్)కంప్యూటర్ను తయారు చేసింది. ‘‘ సిలికాన్ పాడైతే ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అదే ఈ ద్విమితీయ వస్తువులతో తయారైన సర్క్యూట్.. విద్యుత్ ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. దాంతో సర్క్యూట్ ఎక్కువకాలం మన్నుతుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రంగంలో ఇదొక మైలురాయి.భవిష్యత్తులో సిలికాన్రహిత సర్క్యూట్ల తయారీకి ఇది బాటలువేస్తుంది’’ అని సప్తర్షి దాస్ వివరించారు. మెటల్–ఆర్గానిక్ కెమికల్ వేపర్ డిపోజీషన్(ఎంఓసీవీడీ) విధానంలో అత్యంత పల్చని పొరల మీద మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, టంగ్స్టన్ డైసెలినైడ్ పరుచుకునేలా చేస్తారు. తద్వారా ఈ వినూత్న ట్రాన్సిస్టర్లను తయారుచేశారు. రెండు అంగుళాల పొరమీద సైతం ఈ ట్రాన్సిసర్ను అభివృద్ధిచేయొచ్చు. ఈ కంప్యూటర్ అత్యంత తక్కువ కరెంట్ను ఉపయోగించుకుంటూ 25 కిలోహెడ్జ్ సామర్థ్యంతో పనిచేస్తుందని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డాక్టోరల్ విద్యార్థి, భారతీయ మూలాలున్న సుభీర్ ఘోష్ చెప్పారు. ఈ ప్రాథమిక స్థాయి కంప్యూటర్ ప్రస్తు తానికి సింపుల్ లాజిక్ ఆపరేషన్స్ను సమర్థవంతంగా పూర్తిచేయగలదు.భవిష్యత్తు అంతా 2డీదే‘‘మీరొక బహుళ అంతస్తుల భవనం కట్టాలంటే పటిష్టమైన ఇటుకలను వాడతారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతను ఉపయోగించి పటిష్టమైన పల్చటి పేపర్లతోనూ నిర్మాణం పూర్తిచేయొచ్చు. పల్చని, వేగవంతమైన ట్రాన్సిస్టర్లతో కంప్యూటర్నూ రూపొందించవచ్చు’’ అని సప్తర్షి వ్యాఖ్యానించారు. సిలికాన్ సాంకేతికత గత 80 ఏళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోలేదు. కానీ 2డీ టెక్నాలజీ 2010లో మొదలైనా వెనువెంటనే అభివృద్ధిచెందుతోంది. భవిష్యత్తు అంతా 2డీ టెక్నాలజీదే’’ అని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనకు అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ది ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్, నేవీ రీసెర్చ్ ఆఫీస్లు సైతం ఆర్థికసాయం అందిస్తున్నాయి. -
సాంకేతిక మార్గదర్శకులు!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఆస్టరాయిడ్ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం కితాబిచ్చింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్ కంపెనీ ఈక్వల్ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..అగ్నికుల్ కాస్మోస్: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్ లాంచ్ప్యాడ్ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ప్యాడ్. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్ప్యాడ్ ఉండేది. అగ్నిబాణ్ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ‘అగ్నిలెట్’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది.సైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేసైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ): టరీ): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.డెజీ: స్మైల్స్.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్లో 2018లో స్థాపించారు.ఈక్వల్: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.ఎక్స్పోనెంట్ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పూర్తి అయ్యే ఈ–పంప్స్ (చార్జింగ్ స్టేషన్) తయారు చేస్తోంది.ఫ్రేట్ టైగర్: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవలు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ వేదికను రూపొందించింది.గెలాక్స్ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్. ఐదుగురు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్ ఇమేజింగ్ శాటిలైట్ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.సోలార్స్క్వేర్: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్ సేవలను అందిస్తోంది.ది ఈ–ప్లేన్ కో: ఐఐటీ మద్రాస్లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్ ట్యాక్సీని తొలుత మానవ పైలట్తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. పైలట్ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది.