బెంగళూరులో హైటెన్షన్‌.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు | Private schools in Bengaluru receive bomb threats News Updates | Sakshi
Sakshi News home page

బెంగళూరులో హైటెన్షన్‌.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Jul 18 2025 11:17 AM | Updated on Jul 18 2025 1:23 PM

Private schools in Bengaluru receive bomb threats News Updates

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

నగరంలోని రాజరాజేశ్వరీనగర్‌, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌ టీమ్‌లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి. 

ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్‌ , ఈమెయిల్స్‌ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement