
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో భీకర వర్షం పడడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించడంతో అరెంజ్ అలర్ట్ను అధికారులు రెడ్ అలర్ట్గా మార్చారు. ఢిల్లీతోపాటు తూర్పు హరియాణ, పశి్చమ ఉత్తరప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.