breaking news
heavy rain
-
దంచికొట్టిన వాన.. రోడ్లపై పొంగి పార్లుతున్న వరద
-
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 2 రోజులు కుండపోత..!
-
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, శామీర్పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
యూరియా కోసం జోరువానలో రైతుల క్యూ
-
గుంటూరు నగరంలో కుండపోత వర్షం
-
20 రాష్ట్రాలకు రెడ్ అలెర్ట్ అధికారిక ప్రకటన
-
విశాఖలో కుండపోత వర్షం.. ఏపీలో మూడు రోజులు గట్టి వానలు..
సాక్షి, విశాఖ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. 🔸ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/NCNsiHxmKQ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 9, 2025 -
ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు పడే చాన్స్!
విజయవాడ: ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదన్నారు. తీరం వెంబడి 40 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
వరంగల్ లో కుండపోత వర్షం..వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు (ఫొటోలు)
-
వరంగల్ లో కుండపోత వర్షం
-
వరంగల్లో దంచికొట్టిన వర్షం.. ప్రాణ భయంతో ప్రయాణికుల కేకలు..
సాక్షి, వరంగల్: వరంగల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం కాగా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాలో శనివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండలోని అంబేద్కర్ భవన్ రోడ్డు, తిరుమల జంక్షన్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అండర్ బ్రిడ్జి దగ్గర వరదలో చిక్కుకున్న రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు మేరకు వరద నీరు నిలిచిపోవడంతో అతి కష్టం మీద ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. దీంతో, ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో కాలనీల్లోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. #Warangalrains!!After a heavy rains in warangal city Railway under bridge under water logging situation stay safe 🚨🌧️⚠️ pic.twitter.com/G2yyU4ZWv2— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025భారీ వర్షం కారణంగా వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అది గుర్తించకుండా వెళ్లిన రెండు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మిల్స్ కాలనీ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సాయంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. అన్నారం, మహబూబాబాద్ నుంచి వచ్చిన ఈ బస్సుల్లో సుమారు వంద మంది ప్రయాణికులు ఉన్నారు. #Warangalrains!!Now heavy downpour rains going in warangal tricity places Hnk Kazipet warangal city alert 🌧️🌧️🚨 pic.twitter.com/UBEfX6WgMn— Warangal Weatherman (@tharun25_t) September 7, 2025Today two RTC Buses were struck up at under bridge Warangal into 5 ft water and about 20 passengers were struck up in the buses. Immediately CI Inthezargunj along with his staff proceeded to the spot and rescued all the passengers in two buses.@cpwarangal @dcpczwrl @Acp_wrlc pic.twitter.com/9VAOBtSs3H— SHO INTHEZARGUNJ (@shointhezargunj) September 7, 2025 -
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు
-
ఏపీకి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
విజయవాడ: మరో రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు అనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటును 1.5 మరియు 5.8 కి.మీ ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఈ నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48.1అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 6 గంటలకు 2.25 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో నాలుగు,ఐదు రోజులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రతలు తీసుకోవాలన్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు
-
వెంటాడుతున్న వరద కష్టాలు
సాక్షి, నెట్వర్క్: నిర్మల్ జిల్లాలోని భైంసా డివిజన్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తిన వరద బాసర కాటేజీల్లోకి ప్రవేశించింది. వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా అక్కడికి చేరుకుని, పరిస్థితి సమీక్షించారు. విపత్తు నియంత్రణ సహాయక బృందాలతో కాటేజీల నిర్వాహకులు, సిబ్బందిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా బాసర ఆలయ అర్చకులు గోదావరి శాంతించాలంటూ స్నానఘాట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇలావుండగా..భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తారు. సుద్ధవాగు వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఇళ్లలోకి వచ్చిన నీటిని తోడేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్ పట్టణంలో షాపుల్లో చేరిన నీటిని మోటార్లతో తోడుతున్నారు.హైదరాబాద్ నుంచి మెదక్ –ఎల్లారెడ్డి–బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా కోటగిరి వరకు వెళ్లే 765డీ జాతీయ రహదారి ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. హైదరాబాద్–నాగ్పూర్ హైవే (44) కోతకు గురైన చోట్ల మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.హవేళీఘనపురం మండలం గంగమ్మవా గులో గల్లంతైన యాదగౌడ్ అనే మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం లభించింది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య గల్లంతై మూడు రోజులైనా జాడ దొరకలేదు. రైలు పట్టాల ధ్వంసానికి కబ్జాలే కారణంభారీ వర్షాలతో రామేశ్వర్పల్లి–తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య 528 మైలురాయి వద్ద 50 మీటర్ల పొడవున ట్రాక్ కింద మట్టి కొట్టుకపోయి పట్టాలు గాల్లో తేలడానికి చెరువు అలుగు కాలువ ఆక్రమణలే కారణమని తెలుస్తోంది.గణపతి విగ్రహం కోసం వచ్చి చిక్కుకుపోయిన చిన్నారులుకామారెడ్డి జిల్లా లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన సుమారు పది మంది చిన్నారులు బుధవారం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు మెదక్కు వచ్చారు. అయితే రెండు జిల్లాల మధ్య ప్రవహిస్తోన్న మంజీరా నది పోచారం డ్యామ్పై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో వారంతా రెండు రోజులుగా మెదక్లోనే ఉండిపోయారు. దీంతో శుక్రవారం ఉదయం ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్తో వారిని ఎల్లారెడ్డి వైపు తరలించేందుకు యత్నించారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చిన్నారులను మెదక్లోని పునరావాస శిబిరాలకు తరలించారు. -
హిమాలయాల పెను హెచ్చరిక
ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆగస్టు 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. ఈ తీవ్ర అవపాతం హార్షిల్ దగ్గరలోని ధరాలీ, హార్షిల్ లోని సైనిక స్థావరం వద్ద ఆకస్మిక వరదలను సృష్టించింది. భారీ వర్షంతోపాటు మేఘ విస్ఫోటనం చోటుచేసుకుందని చెబుతున్నారు. అతి స్వల్ప కాలంలో అపారమైన వృష్టిని మేఘ విస్ఫోటనం అంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రకమైన పరి ణామం ఇదే మొదటిది కాదు. ‘హిందూ కుశ్ హిమాలయ’ (హెచ్కెహెచ్) ప్రాంతం ఇప్పటికే అనేక వైపరీత్యాలను చవిచూసింది. నేపాల్ లిమి కోనలోని టిల్ గ్రామంపై మే 15న వినాశకర మైన వరద విరుచుకుపడింది. తర్వాత, హిమానీ సరస్సు ఉన్న జలాశయ ఆనకట్ట తెగి రసువా–భోటేకోశీ నది ఆయకట్టును జూలై 8న వరద ముంచెత్తింది. జమ్ము–కశ్మీర్ లోని కిస్త్వార్ జిల్లాలో ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్ నది ఆరగాణి పొడవునా మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, రోడ్లు, జల విద్యుదు త్పాదన కేంద్రాల విభాగాలు కొట్టుకుపోవడంతో అనేక మంది నిరా శ్రయులయ్యారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దారిలో , ఆగస్టు 26న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చని పోయారు. అక్కడ కొండవాలు ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. వాటికి తీవ్ర వృష్టి తోడవుతోంది. వరదలకు లోనుకాగల సానువుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. జల బాంబులుఈ దుర్ఘటనలన్నీ, రకరకాల ఆపదల రాకను సమగ్రంగామదింపు చేసే (ఎంహెచ్ఆర్ఏ) వ్యవస్థ అవసరాన్ని మరోసారి చాటుతున్నాయి. అక్కడక్కడ విడి విడిగా ప్రమాదాలకు ఉన్న అవకాశాలనే కాకుండా , వాటి మధ్యన ఉండగల సంక్లిష్ట పరస్పర క్రియలను పరిశీలించేదిగా ఆ ప్రణాళిక ఉండాలి. అధిక వర్షపాతం కొండ చరియలు విరిగిపడటానికి, తదనంతరం, హిమానీ సరస్సు లకు గండిపడటానికీ దారితీస్తోంది. నీరు గడ్డకట్టిన ప్రాంతాలు, హిమం కరుగుతున్నాయి. ఈ జల ప్రవాహాలన్నీ కలసి లోయల్లో అస్థిరతను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. హిందూ కుశ్ హిమానీ నదాలు ఆందోళనకరమైన వేగాలతో తగ్గుతున్నాయి. ఇవి కరుగు తున్న వేగం, హిందూ కుశ్ నదుల ప్రవాహ వేగాల గతులను మార్చే స్తోంది. ఇవి ‘క్రయోస్పియర్ టైమ్ బాంబులు’గా తయారవు తున్నాయి.సిక్కింలో 2023 అక్టోబర్ 3న సంభవించిన విపత్తు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది హిమానీ సరస్సుకు గండిపడటంతో వచ్చిన వరద బీభత్సమే కాదు. ఒక పరిణామం మరో పరిణామా నికి పురిగొల్పే సంక్లిష్టమైన ఉపద్రవం. ఒక పెద్ద హిమఖండం దక్షిణ లోనక్ సరస్సులోకి వచ్చిపడటంతో ఆ గొలుసు కట్టు ప్రక్రియ మొదలైంది. హిందూ కుశ్లో ఉపేక్షిస్తూ వచ్చిన జల ఘనీభవన స్థానాల కీలక పాత్రను అది తేటతెల్లం చేసింది. ఆర్కిటిక్ప్రాంతంలో శాశ్వత ఐసు గడ్డల గురించి విస్తృతమైన అధ్యయనాలు సాగాయి. హిందూ కుశ్ ప్రాంతంలో హిమ ఖండాలు కరగడంపై ఇటీవలి కాలంలో మాత్రమే దృష్టి సారించారు. హిమ ఖండాలు కరిగితే లోయలు అస్థిరమవుతాయి. అది కొండ చరియలు విరిగి పడటానికి కారణమవుతుంది. భూకంపాలకు హెచ్చరించినట్టుగానే...ఏయేటి కాయేడు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న సంక్లిష్ట ఉపద్రవాల ద్వారా ప్రకృతి మనకు తరచూ హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాలను ప్రభావితం చేయగలిగిన నమూనాలు లేకపోలేదు. కానీ, వాటి కచ్చితత్వం పూర్తిగా ‘ఇన్ పుట్ డేటా క్వాలిటీ’పై ఆధారపడి ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు, ఆపదలను తగ్గించుకునే వ్యూహాల రూపకల్పనకు మనం ఎత్తయిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి డేటా సమీకరణ చేపట్టాలి. అందుకు అత్యవసరంగా మరిన్ని నిధులను వెచ్చించవలసిన అవసరం ఉంది. గ్లేసియర్ ద్రవ్య రాశి సమతౌల్య కొలతలను నమోదు చేసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ రికార్డులను పదిలపరచుకుని పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. సరస్సుల పరిమాణాలను కచ్చితత్వంతో అంచనా వేసేందుకు సమగ్ర బాతీమెట్రిక్ సర్వేలు నిర్వహించుకోవాలి.గ్లేసియర్ సంబంధిత వైపరీత్యాలు చెదురుమదురుగా ఉండటం అరుదు. అవి ఒకదానివెంట ఒకటి సంభవిస్తుంటాయి, సరిహద్దు లకు అతీతమైనవిగా తరచూ ఉంటాయి. ఎక్కడ వైపరీత్యం సంభ వించినా దాని చుట్టుపక్కల దేశాలన్నీ కష్టనష్టాలను అనుభవించక తప్పదు. కనుక, పటిష్టమైన ప్రాంతీయ సహకారం అనివార్యం. ప్రజలు లేదా మౌలిక వసతులపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదం సైతం పెను ఉపద్రవంగా మారుతుంది. కనుక, జనావాస ప్రాంతాల ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవై ఉండాలి. ముఖ్యంగా, ఎప్పుడుఎలాంటి జలవాయు పరివర్తనాలు చోటుచేసుకుంటాయో తెలియని హిందూ కుశ్ పర్యావరణాలలో వాటి అవసరం మరింత ఉంది. వైజ్ఞానిక మదింపులను ఆధారం చేసుకున్న ఆచరణ యోగ్యమైన విధానాలను మనం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. క్రయోస్పియర్ ప్రమాదకర మండలాల పటాన్ని తయారు చేయడం ఆ దిశగా వేసే ముఖ్యమైన అడుగు కావచ్చు. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం సంభవించగల ప్రాంతాలను గుర్తించే పటం మాదిరిగానే దాన్నీ రూపొందించుకోవచ్చు. ఎత్తైన ప్రాంతాల్లోనూ, గడ్డ కట్టిన సరస్సులు ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ మ్యాప్ మార్గం చూపుతుంది. ముఖ్యంగా ప్రవాహ దిగువ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట్ల, లేదా కీలకమైన మౌలిక వసతులు ఉన్నచోట ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చివరగా, హై–రిస్క్ మండలాల్లో ఆదిలోనే హెచ్చరించగల వ్యవస్థలను నియోగించుకోవాలి. శిక్షణ ఇవ్వడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలను సన్నద్ధులను చేసే కార్యక్రమాన్ని పటిష్ఠపరచుకోవాలి. కొద్ది నిమిషాల ముందు హెచ్చరించినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.– మహమ్మద్ ఫారూక్ ఆజమ్ ‘ గ్లేసియాలజీ, హైడ్రాలజీ ప్రొఫెసర్, ఐఐటీ, ఇందౌర్– శాశ్వతా సన్యాల్ ‘ ఇంటర్వెన్షన్ మేనేజర్, ఐసీఐఎంఓడీ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
-
కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ఏపీకి వాన గండం.. వారం రోజులు భారీ వర్షాలు
-
తెలంగాణలో జల విలయం... కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి... భారీ వర్షాలతో మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతలం
-
రోడ్లను ముంచెత్తిన వరద.. వాహనదారులకు గండం
-
సముద్రం కాదహే! కుండపోతతో మునిగిన కామారెడ్డి రోడ్లను చూశారా? (చిత్రాలు)
-
భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం
-
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
-
వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఎరియల్ సర్వే
Heavy Rain Updates..వరద ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి ఎరియల్ సర్వేశ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్ సీఎంతో పాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు గోదావరి జలాలు గుండె కాయఘోష్ నివేదికపై అసెంబ్లీ చర్చకు పెట్టాం మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసినా.. చేసిన పాపాలు పోవుకాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపుతే గ్రామాలు కొట్టుకపోతాయిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్లో లోపాలు ఉన్నాయికాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉంది.డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపం ఉందిఏరియల్ సర్వేకు బయల్దేరిన సీఎం రేవంత్రెడ్డికాసేపట్లో కామారెడ్డి,మెదక్ జిల్లా సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వేసీఎం రేవంత్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి,మహేష్ గౌడ్ వరద ప్రభావిత పప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్న సీఎం రేవంత్ ముందుగా ఎల్లంపల్లి సీఎం రేవంత్ ఏరియల్ సర్వే ఆ తర్వాత మెదక్కు వెళ్లనున్న తెలంగాణ సీఎం అనంతరం కామారెడ్డిలో వరదలతపై అధికారులతో సమీక్ష చేయనున్న సీఎంవర్షాల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు..భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో పలు రైళ్లు రద్దుకొన్ని దారి మళ్లింపు, మరికొన్ని పాక్షికంగా రద్దు36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా 14 రైళ్లు రద్దు వివరాలు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ Helpline Numbers provided at Kacheguda, Nizamabad, Kamareddi, Secunderabad Railway Stations in view of heavy trains for information on train operationsKacheguda - 9063318082NZB - 9703296714KMC - 9281035664SC - 040 277 86170@drmsecunderabad @drmhyb #HeavyRains #Telangana— South Central Railway (@SCRailwayIndia) August 28, 2025రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం: ఐఎండీరేపటి వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..ఇవాళ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ.హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. డీజీపీ జితేందర్ కామెంట్స్.వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.24 గంటలుగా పోలీసు ఫోర్స్ రెస్య్కూ ఆపరేషన్లు చేస్తూనే ఉంది.బోట్స్, లైఫ్ జాకెట్లతో చాలా మందిని రక్షించగలిగాం.ఇప్పటి వరకు 1200 మందిని కాపాడాం.కామారెడ్డి, నిర్మల్, మెదక్, రామాయంపేటలో వరద తగ్గిందికంట్రోల్ రూమ్ నుంచి వరదలపై 24 గంటలు మానిటరింగ్ చేస్తున్నాం.కామారెడ్డిలో చాలా మందిని కాపాడగలిగాం.సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ స్పాట్కి చేరుకోవడంతో ముప్పు తప్పింది.ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ైఫైర్ సిబ్బంది కలిసి ెరెస్య్కూ ఆపరేషన్ చేశాం.అన్ని ప్రాంతాల్లో పోలీసు ఫోర్స్ అప్రమత్తంగా ఉంది.జాతీయ రహదారి-44పై ట్రాఫిక్ మళ్లింపుట్రాఫిక్ జామ్ నేపథ్యంలో పోలీసుల సూచనలు.. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న NH-44 నాగ్పూర్ హైవే..ప్రజల భద్రత కోసం ట్రాఫిక్ డైవర్షన్ అమలు..హెవీ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న లారీలు మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద మళ్లింపు.మేడ్చల్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్ వెళ్ళాలిలైట్ వెహికిల్స్ డైవర్షన్ ఇలా..హైదరాబాద్-ఆదిలాబాద్ వెళ్తున్న కార్లు తూప్రాన్ వద్ద మళ్లింపు.మేడ్చల్-తూప్రాన్-సిద్ధిపేట-కరీంనగర్-జగిత్యాల-కోరుట్ల-మెట్పల్లి-ఆర్మూర్-ఆదిలాబాద్కామారెడ్డి-డిచ్పల్లి-ఆర్మూర్ మధ్య రహదారి వర్షంతో ప్రభావితం అయ్యింది..ఆదిలాబాద్ వెళ్లే ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలి: పోలీసులుహెవీ వెహికిల్స్ తప్పనిసరిగా డైవర్షన్ మార్గం పాటించాలి.ట్రాఫిక్ పోలీసులు, హైవే పెట్రోల్ సిబ్బంది డైవర్షన్స్ చూపుతారు. 🚦 TRAFFIC ADVISORY – NH44 (Nagpur Highway) 🚦Due to heavy rains and road damage on NH44, traffic diversions are in effect to ensure safety and smooth movement.📍 Diversion for Heavy VehiclesFrom Hyderabad → Adilabad (NH44), traffic will be diverted at Medchal Checkpost.… pic.twitter.com/KseVIcc9X6— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 28, 2025రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక @balaji25_t Kamareddy present situation. At. Pedda cheruvu. Totally destroyed. #Kamareddy @Collector_KMR @revanth_anumula . Situation may. Get worse. Due. Upcoming. Rains and flooding.. so .. Take. Responsibility all Departments @TelanganaCMO @TelanganaCOPs pic.twitter.com/wJqtqLMOSF— KALKI .& SALAAR. ✨ (@MRSANJUYT1) August 28, 2025సిరిసిల్ల, కామారెడ్డిలో కేటీఆర్ పర్యటనబీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళనకార్యకర్త నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ సహాయ చర్యల్లో పాల్గొనాలివర్షాల వల్ల నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించాలితీవ్రమైన వరద ఉన్నచోట ఆహారం, తాగునీరు అందించాలిఅవసరమైతే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలిపారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి, వ్యాధులు ప్రబలకుండా చూడాలసిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో పర్యటనముందుగా సిరిసిల్ల జిల్లా నర్మలలో పర్యటించనున్న కేటీఆర్నర్మల పర్యటన తర్వాత కామారెడ్డికి రాక.Due to ongoing Massive rains, many parts of kamareddy district under flash floods, below 👇visuals of #Kamareddy to #Hyderabad route#KamareddyFloods #KamareddyRains pic.twitter.com/Uta0EdVzja— Eastcoast Weatherman (@eastcoastrains) August 28, 2025కామారెడ్డి పర్యటనకు బయల్దేరిన మంత్రి సీతక్క, షబ్బీర్ అలీభారీ వర్షాలు దృష్ట్యా కామారెడ్డిలో పరిస్థితిని పరిశీలించనున్న సీతక్కవరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించనున్న మంత్రి సీతక్కప్రజలకు అందుతున్న అత్యవసర సేవలపై సమీక్ష పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుకొణిజర్లలో పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలుఖమ్మం జిల్లాలో పొంగుతున్న వాగులు..కొణిజర్ల మండలంలో నమోదై 120 మిల్లీమీటర్ల వర్షపాతంమండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పగిడేరు, నిమ్మ వాగు, జన్నారం ఏరు, రాళ్లవాగుపగిడేరు ఉద్ధృతితో నిలిచిన రాకపోకలుభువనగిరి భారీ వాహనాల రాకపోకలకు అనుమతిభువనగిరి చిట్యాల మార్గంలో నాగిరెడ్డిపల్లి వద్ద కల్వర్టుపై నుంచి ఉద్ధృతంగా సాగుతున్న వరద ప్రవాహంబుధవారం నిలిపివేసిన వాహనాల రాకపోకలుప్రవాహం తగ్గడంతో గురువారం ఉదయం నుంచి అనుమతించిన భారీ వాహనాల రాకపోకలు ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుకామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వచ్చిన వరదల వల్ల ఇళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలుఇళ్లు ఖాళీ చేస్తున్న డోంగ్లి మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల ప్రజలుమద్నూర్ మండలం మీర్జాపూర్లోని ఆలయంలో తలదాచుకుంటున్న వృద్ధులు, చిన్నారులుపొరుగు గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్న సిర్పూర్ గ్రామస్థులుడోంగ్లికి వెళ్లిపోయిన పెద్దటాక్లీలోని కొన్ని కుటుంబాలుజలదిగ్బంధంలో పిట్ల మండలం కుర్తి గ్రామంనిజాంసాగర్, కౌలాస్నాలా జలాశయం గేట్లు ఎత్తి నీటి విడుదలనీటి విడుదలతో ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలుమాజీ మంత్రి హరీష్ పర్యటన..మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో హరీష్రావు పర్యటనబూరుగుపల్లిలో తెగిపోయిన రహదారిని పరిశీలించిన హరీష్స్థానికులతో మాట్లాడిన మాజీ మంత్రిరాజాపేట, ధూప్సింగ్తండా వాసులను పరామర్శించిన హరీష్రావు బృందంనిన్నటి నుంచి జల దిగ్బంధంలో ఉన్న ధూప్సింగ్తండా సీఎం రేవంత్ ఏరియల్ సర్వే వాయిదా.. సీఎం ఏరియల్ సర్వేకు వర్షం అడ్డంకి.. వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే వాయిదావర్షాలపై సీఎం సమీక్ష..రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో సమావేశమైన సీఎం.వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలుబిక్కనూర్ టోల్ప్లాజా నుంచి కామారెడ్డి వరకు భారీగా ట్రాఫిక్ జామ్సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలువాహనాలు భారీగా నిలవడంతో వాహనదారుల ఆందోళనమంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హెలికాప్టర్ను అందుబాటులో ఉంచాం..నిరాశ్రయులైన ప్రజల కోసం ఆహారం, ఇతర వస్తువులు అందుబాటులో ఉంచాం..ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సీఎం సమీక్షిస్తారు.కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష చేస్తా.సాయంత్రం వరకు పంట, ప్రాణ, ఆస్తి నష్టంపై నివేదిక వస్తుంది. భారీ వర్షాలపై కేసీఆర్ ఆందోళన..భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ఆందోళనవరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో మాట్లాడిన కేసీఆర్తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆదేశంతెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్.. 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలుభద్రాద్రి, భూపాలపల్లి, ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురంభీం,నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు, ఉరుములు, మెరుపులు వర్షాలు..తెలంగాణలో మొత్తం 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ11 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం SEVERE RAINFALL WARNING ⚠️🌧️ NEXT 6HOURS FORECAST ⚠️ VERY HEAVY DOWNPOURS to continue in Kamareddy, Nizamabad, Nirmal, Jagitial. FLASH FLOOD WARNING for these districts ⚠️⚠️⚠️ HEAVY DOWNPOURS to continue in Karimnagar, Sircilla, Peddapalli, Adilabad, Asifabad Medak, Mulugu.…— Telangana Weatherman (@balaji25_t) August 28, 2025 వర్షాల ఎఫెక్ట్.. 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులుతాజాగా నల్లగొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో విద్యాసంస్థలు బంద్ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇచ్చిన అధికారులు.కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు సెలవుకరీంనగర్, జగిత్యాల జిల్లాలోని అన్ని పాఠశాలకు ఇవాళ సెలవుభారీ వర్షాల దృష్ట్యా సెలవు ప్రకటించిన జిల్లా విద్యాధికారులుNH-44 turns into a nightmare!20 KM traffic jam in #Kamareddy as heavy flooding brings vehicles to a standstill. #Telangana #NH44 pic.twitter.com/atBXc2bhuI— Mubashir.Khurram (@infomubashir) August 28, 2025 NH-44పై భారీగా ట్రాఫిక్ జామ్.. ఆదిలాబాద్ జిల్లా : భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవుఅత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచనరాత్రి నుంచి ఏకధాటి వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలుఆదిలాబాద్ జిల్లా: వర్ష బీభత్సానికి విరిగిపడిన చెట్లు, తెగిన విద్యుత్ తీగలుభీంపూర్, తాంసి మండల్లోని 50 గ్రామాలకు రాత్రి నుంచి నిలిచిన విద్యుత్ సరఫరాఎన్హెచ్-44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లారీలు, వాహనాలు కిలోమీటర్ల మేర్ల బారులు తీరాయి. TELANGANA & HYDERABAD Update | 28 AUG 8AM ⚠️🔴 SEVERE DOWNPOURS Alert for Kamareddy, Medak, Sircilla, Karimnagar, Jagitial, Nizamabad, Nirmal, and Khammam districts.Peak LPA Effect is going on now in the above-mentioned districts. The LPA impact is likely to end tonight…— Hyderabad Rains (@Hyderabadrains) August 28, 2025 పెరుగుతున్న గోదావరి నీటిమట్టంభద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టంఉదయం 8 గంటలకు 34.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం #Kamareddy జిల్లాలోని సరంపల్లి గ్రామం దేవునిపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల లోని ST రెసిడెన్షియల్ విద్యార్థులు (300) జలదిగ్బంధంలో ఉన్న విషయం తెలుసుకొని వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. @TelanganaCOPs @TelanganaDGP @TelanganaCMO @Collector_KMR pic.twitter.com/hnAsa0E75Q— SP Kamareddy (@sp_kamareddy) August 27, 2025మానేరు ఉగ్రరూపం.. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలుతెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజల అవస్థలుమెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు ఉగ్రరూపంపాల్వంచ వాగు, కూడవెల్లి వాగుల నుంచి మానేరులోకి భారీగా వరదరాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మానేరువాగునిండుకుండను తలపిస్తున్న నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయంఎగువ మానేరు జలాశయం నుంచి దిగువకు వరద విడుదలమానేరు ఉగ్రరూపంతో మిడ్ మానేరులోకి భారీగా వరద నీరువచ్చే 2 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం,మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లిలో భారీ వర్షాలువచ్చే 2 గంటల్లో సిద్దిపేట, మెదక్, జనగాం, యాదాద్రి, మంచిర్యాలలో మోస్తరు వర్షాలువరంగల్ అతలాకుతలం.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలుఉమ్మడి వరంగల్ జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలుములుగు జిల్లా తాడ్వాయిలో 15 సెం.మీ వర్షపాతంవెంకటాపూర్లో 12 సెం.మీ., గోవిందరావుపేటలో 11 సెం.మీ. వర్షపాతంములుగు జిల్లా: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జంపన్నవాగుమేడారం వద్ద బ్రిడ్జి ఆనుకుని పారుతున్న జంపన్నవాగుపసర నుంచి తాడ్వాయి మధ్యలో ఉన్న జలగలంచ వాగు ఉద్ధృతిపసర నుంచి తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకల నిషేధంజలగలంచ వాగు ఉద్ధృతితో ప్రజలను పునరావాస కేంద్రానికి తరలింపుహనుమకొండ జిల్లాలో అలుగుపారుతోన్న కటాక్షపూర్ చెరువు వర్షాల ఎఫెక్ట్.. రైళ్లు రద్దు..భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేరాష్ట్రంలో భారీ వర్షాల వల్ల పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేభారీ వర్షాల కారణంగా పలు రైళ్ల మళ్లింపు, రద్దు, పాక్షిక రద్దుభారీ వర్షం కారణంగా పట్టాలపై నుంచి ప్రవహిస్తున్న వరదవరద దృష్ట్యా రైళ్ల దారి మళ్లింపు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారంఇవాళ నడవాల్సిన అకోల- అకోట, కాచిగూడ- నాగర్సోల్ రైళ్లు రద్దుఇవాళ నడవాల్సిన కాచిగూడ - కరీంనగర్, హెచ్.ఎస్ నాందేడ్ - మేడ్చల్ రైళ్లు రద్దుహైదరాబాద్-కామారెడ్డి మధ్య నిలిచిన పలు రైళ్ల రాకపోకలుభిక్కనూరు-తలమడ్ల స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుఅక్కన్నపేట్-మెదక్ స్టేషన్ల మధ్య పట్టాలపై చేరిన వర్షపు నీరుకరీంనగర్- కాచిగూడ, మెదక్- కాచిగూడ, బోధన్- కాచిగూడ రైళ్లు రద్దుకాచిగూడ-మెదక్, నిజామాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- తిరుపతి రైళ్లు రద్దురేపటి కాచిగూడ - నర్కేర్ సర్వీస్ను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేగజ్వేల్ - లక్డారం రైలు పట్టాలపై భారీగా ప్రహిస్తున్న వరద నీరుఇవాళ, రేపు మల్కాజిగిరి- సిద్దిపేట సర్వీసు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వేప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వేకాచిగూడ స్టేషన్లో 9063318082 నంబర్ ఏర్పాటుసికింద్రాబాద్ స్టేషన్లో 040- 27786170 నంబర్ ఏర్పాటునిజామాబాద్ స్టేషన్లో 970329671 నంబర్ ఏర్పాటుకామారెడ్డి స్టేషన్లో 9281035664 నంబర్ ఏర్పాటుBulletin No.6 Cancellation/Diversions/Partial Cancellations of Trains due to heavy rains @drmhyb @drmsecunderabad @drmned pic.twitter.com/EIVsmpA2lU— South Central Railway (@SCRailwayIndia) August 27, 2025 వర్షాల రెడ్ అలర్ట్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలుఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన అధికారులుఆదిలాబాద్: ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షంఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవుకడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలుకడెం ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీరు విడుదల అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. ఎకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీటి మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు.ఇక, కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం.మీ వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెం.మీ, మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం.మీ, కామారెడ్డి పట్టణంలో 28.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా భిక్నూర్లో 27.9 సెం.మీ, నిర్మల్ జిల్లా వడ్యాల్లో 27.9 సెం.మీ, కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం.మీ, మెదక్జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం.మీ, లింగంపేటలో 22.5 సెం.మీ, దోమకొండలో 20.2 సెం.మీ, నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేట్లో 24.1 సెం.మీ, ముజిగిలో 23.1 సెం.మీ, మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.మీల వర్షం పాతం నమోదైంది. -
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక, కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇంఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... 8 జిల్లాలకు ఆరెంజ్, 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్... కామారెడ్డి జిల్లాలో రైలు, రోడ్డు మార్గాలు మూసివేత
-
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
Andhra Pradesh: నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. బుధవారం అర్థరాత్రి లేదా గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. మరోవైపు..వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.అనకాపల్లి జిల్లా సాలపువానిపాలెంలో 6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళంలో 5.8, విశాఖ జిల్లా నాతయ్యపాలెం, అనకాపల్లి జిల్లా గంధవరం, లంకెలపాలెంలో 5. 5, విజయనగరం అర్బన్లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారి జలదిగ్భంధమవ్వడంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీకాకుళం, విశాఖ, మన్యం జిల్లాల్లో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల 130–150 మి.మీ వర్షపాతం నమోదైంది.ఈ భారీ వర్షాలు బుధవారం ఉదయం వరకూ కొనసాగే అవకాశం ఉందనీ.. తర్వాత ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏలూరు,అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారి స్టెల్లా తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం వరకూ తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ ,28వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. మొద్దు నిద్రలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అల్పపీడనం ప్రభావంపై వాతావరణశాఖ వారం ముందుగానే హెచ్చరించినా.. ఏపీ విపత్తుల నిర్వహణ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్ పనితీరు మందగించింది. గతంలో ప్రతి 10 నిమిషాలకోసారి అప్డేట్స్ అందించే రాడార్ ఇప్పుడు గంటకోసారి సమాచారం ఇస్తున్నా అధికారులు సరిచేయలేదు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్డీపీఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ రెండు రోజులుగా మూగబోయింది. భారీ వర్షాలు, పిడుగులు పడిన తర్వాత మొబైల్స్కు ఎస్ఎంఎస్లు వస్తుండడం గమనార్హం. -
దేశ ఆర్థిక రాజధాని ముంచెత్తిన వర్షాలు
-
ముంబైలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
-
AP Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక
-
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
భారీ వర్షం విశాఖపట్నం విలవిల (ఫొటోలు)
-
ఏపీకి మరో మూడు రోజులు భారీ వర్ష సూచన
-
నేడు..రేపు భారీ వర్షాలు
-
ఒక్క వానకే మునిగిన బాబు విజన్ అమరావతి
-
హైదరాబాద్ లో హై అలర్ట్.. బయటకు రావద్దంటూ హెచ్చరిక
-
తెలుగు రాష్ట్రాలకు రైన్ అలర్ట్
-
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి (ఫొటోలు)
-
పూర్తిగా నీట మునిగిన అమరావతి
-
భారీ వర్షాలు ..వరద ముంపులో రాజధాని అమరావతి (ఫొటోలు)
-
Hyderabad: మరో 3 రోజులు భారీ వర్షాలు
-
ఏపీకి రాబోయే 4 రోజులు భారీ వర్ష సూచన
-
భారీ వర్షాలు.. తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్
-
ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు
-
వరంగల్- హన్మకొండను ముంచెత్తిన వరద (ఫొటోలు)
-
High Alert: తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఐదు రోజులు భారీ వర్షాలు..
-
తెలంగాణకు అలర్ట్.. 17 జిల్లాల్లో 13 నుంచి భారీ వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, సోమవారం, మంగళవారం కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నుంచి 16 వరకు.. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :10-08-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @Indiametdept pic.twitter.com/7Vx8ZrRLag— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) August 10, 2025నేడు, రేపు భారీ వర్షాలు.. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి.Overnight, as expected, South, East TG like Rangareddy, Mahabubnagar, Nagarkurnool, Narayanpet, Khammam, Suryapet, Yadadri - Bhongir, Vikarabad rocked 💥🌧️ Next 2hrs, NON STOP MODERATE RAINS to continue in Gadwal, Wanaparthy, NagarkurnoolScattered rains ahead in Asifabad,…— Telangana Weatherman (@balaji25_t) August 11, 2025ఇక, ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.మరోవైపు.. ఏపీలో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సందర్భంలో దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా వాయవ్య, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాలు జోరందుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి.సోమ, మంగళవారాల్లో రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ, వాయవ్య గాలుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం
-
అర్ధరాత్రి దంచికొట్టిన జడివాన.. వణికిన హైదరాబాద్ నగరం(ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావం... ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలైనా ముందుకు సాగని పంటల సాగు
-
హైదరాబాద్ను మరోసారి ముంచెత్తిన భారీ వాన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో భారీ వర్షంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్లౌడ్ బరస్ట్ అయిన తీరులో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దులాపూర్మెట్, నాగోల్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్నగర్, మీర్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాత్ తదిదర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్, ట్రోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్నగర్, సబర్మతినగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. -
చైనాపై పగబట్టిన వరుణుడు! మెరుపు వరదలు పోటెత్తి..
వరుణుడు పగబట్టాడేమో అనేంతగా చైనా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కిందటి నెలలో ఉత్తర బీజింగ్లో కురిసిన భారీ వర్షాలకు 44 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా.. మెరుపు వరదలు పోటెత్తి పది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చైనా గాన్సు ప్రావిన్స్లో శుక్రవారం ఇది చోటు చేసుకుంది.చైనాలో శుక్రవారం ఘోరం జరిగింది. మెరుపు వరదలు పోటెత్తడంతో పది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో జనాల ఆచూకీ లేకుండా పోయింది. దీంతో అధ్యక్షుడు జీ జిన్పింగ్ అన్నిరకాల మార్గాలతో సహయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.గురువారం గాన్సు ప్రావిన్స్లోని యూజోంగ్లో కుంభవృష్టి కురిసింది. ఫలితంగా శుక్రవారం వేకువ జామునే మెరుపు వరదలు పోటెత్తాయి. వరదల ఉధృతికి లాంజౌ నగర శివారులో కొండ చరియలు విరిగిపడినట్లు అక్కడి మీడియా సంస్థ సీసీటీవీ కథనాలు ఇస్తోంది. జింగ్లాంగ్ పర్వత శ్రేణి గుండా నాలుగు గ్రామాలకు కరెంట్, సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి.చైనాలో సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు దాకా వానలు కురుస్తుంటాయి. ఈ కాలంలో దక్షిణ, తూర్పు ప్రాంతాలు మాన్సూన్ ప్రభావానికి లోనవుతాయి. తద్వారా భారీ వర్షాలు కురుస్తాయి. అయితే.. ఈసారి గాలి ప్రవాహ మార్పులు అంటే.. పశ్చిమ గాలులు, సముద్రపు తేమ గల గాలులు ఒకే ప్రాంతంలో కలుస్తుండడం వల్ల వర్షాలు అధికంగా పడుతున్నాయి. గ్వాంగ్డాంగ్, గుయాంగ్సీ, హునాన్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయికి మించి ఉంది. చైనా భారీ వర్షాలు, పోటెత్తిన వరదలు తీవ్ర స్థాయిలో ప్రజల జీవితం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. వరదల వల్ల చైనాకు ఇప్పటిదాకా 54.11 బిలియన్ యువాన్ (ఆరున్నర లక్షల కోట్లకు పైగా) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వరదల వల్ల సుమారు 80 వేలమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధికంగా గ్రీన్హౌజ్ ఉద్గారాలను వదిలే దేశంగా చైనా ఉంది. ఫలితంగా అక్కడి వాతావరణంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది విశ్లేషకుల మాట. అదే సమయంలో.. చైనా ప్రపంచ పునరుత్పాదక శక్తి రంగంలో శక్తివంతమైన దేశంగానూ నిలవడం గమనార్హం. ఈ క్రమంలోనే 2060 నాటికి కార్బన్-న్యూట్రల్ (కార్బన్ ఉద్గారాలు లేకుండా) చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. అత్యవసరమైతేనే బయటకు రండి
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ సిరిసిల్ల, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కాగా, నగరంలో నిన్న (గురువారం) రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు. -
హైదరాబాద్ లో వర్ష భీభత్సం
-
మృత్యు మేఘం..‘విస్ఫోట’ విలయం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్లోనూ చూశాం.ముందే చెప్పలేరా?వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు. 10 సెం.మీ. వర్షపాతంఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. కేదార్నాథ్ విలయంక్లౌడ్బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు. అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘చార్ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్లోని బార్కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. » పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.» 2021 అక్టోబర్లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ముంచెత్తిన వాన.. చెరువులుగా మారిన రోడ్లు
సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీనగర్ నుంచి చాదర్ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు, బషీర్బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్పేట వరకు, ట్యాంక్బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.కూ కట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్భవన్ రహదారి నీట మునిగింది.పలు జిల్లాల్లోనూ..పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు. -
హైదరాబాద్లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
హైదరాబాద్లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Rains Updates: హైదరాబాదులో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లుNDRF ఫోన్ నెం.8333068536, ఐసీసీసీ 8712596106.హైడ్రా ఫోన్ నెం.9154170992, ట్రాఫిక్ 8712660600.సైబరాబాద్ 8500411111, రాచకొండ 8712662999.TGSPDCL ఫోన్ నెం.7901530966, RTC 9444097000.GHMC ఫోన్ నె.8125971221, HMWSSB 9949930003.👉జంట జలాశయాల్లోకి భారీగా వరదకాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులులోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనకిస్మత్పూర్, బండ్లగూడ, సన్సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచనవరద నీటిలో మునిగిన ఖైరతాబాద్-రాజ్భవన్ రహదారిమోండా మార్కెట్, బండిమెట్లో భారీగా వరదజీడిమెట్ల, సుచిత్రలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాబేగంబజార్, గౌలిగూడ బస్తీల్లో భారీగా నిలిచిన వరదభారీ వర్షానికి మణికొండలో కారుపై కూలిన గోడయూసుఫ్గూడ, కృష్ణానగర్లో భారీగా వరద ప్రవాహంభారీ వర్షానికి మాదాపూర్లో పొంగుతున్న డ్రైనేజీ👉నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మెుదలైంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, మియాపూర్, చందానగర్, బాలానగర్ సనత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్....అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్. దిల్సుఖ్నగర్ చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, నాచారం తార్నాక, నల్లకుంట హబ్సిగూడ, బేగంపేట్, వారణాసిగూడ, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్నగర్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.👉హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.👉జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.👉నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్ఆర్ నగర్ 11, ఖైరతాబాద్ 11, సరూర్నగర్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.👉ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరించాడు. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.👉కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్శిటీలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.👉బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
#HyderabadRains : భారీ వర్షానికి వణికిన మహానగరం.. జల దిగ్బంధంలో పలు కాలనీలు (ఫొటోలు)
-
Hyderabad Rains: నగరం.. నిలిచిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి, పంజగుట్ట–మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు. -
చెరువుల్లా హైదరాబాద్ రోడ్లు.. వాహనదారులకు నరకం
-
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
వరద బీభత్సం..చైనా అతలాకుతలం (ఫొటోలు)
-
వైతరణి ఉగ్రరూపం : వరద బెడద
ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రంలో వరదలతో నదులు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల ప్రమాద సంకేతం దాటి తీర ప్రాంతాల్లో కట్టలను బలహీనపరుస్తున్నాయి. నదీతీర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రాణహాని జరగకుండా సమగ్ర యంత్రాంగం చురుకుగా పని చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ పేర్కొంది. ప్రధానంగా సువర్ణ రేఖ, వైతరణి, జలకా నదుల్లో వరద ఉద్ధృతి విపరీతంగా కొనసాగుతోంది. ఈ నదుల్లో నీటిమట్టం పలు తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితికి మించి ఉంది. వైతరణి నది ఆనందపూర్, అఖుపొదా, జలకా నది మథాని తీరం, సువర్ణ రేఖ నది జంసోలా ఘాట్, రాజ్ఘాట్ తీర ప్రాంతాల్లో గరిష్ట పరిమితిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల అంచనా. #WATCH | Bhadrak, Odisha | The Baitarani River has crossed the danger mark at Akhuapada, and a flood warning has been issued for Jajpur and Bhadrak districts. (26.07) pic.twitter.com/hHNQAwZtqD— ANI (@ANI) July 26, 2025ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం రాష్ట్రంలో వరద ముంపు పరిస్థితి తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిస్థితి నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. నదుల్లో వరద పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ ఖరారు చేసింది. అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో వివిధ నదుల నీటి మట్టం గణనీయంగా పెరుగుతోంది. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నందున వరద ముంపు పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాఢి శనివారం విలేకరులకు తెలియజేశారు. అవసరమైతే లోతట్టు వరద తాకిడి ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బాలాసోర్ జిల్లాలో 4 మండలాలు మళ్లీ ప్రభావితం అవుతాయని భావిస్తున్నారు. వాటిలో బలియాపాల్, భొగొరాయ్, బొస్తా, జలేశ్వర్ ఉన్నాయి. నిరంతర నిఘా ఉప్పొంగుతున్న నదీతీర ప్రాంతాల్లో పరిస్థితులపై అనుబంధ యంత్రాంగం నిరంతర నిఘా పెడుతోంది. రాష్ట్ర వరద విభాగం రాత్రింబవళ్లు చురుకుగా పని చేస్తుందని చంద్రశేఖర్ పాఢి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారు. జాజ్పూర్, భద్రక్ – బాలసోర్ జిల్లా కలెక్టర్లు నదీతీర ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు, క్షేత్రస్థాయిలో అనుబంధ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సువర్ణరేఖ, బుఢా»ొలంగ్, మహానది, బ్రాహ్మణి, వైతరణి వ్యవస్థ నుంచి చీఫ్ ఇంజినీర్లు, బేసిన్ మేనేజర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయ కార్యాచరణను పర్యవేక్షిస్తున్నారు. భువనేశ్వర్ నుంచి ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్లను ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఉన్నతాధికారులు సువర్ణరేఖ బేసిన్, వైతరణి బేసిన్ పరిధిలో వారు క్షేత్రస్థాయిలో వరద నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ఈ రెండు నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని దాటిన తర్వాత ఈ అధికారులను తరలించారు. Flood Update: Flood Situation at 11 AM #Flood #Odisha@CMO_Odisha @DC_Odisha @_anugarg @IPR_Odisha@OLICLTD @OIIPCRA_OCTDMS @ltd_occ@GWDOdisha @CE_Megalift @dm_jajpur@DM_Bhadrak @DBalasore pic.twitter.com/VWOtvXcqBw— Deptt. of Water Resources (@OdishaWater) July 27, 2025 వైతరణి ఉగ్రరూపం భద్రక్ జిల్లా అఖుపొడా తీరంలో వైతరణి ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ మేరకు కలెక్టర్ వరద హెచ్చరికను జారీ చేశారు. చాంద్బాలి, ధామ్నగర్లు తీవ్రంగా, భొండారి, పొఖొరి ప్రాంతాలు పాక్షికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నదీతీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మయూర్భంజ్ జిల్లాలో రాసగోవింద్పూర్, మోర్దా, షులియాపడా, చిత్రాడ్ మొదలైన ప్రాంతాల్లో ఎగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా జలకా నది నీటిమట్టం పెరుగుతోంది. ఇటీవల ఈ ప్రాంతం వరదలకు గురై వందలాది హెక్టార్లలోని వరి పొలాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితి దిగజారకుంటే బొస్తా మండలంలో 8 పంచాయతీలు, సదర్ మండలంలో 2 పంచాయతీలు ప్రభావితం అవుతాయని భయపడుతున్నారు. వివిధ ప్రదేశాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో నదితీర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. ఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన -
Heavy Rain: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
-
హిరాకుద్ జలాశయానికి వరదపోటు
ఒడిశా, భువనేశ్వర్: హిరాకుద్ జలాశయంలో వరద నీటి ఉధృతి పెరుగుతుంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం పరిమితి 630 అడుగులు కాగా ప్రస్తుతం 609.39 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. నీటి మట్టం నియంత్రణలో భాగంగా అంచెలంచెలుగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఎడమ వైపు 13, కుడి వైపు ఏడు.. మొత్తం మీద 20 గేట్లు తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం లోనికి ప్రతి సెకన్కు 2.51 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుండగా సెకనుకు 2.75 లక్షల క్యూసెక్కులు వరద నీరు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి దృష్ట్యా మిగిలిన గేట్లు తెరిచే విషయం ఖరారు చేస్తారని జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తెలిపారు. గురువారం నుంచి పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 15 జిల్లాల 43 మండలాల్లో 50 మిల్లీమీటర్లు పైబడి వర్షపాతం నమోదు అయినట్లు విభాగం సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే నదుల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని నదుల నీటి మట్టం ప్రమాద సంకేతం దిగువన కొనసాగుతుందని సమాచారం. #ହୀରାକୁଦର_୨୦ଟି_ଗେଟ୍_ଖୋଲା👉ହୀରାକୁଦରୁ ୨୦ଟି ଗେଟ୍ ଦେଇ ବନ୍ୟାଜଳ ନିଷ୍କାସନ ଜାରି👉୬୦୯.୩୯ଫୁଟ୍ ରହିଛି ଜଳଭଣ୍ଡାରର ଜଳସ୍ତର#HirakudDam #Sambalpur #Odisha #GateOpen pic.twitter.com/vR9RNEZh7B— Mukesh Kumar Sahu (@Anchor_Mukesh) July 26, 2025 -
Heavy Rain: తెలంగాణ ప్రజలకు ప్రమాద హెచ్చరిక
-
హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మరోవైపు.. జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది కూడా.#HYDTPinfo #RainAlert#Raining in Hyderabad City.Commuters drive safely.#HyderabadRains pic.twitter.com/nruHbUJ8pW— Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2025 -
ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
AP Rains: చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
-
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం..జనజీవనం అస్తవ్యస్తం (ఫొటోలు)
-
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
-
ఏపీ, తెలంగాణలో ఎల్లో అలర్ట్
-
హైదరాబాద్లో మరికాసేపట్లో అతిభారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షం కురవొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫీసులు, పనులు ముగిసే వేళలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు.. తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. -
విజయవాడలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్మండి, చిలకలగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్లొండ, రంగారెడ్డి, యాద్రాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ అయ్యింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.కాగా, శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటల పాటు కురిసిన వానతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. -
నేడు భారీ నుంచి అతిభారీ వర్షం.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటలపాటు కురిసిన వానతో నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ వర్షాలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ , పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది.. హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. జీహెచ్ఎంసీ ,రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందులు వస్తె పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైనా విపత్తు వస్తె అధికారులకు వెంటనే తెలియజేయాలి’’ అని పొన్నం నగరవాసులను కోరారు.మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. -
ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
-
మా ఈ పరిస్థితికి హైడ్రానే కారణం
-
జడివానకు హైదరాబాద్ అతలాకుతలం.. ట్రాఫిక్ జామ్తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)
-
వణికిన మహానగరం
-
చినుకు సిటీ అంతా వణుకు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.ప్యాట్నీ నగర్లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బందికంటోన్మెంట్, బోయిన్పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు. ఎటు చూసినా వరదే.. హైదరాబాద్లోని మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద, ఎల్బీనగర్, మలక్పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్ నగర్, అంబికా నగర్, పటేల్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరం రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ రాయదుర్గం, షేక్పేట్ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్ ఫ్లైఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హఫీజ్పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్పేట పటేల్నగర్, ప్రేమ్నగర్, అలీకేఫ్ చౌరస్తాల్లో, బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మాదాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ట్యాంక్, ఎన్ఎఫ్సీఎల్ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్గూడ శ్రీకష్ణానగర్ రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మూసారంబాగ్ బ్రిడ్జిని వరద ముంచెత్తింది. సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్వరద ఉధృతికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్యాట్నీనగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం... ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్కో సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్ మండలం నదీమ్నగర్ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది. -
Heavy Rains: హైదరాబాద్ అతలాకుతలం.. భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: శుక్రవారం మధ్యాహ్నం నుంచి దంచి కొట్టిన భారీ వర్షం.. నగరాన్ని అతలాకుతలం చేసేసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో పలువురు వరద నీటిలో చిక్కుకున్నారు. కొత్తగూడ ఫ్లై ఓవర్పై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ను మళ్లిచారు. పలుచోట్ల ఫ్లై ఓవర్లు వాహనాలతో నిండిపోయాయి. భారీ వర్షం కారణంగా ఐటీ సెక్టార్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.నగరంలో రెండు గంటలపాటు వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఈ రాత్రికి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని.. యాద్రాది, భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్..హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యంది. భారీ వర్షానికి సికిందరాబాద్లో ‘పైగా’ కాలనీ నీటమునిగింది. కాలనీలో ఉన్న ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. కొన్ని పరిశ్రమలు, షోరూమ్ ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకున్నారు. అత్యధికంగా మారేడ్పల్లిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 11, ఉప్పల్లో 10.5, మల్కాజ్గిరిలో 9.7, ఇబ్రహీంపట్నంలో 9.6, బండ్లగూడలో 9.5, ముషీరాబాద్లో 8.9, అంబర్పేట్లో 8.4, దుండిగల్ 8.3 సెం.మీ వర్షపాతం నమోదైంది.భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలువర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని రేవంత్ సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. -
హైదరాబాద్లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. నిన్న(గురువారం, జూలై 17) సాయంత్రం సమయంలో హైదరాబాద్నలో భారీ వర్షం పడగా, ఈరోజు(శుక్రవారం, జూలై 18) కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కీకారణ్యంగా మారిపోయిన మేఘాలు.. కాసేపటికి భారీ వర్షంతో నగరాన్ని తడిపేశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయతనగర్లో కుండపోత వర్షం పడుతుండగా, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో సైతం భారీ వర్షం కురుస్తోంది. ఇక మెహదీపటం్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటిలో కుండపోత వర్షం పడుతోంది. నాచారం, హబ్సిగూడ్, తార్నాక తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతూ ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. బంజారాహిల్స్, పంజాగుట్టలోట్రాఫిక్ జామ్తో వాహనదారులు అవస్థులు పడుతున్నారు. -
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా మరో మూడ్రోజుల వర్షాలు
-
Hyderabad: దంచికొట్టిన వర్షం
-
హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని గురువారం (జూలై 17)సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అధికారుల్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) అప్రమత్తం చేసింది. నగరానికి భారీ వర్ష సూచన అన్న అప్డేట్ వచ్చిన కాసేపటికే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం పడింది. పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్, మూసాపేట్, సనత్నగర్, ఎర్రగడ్డలో కుండపోత వర్షం పడగా, కూకట్పల్లి, బాలానగర్, మాదాపూర్లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీలో సైతం భారీ వర్షం పడింది. భారీ వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారిలో ఆందోళన మొదలైంది. ఆఫీస్ షిష్ట్లు ఐదు గంటలకు ముగిసే వారు ఆగమేఘాల మీద ఇళ్లకు బయలుదేరారు. -
ఢిల్లీలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఢిల్లీతోపాటు శివారు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండియా గేట్, కర్తవ్యపథ్ ప్రాంతాల్లో భీకర వర్షం పడడంతో పర్యాటకులు ఇబ్బందులకు గురయ్యారు. ఢిల్లీలో మరికొన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించడంతో అరెంజ్ అలర్ట్ను అధికారులు రెడ్ అలర్ట్గా మార్చారు. ఢిల్లీతోపాటు తూర్పు హరియాణ, పశి్చమ ఉత్తరప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. -
ఢిల్లీలో దంచికొట్టిన వాన
ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం మారిపోయింది. నగరంతో పాటు శివారులో కుండపోత భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పని వేళలు ముగిసే సమయం కావడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం పడొచ్చని చెబుతూ వాతావరణ శాఖ(IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఢిల్లీ అధికార యంత్రంగాణం పలు సూచనలు జారీ చేసింది. #WATCH | Heavy rain lashes parts of Delhi. Visuals from the GRG Road, which is waterlogged. pic.twitter.com/EOVN69XZRQ— ANI (@ANI) July 9, 2025నగర వ్యాప్తంగా పలు అండర్పాస్లను మూసేస్తున్నట్లు చెబుతూ.. ఆ వైపుగా వెళ్లే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.అందుకు తగ్గట్లే నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడింది.#WATCH | Heavy rain lashes parts of Delhi, visuals near Kartavya Path. pic.twitter.com/vPgcg2iuiU— ANI (@ANI) July 9, 2025VIDEO | Delhi: Heavy rain lashes parts of the national capital, bringing relief from heat. Visuals from Constitution Club. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz)#Delhi pic.twitter.com/vsrcgn1i7Q— Press Trust of India (@PTI_News) July 9, 2025 -
హిమాచల్లో 75 మరణాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధింపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, హిమాచల్లోని మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణాల వారి సంఖ్య 75కు చేరుకుంది. మరోవైపు.. పలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ విధించింది.హిమాచల్ ప్రదేశ్లో ఒక్క రోజులో 115-204 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 204 మిల్లీ మీటర్లు అతి తీవ్ర వర్షపాతం కిందకు వస్తుంది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 240 రహదారులపై రాకపోకలు కష్టంగా మారినట్లు అధికారులు వెల్లడించారు. ఆకస్మిక వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా మారింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి.Chamba, Himachal Pradesh: Heavy rain in Chamba district washed away the Kangela Nala bridge, cutting off a key route and disrupting local life. Authorities dispatched teams, plan alternative routes, and assured quick reconstruction to restore connectivity and ease difficulties… pic.twitter.com/IkQIjsmrMK— IANS (@ians_india) July 6, 2025రెడ్ అలర్ట్ జారీ..హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ విధించింది. అలాగే, రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, శిమ్లా, సిర్మూర్ జిల్లాల్లో మెరుపు వరదలు రావొచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పుర్, హమిర్పుర్, చంబా, శిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. మరోవైపు.. సహాయక చర్యల్లో ఐటీబీపీ దళాలు పాల్గొంటున్నాయి. Himachal is in destruction again.Lives lost, homes destroyed, bridges collapsed.Pray for Himachal—and repost to urge the government to take immediate action. pic.twitter.com/DT8UAZpkba— Go Himachal (@GoHimachal_) July 4, 2025जिला ऊना के त्यूडी गांव में एक बारिश से पैदा हुए हालात।।खड्ड का रुख गांव की तरफ गांव जलमग्न।मानव निर्मित आपदा।#Una #himachalfloods #HimachalPradesh pic.twitter.com/MUbHPdDKcF— Gems of Himachal (@GemsHimachal) July 6, 2025🚨HEAVY RAINS TRIGGER CLOUD BURSTS AND FLOODING IN HIMACHAL PRADESH, INDIA.Cloud bursts in Karsog area, Mandi, cause 1 death and 7 missing.Vehicles swept away and 16 MW power project destroyed.Beas River floods intensifySchools and colleges closed; statewide alert active pic.twitter.com/ucXSbYhviD— Weather Monitor (@WeatherMonitors) July 1, 2025 -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, గోల్కొండ, మెహిదీపట్నం, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, రాజేంద్రనగర్, వికారాబాద్, వెంకటగిరి, యూసుఫ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. -
విజయవాడలో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
-
Heavy Rains: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్..
-
ఏపీకి భారీ వర్ష సూచన..
-
నిజామాబాద్లో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు
-
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు (ఫొటోలు)
-
ఒక్కసారిగా మారిన వాతావరణం.. హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ.. ఉక్కపోతతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. వర్షం పడటంతో ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణంతో ఉపశమనం పొందారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ఖైరతాబాద్, అబిడ్స్, పంజాగుట్టలో భారీ వర్షం కురుస్తోంది.తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. పలు మండలాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించింది. -
ఇవాళ, రేపు ఏపీలో విస్తారంగా వర్షాలు
-
విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
-
విశాఖపట్నం : సంద్రం.. కల్లోలం (ఫొటోలు)
-
బలపడుతున్న అల్పపీడనం.. వచ్చే ఐదు రోజులు వానలే వానలు
-
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
-
‘ముంబై’ చెప్తున్నదేమిటి?!
‘కుండపోతలతో వస్తున్నాం... కాచుకోండ’న్నట్టు హెచ్చరిస్తూ ప్రవేశించాయి నైరుతి రుతుపవనాలు. సోమవారం వేకువజామునే కళ్లు తెరిచిన ముంబై మహానగరవాసులు... వస్తూనే తడాఖా చూపించిన భారీ వర్షాన్ని చూసి బిత్తరపోయారు. సాధారణ సమయాల్లో గంభీరంగా, కళ్లు చెదిరేలా కనబడే మన నగరాలు చినుకు రాలితే ఎంత అల్లకల్లోలమవుతాయో మొన్నీ మధ్యే బెంగళూరు నగరం కూడా నిరూపించింది. మన్నూ మిన్నూ ఏకమైనట్టు ధారాపాతంగా రాత్రంతా కురియటంవల్ల 200 మిల్లీ మీటర్లు(ఎంఎం) మించిన వర్షపాతంతో ముంబై నగరం తాజాగా తడిసిముద్దయింది. ఆ నగరానికి ముందుగా జారీచేసిన ‘యెల్లో అలెర్ట్’ను కాస్తా ‘రెడ్ అలెర్ట్’గా సవరిస్తూ, ముంబైతోపాటు దాని ఇరుగుపొరుగునున్న జిల్లాల్లో సైతం పిడుగులతో, పెనుగాలులతో అత్యంత భారీ వర్షం ముంచుకు రాబోతున్నదని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముంబై పొరుగునున్న కొలాబాలో సోమవారం 295 ఎంఎం వర్షపాతం నమోదై, 107 ఏళ్లనాటి... అంటే 1918 నాటి రికార్డు 279.4 ఎంఎంను అధిగమించింది. ఇంకా కర్ణాటకలోని మంగళూరు నగరం, దక్షిణ కన్నడ జిల్లాలు సైతం భారీవర్షాలతో ఇక్కట్లుపడ్డాయి. కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు పది రోజులకు మహారాష్ట్ర రావాల్సివుండగా కేవలం 24 గంటల్లో అక్కడికి లంఘించాయి. ముంబైకి ఆ మర్నాడే చెప్పాపెట్టకుండా వచ్చాయి.సరిగ్గా అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్స్ విభాగం ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రతియేటా అంతక్రితంతో పోలిస్తే భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నదే దాని సారాంశం. ఇలాంటి ప్రకటనలు మన పాలకుల్ని అప్రమత్తుల్ని చేయాలి. ఏటా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి. వాటి వికేంద్రీకరణకు ప్రణాళికలు రూపొందించాలి. కానీ తరచు నడుంలోతు నీళ్లల్లో మునకలేస్తున్న నగరాలను చూస్తుంటే వారికంత శ్రద్ధ, తీరిక లేవన్న సంగతి తెలుస్తుంది. శతాబ్దం కిందట లేదా అంతకు చాలాముందు నుంచీ ప్రధాన నగరాలుగా వున్నవాటిపై ఎటూ శ్రద్ధ లేదు. కనీసం కొత్తగా నిర్మిస్తున్న నగరాలపైన అయినా ముందుచూపుతో వ్యవహరిద్దామన్న జ్ఞానం లేదు. నిరుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకూ దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షాలు విజయవాడ నగరంలో కొంత భాగాన్ని ముంచెత్తడంతోపాటు అమరావతిని కూడా వరదలు అస్తవ్యస్తం చేశాయి. దాని పరిధిలోని 29 గ్రామాల్లో 25 నిండా నీళ్లల్లో మునిగాయి. సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అక్రమంగా వుంటున్న తన కరకట్ట నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తదితర సంస్థలు మూతపడాల్సి వచ్చింది. లక్షలాదిమంది ప్రజలు సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డారు. విజయవాడలో 35 మంది మరణించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా మొండి వైఖరితో అమరావతికి పూనుకోవటమే తప్పనుకుంటే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ పిలిచి అట్టహాసంగా సభ చేసి పనులు మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత నేల స్వభావం తెలియకపోతే పోయింది... కనీసం కేంద్రీకృత నగరాల వల్ల కలిగే ముప్పును చూస్తూ కూడా వేలకోట్లు కుమ్మరిస్తున్నారంటే ఏమనుకోవాలి?‘ప్రకృతి వైపరీత్యాలు నిజమైన అర్థంలో ప్రకృతి కల్పిస్తున్న వైపరీత్యాలు కాదు. అవి మనిషి రూపొందించే విధానాల వైఫల్యం’ అంటాడు అమెరికన్ దౌత్య నిపుణుడు జాన్ బోల్టన్. కుంభవృష్టి కురిసినా దాన్నంతటినీ ఇముడ్చుకోగల చెరువులూ, వాగులూ, వంకలూ దాదాపు అన్ని రాష్ట్రా ల్లోనూ వున్నాయి. వాటిల్లో కొన్ని సహజసిద్ధమైనవీ, కొన్ని మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నిర్మించినవీ. కానీ చేజేతులా మనమే వాటి పీకనొక్కుతున్నాం. ఇష్టానుసారం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నా కళ్లుమూసుకుంటున్నాం. హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూముల్లో బుల్డోజర్లు దింపి ప్రకృతి సంపద నాశనం చేస్తున్నారని ఆవేదన చెందిన ప్రధానే, ఆ తర్వాత కొద్దిరోజులకే వేలాది ఎకరాల పంట భూముల్ని మాయం చేసే అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేశారు. తమ కూటమి ప్రభుత్వమైతే ఒక లెక్క... వేరే పార్టీ ప్రభుత్వమైతే ఒక లెక్క! నిర్దిష్టమైన విధానాల్లేకుండా ‘ఏ రోటి కాడ ఆ పాట’న్నట్టు ప్రవర్తించే పాలకుల వల్లే వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయి. వీటిని నివారించటం మానవ మాత్రులకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కాస్త తెలివితో వ్యవహరిస్తే వాటివల్ల కలిగే నష్టాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావొచ్చు. కారణాలేమైనా వాతావరణం గతంలో మాదిరి లేదు. మన విధ్వంసకర ఆచరణతో దాన్ని మరింత క్షీణింపజేస్తున్నాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణగానీ, వికేంద్రీకరణగానీ లేకపోవటంతో నగరాలు కిటకిటలాడుతున్నాయి. నగరాల్లోనే ఉపాధి అవకాశాలుండటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు అక్కడికే క్యూ కడుతున్నారు. పెరిగిన జనాభాకు తగినట్టు డ్రయినేజీ వ్యవస్థ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఈసారి వర్షరుతువు ఎలా వుండబోతున్నదో ముంబై నగరాన్ని ముంచెత్తిన వాన నిరూపించింది. సహాయ సిబ్బందిని అందుబాటులో వుంచటంతో సహా పలు ముందస్తు చర్యలు తీసుకోవటం మినహా ఈ ఏడాది ఎటూ ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేదు. కనీసం రాబోయేకాలంలోనైనా అమల్లోవున్న విధానాలను సమీక్షించుకుని మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రణాళికాబద్ధమైన పథకాలు రూపొందించి అమలుచేసి, వికేంద్రీకరణపై దృష్టిసారిస్తే చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి. -
భారీ వర్షాలు.. నీట మునిగిన ముంబై..
-
#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)
-
మూడు రోజులు భారీ వర్షాలు..
-
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
ఢిల్లీలో రాత్రి నుంచి భారీ వర్షం
-
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో భారీ వర్షం కురిసింది. అలాగే సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, టోలీచౌకీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా చిరు జల్లులు పడుతుండగా.. రేపు భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి(Southwest Monsoon) రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. Ameerpet metro station 🌧️ #HyderabadRains#Hyderabad pic.twitter.com/svyXFaOb0b— Rajesh (@bekindtoevery_1) May 24, 2025#24MAY 7:30PM⚠️Pouring So Heavily in Northern & Western Parts of the City #Hyderabadrains pic.twitter.com/gNR0GD4WZc— Hyderabad Rains (@Hyderabadrains) May 24, 2025 -
రెండ్రోజుల్లో కేరళకు నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలిక అత్యంత చురుకుగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో చురుకుగా సాగుతున్న రుతుపవనాలు రానున్న రెండ్రోజుల్లో కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఈ నెల 27న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాల సమయంలో బంగాళాఖాతంలో ఏర్ప డే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలకు అవకాశం ఉంటుంది.గురువా రం తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్–గోవా తీర ప్రాంతం సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్పష్టమైన అల్పపీడనంగా మారిందని, ఇది క్ర మంగా బలపడి శనివారం ఉదయానికల్లా వాయుగుండంగా మారే అవకా శం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని సూచించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు శుక్రవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. ఖమ్మంలో అత్యధికంగా 36.0 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా మెదక్లో 20.0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండురోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సియస్ వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
విండీస్, ఐర్లాండ్ మ్యాచ్ రద్దు
డబ్లిన్: ఐర్లాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమి నుంచి తేరుకున్న వెస్టిండీస్ రెండో వన్డేలో అదరగొట్టింది. భారీ స్కోరు చేసి విజయంపై ఆశలు పెంచుకున్న వెస్టిండీస్ను వరుణదేవుడు కరుణించలేదు. ఫలితంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ఫలితం తేలకుండానే ముగిసింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిశాక భారీ వర్షం రావడంతో ఐర్లాండ్ ఛేజింగ్ సాధ్యపడలేదు. వెరసి మూడు వన్డేల సిరీస్లో ఐర్లాండ్ ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు సాధించింది. వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేయగా... చివర్లో మాథ్యూ ఫోర్డీ (19 బంతుల్లో 58; 2 ఫోర్లు, 8 సిక్స్లు) శివమెత్తాడు. కేవలం 16 బంతుల్లోనే ఫోర్డీ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా ఏబీ డివిలియర్స్ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును ఫోర్డీ సమం చేశాడు. కెప్టెన్ షై హోప్ (57 బంతుల్లో 49; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగు తేడాతో అర్ధ సెంచరీని చేజార్చుకోగా... జస్టిన్ గ్రీవెస్ (36 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెకార్తీ, జోష్ లిటిల్ రెండు వికెట్ల చొప్పున తీయగా... లియామ్ మెకార్తీకి మూడు వికెట్లు దక్కాయి. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. -
మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు
-
Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
-
హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం
-
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం!
న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్ పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోషల్ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. #WATCH | Delhi-NCR experiences weather change. Visuals from Noida Sector 10 in Uttar Pradesh as it experiences dust storm. pic.twitter.com/gsqXxyFGhq— ANI (@ANI) May 21, 2025 #WATCH | Delhi: A tree uprooted at Janpath Road as the city received gusty wind, heavy rainfall and hailstorm. pic.twitter.com/GDVI1OpSz4— ANI (@ANI) May 21, 2025#WATCH | Delhi receives gusty wind, heavy rainfall and hailstorm. Visuals from Geeta Colony. pic.twitter.com/hTIXMzETgZ— ANI (@ANI) May 21, 2025 -
బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం
-
ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)
-
దక్షిణ కోస్తా, సీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఆవరించి ఉంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాగా, పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటే సూచనలున్నాయని కూడా పేర్కొన్నారు. -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన
విశాఖ : రానున్న వారం రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్ర స్పష్టం చేసింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. రాగల 24 గంట్లలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇక బాపల్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో గంటలకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. -
బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Silk Board Metro Station, Bengaluru…Congress is ruling the state so it’s ok…. pic.twitter.com/reKKwbMTdE— Mr Sinha (@MrSinha_) May 19, 2025 Today: Significant flooding in Bengaluru, Karnataka, India, leading to major traffic disruptions and impacting daily activities for residents. #BengaluruRains #KarnatakaRains pic.twitter.com/0Ph7vHBHUt— Weather Monitor (@WeatherMonitors) May 19, 2025భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.After hiking the price of bus ride and metro fare ; Karnataka Congress Govt to launch FERRY SERVICE? Seems so.Congress CM Siddaramaiah has 'gifted' people of Karnataka and Bengaluru especially lakes in the form of water stagnation.This is Congress govt for you. They can't… pic.twitter.com/dKvPLqTnUx— Cons of Congress (@ConsOfCongress) May 19, 2025 #bengalururains #BangaloreRains Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it. Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 202522 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది. ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025#BengaluruRains The Hennur-Bagalur Road, which is the alternative route to Kempegowda International airport in Bengaluru, was flooded. Motorists & traffic cops had a tough time. (📹 by TOI Syed Asif)@timesofindia pic.twitter.com/xZTRTU9Btv— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025BANGALORE WATER PARK #Bengaluru #bengalurufloods #BengaluruRains pic.twitter.com/QpBqXmgl5T— Bihar Buzz (@buzz_bihar) May 19, 2025 -
విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)
-
అనంతపురం జిల్లాలో భారీ వర్షం
-
ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం, కొమొరిన్, మాల్దీవులు, తూర్పు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి విస్తరించింది. దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల్లో విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఉంది. మరోవైపు పశి్చమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోంది.ఈ ఉపరితల ఆవర్తనంలో దక్షిణ కోస్తా నుంచి యానాం వరకూ విస్తరించిన ద్రోణి విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగనుంది. వడగాలులు, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదుతో పాటు ఈదురుగాలులు, వర్షాలు కూడా కురిసే సూచనలున్నాయి. ఆది, సోమవారాల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. ఈనెలాఖరుకు వేసవి ముగింపు ఈనెల నాలుగో వారం నాటికి రాష్ట్రంలో ఎండాకాలం దాదాపు ముగిసి పోయినట్లేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26 నుంచి రాయలసీమ అంతటా, 29 తర్వాత రాష్ట్రమంతటా చల్లని వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా జల్లులతో కూడిన వర్షాలు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో 4.9 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లా డిజిపేటలో 4.7, కర్నూలులో 4.6, చిత్తూరు జిల్లా ముత్తుకూరు 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3, ఏలూరు జిల్లా ఎస్.రాఘవపురంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
హైదరాబాద్ సహా పలు చోట్ల మోస్తారు వర్షం
-
అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)
-
అనంతపురం జిల్లాను వణికిస్తున్న వర్షాలు
-
ముంచేస్తున్నా.. నిర్లక్ష్యమే
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ధాన్యం కొనుగోలులో ముందుచూపు కొరవడిన ప్రభుత్వం అన్నదాతలను నిండా ముంచేసింది. రెక్కల కష్టం వర్షంలో తడిసి ముద్దయ్యిందని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో మొదలైన వరి కోతలు మూడో వారంలో ఊపందుకున్నాయి. అప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పంటకు కనీస మద్దతు ధర దక్కక రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పెరవలి, నిడదవోలు, జగ్గంపేట, తాళ్లపూడి తదితర మండలాల్లో ఆందోళనలకు దిగారు. ముందే హెచ్చరికలున్నా..రబీ కోతలు ప్రారంభమైన తొలినాళ్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కనీస మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు శనివారం, ఆదివారం కురిసిన వర్షాలు రైతుల్ని ముంచేశాయి. వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. కుండపోత వర్షంతో రోడ్ల పక్కన, కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. కాకినాడ జిల్లాలో 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.వారి లెక్కల ప్రకారమే ఇంకా 2.23 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా, 2,63,076 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, లక్ష్యాన్ని అధిగమించామంటూ కొనుగోళ్లను నిలిపివేశారు. కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, 2 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతించింది.ధాన్యం కొనుగోలు చేయాలంటూ జిల్లాలో రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం ముందుగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే అకాల వర్షాల ముప్పు నుంచి బయటపడే వారమని రైతులు విలపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని అధికారులే దగ్గరుండి కొనుగోలు చేయించారని, వరి కోతలు మొదలవుతాయనగానే అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించిందని రైతులు గుర్తు చేసుకున్నారు. వర్షాలకు పంట దెబ్బతినడం సహజం: సాక్షి, అమరావతి: అధిక వర్షాలకు వరి పంట దెబ్బతిని, ధాన్యం తడిసిపోవడం సహజమేనని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అకాల వర్షాలకు కొన్ని జిల్లాల్లోనే పంట, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందన్నారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్ముకున్నా.. అమ్మకపోయినా నష్టమేవర్షంలో తడిసి ముద్దయిన పంట కొనుగోలు మాట దేవుడెరుగు.. రెండు వారాలు ముందుగానే కోతలు పూర్తయి రైతులు తక్కువ ధరకు కమీషన్ ఏజెంట్లకు ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సి వచ్చింది. 75 కేజీల బస్తా ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1,750 ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా.. రైతుకు రూ.1,300–1,450కి మించి దక్కలేదు. ప్రతి బస్తాపై రైతులు రూ.400–500 నష్టపోయారు. ధాన్యాన్ని త్వరగా ఒబ్బిడి చేసుకోవాలనే తలంపుతో యంత్రాలతో వరి కోతలు పూర్తి చేశారు. కోత కోసిన వెంటనే ధాన్యాన్ని అమ్మేసుకోవడానికి మొగ్గు చూపారు. ఆ సమయంలో రైతు సేవా కేంద్రాల వద్ద రైతు నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయించుకోవడం, 17 శాతం తేమ ఉన్నా తీసుకోకపోవడం వంటి సవాలక్ష సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. వీటిని అధిగమించలేక రైతులు రూ.400 నుంచి రూ.500 తక్కువైనా గత్యంతరం లేక కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. -
రైతులకు బాసటగా YSRCP... నేతలతో వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్
-
ఏపీకి భారీ వర్ష సూచన
-
అకాల వర్షాలు.. అన్నదాతకు గుండెకోత
-
తిరుపతిలో భారీ వర్షం.. గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకూ విస్తరించి ఉంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గరిష్టంగా 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. దక్షిణకోస్తా జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 50 నుంచి 60 కి.మీ. గరిష్టంగా 70 కి.మీప వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి.కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని 130 ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యాయి. అదే సమయంలో ఆదివారం నంద్యాల జిల్లా గోనవరం, నెల్లూరు జిల్లా సోమశిల, తిరుపతి జిల్లా వెంకటగిరి, వైఎస్సార్ జిల్లా కమలాపురం తదితర ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.పశ్చిమ విఘ్నాల వల్లే..రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి వాతావరణానికి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ (పశ్చిమ విఘ్నాలు) కార ణమని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కారణంగా ప్రస్తుతం రెండు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయి. ఇవి ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు వ్యాప్తంగా విస్తరించి ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయి. భూమి నుంచి మూడు కిలోమీటర్ల పైకి వెళ్లే వరకూ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో వీచే గాలులు సముద్రం నుండి ఎక్కువ శాతం తేమను తీసుకుని అప్పటికప్పుడు మేఘాలుగా ఏర్పడతాయి.