breaking news
heavy rain
-
AP: రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: వాతావరణ శాఖ రాష్ట్రానికి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెట్లకింద, హోర్డింగుల వద్ద నిల్చోవద్దని వాతావరణ శాఖ సూచించింది. -
హైదరాబాద్లో కుండపోతగా వర్షం
హైదరాబాద్లో భారీగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సనత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండలో పెద్ద ఎత్తున జల్లులు కురుస్తున్నాయి. ఎస్ఆర్ నగర్, ఫిలీంనగర్, అమీర్పేటలో కుండపోతగా వాన పడుతోంది. పెద్దఎత్తున వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
భారత్ కి బిగ్ అలర్ట్! వచ్చేసిన 3,500 KM రాక్షస మేఘాలు!
-
2011 రికార్డు బద్దలు.. ఆగస్టు మొదట్లోనే కుండపోత వర్షాలు!
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. శుక్రవారం కురిసిన కుండపోత వర్షాలకు రాజధానిలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2011 తర్వాత ఆగస్టు తొలి వారంలో ఢిల్లీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల మొదటి ఏడు రోజుల్లో నగరంలో ఏకంగా 127 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి ఉత్తరప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఆవర్తనం, పశ్చిమ ద్రోణి ప్రభావం వల్లే ఈ భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. #WATCH | Heavy rain batters Delhi; Commuters face challenge as they wade through waterlogged roads in Sainik Farms area pic.twitter.com/6DnGGb3iUo— ANI (@ANI) August 7, 2026శనివారం నుంచి వర్షాల తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆగస్టు 10 వరకు ఈ వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు దేశంలోని మరో 14 రాష్ట్రాల్లోనూ వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్లో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ సూచించారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, కేరళలోని కాసర్కోడ్, కన్నూర్, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రాజస్థాన్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ఇది కూడా చదవండి: ఇక మటన్ ముక్కలు కాదు.. ఆకులు! -
పీక్ అవర్లో జోరు వాన
సాక్షి, హైదరాబాద్: పగలంతా సాధారణ వాతావరణమే. సాయంత్రానికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోతోంది. ఉద్యోగులు, వాహనదారులు ఇళ్లకు తిరుగుపయనమయ్యే ‘పీక్ అవర్’లో వరుణుడు కుంభవృష్టి కురిపిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నగరంలో భారీ వర్షం దంచి కొట్టింది. రాజేంద్రనగర్పై వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆకాశానికి తూట్లు పడినట్లుగా దాదాపు అర్ధగంట పాటు ఏకధాటిగా కుండపోత కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపించాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారులు ఇళ్లకు వెళ్లే క్రమంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. -
యూపీలో దంచికొట్టిన వర్షం
-
హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం
-
హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత వాన (ఫొటోలు)
-
హైదరాబాద్లో మళ్లీ భారీ వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఈ రోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం పడగా, రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత తిరిగి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది. శేర్లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, తదితర ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. పెద్దఎత్తున వరదనీరు రోడ్లమీదకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
ఒడిశా వరదల్లో కొత్త భయం
భువనేశ్వర్ : ఒడిశాలోని జాజాపూర్ జిల్లాలో వరదల వల్ల ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. అసలే వరదల వల్ల గూడు చెదిరి ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు పాములతో సరికొత్త సమస్య వచ్చి పడింది. వరదనీటితో పాటు పాములు సైతం ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళలనలకు గురవుతున్నారు. విషపు జీవులు కరిచివేయడం వల్ల ఇప్పటికే దాదాపు 76మందికి పైగా ఆసుపత్రులలో చేరారు.దశరథ్పూర్ బ్లాక్లోని గ్రామాల్లోని వీధులు, సంతల రోడ్లపైకి విపరీతంగా వరద చేరింది. దేవాలయాలు ఇళ్లు, ప్రభుత్వకార్యాలయాలన్నిటినీ వరద ముంచెత్తింది. దీంతో ఇళ్లలోని సామాగ్రి అంతా నీటిపాలు కావడంతో ప్రజలు తినడానికి, నిద్రపోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే ఈ సమస్యలతో సతమవుతున్న ప్రజలకు ఇప్పుడు ఊహించని విపత్తు కొత్త తలనొప్పిని తెచ్చింది. భారీవరదలకు విష సర్పాలు , ఇతర విష సరీసృపాల ఇండ్లలోకి చేరుతున్నాయి. ప్రజల ఇళ్లు, నివాసాలు, పంజరాలలో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అక్కడి ఆరోగ్యశాఖ అందించిన వివరాల ప్రకారం. గత ఐదు రోజుల్లో మంగళ్పురా మెడికల్ సెంటర్లో 76 మందికి పైగా చికిత్స పొందారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి అమృత ప్రీతమ్ మల్లా తెలిపారు. వీరిలో 37 మందిని గుర్తుతెలియని జంతువులు, 11 మందిని పాములు కాటు వేసినట్లు తెలిపారు.దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విషసర్పాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాగ్రత్తలుకరెంటు లేనప్పుడు టార్చ్ లైట్ను ఉపయోగించాలిచీకటి ప్రదేశంలో తిరిగేటప్పుడు లైటును ఉపయోగించాలి. బూట్లు, బట్టలు వేసుకునే ముందు వాటిని జాగ్రత్తగా సరిచూసుకోవాలి.నేలపై పడుకోవడానికి బదులుగా, మంచం వంటి ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించాలి.ఒకవేళ పాములు లేక ఇతర విషసర్పాలు కాటు వేసినట్లు అనుమానం వస్తే స్వంత చికిత్స కాకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అని ప్రకటన విడదల చేశారు. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీగా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాలలో జోరుగా వాన కురుస్తోంది. పలు ప్రాంతాలలో ఆకస్మిక వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
తెలంగాణలో వర్షాల బీభత్సం.. బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక
-
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు... జలాశయాలకు పోటెత్తుతున్న వరద నీరు (ఫొటోలు)
-
హైదరాబాద్కు భారీ వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డిప్రెషన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని అంచనా వేస్తోంది. గురువారం రాత్రి వరకు ప్రభావం గరిష్ట స్థాయిలో ఉంటుందని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది.అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 12 నుంచి 18 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని సూచించారు.ఇక సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్లో కుండపోత?..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం సమయంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే ప్రయాణాలను కొంత సమయం వాయిదా వేసుకోవాలని సూచించారు.ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీవర్షాల కారణంగా రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉన్నవాళ్లకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు తెలిపింది.హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.ప్రజలకు అధికారుల సూచనలుభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెరువులు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు. మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు, నీరు నిలిచిన రోడ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
వానలే వానలు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు
-
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.మరోవైపు, ములుగు జిల్లా, వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గంగా కాలువలు తవ్వించి నీటి పారుదలకు చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది కలిసి ప్రయత్నాలు నిర్వహించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది..శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సామర్థ్యం 20 టీఎంసీ లకు గాను 11.1105 టీఎంసీలునీటిమట్టం 148 మీటర్లకు గాను 144.22 మీటర్లుప్రాజెక్టు ఇన్ ఫ్లో: 75,328 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో: 12,875 క్యూసెక్కులు -
హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
హైదరాబాద్లో భారీ ఉరుములు..దంచికొట్టిన వర్షం రోడ్లన్నీ జలమయం (ఫొటోలు)
-
17 రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఉత్తరాదిన అలా.. ఏపీలో ఇలా
-
గుజరాత్లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)
-
వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది మృతి
న్యూఢిల్లీ: ఉత్తర, తూర్పు భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తీవ్రరూపం దాల్చాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్లలో సంభవించిన వర్ష సంబంధిత ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.జమ్ముకశ్మీర్లోని పూంచ్, రజౌరీ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 12కి చేరింది. పూంచ్లోని సురాన్కోట్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని జమ్ముకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయగా, 84 రోడ్లు మూసుకుపోయాయి. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో ఆకస్మిక వరదలకు ఇళ్లు కొట్టుకుపోయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
చార్ధామ్ యాత్ర నిలిపివేత!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్రను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతినడం, ప్రయాణం ప్రమాదకరంగా మారడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడంతో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి మార్గాల్లో యాత్రికుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.ప్రస్తుతం చార్ధామ్ ప్రయాణంలో ఉన్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా యంత్రాంగాలను ఆదేశించారు. మరోవైపు, అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రుద్రప్రయాగ్ తదితర ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నదీ తీర ప్రాంతాలు మునిగిపోగా, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. వాతావరణం మెరుగుపడి, నిపుణులు భద్రతను ధృవీకరించిన తర్వాతే యాత్ర పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్లో అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఇప్పటివరకు 44.8 లక్షలకు పైగా భక్తులు చార్ధామ్ క్షేత్రాలను దర్శించుకున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది. -
రైతన్నలకు గుడ్ న్యూస్.. ఆగస్టులో దంచుడే దంచుడు
-
చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్ దెబ్బకు అతలాకుతలం
చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.#China evacuated more than 1 million people & issued high alerts as eastern China braced for #TyphoonBavi, which brought strong winds and rain to #Japan's southern islands and #Taiwan. #floods #Phillipines #typhoon #Bavi #Beijing #heavyrain pic.twitter.com/hjSWM5y1kQ— Salar News (@EnglishSalar) July 11, 2026టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.🇹🇼 Typhoon Bavi is battering Taiwan, forcing more than 14,000 people to evacuate. Keelung is being lashed by fierce winds and heavy rain, while over 27,000 households are already without power. 🌪️⚠️ #TyphoonBavi #Taiwan #Breaking pic.twitter.com/VU1Nrd0AkB— 呀婷 (Ya-Ting) (@YaTing542311) July 11, 2026Nature returning the trash with gigantic waves during the arrival of Typhoon Bavi in Taizhou, Zhejiang Province, China 🇨🇳 , on July 11, 2026.#TyphoonBavi pic.twitter.com/aX9ulp23gN— 🄲🄾🄻🄾🄽🄴🄻 🄱🄾🄶🄴🅈 (@alfadelta0108) July 11, 2026 -
విమానం ఆలస్యమైతే.. ఇవి ఉచితం!
వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు విమానాలు ఆలస్యంగా బయలుదేరడం లేదా పూర్తిగా రద్దు కావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. అయితే.. విమానం ఆలస్యమైనా లేదా రద్దైనా ప్రయాణికులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు లభిస్తాయి. ఈ హక్కులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్యాసింజర్ చార్టర్లో స్పష్టంగా పేర్కొంది.విమానం ఆలస్యమైతే..నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేసి ఉంటే, విమానం ఆలస్యమైన సమయాన్ని బట్టి ఎయిర్లైన్ సంస్థ ఉచితంగా భోజనం, తాగునీరు లేదా ఇతర రిఫ్రెష్మెంట్లు అందించాలి. ప్రయాణ సమయం, ఆలస్యమైన గంటలను బట్టి ఈ సౌకర్యాలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి.రీఫండ్ ఎంపికదేశీయ విమానం ఆరు గంటలకు పైగా ఆలస్యమవుతుందని ముందే తెలిసినప్పుడు, ఎయిర్లైన్ సంస్థ కనీసం 24 గంటల ముందే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోవచ్చు, లేదా పూర్తి టికెట్ మొత్తాన్ని రీఫండ్గా పొందవచ్చు.ఒకవేళ ఎయిర్లైన్ సంస్థ సరైన సమయంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోతే లేదా అదే టికెట్పై బుక్ చేసిన కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యేలా జరిగితే, కేవలం రీఫండ్ మాత్రమే కాకుండా అదనంగా పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.ప్రత్యామ్నాయ విమానం కోసం ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో కూడా భోజనం, రిఫ్రెష్మెంట్లు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఎయిర్లైన్ సంస్థదే. అయితే.. టికెట్ బుక్ చేసుకునే సమయంలో సరైన మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే విమానం ఆలస్యానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పంచుకుంటారు. సరైన వివరాలు ఇవ్వని సమయంలో విమానం రద్దు లేదా ఆలస్యం గురించి సమాచారం అందకపోయినా, ఆర్థిక పరిహారం కోరే హక్కు ఉండదు. -
ఉత్తరాదికి బిగ్ అలర్ట్.. వరదల ఉగ్రరూపం..
దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు.. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పదికిపైగా మరణాలు సంభవించాయి.ఉత్తరాఖండ్లో ఎడతెరిపిలేని వర్షాలతో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చార్ధామ్ మార్గాల్లోనూ భద్రతా కారణాలతో ఆంక్షలు విధించారు. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు హెచ్చరికలు జారీ చేసి అధికారులు అప్రమత్తమయ్యారు.#WATCH | Uttarkashi, Uttarakhand | Traffic has been restored on the Gangotri National Highway after the road, which was blocked due to a landslide and debris near Nalupani, was cleared.In view of repeated landslides and debris accumulation at Nalupani causing frequent… pic.twitter.com/84kV12kio7— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 10, 2026 హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కిన్నౌర్ జిల్లాలో వరదల కారణంగా ఓ వంతెన దెబ్బతిని గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.Fortunately no casualties or injuries. The building had been vacated.But take a look at the slope and the kind of construction.... Is it really that much of a surprise that it collapsed.#uttarakhand pic.twitter.com/ijU6EgOT5c— Sidharth Shukla (@sidhshuk) July 9, 2026ఉత్తరప్రదేశ్లోనూ భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదలు, రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ జీవనం ప్రభావితమైంది.Raining heavily in various parts of Uttarakhand, morning visuals from Haridwar More rains coming in the next 2-3 days, there will be season's first significant rise in the water level of Uttarakhand riversStay away from rivers and streams pic.twitter.com/DxKeQuU7uC— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2026భారీ వర్షాల ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా కనిపిస్తోంది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నీటి మునకలు, రోడ్డు ప్రమాదాలు, భవనాల కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నదులు ఉప్పొంగడం, నేల బలహీనపడటం, ఆకస్మిక వరదలు కారణంగా మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.रुद्रप्रयाग में उफान पर अलकनंदा...पानी में डूबी शिव प्रतिमा #Uttarakhand #Monsoon #Rainfall pic.twitter.com/IJBuk2MLDX— Nidhi Mudgill (@nidhimudgill) July 9, 2026ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, కొండ ప్రాంతాల్లో నదులు, వాగుల సమీపానికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. రక్షణ, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. Scary visuals coming in from Kinnaur. The worst part is that these nalas don’t just carry water they bring rocks, mud and heavy debris with them, making the impact far more destructive.Heavy rain alerts are in place across several districts of Himachal. Please avoid unnecessary… pic.twitter.com/Nak9plrCXf— Nikhil saini (@iNikhilsaini) July 9, 2026 -
ఢిల్లీని వణికించిన వరుణుడు.. జనం అవస్థలు (ఫొటోలు)
-
కుండపోత వర్ష బీభత్సం.. 5000 సిలిండర్లు గల్లంతు..
ముంబై: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా రాయ్గఢ్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. భారీ వర్షాల కారణంగా సుమారు 5,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ సిలిండర్లు కనిపిస్తే ప్రజలు వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సిలిండర్లు నివాస ప్రాంతాలు, రోడ్లు, నదీ ప్రవాహాల సమీపంలో కనిపించవచ్చని అధికారులు తెలిపారు. వాటిని తరలించేందుకు లేదా తెరవడానికి ప్రయత్నిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు. సిలిండర్లలో గ్యాస్ మిగిలి ఉండే అవకాశం ఉన్నందున లీకేజీ, మంటలు లేదా పేలుడు వంటి ప్రమాదాలు సంభవించవచ్చని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.Raigad,Maharashtra - Several empty cylinders of HPCL were washed away in a sudden flood at Chavane village in Khalapur taluka.The empty tanks had been brought to the HPCL plant in Chavane for processing and refilling. However, heavy rainfall on the hilltop caused a massive surge… pic.twitter.com/08PVx2k5XJ— NextMinute News (@nextminutenews7) July 8, 2026మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి సురక్షితంగా తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక యంత్రాంగం ప్రజల భద్రత కోసం పర్యవేక్షణ పెంచింది. ఇక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితులు నెలకొన్నాయి. రాయ్గఢ్లో రవాణా, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.ముంబైపై పంజా..ఇదిలా ఉండగా.. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగర జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. గత ఏడు రోజుల్లో నమోదైన వర్షపాతం రికార్డు స్థాయికి చేరుకుంది. శాంతాక్రూజ్ వాతావరణ కేంద్రంలో 1,017.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది గత ఏడాది మొత్తం జూలై నెలలో కురిసిన వర్షపాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైలు, విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.मुंबई और उसके आसपास के इलाकों में मूसलाधार बारिश के कारण कई जगहों पर रेलवे ट्रैक जलमग्न हो गए हैं।भारी बारिश होने के कारण। pic.twitter.com/n0Jn1MFtRW— Cockroach Janta Party (@CJP_for_India) July 9, 2026భారత వాతావరణ శాఖ (IMD) ముంబై, థానే ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. ఇక భారీ వర్షాలతో ముంబైకి తాగునీటిని అందించే విహార్, తులసి సరస్సులు పూర్తిగా నిండిపోయాయి. దీంతో నగర నీటి సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత మేర తగ్గినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు నిలిచిన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Mumbai rains giving no respite this time! Hope it stops soon. 🙁 Stay safe#MumbaiRain pic.twitter.com/o9OSpM6GA2— Puneet Kumar (@puneetiitm) July 8, 2026 -
పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం
-
ఆకాశానికి చిల్లు పడిందా? ముంబైలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
-
జమ్ముకశ్మీర్లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి -
తీరం దాటిన వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
హైదరాబాద్లో జోరు వాన (ఫొటోలు)
-
ముంబైలో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
ముంబైలో వర్ష బీభత్సం..‘రెడ్ అలర్ట్’ జారీ!
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం నగరంతో పాటు పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైనప్పటికీ, ఈ వారం ప్రారంభం నుండి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గణాంకాల ప్రకారం.. ఐలాండ్ సిటీలో సగటున 99 మి.మీ, తూర్పు శివారు ప్రాంతాలలో 98 మి.మీ, పశ్చిమ శివారు ప్రాంతాలలో 94 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
AP: వారం రోజులపాటు వర్ష సూచన..పలు జిల్లాల్లో భారీ వర్షాలు
విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందచని హెచ్చరించింది. రాగల 24 గంటల్లో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనిలో భాగంగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
-
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
-
మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ మ్యాన్హోల్లో పడి..
ముంబైలో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వర్షం మధ్య తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అంధేరి-సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్కోపర్తో కలిపే ఖైరానీ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అతడు మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు సమాచారం.ఘటనాస్థలిలో అతడి గొడుగు, చెప్పులు కనిపించాయి. ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చేపట్టారు. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న మరమ్మతుల పనుల వల్ల మ్యాన్హోల్ మూత తెరిచి ఉంచారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తూ సంబంధిత కాంట్రాక్టర్పై హత్య కేసు నమోదు చేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించినట్టు చెప్పారు.ఈ ఘటనకు 2 రోజుల ముందే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆ ఘటనపై ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం బయటపడటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓ అధికారిని సస్పెండ్ చేసింది.ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలుగురువారం కూడా ముంబైలో భారీ వర్షం కొనసాగింది. దాదర్, పరేల్, హింద్మాతా, చార్కోప్, వర్లీ, గోరేగావ్, అంధేరి సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.గురువారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో తూర్పు శివారు ప్రాంతాల్లో సగటున 189 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగర ప్రధాన ప్రాంతాల్లో 172 మిల్లీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.ముంబై జీవనాడిగా భావించే లోకల్ రైలు సర్వీసులపై కూడా వర్షం ప్రభావం పడినట్లు తెలుస్తోంది. పట్టాలపై నీరు చేరడంతో ఉదయం రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని ప్రయాణికులు తెలిపారు. అయితే రైల్వే అధికారులు మాత్రం రైలు సర్వీసులు ఎలాంటి అంతరాయం లేకుండా సాధారణంగానే నడుస్తున్నాయని వెల్లడించారు. -
ముంబైని ముంచెత్తిన వర్షం
-
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం (ఫొటోలు)
-
వర్షం కారణంగా తొలి టీ20 రద్దు.. భారత్కు అచ్చిరాని వేదిక
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ను వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం జోరందుకున్న వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అభిషేక్, శ్రేయస్లు కలిసి భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ ఇద్దరు మూడో వికెట్కు 82 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ శర్మ వెనుదిరిగాడు. అప్పటివరకు స్లోగా ఆడిన అయ్యర్ వేగం పెంచాడు. ఈ దశలో 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్రమంలో అయ్యర్ ఔటైనప్పటికీ ఫినిషర్ రోల్కు న్యాయం చేస్తూ శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడడంతో టీమిండియా 180 పరుగుల మార్క్ను దాటింది.The 1st #ENGvIND T20I in Durham has been called off due to rains.Scorecard ▶️ https://t.co/occSMon7Q9#TeamIndia pic.twitter.com/cjIdYQcHUR— BCCI (@BCCI) July 1, 2026 -
జులైలో భారీ వర్షాలు! బంగాళాఖాతంలో రెండు అల్ప పీడనాలు
-
జపాన్ను వణికిస్తున్న జంట తుఫానులు.. 120కి పైగా విమానాలు రద్దు
-
ముంబై నగరాన్ని వణికిస్తున్న కుండపోత వర్షం..
-
ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు)
-
కేరళ లాటరీపై ‘కాగ్’ సంచలన నివేదిక
కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కేరళ స్టేట్ లాటరీ డిపార్ట్మెంట్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రికార్డు స్థాయిలో టికెట్ల విక్రయాలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే అసలు లాభాలు (నికర రాబడి) క్రమంగా తగ్గిపోతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా ఆడిట్ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అంతర్గత లోపాలు ఈ అదృష్ట వ్యాపారాన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుకేరళ రాష్ట్ర పన్నేతర ఆదాయంలో లాటరీ విభాగం ఇప్పటికీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం పన్నేతర ఆదాయంలో ఈ శాఖ నుంచే ఏకంగా 76.66 శాతం లభించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతేకాకుండా, 2024-25 నాటికి లాటరీ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రాబడి రూ. 12,711.18 కోట్లకు చేరుకుంది.జీఎస్టీ రూపంలో భారీ పన్నులుఈ లాటరీ కేవలం రాష్ట్ర ఖజానాను నింపడమే కాకుండా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే లాటరీ విక్రయాల ద్వారా మొత్తం రూ. 3,559.34 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి నేరుగా ఆదాయాన్ని అందించే ఒక ద్వంద్వ ప్రయోజన ఆర్థిక వనరుగా నిలిచింది.తగ్గిన నికర లాభాలుటికెట్ల అమ్మకాలు భారీగా పెరిగినప్పటికీ, ప్రభుత్వం చేతికి వచ్చే నికర లాభం (Net Yield) మాత్రం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో లాటరీ ద్వారా వచ్చిన నికర లాభం రూ. 140.51 కోట్లు తగ్గింది. పెరిగిన అమ్మకాలతో సంబంధం లేకుండా లాభాల శాతం క్షీణించడం వెనుక నిర్వహణ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.బహుమతులు, కమీషన్ల భారంలాభాలు తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఇచ్చే బహుమతి మొత్తం, ఏజెంట్ల నెట్వర్క్ను నిలబెట్టేందుకు ఇచ్చే కమీషన్లు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైజ్ మనీ, కమీషన్ల కోసం డిపార్ట్మెంట్ ఏకంగా రూ. 11,721.98 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా, ప్రభుత్వానికి దక్కే వాటా మాత్రం స్వల్పంగానే ఉంటోంది.భారీ వర్షాలు, మెషిన్ల కొరతకేరళ లాటరీ ఆదాయ వృద్ధి రేటు గతంలో నమోదైన 5.36 శాతం నుండి ఒక్కసారిగా 1.44 శాతానికి పడిపోయింది. ఈ మందగమనానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలేనని అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు కొత్త లాటరీ సిరీస్లను ప్రారంభించడానికి అవసరమైన డ్రాయింగ్ మెషిన్ల కొరత కూడా అమ్మకాల విస్తరణకు ప్రతిబంధకంగా మారింది.ఆడిట్ లోపాలు, నిధుల దుర్వినియోగంఆర్థిక పరమైన సవాళ్లతో పాటు, శాఖలోని పరిపాలనా లోపాలను కూడా ‘కాగ్’ ఎండగట్టింది. జూన్ 2024 నాటికి రూ. 7.30 కోట్లకు సంబంధించిన 77 ఆడిట్ పారాగ్రాఫ్లు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై కనీసం ఒక్క సమీక్షా సమావేశం కూడా జరగలేదు. అంతేకాకుండా, గత 15 ఏళ్లుగా రూ.49.03 లక్షల నిధుల దుర్వినియోగం కేసు ఇప్పటికీ పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోవడం అంతర్గత పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది.ఇది కూడా చదవండి: ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్ బి’! -
హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీ వర్షం పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్, పాతబస్తీ, చార్మినార్, బహదూర్పురా, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, మియాపూర్లో వాన కురిసింది. హైదరాబాద్లో అర్ధరాత్రి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.మరోవైపు, నల్లగొండ జిల్లాలో కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులుపడ్డారు. తిరుమలగిరి (సాగర్) మండలం బోయగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పశువుల కాపరి పుట్టపాక మల్లయ్య(45) మృతి చెందాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. -
హైదరాబాద్లో భారీ వర్షం.. పోలీసుల కీలక సూచన
సాక్షి, హైదరాబాద్: ఈ రోజు ( సోమవారం) హైదరాబాద్కు భారీ వర్షహెచ్చరిక ఉన్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షం దృష్ట్యా విద్యాసంస్థలు, ఐటీ కార్యాలయాలు త్వరగా విధులు ముగించి ముందు బయలుదేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కీలక సూచన చేశారు. కాగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది -
రాష్ట్రంలో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
సాక్షి, విశాఖ : వాతావరణ శాఖ నేడు ( సోమవారం) రాష్ట్రానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. కాకినాడ,అల్లూరి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వానలు ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.ఈ నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో ఈ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వానలు లేని చోట ఎండల తీవ్రత సైతం అధికంగా ఉండనున్నట్లు పేర్కొంది. -
ఏపీకి అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను విపత్తుల సంస్థ ప్రకటించింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.విశాఖపట్నంలో వర్షం దంచికొడుతోంది. బీచ్ రోడ్డులో వరద నీరు భారీగా చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. -
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఫిల్మ్నగర్ మణికొండ, నానక్ రామ్గూడ, కొండాపూర్లో కుండపోత వర్షం పడింది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్సిటీలో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
గుడివాడలో భారీ వర్షం.. చెరువైన బస్టాండ్
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి గుడివాడ బస్టాండ్ జలమయమైంది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి బస్టాండ్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. దీంతో, బస్టాండ్ ప్రాంగణం చిన్నపాటి చెరువును తలపిస్తోంది. బస్టాండ్ ఆవరణలో మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల వద్దకు చేరుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, డ్రైవర్లు బస్సులను లోపలకు తీసుకురాకుండా బయట ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు.మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. తిరువూరు, ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ వెళ్ళే జాతీయ (NHAI-30) రహదారిపై లక్ష్మీపురం వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడిపోయింది. తిరువూరు-విసన్నపేట వెళ్లే దారిలో మల్లెల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై చెట్టు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఇదే పరిస్థితి ఉంది. చెట్లు పడిపోవడంతో జేసీబీ, యంత్రాల సహాయంతో రెస్క్యూ టీమ్ చెట్లను తొలగిస్తున్నారు. -
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)
-
ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు
-
మరో 2 రోజులు భారీ వర్షాలు
-
TG: నేడు భారీవర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.అదేవిధంగా సిద్ధిపేట, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే విధంగా మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా వర్షాలు పడే అవకాలున్నాయని పేర్కొది. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఇటీవల భారీ వర్షం కురిసింది. దీంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్లో అలర్ట్- సాధారణం కంటే ఎక్కువ వర్షాలు (6.45 సెం.మీ నుండి 11.55 సెం.మీ వరకు) కురిసే అవకాశం ఉన్నప్పుడు, లేదా వాతావరణం ప్రతికూలంగా మారినప్పుడు ఈ అలర్ట్ జారీ చేస్తోంది.రెడ్ అలర్ట్- అత్యున్నత స్థాయి ప్రమాదం అని అర్థం.తీవ్రత: అత్యంత భారీ వర్షాలు (24 గంటల్లో 20.45 సెం.మీ కంటే ఎక్కువ) కురిసి, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు ఈ హెచ్చరికను జారీ చేస్తారు. -
రెండు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు
-
హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
-
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
భాగ్య ‘నరకం’
సాక్షి, హైదరాబాద్: వానాకాలం వచ్చేసింది.. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగింది..కానీ, హైదరాబాద్ నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. చినుకు రాలితే వణికిపోతోంది. గతేడాది భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ, అదేస్థాయి వానలు ఈసారి కురిస్తే అంతకంటే ఎక్కువ ఆగమాగమయ్యే పరిస్థితి నెలకొనడమే దీనికి కారణం. నగరంలో ఏదైనా సమస్య నెలకొంటే ముందుగా అటువైపు వాహనాలను నియంత్రిస్తారు, లేకుంటే ఆ రూట్ ట్రాఫిక్లో చిక్కుకుంటుంది.గత ఏడాది భారీ వర్షాలు, భయంకర ట్రాఫిక్ జామ్లను సృష్టించిన ప్రాంతాల్లో కొత్తగా వేల సంఖ్యలో వాహనాలు వచ్చి చేరుతున్నాయి. అందుకే నగరం ఇప్పుడు వణికిపోతోంది. పైగా నగరం మరింత విస్తరించింది..కొత్త జనావాసాలు వెలిశాయి. ఇతర జిల్లాలు, ఏపీ నుంచి నగరానికి వచ్చే వాహనాల సంఖ్యా పెరిగింది. రోడ్లు మరింత కుంచించుకుపోయాయి.. అదనంగా ప్రత్యామ్నాయ దారులేవీ అందుబాటులోకి రాలేదు. అందుకే ఇప్పుడు నగరానికి ముచ్చెమటలు పడుతున్నాయి. వాహన వరద.. నాలుగో స్థానంలో హైదరాబాద్ దేశంలో ఎక్కువ వాహనాలు అమ్ముడవుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. గత వానాకాలం ముగిసిన తర్వాత నగరంలో ఏకంగా 5,35 లక్షల వాహనాలు రోడ్డెకెక్కాయి. దీంతో నగరంలో మొత్తం వాహనాల సంఖ్య 90 లక్షలకు చేరువైంది. ఇప్పుడు ఇదే భాగ్యనగర గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. గతేడాది నాటికి ఉన్న వాహనాలకు తగ్గ రోడ్డు నెట్వర్క్ హైదరాబాద్కు లేదు. వాణిజ్య ప్రాంతాల విస్తరణ మీద నగరంలో ఎక్కడా నియంత్రణ లేదు. వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చే విషయంలో ప్రణాళిక అంటూ లేని దుస్థితి.ఆయా ప్రాంతాలో పార్కింగ్ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది. ఈ తరుణంలో కొత్తగా లక్షల వాహనాలు రోడ్డెక్కితే పరిస్థితి భయంకరంగా మారబోతోంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిస్తే చాలా ప్రాంతాల్లో గంటలతరబడి ట్రాఫిక్లో బంధీ కావాల్సిందే. ఈనెల 9న భారీ వర్షంతో ఈసారి తొలకరి పలకరించింది. నాలెడ్జి సిటీ, కొండాపూర్, ఐకియా జంక్షన్, మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, రాయదుర్గం, మెహిదీపట్నం, సచివాలయం, ముషీరాబాద్, పాతనగరం... ఇలా ప్రధాన ప్రాంతాలు సాయంత్రం మూడు గంటలపాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాయి. కేవలం 4–5 సెంటీమీటర్ల మేర కురిసిన ఈ వాన 30 శాతం నగరాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహంలోకి నెట్టేసింది. మరి వరుస పెట్టి 10 సెం.మీ. మేర వాన కురిస్తే నగరం రోజు మొత్తం స్తంభించాల్సిందే. గతేడాది అనుభవాలేంటి..? గత సంవత్సరం భారీ వర్షాలు కురిశాయి. కేవలం గంట సమయంలోనే 10 సెం.మీ. వాన కురిసిన దాఖలాలు ఉండటంతో మెరుపు వరదలు సంభవించాయి. గత సీజన్లో మొత్తం 18 మార్లు నగరం ట్రాఫిక్లో బంధీ కాగా, అరడజను పర్యాయాలు గ్రిడ్లాక్ పరిస్థితి నెలకొంది. యావత్ నగరం గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో నరకం అనుభవించాల్సి వచ్చింది. ⇒ ఏప్రిల్ 3–4,(ప్రీ–మాన్సూన్): జడివాన బీభత్సం సృష్టించింది. గంటపాటు కురిసి భారీ వృక్షాలను కూడా కూకటి వేళ్లతో పెకిలించేసింది. ఫలితం నగరం మొత్తం ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ⇒ ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఆరు భారీ వర్షాలు కురిశాయి. వానలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రధాన రోడ్లు చెరువుల్లా మారి గంటలపాటు వాహనాలు నిలిచిపోవాల్సి వచ్చింది. ⇒ సెప్టెంబర్ 17 రాత్రి కురిసిన వాన రోడ్లను ముంచెత్తింది. ప్రాణనష్టం కూడా నెలకొంది. సెప్టెంబర్ 22న గంట పాటు ఏకబిగిన కురిసిన వానలు నగరం మొత్తాన్ని స్తంభింపజేశాయి. ⇒ తుఫాను ప్రభావంతో అక్టోబర్ 29న కురిసిన కుండపోత పీక్ గ్రిడ్లాక్గా నిలిచింది. ఐటీ కారిడార్లో మితిమీరిన కేంద్రీకరణ మాదాపూర్, రాయదుర్గం, కొండాపూర్, మైండ్స్పేస్ జంక్షన్, కోకాపేట లాంటి ఆధునిక హైదరాబాద్ ప్రాంతాల్లో అతి భారీ భవన సముదాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సగటున ఇంటికి రెండు కార్లున్నాయని తేలింది. ఉదయం, సాయంత్రం వేళల్లో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. అలాంటి సమయంలో వర్షం కురిస్తే పరిస్థితి బీభత్సంగా మారుతోంది. ఈ ఏడాది తొలి వాన ఈ ప్రాంతాలను ఆగమాగం చేసింది. అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ ఫ్లైఓవర్లను నిర్మించే దిశగా జరిగిన ఆలోచనలో పదో వంతు కూడా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే విషయంలో లేకపోవటమే అతి పెద్ద సమస్య. నగరంలో రెండుమూడు సెం.మీ. వానను తట్టుకునే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అంతకుమించి ఒక్క చినుకు రాలినా అతలాకుతలమే. భారీ నిర్మాణాలకు అనుమతిచ్చే ముందే ఆ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచే వ్యూహం ప్రభుత్వం వద్ద లేదు. ఇలా చేస్తే కొంత మెరుగు ⇒ ఆఫీస్ వేళల్లో మార్పులు : ఐటీ కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు అన్నీ ఒకే సమయానికి కాకుండా, గంట, రెండు గంటల వ్యవధితో విడతల వారీగా లీవ్/లాగిన్ టైమింగ్స్ పెట్టాలి. ⇒ కార్ పూలింగ్ –ప్రజా రవాణా: ఒక్కరే కారులో వెళ్లకుండా నలుగురు కలిసి ‘కార్ పూలింగ్’చేయడం ఇలాంటి సందర్భంలో చాలా ఉపయోగం, ఇక సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆశ్రయించే అలవాటు పెంచుకోవాల్సిందే. ⇒ నీరు నిలిచే ప్రాంతాల గుర్తింపు: నగరంలో నీరు నిలిచే 350కి పైగా ప్రధాన ప్రాంతాల్లో అత్యాధునిక మోటార్లు ఉంచి, çవరద నీటిని నాలాల్లోకి పంప్ చేయాలి. ⇒ హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ ఉమ్మడి కార్యాచరణ: వర్షం పడగానే రంగంలోకి దిగేలా క్షేత్రస్థాయి సిబ్బందిని జంక్షన్లలో మోహరించాలి. ⇒ వర్క్ఫ్రమ్ హోమ్: భారీ వర్ష సూచనలు అందిన సమయాల్లో ఎక్కువ మంది ఉద్యోగులుండే ఐటీ కంపెనీలకు ముందే సమాచారం ఇచ్చి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ప్రకటించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ⇒ రోడ్లపై గుంతల పూడ్చివేత: వీలైనంత తొందరగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేయాలి. అక్రమ పార్కింగులను నియంత్రించాలి. రోడ్డు ఆక్రమణలు తొలగించాలి. ⇒ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు విసరొద్దు.. అవి డ్రైనేజీ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. వరద నీళ్లు వేగంగా పారకుండా అడ్డుకుంటున్నాయి. -
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, చింతల్, బాలానగరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో భారీ వర్షం కురవగా, మళ్లీ ఈరోజు(శుక్రవారం, జూన్ 12వ తేదీ) భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం రేవంత్ విమానం వెనక్కి మళ్లింపుహైదరాబాద్లో భారీ వర్షం కారణంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి విమానం తిరిగి వెనక్కి మళ్లించారు. సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరు మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరు మళ్లించారు. -
ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విశాఖ : ఆంధ్రప్రదేశ్లో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతు రుతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండటమే ఇందుకు కారణంగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావారి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం పడే అవకాశం ఉండటంతో .. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల,వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. భారీ వర్షాలు పడే సమయంలో కోస్తా వ్యాప్తంగా 50-60 కిమీ వేగంతో ఈదురు గాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది,. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, ఈదురు గాలులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరొకవైపు కొన్ని జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
-
ఉమ్మడి కృష్ణా జిల్లాలో వడగండ్లతో కుండపోత వర్షం
-
ఇది స్విమ్మింగ్ పూల్ కాదు ఫ్లైఓవర్.. చూసి షాక్ అవుతున్న పబ్లిక్
-
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
-
హైదరాబాద్లో భారీ వర్షంపై మంత్రి పొన్నం సమీక్ష
హైదరాబాద్: భారీ వర్షం కారణంగా నగరంలో ఏర్పడిన పరిస్థితులపై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.తక్కువ సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు.నగరంలోని ఒక్కసారిగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపడిన ఘటనలపై మంత్రి ఆరా తీశారు. విద్యుత్ షాక్ తో ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలుసుకున్న సమాచారంతో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.కూలిన చెట్లు ,తెగిన విద్యుత్ తీగలు తొలగించడానికి సహాయక చర్యలను వేగవంతం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విద్యుత్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో కుండపోత వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల కుండపోతగా వాన కురిసింది. నగర పరిధిలోని అడిక్మెట్, విద్యానగర్, అంబర్ పేట్, ఉస్మానియా యూనివర్శిటీ, హఫీజ్పేట్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షం కురవడంతో వరద నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే యత్నం చేస్తున్నారు. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించిన దక్షిణ–పశ్చిమ రుతుపవనాలు రాకతో, మంగళవారం(జూన్ 9వ తేదీ) సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం పడింది. సాయంత్రం సమయంలో హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. తద్వారా రహదారులు నీట మునగడంతో పాటు విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. రాత్రి కూడా వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లో భారీ ట్రాఫిక్ జామ్..నగర ఐటీ కారిడార్లో కురిసిన కుండపోత వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గం, ఐకియా, మైండ్స్పేస్ పరిసరాల్లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో గమ్యస్థానాలకు చేరుకునే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవ్యాప్తంగా కొనసాగుతున్న వర్షం.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరుఅంబర్పేట బతుకమ్మకుంటకు భారీగా వరద నీరు చేరింది. హైడ్రా చేసిన ఏర్పాట్లతో పరిసర బస్తీలకు వరద ముప్పు తప్పింది. చెరువు నిండటంతో స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు యువకుల మృతిహైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బండ్లగూడ సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆటో దిగగానే విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను జాఫర్ (25), అబూ (16)గా గుర్తించారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వర్షపాతం రికార్డు వివరాలు సుమారుగా ఇలా ఉన్నాయి..అడిక్మెట్-36.3 mmవిద్యానగర్- 31.5 mmఅంబర్ పేట్-31.3 mmఉస్మానియా యూనివర్శిటీ-హఫీజ్పేట్-27.5 mmనెహ్రూ నగర్-21 mmమలక్పేట్-మియాపూర్-18 mmఉప్పల్-సరూర్నగర్- 12 mm RTC X Roads after HEAVY DOWNPOUR at 5pm Around 60-70mm was recorded ⚠️ pic.twitter.com/XrTaW8x4Rq— Telangana Weatherman (@balaji25_t) June 9, 2026 -
APకి నైరుతి రుతుపవనాలు.. జోరుగా వానలు
-
తిరుమలలో కుంభవృష్టి వర్షం.. భక్తులకు ఇబ్బందులు
తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం గంటపాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఈ భారీ వర్షం కారణంగా ఆలయ పరిసర ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం చుట్టుపక్కల రహదారులు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా క్యూలైన్లలో నిలబడి ఉన్న భక్తులు తడిసి ఇబ్బంది పడ్డారు. రహదారులు ముంచెత్తడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. -
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. తెలంగాణలో అలర్ట్
-
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. వానలు వస్తున్నాయ్!
-
తెలంగాణకు భారీ వర్ష సూచన
-
తిరుమలలో కుండపోత వర్షం
తిరుమల: తిరుమల కొండపై కుండపోతగా వర్షం కురుస్తోంది. రెండు గంటలకు పైగా వర్షం కురుస్తోంది. దాంతో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకునే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన ప్రాంతాలన్నీ జలమయంగా మారడంతో భక్తులు అగచాట్లు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి వసతి ప్రాంతాలకు వెళ్లాలన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమలలో ఉన్నపళంగా వాతావరణం మారిపోయి వర్షం పడటం ఆరంభించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండటంతో తిరుపతి నగరంలో కూడా రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. దాంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం
చురు జిల్లా: రాజస్థాన్లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. చురు జిల్లాలో ఇసుక తుపాన్తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చురు, బికనేర్, శ్రీగంగానగర్లో అరగంట పాటు ఇసుక తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఇసుక తుపాను వీధులను కమ్మేసింది. భారీ దుమ్ము కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. సోషల్ మీడియాలో దుమ్ము తుపాను సంబంధించి వీడియోలు వైరల్గా మారాయి.వీధుల గుండా బలమైన ఈదురుగాలులు, దట్టమైన దుమ్ము మేఘాలు కనిపించాయి. దీంతో ఆకాశం ముదురు నారింజ-గోధుమ రంగులోకి మారిపోయింది. ఒక్కసారిగా ఇసుక తుపానుతో ప్రయాణికులు స్థానికులు ఇళ్లలోనే ఆశ్రయం పొందారు. ఈదురుగాలుల ధాటికి చెట్లు నేలకొరిగాయి. ఈ ప్రాంతంలో తీవ్రమైన ఎండల తర్వాత బలమైన గాలులు, దుమ్ము తుపానులు ముంచెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఉత్తర భారతదేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎడారి వేడి గాలులు పరస్పరం చర్య జరిపినప్పుడు.. ముఖ్యంగా రుతుపవనాల ముందు వచ్చే ముందు రాజస్థాన్లో ఇటువంటి దుమ్ము తుపానులు సహజమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇసుక తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి నివేదికలు అందలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ విజిబిలిటీ ఉన్న సమయంలో అనవసరమైన ప్రయాణాలను చేయొద్దని.. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, దుమ్ము లేచే పరిస్థితులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. -
ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విజయవాడ: ఏపీలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఏపీలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించగా, మళ్లీ ఏపీకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం,. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
విశాఖలో వాన బీభత్సం..
సాక్షి, విశాఖపట్నం: ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన విశాఖవాసులకు గురువారం ఉదయం వర్షం ఊరటనిచ్చింది. అయితే కాసేపటికే వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోగా.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం.ఇదిలా ఉండగా విశాఖ నగరానికి సమీపంలో సముద్రం వైపు అకస్మాత్తుగా సీ స్టార్మ్ ఏర్పడినట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ద్వారకానగర్, మధురవాడ, సీతమ్మధార, జగదాంబ జంక్షన్తో పాటు బీచ్రోడ్ సమీప ప్రాంతాల్లో వచ్చే 30 నుంచి 40 నిమిషాల్లో మరోసారి వర్షం కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు.ఈ స్టార్మ్ నెమ్మదిగా కదులుతుండటంతో భారీ వర్షం కంటే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు అవసరం లేకుండా బయటకు రావొద్దని, బీచ్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా ఇంకా వర్షాలు కొనసాగొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.#Visakhapatnam rains alert - Sudden sea storm development near the city can give a spell of rains across Dwaraka Nagar, Madhurawada, Seethammadhara, Jagadamba and areas close to Beach road (like Mahalakshminagar) during next 30-40 minutes. Slow moving storms and rains will be…— Andhra Pradesh Weatherman (@praneethweather) May 28, 2026 -
భారీ వర్షం లోయలో ఇరుక్కుపోయిన బొలెరో
-
విశాఖపట్నంలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
భారీ వర్షానికి చల్లబడ్డ హైదరాబాద్
-
తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్తో సహా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం పడింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) మధ్యాహ్నం వరకూ ఎండతో అల్లాడిన ప్రజల్ని వర్షం పలకరించింది. హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్లో గాలివాన బీభత్సానికి వర్షపు నీరు కల్లాల్లోకి చేరింది. దాంతో ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలి బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఓ చెట్టు కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. గుంతపల్లి చెరువు తండాలో పిడుగుపడింది. మెదక్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షానికి మెదక్ మండలంలో ధాన్యం తడిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో ఈదురు గాలికి పశువుల పాక కూలింది. లక్ష్మయ్య అనే గొర్లె కాపరి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కామారెడ్డి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం తడిచిపోయింది. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆవేదన చెందుతున్నారు. -
విజయవాడలో గాలివాన బీభత్సం (ఫొటోలు)
-
కేరళలో మళ్లీ భయం.. భయం.. వర్షాలు బాబోయ్..
తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో గతంలో కురిసిన వర్షాలు ఎంతగా విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాకాలాల్లో కేరళలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటే.. 2018లో సంభవించిన విపత్తును అత్యంత భయంకరమైన విపత్తుగా గుర్తించారు. 2019, 2020లో వరుస మాన్సూన్లలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. 2024 వయనాడ్ విపత్తును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాలు ఈనెల 26న (4 రోజులు అటుఇటుగా) కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కేరళలో వర్ష హెచ్చరికలను భారత వాతావరణ శాఖ తాజాగా సవరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పత్తనం తిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో మంగళవారం ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.అదే విధంగా బుధవారం కూడా నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అలప్పుళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో బుధవారానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.ఇక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
తిరుమల కొండపై భారీ వర్షం (ఫొటోలు)
-
తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షం
ఎండలతో అల్లాడుతున్న తెలుగురాష్ట్రాలను వరుణుడు కాస్త చల్లబరిచారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ రోజు ( ఆదివారం) భారీ వర్షాలు కురిశాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమల తిరుపతిలో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిశాయి. కోనసామ జిల్లాల్లోనూ భారీ జల్లులు పడ్డాయి. అకాల వర్షాలతో పంట నష్టం ఉండే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. నల్లగొండ, పెద్దవూర, తిప్పర్తిలో భారీ జల్లులు కురిశాయి. గుర్రంపూడి, సూర్యాపేట, కోదాడలో కుండపోతగా జల్లులు పడుతున్నాయి. భారీగా కురిసిన వర్షం దాటికి హుూజుర్నగర్లో వృక్షాలు నేలకొరిగాయి. మిర్యాలగూడ, నకిరికేల్లో భారీ జల్లులు పడ్డాయి. సిద్ధిపేటలో భారీగా వర్షం కురవడంతో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. ఇన్నిరోజులు భానుడు భగభగలతో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వరుణుడు కరుణించడంతో కాస్త సేద తీరారు. -
ఏపీ : పలు జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం (ఫొటోలు)
-
భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)
-
బెంగళూరులో ఘోర విషాదం.. స్పాటికి సీఎం సిద్ధరామయ్య
-
భారీ వర్షాలకు కూలిన గోడ.. ఏడుగురు మృతి
బెంగళూరులో కురిసిన అకాల వర్షాలు ఏడుగురిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ రోజు బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఓ ఆసుపత్రి ప్రహారి గోడ కూలి ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు.నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రహారి గోడ కూలింది. వర్షం పెద్దఎత్తున కురవడంతో బలమైన గాలులు వీశాయని దీంతో గోడ పక్కన నిల్చున్న ఏడుగురు బాధితులు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. మృతులలో అధికంగా అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని తెలిపారు.దీంతో వివరాలు తెలుసుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెలంగాణకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
-
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం..వడగళ్ల వాన బీభత్సము
-
వాతావరణంలో మార్పులు సూర్యాపేటలో భారీ వర్షం
-
హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)
-
ఈ రోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు
-
తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు
-
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. నిజాంపేట్, కేపీహెచ్బీ, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, నాచారం, చిల్కానగర్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వేళ సూర్యుని వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు రాత్రివేళ ఈ జల్లులు కొద్దిమేర ఉపశమనం కలిగించాయి. అయితే రాత్రి పదిగంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ట్రాఫిక్కు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. -
ల్యాండింగ్కు వీలులేక గంటపాటు గాల్లో చక్కర్లు
కోల్కతా: ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో మెరుపులా విరుచుకుపడే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గురువారం మధ్యాహ్నం ఉరు ములు, భారీవర్షం, భీకరగాలుల గంటలపాటు ఆందోళనకు గురిచేశాయి. ఎన్నికల ప్రచారర్యాలీల్లో పాల్గొని కోల్కతాకు ఛార్టెర్డ్ విమానంలో తిరుగుపయనమైన మమతకు కోల్కతా ఎయిర్పోర్ట్లో అననుకూల వాతావరణం స్వాగతం పలికింది. దీంతో తప్పనిపరిస్థితుల్లో విమానం గంటకుపైగా గాల్లోని చక్కర్లు కొట్టింది. తర్వాత ఎట్టకేలకు 5.19 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అణ్డాల్ నగరంలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు విమానంలో మమత బయల్దేరారు. అరగంటలో కోల్కతాలోని నేతాజీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ అప్పటికే ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా పెద్ద గాలివానలో చిక్కుకుంది. దీంతో విమానాల రాకపోకలను నిలిపేశారు. చేసేదిలేక విమానం చాలాసేపు గాల్లో చక్కర్లు కొట్టి గంట తర్వాత దిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం, ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. -
హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి
-
కుండపోత.. కర్షకుడి కడుపుకోత
సాక్షి, నెట్వర్క్/సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, గాలి దుమారం మొదలైంది. కొద్దిసేపటికి ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి పంటలు నేల వాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజధాని ప్రాంతం అమరావతిలో వర్షం దంచికొట్టింది. తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో వడగండ్ల వాన పడింది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో భారీ వర్షంతో డ్రెయిన్లు పొంగిపొర్లాయి. చాట్రాయి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆగిరిపల్లిలో 24 మి.మీ వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో భారీ వర్షానికి జీడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలో వడగండ్ల వర్షం మినుము, మొక్కజొన్న, మిర్చి, కంది పంటలను కోలుకోలేని దెబ్బతీసింది. కందిపంట పూత రాలిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తిరుపతి నగరంలో బుధవారం రాత్రి గంటపాటు జోరు వాన కురిసింది. తిరుపతి నగరం, తిరుపతి రూరల్ మండలం, రేణిగుంట మండలాల్లో బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9 వరకు కుండపోత వర్షం పడింది. కాగా, రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఓ వైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కూలీల బతుకులపై ‘పిడుగు’ కుండపోత వర్షంతో పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగు పడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీరపాలెంలో మిర్చి కోతలకు పొలానికి వెళ్లిన కాటూరి సుబ్బరత్నమ్మ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బాపట్ల జిల్లాలో పిడుగుపాటుతో పెరవలి వనజ మృతి చెందింది. వైఎస్సార్ కడప జిల్లా చిన్నాయపల్లెకి చెందిన గుర్రాల నారాయణ రెడ్డి(55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. -
ఇవాళ, రేపు భారీ వర్షాలు 40-50 కి.మీ. వేగంతో గాలులు
-
హైదరాబాద్ లో భారీ వర్షం.. తెలంగాణలో పలు చోట్ల వడగళ్ల వాన
-
బ్రెజిల్ అతలాకుతలం.. భీకర వరదలతో 46 మరణాలు..
జూయిజ్ డీ ఫోరా: బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గెరాయిస్ను భీకర వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని జూయిజ్ డీ ఫోరా, ఉబా నగరాల్లో లక్షలాది మంది ప్రజల జనజీవన అస్తవ్యస్థమైంది. వరద సంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 46 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఇంకా చాలా మంది జాడ తెలీకుండా పోయిందని సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని అధికారులు ప్రకటించారు. 21 మంది గల్లంతు అయినట్టు అధికారులు చెబుతున్నారు.ఇక, రాత్రిళ్లు సైతం రిస్క్యూ బృందాలు తమ విధుల్లో నిమగ్నమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని 3,000 మందిని బుధవారం ఉదయం అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి కొద్దిరోజులపాటు భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 5,60,000 జనాభా ఉండే జూయిజ్ డీ ఫోరా నగర వీధులన్నీ బురదలో నిండిపోయాయి. సమీపంలోని కొండచరియలు మరోసారి విరిగిపడే ప్రమాదముందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.🇧🇷🔴 ارتفاع حصيلة القتلى في البرازيلأعلنت فرق الإنقاذ والسلطات المحلية وفاة ما لا يقل عن 20 شخصًا، مع فقدان العشرات، واضطرار أكثر من 400 شخص إلى إخلاء منازلهم، جراء الأمطار الغزيرة التي ضربت جنوب شرق البرازيل.#Brazil #HeavyRain #Floods #Landslides #ExtremeWeather #BreakingNews pic.twitter.com/CHZr6VoFw7— طقس_العالم ⚡️ (@Arab_Storms) February 24, 20261,07,000 జనాభా ఉన్న ఉబా నగరంలో జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సోమవారం ఉదయం నుంచి మొదలైన వానలకు ఇప్పటిదాకా 20 కొండచరియలు విరిగిన ఘటనలు నమోదయ్యాయని మేయర్ మార్గరీడా సాలమావో చెప్పారు. వరదబాధిత ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోందని, బాధిత కుటుంబాలకు తగుసాయం అందిస్తామని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లాలూ డ సిల్వా భరోసా ఇచ్చారు. కొండలు, లోయలు, లోతట్టు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపించారు. 🇧🇷 Dozens are still missing in southeastern #Brazil after floods killed at least 36 people in the state of Minas Gerais, officials said 👇 pic.twitter.com/B5xvJ4M8iT— FRANCE 24 English (@France24_en) February 25, 2026🚨⚡️At least 23 people were killed due to floods and landslides that struck Juiz de Fora in the state of Minas Gerais, Brazil, after heavy rainfall totaling 584 mm over two days, prompting authorities to declare a state of public calamity. pic.twitter.com/3ZLptDPXTu— RussiaNews 🇷🇺 (@mog_russEN) February 25, 2026🚨 At least 30 people are dead and hundreds displaced in Brazil’s Minas Gerais after record-breaking rainfall triggered landslides and flash floods⚠️ Juiz de Fora was hardest hit, with rivers bursting their banks and entire neighborhoods submerged pic.twitter.com/ZrvhyWwm0u— Anadolu English (@anadoluagency) February 25, 2026 -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రెండు రోజుల పాటు భారీ వర్షాలు
-
ఎండాకాలం వాన.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
-
కుండపోత వర్షాలు.. 100 మంది మృతి!
ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. మరోవైపు.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఆఫ్రికాలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలలో ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొజాంబిక్లో వర్షాలు, వరదల కారణంగా రెండు లక్షల మందికి పైగా ప్రభావితులు అయ్యారు. భారీ వర్షాల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా ఇప్పటికే వంద మందికిపైగా మృతి చెందారు. ఇక, జింబాబ్వేలో వర్షాల వల్ల 70 మంది మరణించగా.. 1000కి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.BREAKINGMore than 100 dead in torrential rains and floods across southern Africa.Severe flooding hit Gigmoto on the Island of Catanduanes in the Philippines today, after heavy rain from Tropical Storm Ada triggered a landslide that blocked a river pic.twitter.com/dKicNBaCxq— Lee Golden (@LeeGolden6) January 17, 2026ఇదిలా ఉండగా.. దక్షిణ ఆఫ్రికాలో మృతుల సంఖ్య 30 చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హెలికాప్టర్లను రంగంలోకి దించి, బాధితుల్ని రక్షిస్తున్నారు. ప్రఖ్యాత క్రుగార్ నేషనల్ పార్క్ను కూడా ఈ వరదలు ప్రభావితం చేశాయి. అందులో చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. లా నినా వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆఫ్రికాలోని ఏడు దేశాలను వర్షాలు ముంచెత్తుతున్నాయని అమెరికా వాతావరణ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. Heavy rain, floods wreak havoc in South Africa:Torrential rains and severe flooding in northern South Africa have killed at least 19 people since last month, with Limpopo and Mpumalanga provinces hardest hit. pic.twitter.com/9JH0lJpDx5— CGTN Africa (@cgtnafrica) January 17, 2026 -
సంక్రాంతికి బిగ్ షాక్.. APలో భారీ వర్షాలు
-
ప్రళయం పోస్ట్పోన్.. యుగాంతం ఇప్పట్లో లేనట్లే!
ప్రళయాన్ని మానవమాత్రులైనా అంచనా వేయగలరా?.. అదేం సినిమానా? పోస్ట్పోన్ కావడానికి అనుకుంటున్నారా?. లక్షల మందిని మోసం చేసిన ఓ వ్యక్తి మాటల గురించే ఇక్కడ చెప్పబోతున్నాం. డిసెంబర్ 25వ తేదీన పెద్ద ప్రళయం పుట్టుకొస్తుందని.. దాని ప్రభావంతో యుగాంతం తప్పదని ప్రచారం చేసిన ఆ వ్యక్తి ఇప్పుడేమో మాట మార్చేశారు మరి!.. ఘనాకు చెందిన మత గురువు ఎబో(Eboh Noah) లెక్క తప్పింది. క్రిస్మస్ నాడే మహా జలప్రళయం మొదలుకాబోతోందని హెచ్చరికలు జారీ చేసిన ఇతగాడు.. ఇప్పుడు అబ్బే దేవుడు కొంతకాలం దానిని వాయిదా వేశాడంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న నోహా.. ఈ ప్రళయం పేరు చెప్పుకునే లెక్కలేనంత విరాళాలు సేకరించడం ఈ ఎపిసోడ్లో కొసమెరుపు. 30 ఏళ్ల ఎబో.. ఈ ఏడాది ఆగస్టులో ‘‘జరిగేది.. జరగక మానదు’’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ క్రిస్మస్ తేదీన ప్రపంచమంతా జోరు వాన మొదలవుతుందని.. అది మూడేళ్లపాటు ఆగకుండా కురిసి ప్రపంచం మునిగిపోతుందని, అయితే ఆ జల ప్రళయంలో మూడేళ్లపాటు తట్టుకోగలిగే పడవలను నిర్మించే బాధ్యత దేవుడు తనకు(నోహానని చెబుతూ) అప్పగించాడని అనుచరుల్ని నమ్మ బలికాడు. ఆ అనుచరులు ఆ ప్రచారం విస్తృతంగా జరపడంతో.. ఎబోకి ఎబో జీససగా, ఎబో నోహాగా పేరు దక్కింది. ఈ మాటలు నమ్మిన లక్షల మంది తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి డబ్బులు ఇచ్చారు. తీరా.. ఆ తారీఖు వచ్చేసరికి.. ఆ యుగాంతం వాయిదా పడిందని చెబుతున్నాడు. దేవుడు మానవాళికి ఇంకొంత సమయం ఇచ్చాడని.. అలాగే మరింత మందిని రక్షించేలా ఆర్క్ ప్రాజెక్టు(భారీ పడవల నిర్మాణం) విస్తరించాలని ఆదేశించాడని చెబుతున్నాడు. అయితే ఎబో డూమ్స్డే హెచ్చరికలపై పలువురు మండిపడుతున్నారు. బైబిల్ ప్రకారం.. ప్రళయం ఏనాడో వచ్చిందని, మరొకటి వచ్చే ప్రసక్తే లేదని.. మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని జనాలను మోసం చేయడం సరికాదని ఎబోకు హితవు పలుకుతున్నారు. ఇంకోవైపు.. జనాల నుంచి సేకరించిన సొమ్ముతో ఎబో విలాసాలు అనుభవిస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు. BIG UPDATE 🔴Ghanaian self styled prophet Eboh Noah said God would end the world in a new flood on December 25, 2025, urging followers to fund the construction of 8 arks. Many sold their belongings and handed over the money.He has now said the apocalypse has been postponed.… pic.twitter.com/2aX6F2FVN3— Open Source Intel (@Osint613) December 24, 2025Just after buying a new Benz pic.twitter.com/aIAq6IhDtk— Richy Rich (@richyrich) December 24, 2025 -
మునిగిన దుబాయ్.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక
-
ఉరుములు, మెరుపులతో దుబాయ్ ను వణికిస్తున్న భారీ వర్షం
-
దుబాయ్లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025 -
దుబాయ్లో దంచికొట్టిన వర్షం.. బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు (ఫొటోలు)
-
మొరాకోలో ఆకస్మిక వరదలు.. 37 మంది మృతి
కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి. పది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, నగర యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. దేశంలోని టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నష్టం సంభవించింది. -
జలదిగ్బంధంలో నెల్లూరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/విడవలూరు: దిత్వా తుపాను అల్పపీడనంగా మారి చెన్నైలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా.. దాని ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి నెల్లూరు నగరం అతలాకుతలమైంది. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిల వద్ద పెద్ద ఎత్తున నీరు చేరిపోయింది.విజయమహల్ గేట్ వద్ద ఉన్న బాక్స్టైపు బ్రిడ్జి మునిగిపోయింది. మాగుంటలేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద కారు నీటిలో చిక్కుకుంది. నగరంలోని తూర్పుప్రాంతాలైన బాలాజీనగర్, స్టోన్హౌస్పేట, హరనాథపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లోని కాలనీలను వరదనీరు చుట్టుముట్టింది. నెల్లూరులోని టెక్కేమిట్ట రోడ్డులోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలోకి నీరు చేరింది. నీట మునిగిన పొలాలు.. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పొలాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. 30 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాథమిక లెక్కల ప్రకారం 3011 (7527.5 ఎకరాలు) హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరినార్లు, నాట్లు 6,970 ఎకరాల్లో, శనగ 557.5 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 6,321 మంది రైతులు నష్టపోయారు. వరద నీరు చేరడంతో వెంకటాచలం, మనుబోలు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. నెల్లూరు అతలాకుతలమవుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదు. సహాయక చర్యలు చేపట్టడం లేదు. కూలిన పోలీస్ స్టేషన్ సీలింగ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు పోలీస్స్టేషన్లోని సీలింగ్ గురువారం వేకువజామున ఒక్కసారిగా కూలిపోయింది. సిబ్బంది వేరే గదిలో ఉండటంతో ప్రమాదం తప్పింది. ఫర్నీచర్, సీలింగ్కు ఉన్న ఫ్యాన్లు, లైట్లు పూర్తిగా «ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలాన్ని ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ పరిశీలించారు. ఈ స్మార్ట్ పోలీస్స్టేషన్ను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరి్మంచారు. నిర్మాణం చేపట్టిన ఏడేళ్లకే సీలింగ్ కూలిపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)
-
ఏపీలో కుండపోత వర్షం.. మునిగిన రహదారులు
-
#CycloneDitwah : తమిళనాడులో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో చెన్నై (ఫొటోలు)
-
తీవ్ర వాయుగుండంగా మారిన తుఫాన్
-
వాయువేగంతో ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను
-
తమిళనాడుకు దిత్వా పెనుప్రమాదం
-
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి రెడ్ అలర్ట్
-
దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. రెండు రోజులు భారీ వర్షాలు
-
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్
-
80 కిలోమీటర్ల దూరంలో ముంచుకొస్తున్న మృత్యువు
-
తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా
-
Heavy Rain: దక్షిణ కోస్తాలో అతిభారీ వర్షాలు పడే అవకాశం
-
AP: దూసుకొస్తున్న సెన్యార్ రెండు రోజుల్లో భారీ తుఫాన్
-
Big Shock: మరో తుఫాను రాబోతుంది!
-
దూసుకొస్తున్న మరో తుఫాను.. ఏపీకి హై అలర్ట్
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరంగల్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. అధికారుల కీలక హెచ్చరిక
-
ఏపీని వీడని మొంథా తుఫాన్
-
తెలంగాణను కుదిపేసిన మోంథా.. రోడ్లన్నీ జలమయం
-
అన్నదాతకు గుండె కోత
-
#CycloneMontha : వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం (ఫొటోలు)
-
ముంచేసిన మోంథా
సాక్షి, నెట్వర్క్: మోంథా తుపాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బుధవారం అనేక జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలాచోట్ల రహదారులు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. చెరువులు, కుంటలు తెగిపోగా... కాల్వలు, వాగులు ఉప్పొంగాయి. వరదనీరు పొలాలను ముంచేసింది. పంటలు నేలకొరిగాయి. కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. నాగర్కర్నూల్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని చాలాచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. 29 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతాల్లో 12 గంటల్లోనే 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. 105 ప్రాంతాల్లో ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో భారీ వర్షాలు నమోదు కావడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఏపీలోని నర్సాపురం వద్ద తీరం దాటిన మోంథా తీవ్ర తుపాను ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. బుధవారం సాయంత్రానికి మోంథా బలహీనపడి వాయుగుండంగా మారింది. గురువారం మధ్యాహ్నం కల్లా దీని ప్రభావం పూర్తిగా తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు... ⇒ ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ⇒ ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 82.90 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 110.87 సెంటీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 34 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. 5 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 20 జిల్లాల్లో అధికం, 8 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓరుగల్లు అతలాకుతలం ఉమ్మడి వరంగల్ జిల్లాను మోంథా తుపాను కుదిపేసింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు దంచికొట్టిన వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. కోతకొచ్చిన వరి పంట నేలరాలింది. ఇప్పటికే కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కల్లాల్లోనే తడిసింది. మిర్చి, మొక్కజొన, పత్తి రైతుల పరిస్థితి ఆగమాగమైంది. 30 శాతమే వరికోతలు పూర్తి కాగా, సుమారు 4.50 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధమయ్యాయి. పత్తి ఏరడానికి సిద్ధమైన తరుణంలోనే తుపాను రావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని సుమారు 71 కాలనీల్లో వరద నీరు చేరినట్లు సమాచారం. గురువారం కూడా తుపాను కొనసాగుతుందన్న వాతావరణశాఖ హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా> ఆరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. జలదిగ్బంధంలో ‘గ్రేటర్ వరంగల్’... భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. హనుమకొండ బస్టాండ్లోకి భారీగా వరద చేరి చెరువును తలపించింది. ఎస్ఆర్ నగర్, వివేకానందనగర్, సాయిగణేశ్కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, గిరిప్రసాద్నగర్, గాం«దీనగర్, మైసయ్యనగర్, భద్రకాళినగర్, పోతననగర్, రాజీవ్నగర్, సమ్మయ్యనగర్, వాజ్పేయి కాలనీ, విద్యానగర్, పోచమ్మకుంట, ఇంద్రానగర్, దీన్దయాళ్నగర్, కాజీపేట ప్రశాంత్నగర్, బ్యాంక్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రధాన నాలాలు పొంగిపొర్లాయి. హనుమకొండ, నయీంనగర్, కేయూ క్రాస్రోడ్డు, ములుగు క్రాస్రోడ్డు, హంటర్రోడ్డు, ఎన్జీవోస్ కాలనీ, అంబేడ్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావటంతో గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏజేన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రైల్వే స్టేషన్లు, రైలు పట్టాలపైకి వరద చేరడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్ల రాకపోకలను నిలిపి వేసింది. వరంగల్లో ఇంటర్సిటీ, ఈస్ట్కోస్ట్, మహబూబాబాద్లో కృష్ణ ఎక్స్ప్రెస్లను నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ మీదుగా వెళ్లే పలు రైళ్లు షాలిమార్, టాటా నగర్, షిరిడీ, కాకినాడ ఎక్స్ప్రెస్ను వయా కాజీపేట మీదుగా దారి మళ్లించి భాగ్యనగర్, శాతవాహనను కూడా రద్దు చేశారు. అంతటా అప్రమత్తం... జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నంబర్ 7981975495, టోల్ ఫ్రీ నంబర్ 1800–425–1115 ఏర్పాటు చేశాం. అధికారులు ఎవరూ జిల్లా కేంద్రాన్ని వదిలి వెళ్లరాదని, సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని ఆదేశాలు జారీచేశాం. – స్నేహ శబరీష్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రంగారెడ్డిలో పొంగుతున్న వాగులు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. తలకొండపల్లిలో అత్యధికంగా 11.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంట పొలాలు నీట మునిగాయి. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యం తడిపోయింది. పత్తి, వరి, కూరగాయలు, పూల తోటలకు తీరని నష్టం వాటిల్లింది. మూసీ, ఈసీ, కాగ్నా సహా పలు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం వీర్శెట్టిపల్లి గ్రామానికి చెందిన యువకులు కాగ్నా వాగులో కొట్టుకుపోతున్న యాలాల మండలం అగ్గనూరుకు చెందిన పెద్దింటి నర్సింలు అనే వ్యక్తిని కాపాడారు. అతడు కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో వర్ష బీభత్సం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో 21.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డుల్లోని ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. హుస్నాబాద్ పట్టణంలోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది. ఆర్టీసీ బస్టాండ్లోని ప్లాట్ఫాంల పైకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఖమ్మం జిల్లాను వణికించిన మోంథా మోంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంటలు నాశనమయ్యాయి. బోనకల్ మండలంలో 9.34 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పాలేరు, వైరా, లంకాసాగర్, కిన్నెరసాని రిజర్వాయర్లలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. కొణిజర్ల మండలం అంజనాపురం సమీపంలో నిమ్మవాగు బ్రిడ్జి పైనుంచి వెళ్లటానికి ప్రయతి్నంచిన డీసీఎం వరద నీటిలో కొట్టుకుపోయింది. డీసీఎంను నడిపిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోతీనగర్ కాలనీకి చెందిన ఆరేపల్లి మురళి (32) నీటిలో గల్లంతయ్యాడు. మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాల్లో రైల్వేట్రాక్పైకి వరద చేరడంతో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దుచేసి, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఖమ్మంలోని మున్నేటి వరద ఉధృతిని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం నిమ్మవాగులో కొట్టుకుపోతున్న డీసీఎం వాహనం నాగర్కర్నూల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో అత్యధికంగా 18.22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అచ్చంపేట, చారకొండ, ఊర్కొండ, తెలకపల్లి, బల్మూర్ మండలాల్లో 12 సెం.మీ. వర్షం కురిసింది. నల్లమలలోని ఉమామహేశ్వర దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట వాగులో కారు కొట్టుకుపోయింది. నాగర్కర్నూల్ కలెక్టరేట్లోకి వరద నీరు చేరింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని హజికన్పేటలో ఓ ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న చింతామణి అనే మహిళలను పోలీసులు కాపాడారు. మహబూబ్నగర్లో ఎర్రకుంట, కొత్తచెరువు ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. హైదరాబాద్–శ్రీశైలం హైవేపై రాకపోకలు నిలిపివేత నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి అలుగు ఉధృతంగా పారుతోంది. ప్రాజెక్టుకు కుడి భాగాన నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తీపూర్ గ్రామ శివారులో ఉన్న రెండో అలుగు దిగువన హైదరాబాద్ – శ్రీశైలం రహదారి బ్రిడ్జి వరద ధాటికి దెబ్బతింది. దీంతో ఈ మార్గం గుండా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్–శ్రీశైలం వైపు వెళ్లే వాహనాలను తెలకపల్లి– లింగాల– బల్మూర్– అచ్చంపేట మీదుగా దారి మళ్లించారు. చెట్టు కూలి వ్యక్తి మృతి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చెందిన కోట లక్ష్మీనారాయణ (45) చెట్టు కూలిపడి మరణించాడు. నూతనకల్ మండల పరిధిలోని తానంచర్ల గ్రామంలో మెడికల్షాపు నిర్వహిస్తున్న అతడు.. సొంత గ్రామంలోని పామాయిల్ తోటను చూసేందుకు బుధవారం వెళ్తుండగా చందుపట్ల గ్రామ శివాలో భారీ వృక్షం మొంథా తుపాన్ ధాటికి కూలి ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. కామారెడ్డి, నిజామాబాద్లో అప్రమత్తం కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. రైతులు కల్లాల్లోని ధాన్యం కుప్పలు తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా కుప్పలు చేసి బుధవారం రోజంతా టార్పాలిన్లు కప్పి ఉంచారు. ఇటు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లను నిలిపేశారు. వ్యవసాయ అధికారుల సూచనతో రైతులు పంట కోతలను కూడా ఆపేశారు. ఉమ్మడి కరీంనగర్లో పంటలకు తీవ్ర నష్టం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు వరి పంట నేలవాలింది. పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసిపోయింది. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్ పట్ణణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రామగుండం రీజన్లోని సింగరేణి ఓసీపీలో 1.5 లక్షల ఓబీ తవ్వకాలు, 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నక్కవాగు, బిక్కవాగు, గంజివాగు, మానేరు, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో 11 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీరును దిగువకు వదులుతున్నారు. నల్లగొండ జిల్లా అతలాకుతలం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి వద్ద గిరిజన బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాల వరద నీటిలో చిక్కుకుంది. దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇతర అధికారులు అక్కడికి చేరుకుని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని వరదనీరు చుట్టముట్టింది. తుంగతుర్తి మండలంలో సంగెం– వెంకేపల్లి – కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డులో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పెన్పహాడ్ మండలం గాజులమల్కాపురం, ధర్మాపురం గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్ల విరిగిపడి స్తంభాలు నేలకూలాయి. కోదాడ పట్టణంలో ఉలకవాగు అలుగుపోయడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రామాపురం ఊర చెరువుకు గండి పడి వరిపొలాలు నీట మునిగాయి. వర్షానికి వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గుండాల మండలం మాసాన్పల్లి, నారాయణపురంలో పలువురి ఇళ్లు కూలాయి. యాదాద్రి భువనగిరి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ పట్నం నుంచి తిరిగొచ్చిన విమానం హైదారాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం విశాఖపట్నం బయలుదేరి వాతావరణం అనుకూలించకపోవటంతో తిరిగి వచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రె 2885 విమానం బుధవారం ఉదయం 6.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తుపాను కారణంగా విశాఖపట్నం ఎయిర్పోర్టులో విమానం దిగేందుకు ప్రతికూల వాతావరణం ఉడడంతో దానిని తిరిగి హైదారాబాద్కు మళ్లించడంతో 9.57 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. విజయవాడకు బయలుదేరాల్సిన ఇండిగో 6ఈ 7201 విమానాన్ని కూడా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేసినట్లు ఎయిర్పోర్టు వర్గాలు తెలిపాయి. -
తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)
-
భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక
-
భయంకరంగా వైజాగ్ RK బీచ్..
-
ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
-
ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
తెలంగాణపై మోంథా.. స్కూల్స్ బంద్, రెడ్ అల్టర్
సాక్షి, హైదరాబాద్: మోంథా తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ పైనా కూడా తుపాను ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.తుపాను ప్రభావం ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని హెచ్చరించింది. మూడు జిల్లాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.VERY HEAVY RAINS ALERT - CYCLONE MONTHA PEAK IMPACT ⚠️ As Cyclone Montha moving inland, VERY HEAVY DOWNPOURS ahead in RED MARKED DISTRICTS with few places to get 80-180mm rains causing FLOODS in few places. STAY ALERT ⚠️🌧️BLUE MARKED districts will get MODERATE RAINS today… pic.twitter.com/vMGDKP2eqy— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబ్నగర్, వరంగల్, మహబూబాబాద్, నిజామాబాద్, హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తోంది.మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.DELUGE RAINS IN SOUTH TG ⚠️🌧️CYCLONE MONTHA CORE BANDS are just stuck and NON STOP HEAVY RAINS keep on pouring all over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Wanaparthy, Mahabubnagar, Rangareddy for NEXT SEVERAL HOURS ⚠️⚠️200mm event for Nagarkurnool ⚠️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 29, 2025 #29OCT 7:30AM⚠️CYCLONE MONCHA is moving slower than expected and is currently around KHAMMAM DistrictVERY HEAVY to HEAVY RAINS will continue over Nagarkurnool, Nalgonda, Suryapet, Khammam, Mahabubabad, Ranga Reddy, Vikarabad, and Sangareddy districts for the next 3 hours.… pic.twitter.com/TBEhgamFJp— Hyderabad Rains (@Hyderabadrains) October 29, 2025 -
కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు
-
ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)


