డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్‌, అప్లై చేసుకోండిలా.. | IBPS PO 2025 Notification Out For 5208 Posts, Check Out How To Apply Online Details Inside | Sakshi
Sakshi News home page

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్‌, అప్లై చేసుకోండిలా..

Jul 18 2025 6:49 AM | Updated on Jul 18 2025 9:38 AM

IBPS PO 2025 notification out for 5208 Posts How To Apply Check Details

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌(పీవో /ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఐబీపీఎస్‌లో 5,208 పీవో/ఎంటీ  పోస్టులు..  మొత్తం పోస్టుల సంఖ్య: 5,208.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 21.07.2025 నాటికి గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. 
»    వయసు: 01.07.2025 నాటికి 20 నుంచి 30 ఏళ్లు ఉండాలి. (02.07.1995 నుంచి 01.07.2005 మధ్య జన్మించినవారు అర్హులు). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920(బేసిక్‌ పే)+ఇతర అలవెన్సులుతో పాటు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:21.07.2025
»    ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్‌ 2025.
»    మెయిన్స్‌ పరీక్ష: అక్టోబర్‌ 2025.
»    ఇంటర్వ్యూ:డిసెంబర్‌ 2025  జనవరి 2026
»    వెబ్‌సైట్‌: https://www.ibps.in
 

ఎస్‌ఎస్‌సీలో 1,340 జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) 2025 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ శాఖ­ల్లో గ్రూప్‌–బి(నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌) జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్,మెకానికల్, ఎల క్ట్రికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 1,340.
»    అర్హత: సంబంధిత విభాగంలో(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌) డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయసు:01.01.2026 నాటికి 30 ఏళ్ల లోపు ఉండాలి. సీపీడబ్ల్యూడీకి చెందిన కొన్ని పోస్టులకు 32 ఏళ్ల లోపు ఉండాలి. 
»    పే స్కేల్‌: రూ.35,400 నుంచి రూ.1,12,400
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:21.07.2025
»    దరఖాస్తు ఫీజుకు చివరితేది: 22.07.2025.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 
01.08.2025 నుంచి 02.08.2025 వరకు
»    పేపర్‌–1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: 27.10.2025 నుంచి 31.10.2025 వరకు
»    పేపర్‌–2 పరీక్ష: జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మధ్యలో 
»    వెబ్‌సైట్‌: https://ssc.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement