ప్రధాన వార్తలు

పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
సాక్షి, అనకాపల్లి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ మరోసారి విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అయ్యన్న తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లిలోని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్పై విరుచుకుపడ్డారు. పోలీసు అధికారులు అని కూడా చూడా బూతులు తిట్టారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దొండపూడి గ్రామ దేవత పండగ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, స్పీకర్ వెళ్లే సమయంలో పక్కన ఎస్కార్ట్ లేకపోవడంతో ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్పీకర్ అయ్యన్న తీరుపై పోలీసు అధికారులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tamil Nadu: విజయ్కు ప్రత్యర్థిగా అజిత్? జయలలిత ఇదే కోరుకున్నారా?
చెన్నై: తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. 2026లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. తమిళ అగ్ర నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) పోటీ చేస్తుందని ప్రకటించిన దరిమిలా తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విజయ్ ప్రత్యర్థిగా భావిస్తున్న మరో తమిళ హీరో అజిత్ కుమార్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.అజిత్ రాజకీయ భవిష్యత్కు సంబంధించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మరణించాక అజిత్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. నాడు జయలలిత తన పార్టీ ఏఐడీఎంకేలోకి అజిత్ తన వారసునిగా రావాలని కోరుకుంటున్నారనే వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించి, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, అజిత్ ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఈ ఊహాగానాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత నాడు ఒక నటునిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఒక జర్నలిస్టు ముందు మాట్లాడిన మాటలు వైరల్గా మారాయి. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవే వాదనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే అజిత్ తనకు రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నట్లు ఏనాడూ ప్రకటించలేదు. కాగా జర్నలిస్టు, జయలలిత సన్నిహితుడు అయిన కాలచక్రం నరసింహ నాడు జయలలితతో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో ఈ చర్చను తిరగతోడుతోంది.ఆ వీడియోలో నరసింహ.. ‘ఆమె(జయలిత) తమిళ సినిమాకు చెందిన ఒక నటుడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అతని హుందా ప్రవర్తన, నిజాయితీ, ప్రజలతో కలిసిపోయే తీరు గురించి ప్రస్తావించారు. అయితే ఆ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియకపోయినా, తమ పార్టీలో చేరేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆమె చెప్పారు. వారసత్వం అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె అజిత్ పేరును నేరుగా పేర్కొన లేదు. అయితే అభిమానులు ఆ నటుడు అజయ్ అని స్పష్టంగా చెబుతుంటారు.ఈ అంశంపై అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. ఒక అభిమాని ‘అజిత్ సర్ 2029 లేదా 2030లో రాజకీయాల్లోకి వస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు.. నా మాటలు నిజం అవుతాయి’ అని పేర్కొనగా, మరొకరు, ‘రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఎవరికైనా ఇది నిజం అని అనిపిస్తుంది’ అని రాశారు. ఇంకొకరు ‘అతను ఏఐడీఎంకేను నడిపించేందుకు సరైన వ్యక్తి అయ్యేవాడు’ అని అభిప్రాయపడ్డారు. అయితే అజిత్ ఇప్పటివరకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అజిత్ నటనతో పాటు, తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్పై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు సినీరంగంలో ముడిపడి కనిపిస్తాయి. సిఎన్ అన్నాదురై నుండి ఎం.జి. రామచంద్రన్, జయలలిత వరకు.. అందరూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యమ్’ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.

పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్గా వచ్చే మంత్రి ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్తోపాటు ఇంకో అనుబంధ రూమ్ను కూడా మెయిన్టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామన్యుల నుంచి సెలబ్రేటిల వరకు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్స్టార్ విరాట్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలని ఆర్యవీర్ కలలు కంటున్నాడు. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్యవీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాలని తహతహలాడుతున్నాడు.17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్పటివరకు ఆడే అవకాశం అతడికి లభించలేదు. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనుండడంతో ఆర్యవీర్కు మిగితా మ్యాచ్ల్లో ఆర్యవీర్ భాగమయ్యే ఛాన్స్ ఉంది."ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాటర్. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ప్రతి ఒక్కరిని గౌరవించడం, అందరితో మర్యాదగా నడుచుకోవడం, కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యవీర్ పేర్కొన్నాడు.కాగా ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్ విగ్రహావిష్కరణ

అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు. రూ.931.83 కోట్ల ఆస్తులతో ఆయన అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాత స్థానాల్లో రూ.332.56 కోట్లతో అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండూ, రూ.51.93 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. కేవలం రూ.15 లక్షల ఆస్తులతో అత్యల్ప ఆస్తులున్న పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎంమమతా బెనర్జీ, ఆ తర్వాత స్థానంలో రూ.55 లక్షలతో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నారు.ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి రూ.30 కోట్లకు పైగా ఆస్తులతో ఏడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం రేఖాగుప్తా రూ.5.31 కోట్ల ఆస్తులతో 19వ స్థానంలో ఉన్నారు. 30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుదేశంలోని మొత్తం 30 రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.54.42 కోట్లు అని ఏడీఆర్ నివేదిక తెలిపింది. గత ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఏడీఆర్ సమీక్షించి ఈ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఒక సీఎం సగటు స్వీయ ఆదాయం రూ.13,34,738గా ఉంది. అలాగే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,632 కోట్లుగా ఉంది. అయితే, అరుణాచల్ప్రదేశ్ సీఎం ఖండూకు అత్యధికంగా రూ.180 కోట్లకు పైగా అప్పులున్నాయి. సిద్ధరామయ్యకు రూ. 23 కోట్లకు పైగా, చంద్రబాబుకు రూ.10 కోట్లకు పైగా రేవంత్రెడ్డికి రూ.1.30 కోట్ల అప్పులున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. క్రిమినల్ కేసుల్లో రేవంత్రెడ్డి టాప్ మరోవైపు.. అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి నిలిచారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. రేవంత్రెడ్డి తర్వాతి స్థానాల్లో 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్, 19 కేసులతో చంద్రబాబు ఉన్నారు. ఇక 12 మంది (40%) ముఖ్యమంత్రులు వారిపై క్రిమినల్ కేసులను ప్రకటించుకున్నారని, 10 మంది (33%) వారిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం సీఎంలలో ఇద్దరే మహిళలుఇదిలా ఉంటే.. 30 మంది ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ, ఢిల్లీకి చెందిన రేఖాగుప్తా ఇద్దరే మహిళలు ఉన్నారు. అలాగే, 30 మంది సీఎంలలో తొమ్మిది మంది గ్రాడ్యుయేట్లు, ఆరుగురు ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు, ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇద్దరు ముఖ్యమంత్రులు డాక్టరేట్ పట్టా పొందారు. అఫిడవిట్లు దాఖలు చేసే సమయానికి ఆరుగురు ముఖ్యమంత్రులు 71 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు్కలు కాగా.. 12 మంది సీఎంలు 51 నుంచి 60 ఏళ్ల మధ్య వారని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ లీలలను బయట పెట్టింది ఆ పార్టీకి చెందిన నేత కాబట్టే. అదీ ఎల్లో చానల్ వేదికగా. టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి సదరు మంత్రిపై చేసిన సంచలన ఆరోపణలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తూ ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి రాసలీలలు సాగిస్తున్నారంటూ ఓ ఎల్లో మీడియా చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టడంతో ‘ఇంతకూ ఆ మంత్రి ఎవరు అనగా..’ అంటూ సర్వత్రా చర్చ మొదలైంది. హైదరాబాద్లోనూ మంత్రి నీచపు పనులు ‘‘ఆ మంత్రి తరచూ తిరుపతికి వస్తారు. ఆయన వస్తే ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలోనే బస చేస్తారు. ఆయన పక్క గదినే ఓ మహిళకు కేటాయిస్తారు. ఆమె చెబితేనే మంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు కూడా ఆ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఆయన ఉన్నన్ని రోజులూ మహిళలతో రాసలీలలు సాగిస్తారు. ఆ మంత్రి గురించి టీడీపీలో అందరికీ తెలుసు. పేరు చెప్పను. ఆ మంత్రి తీరు చూస్తూ ఊరుకోలేక కడుపు మండి ఈ విషయాలు చెప్పాల్సి వస్తోంది’ అంటూ సుధాకర్రెడ్డి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి కూడా స్పందించారు. టీడీపీ అధికార ప్రతినిధి చెబుతున్న ఆ మంత్రి హైదరాబాద్లోని ఖరీదైన హోటళ్లలో నికృష్టపు చేష్టలు చేస్తుంటాడని విమర్శించారు. అతనే పవిత్ర ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోనూ రాసలీలలు సాగిస్తున్నాడని, పదవులు ఇప్పిస్తానని చెప్పి మహిళలను ప్రలోభ పెడుతున్నాడని ధ్వజమెత్తారు. ఈయన హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలోనూ ఎల్లో మీడియాలోనే కథనాలు వచ్చాయని గుర్తు చేశారు. అటువంటి మంత్రిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. మంత్రులే ఇలా బరితెగిస్తే, ఇక ఎమ్మెల్యేలు మరీ పేట్రేగిపోరా అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సన్నిహితులు పిలిచే పేరు డార్లింగ్ మంత్రి టీడీపీ అధికార ప్రతినిధి ఎన్బీ సుధాకర్రెడ్డి చెబుతున్న ఆ మంత్రిపై మరిన్నో ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మంత్రిగా ఉంటూ.. శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో ఆయన గడుపుతారట. సన్నిహితుల కోసం గదులు బుక్ చేస్తారట. తెలంగాణ, ఏపీకి చెందిన వారితో అక్కడే సెటిల్మెంట్లు చేస్తారట. ఫైళ్లపై సంతకాలూ అక్కడేనట. వారంలో మూడు రోజులు రాసలీలలు, గానా బజానాలతో కాలం గడుపుతారట. తెలంగాణాలో ఏపీ మంత్రి సెటిల్మెంట్ల వ్యవహారం శ్రుతిమించుతోందని అక్కడి ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ లేఖ కూడా రాసినట్లు గతంలో ఓ పచ్చపత్రిక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఆ మంత్రే ఇప్పుడు విజయవాడ, తిరుపతిల్లోనూ రాసలీలలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయన సొంత నియోజకవర్గానికి వారంలో ఒక రోజు మాత్రమే వెళతారట. అక్కడ మాత్రం బుద్దిమంతుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. బాపట్ల జిల్లాలో అనుచరుల ద్వారా మంత్రి పేకాట స్థావరాలూ నడిపిస్తున్నట్టు భారీ విమర్శలు ఉన్నాయి. ఈ మంత్రిని ఆయన అనుచరులు, సన్నిహితులు ‘డార్లింగ్ మంత్రి’ అని పిలుచుకుంటుండడం కొసమెరుపు.సీఎం గారూ మీ మంత్రిపై చర్యలు తీసుకోండి పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్, తిరుపతిల్లోని ఖరీదైన హోటళ్లలో వారితో రాసలీలలకు పాల్పడుతున్నమంత్రిపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే చంద్రబాబు ఎందుకు చోద్యం చూస్తున్నారు? టీడీపీ నేతే మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. ఈ మంత్రి హైదరాబాద్లో సాగించే ఘన కార్యాలపై గతంలో ఎల్లో మీడియా పత్రికలోనే కథనం ప్రచురితమైంది. – భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి. కూటమి నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బట్టబయలు » రాష్ట్రంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల రాసలీలలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ మహిళ బయటపెట్టి సంచలనం రేపింది. » ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్లో ఓ మహిళతో మాట్లాడుతూ ముద్దులు పెట్టిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. » శ్రీకాకుళం జిల్లా ఆమదాలవస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అదే జిల్లాకు చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయానికి రావాలని అనుచరుల ద్వారా ఒత్తిళ్లు చేయించడం వెలుగులోకి వచ్చింది. » పలు చోట్ల వివిధ పనుల కోసం వస్తున్న మహిళల బలహీనతలు, పేదరికాన్ని ఆసరాగా తీసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోబరుచుకునే యత్నాలు పలు జిల్లాల్లో వెలుగు చూస్తున్నాయి. రాత్రిళ్లు ఫోన్ చేయడం, ఒత్తిడికి గురి చేయడం ద్వారా లొంగదీసుకునే యత్నాలు దారుణమని ప్రజల్లో చర్చ జరుగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని, సీఎం చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రీసెంట్ టైంలో బెస్ట్ హాలీవుడ్ సినిమా.. 'ఎఫ్ 1' రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. కొన్ని మాత్రం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అలా రీసెంట్ టైంలో 'ఎఫ్ 1' అనే హలీవుడ్ మూవీ అద్భుతమైన అనుభూతి అందిస్తోంది. థియేటర్లలో ఉండగానే ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సన్నీ హేన్ (బ్రాడ్ పిట్) ఓ 'ఎఫ్ 1' రేసర్. కుర్రతనంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. కానీ ఓసారి రేసింగ్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. చావు వరకు వెళ్లి బతికి బయటపడతాడు. డాక్టర్స్ హెచ్చరించడంతో తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ని పక్కనబెట్టేస్తాడు. డబ్బుల కోసం చిన్న రేసుల్లో పాల్గొంటూ ఉంటాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత 'ఎఫ్ 1' రేసింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం వస్తుంది. వెళ్తాడు కూడా. ఇతడితో పాటే టీమ్లో మరో కుర్ర డ్రైవర్ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్) ఉంటాడు. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరు పడని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దశని దాటి సన్నీ.. ఎఫ్ 1 ఛాంపియన్ అయ్యాడా లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అసలు సినిమా అంటే ఎలా ఉండాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెబుతారు. కొందరు ఫైట్స్ కావాలంటారు. మరికొందరు రొమాన్స్ కోరుకుంటారు. కానీ చాలామంది మాత్రం సరైన కథ ఉండాలి, మనసుని తాకే ఎమోషన్స్ ఉండాలని అంటుంటారు. అలా అన్ని రకాల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ తీసిన చిత్రం 'ఎఫ్ 1'. సినిమా చూస్తున్నంతసేపు మీరు కూడా రేస్ ట్రాక్పైనే ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఓ మంచి మూవీ చూశామనే అనుభూతిని దక్కుతుంది.ఇది రెండున్నర గంటల సినిమా. కానీ మొదటి నిమిషం నుంచే ఏ మాత్రం బోర్ కొట్టకుండా, రేస్ ట్రాక్పై కారు దూసుకెళ్లినంత వేగంగా వెళ్తుంది. డబ్బుల కోసం ఓ రేసింగ్ పోటీలో సన్నీ పాల్గొని గెలిచే సీన్తో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రూబెన్ అనే పాత్ర ఎంటరవుతుంది. ఇతడు అప్పట్లో సన్నీకి ప్రత్యర్థి రేసర్. ఇప్పుడు మాత్రం ఓ రేసింగ్ జట్టుకు యజమాని. తన టీమ్ భారీ నష్టాల్లో ఉందని, డ్రైవర్గా రావాలని సన్నీని అడుగుతాడు. దీంతో ఎఫ్ 1 పోటీలో పాల్గొనేందుకు సన్నీ, లండన్ వెళ్తాడు. తొలి రేసులో పాల్గొంటాడు. కానీ తన టీమ్లోని కుర్ర డ్రైవర్ జోషువాతో రేసింగ్ ట్రాక్పైనే గొడవ పెట్టుకుంటాడు. అలా కలవడం కలవడంతోనే శత్రువుల్లా మారిన వీరిద్దరూ తర్వాత తర్వాత ఎలా ఫ్రెండ్స్ అయ్యారు. చివరకు ఒక్క రేసులోనైనా గెలిచారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.30 ఏళ్ల పాటు 'ఎఫ్ 1' రేసింగ్కి దూరంగా ఉన్న ఓ వ్యక్తి.. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఎలా విజేత అయ్యాడు అనే కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. ఈ లైన్ వినగానే తెలుగులో వచ్చిన 'జెర్సీ' గుర్తురావొచ్చు. అయితే నాని సినిమాలో బాధాకరమైన ముగింపు ఉంటుంది. ఇందులో మాత్రం హ్యాపీ ఎండింగే ఉంటుంది లెండి.'ఎఫ్ 1' రేసింగ్ అంటే ఏంటి? ఎలాంటి రూల్స్ ఉంటాయి? లాంటి వాటి గురించి మీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా సరే ఈ సినిమా చూడొచ్చు. చూస్తే చాలావరకు అర్థమైపోతుంది. టీవీల్లో రేసింగ్ చూసి ఎంజాయ్ చేస్తుంటాం. కానీ తెర వెనక ఏమేం జరుగుతుంటాయి? అనే అంశాల్ని కూడా ఇందులో చాలా చక్కగా చూపించారు. చూస్తున్నంతసేపు ఓ ప్రేక్షకుడిలా కాకుండా మీరు కూడా రేసర్ అయిపోయారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. మొదటి నుంచి చివరివరకు మిమ్మల్ని స్క్రీన్కి అతుక్కుపోయాలా చేస్తుంది.ఎవరెలా చేశారు?సన్నీగా చేసిన బ్రాడ్ పిట్.. సెటిల్డ్ యాక్టింగ్తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూశాక ఇతడికి ఫ్యాన్ అయిపోతారేమో? జోషువా క్యారెక్టర్ చేసిన డామ్సన్, బ్రాడ్ పిట్తో పోటీపడి మరీ నటించాడు. మిగిలిన యాక్టర్స్ అందరూ ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకున్నారు. టెక్నికల్ టీమ్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లింది. ఇంటర్వెల్, క్లైమాక్స్లో సైలెన్స్తోనూ వాహ్ అనిపించాడు. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవల్.ఓవరాల్గా చెప్పుకొంటే 'ఎఫ్ 1' మూవీ రీసెంట్ టైంలో వచ్చిన బెస్ట్ హాలీవుడ్ మూవీ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. త్వరలో ఉచితంగానూ స్ట్రీమింగ్ కావొచ్చు. ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అస్సలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనుపమ 'పరదా' సినిమా రివ్యూ)

యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. షెంజెన్ వీసా ధరలు పెరిగాయ్
షెంజెన్ వీసా (schengen visa) దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.2023 తర్వాత ధరలు పెరగడం ఇదే మొదటిసారి. పెద్దలకు బేస్ షెంజెన్ వీసా ఫీజు దాదాపు రూ. 8,000 - రూ. 10,000 వరకు ఉన్నప్పటికీ.. VFS అదనపు సర్వీస్ ఫీజును వసూలు చేస్తుంది. దీనివల్ల వల్ల మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఈ కొత్త సర్వీస్ ఫీజు దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. జర్మనీ ఇప్పుడు రూ.1933, స్విట్జర్లాండ్ రూ.2690, పోర్చుగల్ రూ.3111, ఫ్రాన్స్ రూ.2234, ఆస్ట్రియా రూ.2274 వసూలు చేస్తున్నాయి.కొరియర్ డెలివరీ, ఎస్ఎమ్ఎస్ అప్డేట్లు, ప్రీమియం లాంజ్ యాక్సెస్ వంటి సేవలకు అదనంగా చెల్లించడాన్ని కూడా దరఖాస్తుదారులు ఎంచుకోవచ్చు. దేశాన్ని బట్టి ఈ ఛార్జీలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం వీఎఫ్ఎస్ గ్లోబల్ స్విట్జర్లాండ్కు ఈ పెరుగుదలను ధృవీకరించింది. కానీ ఇతర దేశాలకు ఫీజులు మారాయా?, లేదా?.. అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.షెంజెన్ వీసా కలిగిన ప్రయాణికులు 180 రోజుల వ్యవధిలో 90 రోజుల వరకు 29 యూరోపియన్ దేశాలను సందర్శించడానికి అనుమతిస్తుంది. దీనికోసం దరఖాస్తుదారులు ట్రావెల్ ప్లాన్, ఇన్సూరెన్స్ వంటి వాటితోపాటు ఫైనాన్సియల్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..కరెన్సీ హెచ్చుతగ్గులు కూడా యూరప్ పర్యటనల ఖర్చు పెరగడానికి మరోకారణం అని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో రూపాయి బాగా బలహీనపడింది. 2015లో ఒక యూరో ధర రూ.72.12గా ఉంది. 2020లో ఇది రూ.84.64కి పెరిగింది. 2023 నాటికి రూ.89.20కు చేరింది. 2024లో దీని విలువ రూ. 90.55గా ఉంది. కాగా జూన్ 2025లో యూరో విలువ మొదటిదారిగా రూ. 100 దాటిపోయింది. ఇది భారతీయ సందర్శకులకు యూరోపియన్ ప్రయాణ ఖర్చును మరింత పెంచింది.

అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్మెంట్స్పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు.

ఇష్టానుసారం ఇచ్చేసి... ఇక్కట్ల పాల్జేసి..
సాక్షి, హైదరాబాద్: సాగుకాలం కరిగిపోతుండగా.. రైతులకు యూరియా వ్యథలు తప్పడం లేదు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కనిపించని దృశ్యాలు ఇప్పుడు పల్లెల్లో గోచరిస్తున్నాయి. యూరియా కోసం సూర్యోదయానికి ముందు నుంచే రైతులు వ్యవసాయ సహకార సొసైటీల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. నిలబడలేని రైతులు పట్టా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, చెప్పులు క్యూల్లో పెట్టి సొసైటీలు తెరిచి యూరియా ఇచ్చేంత వరకు ఎదురుచూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఒక్కో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తుంటే, కొన్ని జిల్లాల్లో ఎకరానికి ఒక బస్తా చొప్పున ఇస్తున్నారు. రాష్ట్రంలో జూన్ నుంచే ఖరీఫ్ సాగు మొదలు కాగా, జూలై నెలాఖరు నుంచి యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఈనెలలో అవి తీవ్రమై, ఎకరాకు ఒక బస్తా ఇచ్చినా చాలు అనే స్థితికి చేరుకుంది. యూరియా కష్టాలకు అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. యూరియా విక్రయాలపై జవాబుదారీతనం లేకుండా మొదట్లో ఇష్టానుసారం విక్రయించినందునే ఇప్పుడు కొరత ఏర్పడిందని కేంద్రం కూడా భావిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి అధికంగానే విక్రయించినప్పటికీ, కొరత రావడానికి ప్రధాన కారణం అధికారులు యూరియా అమ్మకాలపై దృష్టి పెట్టకపోవడమేనని తెలుస్తోంది. 7.28 ఎల్ఎంటీలు సరఫరా: కేంద్రం ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్రం కేటాయించిన యూరియాలో ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ)రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 5.38 ఎల్ఎంటీ మాత్రమే వచ్చినట్లు వ్యవసాయ శాఖ చెపుతోంది. అయితే కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ మాత్రం గత రబీలో మిగిలిన 1.92 ఎల్ఎంటీని కూడా కలుపుకొని ఇప్పటివరకు 7.28 ఎల్ఎంటీ సరఫరా చేశామని చెబుతోంది. ఇందులో ప్రస్తుతం మార్క్ఫెడ్, సొసైటీలు, ప్రైవేటు డీలర్లు, గోదాములన్నింటా కలుపుకొని అందుబాటులో ఉన్న యూరియా కేవలం 41వేల మెట్రిక్ టన్నులు. అంటే ఈ సీజన్లో ఇప్పటివరకు 6.87 ఎల్ఎంటీల విక్రయాలు జరిగాయి. ఇదే గత ఏడాది ఇదే సమయంలో 6.10 ఎల్ఎంటీ అమ్మకాలే జరిగినట్లు కేంద్రం చెబుతోంది. దీన్ని బట్టి గత సంవత్సరం కన్నా 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా విక్రయించారు. అంటే గత సీజన్తో పోలిస్తే యూరియా విక్రయాలు ఎక్కువ జరిగినప్పటికీ, కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. గత సంవత్సరం ఖరీఫ్తో పోలి్చనా, ఈసారి యూరియా విక్రయాలు అధికంగానే జరిగినట్లు చెబుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, బ్లాక్ మార్కెటింగ్ వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైనట్లు చెబుతోంది. పెద్ద రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం, వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్కు తరలించడం కూడా యూరియా రాద్ధాంతానికి కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరెవరికి ఎంత విక్రయించారు? రాష్ట్రంలో ఖరీఫ్ కోసం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా కేంద్రం యూరియా కోటా పంపిస్తుంది. మార్క్ఫెడ్ ద్వారా, ప్రైవేటు డీలర్ల ద్వారా (50:50 ప్రాతిపదికన) జరిగే విక్రయాలను పర్యవేక్షించకుండా వ్యవసాయ శాఖ గాలికి వదిలేసింది. కేంద్రం నుంచి వచ్చిన యూరియాను రాష్ట్రంలోని 14 వేల మంది డీలర్లు మే నెలాఖరు నుంచే విక్రయిస్తారు. ఇక సొసైటీలు, ఇతర వ్యవసాయ సేవా కేంద్రాల ద్వారా జూన్ నుంచి విక్రయిస్తారు. అయితే ఈ విక్రయాలపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఏ సొసైటీలో ఏ రైతుకు ఎంత యూరియా విక్రయించారనే లెక్కలు కేవలం 10 రోజుల వరకే ఉంటాయి. తరువాత మళ్లీ రైతులు వెళ్లి యూరియా తీసుకోవచ్చు. ఇక ప్రైవేటు డీలర్లు జరిపే యూరియా విక్రయాలపై ఎలాంటి నిఘా లేదు. లెక్కలూ లేవు. రూ. 270 చొప్పున విక్రయించాల్సిన యూరియాను రూ.400 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సమయంలో వ్యవసాయేతర అవసరాలకూ యూరియాను డీలర్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రంగుల కంపెనీలు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం తయారీ పరిశ్రమలతోపాటు గుడుంబా, కోళ్లు, పశువుల దాణా, చేపలు, రొయ్యల చెరువుల్లో సైతం యూరియాను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు కూడా రాష్ట్రంలోని ప్రైవేటు డీలర్ల నుంచి అధిక ధరలకు యూరియాను పెద్దఎత్తున కొనుగోలు చేసి తీసుకెళ్తారని మార్క్ఫెడ్కు చెందిన ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఒక్కో రైతుకు రేషన్ విధానంలో ఎకరాకు ఒక బస్తా చొప్పున ఇస్తున్నట్లుగా ఖరీఫ్ ఆరంభం నుంచే అమలు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నిపుణులు అంటున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం కూడా... రాష్ట్రంలో యూరియా అధిక వినియోగానికి చెపుతున్న కారణాల్లో ఒకటి ఈసారి ఖరీఫ్ సీజన్ సాధారణం కన్నా ముందే రావడమైతే, రెండోది పంట సాగు విస్తీర్ణం గతం కన్నా గణనీయంగా పెరగడం. గత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు మూడో వారానికి 91.21 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈసారి 118 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో వరి విస్తీర్ణమే గత ఖరీఫ్ కన్నా 23 లక్షల ఎకరాలు ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఈ సమయానికి 31.60 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 54.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక పత్తి 42 లక్షల ఎకరాల నుంచి 45 లక్షలకు పెరిగింది. మొక్కజొన్న గత ఖరీఫ్లో 4.55 లక్షల ఎకరాలు సాగైతే ఈసారి 6.48 లక్షల ఎకరాలు సాగైంది. యూరియా అధికంగా వినియోగించే ఈ మూడు పంటల సాగు విస్తీర్ణం పెరగడం వల్ల కూడా కొరత ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలకు అనుగుణంగా సరఫరా... ఖరీఫ్, రబీ మొదలు కావడానికి ముందే... వ్యవసాయ శాఖ ఆయా సీజన్లకు అవసరమైన ఎరువుల ప్రణాళిక రూపొందిస్తుంది. ఆ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖకు నివేదిక పంపిస్తే, రాష్ట్రాల వారీగా కోటాను విడుదల చేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు 9.80 ఎల్ఎంటీల కోటాకు కేంద్రం ఆమోదం తెలిపింది. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తోంది. దాని ప్రకారం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి నెలా 1.60 ఎల్ఎంటీకి తగ్గకుండా పంపించాలి. ఈ మేరకు దేశంలోని ఎరువుల కంపెనీలకు కోటా విడుదల చేస్తే ఆయా కంపెనీల ద్వారా 50 శాతం కోటాను రైల్వే రేక్ పాయింట్ల ద్వారా మార్క్ఫెడ్కు, మరో 50 శాతం కోటా ప్రైవేటు డీలర్లకు పంపిస్తారు. ఈ లెక్కన ఇప్పటివరకు కేంద్రం పంపిన 5.18 ఎల్ఎంటీ యూరియాలో సగం అంటే 2.59 ఎల్ఎంటీ ప్రైవేటు డీలర్లకు వెళ్లింది. గత రబీకి సంబంధించిన ఓపెనింగ్ స్టాక్తో కలిపితే మొత్తం 3.61 ఎల్ఎంటీలు రాష్ట్రంలోని 14వేల ప్రైవేటు డీలర్లకు చేరింది. అయితే ప్రస్తుతం 18వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వారి వద్ద ఉంది. అంటే 3.43 ఎల్ఎంటీలు విక్రయించారు. కానీ ఎవరికి ఎంత మేర విక్రయించారనే లెక్కలు వ్యవసాయ శాఖ దగ్గర లేకపోవడం గమనార్హం. భారీగా పెరిగిన వాడకం రాష్ట్రంలో యూరియా వినియోగం శాస్త్రవేత్తలు సూచిస్తున్న మోతాదుకన్నా రెండింతలు అధికంగా వినియోగిస్తున్నారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి ఎకరాకు పంట కాలంలో 120 కిలోలు వినియోగిస్తే సరిపోతుంది. కానీ ఎకరాకు ఒకటిన్నర బస్తాల చొప్పున (బస్తా 45 కిలోలు) మూడు సార్లు వినియోగిస్తున్నారు. అలాగే మొక్కజొన్న, పత్తి పంటలకు కూడా మోతాదుకు మించి వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వరికోసం నాట్లు పడిన 10 నుంచి 15 రోజులకు ఎకరాకు బస్తా నుంచి రెండు బస్తాల చొప్పున యూరియాను కాంప్లెక్స్ ఎరువుతో కలిపి వినియోగిస్తుంటారు. ఆ తరువాత పొట్ట దశలో 45 రోజులకు, మరోసారి రెండు బస్తాల చొప్పున, మూడోదఫా 90 రోజుల్లో మరోసారి బస్తా చొప్పున వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు పంట కాలంలో కొన్ని జిల్లాల్లో మూడుసార్లు యూరియాను వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎకరాకు ఒక్కోసారి రెండు బస్తాల చొప్పున వినియోగిస్తారు. పత్తి పంట కోసం కూడా ఎకరాకు ఒకటిన్నర బస్తాలకు తగ్గకుండా వినియోగించడంతో ఖరీఫ్లో యూరియా డిమాండ్ పెరుగుతోంది. అదే యాసంగి (రబీ) సీజన్లో పత్తి లేకపోవడంతో డిమాండ్ అంతగా లేదని అధికారులు అంటున్నారు.
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
గణపయ్యకు టెక్నో హారం!
షూటింగ్లో తీవ్ర విషాదం.. అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్: తొలి చైనా కంపెనీగా వివో
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
షాకింగ్.. ఆసియాకప్ ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని భారత్-పాక్
Tamil Nadu: విజయ్కు ప్రత్యర్థిగా అజిత్? జయలలిత ఇదే కోరుకున్నారా?
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
సాక్షి కార్టూన్ 23-08-2025
'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
చైనా మార్కెట్లలో భారత్కు స్వాగతం
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
‘గాజా సాయం’ పేరుతో నిధుల సేకరణ.. గుజరాత్లో సిరియన్ అరెస్ట్
గణపయ్యకు టెక్నో హారం!
షూటింగ్లో తీవ్ర విషాదం.. అసిస్టెంట్ డైరెక్టర్ కన్నుమూత
వినుకొండలో బరి తెగించిన టీడీపీ గూండాలు
పోలీసులను బూతులు తిడుతూ.. రెచ్చిపోయిన స్పీకర్ అయ్యన్న
మిక్స్డ్ రియల్టీ హెడ్సెట్: తొలి చైనా కంపెనీగా వివో
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
షాకింగ్.. ఆసియాకప్ ఫైనల్లో ఒక్కసారి కూడా తలపడని భారత్-పాక్
Tamil Nadu: విజయ్కు ప్రత్యర్థిగా అజిత్? జయలలిత ఇదే కోరుకున్నారా?
దెందులూరులో పచ్చ కుట్రలు.. వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్
సంవత్సరం తిరిగే సరికి బంగారం ధర..
యుద్ధాల విషయంలో స్వర్గప్రాప్తి ఏమోగానీ సుంకాల వేసినందుకు మాత్రం కచ్చితంగా నరకానికే పోతారేమోననిపిస్తుంది సార్!
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి
స్టార్ హీరోయిన్ కూతురు ఎంట్రీ.. ఘట్టమనేని జయకృష్ణతో ఫస్ట్ సినిమా!
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు
నా కూతురి ఆరోగ్యం కోసం రోజూ ఈ ఫుడ్ తప్పనిసరి: ఉపాసన
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
సాక్షి కార్టూన్ 23-08-2025
'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
చైనా మార్కెట్లలో భారత్కు స్వాగతం
బంగారం శుభవార్త.. వెండి భారీ మోత.. ఏకంగా రూ.వేలల్లో
ఒంటరి బతుకు.. నాకేమైనా అయితే ఎవరూ రారు.. నటి ఎమోషనల్
పెళ్లైన కుమార్తెకు తల్లి ఆస్తిలో వాటా ఉంటుందా?
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
వందలకోట్ల వరకట్నం.. నేను గర్భంతో ఉండగా..: హీరో భార్య
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ
అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
సినిమా

20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు
సాధారణంగా హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఒకవేళ అలా చేస్తే ఎక్కడ తమ కెరీర్ డ్యామేజ్ అవుతుందోనని కంగారుపడుతుంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు అలా ఓ నటి.. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు ఏడాది తిరిగేలోపు ఓ అమ్మాయికి తల్లి కూడా అయిపోయింది. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఎవరా నటి?(ఇదీ చదవండి: కొత్త కారు కొన్న తెలుగు నటుడు.. రేటు ఎంతో తెలుసా?)ఓటీటీ ప్రియులకు 'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఎల్ అలియాస్ ఎలెవన్ అనే లీడ్ రోల్ చేసిన మిల్లీ బాబీ బ్రౌన్.. పలు సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఐదో సీజన్ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.సరే ఈ విషయాలన్నీ పక్కనబెడితే మిల్లీ గత కొన్నాళ్లుగా జేక్ బొంగియోవి అనే యువకుడితో డేటింగ్ చేసింది. గతేడాది అక్టోబరులో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. వివాహం జరిగేటప్పటికి మిల్లీ వయసు 20 ఏళ్లు. దీంతో చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది అని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏడాది లోపే ఓ పాపకు తల్లి కూడా అయినట్లు స్వయంగా మిల్లీనే ప్రకటించింది. అయితే పాపని దత్తత తీసుకున్నామని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Millie Bobby Brown (@milliebobbybrown)

ఆ సీన్ కోసం 28 టేకులు.. ఇప్పటికీ మర్చిపోలేను: విద్యాబాలన్
'పరిణీత' చిత్రంతో విద్యాబాలన్ (Vidya Balan) కెరీర్ మొదలైంది. ఈ సినిమా 2005 జూన్ 10న విడుదలైంది. శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన పరిణీత (1914) అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రదీప్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతోంది. ఆగస్టు 29న మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.ఇంత పరిచయమా? నాకు తెలీదుఈ సందర్భంగా విద్యాబాలన్ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది. నాకు బాగా గుర్తు.. సైఫ్ అలీ ఖాన్ తల్లి, బాలీవుడ్ స్టార్ షర్మిల ఠాగూర్ (Sharmila Tagore) ఓరోజు సెట్కు వచ్చింది. తనను చూసేందుకు నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆవిడంటే నాకెంతో ఇష్టం. మామధ్య ఎంతో అనుబంధం ఉందన్నట్లుగా ఒకరినొకరం పలకరించుకున్నాం. అది చూసిన సైఫ్.. ఓహ్, మీ ఇద్దరికీ ఇంత పరిచయముందని నాకింతవరకు తెలీదు అని సరదాగా జోక్ చేశాడు. ఎప్పుడు గుర్తు చేసుకున్నా..వెంటనే నేను నాకు ఆమె తెలుసు.. కానీ తనకు నేను తెలియదని బదులిచ్చాను. సైఫ్ సరదాగా ఉంటూ ఎప్పుడూ నవ్విస్తుంటాడు. ఆ సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్నా నవ్వొస్తుంటుంది. దాదా(ప్రదీప్ సర్కార్) వల్లే నటనలో మెళకువలు నేర్చుకున్నాను. ప్రతి చిన్నవిషయాన్ని కూడా గుర్తించి సీన్ మళ్లీ చేయిస్తాడు. అవసరమైతే వంద టేకులైనా తీసుకుంటాడు.కన్నీటి చుక్క సరిగ్గా రావాలని..కేవలం మా పర్ఫామెన్స్ కోసమే కాదు, వెనకాల పావురాలు ఎగిరే క్షణాలు కూడా సరిగ్గా రావాలనుకుంటాడు. అన్నీ సరిగ్గా కుదరాలని భావిస్తాడు. ఒక పాటలో నేను ఏడవాల్సి ఉంటుంది. ఆ పాటలోని ఓ లైన్ దగ్గర నా కన్నీటిచుక్క కిందపడాలి. దీని కోసం 28 టేకులు తీసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రదీప్ సర్కార్.. అనారోగ్యంతో 2023లో కన్నుమూశారు.

రెండు బ్రేకప్స్.. మగవాడి తోడు అవసరం లేదు: హీరోయిన్
గతంలో రెండు బ్రేకప్స్ జరిగాయంటోంది బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా (Daisy Shah). అందులో తనను బాగా ఇబ్బంది పెట్టిన రిలేషన్షిప్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఓ అబ్బాయితో చాలా ఏళ్లు రిలేషన్లో ఉన్నాను. మొదటి నాలుగేళ్ల సమయంలో అసలు పెళ్లి ఆలోచనే రాలేదు. తర్వాత నాకు ఆ ఆలోచనే రాకుండా చేశాడు. ఏడో సంవత్సరంలో ఉండగా.. నేను సంతోషంగా లేనన్న విషయాన్ని గ్రహించి బ్రేకప్ చెప్పాను. రెండో రిలేషన్లో పరిస్థితి మరీ దారుణం. నేనెక్కడికి వెళ్తున్నా?.. అబ్బాయిలతో కలిసి పని చేస్తున్నానా? ఇలా ప్రతీది గుచ్చిగుచ్చి అడిగేవాడు. ఇక్కడ ఆశ్చర్యకర విషయమేంటంటే.. అతడు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నాడు. ఒకసారి మేమిద్దరం పార్టీలో ఉన్నాం. ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నాం. ఇంతలో ఒకరు నా వెనక నుంచి వచ్చి చేయి పట్టుకుని లాగి తనతో డ్యాన్స్ చేయమని అడిగాడు.నా తప్పేముంది?అందులో తప్పేముంది? దానికి నాపై కోప్పడాల్సిన అవసరం లేదుకదా! కానీ అతడు మాత్రం వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తూ తనను అర్థం చేసుకోమన్నాడు. అతడి పద్ధతి నాకు చిరాకు తెప్పించేది. నన్నెప్పుడూ కంట్రోల్ చేయాలని చూసేవాడు. దానివల్ల మరింత ఫ్రస్టేట్ అయ్యేదాన్ని. బలమైన అమ్మాయిలను చూసి మగవాళ్లు అస్సలు ఓర్వలేరు. అలాంటివాళ్లను చాలామందిని చూశాను. ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకోవాలన్న ఆసక్తి లేదు. పైగా నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నా పోషణ కోసం ఒక మగవాడి తోడు అవసరం లేదు. అయితే నా స్నేహితురాలి సలహాతో అండాలు భద్రపరిచాను అని చెప్పుకొచ్చింది.కెరీర్డైసీ షా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కెరీర్ మొదలుపెట్టింది. భద్ర అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా మారింది. సల్మాన్ ఖాన్తో చేసిన 'జై హో' మూవీతో మంచి గుర్తింపు అందుకుంది. ఈమె చివరగా మిస్టరీ ఆఫ్ ద టాటూ మూవీ చేసింది. గతేడాది వచ్చిన రెడ్ రూమ్ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. మరో రెండు రోజుల్లో (ఆగస్టు 25న) డైసీ షా 41వ వయసులోకి అడుగుపెట్టనుంది.చదవండి: బతికుండగానే చంపుతారా? సిగ్గు లేదు!: నటుడి ఆగ్రహం

తమన్, కార్తీక్ల మంచి మనసు.. అంధుడి కంటిచూపుకి హామీ!
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S Thaman) తనది మంచి మనసు అని మరోసారి నిరూపించుకున్నాడు. కళ్లు లేని వ్యక్తికి చూపు ప్రసాదిస్తానని మాటిచ్చాడు. ఇతడు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగింగ్ కాంపిటీషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ రాబోతోంది. ఆగస్టు 29న ఈ షో ప్రారంభం కానుంది. ఇందులో తమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరిస్తుండగా సింగర్స్ శ్రీరామచంద్ర, సమీరా యాంకరింగ్ చేయనున్నారు.టాలెంట్కు ఫిదాఈ మేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఆడిషన్స్ నిర్వహించారు. వారిలో ఓ అంధుడు కూడా ఉన్నాడు. అతడి టాలెంట్కు జడ్జిలు ఫిదా అయ్యారు. చిన్నప్పటి నుంచే కంటిచూపు లేదా? అని తమన్ అడగ్గా.. పుట్టినప్పటినుంచే గుడ్డివాడిని అని తెలిపాడు. అందుకు తమన్.. నేను, కార్తీక్ కలిసి నీకు కళ్లు కనిపించేలా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ మాటకు అంధుడు ఎంతగానో సంతోషించాడు. కళ్లు లేని వ్యక్తికి ఆపరేషన్ ద్వారా చూపు ప్రసాదించేందుకు ముందుకు వచ్చిన తమన్, కార్తీక్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఓటీటీలో 'కుబేర' విలన్ మూవీ.. ఎక్కడంటే?
న్యూస్ పాడ్కాస్ట్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం... చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ పేరిట ప్రతిఏటా 350 కోట్ల రూపాయల ప్రజాధనానికి టెండర్... కుప్పంలో ప్రారంభమైన పైలెట్ ప్రాజెక్టు

పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన

నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం
క్రీడలు

మెరిసిన రాఘ్వి, షఫాలీ
బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్ హస్నబిస్ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. సియానా జింజర్ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... నికోల్ ఫాల్టుమ్ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్), టిటాస్ సాధు (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

సెలక్షన్ కమిటీలో మార్పులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ సీనియర్ సెలక్షన్ కమిటీలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది. అజిత్ అగార్కర్ చైర్మన్గా ఉన్న ఈ బృందంలో ఐదు జోన్ల నుంచి ఐదుగురు సెలక్టర్లు ఉన్నారు. టీమిండియా సెలక్టర్ పదవి కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులు కోరింది. చీఫ్ సెలక్టర్ అగార్కర్ కాంట్రాక్ట్ 2026 టి20 వరల్డ్ కప్ వరకు ఉండగా, అజయ్ రాత్రా గత అక్టోబర్లోనే ఇందులోకి వచ్చాడు. కాబట్టి మిగిలిన ముగ్గురు శివ్సుందర్ దాస్ (సెంట్రల్ జోన్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), ఎస్. శరత్ (సౌత్జోన్)లలో ఇద్దరు తప్పుకోనున్నారు. వీరిలో ఏ ఇద్దరు అనేది స్పష్టంగా తెలియికపోయినా... ఎస్.శరత్ను గతంలో అతను సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుత జూనియర్ కమిటీ చైర్మన్ తిలక్ నాయుడు పనితీరుపై బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సీనియర్ కమిటీ నుంచి శరత్ తప్పుకుంటే సౌత్జోన్ నుంచి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్, హైదరాబాద్కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తిగా ఉన్నాడు. సెంట్రల్ జోన్ కోటాలో సెలక్టర్ పదవిని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా ఆశిస్తున్నాడు. సెలక్టర్ ఎంపిక కోసం సెపె్టంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలంటూ బోర్డు గడువు విధించింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల క్రితం రిటైర్ అయినవాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలి. కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు...లేదంటే 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి. మరోవైపు సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీలో కూడా మార్పులు ఖాయమయ్యాయి. వన్డే వరల్డ్ కప్కు జట్టును ఎంపిక చేయడంతో ఈ కమిటీ పదవీకాలం ముగిసింది. నలుగురు సభ్యుల ఈ బృందంలో నీతూ డేవిడ్, ఆర్తి వైద్య, రేణు మార్గరెట్ తప్పుకోవడం ఖాయం కాగా... రెండేళ్ల క్రితమే కమిటీలోకి వచ్చిన శ్యామ షా మాత్రం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

చాంపియన్ హరియాణా
జలంధర్: జాతీయ జూనియర్ పురుషుల హాకీ చాంపియన్షిప్లో హరియాణా జట్టు విజేతగా నిలిచింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో హరియాణా 3–2తో ఒడిశా జట్టుపై గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు అదేపనిగా ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులు చేసినప్పటికీ ఏ జట్టుకు ఫలితం దక్కలేదు. కానీ రెండో క్వార్టర్ మొదలవగానే ఒడిశా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకొని 2 నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసింది. దీపక్ ప్రధాన్ (17వ ని.), ప్రతాప్ టొప్పొ (19వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచారు. దీంతో ఒడిశా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. కానీ ఆఖరి క్వార్టర్ మ్యాచ్ ఫలితాన్నే తారుమారు చేసింది. హరియాణా ఆటగాళ్లు చిరాగ్ (50వ ని.), మరుసటి నిమిషంలోనే నితిన్ (51వ, 60వ ని.) స్కోరును 2–2తో సమం చేశారు. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠరేకిత్తించగా ఆఖరి నిమిషంలో నితిన్ గోల్ చేసి హరియాణాను విజేతగా నిలిపాడు. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పంజాబ్ 4–3తో షూటౌట్లో ఉత్తర ప్రదేశ్పై విజయం సాధించింది.

ప్రజ్ఞానందకు మరో ‘డ్రా’
సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్ఫీల్డ్ కప్ గ్రాండ్ చెస్ టూర్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శనివారం మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్ను ప్రజ్ఞానంద 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీలో ప్రజ్ఞానందకు ఇది వరుసగా నాలుగో ‘డ్రా’. ఇక ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్... జాన్ క్రిస్టాఫ్ డూడా (పోలాండ్)తో గేమ్ను 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. సామ్ సెవియాన్ (అమెరికా), నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)... అరోనియన్ (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) మధ్య మ్యాచ్లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. మొత్తంగా శనివారం జరిగిన అన్నీ మ్యాచ్లు ‘డ్రా’గానే ముగిశాయి. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఫాబియానో కరువానా (అమెరికా) 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, అరోనియన్ చెరో 3 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. గుకేశ్, మాక్సిమి లాగ్రెవ్, వెస్లీ సో, అలిరెజా 2.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. గ్రాండ్ చెస్ టూర్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ప్లేయర్లు ఫైనల్లో తలపడతారు.
బిజినెస్

మోసాలపై ఫండ్స్ కన్నేసి ఉంచాలి
ముంబై: మార్కెట్ పరమైన రిస్క్లే కాకుండా మోసపూరిత ఉపసంహరణల పట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు. అలాంటి చర్యలను అడ్డుకోకపోతే ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. ఫండ్స్ సంస్థలు సదా నిఘా వేసి ఉంచాలని, నేరస్థులు మరింత అధునాతనంగా మారుతున్నందున మోసాలను గుర్తించి, వేగంగా స్పందించాలని కోరారు. బ్లూచిప్ కంపెనీలకు వెలుపల వైవిధ్యం కోసమని సూక్ష్మ కంపెనీలు, డెట్ పత్రాల్లో ఇన్వెస్ట్ చేసే ముందు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తమ పాలనను కొనసాగిస్తూనే బాధ్యాతయుతమైన వృద్ధిపై ఫండ్స్ సంస్థలు దృష్టి సారించాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు అమర్జీత్ సింగ్ ఈ సందర్భంగా సూచించారు. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ తదితర ఉత్పత్తుల సాయంతో ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచుకోవచ్చన్నారు. ఫండ్స్ పరిశ్రమలో స్వీయ నియంత్రణ కూడా ముఖ్యమన్నారు. తీవ్రమైన పోటీ పరిస్థితుల్లో నిర్వహణ ఆస్తులను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కొద్దని హితవు పలికారు.

రిటైల్ రంగం రికార్డు రన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, దేశీ మార్కెట్ ఆసరాగా నిలుస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో భారత రిటైల్ రంగం దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి ఏటా 10 శాతం వృద్ధితో 1.93 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. 2024లో ఇది 1.06 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. డెలాయిట్–ఫిక్కీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా డిజిటల్ వినియోగం, ప్రీమియమీకరణ, వివిధ మార్కెట్లవ్యాప్తంగా ఈ–కామర్స్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇలా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రిటైల్ రంగంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుండటం వల్ల దేశీయంగా డిమాండ్ స్థిరంగా కొనసాగుతుండటంతో పాటు, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరించేందుకు బ్రాండ్లలో కూడా ధీమా పెరుగుతోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ), టారిఫ్లపరమైన సర్దుబాట్ల వల్ల ఎగుమతి మార్కెట్లలో భారత్ మరింత మెరుగ్గా పోటీపడే అవకాశాలు దక్కుతున్నాయి. వాణిజ్య అవరోధాలు పెద్దగా లేకుండా, వ్యయాల భారం తక్కువగా ఉండే కొత్త మార్కెట్లకు మేడిన్ ఇండియా ఉత్పత్తులు చేరుకుంటున్నాయి. ‘మధ్యతరగతి ప్రజలు, డిజిటల్ అవగాహన కలిగిన యువ జనాభా, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో ఆర్థిక సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఈ–కామర్స్ లావాదేవీల్లో ఇప్పుడు వీటి వాటా 60 శాతం పైగా ఉంటోంది. ఈ అంశాల దన్నుతో భారత వినియోగదారుల వ్యవస్థ ఒక విశిష్టమైన దశాబ్దంలోకి అడుగుపెడుతోంది‘ అని డెలాయిట్ సౌత్ ఏషియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు .. → మారుతున్న వినియోగదారుల అలవాట్లు, ప్రాంతీయ పరిస్థితులను ముందుగా అంచనా వేసి, తదనుగుణంగా ఎఫ్ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తులు), రిటైల్, ఈ–కామర్స్ సంస్థలు స్పందించడంపై తదుపరి వృద్ధి ఆధారపడి ఉంటుంది. → దూరదృష్టి, నిర్ణయాత్మకమైన చర్యలతో 2030 నాటికి భారత రిటైల్ మార్కెట్ దాదాపు రెట్టింపు స్థాయి అయిన 1.9 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. అదే సమయంలో వినియోగ రంగంలో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరతకు సంబంధించి అంతర్జాతీయంగా సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుంది. → ప్రస్తుతం కొనుగోళ్లకు సంబంధించి 73 శాతం నిర్ణయాలను ఆన్లైన్ మార్కెట్ప్లేస్లు ప్రభావితం చేస్తున్నాయి. యూట్యూబ్ రివ్యూలు 40 శాతం, తెలిసినవారిచ్చే సలహాలు 51 శాతం మేర ప్రభావం చూపుతున్నాయి. సంప్రదాయ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్కి ఇవి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలుగా ఉంటున్నాయి. → 2024లో దేశీయంగా డైరెక్ట్ టు కన్జూమర్ (డీ2సీ) మార్కెట్ 80 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. 2025లో ఇది 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటేసే దిశగా ముందుకెళ్తోంది. → మేడిన్ ఇండియా ఉత్పత్తులపై వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో 68 శాతం మంది, హోమ్ డెకరేషన్ విభాగంలో 55 శాతం, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 53 శాతం మంది వినియోగదారులు భారతీయ బ్రాండ్స్వైపు మొగ్గు చూపారు. → 80 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న క్విక్ కామర్స్ విభాగం, మార్కెట్లో ఉత్పత్తుల లభ్యత విషయంలో చాలా వేగవంతంగా మార్పులు తీసుకొచి్చంది. ఈ సెగ్మెంట్ ఏటా 70–80 శాతం మేర వృద్ధి చెందుతోంది. → ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బహుళ మాధ్యమాల ద్వారా రిటైల్ రంగం వృద్ధి చెందుతోంది. ఈ–కామర్స్ లావాదేవీల్లో 60 శాతం.. ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. → మాల్స్ కేవలం షాపింగ్కే కాకుండా లగ్జరీ అనుభూతి అందించే కేంద్రాలుగా కూడా మారుతున్నాయి. 2024లో రిటైల్ స్పేస్ లీజింగ్లో బెంగళూరు, హైదరాబాద్ 60 శాతం వాటాను దక్కించుకున్నాయి.

ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్

ఎలాన్ మస్క్ సైబర్ట్రక్: సేఫ్టీలో టాప్ రేటింగ్
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.ఎన్హెచ్టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్ట్రక్కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారుప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh— Elon Musk (@elonmusk) August 22, 2025
ఫ్యామిలీ

కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్స్ట్రాక్ట్ ఆర్ట్లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్బర్గ్లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre)

అంతరిక్ష పరిశోధనలో నవ శకం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం. 🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨ On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక

ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!
ఫొటోలు


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 24-31)


పుష్ప మూవీ ఫేమ్ జాలి రెడ్డి బర్త్ డే.. సతీమణి స్పెషల్ విషెస్ (ఫొటోలు)


కాబోయే మరదలితో రిబ్బన్ కట్ చేసిన సారా.. సచిన్ పుత్రికోత్సాహం (ఫొటోలు)


పట్టుచీరలో చందమామలా.. అనసూయ కొత్త ఫొటోలు


ఆఖరి శ్రావణ శుక్రవారం పూజ : నిండు గర్భిణి సోనియా ఆకుల (ఫొటోలు)


తెలంగాణ : ప్రసిద్ద వెంకటేశ్వర ఆలయం రత్నాలయం.. తప్పక వెళ్లాల్సిందే (ఫొటోలు)


ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ (ఫోటోలు)


జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)


విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)


జపాన్లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)
అంతర్జాతీయం

ట్రంప్ మాజీ సలహాదారు బోల్టన్ ఇంట్లో సోదాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మొదటి సారిగా ఎన్నిౖకైన సమయంలో 2018–19 సంవత్సరాల్లో జాతీయ భద్రతా సలహా దారుగా వ్యవహరించిన జాన్ బోల్టన్ నివాసంపై ఎఫ్బీఐ అధికారులు దాడులు జరిపారు. మేరీల్యాండ్లోని బెథెస్డాలో ఉన్న బోల్టన్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ అధికారులు ధ్రువీకరించారు. ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. రహస్య పత్రాలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే సోదాలు చేపట్టినట్లు మీడియా అంటోంది. వాషింగ్టన్ డీసీలోని బోల్టన్ కార్యాలయంలోనూ సోదాలు జరిగాయని తెలిపింది. అప్పటి ట్రంప్ పాలనపై బోల్టన్ 2020లో ఒక పుస్తకం రాశారు. ఇందులో ట్రంప్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పుస్తకంలోని పలు అంశాలను అధికార రహస్య పత్రాల ద్వారానే బోల్టన్ పొందినట్లు ట్రంప్ గతంలో విమర్శలు చేశారు. దాడులపై బోల్టన్ స్పందించలేదు. దాడుల విషయంతనకు తెలియదని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు.

మరణం అంచున గాజా
గాజా స్ట్రిప్: రెండేళ్ల యాజన్.. గాజా నగరంలోని బీచ్లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు. విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు. ఇది ఒక్క యాజన్ స్థితి కాదు.. గాజా స్ట్రిప్లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిండీ మెక్ కెయిన్ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్ నుంచి డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్ చివరి నాటికి, గాజా స్ట్రిప్ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం. జూన్ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు. మనుషులు సృష్టించిన కరువు అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్ ఫ్లెచర్ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు.

బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్తో ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid)

శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
కొలంబో: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే(76)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు ఆ వెంటనే అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. శ్రీలంక అధ్యక్షుడిగా 2022–24 సంవత్సరాల్లో విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 సెప్టెంబర్లో తన భార్య ప్రొఫెసర్ మైత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన విక్రమసింఘే ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు న్నాయి. లాయర్, సీనియర్ రాజకీయ నేత అయిన విక్రమసింఘే ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. వేర్వేరు సమయాల్లో ఆరు సార్లు ప్రధానిగా పనిచేశారు. గొటబయ రాజపక్స రాజీనామాతో 2022లో అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటప డేశారన్న ప్రతిష్టను సంపాదించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అధ్యక్షుడిగా ఆయన చేపట్టిన 23 విదేశీ పర్యటనల ఖర్చు రూ.17.50 కోట్లని మీడియా తెలిపింది. కాగా, అరెస్టయిన ఏౖMðక శ్రీలంక మాజీ అధ్యక్షుడిగా విక్రమ సింఘే నిలిచిపోయారు.
జాతీయం

కుక్కకు ఆహారం వేస్తూనే ఉంది.. చెంప దెబ్బలు తింటూనే ఉంది!
ఘజియాబాద్: వీధి కుక్కలు స్వైర విహారంతో ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న అంశాన్ని సుప్రీంకోర్టు సైతం తీవ్ర పరిగణించిన సంగతి తెలిసిందే. వీధుల్లో ప్రమాదకరంగా సంచరించే కుక్కలను తగు షెల్టర్లు ఏర్పాటు చేసి వాటిని అక్కడకు తరలించాలని ఇటీవల ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. ఇదిలా ఉంచితే, యూపీలో ఒక ఉదంతం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్లో ఒక మహిళ.. కుక్కకు ఆహారం పెడుతూ చెంప దెబ్బల బారిన పడింది. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న వీధి కుక్కకు ఓ మహిళ ఆహారం పెడుతుంటే దాన్ని ఆ అపార్ట్మెంట్ వాసి ఒకరు అడ్డుకున్నారు. ఇక్కడ ఎందుకు కుక్కకు ఆహారం పెడుతున్నావా? అని అడగ్గా, ఇందులో తప్పేముంది అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ మహిళను చెంప దెబ్బ కొట్టాడు సదరు వ్యక్తి. ఇలా ఆమె ఆహారం పెడుతూనే ఉంది.. అతను చెంప దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. సుమారు 38 సెకన్లలో 8సార్లు చెంప దెబ్బలకు గురైంది సదరు మహిళ. ఘజియాబాద్లోని విజయ్ నగర్లోని బ్రహ్మపుత్రా ఎన్క్లేవ్ సోసైటీలో ఇది జరిగింది. ఆ మహిళను చెంప దెబ్బలు కొట్టిన వ్యక్తిని కమల్ ఖన్నాగా గుర్తించారు. ఇదీ చదవండి: స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే

ఈసారి పాక్ను కలిపి ఇచ్చి పడేశారు..!
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్లపై సెటైరిక్గా స్పందించారు. ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు. #WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc— ANI (@ANI) August 23, 2025 ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.ఇదీ చదవండి: భారత్తో సమస్య ఉంటే.. ట్రంప్కు జై శంకర్ స్పష్టీకరణ

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్టక్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది.

‘భారత్తో సమస్య ఉంటే.. ’: ట్రంప్కు జైశంకర్ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జైశంకర్ స్పష్టం చేశారు.‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. #WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv— ANI (@ANI) August 23, 2025ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు.
ఎన్ఆర్ఐ

విద్యార్థిని ఉన్నత చదువుకు పొట్లూరి రవి సహాయం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థిని మైమూన్ ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసానికి రవి పొట్లూరి రూ. 1.75 లక్షలు సహాయం అందించి ఆమెను ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్లో చదివించారు.రవి పొట్లూరి ప్రోత్సాహంతో ఆమె నేడు ఇంటర్మీడియెట్ లో ప్రతిభ ప్రదర్శించడంతోపాటు ప్రవేశపరీక్షలో 6,947 ర్యాంక్ సాధించి వెటర్నరీ కాలేజీలో సీటుకు అర్హత సాధించింది. చదువులో రాణించడం పట్ల రవి పొట్లూరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. కప్పట్రాళ్ళ గ్రామంలోనే పదవతరగతిలో టాపర్ గా వచ్చిన ఆమె ప్రతిభను గమనించి రవి పొట్లూరి ఇంటర్మీడియెట్ చదువుకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మైమూన్ మాట్లాడుతూ, రవి పొట్లూరి గారి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిభకల విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తూనే ఉంటానని ఈ సందర్భంగా రవి పొట్లూరి చెప్పారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్
షా ఆలం; ఆగస్టు, 2025: తెలుగు భాషాసంస్కృతులను తర్వాతి తరాలకు అందించడం గొప్ప విషయం అని తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు రెడ్డి శ్యామల అన్నారు. భాష బోధన చేయడానికి భాషా శాస్త్ర పరిజ్ఞానం అవసరం ఎంతో ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈనెల 13 నుంచి 23 వరకు మలేషియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న తెలుగు డిప్లమా కోర్స్ లో భాగంగా నిర్వహించిన కార్యశాల ప్రారంభ సమావేశంలో ఆమె పాల్గొని, తెలుగు సంఘాన్ని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, తెలుగు భాషా సాంస్కృతిక మూలాలను బతికించుకోవాలనుకోవడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా మలేషియాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్పించడం అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్ను ఆమె అభినందించారు. ఈ కార్యశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చంద్రయ్య, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డా. ప్రతాప్, కోఆర్డినేటర్ రమేష్, ఉపాధ్యక్షులు సీతారావు విద్యార్థులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు.

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్కి మేరీల్యాండ్తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.
క్రైమ్

హాస్టల్లో హుక్కా
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధి లోని కొత్తపేటలోని సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్ లో కొందరు విద్యార్థులు హుక్కాకు అలవాటు పడ్డారు. ఏకంగా యూట్యూబ్లో చూసి అవసరమైన సామగ్రి ఆన్లైన్లో, తెలిసినవారి నుంచి సమకూర్చుకొని స్వయంగా హుక్కా తయారు చేశారు. హాస్టల్లో ఉండే కొత్తపేటకు చెందిన ఇంటర్ విద్యార్థికి షాద్నగర్లోని ఓ హోటల్లో పనిచేసే మిత్రుడు ఉన్నాడు. ఇతని ద్వారా హుక్కా పీల్చడం అలవాటు చేసుకున్నాడు. మరో ఇద్దరు విద్యార్థులకు అలవాటు చేశాడు. అలా పదోతరగతి లోపు చదువుతున్న 20 మంది హుక్కాకు బానిసలుగా మారారు. ఇదంతా ఓ నాలుగో తరగతి విద్యార్థి గమనించగా, అతడిని కొట్టి బలవంతంగా హుక్కా తాగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ ఇద్దరు విద్యార్థులను హాస్టల్ నుంచి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హుక్కా పీల్చేందుకు గుర్తు తెలియని వ్యక్తి హాస్టల్ గోడ దూకి, విద్యుత్ దీపాలు ఆర్పివేశాడు. దీంతో మిగిలిన విద్యార్థులు రాత్రంతా భయంభయంగా గడిపి శనివారం ఉదయమే హాస్టల్ సిబ్బందికి తెలిపారు. హాస్టల్లో తనిఖీ చేయగా హుక్కా మిషన్తోపాటు సామగ్రి లభించాయి. ఇంటర్ విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు విశ్వసనీయ సమాచారం

కిటికీ ఇనుప కడ్డీల్లో ఇరుక్కున్న బాలిక...స్కూల్లో రాత్రంతా నరకం!
భువనేశ్వర్ : ఒడిశాలోని కియోంజార్ జిల్లాలో జరిగిన ఘటన నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. రెండో తరగతి రాత్రంతా స్కూల్లోనే బిక్కు బిక్కు మంటూ గడిపిన వైనం కలకలం రేపింది. బన్స్పాల్ బ్లాక్ పరిధిలోని అంజార్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ఈ సంఘటన జరిగింది.8 ఏళ్ల జ్యోత్స్న దేహూరి రెండో తరగతి చదువుతోంది. స్కూలు ముగిసిన తరువాత జ్యోత్న కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు రాత్రంతా తమ కుమార్తె కోసం వెతికినా ఫలితం కనపించలేదు. అసలేం జరిగిందంటే..సాయంత్రం 4 గంటలకు పాఠశాల సమయం ముగియడంతో, 8 ఏళ్ల జ్యోత్స్న లోపల ఉందో లేదోచెక్ చేయకుండానేఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. అయితే తాళం వేసిఉన్నట్టు గుర్తించిన జ్యోత్న కిటికీ గుండా పాఠశాల నుండి బయటకు రావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఆమె కిటికీ ఊచల మధ్య ఇరుక్కు పోయింది. రాత్రంతా అలానే నరక యాతన అనుభవించింది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!శుక్రవారం ఉదయం 9 గంటలకు గేటు తెరిచిన తర్వాత ఆమె ఇరుక్కుపోయి ఉండటం చూసి పాఠశాల వంటమనిషి షాక్ అయ్యాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఇనుప రాడ్లను వంచి జ్యోత్స్నరక్షించారు. అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తూ చిన్నారికి ఎలాంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో జ్యోత్న్స తల్లిదండ్రులు, స్థానికులు, టీచర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు గౌరహరి మహంతను సస్పెండ్ చేశారు.చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

మహిళా ఇంజినీర్ ఆత్మహత్య
అనంతపురం: హెచ్చెల్సీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.సుమియ(32) ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక కుంగుబాటుకు గురై ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని రామప్ప వీధిలో నివాసం ఉండే కొండకమర్ల బాబాసాహెబ్ రెండో కుమార్తె కె.సుమియ కు గుంతకల్లుకు చెందిన పామిడి మహమ్మద్ షఫీతో 2020లో వివాహమైంది. ఈమె అనంతపురం హెచ్చెల్సీ ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్గా పనిచేస్తూ ఆర్.కె.నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న మన్హా సాఫియా, రెండేళ్ల వయసున్న మహిరా ఇరమ్ సంతానం. రెండో కాన్పు తర్వాత నుంచి సుమియాకు హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. వారం రోజులుగా మాత్రలు వేసుకోకపోవడంతో మానసిక రుగ్మత అధికమైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని పలు దఫాలుగా ప్రయత్నించగా కుటుంబ సభ్యులు వారించారు. ఈ విషయాన్ని మహమ్మద్ షఫీ తన మామ బాబాసాహెబ్కు చెప్పాడు. దీంతో ఆయన గురువారం సుమియా ఇంటికి వచ్చారు. ఆమెకు నచ్చచెప్పి డాక్టర్ వద్ద చూపించారు. అయినా కూడా సుమియా నిద్రకపోకుండా తాను చనిపోతానంటూ ఏడుస్తూనే ఉండటంతో తండ్రి, కుటుంబ సభ్యులు ఓదార్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అందరూ కలిసి భోజనం చేసి, నిద్రపోయారు. సుమియా, ఆమె భర్త షఫీ, చిన్నపిల్లలు ఒక బెడ్రూంలో నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుమార్తె నిద్రపోయిందా లేదా అని బాబాసాహెబ్ గదివైపు రాగా.. అప్పటికే సుమియా చీరతో ఫ్యానుకు వేసుకున్న ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దింపి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి సుమియా చనిపోయిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి, భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ కేసు నమోదు చేశారు.

నిద్ర చేయడానికొచ్చి శాశ్వత నిద్రలోకి..
ఎన్టీఆర్ జిల్లా: కొడుకు పుట్టాడని చిన్నమ్మ ఇంట్లో నిద్ర చేయటానికి వచ్చిన ఓ బాలింత, మూడు నెలల కుమారుడు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు దుర్మరణం చెందగా మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషాద ఘటన శుక్రవారం ఎనీ్టఆర్ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం ఎ.కొండూరుకు చెందిన నాగబత్తుల చైతన్యకు విజయవాడకు చెందిన నవీన్తో ఏడాది క్రితం వివాహమైంది. అతను విజయవాడలోని ఓ సినిమా థియేటర్లో పని చేస్తుంటాడు. వారికి మగ బిడ్డ పుట్టగా ఆర్జిక్ చైతన్య అని నామకరణం చేశారు. చైతన్య కంచికచర్ల మండలం కీసరలో నివసిస్తున్న పిన్ని ఇంట్లో నిద్రచేసేందుకు మూడు నెలల బాబుతో కలసి బస్సులో వచ్చింది. కీసర సెంటర్లో బస్సు దిగానంటూ పిన్నికి ఫోన్ చేసింది. ఆమె చైతన్యను తీసుకురావాల్సిందిగా పొరుగింట్లో ఉండే శ్రీకాంత్ అనే వ్యక్తిని కోరింది. వెంటనే బస్టాప్నకు వెళ్లిన శ్రీకాంత్ తల్లీబిడ్డను బైక్పై ఎక్కించుకుంటున్నాడు. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వేగంగా వెళ్తున్న లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. ఘటనలో చిన్నారి ఆర్జిక్ అక్కడికక్కడే మరణించాడు. చైతన్య, శ్రీకాంత్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వారిని హైవే అంబులెన్స్లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చైతన్య మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. లారీడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వీడియోలు


ABN రాధాకృష్ణ రుణం తీర్చుకోవాలి


భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త


సంపద సృష్టి అని అప్పుల ఏపీగా మార్చేశారు..!


ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా హాలీవుడ్ రేంజ్ లో రామాయణం


చింతమనేని రెడ్ బుక్ అరాచకాలు.. నా కొడుకుని వదిలేయండి..


స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి పోరాడుతాం: బొత్స
Nizamabad: ముగ్గురు చిన్నారుల పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడు శంకర్


తమ్మినేని సీతారాం హౌస్ అరెస్ట్... ఆముదాలవలసలో ఆందోళన


Sahasra Mother: హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర..!


బాబు సర్కార్ అప్పులు.. కాగ్ నివేదికపై వైఎస్ జగన్ రియాక్షన్