
కొలంబో: అధికారంలో ఉండగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే(76)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ)ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అధికారులు ఆ వెంటనే అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.
శ్రీలంక అధ్యక్షుడిగా 2022–24 సంవత్సరాల్లో విక్రమసింఘే శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 సెప్టెంబర్లో తన భార్య ప్రొఫెసర్ మైత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు లండన్ వెళ్లిన విక్రమసింఘే ప్రభుత్వ నిధులను వాడుకున్నట్లు ఆరోపణలు న్నాయి. లాయర్, సీనియర్ రాజకీయ నేత అయిన విక్రమసింఘే ఐదు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.
వేర్వేరు సమయాల్లో ఆరు సార్లు ప్రధానిగా పనిచేశారు. గొటబయ రాజపక్స రాజీనామాతో 2022లో అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ఆయన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటప డేశారన్న ప్రతిష్టను సంపాదించుకున్నారు. అనంతరం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అధ్యక్షుడిగా ఆయన చేపట్టిన 23 విదేశీ పర్యటనల ఖర్చు రూ.17.50 కోట్లని మీడియా తెలిపింది. కాగా, అరెస్టయిన ఏౖMðక శ్రీలంక మాజీ అధ్యక్షుడిగా విక్రమ సింఘే నిలిచిపోయారు.