breaking news
Sri Lanka
-
శ్రీలంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరం
న్యూఢిల్లీ: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో... పనిభారం, భవిష్యత్తులో కీలక సిరీస్లను దృష్టిలో పెట్టుకొని అతడికి ఇంకొన్నాళ్లు విశ్రాంతి అవసరమని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వైద్యబృందం భావిస్తోంది. బుమ్రా స్థానంలో సెలక్టర్లు దేశవాళీల్లో రాణిస్తున్న జమ్మూకశ్మీర్ పేసర్ అఖీబ్ నబీని ఎంపిక చేయనున్నారు. -
పాక్ను మరోసారి చిత్తు చేసిన శ్రీలంక.. మరో సిరీస్ కైవసం
శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. తొలుత మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కోల్పోయిన (1-2తో) ఈ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.డంబుల్లా వేదికగా ఇవాళ జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు పాక్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రీలంక మరో 14 బంతులు (17.4 ఓవర్లు) మిగిలుండగానే కేవలం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ చమారీ ఆటపట్టు (40), సంజనా కవిండి (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. విష్మి గుణరత్నే (31), హర్షిత సమరవిక్రమ (37 నాటౌట్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్లు ఆడారు. ఆఖర్లో కవిష దిల్హరి (14 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించింది. పాక్ బౌలర్లలో హనీ 2, వహీదా, అయేషా జాఫర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తరఫున ఓపెనర్లు మునీబా అలీ (45), షావాల్ జుల్ఫికర్ (48) రాణించారు. ఆఖర్లో ఫాతిమా (30 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మిగతా ప్లేయర్లలో ఎమాన్ నసీర్ 21, అయేషా జాఫర్ 8, సైరా జబీన్ 16, హనీ 2 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో ప్రబోధ 2, సుగంధక కుమారి, చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి తలో వికెట్ తీశారు. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 4న జరుగనుంది. -
సారాంశ్కు స్వాగతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్స్పిన్నర్ సారాంశ్ జైన్కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 33 ఏళ్ల సారాంశ్ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం శుబ్మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ను కూడా ఈ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్రౌండర్... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో భారత్ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్ సారాంశ్ను ఎంపిక చేశారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్లు ఆడిన సారాంశ్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.భారత టెస్టు జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్లను గెలిచిన శ్రీలంక సిరీస్ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్ను స్వల్ప స్కోర్కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్కు ఔటైంది. -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
భారత జెన్-జీకి పాక్, శ్రీలంక, నేపాల్ సెల్యూట్.. రియాక్షన్లు ఇవే..
భారత జెన్-జీని తరచూ మొబైల్లో ఎక్కువ సమయం గడిపే తరం, ప్రతి విషయాన్నీ మీమ్స్గా మార్చే తరం, తీవ్రమైన అంశాలపై ఎక్కువసేపు దృష్టి పెట్టని తరంగా భావించేవారు. కానీ గత నెల రోజులుగా అదే బలహీనతలు వారి అతిపెద్ద బలంగా మారాయి. వరుసగా సాగిన విద్యార్థి ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేశాయి. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలో సంప్రదాయ రాజకీయ ప్రకటనల స్థానంలో మీమ్స్ వచ్చాయి. ఇన్స్టా రీల్స్ ప్రజలను సమీకరించే సాధనంగా మారాయి.ఈ ఉద్యమం ఇప్పుడు భారత్కే పరిమితం కాలేదు. పొరుగు దేశాల్లో కూడా దీని గురించి చర్చ సాగుతోంది. జెన్-జీ దృష్టి త్వరగా మళ్లిపోతుందని సాధారణంగా చెబుతుంటారు. కానీ భారత్లో జరిగిన ఈ ఉద్యమం శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్ యువత దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ దేశాల్లో గతంలో కూడా యువజన ఉద్యమాలు జరిగాయి. అందువల్ల భారత్లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమంపై అక్కడ ప్రత్యేక ఆసక్తి కనిపించింది.దీనిపై పాకిస్థాన్ యువతి ఒకరు మాట్లాడుతూ.. "ఇలా చేస్తుంటే ప్రేమలో పడిపోతానేమో... మీరు ఇంత బాగా చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను?" అని అన్నారు. భారత జెన్-జీ చూపించిన ధైర్యం, ఐక్యత ఎవరినైనా ఆకట్టుకుంటాయి. సరిహద్దులు వేరు కావచ్చు. కానీ ఈ తరం ఆలోచనలు, ఉత్సాహం ఒక్కటేనని చెప్పారు. పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు అవకాశం వస్తే తామూ భారత విద్యార్థుల్లాగే వీధుల్లోకి వచ్చేవాళ్లమని అన్నారు. ఓ యువకుడు మాట్లాడుతూ.. "కాక్రోచ్ జనతా పార్టీ చాలా కూల్గా ఉంది. వారు అవసరానికి మించి సీరియస్గా ఉండరు. అదే నాకు నచ్చింది. జెన్-జీకి సాటి ఎవరూ లేరు" అని చెప్పాడు.ఒక ప్లేట్ బిర్యానీకే అమ్ముడుపోయేవాళ్లం ముంబైలో వైరల్ అయిన ఓ వీడియోను కూడా అతను ప్రస్తావించాడు. అందులో పోలీసులు విద్యార్థులను వాహనంలో తీసుకెళ్తుండగా, వెనుక నుంచి ఎవరో నిశ్శబ్దంగా తాళం తీసేయడంతో విద్యార్థులు బయటకు వచ్చి పరుగులు తీశారు. మరో పాకిస్థాన్ యువకుడు మాట్లాడుతూ.. భారత విద్యార్థులు మతం, కులానికి అతీతంగా ఐక్యంగా నిలిచారని, కానీ పాకిస్థాన్లో ప్రజలు పంజాబీ-పష్తూన్, సున్నీ-షియా వంటి విభజనల్లో ఉన్నారని అన్నాడు."అదే భారత్ జెన్-జెడ్ అతిపెద్ద బలం. పాకిస్థాన్ జెన్-జీ అంత సులభంగా ఒక్కటవుతుందని నాకు అనిపించడం లేదు." భారత్ ఉద్యమానికి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయన్న ఆరోపణలపై పాకిస్థాన్ కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ.. "మా దేశాన్ని నడపడానికే మా దేశం వద్ద డబ్బు లేదు. భారత ఉద్యమానికి ఎలా నిధులు ఇస్తాం?" అని అన్నాడు.బిలాల్ హసన్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘‘భారత్లో విద్యార్థులపై లాఠీచార్జ్ జరగొచ్చు. కానీ పాకిస్థాన్లో చాలా సందర్భాల్లో ప్రజలను నేరుగా తీసుకెళ్లి అదృశ్యం చేస్తారు’’ అని చెప్పారు. పాకిస్థాన్లో చాలామందిని "ఒక ప్లేట్ బిర్యానీ"కే కొనుగోలు చేయవచ్చని వ్యాఖ్యానించారు.శ్రీలంక యువతపై ప్రభావంభారత విద్యార్థి ఉద్యమం శ్రీలంక యువతపై కూడా ప్రభావం చూపింది. 2022లో శ్రీలంక యువత ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత రాజపక్స ప్రభుత్వం అధికారాన్ని వీడింది. ఇప్పుడు శ్రీలంకలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై కార్టూన్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా వచ్చాయి. ప్రముఖ కార్టూనిస్ట్ అవంతా ఆర్టిగాలా పంచుకున్న వ్యంగ్య చిత్రంలో ప్రభుత్వం "బొద్దింకలను" అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, భారత్ ఇళ్లలో వాడే "లక్ష్మణ రేఖ" కూడా వాటిని ఆపలేకపోయినట్టు చూపించారు.భారత్ ఉద్యమంలో ఎక్కువగా చర్చకు వచ్చిన చిత్రం ముంబైకి చెందిన రియా అహీర్ పోలీసు వాహనం ముందు చేతులు చాపి నిలిచిన ఫొటో. చాలామంది దీన్ని 1989 తియానన్మెన్ స్క్వేర్లోని ప్రసిద్ధ "ట్యాంక్ మ్యాన్" చిత్రంతో పోల్చారు. శ్రీలంక లా కాలేజీ విద్యార్థిని స్వస్థిక అరులింగం ఫేస్బుక్లో ఈ చిత్రాన్ని పంచుకుంటూ "వైబింగ్ ఎట్ అనదర్ లెవల్" అని రాశారు. 2022 శ్రీలంక ఉద్యమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త బువాంకా పెరేరా ఇన్స్టాగ్రామ్లో భారత యువతకు సందేశం పంపారు."శ్రీలంక నుంచి ప్రారంభమై ఆసియా అంతటా వ్యాపించిన యువజన ఉద్యమాల జ్వాల భారత్ను చాలాకాలం తాకలేదనిపించింది. కానీ ఇప్పుడు రాజ్యాంగం, దేశ వ్యవస్థాపకులు కలలు కన్న భారత్ కోసం భారత యువత పోరాడుతుండటం చూసి ఆనందంతో కళ్లలో నీళ్లు వస్తున్నాయి" అని ఆయన అన్నారు. నేపాల్ యువత మద్దతునేపాల్లో కూడా భారత్ జెన్-జీ ఉద్యమంపై సానుకూల స్పందనలు వచ్చాయి. కాఠ్మాండూ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా మాట్లాడుతూ.. భారత విద్యార్థుల ఆగ్రహం పూర్తిగా సమంజసమని, దాన్ని అతిగా స్పందించారని చెప్పలేమన్నారు. "వీధుల్లో విద్యార్థులను చూసినప్పుడు నా మనసు అప్పుడూ బాధపడింది. ఇప్పుడూ బాధపడుతోంది" అని చెప్పారు. 2025లో నేపాల్ జెన్-జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అది కూడా యువత శక్తికి ఉదాహరణగా నిలిచి చివరకు కేపీ ఓలీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేసిందని అన్నారు.జెన్-జీ నుంచి ప్రపంచం నేర్చుకుంటోంది..ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రారంభమైన ఈ ఉద్యమం క్రమంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచం తొలిసారి భారత్ జెన్-జీ మీమ్స్, నినాదాలు, వైరల్ వీడియోలను చూసి నవ్వడమే కాదు, వాటి నుంచి నేర్చుకోవడం కూడా ప్రారంభించింది. పొరుగు దేశాల నుంచి వచ్చిన స్పందనలు చూస్తే, భారత్ విద్యార్థి ఉద్యమం సరిహద్దులు దాటి యువతకు స్ఫూర్తిగా మారిందని తెలుస్తోంది. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్కు చెందిన పలువురు యువకులు భారత విద్యార్థుల ఐక్యత, ధైర్యం, సృజనాత్మక నిరసనను ప్రజాస్వామ్య ఉద్యమానికి కొత్త ఆదర్శంగా అభివర్ణించారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్
ఆంటిగ్వాలో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు హైస్కోరింగ్ డ్రాగా ముగియడంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన విండీస్, రెండో టెస్టును డ్రాగా ముగించడంతో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. 2023 ఫిబ్రవరి తర్వాత వెస్టిండీస్కు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం. అలాగే శ్రీలంకపై 2003 తర్వాత ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.రెండో టెస్ట్ చివరి రోజు ఓవర్నైట్ స్కోరు 92/2తో ఆట ప్రారంభించిన శ్రీలంక వేగంగా పరుగులు సాధించింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా, సోనాల్ దినూష, మిలన్ రత్నాయకే వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడడంతో లంచ్ సమయానికి 281 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఆధిక్యాన్ని 300 దాటించిన శ్రీలంక 251/9 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. దినేశ్ చండిమల్ 71 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కమిందు మెండిస్ 44 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు తీశాడు.306 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఓపెనర్లు జాన్ క్యాంప్బెల్, బ్రాండన్ కింగ్ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. మధ్యలో రెండు సార్లు చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించినా ఫలితంపై ప్రభావం చూపలేదు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్లో బ్రాండన్ కింగ్ ఎల్బీగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా, డీఆర్ఎస్లో నిర్ణయం మారడంతో శ్రీలంకకు నిరాశ ఎదురైంది.చివరికి క్యాంప్బెల్ (51 నాటౌట్), బ్రాండన్ కింగ్ (51 నాటౌట్) అర్ధసెంచరీలతో జట్టును నిలబెట్టగా, ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 549/9 డిక్లేర్ చేయగా, లహిరు ఉదార 188, సోనాల్ దినూష 92, కమిందు మెండిస్ 84 పరుగులతో రాణించారు. ప్రత్యుత్తరంగా వెస్టిండీస్ 499 పరుగులు చేసింది. జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112 పరుగులతో ఆకట్టుకోగా, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. కాగా, తొలి టెస్టులో సాధించిన ఘన విజయమే సిరీస్ ఫలితాన్ని వెస్టిండీస్కు అనుకూలంగా మలిచింది. -
డబుల్ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్.. హోప్ శతకం
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక మ్యాచ్పై పట్టు సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసి, ఓవరాల్గా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో విజయానికి అవసరమైన లక్ష్యాన్ని నిర్దేశించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది.మూడో రోజు ప్రారంభమైన జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్ భాగస్వామ్యం నాలుగో రోజు కూడా కొనసాగింది. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు. హోప్ (112) తన కెరీర్లో ఐదో టెస్టు సెంచరీని, స్వదేశంలో తొలి టెస్టు శతకాన్ని నమోదు చేయగా.. గ్రీవ్స్ (180) తన మూడో టెస్టు సెంచరీని పూర్తి చేశాడు. గ్రీవ్స్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.గ్రీవ్స్-హోప్ 76.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 242 పరుగుల భారీ భాగస్వామ్యానికి నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ఎంతో సేపు కొనసాగలేదు. ఓ దశలో 5 వికెట్లకు 438 పరుగులతో బలంగా కనిపించిన వెస్టిండీస్ చివరి ఐదు వికెట్లను కేవలం 61 పరుగులకే కోల్పోయి 499 పరుగులకు ఆలౌటైంది.దీంతో తొలి ఇన్నింగ్స్ను 549/9 వద్ద డిక్లేర్ చేసిన శ్రీలంకకు 50 పరుగుల ఆధిక్యం లభించింది. అసిత ఫెర్నాండో ఐదు వికెట్లతో రాణించాడు.రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే శ్రీలంకకు షమార్ జోసెఫ్, అల్జారీ జోసెఫ్ షాకిచ్చారు. లహిరు ఉదారా నాలుగు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే ఎల్బీగా వెనుదిరగగా, నిషాన్ మదుష్కను అల్జారీ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.ఆ క్లిష్ట సమయంలో దినేశ్ చండిమల్, కమిందు మెండిస్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్కు అజేయంగా 60 పరుగులు జోడించి జట్టును గట్టెక్కించారు. చండిమల్ 66 బంతుల్లో 40 పరుగులతో, కమిందు మెండిస్ 35 బంతుల్లో 30 పరుగులతో నాటౌట్గా నిలిచారు.సంక్షిప్త స్కోర్లు:శ్రీలంక: 549/9 డిక్లేర్ & 92/2 (దినేశ్ చండిమల్ 40*, కమిందు మెండిస్ 30*)వెస్టిండీస్: 499 (జస్టిన్ గ్రీవ్స్ 180, షాయ్ హోప్ 112; అసిత ఫెర్నాండో 5/130)శ్రీలంకకు మొత్తం 142 పరుగుల ఆధిక్యంకాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ నెగ్గిన వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
లంక జైల్లో గ్యాంగ్ వార్
కొలంబో (శ్రీలంక): శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఆదివారం మొదలైన గ్యాంగ్ వార్ 26 మంది ప్రాణాలు తీసింది. వందమంది గాయపడ్డారు. మృతుల్లో శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతోపాటు జైలు గార్డులు కూడా ఉన్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. నేరగాళ్ల గుంపులు మొదట ఆదివారం ఒకరితో ఒకరు తలపడటంతో ఈ గ్యాంగ్ వార్ మొదలైంది. అయితే సోమవారం వీరు జైల్లోని తుపాకులు కూడా లాక్కోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అచ్చం సినిమాల్లో చూపినట్టుగానే మత్తుమందుల రవాణాకు సంబంధించి రెండు వైరి గ్రూపుల మధ్య వివాదంతో ఘర్షణ మొదలైనట్లు ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. ఒక వర్గం మత్తుమందుల రవాణాకు పాల్పడతూండగా ఇంకో వర్గం దాన్ని వ్యతిరేకించింది.ఒక వర్గం సమాచారం ప్రత్యర్థి వర్గానికి ఎవరు అందించారన్న విషయమై ఘర్షణ మొదలైనట్లు తెలిసింది. ఆదివారం రెండు వర్గాల వారు కలబడటంతో 20మంది వరకూ మరణించారు. ఆ తరువాత కొందరు మహిళ ఖైదీలు ఆదివారం రాత్రి జైలు పైకప్పుపై నిరసన ప్రదర్శన నిర్వహిస్తూండగా అది పాక్షికంగా కూలిపోయింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా జైల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగాయి.తొలి రోజు ఘటనలకు వ్యతిరేకంగా నిరసనలకు దిగిన ఖైదీలు జైలు ఆయుధాగారంలోకి చొరబడి తుపాకులు స్వా«దీనం చేసుకున్నారు. కాల్పులు జరిపారు. ఫలితంగా నలుగురు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు నెగొంబో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనల్లో సుమారు వంద మంది దాకా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఖైదీలతో పాటు గార్డుల్లో చాలామంది తుపాకీ కాల్పుల కారణంగా గాయపడ్డారని, పలువురు కత్తిగాటు గాయాలతో ఉన్నారని నెగెంబో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిలో కొందరిని కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. -
ఘోరంగా తన్నుకున్నారు.. 25 మంది మృతి, 100 మందికి గాయాలు
కొలంబో: శ్రీలంకలోని నెగొంబో జైల్లో ఖైదీలు తీవ్ర ఘర్షణకు దిగారు. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి తీవ్రగాయాలయ్యాయి. అంతమంది ఖైదీలు ఘర్షణ పడుతున్న సమయంలో అక్కడి పోలీసులు ఏమీ చేయలేకపోయారు.మృతుల్లో నలుగురు గార్డులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లలో శ్రీకంలోని జైళ్లలో ఇంతటి ఘౌరమైన అల్లర్లు ఎన్నడూ జరగలేదని చెప్పారు. రాజధాని కొలంబోకు ఉత్తర దిశలో ఉన్న నెగొంబో ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు."కొంతమందికి తుపాకీ గాయాలు ఉన్నాయి. ఇంకొందరికి కత్తి కోతలు, తీవ్ర గాయాలు ఉన్నాయి" అని అధికారులు తెలిపారు. నెగొంబో జైలులో ఆదివారం సాయంత్రం ఘర్షణలు మొదలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ జైలులో వేలాది మంది ఖైదీలు ఉన్నారు.ఘర్షణల వార్తలు జైలు అంతటా వ్యాపించడంతో పక్కనే ఉన్న విభాగంలోని మహిళా ఖైదీలు ఆదివారం రాత్రి భవనం పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పైకప్పులో ఓ భాగం కూలిపోవడంతో కొంతమంది మహిళలకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసు కమాండోలను పిలిపించినా వారిని జైలు లోపలికి పంపలేదు.సోమవారం ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో జైలు బయటకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించేందుకు వైమానిక దళం డ్రోన్లు, హెలికాప్టర్ను వినియోగించింది. స్థానికులు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. సోమవారం ఉదయం పరిస్థితి అదుపు తప్పిందని ఓ పోలీసు అధికారి ఏఎఫ్పీకి తెలిపారు.కాగా, గతంలోనూ శ్రీలంకలోని జైళ్లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2020 డిసెంబరులో శ్రీలంకలోని మరో జైలులో జరిగిన అల్లర్లలో 11 మంది ఖైదీలు మరణించారు. 117 మంది గాయపడ్డారు. ఆ సమయంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో రద్దీగా ఉన్న జైళ్ల నుంచి వందలాది మంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం నాటికి శ్రీలంక జైళ్లలో 41,250 మంది ఖైదీలు ఉన్నారని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది ఆ జైళ్ల సామర్థ్యం కన్నా దాదాపు 4 రెట్లు ఎక్కువ. -
శ్రీలంక చిత్తు.. 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంక-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్ట్లో 10 వికెట్ల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 1-0తో ఇండియా సొంతం చేసుకుంది. తొలి టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక-ఎ తమ మొదటి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సహాన్ అరాచిగే శతక్కొట్టగా (127).. నువానిదు ఫెర్నాండో 44, అంజల బండారా 42 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ నాలుగేసి వికెట్లతో సత్తా చాటగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 543 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ (267 బంతుల్లో 168; 22 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా... దేవదత్ పడిక్కల్ (94) , కెప్టెన్ ధ్రువ్ జురేల్ (88 బంతుల్లో 53; 6 ఫోర్లు), సారాన్ష్ జైన్ (137 బంతుల్లో 70; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీలతో మెరిశారు.శ్రీలంక బౌలర్లలో కేశర నువాంత నాలుగు, సుదీరా తిలకరత్నే మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. మరోసారి గుర్నూర్ బ్రార్ 6 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక భారత్ ముందు కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఈ లక్ష్యాన్ని ఇండియా-ఎ జట్టు వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలో చేధించింది. -
దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్
ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో శ్రీలంక జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (549-9 డిక్లేర్) చేసింది.అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఇంకా 491 పరుగుల వెనుకబడి ఉంది.రెండో రోజు ఆటలో కుసాల్ మెండిస్ (69), సోనల్ దినుషా (92) విండీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలు బాదుతూ ఆరో వికెట్కు 143 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఆఖర్లో మిలన్ రత్నాయకే (15), ప్రభాత్ జయసూర్య (17 నాటౌట్), విజెసుందర (14) ఓ మోస్తరు పరుగులు చేయడంతో శ్రీలంక 500 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు ఓపెనర్ లహీరు ఉదారా (188) భారీ శతకంతో కదంతొక్కగా.. కమిందు మెండిస్ (84) అర్ద సెంచరీతో రాణించాడు.549 పరుగుల భారీ లక్ష్యానికి స్పందనగా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాండన్ కింగ్ను (17) అసిత ఫెర్నాండో ఔట్ చేశాడు. అనంతరం జాన్ క్యాంప్బెల్ (31), కావెమ్ హాడ్జ్ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఆతిథ్య వెస్టిండీస్ తొలి మ్యాచ్లో గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
శ్రీలంక ఓపెనర్ సరికొత్త చరిత్ర
వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉదారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. నార్త్ సౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు బాదిన అతడు.. ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక ఓపెనర్గా రికార్డుల్లోకెక్కాడు. లంక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఉదారాకు ముందు ఏ ఓపెనర్ ఓ ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు కొట్టలేదు. గతంలో ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య రెండు సార్లు ఓ ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు కొట్టాడు.ఈ రికార్డుతో పాటు ఉదారా ఓ భారీ శతకం కూడా సాధించాడు. 248 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 188 పరుగులు చేసి ఔటయ్యాడు. కెరీర్లో కేవలం మూడో టెస్టు మాత్రమే ఆడుతున్న 32 ఏళ్ల ఉదారా ఈ ఇన్నింగ్స్తో మరో అరుదైన రికార్డు కూడా నెలకొల్పాడు.వెస్టిండీస్పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన శ్రీలంక ఓపెనర్గానూ రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు దిముత్ కరుణరత్నె పేరిట ఉండేది. 2015లో గాలే టెస్టులో కరుణరత్నె 186 పరుగులు చేశాడు. తాజగా ఉదారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.ఇక ఓవరాల్గా ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్ రికార్డు టీమిండియా యువ కెరటం యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. జైసూ 2024లో ఇంగ్లండ్తో రాజ్కోట్లో జరిగిన టెస్టులో ఏకంగా 12 సిక్సర్లు (214 నాటౌట్) బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ చెరో 11 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఉదారా భారీ శతకంతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఉదారాకు కమిందు మెండిస్ (84) కూడా సహకరించడంతో ఈ స్కోర్ సాధ్యపడింది. మిగతా ప్లేయర్లలో నిషన్ మధుష్క (6), దినేశ్ చండీమల్ (1), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (33) ఔట్ కాగా.. కుసాల్ మెండిస్ (0), సోనల్ దినుష (5) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, జేడన్ సీల్స్, అల్జరీ జోసఫ్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో భారీ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
పుంజుకున్న టీమిండియా బౌలర్లు.. లంక బ్యాటర్లు కట్టడి
శ్రీలంక-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్లో భారత బౌలర్లు పుంజుకున్నారు. తొలి రోజు పెద్ద ప్రభావం చూపని వీరు, రెండో రోజు లంక బ్యాటర్లను కట్టడి చేశారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 366 పరుగుల నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక స్కోర్ 288-5గా ఉండింది. రెండో రోజు ఆట తొలి సెషన్లోనే గుర్నూర్ బ్రార్ (22-277-4), సరాన్ష్ జైన్ (30-2-92-4) చెలరేగడంతో ఆ జట్టు 61 పరుగుల వ్యవధిలో మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 83 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు బరిలోకి దిగిన లంక కెప్టెన్ సహన్ అరచ్చిగే (127) సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ అంజల బండార (42) అదే స్కోర్ వద్ద ఔటయ్యాడు. లంక ఇన్నింగ్స్లో పవంత వీరసింఘే 39, సోహన్ డి లివెరా 28, నువనిదు ఫెర్నాండో 44, అషేన్ బండార 34, చమిక గుణశేఖర 13, కేశర నువంత 1, దిలుమ్ సుదీర 20, అసంక మనోజ్ 4, దులజ్ సముదిత 2 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బ్రార్, సరాన్ష్ కాకుండా యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ రెండో టెస్టు
గాలె: యువ ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’ జట్టు... గురువారం నుంచి శ్రీలంక ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా... భారత జట్టు నుంచి ఓపెనర్ సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ సెంచరీలు చేశారు. ఈ పర్యటనలో ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’జట్టు... సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. తొలి టెస్టు ‘డ్రా’ కావడంతో... నేటి నుంచి ప్రారంభం కానున్న నాలుగు రోజుల మ్యాచ్లో రాణించి సిరీస్ పట్టేయాలని చూస్తోంది.యువ పేసర్లను తీర్చిదిద్దాలని భావిస్తున్న మేనేజ్మెంట్... ఇటీవల టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్ను శ్రీలంక పిచ్లపై పరీక్షించనుంది. అతడితో పాటు అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్పిన్ ఆల్రౌండర్ మానవ్ సుతార్... తొలి మ్యాచ్లోనూ 10 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం కౌంటీల్లో సైతం రాణించిన సుతార్... ఇప్పుడు భారత్ ‘ఎ’ తరఫున ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. హర్ష్ దూబేకు తుది జట్టులో చోటు కష్టమే. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ప్లేయర్లలో పలువురు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో... ఆఖరి పోరులో జట్టు కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. అమన్ మోఖడే, జీషన్ అన్సారీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ పూర్తిగా కోలుకోకపోతే అతడి స్థానంలో అమన్ మోఖడే ఇన్నింగ్స్ ఆరంభించవచ్చు. -
జురేల్ అజేయ శతకం
గాలె: శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు భారీ స్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 333/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు 111.4 ఓవర్లలో 452/6 వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (215 బంతుల్లో 141 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ శతకంతో కదంతొక్కాడు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (113 బంతుల్లో 63; 5 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో పది పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు. దీంతో 136 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రషీద్ అవుటైనా... హర్ష్ దూబే (51 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో ధ్రువ్ జురేల్ దూకుడు కొనసాగించాడు. లంక బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న జురేల్... వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. లంక బౌలర్లలో చమిక గుణశేకర 3 వికెట్లు పడగొట్టగా... డిలుమ్ సుదీర రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. నువానీడు ఫెర్నాండో (103 బంతుల్లో 65 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ హాఫ్సెంచరీతో పోరాడుతున్నాడు. ఓపెనర్లు నిరోషన్ డిక్వెల్లా (10), పవంత వీరసింఘే (11) విఫలమవడంతో ఒక దశలో లంక 38/2తో కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో అషెన్ బండారా (51 బంతుల్లో 18 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో కలిసి ఫెర్నాండో ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఒక్కో పరుగు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్కు 75 పరుగులు జోడించారు. చేతిలో 8 వికెట్లు ఉన్న శ్రీలంక ‘ఎ’ జట్టు... ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టు స్కోరుకు ఇంకా 339 పరుగులు వెనుకబడి ఉంది. ఫెర్నాండో, బండారా క్రీజులో ఉన్నారు. భారత ‘ఎ’ బౌలర్లలో అన్షుల్ కంబోజ్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. -
ఐటీ ఉద్యోగం పోయింది : నేడు రోజుకు రూ. 50 వేల టర్నోవర్
ఉద్యోగం పోయిందని ఏ మాత్రం బెంబేలెత్తిపోలేదు. అస్సలు అధైర్యపడలేదు. నిరాశ అంతకన్నా పడలేదు. మొదట్లో కాస్త కంగారుగా అనిపించాన, వెంటనే తన జీవనం కోసం కొత్త మార్గాలు ఏమున్నాయా అని అన్వేషించాడు. ఆ అన్వేషణ ఫలితమే అతనికి కొండంత ధైర్యాన్నిచ్చింది. తన సొంత గ్రామంలోనే సూపర్ మార్కెట్ ప్రారంభించాడు. కేవలం మూడు నెలల్లోనే విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్ఫూర్తిదాయక స్టోరీ ఇది.శ్రీలంకకు చెందిన సమీత సులక్కన అనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా పంచుకున్న తన విజయగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతోంది. కంపెనీలో జరిగిన లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు.ఐటీ ఉద్యోగం నుండి వ్యాపారం వైపు..సమీత సులక్కన తన విజయ గాథను లింక్డ్ఇన్ పోస్ట్లో వివరించారు. దీని ప్రకారం ఇటీవల కంపెనీలో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు సమిత. మిగిలిన వారిలాగే భవిష్యత్తుపై ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. టెకీలకు ఐటీ రంగంలోనే కెరీర్ ఉంటుందని భావించాడు. పైగా ఐటీ అనేది ప్యాషన్. కానీ, ఆ కష్టకాలంలో అవకాశాలు ఎప్పుడూ మనం అనుకున్న రూపంలోనే రావని చాలా తొందరగానే గ్రహించాడు. అందుకే మరో టెక్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా, తన గ్రామంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించే ఒక మినీ సూపర్ మార్కెట్ కూడా లేదని గమనించి, ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుని స్వయంగా ఒక స్టోర్ను ప్రారంభించాడు.సంప్రదాయ వ్యాపారానికి టెక్నాలజీ హంగులుతాను చదువుకున్న చదువును, టెక్నాలజీ నేపథ్యాన్ని తన వ్యాపారంలో ఉపయోగించాలని సమిత నిర్ణయించుకున్నాడు. సాధారణ కిరాణా దుకాణంలా కాకుండా భిన్నంగా ఆలోచించాడు. కస్టమర్ల సౌకర్యం కోసం 'క్యాష్ ఆన్ డెలివరీ' (COD) సదుపాయంతో కూడిన ఒక సాధారణ ఆన్లైన్ ఆర్డరింగ్ విధానాన్ని ఆయనే స్వయంగా డెవలప్ చేసుకున్నాడు. దీనివల్ల కస్టమర్లు ఇంట్లో కూర్చునే ఆర్డర్ చేసుకునే వీలు కలిగింది. అంతే ఆర్డర్లు భారీగా వచ్చాయి. వ్యాపారం చాలా వేగంగా పుంజుకుంది. కేవలం మూడు నెలల్లోనే రోజువారీ టర్నోవర్ రూ. 50,000 దాటింది. ఈ సూపర్ మార్కెట్తో పాటు, తన గ్రామంలో 'ప్యూరిఫైడ్ వాటర్' (శుద్ధి చేసిన తాగునీరు) సరఫరా చేసే మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని సమిత యోచిస్తున్నాడు.ఇదీ చదవండి: ఇష్టం లేదని చెప్పినా కేతన్ వినలేదు : సియా, తల్లి షాకింగ్ రియాక్షన్నిరుద్యోగులకు, యువతకు సమిత సలహా"ఈ అనుభవం నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది: మనం మారడానికి, ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంటే.. మనకు ఎదురయ్యే ఎదురుదెబ్బలే కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఉద్యోగ రంగంలో అనిశ్చితిని ఎదుర్కొంటున్న వారు ఎవరూ అందోళన పడకండి. ప్రణాళిక వేసుకోండి, అవసరమైతే చిన్నగా ప్రారంభించండి, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. పరిస్థితులు అన్నీ అనుకూలంగా మారేవరకు వేచి చూస్తే విజయం రాదు. ఇతరులు అడుగు ముందుకు వేయడానికి భయపడు తున్నప్పుడు, మనం మొదటి అడుగు వేస్తేనే విజయం లభిస్తుంది." అంటూ తన లాంటివారికి సూచిస్తున్నారు సమిత.ఇదీ చదవండి: తండ్రి చివరి కోరిక : వీడియో కాల్లోనే పెళ్లి, అంతలోనే..!నెటిజన్ల ప్రశంసలుసమిత తీసుకున్న నిర్ణయం, సాధించిన విజయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అద్భుతం, నువ్వు నిజంగా ఒక స్ఫూర్తివి సమిత అని ఒకరంటే, "గతేడాది నాకూ ఇలాగే ఉద్యోగం పోయింది బ్రదర్. దాంతో నేను నా సొంత క్లాత్ బ్రాండ్ ప్రారంభించాను. నాణ్యత అనేది కేవలం సాఫ్ట్వేర్కే కాదు, మన చుట్టూ ఉన్న అన్నిటికీ వర్తిస్తుంది. ప్రస్తుతం నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్ని" అంటూ మరో యూజర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, సమితను అభినందించారు.(ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన సైనికులు వీరే!) -
సాయి సుదర్శన్ శతకం
గాలె (శ్రీలంక): ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత ‘ఎ’ జట్టు... శ్రీలంక ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులోనూ శుభారంభం చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ధ్రువ్ జురేల్ సారథ్యంలోని భారత ‘ఎ’ జట్టు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ (175 బంతుల్లో 132; 19 ఫోర్లు) సూపర్ సెంచరీతో చెలరేగాడు. సుదీర్ఘ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సుదర్శన్... లంక బౌలర్లపై అదే దూకుడు కొనసాగించాడు. కొలత వేసినట్లు బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు గట్టి పునాది వేశాడు. కెప్టెన్ ధ్రువ్ జురేల్ (138 బంతుల్లో 68 బ్యాటింగ్; 5 ఫోర్లు), ఆంధ్రప్రదేశ్ ఆటగాడు షేక్ రషీద్ (92 బంతుల్లో 53 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఈ జంట అబేధ్యమైన ఐదో వికెట్కు 116 పరుగులు జోడించింది. ఆయుశ్ పాండే (25), దేవదత్ పడిక్కల్ (12), రుతురాజ్ గైక్వాడ్ (22) ఎక్కువసేపు నిలవలేకపోయారు. లంక బౌలర్లలో డిలుమ్ సుదీరా 2 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు మనవాళ్లు 3.87 రన్రేట్తో పరుగులు సాధించారు. -
రేపటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
శ్రీలంక పర్యటనలో వన్డే ట్రై-నేషన్ సిరీస్ను విజయవంతంగా ముగించిన భారత్-ఏ జట్టు ఇప్పుడు రెడ్బాల్ క్రికెట్పై దృష్టి సారించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ రేపటి నుంచి (జూన్ 25) గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. భారత్-ఏ జట్టుకు వికెట్కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జురెల్కు ఇది కెప్టెన్గా కీలక అవకాశం. జట్టు వైస్ కెప్టెన్గా దేవదత్ పడిక్కల్ వ్యవహరించనున్నాడు. ఇటీవల ముగిసిన ట్రై-నేషన్ ‘ఏ’ సిరీస్లో భారత్-ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో శ్రీలంక-ఏను 66 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు అదే జోరును నాలుగు రోజుల ఫార్మాట్లో కొనసాగించాలని భారత్-ఏ లక్ష్యంగా పెట్టుకుంది. గాలే పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లకు ఇది కఠిన పరీక్షగా మారే అవకాశం ఉంది. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న శ్రీలంక-ఏ జట్టు కూడా ప్రతిఘటన చూపేందుకు సిద్ధమవుతోంది.తొలి మ్యాచ్ రేపటి నుంచి 28 వరకు జరుగుతుండగా, రెండో మ్యాచ్ జూలై 2 నుంచి 5 వరకు గాలే వేదికగానే నిర్వహించబడుతుంది.జట్ల వివరాలు..భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, అమన్ మోఖడే, ఆయుశ్ పాండే, షేక్ రషీద్, రుతురాజ్ గైక్వాడ్, హర్షిత్ దూబే, అన్షుల్ కంబోజ్, సరాన్ష్ జైన్, ఆకిబ్ నబీ దార్, ధృవ్ జురెల్, ఎన్ జగదీశన్, గుర్నూర్ బ్రార్, యశ్ ఠాకూర్, జీషన్ అన్సారీశ్రీలంక ఏ జట్టు: నువనిదు ఫెర్నాండో, అషెన్ బండార, అహాన్ విక్రమసింఘే, అసంక మనోజ్, పవంత వీరసింఘే, సహాన్ అరచ్చిగే (కెప్టెన్), రవిందు ఫెర్నాండో, దిలుమ్ సుదీర, ప్రవీణ్ మనీషా, కేషారా నువంత, సోహన్ డి లివేరా, నిరోషన్ డిక్వెల్లా, కవిందు పతిరత్నే, మొహమ్మద్ షిరాజ్, చమిక గుణశేఖర, దులాజ్ సముదిత, -
చమరి చమక్
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు అజేయ సెంచరీతో విజృంభించింది. మహిళల టి20 వరల్డ్కప్లో భాగంగా గత మూడు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లంక సారథి ఐర్లాండ్పై విరుచుకుపడింది. సాధించాల్సిన లక్ష్యం 131 పరుగులే ఉన్నా... అందులోనే అజేయ సెంచరీతో అదరగొట్టింది. మొదట లంక బౌలర్ల క్రమశిక్షణకు ఐర్లాండ్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా... చమరి మెరుపులతో శ్రీలంక సునాయాసంగా గెలుపు తీరం దాటింది. లంకకు ఇది రెండో విజయం కాగా... ఐర్లాండ్ ఆడిన నాలుగో మ్యాచ్లోనూ పరాజయం మూటగట్టుకుంది. బ్రిస్టల్: మహిళల టి20 ప్రపంచకప్లో శ్రీలంక రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్–2లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో లంక 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. కెప్టెన్ గాబీ లూయిస్ (50 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... లీ పాల్ (27 బంతుల్లో 20; 1 ఫోర్), అలీస్ టెక్టర్ (21 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్ల ధాటికి 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ జట్టును కెప్టెన్ గాబీ ఆదుకుంది. అయితే ఆమె ఆశించినంత వేగంగా ఆడలేకపోవడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన లంక బౌలర్లు ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. మిథాలీ అయోధ్య, సుగంధిక, చమరి, నీలాక్షిక తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 15.3 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 134 పరుగులు చేసి విజయం సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ చమరి ఆటపట్టు (61 బంతుల్లో 106 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకుంది. మరో ఓపెనర్ ఇమేషా దులానీ (27 బంతుల్లో 20; 3 ఫోర్లు) కెప్టెన్కు సహకారం అందించింది. వీరిద్దరూ తొలి వికెట్కు 12 ఓవర్లలో 98 పరుగులు జోడించడంతోనే లంక గెలుపు ఖాయమైంది. బౌండరీల వరద.. గత మ్యాచ్ అనంతరం సారథిగా విఫలమయ్యానని చెప్పిన చమరి... ఇన్నింగ్స్ తొలి బంతికే ఫోర్ కొట్టి తన ఉద్దేశాన్ని చాటింది. అక్కడి నుంచి మొదలుకొని మ్యాచ్ ముగిసే వరకు బౌండరీల వరద పారించింది. మూడో, నాలుగో ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన చమరి... ఐదో ఓవర్లో మూడు ఫోర్లు అరుసుకుంది. ఏడో ఓవర్లో మరో ఫోర్తో 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. గత మూడు మ్యాచ్ల్లో వరుసగా 2, 27, 4 పరుగులు చేసిన చమరి... ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేసింది. బౌలర్తో సంబంధం లేకుండా తన ధాటిని కొనసాగించింది. హాఫ్సెంచరీ అనంతరం మరింత వేగంగా ఆడిన చమరి చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించింది. 13వ ఓవర్లో 4, 6, 4 కొట్టిన చమరి... అదే జోరులో 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. చమరికి ఇది నాలుగో అంతర్జాతీయ టి20 శతకం కావడం విశేషం. ఆమె దూకుడుతో లంక జట్టు మరో 27 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించి రన్రేట్ను కాస్త మెరుగు పరుచుకుంది. గ్రూప్–2లో ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలతో చెరో 6 పాయింట్లు సాధించి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (0.122 రన్రేట్) 2 విజయాలు, 2 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతుండగా... ఇప్పుడు రెండో విజయంతో లంక జట్టు కూడా 4 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్రేట్ (–0.973)లో వెనుకబడి పట్టిక నాలుగో ‘ప్లేస్’లో నిలిచింది. తమ తదుపరి మ్యాచ్లో శుక్రవారం స్కాట్లాండ్తో లంక తలపడనుంది. -
మాన్సూన్ మజిలీకి కేరాఫ్ అడ్రస్..
అక్కడి వర్షపు చినుకులు ప్రకృతి రంగులను మరింత గాఢంగా మార్చేస్తాయి. ప్రతి అడుగులో పచ్చని వనాలు, మేఘాల చాటున కనిపించే కొండలు, అలల మధ్య నవ్వే తీరాలు.. కల కలిసిన దేశం శ్రీలంక. భారత దేశానికి దగ్గరగా ఉన్న ఈ చిన్న ద్వీప దేశం, మాన్ సూన్ సీజన్ లో ఒక కొత్త రూపం ధరిస్తుంది. ఒక వైపు సముద్ర అలలు, మరో వైపు టీ ప్లాంటేషన్స్, ఇంకొక వైపు ప్రాచీన దేవాలయాలు, కొలనియల్ వీధులు అన్నీ కలిసి ప్రయాణాన్ని గుర్తిండిపోయే అనుభవంగా మారుస్తాయి..శ్రీలంక అనేది దక్షిణ ఆసియాలో హిందూ మహా సముద్రం మధ్య ఉన్న అందమైన ద్వీపదేశం. రాజధాని శ్రీ జయవర్ధనపుర కొట్టే కాగా, ఆ దేశ ఆర్థిక రాజధాని కొలంబో. వర్షాకాలంలో ముఖ్యంగా నైరుతీ, దేశ మధ్య భాగాలు పచ్చదనంతో మెరిసిపోతాయి. చిన్న దూరం ప్రయాణం చేస్తే బీచుల నుంచి హిల్ స్టేషన్ కి, అక్కడి నుంచి వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ వరకు సీనరీ మారిపోవడం శ్రీలంక ప్రయాణంలో ఉన్న ప్రత్యేకత.గాలే ఫేస్ గ్రీన్..కొలంబోలో ప్రయాణం మొదలైతే సముద్ర గాలి, మోడరన్ సిటీ రిథమ్ రెండూ కలిసి ఒక ఆహ్లాదకరమైన ఆరంభాన్ని ఇస్తాయి. గాలే ఫేస్ గ్రీన్ ప్రాంతంలో సాయంత్రం సమయంలో అలల మధ్య నడుస్తుంటే సమయం మెల్లగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి గాలే ఫేస్ గ్రీన్ దిశలో వెళ్లినప్పుడు డచ్ ఫోర్ట్ మధ్య నడిచే ప్రతి వీధి చరిత్రని గుర్తుచేయడం మొదలు పెడుతుంది. ఓల్డ్ బిల్డింగ్స్, స్టోన్ రోడ్స్, సముద్ర అలల మధ్య ఈ ప్రదేశం ఒక పెయింటింగ్లా ఉంటుంది.కేండీ చేరిన వెంటనే పరిసరాలు పూర్తిగా మారిపోతాయి. కొండల మధ్య ఉన్న ఈ నగరంలో మేఘాలు దిగివచ్చినట్టు ఉంటాయి. టెంపుల్ ఆఫ్ టూత్ చుట్టూ ఉన్న ప్రశాంతత యాత్రకు మరో అర్థం ఇస్తుంది. సరస్సు పక్కన సాయంత్రం నడిచే సమయం చాలా మధురంగా అనిపిస్తుంది.నువారా ఎలియాకి చేరిన తరువాత టీ ప్లాంటేషన్స్ మధ్య వెళ్తున్న రైల్ జర్నీ ఒక సినిమా సీన్ లా ఉంటుంది. పచ్చని టీ తోటలు, చిన్న చిన్న జల΄ాతాలు, మేఘాల మధ్య కనిపించే స్టేషన్స్ ప్రతి నిమిషం కెమెరాలో కాకుండా మనసులో నిలిచిపోయే దృశ్యాలుగా మిగిలిపోతాయి.ఎల్లాలో నైన్ ఆర్చ్ బ్రిడ్జి దగ్గర రైలు మెల్లగా వెళ్తుంటే ఈ శబ్దం మధ్య ప్రకృతి ఒక సంగీతం వినిపిస్తున్నట్టు ఉంటుంది. లిటిల్ ఆడమ్స్ పీక్పై గాలి నిలబడి చూస్తే మేఘాల కింద ప్రపంచం వెలుగుతున్నట్టు కనిపిస్తుంది. యాలా నేషనల్ ΄ార్క్లో ప్రకృతి ఇంకో రూపం కనిపిస్తుంది. అడవి మధ్య సఫారీ చేస్తూ జింకలు, ఏనుగులు, పక్షులను చూడటం ప్రయాణానికి ఇంకో అనుభవం కలిగిస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి కొలంబోకి డైరెక్ట్ ఫ్లైట్స్, వన్ స్టాప్ ఫ్లైట్స్ రెగ్యులర్గా ఉంటాయి. సుమారు రెండు నుండి నాలుగు గంటల ప్రయాణం తరువాత సముద్రం మధ్య ఉన్న ఈ ఐలాండ్ని చేరుకుంటారు. ఎయిర్పోర్టు నుండి బయటకి వచ్చిన వెంటనే తేమతో కూడుకున్న గాలి, కొబ్బరి చెట్లు, సముద్ర వాసనలు లంకకి స్వాగతం చెబుతాయి.విజయవాడ నుంచి ప్రయాణం చేయాలి అనుకునే వారు హైదరాబాద్ లేదా చెన్నై నుంచి కొలంబోకి విమానంలో చేరుకోవచ్చు. ఫ్లైట్ జర్నీ చిన్నదిగా ఉండటం వల్ల వీకెండ్ హాలిడేస్ని కలుపుకుని కూడా మంచి మాన్ సూన్ వెకేషన్ ప్లాన్ చేసుకోవచ్చు.శ్రీలంకలో రైల్ జర్నీలు కూడా ఈ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం. కేండీ నుంచి ఎల్లా వరకు వెళ్లే ట్రైన్ రూట్ ప్రపంచంలో అందమైన రైల్వే జర్నీస్లో ఒకటిగా అనిపిస్తుంది. విండో పక్కన కూర్చొని బయటి ప్రకృతిని చూస్తూ వెళ్తే దూరం అనేది పెద్ద భాగంగా అనిపించదు.ఎక్కడ ఉండాలి?కొలంబోలో బీచ్ ఫేసింగ్ హోటల్స్ నుంచి బోటీక్ స్టేస్ వరకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. గాలేలో కాలనియల్ స్టైల్ హెరిటేజ్ హోటల్స్ అనేవి ఓల్డ్ వరల్డ్ చార్మ్ని అందిస్తాయి. కేండీలో లేక్ వ్యూ రిసార్ట్స్ ప్రశాంతతని కలిగిస్తాయి. నువారా ఎలియాలో బ్రిటిష్ స్టైల్ కాటేజీలు, టీ ఎస్టేట్ బంగ్లాల్లో ఉండటం ఒక నాస్టాల్జిక్ ఎక్స్పీరియెన్స్లా ఉంటుంది. ఎల్లాలో కొండల మధ్య ఉన్న ఎకో స్టేస్లో ప్రతి ఉదయం మేఘాల మధ్య కాఫీ తాగడం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?శ్రీలంక రుచులు మన సౌత్ ఇండియా ఫ్లేవర్స్కి దగ్గరగా ఉన్నా వాటి స్పెషాలిటీ వాటిదే. రైస్, కర్రీ ప్రతి భోజనంలో ఒక కొత్త కాంబినేషన్ ఇస్తుంది. హాపర్స్, స్ట్రింగ్ హాపర్స్, కొట్టు రోటి, పోల్ సంభోల్, ఫిష్ కర్రీ, కోకోనట్ కర్రీస్ రుచులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సాయంత్రం ఒక హాట్ సిలోన్ టీతో మేఘాలు చూస్తూ గడిపే నిమిషాలు ప్రయాణంలో అత్యంత మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.ఆసక్తికరమైన విషయాలు..శ్రీలంకని పర్ల్ ఆఫ్ ది ఓషియన్, భారత దేశపు కన్నీటి బిందువు అని కూడా పిలుస్తారు.కేండీ నుంచి ఎల్లా రైల్వే జర్నీ ప్రపంచంలో అత్యంత అందమైన ట్రైన్ జర్నీ రూట్స్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.సీలోన్ టీ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేక సంఖ్యలో ఉన్న దేశాల్లో శ్రీలంక కూడా ఒకటి.మాన్ సూన్ సీజన్ లో టీ ప్లాంటేషన్స్, వాటర్ఫాల్స్, అడవులు మరింత పచ్చగా కనిపిస్తాయి.యాత్ర బడ్జెట్ వివరాలు..హైదరాబాద్ నుండి 5 రోజుల శ్రీలంక మాన్ సూన్ ట్రిప్కి బడ్జెట్ ప్యాకేజీ సుమారు రూ.45,000 నుండి రూ.60 వేల మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంఫర్ట్ ట్రిప్ రూ.65 వేల నుండి రూ.90 వేల వరకు ఉంటుంది. ప్రీమియం ఎక్స్పీరియెన్స్ రిసార్టులు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కలిపి రూ.1.10 లక్షల వరకు పైకి వెళ్లవచ్చు.విజయవాడ నుండి ప్రయాణం చేస్తే హైదరాబాద్ లేదా చెన్నై కనెక్టింగ్ ఫ్లైట్ బట్టి కొంచెం ట్రావెల్ కాస్ట్ మారవచ్చు. స్టే చార్జీలు బడ్జెట్ హోటల్స్లో రాత్రికి రూ.2,500 నుండి మొదలై ప్రీమియం రిసార్టులు రూ.15 వేలు లేదా దానికన్నా ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.2,000 మధ్య సరిపోతుంది. లోకల్ సైట్ సీయింగ్ ప్యాకేజీలు, సీనిక్ ట్రైన్ జర్నీలు, వైల్డ్ లైఫ్ సఫారీ, టీ ఎస్టేట్స్ ఎక్స్పీరియెన్స్ని కలిపి కంప్లీట్ ప్లాన్ చేసుకోవచ్చు.ఇండియన్ ΄ాస్పోర్ట్ హోల్డర్స్కి శ్రీలంక ఎంట్రీ కోసం వీసా అవసరం లేదు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా ముందుగా అప్లై చేసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవడం సులభం.ఏం చూడాలి?శ్రీలంకాలో ప్రతి రోజు ఒక కొత్త రంగులో ప్రారంభం అవుతుంది. ఒక రోజు సన్ రైజ్ బీచ్పై కనిపిస్తుంది. మరొక రోజు టీ ప్లాంటేషన్స్ మధ్య మేఘాలు దిగివస్తాయి. ఇంకొక రోజు పురాతన ఆలయాల గంటల నాదం వినిపిస్తుంది. సముద్రంపై సాయంత్రం సూర్యాస్తమయం చూస్తుంటే ఆ వెలుగు నీళ్లపై పడిన ప్రతి నిమిషం ఒక పెయింటింగ్లా మారిపోతుంది.వేల్ వాచింగ్ సీజన్ లో మిరిస్సా దగ్గర సముద్రంపై వెళ్తుంటే ప్రకృతి విస్తృత రూపం కనిపిస్తుంది. టీ ఫ్యాక్టరీ విజిట్లో ఒక కప్ సిలోన్ టీ వెనుక ఉన్న కష్టం తెలుస్తుంది.లోకల్ మార్కెట్లో రంగురంగుల పండ్లు, మసాలాలు, హ్యాండీక్రాఫ్ట్స్ మధ్య నడుస్తుంటే లంక జీవనశైలిని పూర్తిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆయుర్వేద వెల్నెస్ ఎక్స్పీరియెన్సెస్, సీనిక్ ట్రైన్ రైడ్, బీచ్ వాక్స్, వైల్డ్ లైఫ్ సఫారీలు, టీ ఎస్టేట్ మార్నింగ్ వాక్స్ ఇవన్నీ ఈ యాత్రని పూర్తి చేస్తాయి. – ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
సూర్యవంశీ విధ్వసం.. 11బంతుల్లో హాఫ్ సెంచరీ
-
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్కు దంబుల్లా వేదిక. -
శ్రీలంక మాజీ అధ్యక్షుడి కుమారుడు అరెస్ట్
అవినీతి కేసులో శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్స బుధవారం అరెస్టయ్యాడు. 38 ఏళ్ల యోషిత నౌకాదళ అధికారిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ నిధులను ఉపయోగించి విదేశీ శిక్షణ పొందినట్లు అవినీతి నిరోధక కమిషన్ ఆరోపించింది.అవసరమైన అర్హతలు లేకపోయినా నౌకాదళంలో నియామకం పొందడం, అనంతరం ప్రభుత్వ ఖర్చుతో బ్రిటన్లో శిక్షణకు వెళ్లడంపై దర్యాప్తు జరుగుతోందని కమిషన్ వెల్లడించింది.యోషిత ఇప్పటికే రెండు మనీలాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, విదేశీ ప్రయాణాలపై కూడా నిషేధం అమల్లో ఉంది. ఈ కేసుల్లో బెయిల్పై ఉన్న అతడిని తాజా ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు.మరోపక్క మహింద రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స్ కూడా ఇటీవల న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. 2019 ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అరెస్టు అవకాశాలను నివారించాలని ఆయన కోర్టును ఆశ్రయించగా, ఈ నెల ప్రారంభంలో అతడి విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించబడింది. -
దోషిగా తేలిన శ్రీలంక ప్లేయర్.. మరో సీనియర్కు తప్పని శిక్ష..
-
వైభవ్ కోసం గంటసేపు వెయిట్ చేసిన శ్రీలంక ఫస్ట్ ODI కెప్టెన్ అనుర టెన్నెకూన్
-
టీ20 ప్రపంచకప్లో సంచలనం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్కు శ్రీలంక జట్టు ఊహించని షాకిచ్చింది. సౌతాంప్టన్ వేదికగా ఇవాళ (జూన్ 16) జరిగిన మ్యాచ్లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. కెప్టెన్ అమేలియా కెర్ (45), సోఫీ డివైన్ (45) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లతో సత్తా చాటగా.. మిథాలీ అయోధ్య, సుగంధిక కుమారి, కెప్టెన్ చమారీ ఆటపట్టు, నిమష మీపగే తలో వికెట్ తీశారు.అనంతరం 151 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆదిలో తడబడినప్పటికీ (55 పరుగులకే 4 వికెట్లు).. నిలాక్షిక డిసిల్వ (54 నాటౌట్), కౌషని నుత్యాంగన (24 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో మెరిసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ సత్తా చాటడంతో లంక జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే (19.4 ఓవర్లు) లక్ష్యాన్ని చేరుకుంది (5 వికెట్ల నష్టానికి). కివీస్ బౌలర్లలో నెన్సి పటేల్ (4-0-23-2), రోస్మేరి (4-1-28-0), బ్రీ ఇల్లింగ్ (4-0-33-1) రాణించినా నిలాక్షిక, కౌషని జోడీని నిలువరించలేకపోయారు.ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఇది వరుసగా రెండో ఓటమి. శ్రీలంకకు ముందు ఈ జట్టు విండీస్ చేతిలో కూడా చిత్తైంది. లంక విషయానికొస్తే.. ఈ ఎడిషన్లో ఈ జట్టుకు ఇదే తొలి గెలుపు. దీనికి ముందు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడింది. -
ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు శ్రీలంక-ఏ చేతిలో సూపర్ ఓవర్ ఓటమి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కారణంగా ఇండియా-ఏ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసిన ఇండియా-ఏ ఆ తర్వాత అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్లో అనూహ్య ఓటమి చవిచూసింది. ఇక సోమవారం లంకతో జరిగిన మ్యాచ్లో హైడ్రామా నడుమ సూపర్ ఓవర్లో ఓటమిపాలై రెండో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో మూడు మ్యాచ్ల్లో రెండింట ఓడి ఒక మ్యాచ్లో గెలిచి పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.ఆఫ్గన్పై గెలిచినా..బుధవారం అఫ్గానిస్తాన్ జట్టుతో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో గెలవడమే కాదు భారీ రన్రేట్ సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ చేతిలో ఓడిపోతే మాత్రం ఇండియా-ఏ జట్టు ఇంటిదారి పట్టాల్సిందే. అదే సమయంలో అఫ్గానిస్తాన్ జట్టు లంకతో జరిగే తమ చివరి మ్యాచ్లో గెలిస్తే మాత్రం సమీకరణాలు మారిపోనున్నాయి. ఎందుకంటే ఆఫ్గన్పై ఇండియా గెలిచి, శ్రీలంకపై ఆఫ్గన్ గెలిస్తే.. ఇరుజట్లు నాలుగు మ్యాచ్ల్లో రెండేసి విజయాలతో ఉంటాయి.కీలకం కానున్న నెట్ రన్రేట్ అప్పుడు నెట్ రన్రేట్ కీలకం కానుంది. ఈ రెండు జట్లలో మెరుగైన రన్రేట్ ఉన్న జట్టు ఫైనల్లో అడుగుపెట్టనుంది. అయితే ప్రస్తుతం రన్రేట్ విషయంలో అఫ్గానిస్తాన్ (-1.392)తో పోలిస్తే ఇండియా-ఏ (+0.330)ది పైచేయిగా ఉంది. ఒకవేళ ఆఫ్గన్ లంకతో చివరి మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే మాత్రం మెరుగైన రన్రేట్తో ఫైనల్కు వెళ్లే అవకాశముంది. కాబట్టి ఆఫ్గన్కు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే వారిపై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు ఇండియా-ఏ జట్టు ముందున్న తక్షణ కర్తవ్యం. అయితే శ్రీలంకతో మ్యాచ్లో టాపార్డర్, మిడిలార్డర్ పూర్తిగా విఫలమవ్వడం జట్టు కొంపముంచింది. లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్ హెగ్డె, విప్రజ్ నిగమ్లు ఆడకపోయుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. శ్రీలంకతో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక జట్టు కూడా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 16 పరుగులు చేయగా, భారత్ 9 పరుగులకే పరిమితమయ్యి ఓటమి చవిచూసింది.Read: లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా! -
లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్పై నిషేధం తప్పదా!
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్గా నిలిచింది. లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.అసలేం జరిగింది?మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్ వైపు వెళుతున్న విశేన్ హలంబాగేను వైభవ్ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్ ఆటగాడు డిక్వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది. జాతీయ జట్టులో చోటుఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్ను ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. మూడు మ్యాచ్లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026A heated moment between Tilak Verma and Umpire. 🤯 pic.twitter.com/pe67HdkoHK— Qamar. (@Qamar5618) June 15, 2026 -
సూర్యాన్ష్ మెరుపులు.. ఇండియా-ఏ భారీ స్కోరు
ముక్కోనఫు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సూర్యాన్ష్ షెడ్గే (72 పరుగులు) ఇన్నింగ్స్కు తోడు విప్రాజ్ నిగమ్ (51) సంచలన అర్థసెంచరీ చేయడంతో ఇండియా-ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ (21) మరోసారి నిరాశపరచగా, రుతురాజ్ గైక్వాడ్ (37), కెప్టెన్ తిలక్ వర్మ (23) పర్వాలేదనిపించారు. ఒక దశలో 143 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇండియా-ఏ జట్టును సూర్యాన్ష్, విప్రజ్ ఆదుకున్నారు. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట లోయర్ ఆర్డర్లో సూర్యాన్ష్, విప్రజ్ నిగమ్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించారు. ఈ ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్కు 104 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో విజయ్కాంత్ వియస్కాంత్ 3 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: పాక్ ప్లేయర్ కవ్వింపు చర్యలు.. గొంతుపట్టుకున్న హర్మన్! -
షనక మెరుపులు
కింగ్స్టన్: వెస్టిండీస్తో తొలి టి20లో ఓటమి పాలైన శ్రీలంక జట్టు... రెండో మ్యాచ్లో సమష్టి ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కమిల్ మిషారా (40 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దసున్ షనక (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. విండీస్ బౌలర్లలో షామార్ జోసెఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18.1 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. రావ్మన్ పావెల్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్లు), హెట్మైర్ (26 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కాస్త పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. లంక బౌలర్లలో హసరంగ, చమీర చెరో మూడు వికెట్లు పడగొట్టారు. -
ఇండియా-ఏకు భారీ షాక్.. వైభవ్ సూర్యవంశీకి గాయం!
ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం శ్రీలంకతో జరగనున్న వన్డే మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆడేది అనుమానంగానే ఉంది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్కు వచ్చిన వచ్చిన వైభవ్ సూర్యవంశీ గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైభవ్ ప్రాక్టీస్ మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే నివేదికలో వైభవ్ సూర్యవంశీ గాయం తీవ్రత ఎంత అనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇక రేపు శ్రీలంక-ఏతో జరగనున్న మ్యాచ్కు వైభవ్ దూరమైతే అతడి స్థానంలో నిశాంత్ సింధును జట్టులోకి తీసుకునే అవకాశముంది. ఎలాగూ టాపార్డర్లో ప్రభ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ ఉండడంతో వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా వస్తే, ఒకరు వన్డౌన్లో రావడం ఖాయం. కెప్టెన్ తిలక్ వర్మ నాలుగో స్థానంలో ఆడుతాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో విఫలమైనప్పటికీ, రెండో మ్యాచ్లో మాత్రం 22 బంతుల్లో 44 పరుగులతో తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు.అయితే వైభవ్ సూర్యవంశీ గాయం అప్డేట్పై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రాబోయే ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ ఆడే టీమిండియా జట్టులో వైభవ్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్కు గాయం తీవ్రత ఎక్కువగా లేకపోతే రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు ఆడే సువర్ణావకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలన బ్యాటింగ్తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ అనూహ్యంగా టీమిండియాలోకి ఎంపిక చేసింది. ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు కూడా వైభవ్ సూర్యవంశీ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఒకవేళ ఐర్లాండ్తో పర్యటనకు ముందే సూర్యవంశీ ఫిట్నెస్ నిరూపించుకుంటే, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరఫున అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచే అవకాశముంది. -
భారత అండర్–19 జట్టులో ప్రతీక్ష
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే మహిళల అండర్–19 వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన వి.ప్రతీక్ష ఎంపికైంది. భవికా అహిరే నేతృత్వంలో బరిలోకి దిగే 15 మంది సభ్యుల టీమ్లో ప్రతీక్షకు అవకాశం దక్కింది. నగరంలోని మీర్ అకాడమీలో కోచ్లు ముస్తఫా అలీ, వసీం అలీ వద్ద ప్రతీక్ష శిక్షణ పొందుతోంది. ఇటీవల దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడంతో ఆమె ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు జట్టులో స్థానం కల్పించారు. జూన్ 30, జులై 3, 6 తేదీల్లో భారత్, శ్రీలంక టీమ్ల మధ్య పుదుచ్చేరిలో మూడు వన్డేలు జరుగుతాయి. భారత అండర్–19 మహిళల జట్టు: భవికా అహిరే (కెప్టెన్), ఇరా జాదవ్, దియా యాదవ్, ఈశ్వరి, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పలక్, మహక్, కాశ్వీ, విధి పర్మార్, గౌరి గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె.దీక్ష. -
ఆడేద్దాం... ధనాధన్
ఒకవైపు క్రీడా లోకమంతా సాకర్ ఫీవర్లో మునిగి తేలుతుంటే... మరోవైపు ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్నకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా 24 రోజుల పాటు జరగనున్న మహిళల మహా సంగ్రామంలో 12 జట్లు ట్రోఫీ కోసం కొట్లాడనున్నాయి. గతేడాది వన్డే ప్రపంచకప్ చేజిక్కించుకొని జోరుమీదున్న టీమిండియా... టి20 ఫార్మాట్లోనూ విశ్వ విజేత అనిపించుకోవాలని తహతహలాడుతుంటే... గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తాపడ్డ దక్షిణాఫ్రికా ఈసారైనా కప్పును ఒడిసిపట్టాలని కృతనిశ్చయంతో ఉంది!మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు టైటిల్ నెగ్గిన ఆ్రస్టేలియా ఏడో కప్పు ఖాతాలో వేసుకోవాలనుకుంటుంటే... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ తమ పట్టు కొనసాగించాలని చూస్తోంది! సంచలన ప్రదర్శనతో రెండోసారి చాంపియన్గా నిలవాలని వెస్టిండీస్ భావిస్తుంటే... అప్పుడెప్పుడో ఈ ఫార్మాట్లో జరిగిన తొలి వరల్డ్కప్లో ట్రోఫీ నెగ్గిన ఇంగ్లండ్... ఇప్పుడు ఆతిథ్య హోదాలో రెండోసారి టైటిల్ హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది! మరెందుకు ఆలస్యం... అటు ‘ఫిఫా’ ప్రపంచకప్తో పాటు ఇటు... టి20 మెరుపులు చూసేందుకు సిద్ధమైపోదాం. –సాక్షి, క్రీడావిభాగంరెండేళ్లకోసారి జరిగే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ మరోసారి సందడి చేసేందుకు మన ముందుకు వచ్చేసింది. తొలి ప్రపంచకప్ తర్వాత ఇప్పుడు పదో టోర్నీకి మరోసారి ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తుండగా... 7 వేదికల్లో మొత్తం 33 మ్యాచ్లు నిర్వహించనున్నారు. 12 జట్లు ట్రోఫీ కోసం అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా... వచ్చే నెల 5న విఖ్యాత లార్డ్స్ మైదానంలో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది వరల్డ్కప్లలో ఆరుసార్లు చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా... తమ ఆధిపత్యం కనబర్చాలని చూస్తుంటే... ఇప్పటి వరకు ఒక్కోసారి ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్... రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తున్నాయి. ఇక ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా వరల్డ్కప్ గెలవని భారత్, దక్షిణాఫ్రికా తమ చిరకాల స్వప్నం సాకారం చేసుకోవాలని భావిస్తున్నాయి. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో విజేతగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... పొట్టి ఫార్మాట్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)తో రాటుదేలిన భారత అమ్మాయిలు... విశ్వ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్తో టి20 సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ... ప్రధాన టోర్నీలో దూకుడే మంత్రంగా ఆడుతామని హర్మన్ వెల్లడించింది. ఇక గత రెండు (2023, 2024) వరల్డ్కప్లలో ఫైనల్లో ఓడిన దక్షిణాఫ్రికా బలమైన బృందంతో బరిలోకి దిగనుంది. సొంతగడ్డ ఇంగ్లండ్కు అనుకూలం కానుండగా... డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్కు ఆల్రౌండర్ల బలగం దండిగా ఉంది. శుక్రవారం శ్రీలంక, ఇంగ్లండ్ మ్యాచ్తో ఈ టోర్నీకి తెరలేవనుండగా... టీమిండియా తమ తొలి మ్యాచ్లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఎంపిక ఇలా... బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చి న 2024 టి20 ప్రపంచకప్లో 10 జట్లు పాల్గొనగా... ఇప్పుడా సంఖ్యను 12కు పెంచారు. ఆతిథ్య హోదాలో ఇంగ్లండ్ నేరుగా వరల్డ్కప్నకు అర్హత సాధించగా... 2024 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఐదు జట్లతో పాటు... ఐసీసీ మహిళల టి20 ర్యాంకింగ్స్లో అత్యుత్తమ రెండు జట్లను కూడా నేరుగా మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక మిగిలిన నాలుగు జట్లను క్వాలిఫయర్ టోర్నీల ద్వారా నిర్ణయించారు. మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూప్లోని మిగిలిన ఐదు జట్లతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూప్ల్లో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. ప్రైజ్మనీ ఎంతంటే... ఈ టోర్నీ మొత్తం ప్రైజ్మనీ 8 లక్షల 76 వేల డాలర్లు (సుమారు రూ. 83 కోట్లు). విజేతకు 23 లక్షల డాలర్లు (రూ. 22 కోట్లు) లభించనుండగా... రన్నరప్ జట్టుకు 11 లక్షల డాలర్లు (రూ. 11 కోట్లు) దక్కనున్నాయి. సెమీస్లో ఓడిన జట్లకు 6 లక్షల డాలర్ల (రూ. 6 కోట్లు) చొప్పున లభించనున్నాయి. 10 ఇది పదో మహిళల టి20 ప్రపంచకప్. 2009లో తొలిసారి ఇంగ్లండ్, వేల్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగగా... మళ్లీ ఇప్పుడు పదో ఎడిషన్ వరల్డ్కప్నకు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. తొలి టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఎప్పుడూ ట్రోఫీని అందుకోలేదు. 6 ఆ్రస్టేలియా గెలిచిన టి20 వరల్డ్కప్ ట్రోఫీలు. 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆ్రస్టేలియా చాంపియన్గా నిలవగా... ఇంగ్లండ్ (2009), వెస్టిండీస్ (2016), న్యూజిలాండ్ (2024) ఒక్కోసారి ట్రోఫీ దక్కించుకున్నాయి. భారత్ అత్యుత్తమంగా 2020లో రన్నరప్గా నిలిచింది. -
భారత్ – ఎ జట్టులో రషీద్కు చోటు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక్ రషీద్ భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీ మెన్ కమిటీ సభ్యుడు టీవీ శివరామకృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి శ్రీలంకలో జరగనున్న టోరీ్నలో భారత్– ఏ జట్టు తరఫున రషీద్ ఆడనున్నారన్నారు.గతంలో రషీద్ భారత అండర్– 19 వరల్డ్ కప్ పోటీల్లో వైస్ కెపె్టన్గా వ్యవహరించడమే కాకుండా, వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది రంజీ మ్యాచ్ల్లో అద్భుత ప్రతిభ కనబరచడం ద్వారా భారత్ –ఎ జట్టులో స్థానం సంపాదించాడు. రషీద్కు త్రీమెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, టీవీ శివరామకృష్ణ, సీహెచ్ నాగరాజు తదితరులు అభినందనలు తెలిపారు. -
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..
-
ఎందుకు అలా చేశావు.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్!
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత తొలిసారి బ్యాట్ ఝుళిపించాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ తరపున వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకపై విఫలమైనప్పటికి అఫ్గాన్పై మాత్రం అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు.15 ఏళ్ల సూర్యవంశీ తనదైన శైలిలో జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం గమనార్హం. అతడు దూకుడు చూసి సెంచరీ బాదడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్గా వైభవ్ మలుచుకోలేకపోయాడు.చెత్త షాట్ ఆడి..కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికి. తనకు ఉన్న ఏకైక వీక్నెస్ ఈ మ్యాచ్లోనూ బయటపడింది. 'షార్ట్ ఆఫ్ ఎ లెంగ్త్' బంతికి మరోసారి తన వికెట్ను కోల్పోయాడు. ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్జాయ్ టీమిండియా ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన అబ్దుల్లా అహ్మద్జాయ్.. తొలి బంతిని ఆఫ్ స్టంప్కు వెలుపలగా షార్ట్ పిచ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని అతడు రాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.కానీ ఎక్స్ట్రా బౌన్స్ కారణంగా బంతి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. అసలు ఆ బంతికి ఆ షాట్ ఆడాల్సిన అవసరం లేదు. కానీ అనవసరంగా లేని షాట్ను ఆడి తన హాఫ్ సెంచరీని కోల్పోయాడు. ఐపీఎల్-2026లోనూ చాలా మ్యాచ్లలో షార్ట్ లెంగ్త్ బంతికే వైభవ్ ఔటయ్యాడు. అతడి బలహీనతను పసిగట్టిన అఫ్గాన్ పేసర్.. ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేసి బోల్తా కొట్టించాడు. -
ఓటమి అంచుల నుంచి...
దంబుల్లా: 278 పరుగుల లక్ష్యఛేదనలో 47 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ‘ఎ’ జట్టు 261/6తో నిలిచింది. ఆ జట్టు విజయానికి 18 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా... చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ సహాన్ (72 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకంతో జోరు మీదున్నాడు. ఇంకేముంది ముక్కోణపు వన్డే టోర్నీలో శ్రీలంక ‘ఎ’ జట్టు విజయం సాధించడం తథ్యమే అనుకుంటే... అక్కడే భారత ‘ఎ’ బౌలర్లు అద్భుతం చేశారు. 48వ ఓవర్లో 7 పరుగులు ఇ చ్చిన అన్షుల్ కంబోజ్... ప్రత్యర్థి కెప్టెన్ను అవుట్ చేయగా... అర్షద్ ఖాన్ వేసిన 49వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ‘ఎ’ జట్టు 8 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రుతురాజ్ గైక్వాడ్ (114 బంతుల్లో 101; 6 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా... కెప్టెన్ తిలక్ వర్మ ( 97 బంతుల్లో 60; 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 14; 3 ఫోర్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (2) విఫలమయ్యారు. భారత ‘ఎ’ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్లో వైభవ్... ఐపీఎల్ జోరు కనబర్చలేకపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (32; 4 ఫోర్లు, 1 సిక్స్), ఆయుశ్ బదోనీ (24; 2 ఫోర్లు), సూర్యాన్ష్ షెడ్గె (26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా కొన్ని పరుగులు చేశారు. లంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో లంక 48.5 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. సహాన్తో పాటు డికెవెల్లా (47), అవిష్క(45), సదీరా సమరవిక్రమ (46) రాణించారు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించడంలో సఫలమైన భారత జట్టును విజయం వరించింది. భారత ‘ఎ’ బౌలర్లలో అర్షద్ ఖాన్, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోనీ, విప్రాజ్ నిగమ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. గురువారం జరగనున్న రెండో లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తలపడనుంది. -
ఇద్దరు ప్రపంచకప్ సభ్యులపై వేటు
జూన్ 11 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 9) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ముగ్గురు టీ20 ప్రపంచకప్ 2026 సభ్యులకు చోటు దక్కలేదు. ఇందులో ఇద్దరిపై (జాన్సన్ ఛార్లెన్, క్వింటన్ సాంప్సన్) వేటు పడగా.. అల్జరీ జోసఫ్కు వర్క్లోడ్ కారణంగా విశ్రాంతినిచ్చారు. యువ ఆటగాళ్లు ఆకీమ్ ఆగస్టే, జువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్లకు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. విధ్వంసకర వీరులు హెట్మైర్, రూథర్ఫోర్డ్, షెపర్డ్, పావెల్, హోల్డర్ తమ స్థానాలను నిలుపుకున్నారు. శ్రీలంకతో ఈ సిరీస్ జూన్ 12, 14, 15 తేదీల్లో జమైకాలోని సబీనా పార్క్ వేదికగా జరుగనుంది.శ్రీలంకతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టుషాయ్ హోప్ (సి), జువెల్ ఆండ్రూ, అకీమ్ అగస్టే, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్కాగా, శ్రీలంక క్రికెట్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అంతకుముందు రెండో వన్డే కూడా వర్షార్పణం అయ్యింది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక వన్డేలో గెలవడంతో శ్రీలంక సిరీస్ను కైవసం చేసుకుంది.స్వదేశంలో సిరీస్ కోల్పోవడంతో విండీస్ జట్టు 2027 వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. 2023-27 సైకిల్లో విండీస్ ప్రస్తుతం పదో స్థానంలో ఉంది. టాప్-8లో ఉన్న జట్లు మాత్రమే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలు ఆటోమేటిక్గా టోర్నీలోకి అడుగుపెడతాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా అక్టోబరు-నవంబరు మధ్య జరుగనున్న సంగతి తెలిసిందే. -
శ్రీలంక, వెస్టిండీస్ రెండో వన్డే వర్షార్పణం
శ్రీలంక, వెస్టిండీస్ మధ్య ఆదివారం జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం అయింది. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంక 41 పరుగులు తేడాతో విజయం సాధించింది.దీంతో ప్రస్తుతం లంక జట్టు సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్స్టన్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం లంక జట్టుకు అదే తొలి విజయం. అలాగే కరీబియన్ దీవుల్లో శ్రీలంక జట్టుకు 13 ఏళ్ల తర్వాత ఇదే తొలి వన్డే గెలుపు. ఆదివారం జరగాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనుకుంటే... భారీ వర్షం కారణంగా అది సాధ్యపడలేదు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది.చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! కేవలం 10 బంతుల్లోనే -
మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్లో మెరుపులు మెరిపించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత్-ఎ జట్టు తరపున సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్యవంశీకి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెటర్ తన లగేజ్తో పాటు బస్సు వైపు వెళ్తుండగా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.As soon as Vaibhav Suryavanshi arrived in Sri Lanka, he looked a bit upset. There was sadness and slight frustration visible on his face. He also seemed bothered by the fans, and his disappointment was clearly noticeable while taking pictures with them.👀 pic.twitter.com/8H48R1VLld— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 5, 2026 -
రియల్ పెద్ది షాకింగ్ జర్నీ
ఒకప్పుడు క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలర్గా తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది!. ఇప్పుడు అదే అతన్ని మరో రంగంలో.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసే స్థాయికి చేరుకునేలా చేసింది. తాజాగా.. అంతర్జాతీయ వేదికలో అతని ప్రదర్శన చూసినవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. రీల్ లైఫ్లో పెద్ది రాంచరణ్లా.. రియల్ లైఫ్లోనూ ఈ ‘పెద్ది’ క్రాస్ అథ్లెటిక్స్తో క్రీడారంగంలో హాట్ టాపిక్గా మారాడు. తాజాగా.. రోమ్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేష్ తరంగ పతిరగే(23) అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో ప్రయత్నంలోనే అతను 92.62 మీటర్ల జావెలిన్ విసిరి మీట్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ త్రోతో అతను కేవలం శ్రీలంక నేషనల్ రికార్డ్ మాత్రమే కాదు.. 2026 సీజన్లో ప్రపంచంలోనే బెస్ట్ త్రో కూడా నమోదు చేశాడు.ఈ అద్భుత ప్రదర్శనతో రుమేష్, పురుషుల జావెలిన్లో 90 మీటర్ల మార్క్ దాటిన కేవలం నాలుగు ఆసియా అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు. తద్వారా భారత స్టార్ నీరజ్ చోప్రా, పాకిస్తాన్ అర్షద్ నదీమ్, చైనీస్ తైపీకి చెందిన చెంగ్ చావో-త్సున్ తర్వాత ఈ క్లబ్లో చేరిన నాలుగో ఆసియా క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 21 ఏళ్ల చరిత్రలో.. జావెలిన్లో ఇది 21వ బెస్ట్ త్రోగా నమోదైంది. ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్ రిపబ్లిక్ దిగ్గజం జాన్ జెలెజ్నీ పేరిట ఉంది.రుమేష్ ప్రయాణం ఆసక్తికరం.. పెద్దిలో హీరో రాంచరణ్.. క్రికెట్ నుంచి కుస్తీ.. అక్కడి నుంచి అథ్లెటిక్గా ప్రయాణం చేస్తాడు. అలాగే.. ఈ రియల్ లైఫ్ పెద్ది రుమేష్ ప్రయాణం కూడా క్రికెట్ తోనే ప్రారంభమైంది. అలాగని.. బ్యాట్స్మన్గా మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్గా!. కొలంబోకు దక్షిణంగా ఉన్న చిన్న తీర పట్టణం కలుతరాకు చెందిన ఇతగాడు.. చాలా మంది పిల్లల్లాగే క్రికెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. అండర్-18 స్థాయిలో గంటకు 134 కి.మీ వేగంతో బంతులు వేసిన ప్రతిభావంతుడు అతను. కొలంబోలోని సెయింట్ పీటర్స్ కాలేజీ తరఫున తన ఏకైక పోటీ మ్యాచ్లోనూ అతను అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు తీసి, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అది అతని క్రికెట్ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్లే స్థాయి ప్రదర్శనగా నిలిచింది. అయితే తర్వాతి రోజుల్లో అతనికి అవకాశాలు పెద్దగా దక్కలేదు. టీ20 లీగ్ల ప్రభావం.. జాతీయ జట్టుకు చేరడంలో ఉన్న కఠిన పోటీ.. పైగా రాజకీయాల కారణంగా అతను క్రికెట్కు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. ఆపై అథ్లెటిక్స్ వైపు మలుపు తీసుకున్నాడు.2017లో జావెలిన్ త్రో ప్రారంభించిన అతను మొదటిసారి 30 మీటర్లు మాత్రమే విసిరాడు. కానీ తండ్రి మార్గదర్శకత్వంలో వేగంగా ఎదిగి కొన్ని నెలల్లోనే 60 మీటర్లకు పైగా చేరుకున్నాడు. 2024 నాటికి 85 మీటర్ల మార్క్ దాటాడు. 2025లో నీరజ్ చోప్రా క్లాసిక్లో కూడా పోడియం ఫినిష్ సాధించి తన స్థాయిని నిరూపించుకున్నాడు.తాజాగా రోమ్లో నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి స్టార్లు లేకపోయినా, రుమేష్ మాత్రం తన త్రోతో అందరినీ వెనక్కి నెట్టాడు. అతని తర్వాతి ప్రయత్నాల్లో ఫౌల్స్ వచ్చినా, ఎవరూ అతని దూరానికి దగ్గర కాలేకపోయారు.క్రికెట్ నుంచి జావెలిన్కి మారిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్లో కొత్త స్టార్గా ఎదుగుతున్నాడు. రుమేష్ పతిరగే త్రో కేవలం రికార్డు కాదు… అది ఒక కొత్త “ఏషియన్ డామినెన్స్” ప్రారంభం అన్నట్టుగా క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
వైభవ్ సూర్యవంశీ ఎఫెక్ట్.. బిగ్ న్యూస్
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనూ కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్, త్వరలో శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టోర్నీకి (భారత-ఏ జట్టుకు) ఎంపికైన విషయం తెలిసిందే. వైభవ్ ఆడనుండటంతో ఈ టోర్నీకి ఊహించని ఆదరణ లభిస్తోంది.దీంతో నిర్వాహకులు (సోనీ నెట్వర్క్) ఈ టోర్నీని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా పోస్టులో "The Sooryavanshi Express is coming to light up the stage in a high-octane Tri-series" అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైభవ్ క్రేజ్కు ఓ సాధారణ టోర్నీ కూడా ప్రత్యక్ష ప్రసారానికి నోచుకుంది.వైభవ్ బ్రాండ్ను వినియోగించుకొని నిర్వహకులు తమ వ్యాపారాభివృద్దికి ప్రయత్నిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ 2026 మరియు ఐపీఎల్ ప్రసార హక్కులు కోల్పోయిన సోని నెట్వర్క్, వైభవ్ క్రేజ్ను ఉపయోగించుకొని తిరిగి అభిమానులకు దగ్గర కావాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ టోర్నీపై భారీ ఫోకస్ పెట్టింది. అన్ని మ్యాచ్లు సోని స్పోర్ట్స్, సోని లివ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.ఈ టోర్నీలో భారత-ఏ జట్టుతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ జూన్ 9 నుంచి 21 వరకు డంబుల్లా వేదికగా జరుగనుంది.ఈ టోర్నీ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రధాన ఆకర్షణ మాత్రం వైభవ్ సూర్యవంశీయే. ఐపీఎల్లో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల కిందటే భారత-ఏ జట్టుకు సంబంధించి ఓ కీలక మార్పు జరిగింది. గాయంతో బాధపడుతున్నరియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు.శ్రీలంక ముక్కోణపు టోర్నీకి భారత-ఏ జట్టు..తిలక్ వర్మ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంశ్ ఆర్య, ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షేడ్గే, విప్రాజ్ నిగమ్, అన్షుల్ కంబోజ్, అనుకూల్ రాయ్, అర్షాద్ ఖాన్, ప్రభ్సిమ్రన్ సింగ్, కుమార్ కుషాగ్రా, యశ్ ఠాకూర్, యుద్ద్వీర్ సింగ్ చరక్ -
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం.. కొత్త కెప్టెన్ ఎంపిక
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వైట్బాల్ (టీ20, వన్డే) కెప్టెన్గా కుసాల్ మెండిస్ ఎంపికైనట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది. దసున్ షనక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు అతను బోర్డును రిసిగ్నేషన్ కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు చరిత్ అసలంకను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని సమాచారం. రెండు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కుసాల్ మెండిస్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్ట్ కెప్టెన్గా ధనంజయ డిసిల్వ కొనసాగనున్నాడు.31 ఏళ్ల కుసాల్ మెండిస్ ఇటీవలికాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్లు ఆడిన అతను.. 550 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 55, స్ట్రైక్రేట్ 160తో నమోదు చేశాడు.కుసాల్ గత ఐపీఎల్ సీజన్లోనూ ఆకట్టుకున్నాడు. ఆడింది ఒకటే మ్యాచ్ అయినా ప్రభావంతంగా కనిపించాడు. జోస్ బట్లర్ గాయపడటంతో అతనికి రీప్లేస్మెంట్గా వచ్చిన మెండిస్.. ఓ మ్యాచ్లో 200 స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.కాగా, శ్రీలంక జట్టుకు మున్ముందు బిజీ షెడ్యూల్ ఉంది. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, భారత్ పర్యటనలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్లతో కుసాల్ మెండిస్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష మొదలుకానుంది. -
స్విమ్మింగ్లో చరిత్ర సృష్టించిన బెంగళూరు టెకీ దంపతులు
బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది. -
భారత్ లేకుండా టోర్నీ.. పాక్ అభ్యర్ధనకు శ్రీలంక అంగీకారం
అంతర్జాతీయ వేదికపై భారత్కు వ్యతిరేకంగా శ్రీలంక క్రికెట్ బోర్డు సాహసోపేత నిర్ణయం తీసుకుంది. టీమిండియా లేకుండా పాకిస్తాన్తో వన్డే ట్రై సిరీస్ ఆడేందుకు అంగీకారం తెలిపింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయం భారత్కు కాస్త కటువగా ఉండనుంది. ఎందుకంటే శ్రీలంక లాంటి మిత్రదేశం పాక్తో క్రికెట్ సంబంధాలు కొనసాగించడం బీసీసీఐకి ఇష్టం ఉండదు. పాక్ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీలో మూడో జట్టుగా ఇంగ్లండ్ ఉండనుంది. ఈ టోర్నీ అక్టోబర్-నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీకి వేదికలు ఖరారు కావాల్సి ఉంది. లాహోర్, కరాచీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.వచ్చే ఏడాది జరుగబోయే వన్డే ప్రపంచకప్కు సన్నాహకంగా ఈ టోర్నీని ప్లాన్ చేసుకున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. కాగా, 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, పాక్లో ట్రై సిరీస్ కంటే ముందే శ్రీలంకతో టీ20 సిరీస్ జరుగనుంది. ట్రై సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కూడా జరగాల్సి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ నవంబర్లో జరిగే అవకాశం ఉంది.బంగ్లాదేశ్లో పర్యటించనున్న పాక్రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మే 8 నుంచి ఢాకా వేదికగా జరుగనుంది. అనంతరం రెండో టెస్ట్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా జరుగనుంది.బంగ్లాదేశ్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (సి), అబ్దుల్లా ఫజల్, అమద్ బట్, అజాన్ అవాయిస్, బాబర్ ఆజం, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), ముహమ్మద్ ఘాజీ ఘోరీ (wk), సాజిద్ ఖాన్, నౌమాన్ అలీ, సల్మాన అఘా, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది -
చారిత్రక సిరీస్ను ప్రకటించిన శ్రీలంక
శ్రీలంక క్రికెట్ బోర్డు చారిత్రక సిరీస్ను ప్రకటించింది. ఐదేళ్ల విరామం తర్వాత వారి జట్టు కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ పర్యటనలో వెస్టిండీస్ జట్టుతో పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. శ్రీలంక జట్టు చివరిసారిగా 2021లో వెస్టిండీస్లో పర్యటించింది. ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది జూన్-జూలై నెలల్లో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం కరీబియన్కు వెళ్లనుంది.ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్వన్డేలు – సబీనా పార్క్, కింగ్స్టన్జూన్ 3 – తొలి వన్డేజూన్ 6 – రెండో వన్డేజూన్ 8 – మూడో వన్డేటీ20లు – సబీనా పార్క్జూన్ 11 – తొలి టీ20జూన్ 13 – రెండో టీ20జూన్ 14 – మూడో టీ20టెస్టులు – సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వాజూన్ 25 నుంచి తొలి టెస్టుజూలై 3 నుంచి రెండో టెస్టుఇరు జట్లకు కీలకంఇటీవలికాలంలో ఇరు జట్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ సిరీస్ వారిరువురి పునరుద్ధరణకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2021 పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డేల్లో వెస్టిండీస్ శ్రీలంకను వైట్వాష్ చేసింది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 డిజాస్టర్ తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి. మెగా టోర్నీలో లంక జట్టు ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వ ఇటీవలే రాజీనామా చేశాడు. దీంతో ఇటీవలే కుమార సంగక్కర, రోషన్ మహానామా లాంటి మాజీలతో కొత్త కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లంక క్రికెట్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేయనుంది. -
స్వదేశానికి వెళ్లిన సన్రైజర్స్ విదేశీ ప్లేయర్లు
ఐపీఎల్ 2026 మధ్యలో సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ముగ్గురు శ్రీలంక ప్లేయర్లు (దిల్షన్ మధుషంక, ఎషాన్ మలింగ, కమిందు మెండిస్) అర్దాంతరంగా స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్పై ఘన విజయం తర్వాత ఇది జరిగింది. లంక క్రికెట్ బోర్డు మధుషంక, మలింగ, కమిందును అత్యవసరంగా స్వదేశానికి రావాలని సందేశం పంపింది.NEWS 🚨Sri Lankan cricketers Dilshan Madushanka, Eshan Malinga, and Kamindu Mendis, who are representing SRH in the IPL, arrived in Sri Lanka early this morning.#sportspavilionlk #ipl2026 #MIvsSRH #EshanMalinga #fypシ゚viralシfypシ゚viralシalシ pic.twitter.com/dMwWZJ74S8— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) April 30, 2026శ్రీలంక జట్టు త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనకు సంబంధించిన వీసా బయోమెట్రిక్స్ పూర్తి చేసుకోవడానికి పై ముగ్గురు స్వదేశానికి వెళ్లారు. ఈ త్రయం విండీస్లో పర్యటించబోయే లంక జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.వీసా ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం, మధుషంక, మలింగ, కమిందు తిరిగి ఇవాళ ( మే 1) ఉదయం భారత్కు వచ్చి ఎస్ఆర్హెచ్ శిబిరంలో చేరారు. దీంతో మే 3న కేకేఆర్తో జరిగే కీలక మ్యాచ్కు వీరు అందుబాటులో ఉండనున్నారు. ఈ విషయం తెలియక సోషల్మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి.ఈ ముగ్గురు ఎస్ఆర్హెచ్ యాజమాన్యంతో గొడవపడి స్వదేశానికి వెళ్లిపోయారని కొందరు.. గాయాల కారణంగా జట్టును వీడారని ఇంకొందరు ప్రచారం చేశారు. చివరికి లంక బోర్డు చెందిన కీలక అధికారి ఒకరు వివరణ ఇవ్వడంతో ఈ ఫేక్ ప్రచారానికి పుల్స్టాప్ పడింది.దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే, ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న వ్యక్తి (ఎషాన్ మలింగ) పై ముగ్గురిలో ఉన్నారు. మంచి లయలో ఉన్న ఎస్ఆర్హెచ్కు మలింగ లాంటి బౌలర్ ఒక్క మ్యాచ్కు దూరమైనా తీవ్ర పరిణామాలు ఉంటాయి.మలింగ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. మదుషంక ఒక మ్యాచ్లో ఆడి వికెట్ సాధించగా, కమిందు మెండిస్కు ఇంకా తుది జట్టులో అవకాశం రాలేదు.కాగా, సీజన్ ఆరంభంలో కాస్త అటుఇటుగా ఆడిన సన్రైజర్స్ కీలక దశ వచ్చే సరికి విజయాల బాట పట్టి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. పంజాబ్, ఆర్సీబీ టాప్-2లో ఉన్నాయి. -
టీ20 సిరీస్ కూడా లంకదే..!
మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు, తొలుత వన్డే సిరీస్ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.సిల్హెట్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్, రితూ మోనీ తలో వికెట్ తీశారు.అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్ అక్తెర్ (44 నాటౌట్) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ నిగార్ సల్తానా 7, షోర్నా అక్తెర్ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్ వేదికగా జరుగనుంది. -
టీ20 సిరీస్లోనూ బోణీ కొట్టిన శ్రీలంక
మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ తొలుత జరిగిన వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాల్టి నుంచి (ఏప్రిల్ 28) నుంచి ప్రారంభమైన టీ20 సిరీస్లోనూ బోణీ కొట్టింది. సిల్హెట్ వేదికగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్లో 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.ఈ మ్యాచ్లో శ్రీలంక ప్లేయర్లు ఆల్రౌండ్ ప్రదర్శనలతో అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసిన లంకేయులు, ఆతర్వాత బౌలింగ్లోనూ సత్తా చాటి బంగ్లాదేశ్ను 136 పరుగులకే (7 వికెట్ల నష్టానికి) పరిమితం చేశారు.లంక బ్యాటర్లలో ఇమేషా దులని (55), హర్షిత సమరవిక్రమ (61) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ చమారీ 32 పరుగులతో పర్వాలేదనిపించింది. మిగతా ప్లేయర్లలో హాసిని పెరీరా 7, హన్సిమ కరుణరత్నే 2 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో సల్తానా ఖాతూన్ 2, మరుఫా అక్తెర్, నహిద అక్తెర్ తలో వికెట్ తీశారు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో షోర్నా అక్తెర్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. ఆమెకు మరో ఎండ్ నుండి ఎవరి సహకారం లభించలేదు. దిల్హర అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 16, షిర్మన్ అక్తెర్ 1, కెప్టెన్ నిగార్ సుల్తానా డకౌట్, శోభన మోస్తరి 16, రబేయా ఖాన్ 6, సుల్తానా ఖాతూన్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో మల్కి మదారా, మిథాలీ అయోధ్య, చమారీ తలో 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను కట్టడి చేశారు. సుగంధిక, కవిష వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 30న జరుగనుంది. -
షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్!
కొలంబో: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఒక ఉదంతం వెలుగుచూసింది. సన్యాస వస్త్రధారణలో ఉన్న 22 మంది వ్యక్తులు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొలంబో విమానాశ్రయంలో పట్టుబడ్డారు. థాయ్లాండ్ నుండి తిరిగి వస్తున్న వీరి వద్ద 110 కిలోల గంజాయి (కుష్, హషీష్) లభించడం అధికార వర్గాలను సైతం నివ్వెరపరిచింది.సూట్కేసుల్లో రహస్య అరలుకొలంబో విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, అసలు బాగోతం బయటపడింది. స్వీట్లు, పాఠశాల సామగ్రితో పాటు సూట్కేసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఫాల్స్ వాల్స్’ (రహస్య అరలు) వెనుక ఈ మత్తుపదార్థాలను దాచారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 కిలోల చొప్పున అత్యంత ప్రమాదకరమైన కుష్, హషీష్ రకాలకు చెందిన గంజాయి ప్యాకెట్లు లభించాయి. సన్యాసుల ముసుగులో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.ఉచిత థాయ్లాండ్ ట్రిప్ వెనుక మాస్టర్మైండ్పట్టుబడిన ఈ సన్యాసుల(వేషధారణ)లో ఎక్కువ మంది విద్యార్థులే. ఒక గుర్తుతెలియని స్పాన్సర్ వీరికి నాలుగు రోజుల థాయ్లాండ్ పర్యటనకు పూర్తి ఖర్చులు భరించినట్లు సమాచారం. ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని పోలీసులు కొలంబో శివార్లలో అరెస్టు చేశారు. అతడు ఈ బృందంతో ప్రయాణించలేదు కానీ, వారు తీసుకొస్తున్న పార్శిల్స్ అన్నీ ‘విరాళాలు’ అని నమ్మించే ప్రయత్నం చేశాడు.7 రోజుల రిమాండ్పట్టుబడిన ఈ దొంగ సన్యాసుల మొబైల్ ఫోన్లను పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పరిశీలించగా, వారు థాయ్లాండ్ ట్రిప్లో సాధారణ దుస్తులు ధరించి, విలాసవంతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వీరందరినీ ఆదివారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఏడు రోజుల పాటు రిమాండ్కు ఆదేశించింది. -
ఆర్సీబీకి షాక్.. కేసు వెనక్కు తీసుకున్న బౌలర్
శ్రీలంక ఆటగాడు నువాన్ తుషార వ్యవహారం ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఐపీఎల్ 2026లో పాల్గొనేందుకు తుషారకు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (శ్రీలంక క్రికెట్) అనుమతి నిరాకరించింది. ఫిట్నెస్ లేని కారణంగా తుషారకు ఎన్వోసీ జారీ చేయలేమని తెలిపింది.ఈ విషయమై కోర్టును ఆశ్రయించిన తుషార.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో కోర్టు శ్రీలంక క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ పరిణామం తర్వాత తుషార ఇక ఐపీఎల్ ఆడటం కష్టమేనని తేలిపోయింది.తుషార వ్యవహారంలో కోర్టు తీర్పు ఆర్సీబీని ఇరకాటంలో పడేసింది. ఆ జట్టు ఈ సీజన్లో తుషారపై ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, గత సీజన్లో అతను హాజిల్వుడ్ గైర్హాజరీలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని యార్కర్లు, స్లో బంతులు డెత్ ఓవర్లలో ఆర్సీబీకి కీలకంగా మారే అవకాశం ఉండింది.ప్రస్తుతం ఆర్సీబీకి హాజిల్వుడ్, డఫీ, ఎంగిడి వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. తుషార లాంటి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఉంటే అదనపు బలంగా మారే అవకాశం ఉండింది. మొత్తంగా తుషార న్యాయపోరాటం చేస్తూ మధ్యలోనే యూ-టర్న్ తీసుకోవడం ఆర్సీబీకి వ్యూహాత్మక నష్టంగా పరిగణించాలి. ప్లే ఆఫ్స్ రేసులో పోటీ తీవ్రంగా ఉన్న దశలో ఇలాంటి మార్పులు జట్టు సమతుల్యతను దెబ్బతీస్తాయి.కాగా, తుషార లేకపోయినా ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే రాణిస్తుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు, 2 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్ 24న జరిగే తదుపరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. -
రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్పై నిషేధం
రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్, శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్లోని లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందాన్ని ఉల్లఘించినందుకు ఒక సంవత్సరం నిషేధం విధించింది. దీంతో షనక వచ్చే పీఎస్ఎల్ సీజన్ (2027)లో పాల్గొనలేరు.పీసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లాహోర్ ఖలందర్స్తో చేసుకున్న ఒప్పందాన్ని షనక ఉల్లఘించాడు. మార్చి 21న టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇందుకు అతను చూపించిన కారణాలు ఒప్పంద పరిధిలో చెల్లుబాటు కావు. కాబట్టి లీగ్ ప్రతిష్ఠను కాపాడేందుకు షనకపై ఏడాది నిషేధం విధించారు.పీసీబీ తనపై విధించిన నిషేధాన్ని షనక పరోక్షంగా అంగీకరించాడు. ఓ ప్రకటన విడుదల చేస్తూ, తన విచారాన్ని వ్యక్తం చేశాడు. "హెచ్బీఎల్ పీఎస్ఎల్ నుంచి తప్పుకోవడం నా తప్పు. పాకిస్థాన్ అభిమానులు, లాహోర్ ఖలందర్స్ అభిమానులను నిరాశపరిచినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆ సమయంలో మరో టోర్నమెంట్లో ఆడాలనే ఉద్దేశం నాకు లేదు. పాకిస్థాన్లో ఆడటం నాకు ఎప్పుడూ ఆనందమే" అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తిరిగి ఈ లీగ్లో పాల్గొనే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, షనక పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న తర్వాత ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్తో ఒప్పందం చేసుకున్నాడు. సామ్ కర్రన్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడంతో రాయల్స్ షనకను ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎంపిక చేసుకుంది. షనకకు రాయల్స్ బేస్ ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.ఈ సీజన్లో షనక రాయల్స్ తరఫున ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. -
బొగ్గు దిగుమతుల్లో అక్రమాల ఆరోపణలు
కొలంబో: విద్యుదుత్పత్తిలో వాడే బొగ్గు దిగుమతుల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలున్న శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కుమార జయకోడి పదవికి రాజీనామా చేశారు. ఆ శాఖ కార్యదర్శి ఉదయాంగ హేమపాల కూడా బాధ్యతల నుంచి వైదొలిగారు. ప్రభుత్వ రంగ సంస్థ చేపట్టిన బొగ్గు దిగుమతుల్లో ఆరోపణలపై శ్రీలంక అధ్యక్ష కార్యాలయం స్పందించింది. అయితే, అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. దీనిపై ఆరునెలల్లో ప్రత్యేక కమిటీతో దర్యాప్తు పూర్తి చేసి, వాస్తవాలను వెల్లడిస్తామని తెలిపింది. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కుమార జయకోడి గతవారం పార్లమెంట్లో ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కారు. శ్రీలంక తన ఇంధన అవసరాలకు కావాల్సిన బొగ్గును ఏడాదికి 25 లక్షల టన్నుల చొప్పున ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియాలతోపాటు స్వల్ప పరిమాణంలో భారత్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటోంది. -
పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర .. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి..
కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్షాక్ తగిలింది. గ్లోబల్ మార్కెట్లో గ్యాస్ ధరలు పెరుగుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ ధరల్ని పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరల్ని మరోసారి పెంచుతున్నట్లు శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని ఎల్పీజీ గ్యాస్ సంస్థ లిట్రో గ్యాస్ లంక ప్రకటించింది. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి (ఏప్రిల్5)నుంచి అమల్లోకి రానున్నాయి. లిట్రో గ్యాస్ తెలిపిన వివరాల మేరకు.. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగాయి. వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.ప్రస్తుతం కొలంబోలో కొత్త ధరలు ఇలా ఉన్నాయి 12.5 కిలోల సిలిండర్: రూ. 775 పెరిగి రూ. 4,7655 కిలోల సిలిండర్: రూ. 308 పెరిగి రూ. 1,9102.3 కిలోల సిలిండర్: రూ.140 పెరిగి రూ.840వినియోగదారులపై ప్రభావంఈ పెంపు వల్ల శ్రీలంక ప్రజలకు జీవన వ్యయాలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం (భారత్లో ఉగాది..శ్రీలంకలో పుత్తాండు) సీజన్లో గ్యాస్ ధరలు పెరగడం కుటుంబాలపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. అయితే లిట్రో గ్యాస్ లంక వినియోగదారులపై పూర్తి భారాన్ని మోపకుండా, పరిమిత స్థాయిలో మాత్రమే ధరలు పెంచడం ద్వారా కొంత ఉపశమనం కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తెలంగాణ అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి
నిజామాబాద్ రూరల్: ఆ ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఎల్లలు లేవని నిరూపించింది. శ్రీలంక అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శనివారం మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. నిజామాబాద్ రూరల్ మండలం లింగితండాకు చెందిన బొంత వెంకటేశ్ 2019లో దుబాయికి వెళ్లాడు. అక్కడ ఎల్టన్ ప్రాపర్టీ అనే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీలంక దేశానికి చెందిన ఉమేక తారుషి వెంకటేశ్ల మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు తల్లితండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ ప్రేమ విషయాన్ని వెంకటేశ్ శ్రీలంకకు వెళ్లి తారుషి తల్లితండ్రులకు చెప్పి ఒప్పించాడు. ఇటు వెంకటేశ్ తల్లితండ్రులు ఒప్పుకున్నారు. దీంతో తారుషి, ఆమె తల్లితండ్రులు సేనాదిపతిగే నిలంతి పెరీరా, గలాని గమగె జనక ప్రియదర్శన సిల్వా లింగి తండాకు పది రోజుల క్రితం చేరుకున్నారు. శుక్రవారం ఇరు కుటుంబాల సంతోషాల మధ్య హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం వీరి వివాహానికి లింగి తండా వేదికగా మారనుంది. తమ ప్రేమ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెంకటేశ్ ‘సాక్షి’తో తెలిపారు. -
సినీ నటితో వివాదంలో శ్రీలంక విధ్వంసకర బ్యాటర్
శ్రీలంక విధ్వంసకర బ్యాటర్ భానుక రాజపక్స ఓ సినీ నటితో న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నాడు. ఈ కేసు ఓ బంగారు గొలుసు చుట్టూ తిరుగుతోంది. హర్షి రసంగా అనే స్థానిక యువ నటికి రాజపక్స ఓ బంగారు గొలుసు (రూ. 9 లక్షలు) ఇచ్చాడు. దీన్ని బహుమతిగా భావించిన ఆమె.. అవసరాల రిత్యా తాకట్టు పెట్టి డబ్బు చేసుకుంది. అయితే గొలుసును హర్షి తన వద్ద అరువు తీసుకొని, అనుమతి లేకుండా తాకట్టు పెట్టుకుందని రాజపక్స పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసుల విచారణ జరిపి హర్షిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రూ. 5 లక్షల చొప్పున రెండు ష్యూరిటీలు పెట్టి బెయిల్ మంజూరు చేసింది. విచారణలో హర్షి న్యాయవాదులు గొలుసును తాకట్టు పెట్టిన విషయాన్ని అంగీకరించి, తిరిగి విడిపిస్తామని హామీ ఇచ్చారు. మాట మార్చిన హర్షిబెయిల్ లభించిన తర్వాత హర్షి మాట మార్చింది. మీడియా ముందుకు వచ్చి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. గొలుసు తనకు రాజపక్స వ్యక్తిగత సంబంధంలో గిఫ్ట్గా ఇచ్చాడని తెలిపింది. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. రాజపక్స వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాజపక్స ఇటీవల టీమిండియాపై నిరాధరమైన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కాడు. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్లో భారత ఆటగాళ్లు ఉపయోగించే బ్యాట్లు అసాధారణంగా ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత అతను టీమిండియా అభిమానుల నుంచి చీవాట్లు తిన్నాడు. -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
4 లీటర్ల పెట్రోలు దాచాడని... 21 రోజుల జైలు, జరిమానా!
కొలంబో: పశ్చిమాసియా కల్లోలం పుణ్యమా అని పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోలును ఇంట్లో దాచిన పాపానికి ఓ వ్యక్తి ఏకంగా కటకటాలపాలు కావాల్సి వచ్చింది! ఈ వింత ఉదంతం శ్రీలంకలో చోటుచేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందిన లసంత కుమార బాలసూర్య (48) ఇంట్లో సోదాల్లో 4 లీటర్ల పెట్రోల్ దొరికింది. దాంతో పోలీసులు మనవాడిని అరెస్టు చేసి బోనెక్కించారు. తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ నిమిత్తం ఇంటి పరిసరాల్లోని చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోలు తెచ్చుకున్నానని మొత్తుకున్నా లాభం లేకపోయింది.అతనికి 21 రోజుల జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన అక్రమ నిల్వలపై లంక కఠిన నిషేధం విధించింది. కనుక, దాచింది నాలుగు లీటర్లే అయినా నేరం నేరమే పొమ్మంటూ చట్టం ఇలా తన పని తాను చేసుకుపోయింది! పౌరుల పెట్రోల్, డీజిల్ వాడకంపై లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలుకు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే అనుమతిస్తారు. -
అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక
అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా, అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. ‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం. ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. జిబౌటి బేస్ నుండి ఎనిమిది యాంటీ-షిప్ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు’ దెబ్బ -
అర్థరాత్రి.. అమాంతంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
కొలంబియా: శ్రీలంక ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థ సియాలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) అర్థరాత్రి పెద్ద షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 9 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.సీపీసీ లెక్కల ప్రకారం.. ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గత వారం 92–93 అమెరికన్ డాలర్ల వద్ద ఉండగా, కొన్ని రోజుల్లోనే 115 డాలర్లకు చేరాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమయ్యాయి. ఈ పరిస్థితులు శ్రీలంకలో ఇంధన ధరలపై తక్షణ ప్రభావం చూపాయి.ఆక్టేన్ 92 అంటే పెట్రోల్లోని ఆక్టేన్ రేటింగ్ (Octane Rating) ను సూచిస్తుంది. ఇది ఇంధనం ఇంజిన్లో నాకింగ్ (knocking) లేకుండా ఎంత వరకు కంప్రెషన్ను తట్టుకోగలదో చూపించే ప్రమాణం. ఆక్టేన్ 92 అంటే ఇంధనం 92 స్థాయి కంప్రెషన్ను తట్టుకోగలదని అర్థం. వాటి ఆధారంగాఆక్టేన్ 92 -పెట్రోల్ లీటరుకు రూ.317ఆక్టేన్ 95- పెట్రోల్ రూ.365సాధారణ డీజిల్- రూ.303హై-పర్ఫార్మెన్స్ వాహనాలకు వినియోగించే డీజిల్- రూ.353కిరోసిన్ -రూ.195ప్రతి లీటరుకు సగటున రూ.22–25 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.ఈ పరిణామం శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా, ఉత్పత్తి, వినియోగదారుల ఖర్చులు అన్నీ ప్రభావితమవుతాయి. ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులను తగ్గించవచ్చు. దీర్ఘకాలికంగా, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, శక్తి సామర్థ్య విధానాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన పరిష్కారం సాధ్యమవుతుంది. -
శ్రీలంక హెడ్ కోచ్గా టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తి
తాము సంయుక్తంగా (భారత్తో పాటు) ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2026లో ఘోరంగా విఫలమైన (సూపర్-8 దశలో నిష్క్రమణ) తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు ప్రక్షాళన చేపట్టింది. టీమిండియా దశ, దిశను మార్చిన వ్యక్తిని హెడ్ కోచ్గా ఎంపిక చేసుకుంది. అతని పేరు గ్యారీ కిర్స్టన్. ఈ సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ 2011లో టీమిండియాను జగజ్జేతగా (హెడ్ కోచ్గా) నిలిపాడు.పొట్టి ప్రపంచకప్ వైఫల్యాల నేపథ్యంలో అప్పటివరకు హెడ్ కోచ్గా ఉండిన సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడంతో లంక క్రికెట్ బోర్డు కిర్స్టన్ను ఎంపిక చేసింది. కిర్స్టన్ రెండేళ్ల ఒప్పందంలో భాగంగా ఏప్రిల్ 15న బాధ్యతలు చేపడతారు. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా లంక క్రికెట్ కిర్స్టన్ నియామకం చేపట్టింది.కిర్స్టన్ను హెడ్ కోచ్గా మంచి ట్రాక్ ఉంది. అంతర్జాతీయంగా, ఐపీఎల్లో అతను విజయవంతమైన జట్లకు కోచ్గా వ్యవహరించాడు. భారత్ను వన్డే ప్రపంచ ఛాంపియన్గా నిలపడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి కూడా చేర్చాడు. అలాగే తన సొంత జట్టు దక్షిణాఫ్రికాకు కూడా విజయవంతంగా సేవలందించాడు. అతని కెరీర్లో ఏదైనా ఫెయిల్యూర్ ఉందా అంటే అది పాకిస్తాన్ వైట్ బాల్ జట్టుకు కోచ్గా సేవలందించడమే. పాక్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన స్వల్ప కాలంలోనే అతను రాజీనామా చేశాడు (బోర్డు మరియు ఆటగాళ్లతో విభేదాల కారణంగా).ఐపీఎల్లో కిర్స్టన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో పని చేశారు. టైటాన్స్ 2022లో తొలి సీజన్లోనే టైటిల్ గెలిచినప్పుడు అతను బ్యాటింగ్ కోచ్గా ఉన్నారు. 2027 వన్డే ప్రపంచకప్కు శ్రీలంకను నేరుగా అర్హత సాధించేలా చేయడమే కిర్స్టన్ ప్రధాన లక్ష్యం. లంక క్రికెట్ కొద్ది రోజుల క్రితమే తమ మహిళల జట్టు కోచ్ను ( జేమీ సిడ్డన్స్) కూడా మార్చింది. -
ప్రపంచకప్ సందర్భంగా పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన.. మహిళతో..!
పాకిస్తాన్ క్రికెటర్కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ పాక్ క్రికెటర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్-8 దశలో శ్రీలంకతో మ్యాచ్కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో ఓ పాక్ ఆటగాడు మహిళా హౌస్కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్మెంట్కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం. మహిళను వేధించిన ఆ పాక్ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.కాగా, పాక్ ఆటగాళ్లపై, సపోర్ట్ స్టాఫ్పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్ దేశాల హోటల్ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.ఇదిలా ఉంటే, ప్రపంచకప్లో పాక్ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్-8 మ్యాచ్లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్రేట్ సాధించి సెమీస్కు అర్హత సాధించి ఉండేది. అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్కు సెమీస్ బెర్త్ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్ చేసినా గెలిచినా, పాక్ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్ కంటే మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్తో పాటు న్యూజిలాండ్ సెమీస్కు చేరింది. ఇదే న్యూజిలాండ్ జట్టు సెమీస్లో గ్రూప్-1 టాపర్ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఇరాన్ షిప్ను కూల్చేసిన అమెరికా.. 85 మంది జలసమాధి
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న ఇరాన్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక తీరంలో ఇరాన్కు చెందిన షిప్పై సబ్ మెరైన్ అటాక్తో అమెరికా కూల్చివేసింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమదాంలో ఇరాన్ సైనికులు మృతిచెందారు. ఇప్పటి వరకూ శ్రీలంక నావికా దళం 85 మృతదేహాలు స్వాధీనం చేసుకుంది. మరికొందరి జాడ తెలియాల్సి ఉందని ప్రకటించింది. కాగా నౌక మునిగిపోతుండగా 32 మందిని రక్షించినట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాను యుద్ధం కమ్ముకుంది. టెహ్రాన్పై యుఎస్, ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ నగరం విధ్వంసమైంది. ఆ దేశానికి చెందిన అనేక భవనాలు నేల కూలాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఇరాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ సిస్టమ్స్ ఇలా అన్నింటిని నిర్వర్యం చేశామని తెలిపారు. ఇలా దాడులతో ఇప్పటికే పెద్దఎత్తున సైనికవ్యవస్థ దెబ్బతిన్న ఇరాన్కు ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్కు చెందిన యుద్ధనౌకను శ్రీలంక తీరంలో యుఎస్ కూల్చివేసింది.శ్రీలంక గాలే నగర తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా అనే యుద్ధనౌకపైపై సబ్ మెరైన్ అటాక్ జరిగింది. దీంతో నౌక ప్రమాదానికి గురై సముద్రంలోకి మునిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో నౌక నుంచి ప్రమాద సంకేతాలు రావడంతో శ్రీలంక నావికాదళం వెంటనే అక్కడికి చేరుకుంది. తక్షణమే స్పందించి ప్రమాదంలో మునిగిపోతున్న దాదాపు 30 మందిని సురక్షితంగా కాపాడాయి. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 85 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీలంక నేవీ ప్రకటించింది. గల్లంతైన వారికోసం గాలింపులు చేపడుతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ప్రకటించారు. అయితే ఈ నౌక ఐరిస్ డెనా నౌక గత నెల 17న విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో (IFR)పాల్గొని తిరిగి ఇరాన్ వెళుతుండగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం అంతర్జాతీయ సముద్ర జలాల్లో జరిగినట్లు సమాచారం -
కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్ సర్కిల్స్తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎస్కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.Saddened to hear the demise of Mr. Kshema Sangakkara, a well known Civil Lawyer, father and first coach of Kumar Sangakkara. RIP sir, your contribution to the law and cricket will not be forgotten🙏 pic.twitter.com/qJfIqNv6Zr— Akhila Seneviratne (@AkhilaSene97) March 3, 2026కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్గా ఎదగడంలో ఎస్కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం సమయం వెచ్చించే వారు. ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
విండీస్ గడ్డపై తిరుగులేని విజయం సాధించిన శ్రీలంక
వెస్టిండీస్ గడ్డపై శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలు సాధించింది. 3 వన్డేలు, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం వెస్టిండీస్లో పర్యటించిన శ్రీలంక.. తొలుత వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా టీ20 సిరీస్ను 2-0తో చేజిక్కించుకుంది.నిన్న (మార్చి 4) గ్రెనడా వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేసింది.టాపార్డర్ బ్యాటర్లు హేలీ మాథ్యూస్ (8), ఎబోని బ్రాత్వైట్ (8), షవ్నిషా హెక్టార్ (5) దారుణంగా విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు స్టెఫాలీ టేలర్ (24), డియాండ్రా డొట్టిన్ (28), చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో రణవీర (4-0-16-2), కవిష దిల్హరి (4-0-13-1), సుగంధిక కుమారి (4-0-32-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.హాసిని పెరీరా (52 నాటౌట్), చమారీ ఆటపట్టు (32), ఇమేషా దులాని (34 నాటౌట్) రాణించడంతో 17.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అర్ద సెంచరీతో రాణించిన హాసినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. సిరీస్ ఆధ్యాంతం రాణంచిన చమారికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి. -
చక్క'టీ' లైఫ్ స్టైల్
శ్రీలంక లోని హపుటాలే అనే చిన్న కొండ పట్టణంలో టీ తోటల మధ్య సాగే జీవన విధానం ఒక నిశ్శబ్ద ప్రయాణ కథలా అనిపిస్తుంది. పొగమంచులో కమ్ముకున్న వెలుగు–నీడలు, టీ ఆకులు సేకరించే చేతులుం ఇవన్నీ ప్రతీ రోజు ప్రశాంతతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. ఇక్కడ ప్రతీ ఉదయం హడావిడి లేకుండా మెల్లగా ప్రారంభమవుతుంది. లోయలో మేఘాలు సాఫీగా కదులుతూ ఉంటే, మనుషుల జీవితం కూడా అదే లయలో ముందుకు సాగుతుంది. సమయం ఇక్కడ పరుగెత్తదుం నడుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఇక్కడ సమయం గడుస్తుంది.సందర్శనీయ స్థలాలుహపుటాలేలో పర్యాటకులు తప్పక వెళ్లే ప్రదేశాల్లో లిప్టన్ సీట్, డియాలుమా జలపాతం ముఖ్యమైనవి. ఇక్కడ కనిపించేది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదుం సాధారణంగా కొనసాగుతున్న జీవితం యొక్క ఒక నిశ్శబ్ద రాగంలా ఉంటుంది. దగ్గర్లోని తంగమాలే బర్డ్ శాంక్చువరి వద్ద పక్షుల సందడి ఒక స్వచ్ఛమైన సంగీతంలా అనిపిస్తుంది. ప్రతీ ఉదయం ఇక్కడ వినిపించే స్వరాలు హృదయాన్ని తాకుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కొలంబోకి నేరుగా విమాన ప్రయాణం చేసి, అక్కడి నుంచి రైలు లేదా క్యాబ్ ద్వారా హపుటాలే చేరవచ్చు. కొలంబో నుంచి ఈ కొండ ప్రాంతానికి వెళ్లే రైలు ప్రయాణం అత్యంత అందమైన అనుభవంగా ఉంటుంది.(చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!) -
సౌతాఫ్రికాపై పాకిస్తాన్.. వెస్టిండీస్పై శ్రీలంక..!
ఓ పక్క పురుషుల టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. మహిళల విభాగంలో వన్డే, టీ20 సిరీస్లు జరుగుతున్నాయి. మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ సౌతాఫ్రికాలో.. శ్రీలంక విండీస్లో పర్యటిస్తున్నాయి.క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ఆసీస్ పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. ఆతర్వాత వన్డే సిరీస్లో చిత్తుగా ఓడింది. వన్డే ప్రపంచ ఛాంపియన్ హోదాలో భారత జట్టు తమ తొలి సిరీస్లోనే ఆసీస్ చేతిలో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది. ఇరు జట్ల మధ్య మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.నామమాత్రపు విజయంసౌతాఫ్రికా పర్యటనలో తొలుత టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. వన్డే సిరీస్లోనూ అదే ఫలితాన్ని (1-2) పునరావృతం చేసింది. నిన్న జరిగిన మూడో వన్డేలో పాక్ ఆతిథ్య జట్టుపై 119 పరుగుల భారీ తేడాతో గెలుపొంది, కంటితుడుపు విజయాన్ని సాధించింది.చమారీ ఆల్రౌండ్ షోవిండీస్ పర్యటనలో తొలుత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న శ్రీలంక.. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. చివరి టీ20 మార్చి 3న జరుగనుంది. -
రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్ మెర్సిడెస్ వచ్చింది!
షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాలు కోసం ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?ప్రతీ వేసవిలో దుబాయ్ 'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్ సర్వ సాధారణం. కానీ దుబాయ్లోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్. View this post on Instagram A post shared by Dubai Gold District (@dubaigolddistrict)కారుతో సరదాగా ఫోటో కట్ చేస్తే20ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్న సుమిత్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్లకు ఒక వోచర్ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. సర్ప్రైజ్ చేసిన కాల్ఒకరోజు నైట్ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?) -
విండీస్కు కంటితుడుపు విజయం
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో వెస్టిండీస్కు కంటితుడుపు విజయం దక్కింది. ఈ సిరీస్ను ఇదివరకే 0-2తో కోల్పోయిన విండీస్.. నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన మూడో వన్డేలో గెలిచి పర్యాటక జట్టు ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. గ్రెనడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించింది. తొలుత బౌలింగ్లో (10-2-33-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసిన హేలీ.. ఆతర్వాత బ్యాటింగ్లో సెంచరీ చేసి తన జట్టును గెలిపించింది. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. హేలీ (10-2-33-2), కరిశ్మ (10-0-39-2), ఫ్లెచర్ (10-1-39-1), ఆశ్మిని (10-0-42-1) లంక ప్లేయర్లను కట్టడి చేశారు. లంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (70) అర్ద సెంచరీతో రాణించగా.. కవిష దిల్హరి (45 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్ చేసింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ తొలి 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హేలీ.. స్టెఫానీ టేలర్ (38) సహకారంతో విండీస్ను విజయతీరాల వరకు చేర్చింది. చిన్నెల్ హెన్రీ (32 నాటౌట్), డియాండ్రా డాట్టిన్ (24) విండీస్ను విజయతీరాలు దాటించారు. 46 ఓవర్లలో విండీస్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో లంక బౌలర్లు మల్కి మదారా 2, రణవీర, కెప్టెన్ చమారీ చెరో వికెట్ తీశారు. -
పతనం అంచుల్లో శ్రీలంక క్రికెట్
స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ దశలో ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొని ఫ్యాన్స్ను ఉసూరుమనిపించింది. వాస్తవానికి టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టుపై ఓ మోస్తరు అంచనాలు ఉండేవి. హోం అడ్వాంటేజ్ కలిసొచ్చి ప్రత్యర్దులను ఇబ్బంది పెడుతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి తిరగబడింది. గ్రూప్ దశలో పటిష్టమైన ఆస్ట్రేలియాకు షాకిచ్చినా.. సూపర్-8కు రాగానే తేలిపోయింది. వరుసగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఆసీస్పై గెలుపు మినహా శ్రీలంక గ్రూప్ దశలోనూ పెద్దగా చేసిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే తమకంటే చాలా బలహీనమైన జింబాబ్వే చేతిలో ఓటమిపాలై, సొంత అభిమానులచే చీవాట్లు తినింది. సూపర్-8 దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ను బౌలింగ్లో కట్టడి చేయగలిగినా.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. ఓ మోస్తరు స్కోర్లను ఛేదించలేక చతికిలబడింది. తొలుత ఇంగ్లండ్, తాజాగా న్యూజిలాండ్ మ్యాచ్ల్లో ఇదే జరిగింది. ఇంగ్లండ్ను 146 పరుగులకు కట్టడి చేసి సంకలు గుద్దుకున్నా, ఆతర్వాత బ్యాటింగ్లో చేతులెత్తేసి 95 పరుగులకే కుప్పకూలింది.న్యూజిలాండ్ మ్యాచ్లోనూ బౌలర్లు సత్తా చాటి ప్రత్యర్దిని 168 పరుగులకే కట్టడి చేసినా.. ఇంగ్లండ్ మ్యాచ్ తరహాలోనే ఈ మ్యాచ్లోనూ లంక బ్యాటర్లు ఉసూరుమనిపించారు. కనీసం టార్గెట్కు దరిదాపుల్లోకి కూడా రాలేక 107 పరుగులకే పరిమితమయ్యారు. గ్రూప్ దశలో పసికూనలు ఐర్లాండ్, ఒమన్ మినహా ఈ మెగా టోర్నీలో శ్రీలంక సాధించింది ఏమీ లేదు. ఆసీస్పై దక్కిన విజయాన్ని లంక క్రెడిట్కు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఆ జట్టు స్టార్లు లేక బలహీనంగా ఉండింది.మొత్తంగా హోం గ్రౌండ్ అడ్వాంటేజ్తో సంచలనాలు సృష్టిస్తుందని భావించిన శ్రీలంక సూపర్-8 దశలోనే నిష్క్రమించి అభిమానుల ఆశలను అడియాశలు చేసింది. వాస్తవానికి శ్రీలంక పరిస్థితి గత కొంతకాలంగా ఏమంత ఆశాజనకంగా లేదు. గత పదేళ్లకాలంలో ఆ జట్టు అడపాదడపా విజయాలు మినహాయించి ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కనీసం సెమీఫైనల్స్కు చేరుకోలేదు.ఆ జట్టు చివరిగా 2011 వన్డే ప్రపంచకప్లో ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్స్లో భారత్ చేతిలో చిత్తై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆతర్వాత వరుసగా జరిగిన 10 ఐసీసీ మెగా టోర్నీల్లో ఒక్కసారి కూడా సెమీస్కు చేరుకోలేదు. 2015 వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్, 2022 టీ20 వరల్డ్కప్, 2023 వన్డే వరల్డ్కప్, 2024 టీ20 వరల్డ్కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, తాజాగా టీ20 వరల్డ్కప్ 2026లో శ్రీలంక సెమీస్కు ముందే నిష్క్రమించింది.ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. కొన్నేళ కిందటి వెస్టిండీస్ దుస్థితి గుర్తుకు వస్తుంది. విండీస్ జట్టు స్టార్లంతా రిటైరయ్యాక ఉనికి ప్రశ్నార్థకంగా మార్చుకుంది. ఆ జట్టు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. శ్రీలంకను చూస్తే.. విండీస్కు పట్టిన గతే పట్టేలా ఉందనిపిస్తుంది. లంక జట్టులో టాలెంట్కు కొదవ లేకున్నా, నిలకడలేమి పెద్ద సమస్యగా మారింది. నిస్సంక లాంటి ఒకరిద్దరు ఆటగాళ్లు క్రమం తప్పకుండా రాణిస్తున్నా, మిగతా వారి నుంచి వారికి మద్దతు లభించడం లేదు. హసరంగ, పతిరణ లాంటి స్టార్ బౌలర్లు తరుచూ గాయాల బారిన పడి కీలక మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవడం కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారింది. బౌలింగ్లో తీక్షణ, వెల్లాలగే పర్వాలేదనిపించినా, ఆ స్థాయి రాణింపు మ్యాచ్లకు గెలిపించదు. కుసాల్ మెండిస్, అసలంక, కమిందు మెండిస్, కెప్టెన్ షనక లాంటి వారు క్రమం తప్పకుండా రాణిస్తేనే శ్రీలంక ఫేట్ మారుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం సమీప భవిష్యత్తులోనే ఆ జట్టు పసికూన చేతిలో కూడా పరాభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శ్రీలంకతో నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ ఓటమితో ఆతిథ్య శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్కోంచి (31 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.ఈ క్రమంలో సాంట్నర్-మెక్కోంచి జోడీ ఓ వరల్డ్కప్ రికార్డును బద్దలు కొట్టింది. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఏడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు మైక్ హస్సీ-స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. 2010 ఎడిషన్లో బంగ్లాదేశ్పై ఈ జోడీ ఏడో వికెట్కు 74 పరుగులు జోడించింది. తాజాగా సాంట్నర్-మెక్కోంచి జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.డెత్ ఓవర్లలో దూకుడుడెత్ ఓవర్లలో సాంట్నర్-మెక్కొంచి జోడీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 70 పరుగులు రాబట్టింది. 17వ ఓవర్లో 18, 18వ ఓవర్లో 21, చివరి రెండు ఓవర్లలో 19 మరియు 12 పరుగులు పిండుకుంది.అరుదైన మైలురాయిని తాకిన సాంట్నర్ఈ మ్యాచ్లో 47 పరుగులు చేయడంతో సాంట్నర్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 100 వికెట్లు తీసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో మొహమ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, షకీబ్ అల్ హసన్ వంటి ప్రముఖులు ఉన్నారు.బెంబేలెత్తించిన హెన్రీ.. తిప్పేసిన స్పిన్నర్లు169 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లు ఆది నుంచే రెచ్చిపోయారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ (2-1-3-2) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ నిస్సంకను క్లీన్ బౌల్డ్ చేసిన హెన్రీ.. ఆతర్వాతి ఓవర్లో అసలంకను పెవిలియన్కు పంపాడు. ఆతర్వాత స్పిన్నర్లు లైన్లోకి వచ్చి లంక ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. వీరిలో రచిన్ రవీంద్ర (4-0-27-4) లంక పతనాన్ని శాశించారు. సాంట్నర్ (4-0-19-1), గ్లెన్ ఫిలిప్స్ (4-0-21-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక ఆటగాళ్లను కట్టడి చేశారు. ఫలితంగా శ్రీలంక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో 31 పరుగులు చేసిన కమిందు మెండిసే టాప్ స్కోరర్. -
శ్రీలంక ఖేల్ ఖతం
కొలంబో: టి20 ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్–2’ మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరగా, తాజా విజయంతో కివీస్ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే కివీస్ కూడా సెమీస్లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్ ఓడితే కివీస్కు చోటు ఖాయమవుతుంది. పాక్ గెలిస్తే అప్పుడు రన్రేట్లో పోటీ పడాల్సి ఉంటుంది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్లు), రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్), కోల్ మెక్కోన్కీ (23 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్కోన్కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్ 6 సిక్స్లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్... తర్వాతి వికెట్ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్ కప్లో గతంలో ఏడో వికెట్కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్ హస్సీ, స్టీవ్ స్మిత్ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్కోన్కీ దీనిని సవరించారు. మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కమిందు మెండిస్ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
టీ20 వరల్డ్ కప్: శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు
టీ20 వరల్డ్ కప్లో శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో బుధవారం జరిగిన టీ20 వరల్డ్కప్ సూపర్ 8 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. సెమీఫైనల్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంక ఓటమి పాలైంది.టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. 75 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన కివీస్, కొద్ది సమయంలోనే 84/6కి కుప్పకూలింది. వరుసగా మూడు వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మళ్లినట్టే అనిపించింది.అయితే, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), కోల్ మెక్కాంచీ (31 నాటౌట్) కీలకమైన 84 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును గట్టెక్కించారు. మిచెల్,కోల్ అద్భుతమైన ఆటతీరుతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 168/7 స్కోరు చేసింది.169 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక బ్యాట్స్మెన్ ప్రారంభం నుంచే కష్టాల్లో పడ్డారు. న్యూజిలాండ్ బౌలర్ రచిన్ రవీంద్ర అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి లంకన్ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. చివరికి శ్రీలంక నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 107 పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్ల చక్కటి లైనప్, అలాగే సాంట్నర్-మెక్కాంచీ భాగస్వామ్యం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు, పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలంక ఓటమి చవిచూసింది. -
టీ20 ప్రపంచకప్లో నేడు మరో సూపర్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్ 2026లో ఇవాళ (ఫిబ్రవరి 25) మరో సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. ఆతిథ్య శ్రీలంకను న్యూజిలాండ్ కొలొంబో వేదికగా ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇరు జట్లు సెమీస్ రేసులో ఉంటాయి. ఓడినా ఛాన్స్లు ఉంటాయి కానీ, అవకాశాలు చాలా సంక్లిష్టంగా మారతాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈ మ్యాచ్ చాలా కీలకం.శ్రీలంక తొలి సూపర్ ఓవర్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి సెమీస్ రేసులో చిట్టచివరి స్థానంలో ఉండగా.. పాక్తో జరగాల్సిన మ్యాచ్ రద్దై న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ఖరారు కావడంతో మిగిలిన బెర్త్ కోసం న్యూజిలాండ్-పాక్-శ్రీలంక మధ్య త్రిముఖ పోటీ ఏర్పడింది.న్యూజిలాండే ఫేవరెట్నేటి మ్యాచ్లో ఏ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయని పరిశీలిస్తే.. న్యూజిలాండే ఫేవరెట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. గ్రూప్ దశలో ఈ జట్టు నాలుగింట మూడు మ్యాచ్ల్లో (సౌతాఫ్రికా మినహా) గెలిచింది. శ్రీలంక సైతం నాలుగింట మూడు మ్యాచ్ల్లోనే గెలిచినప్పటికీ (జింబాబ్వే మినహా).. బలాబలాల ప్రకారం న్యూజిలాండ్దే ఆధిక్యత కనిపిస్తుంది. గ్రూప్ దశలో ఆసీస్పై సంచలన విజయం సాధించినా, హోం అడ్వాంటేజ్ ఉన్నా.. బలాబలాలను పరిగణలోకి తీసుకుంటే న్యూజిలాండ్పై గెలవడం శ్రీలంకకు చాలా కష్టమనే చెప్పాలి.రికార్డులు కూడా ఇదే చెబుతున్నాయిఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలించినా, న్యూజిలాండ్దే అధిపత్యమని చెబుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్లు జరగగా.. న్యూజిలాండ్ 16, శ్రీలంక 11 మ్యాచ్లు గెలిచాయి. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. శ్రీలంకలో జరిగిన మ్యాచ్ల్లోనూ న్యూజిలాండ్ ఆధిపత్యమే కనిపిస్తుంది. లంకలో ఇరు జట్లు 8 మ్యాచ్ల్లో తలపడగా.. న్యూజిలాండ్ 5, శ్రీలంక 3 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందింది.తుది జట్లు (అంచనా)న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(c), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక: పతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(w), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(c), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక -
స్పిన్కు ఎదురొడ్డి... స్పిన్తోనే పడగొట్టి...
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు టి20 ప్రపంచకప్ ‘సూపర్–8’లో శుభారంభం చేసింది. ఆదివారం గ్రూప్–2లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను బోల్తా కొట్టించింది. గ్రూప్ దశలో పడుతూ లేస్తూ సాగిన ఇంగ్లండ్... ‘సూపర్ ఎయిట్’లో సాధికారిక విజయం ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జోస్ బట్లర్ (7), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (6), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (14), స్యామ్ కరన్ (11), డాసన్ (6) విఫలమయ్యారు. స్పిన్ ఆల్రౌండర్ విల్ జాక్స్ (21; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. సొంతగడ్డపై శ్రీలంక బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఒక్క సాల్ట్ తప్ప మిగిలిన వాళ్లెవరూ భారీ షాట్లు ఆడలేకపోయారు. లంక బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగె 3 వికెట్లు పడగొట్టగా... మధుషనక, తీక్షణ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక పూర్తిగా తడబడింది. 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ షనక (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్లు) ఒక్కడే పోరాడగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విల్ జాక్స్ 3 వికెట్లు తీయగా... ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సాల్ట్ ఒక్కడే... ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాల్ట్ ఒక్కడే దూకుడు కనబర్చాడు. లంక బౌలర్ల ధాటికి సహచర బ్యాటర్లంతా పెవిలియన్కు చేరుతున్నా... సాల్ట్ మాత్రం తనదైన శైలిలో షాట్లు ఆడాడు. వరల్డ్కప్ తొలి పోరులో నేపాల్ చేతిలో ‘చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు’ గెలిచిన ఇంగ్లండ్...‘సూపర్ –8’లోనూ అలాంటి అనుభవమే చవిచూసేలా కనిపించింది. అయితే సాల్ట్ మెరుపులకు బౌలర్ల సహకారం తోడవడంతో ... ఇంగ్లండ్ పని సులువైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 15 బౌండరీలు మాత్రమే నమోదైతే... శ్రీలంక కేవలం 12 బౌండరీలకే పరిమితమైంది. పవర్ ప్లేలోనే 34/5... ఓ మాదిరి లక్ష్యఛేదనలో లంక తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, జాక్స్ ధాటికి... ఆరు ఓవర్లు ముగిసేసరికి 34/5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నిసాంక (9), కమిల్ (6), కుశాల్ మెండిస్ (4), పవన్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగె (10) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. కెప్టెన్ షనక కాస్త పోరాడే ప్రయత్నం చేసినా... ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వికెట్ల పతనం అలాగే కొనసాగింది. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తదుపరి ‘సూపర్–8’ మ్యాచ్ల్లో మంగళవారం పాకిస్తాన్తో ఇంగ్లండ్; బుధవారం న్యూజిలాండ్తో శ్రీలంక తలపడతాయి. -
ఫైనల్ బెర్త్ లక్ష్యంగా... నేడు శ్రీలంక ‘ఎ’తో భారత్ ‘ఎ’ సెమీఫైనల్ పోరు
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం రెండు సెమీఫైనల్స్ ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ జట్టు... రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. రెండో సెమీఫైనల్ను మధ్యాహ్నం గం. 12:30 నుంచి నిర్వహిస్తారు. ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్3, సోనీ స్పోర్ట్స్ టెన్4 చానెల్స్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టోర్నీలో రాధా యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో యూఏఈ ‘ఎ’ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ పరాజయం నుంచి వెంటనే తేరుకున్న భారత ‘ఎ’ జట్టు తర్వాతి రెండు లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్, నేపాల్ జట్లను ఓడించింది. భారత్, పాక్, యూఏఈ జట్లు నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్తో భారత్, పాక్ సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాయి. -
శ్రీలంకకు జింబాబ్వే షాక్
కొలంబో: టి20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాను సంచలన రీతిలో ఓడించిన జింబాబ్వే ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే ఆసీస్పై గెలవడం గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ జట్టు మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ్రస్టేలియాని చిత్తు చేసి సత్తా చాటిన ఆతిథ్య జట్టు శ్రీలంకను వారి సొంతగడ్డపైనే ఓడించి జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘బి’లో ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒకటి రద్దు కాగా, మిగిలిన మూడూ నెగ్గి అజేయంగా, అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ‘సూపర్ ఎయిట్స్’లో తమను తక్కువగా అంచనా వేయవద్దంటూ హెచ్చరికను జారీ చేసింది. గురువారం జరిగిన పోరులో జింబాబ్వే 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేయగా...జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఇన్నింగ్స్లో నిసాంక (41 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, పవన్ రత్నాయకే (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. నిసాంక, కుశాల్ పెరీరా (22; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత జింబాబ్వే కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యరి్థని నిలువరించింది. చివర్లో రత్నాయకే, వెలలాగె (15 నాటౌట్) కలిసి ధాటిగా ఆడారు. 19వ ఓవర్లో రత్నాయకే వరుసగా 4, 6, 4 బాదగా...ఆఖరి ఓవర్లలో వెలలాగె మూడు ఫోర్లు కొట్టాడు. ఛేదనలో జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు), మరుమని (26 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 69 పరుగులు జోడించి శుభారంభం అందించారు. బెన్నెట్ జాగ్రత్తగా ఆడగా ఇతర సహచరులు దూకుడు ప్రదర్శించడంతో జింబాబ్వే లక్ష్యం దిశగా దూసుకుపోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (26 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు), మరుమని, ర్యాన్ బర్ల్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 64 బంతుల్లో 102 పరుగులు సాధించడం విశేషం. 10 ఓవర్లలో 101 పరుగులు చేయాల్సి ఉండటంతో జింబాబ్వే విజయంపై సందేహాలు ఉన్నా...చివరకు జింబాబ్వే బ్యాటర్లు దానిని చేసి చూపించారు. ముఖ్యంగా హేమంత ఓవర్లో రజా వరుసగా 6, 6, 4 బాదడంతో పరిస్థితి మారిపోయింది. తీక్షణ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా ...తొలి బంతికి మున్యోంగా సిక్స్, మూడో బంతికి బెన్నెట్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించారు. -
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో తొలుత టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన జింబాబ్వెన్లు.. తాజాగా తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించిన షాకిచ్చారు. కొలొంబో వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్లో జింబాబ్వే శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా గ్రూప్-బిలో ఓటమెరుగని జట్టుగా నిలిచింది.ఈ గ్రూప్లో జింబాబ్వే.. ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకపై విజయాలు సాధించింది. ఐర్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ గ్రూప్ నుంచి జింబాబ్వే, శ్రీలంక ఇదివరకే సూపర్-8లోకి ప్రవేశించాయి. ఈ గ్రూప్లో శ్రీలంక సైతం ఆస్ట్రేలియాను ఓడించింది. ఇప్పుడు శ్రీలంకను జింబాబ్వే వారి సొంతగడ్డపై ఓడించి సంచలనం సృష్టించింది. పాయింట్ల పట్టికలోనూ జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (62), పవన్ రత్నాయకే (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా 22, కుసాల్ మెండిస్ 14, కమిందు మెండిస్ 7, దసున్ షనక 6, వెల్లాలగే 15 (నాటౌట్) పరుగులు చేశారు. దుషన్ హేమంత డకౌటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, బ్రాడ్ ఈవాన్స్, గ్రేమీ క్రీమర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ర్యాన్ బర్ల్ ఓ వికెట్ తీశాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్రియాన్ బెన్నెట్ (63) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ సికందర్ రజా (45) మెరుపు ఇన్నింగ్స్తో తన జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ మరుమణి (34), ర్యాన్ బర్ల్ (23) ఓ మోస్తరు స్కోర్లతో జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు. లంక బౌలర్లలో హేమంత 2, వెల్లలగే, షనక చెరో వికెట్ తీశారు. -
క్రికెట్ మ్యాచ్కు ప్రత్యేక ఫ్లైట్లలో!
సాక్షి, అమరావతి: సామాన్యులు ఎర్రబస్సు ఎక్కిన మాదిరిగా చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానాలను వినియోగించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పాకిస్థాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ప్రత్యేక జెట్ విమానంలో శ్రీలంక వెళ్లి రావడం హాట్ టాపిక్గా మారింది. ఉదయం అమరావతిలో ఉన్న లోకేశ్ సాయంత్రం కొలంబోలో ప్రత్యక్షమయ్యారు. మర్నాడు ఉదయం తిరిగి అమరావతి చేరుకుని బిల్గేట్స్తో ఫోటోలు దిగడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ఈ కార్యక్రమం పూర్తి కావడమే ఆలస్యం.. లోకేశ్ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రత్యేక విమానాల వ్యయం ఎవరు భరిస్తున్నారన్నది కీలకంగా మారింది. ఈ ఖర్చుల వివరాలను అధికారికంగా వెల్లడించడం లేదు. ఒకపక్కన రాష్ట్రాన్ని అప్పులతో ముంచెత్తుతూ మరోపక్క విహార యాత్రల్లో గడపడంపై విస్తుపోతున్నారు.సమస్యలు గాలికి వదిలేసి...!ప్రస్తుతం మిడ్ సైజ్ ప్రైవేట్ జెట్ విమానం అద్దె గంటకు రూ.3.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ ప్రయాణం కాబట్టి ల్యాండింగ్ చార్జీలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, విదేశీ ఎయిర్ పోర్ట్ ట్యాక్స్లు అన్నీ కలిపి మరో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటాయి. వెరసి తాజాగా లోకేశ్ యాత్రలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.కోటి పైమాటే అని వైమానిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి తనయుడు సాధారణ బైక్ రైడ్లా విమానాలను వాడుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీలు, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండా విదేశాల్లో మ్యాచ్లు చూడటానికి ఇంత సమయం, డబ్బులు వెచ్చించడం సబబేనా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇది వ్యక్తిగత పర్యటన అయితే అధికారిక హోదాను ఉపయోగించి పొందే ప్రోటోకాల్ సౌకర్యాల ఖర్చును ఎవరు చెల్లిస్తున్నారన్నది ముఖ్యం. -
‘శత’క్కొట్టిన నిసాంక
పల్లెకెలె: పాథుమ్ నిసాంక (52 బంతుల్లో 100 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్లు) ‘శతక’ విధ్వంసంతో ఆ్రస్టేలియా గల్లంతైంది. ఈ టి20 ప్రపంచ కప్లో తొలి సెంచరీని ఆతిథ్య శ్రీలంక బ్యాటర్ నిసాంక అజేయంగా లిఖించాడు. దీంతో ‘హ్యాట్రిక్’ విజయాలతో లంక జట్టు ‘సూపర్–8’కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్లో ఓటమి పాలైన ఆ్రస్టేలియా ముందుకెళ్లే అవకాశాల్ని క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు జింబాబ్వే ‘వరుస ఓటమి’లపైనే ఆసీస్ ‘సూపర్–8’ భవితవ్యం ఆధార పడింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన మ్యాచ్లో దాసున్ షనక నేతృత్వంలోని లంక 8 వికెట్ల తేడాతో ఆసీస్పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కెపె్టన్ మిచెల్ మార్‡్ష (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు), ట్రవిస్ హెడ్ (29 బంతుల్లో 56; 7 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 104 పరుగులు జోడించారు. 8.2 ఓవర్ల వరకు వికెట్ కోల్పోలేదు. ఇంతవరకు జోరుగా సాగిన ఆసీస్ అనూహ్యంగా మిగతా 11.4 ఓవర్లలో మరో 77 పరుగులే చేసి 10 వికెట్లను కోల్పోయింది. ఇన్గ్లిస్ (27; 3 ఫోర్లు), మ్యాక్స్వెల్ (22; 1 ఫోర్, 1 సిక్స్) మాత్రమే రెండు పదుల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మ్యాక్స్వెల్ రివర్స్ స్వీప్తో బౌండరీకి యత్నించగా... బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద నిసాంక కళ్లు చెదిరే క్యాచ్తో అబ్బురపరిచాడు. లంక బౌలర్లలో హేమంత 3, చమీర 2 వికెట్లు తీశాడు. అనంతరం లంక 18 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి గెలిచింది. నిసాంక రెండో వికెట్కు కుశాల్ మెండిస్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్)తో 97 పరుగులు, తర్వాత పవన్ రత్నాయకే (28 నాటౌట్; 6 ఫోర్లు)తో అబేధ్యమైన మూడో వికెట్కు 79 పరుగులు జోడించి జట్టును గెలిపించాడు. ఆ్రస్టేలియా తమ చివరి లీగ్ మ్యాచ్లో 20న ఒమన్ జట్టుతో ఆడుతుంది. ఆసీస్ కంటే ముందే జింబాబ్వే మిగిలిన రెండు మ్యాచ్లు (నేడు ఐర్లాండ్తో; 19న శ్రీలంకతో) ఆడుతుంది. ఈ రెండింటిలో జింబాబ్వే ఒక్కటి గెలిచినా ‘సూపర్–8’కు అర్హత పొందుతుంది. ఒకవేళ జింబాబ్వే రెండింటిలో ఓడిపోయినా... రన్రేట్లో ఆ్రస్టేలియాకంటే మెరుగ్గా ఉంటేచాలు ‘సూపర్–8’ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. -
T20 WC 2026: భారీ లక్ష్య ఛేదన.. చరిత్ర సృష్టించిన ఒమన్ ప్లేయర్
టీ20 వరల్డ్కప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 12) ఉదయం జరిగిన మ్యాచ్లో శ్రీలంక, ఒమన్ తలపడ్డాయి. పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో శ్రీలంక 105 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కుసాల్ మెండిస్ (45 బంతుల్లో 61; 7 ఫోర్లు), పవన్ రత్నాయకే (28 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ దసున్ షనక (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 13, కమిల్ మిషారా 8, కమిందు మెండిస్ 19 (నాటౌట్), వెల్లాలగే 6 (నాటౌట్) పరుగులు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-0-28-0) మినహా అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. జితేన్ రామనంది (4-0-41-2), సూఫ్యాన్ మెహమూద్ (4-0-60-1), జే ఒడేడ్రా (1-0-14-1) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చారు. వసీం అలీ (3-0-38-0), నదీమ్ ఖాన్ (4-0-40-0)ను లంక బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ ఆదిలోనే చేతులెత్తేసింది. వెల్లాలగే (4-0-17-1), తీక్షణ (4-0-11-2), చమీరా (2-0-19-2), కమిందు (2-0-10-1), హేమంత (4-0-45-1) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒమన్ ఇన్నింగ్స్లో నాలుగో స్థానంలో వచ్చిన వెటరన్ బ్యాటర్ మొహమ్మద్ నదీం (56 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) మాత్రమే అర్ద సెంచరీతో రాణించాడు.నదీం కాకుండా వసీం అలీ (27) ఒక్కడే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆమిర్ కలీమ్ 6, కెప్టెన్ జతిందర్ సింగ్ 1, హమ్మద్ మీర్జా 9, వినాయక్ శుక్లా 1, నదీం ఖాన్ 2, సూఫ్యాన్ మెహమూద్ 1, షా ఫైసల్ 1, జే ఒడేడ్రా 4 (నాటౌట్), జితేన్ రామనంది డకౌటయ్యారు.నదీం ప్రపంచ రికార్డుఒమన్ తరఫున ఏకైక అర్ద సెంచరీ చేసిన మొహమ్మద్ నదీం ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 ప్రపంచకప్లో అర్ద సెంచరీ చేసిన అతి పెద్ద వయస్కుడైన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం నదీం వయసు 43 ఏళ్ల 161 రోజుల. గతంలో ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉండేది. జయసూర్య 2009 ప్రపంచకప్ ఎడిషన్లో వెస్టిండీస్పై 39 ఏళ్ల 345 రోజుల వయసులో అర్ద సెంచరీ చేశాడు.మరో ప్రపంచ రికార్డు కూడా సమంఈ మ్యాచ్లో నదీం మరో ప్రపంచ రికార్డును కూడా సమం చేశాడు. 52 బంతుల్లో అర్ద సెంచరీ పూర్తి చేసిన నదీం.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బంతుల పరంగా అతి నిదానంగా అర్ద సెంచరీ చేసిన ఆటగాడిగా పాక్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ రికార్డును సమం చేశాడు. రిజ్వాన్ 2024 ఎడిషన్లో కెనడాపై 52 బంతుల్లోనే అర్ద సెంచరీ చేశాడు. -
IND Vs PAK: పాక్తో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ
భారత్తో మ్యాచ్ బహిష్కరణ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బృందంతో పీసీబీ చర్చలు జరుపుతోంది. లాహోర్లో ఈ సమావేశానికి ఐసీసీ, పీసీబీతో పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తరఫున అమినుల్ ఇస్లాం హాజరయ్యాడు.డిమాండ్లు ఇవేనా?ఈ నేపథ్యంలో తాము టీమిండియాతో మ్యాచ్ ఆడాలంటే.. ఈ మ్యాచ్లో లభించే ఆదాయంలో తమకు అత్యధిక వాటా ఇవ్వాలని పీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అదే విధంగా.. బంగ్లాదేశ్కు నష్ట పరిహారం చెల్లించాలని, మ్యాచ్ ఫీజులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, ఇందుకు ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సానుకూలంగా లేనట్లు సమాచారం. గత్యంతరం లేకే తాము భారత్తో మ్యాచ్ బహిష్కరించామన్న పాక్ నిర్ణయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. బంగ్లాదేశ్కు అన్ని సభ్య దేశాల మాదిరి ఆదాయం మాత్రమే వస్తుందని తెలిపినట్లు సమాచారం.మాస్టర్ ప్లాన్!ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ తాము ఆర్థికంగా లబ్ది పొందేలా మాస్టర్ ప్లాన్ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీతో పీసీబీ చర్చలు సఫలమైనా.. పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ నిర్ణయం మేరకే తాము ఆడేది లేనిది చెబుతామని పీసీబీ అంటోందని.. ఇంతకంటే విషయాన్ని పెద్దది చేస్తే పాక్ నష్టపోకతప్పదనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయిస్పందించిన బీసీసీఐఈ క్రమంలో భారత క్రికెట్ మండలి (BCCI) ఈ అంశంపై మరోసారి స్పందించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముందుగా చెప్పినట్లు ఐసీసీ నిర్ణయం మేరకే మేము నడుచుకుంటాము. ఇందులో బీసీసీఐ చెప్పాల్సిందేమీ లేదు’’ పునరుద్ఘాటించారు.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది ఐసీసీ. అయితే, బంగ్లాదేశ్ సైతం తమకు భారత్లో భద్రత ఉండదని.. లంకకు తమ మ్యాచ్ల వేదికను మార్చాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలో నిజం లేదని తేల్చిన ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. అయినా సరే బంగ్లాదేశ్ పంతం వీడకపోవడంతో టోర్నీ నుంచి తప్పించింది.ఉగ్రదాడి జరిగినాఅప్పటి నుంచి బంగ్లాకు వంతపాడుతూ పాకిస్తాన్ డ్రామాలకు తెరలేపింది. తొలుత టోర్నీ నుంచి వైదొలుగుతామన్న పాక్.. తమకు తటస్థ వేదిక ఉన్నా ఇలా చేస్తే ఐసీసీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందన్న భయంతో వెనక్కి తగ్గింది. అయితే, టీమిండియాతో మ్యాచ్ను మాత్రం బహిష్కరిస్తామని పాక్ ప్రకటించింది. టోర్నీలో అన్ని మ్యాచ్లకు లేని భద్రతా కారణాలు టీమిండియాతో మ్యాచ్కు మాత్రమే ఉంటాయని చెబుతూ నైజం బయటపెట్టుకుంది. ఇందుకు శ్రీలంక గట్టిగా బదులిచ్చింది. పాక్లో తమపై ఉగ్రదాడి జరిగినా మళ్లీ ఆ దేశంలో మ్యాచ్లు ఆడామని గుర్తు చేసింది.భారత్- పాక్ మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. మ్యాచ్ బహిష్కరిస్తే తాము ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందని లంక లేఖ రాసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15నాటి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చిన పాక్.. అదనపు ఆదాయం కావాలంటూ మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: ఛాయ్ తీసుకో.. వద్దండి!.. అంబానీకి నో చెప్పిన రోహిత్ శర్మ!#WATCH | Delhi | On Pakistan to boycott its match against India in the ICC Men’s T20 World Cup 2026, BCCI Vice-President Rajeev Shukla says, "We will follow whatever decision is taken by ICC... BCCI has no statement on this..." pic.twitter.com/gug8zToSic— ANI (@ANI) February 9, 2026 -
టీ20 ప్రపంచకప్: ఐర్లాండ్పై శ్రీలంక విజయం
కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో ఐర్లాండ్పై శ్రీలంక విజయం సాధించింది. 20 పరుగులతో తేడాతో గెలిచేసింది. ఐర్లాండ్ జట్టు చివరివరకు పోరాడినప్పటికీ 143 పరుగులకే ఆలౌటైంది. దీంతో లంక గెలుపు లాంఛనమైంది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 54, కమిందు మెండిస్ 44 పరుగులు చేశారు. ఐర్లాండ్ జట్టులో బ్యారీ,జార్జ్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఐర్లాండ్కి మంచి ఆరంభం దక్కింది. కానీ వరస విరామాల్లో వికెట్లు వరసగా పడిపోవడంతో 19.5 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది.హ్యారీ టెక్టర్ 40, రాస్ అడైర్ 34 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ, తీక్షణ తలో మూడు వికెట్లు తీయగా.. పతిరాణా 2 వికెట్లు తీశారు. -
శ్రీలంక కెప్టెన్ ప్రపంచ రికార్డు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ దసున్ షనక ఓ చెత్త రికార్డు విషయంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్లో ఇవాళ (ఫిబ్రవరి 8) ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో డకౌటైన అతను.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక డకౌట్లైన (113 ఇన్నింగ్స్ల్లో 16 సార్లు) ఆటగాడిగా అవతరించాడు. షనకకు ముందు ఈ రికార్డు జప్పి బిమెన్యిమనా (62 ఇన్నింగ్స్ల్లో 15) పేరిట ఉండేది. షనక, జప్పి తర్వాతి స్థానాల్లో పాల్ స్టిర్లింగ్ (158 మ్యాచ్ల్లో 14) ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ ఆదిలో శ్రీలంక ఆటగాళ్లను బాగానే కట్టడి చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. 16 ఓవర్ల వరకు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగింది. ఆ సమయానికి 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆ ఓవర్ తర్వాత ఐర్లాండ్ బౌలర్లు లయ తప్పారు. అనవసర వైడ్లు, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫలితంగా చివరి 4 ఓవర్లలో లంక ఆటగాళ్లు 59 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో జార్జియా డాక్రెల్ (4-0-17-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్క్ అదైర్ (4-0-33-1), గెరాత్ డెలానీ (4-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. మాథ్యూ హంఫ్రేస్ (4-0-44-0), బ్యారీ మెక్ కార్తీ (3-0-40-2) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ మెండిస్ (56 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఆఖర్లో కుసాల్ మెండిస్ (44) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో నిస్సంక 24, కమిల్ మిషారా 14, పవన్ రత్నాయకే 5, వెల్లాలగే 10, హసరంగ ఒక్క పరుగు చేయగా.. షనక డకౌటయ్యాడు. -
శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ.. కీలక మార్పు
శ్రీలంక టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 1న ఇంగ్లండ్తో జరిగిన టీ20లో గాయపడిన ఈషాన్ మలింగ ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. మలింగ స్థానంలో ప్రమోద్ మదుశన్ జట్టులోకి వచ్చాడు. తొలుత ప్రకటించిన జట్టులో ప్రమోద్ స్థానాన్ని ఆశించి భంగపడ్డాడు. అయితే ఈషాన్ గాయపడటంతో ప్రమోద్కు బంపరాఫర్ దక్కింది. ఈషాన్, ప్రమోద్ ఇద్దరూ రైట్ ఆర్మ్ మీడియం పేసర్లే. ఈషాన్ లంక టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాగా.. ప్రమోద్ లంక తరఫున టీ20 ఆడి దాదాపు మూడేళ్లవుతుంది. అతను చివరిగా 2023 ఏప్రిల్లో లంక తరఫున టీ20 ఆడాడు. ప్రమోద్ అంతర్జాతీయ టీ20 ఆడి చాలాకాలమే అయినా పొట్టి ఫార్మాట్తో మాత్రం అనునిత్యం టచ్లోనే ఉన్నాడు. 24 ఏళ్ల ప్రమోద్ ఇప్పటివరకు 8 అంతర్జాతీయ టీ20లు ఆడి 12 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్లో ప్రమోద్.. మతీష పతిరణ. దుష్మంత చమీరాతో కలిసి కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు.స్వదేశంతో పాటు భారత్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఇవాల్టి నుంచే (ఫిబ్రవరి 7) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో గ్రూప్-బిలో ఉన్న శ్రీలంక.. తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 8న ఐర్లాండ్తో ఆడనుంది. ఈ గ్రూప్లో శ్రీలంక, ఐర్లాండ్తో పాటు ఆస్ట్రేలియా, ఒమన్, జింబాబ్వే జట్లు ఉన్నాయి.అప్డేటెడ్ శ్రీలంక జట్టు..- దసున్ షనక (కెప్టెన్) - పథుమ్ నిస్సంక - కమిల్ మిశారా - కుసల్ మెండిస్ - కమిందు మెండిస్ - కుసల్ జానిత్ పెరేరా - చరిత్ అసలంక - జానిత్ లియానగే - పవన్ రత్నాయకే - వనిందు హసరంగ - దునిత్ వెల్లలాగే - మహీష్ తీక్షణ - దుష్మంత చమీరా - మతీషా పథిరానా - ప్రమోద్ మదుశన్ -
T20 WC: జట్లు, మ్యాచ్ టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య షెడ్యూల్ ఖరారైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ ఈ ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ తమ మ్యాచ్లను శ్రీలంక వేదికగా ఆడేలా షెడ్యూల్ రూపొందించారు.ఈ వరల్డ్కప్ టోర్నీలో ఇరవై జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ పోటీ పడుతుండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే ఉన్నాయి.గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ ఉండగా.. గ్రూప్-డి నుంచి న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, యూఏఈ, కెనడా పోటీలో పడుతున్నాయి. మరి టోర్నీకి ఖరారైన ఇరవై జట్లలో ఎవరెవరు ఉన్నారు? మ్యాచ్ టైమింగ్స్... ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ? తదితర విషయాలు తెలుసుకుందామా?!గ్రూప్-ఎభారత్సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్.యూఎస్ఏమోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభం రంజానే.నమీబియాగెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ షాల్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్ల్యుపి మైబర్, మాక్స్ హీంగోరిజర్వు ప్లేయర్: అలెగ్జాండర్ వోల్షెంక్నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాచ్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్మ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్డెర్ మెర్వే, పాల్ వాన్ మెకరెన్, సకీబ్ జుల్ఫికర్పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్.గ్రూప్-బిఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాశ్రీలంకదసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, చరిత్ అసలంక, జనిత్ లియానాగే, పవన్ రత్నాయకే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఇషాన్ మలింగజింబాబ్వేసికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమెర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మడాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స, రిచర్డ్ ఎంగరవ, బ్రెండన్ టేలర్ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఒమన్జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రామనంది, అమీర్ కలీమ్గ్రూప్-సిఇంగ్లండ్హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్వెస్టిండీస్షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, జేసన్ హోల్డర్, అకీల్ హోసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడెన్ సీల్స్, రొమారియో షెపర్డ్.ఇటలీవేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్ కలుగమాగే, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, జెజె స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకానేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, షేర్ మల్లా, లోకేష్ బామ్స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఒలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్క్రీత్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్.ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్నాన్-ట్రావెలింగ్ రిజర్వ్స్: మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్బ్రైడ్, చార్లీ టియర్గ్రూప్-డిసౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో యాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్న్యూజిలాండ్మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదీఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్ రహీమి, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మాన్, డార్విష్ రసూలీ, ఇబ్రహీం జద్రాన్, జియా ఉర్ రెహమాన్ షరీఫీరిజర్వ్స్: AM గజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్కెనడాదిల్ప్రీత్ బజ్వా (కెప్టెన్), అజయ్వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్దీప్ సింగ్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధలీవాల్, నికోలస్ కిర్టన్, రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వా, యువ్రాజ్ సమ్రాయూఏఈముహమ్మద్ వసీమ్ (కెప్టెన్), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, ముహమ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిద్ ఖాన్, సోహైబ్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్.వేదికలు👉భారత్- కోల్కతా, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ 👉శ్రీలంక- కొలంబో, పల్లకెలె👉ఫైనల్- అహ్మదాబాద్మ్యాచ్ ఆరంభ సమయం👉ఉదయం మ్యాచ్లు: 11 గంటలకు ఆరంభం👉మధ్యాహ్నం మ్యాచ్లు: 3 గంటలకు ఆరంభం👉రాత్రి మ్యాచ్లు: 7 గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ వివరాలు👉టీవీలో స్టార్ స్పోర్ట్స్లో ప్రసారం👉డిజిటల్ మీడియాలో జియోహాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం👉తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లిష్, కన్నడ భాషల్లో జియో స్టార్ టీవీలో కామెంట్రీ👉జియోహాట్స్టార్లో పై భాషలతో పాటు బెంగాలీ, భోజ్పురి, హర్యాన్వీ భాషల్లోనూ వ్యాఖ్యానం.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్ -
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదులు తలపడుతుంటే ఇరు దేశాల అభిమానులే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తం స్క్రీన్లకే అతుక్కుపోతుందనడంలో సందేహం లేదు. అయితే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్లు జరిగి దశాబ్దకాలానికి పైగా గడిచిపోయింది.ప్రస్తుతం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్లో మాత్రమే భారత్- పాక్ ముఖాముఖి తలపడుతున్నాయి. ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత నుంచి ఈ రెండు దేశాల్లో ఒకటి ఆతిథ్యం ఇస్తే.. తటస్థ వేదికపైనే మ్యాచ్లు జరిగేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ భారత్లో జరుగుతుండగా.. పాక్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడనుంది.పాక్ ఓవరాక్షన్అయితే, బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల పోరుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ వందకు వంద శాతం జరిగితీరుందని అభిప్రాయపడ్డాడు.వందకు వంద శాతం జరుగుతుంది‘‘వచ్చే మూడు- నాలుగు రోజుల్లో పాక్ నిర్ణయం తారుమారు అవుతుంది. వందకు వంద శాతం భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుందని నేను కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరిలాగే నేనూ దాయాదుల పోరును చూడాలని గట్టిగా అనుకుంటున్నాను.ఈ మ్యాచ్ కేంద్రంగా పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు.. పాక్ ఇప్పుడు తప్పుకొంటే ఆర్థికంగా బాగా నష్టపోవాల్సి ఉంటుంది. తమ వల్ల కలిగిన నష్టాన్ని బ్రాడ్కాస్టర్లకు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ టోర్నీలో మిగతా దేశాలు కూడా ఉన్నాయి.ఇతర బోర్డులకూ నష్టమేపాక్ వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తుందని ఐసీసీ సమావేశంలో ఆయా దేశాల బోర్డులు వాదిస్తాయి. త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా జరుగనుంది. ఈ ఈవెంట్కు తమ ఆటగాళ్లను వెళ్లకుండా నిలువరించే అవకాశాలు కూడా ఉన్నాయి.అయినా ఈసారి పాక్ భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని చెప్పడం సమంజసమే కాదు. ఈసారి పాక్ తటస్థవేదిక మీదే పాక్ తమ మ్యాచ్లు ఆడబోతోంది. అయినా సరే టోర్నీలో ఒక్క జట్టుతో మాత్రమే ఆడము అని చెప్పడం ఏరకంగానూ ఆమోదయోగ్యనీయం కాదు. పూర్తిగా తప్పుకోకుండా ఒక్క జట్టుతో మ్యాచ్ను బహిష్కరించడం టెక్నికల్గా సరికాదు’’ అని అశూ పేర్కొన్నాడు.ఇప్పటికే బంగ్లా అవుట్కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లాదేశ్ ఐసీసీని కోరింది. అయితే, బంగ్లా వాదనలో నిజం లేదంటూ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. గడువు ఇచ్చినా బంగ్లా వైఖరి మారకపోడంతో టోర్నీ నుంచి ఆ జట్టును తప్పించింది. అయితే, పాక్ బంగ్లాదేశ్కు వంతపాడుతూ భారత్తో మ్యాచ్ బహిష్కరణ అంటూ నాటకానికి తెరతీసింది. కాగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్- పాక్ మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: T20 WC 2026: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. మేఘం కురిస్తే... -
T20 WC: పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వార్తల్లో నిలుస్తోంది. తొలుత బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీ నుంచే వైదొలుగుతామని బీరాలు పలికిన పాక్.. తాజాగా భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తున్నామంటూ కొత్త నాటకానికి తెరతీసింది.భారత్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాక్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఓవరాక్షన్ చేస్తూ వ్యవహారాన్ని తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తోంది.భారత్తో మ్యాచ్ రద్దు చేసుకుంటే..ఇక ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఒకవేళ పాక్.. టీమిండియాతో మ్యాచ్ రద్దు చేసుకుంటే.. ఐసీసీ నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాక్ క్రికెట్ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ విషయం పక్కనపెడితే.. ప్రస్తుతానికి ఈ టోర్నీలో కనీసం సూపర్ 8 చేరే అవకాశాలను కూడా పాక్ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్కప్ టోర్నీలో పాక్.. భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాతో కలిసి గ్రూప్-ఎలో ఉంది. ఇందులో భాగంగా టోర్నీ ఆరంభం రోజున అంటే శనివారం (ఫిబ్రవరి 7) పాక్.. తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడాల్సి ఉంది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.వాన పడే అవకాశంఅయితే, ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వాన పడే అవకాశం 90 శాతం ఉంది. ఇక ఫిబ్రవరి 15న రెండో మ్యాచ్లో భారత్ను ఢీకొట్టాల్సి ఉండగా.. పాక్ ఆ మ్యాచ్ను రద్దు చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతోంది.ఇక లీగ్ దశలో ఆఖరిగా పాక్.. నమీబియాతో ఫిబ్రవరి 18న సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్కు కూడా వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలు 25 శాతం ఉన్నాయి. కాగా టీమిండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్ రెండు పాయింట్లు కోల్పోతుంది. అదే సమయంలో సూర్య సేనకు రెండు పాయింట్లు ఉచితంగా వస్తాయి.నెట్రన్రేటుపై ప్రభావంమరోవైపు.. వర్షం వల్ల నెదర్లాండ్స్, నమీబియాలతో మ్యాచ్లకు ఆటంకం కలిగితే నెట్రన్ రేటుపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఫిబ్రవరి 10న అమెరికాతో మ్యాచ్లో పాక్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. గత ఎడిషన్లో పసికూన అయిన అమెరికా చేతిలో పాక్ ఓడిపోయి సూపర్-8 కూడా చేరకుండా నిష్క్రమించిన విషయం తెలిసిందే.తాజా ఎడిషన్లోనూ పాక్కు చిక్కులు తప్పేలా లేవు. టీమిండియాతో మ్యాచ్ రద్దు.. రెండు మ్యాచ్లకు వర్షం ఆటంక కలిగించే సూచనలు.. వెరసి ఈసారి కూడా పాక్ సూపర్-8 చేరడం కష్టమే అనిపిస్తోంది. చదవండి: Ricky Ponting: వద్దని మొత్తుకున్నా వినలేదు.. అతడిని వదిలేశారు -
ఇంగ్లండ్ ‘క్లీన్స్వీప్’
పల్లెకెలె: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఇంగ్లండ్ జట్టు... శ్రీలంకపై టి20 సిరీస్ను ‘క్లీన్ స్వీప్’ చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 12 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. ఈ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ను 2–1తో సొంతం చేసుకున్న ఇంగ్లండ్... టి20 సిరీస్ను 3–0తో చేజిక్కించుకుంది. చివరి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. సామ్ కరన్ (48 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో రాణించగా... జోస్ బట్లర్ (25), లియామ్ డాసన్ (14) మాత్రమే రెండంకెల స్కరు చేశారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (4), బెన్ డకెట్ (0), జాకబ్ బెథెల్ (3), టామ్ బాంటన్ (7), విల్ జాక్స్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దుశ్మంత చమీరా 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... పతిరణకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో లంక 19.3 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (23), కుషాల్ మెండిస్ (26) కాస్తా పోరాడగా... తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్ 4, జాక్స్ 3 వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
శ్రీలంకకు ఊహించని షాక్
టీ20 ప్రపంచకప్-2026కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ ఎషాన్ మలింగ భుజం గాయం కారణంగా ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం పల్లెకెలె వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో మలింగ భుజానికి గాయమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు.అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి 4 నుండి 6 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మలింగ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున 13 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. జాతీయ జట్టు తరపున కూడా నిలకడగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలోనే అతడికి వరల్డ్కప్ జట్టులో సెలెక్టర్లు చోటు ఇచ్చారు. కానీ ఇప్పుడు అనుహ్యంగా గాయపడడంతో టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడి స్ధానంలో దిల్షాన్ మధుశంక జట్టులోకి వచ్చే అవకాశముంది.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
టీ20 వరల్డ్కప్ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.అసలంకపై వేటు..కాగా ఈ మెగా టోర్నీ కోసం లంక సెలెక్టర్లు గత డిసెంబర్లో 25 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్గా ఎంపిక చేశారు.షనక కెప్టెన్గా గతంలో లంకకు ఆసియాకప్ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతున్నారు.టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టుపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్ తీక్షణ -
ముగ్గురు భారత అంపైర్లకు చోటు
దుబాయ్: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే టి20 ప్రపంచ కప్లో పని చేయనున్న అంపైర్లు, రిఫరీలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. 24 మంది అంపైర్లతో పాటు ఆరుగురు మ్యాచ్ రిఫరీలు ఈ జాబితాలో ఉన్నారు. భారత మాజీ పేసర్, సీనియర్లలో ఒకడైన జవగల్ శ్రీనాథ్ రిఫరీగా కొనసాగనుండగా...అతనితో పాటు డీన్ కోస్కర్, డేవిడ్ గిల్బర్ట్, రంజన్ మదుగలే, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అంపైర్లలో భారత్ నుంచి నితిన్ మేనన్, అనంత పద్మనాభన్, జె.మదన్ గోపాల్లకు అవకాశం దక్కింది. ఐసీసీ ఎలీట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడైన నితిన్ మేనన్కు ఇది నాలుగో టి20 వరల్డ్ కప్ కానుంది. గతంలో అతను 2021, 2022, 2024లలో కూడా అంపైర్గా వ్యవహరించాడు. భారత్, న్యూజిలాండ్ సిరీస్లో భాగంగా నేడు జరిగే మ్యాచ్లో అంపైర్గా బాధ్యతలు నిర్వహించనున్న 42 ఏళ్ల మేనన్కు ఇది మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ కానుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత అంపైర్గా అతను నిలవనున్నాడు. మదన్గోపాల్కు ఇది రెండో టి20 వరల్డ్ కప్ కాగా, పద్మనాభన్కు తొలిసారి ప్రపంచ కప్ చాన్స్ లభించింది. రోలండ్ బ్లాక్, క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిసన్ గాఫ్నీ, ఆడ్రియన్ హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, రిచర్డ్ కెటిల్బరో, వేన్ నైట్స్, డొనొవాన్ కాచ్, స్యామన్ నొగాస్కీ, అల్లావుద్దీన్ పలేకర్, అహ్సాన్ రజా, లెస్లీ రీఫర్, పాల్ రీఫెల్, లాంగ్టన్ రూసెర్, షర్ఫుద్దౌలా షాహిద్, గాజీ సొహెల్, రాడ్నీ టకర్, అలెక్స్ వార్స్, రవీంద్ర విమలసిరి, ఆసిఫ్ యాఖూబ్ కూడా అంపైర్లుగా టి20 వరల్డ్ కప్లో పని చేయనున్నారు. -
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే అన్ని జట్ల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు సర్వం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీలో 20 దేశాలు పాల్గొంటుండగా.. అన్నీ దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆ జట్ల పూర్తి వివరాలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూద్దాం.ఆఫ్ఘనిస్తాన్: రషీద్ ఖాన్ (సి), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్హాక్ ఫరూకీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్ ఉల్ హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదీన్ నయీబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, దర్విష్ రసూల్, ఇబ్రహీం జద్రాన్. రిజర్వ్లు: AM ఘజన్ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్ మరియు జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (సి), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.కెనడా: దిల్ప్రీత్ బజ్వా (సి), అజయ్వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ థాకర్, జస్కరన్దీప్ బుట్టర్, కలీమ్ సనా, కన్వర్పాల్ తాత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయాస్ మొవ్వ, యువ్రాజ్ సమ్రా.ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్ (సి), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.భారత్: సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మాథ్యూ హంఫ్రీస్, జోష్ లిటిల్, బారీ మెక్కార్తీ, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.ఇటలీ: వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్ప్రీత్ సింగ్, JJ స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.నమీబియా: గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్క్యాంప్, మలన్ క్రుగర్, నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జెసి బాల్ట్, డైలాన్ లీచర్, డబ్యూపీ మైబుర్గ్, మ్యాక్స్ హెయింగో రిజర్వ్: అలెగ్జాండర్ వోల్స్చెంక్.నేపాల్: రోహిత్ పౌడెల్ (సి), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లమిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్బన్షి, షేర్ మల్లా, లోకేశ్ బామ్.నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), కోలిన్ అకెర్మాన్, నోహ్ క్రోస్, బాస్ డి లీడ్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లైన్, మైఖేల్ లెవిట్, జాక్ లయన్-కాచెట్, మాక్స్ ఓ'డౌడ్, లోగాన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, రోల్ఫ్ వాన్డర్ మెర్వ్, పాల్ వాన్ మీకెరెన్, సాకిబ్ జుల్ఫికర్.న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, కైల్ జామిసన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, బెన్ సియర్స్ (రిజర్వ్).ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మొహమ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితెన్ రామనంది, హస్నైన్ అలీ షా.పాకిస్తాన్: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్క్రీత్, బ్రాండన్ మెక్ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్. రిజర్వ్లు: జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్, మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్బ్రైడ్, చార్లీ టియర్.దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, మార్కో జాన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి న్గిడి, అన్రిచ్ నార్ట్జే, కగిసో రబాడా, ర్యాన్ రికెల్టన్, జాసన్ స్మిత్ మరియు ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంక: దసున్ షనక (సి), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, జనిత్ లియానగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్ననాయక్, సహన్ అరాచిత్వెల్లంగా, రాంత్నిలంగా, రవాణి వాన్గే, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మధుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయ్కాంత్ వియాస్కాంత్, ట్రవీన్ మాథ్యూయూఏఈ: ముహమ్మద్ వసీమ్ (సి), అలీషాన్ షరాఫు, ఆర్యన్ష్ శర్మ, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, హర్షిత్ కౌశిక్, జునైద్ సిద్ధిక్, మయాంక్ కుమార్, ముహమ్మద్ అర్ఫాన్, ముహమ్మద్ ఫరూక్, మహ్మద్ జవదుల్లా, ముహమ్మద్ జోహైబ్, రోహిత్ ఖాన్, సోహైబ్ సింగ్, సిమ్రాన్జీత్ ఖాన్, సిమ్రాన్జీత్.యూఎస్ఏ: మోనాంక్ పటేల్ (సి), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మొహమ్మద్ మొహిసిన్, శుభమ్ రంజనే.వెస్టిండీస్: షాయ్ హోప్ (సి), షిమ్రాన్ హెట్మెయర్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, రోవ్మన్ పావెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, క్వెంటిన్ సాంప్సన్, జేడన్ సీల్స్, రొమారియో షెపర్డ్.జింబాబ్వే: సికందర్ రజా (సి), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, రిచార్డాన్ మైగర్రాబనీ, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మేయర్స్, రిచర్డ్ నగరవ, బ్రెండన్ టేలర్ -
వరల్డ్కప్కు సంబంధించి బిగ్ అప్డేట్
త్వరలో భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్కప్కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగనుండగా.. మూడో మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్లో భారత్, యూఎస్ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది.అదే రోజు టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య కోల్కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విడిపోయాయి. గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. భారత్, పాక్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. పాక్ తమ మ్యాచ్లన్నీ (భారత్ మ్యాచ్తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు.. సెమీస్లో గెలిచే జట్లు ఫైనల్కు చేరుకుంటాయి. గత ఎడిషన్లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. -
ICC: బంగ్లాదేశ్కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్లు.. ముఖ్యంగా భారత్లో జరిగిన మ్యాచ్లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్కు ఛాన్స్! -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్.. 58 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగా ఆడుతుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఐర్లాండ్, జపాన్పై ఘన విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇవాళ (జనవరి 23) జరుగుతున్న తమ చివరి గ్రూప్ (ఏ) మ్యాచ్లో శ్రీలంకను 58 పరుగులకే కుప్పకూలిచ్చి సగం విజయాన్ని సొంతం చేసింది.విండ్హోక్లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. పేసర్ విల్ బైరోమ్ (6.4-0-14-5) చెలరేగడంతో 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. బైరోమ్కు జతగా ఛార్లెస్ లచ్మండ్ (5-1-19-2), కేసీ బార్టన్ (4-0-13-2), హేడెన్ ష్కిల్లర్ (3-0-11-1) కూడా రాణించారు. ఆసీస్ బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్లో కవిజ గమగే (10), చమిక హీనతగల (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ దిమంత మహావితన డకౌట్ కాగా.. మరో ఓపెనర్ విరాన్ చముదిత, దుల్నిత్ సిగెరా, ఆడమ్ హిల్మి తలా ఒక్క పరుగు.. కెప్టెన్ విమత్ దిన్నరా 7, సెనెవిరత్నే 5, రసిత్ రింసర, కుగథాస్ మథులాన్ తలో 6 పరుగులు చేశారు. కాగా, ఈ టోర్నీలో శ్రీలంక తమ తొలి రెండు గ్రూప్ స్టేజీ మ్యాచ్ల్లో జపాన్, ఐర్లాండ్పై ఘన విజయాలు సాధించి తదుపరి దశకు అర్హత సాధించింది. -
బంగ్లాదేశ్ ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం!
టి20 ప్రపంచ కప్లో తాము ఆడే మ్యాచ్లను భద్రతాకారణాలతో భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. తాము వరల్డ్ కప్ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్ను మార్చి ఐర్లాండ్ మ్యాచ్ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. -
ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి.. ‘రత్నపుర’లో దొరికిన రత్నం
ప్రపంచ రత్నాల చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో ప్రపంచంలోనే అతిపెద్ద నీలమణి వజ్రాన్ని ఇటీవల ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఊదా వర్ణంలో మెరిసే ఈ అద్భుతమైన రత్నం పేరు ‘పర్పుల్ స్టార్’. దీని బరువు 3,563 క్యారెట్లు. ఇదే ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద నీలమణి రాయి కావడం విశేషం.వజ్రం కంటే ఎక్కువ మెరుపు, ఆకర్షణ కలిగిన ఈ నక్షత్ర నీలమణి త్వరలోనే వేలానికి రానుంది. యజమానులు దీని విలువను సుమారు 300 మిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీలో సుమారు రూ. 2,728 కోట్లు)గా నిర్ణయించారు.ఈ అరుదైన నీలమణిని ‘స్టార్ ఆఫ్ ప్యూర్ ల్యాండ్’ అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రముఖ రత్నాల నిపుణుడు ఆశాన్ అమరసింఘే మాట్లాడుతూ.. “ఇది చరిత్రలో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద ఊదా నక్షత్ర నీలమణి. ఇది నక్షత్రంలా కనిపిస్తూ, ఏడు విభిన్న రంగుల కిరణాలను వెలువరిస్తుంది. ఇతర రత్నాలకంటే ఇది పూర్తిగా భిన్నమైన ప్రత్యేకతను కలిగి ఉంది” అని తెలిపారు.2023లో లభించిన అపురూప రత్నంఈ విలువైన రత్నానికి సంబంధించిన యజమానులు తమ గుర్తింపును బహిర్గతం చేయలేదు. భద్రతాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే యజమానుల్లో ఒకరి ప్రకారం.. 2023లో ఈ నీలమణి వారి చేతికి వచ్చింది.శ్రీలంకలోని ‘రత్నపుర’ ప్రాంతాన్ని ‘రత్నాల నగరం’గా పిలుస్తారు. అక్కడ జరిగిన తవ్వకాల సమయంలో ఈ రాయి బయటపడింది. అప్పట్లో ఇతర రత్నాలతో పాటు దీన్నీ కొనుగోలు చేశారు. దాదాపు రెండేళ్లపాటు అలాగే ఉంచిన తర్వాత, గత సంవత్సరం దీనిని ధ్రువీకరణ కోసం ప్రయోగశాలకు పంపారు.రూ.కోట్లలో ధరఅంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ఈ నీలమణి విలువ 300 నుంచి 400 మిలియన్ డాలర్లు (రూ.2,728 – 3,638 కోట్లు) వరకు ఉండొచ్చని ఆశాన్ అమరసింఘే వెల్లడించారు. ప్రపంచ రత్నాల మార్కెట్లో ఈ ‘పర్పుల్ స్టార్’ త్వరలోనే కొత్త చరిత్ర సృష్టించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
అతి పెద్ద నీలమణి!
ఊదా రంగులో మెరిసిపోతున్న ఈ నీలమణిని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా! ఇది అలాంటిలాంటి నీలం కాదు. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నీలమణిగా రికార్డులకెక్కింది! అత్యంత అరుదైనదిగా చెబుతున్న ఈ నీలాన్ని శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం తొలిసారి ప్రదర్శనకు ఉంచారు. ఇది ఏకంగా 3,536 క్యారెట్ల బరువుందట! అంటే 700 గ్రాములన్నమాట!! దీనికి స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ అని నామకరణం చేశారు. ఇది నకిలీది కాదని, సిసలైన నీలమణేనని జెమాలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా (జీఐఏ) కూడా ధ్రువీకరించింది. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద సహజ నీలం ఇదేననీ పేర్కొంది. ఇంత భారీ పరిమాణంలో కూడా ఈ నీలమణి పూర్తిస్థాయి సౌష్టవంతో కూడుకుని ఉండటం విశేషమని నిపుణులు చెబుతున్నారు. దానికితోడు సహజంగా అమరిన చూడచక్కని గుండ్రనైన రూపు దీని ప్రత్యేకతను ఎన్నో రెట్లు పెంచింది. వీటన్నింటికీ మించి ఇది ఆరు రకాల కాంతి కిరణాలను వెదజల్లుతుందట కూడా! ఇక నీలమణికి అతి ముఖ్యమైన స్వచ్ఛత విషయంలో కూడా సాటి లేని నాణ్యత స్టార్ ఆఫ్ ప్యూర్ లాండ్ సొంతమని ప్రదర్శకులు వివరించారు. దీని విలువ కనీసం 30 కోట్ల నుంచి 40 కోట్ల డాలర్లు (రూ.3,628 కోట్లు) ఉంటుందని అంతర్జాతీయ రత్నాల నిపుణులు చెప్పారు. వేలంలో దీనికి అంతకు మించే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. భద్రతా కారణాల రీత్యా దీని యజమానుల వివరాలను గోప్యంగా ఉంచారు. ఈ నీలమణి 2023లో శ్రీలంక మారుమూల ప్రాంతంలో వజ్రాల నగరంగా పేరొందిన రత్నపురలో దొరికినట్టు దాని యజమానుల్లో ఒకరు వెల్లడించారు. సాటిలేని నాణ్యతతో కూడిన నీలమణులకు శ్రీలంక అనాది కాలం నుంచీ ప్రసిద్ధి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తిప్పేసిన హసరంగ.. బెంబేలెత్తిపోయిన పాక్
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక 1-1తో డ్రా చేసుకుంది. డంబుల్లా వేదికగా నిన్న (జనవరి 11) జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో పాక్ను 14 పరుగుల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బ్యాటర్లు తలో చేయి వేసి ఈ స్కోర్ను అందించారు. కమిల్ మిషారా 20, కుసాల్ మెండిస్ 30, ధనంజయ డిసిల్వ 22, చరిత్ అసలంక 21, దసున్ షనక 34, జనిత్ లియనాగే 22 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు పడగొట్టగా.. నసీం షా, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ పడగొట్టారు.తిప్పేసిన హసరంగఅనంతరం భారీ లక్ష్య ఛేదనలో హసరంగ ధాటికి పాక్ బెంబేలెత్తిపోయింది. 12 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకు మాత్రమే పరిమితమైంది. హసరంగ 3 ఓవర్లలో 35 పరుగులకు 4 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మతీష పతిరణ (3-0-34-2) రాణించాడు. ఎషాన్ మలింగకు ఓ వికెట్ దక్కింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సల్మాన్ అఘా (45) టాప్ స్కోరర్గా నిలువగా.. మరో ఇద్దరు (నవాజ్ (28), ఖ్వాజా నఫే (26)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో పాక్ గెలువగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
శ్రీలంక మాస్టర్ మైండ్.. వరల్డ్కప్ విన్నింగ్ కోచ్తో ఒప్పందం
టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటింగ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్ను ఎస్ఎల్సీ నియమించింది. టీ20 వరల్డ్కప్ టోర్నీకి శ్రీలంక జట్టును సన్నద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్గా నియమించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.రాథోర్ జనవరి 18న లంకతో జట్టుతో కలవనున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జట్టుతోనే ఉండనున్నాడు. విక్రమ్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. . 2019 సెప్టెంబర్ నుంచి 2024 జూలై వరకు భారత బ్యాటింగ్ కోచ్గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅతడు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవల్ 3 కోచ్గా కొనసాగాడు.అతడు ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్గా కూడా పనిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్పటికే భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రామకృష్ణన్ శ్రీధర్ను తమ ఫీల్డింగ్ కోచ్గా నియమించింది. రాథోర్ భారత బ్యాటింగ్ కోచ్గా ఉన్న సమయంలోనే ఫీల్డింగ్ కోచ్గా శ్రీధర్ పనిచేశాడు.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా సేవలందించనున్నాడు. కాగా ఈ పొట్టి ప్రపంచకప్కు శ్రీలంక, భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. శ్రీలంక తమ లీగ్ మ్యాచ్లన్నింటని స్వదేశంలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన ఐసీసీ?!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్లను భారత్ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్బజ్ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.ముస్తఫిజుర్ రహమాన్ అవుట్ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్గా మెజారిటీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్కతా నైట్రైడర్స్ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.మ్యాచ్లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తిభారత్లో మ్యాచ్లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి మూడు లీగ్ మ్యాచ్లను కోల్కతాలో, చివరి మ్యాచ్ను ముంబైలో ఆడాల్సి ఉంది.‘బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్ జట్టు భారత్లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం. బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది. తరలింపు కష్టమే! బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది. ప్రసారకర్తలు మ్యాచ్లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఆ రియల్ హీరోల కోసం.. చప్పట్లతో మారుమోగిన స్టేడియం -
ప్రపంచకప్కు శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
నమీబియా, జింబాబ్వే వేదికలుగా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరుగబోయే 2026 అండర్ 19 క్రికెట్ వరల్డ్కప్ కోసం 15 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా విమత్ దిన్సరా ఎంపిక కాగా.. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) కవిజ గమగే నియమితుడయ్యాడు.ప్రపంచకప్లో శ్రీలంక.. జపాన్, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. ఈ మెగా టోర్నీ కోసం లంక జట్టు ఇవాళే నమీబియాకు బయల్దేరనుంది. ముందుగా వెళితే అక్కడి పరిస్థితులకు అలవాటు పడవచ్చని లంక బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ప్రపంచకప్లో శ్రీలంక ప్రయాణం జనవరి 17న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో జపాన్తో తలపడుతుంది. అనంతరం జనవరి 19న ఐర్లాండ్తో, 23న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.గతేడాది బంగ్లాదేశ్, వెస్టిండీస్ వన్డే సిరీస్ల్లో ఓటమిపాలైనప్పటికీ, ఆసియా కప్లో సెమీఫైనల్ వరకు చేరిన లంక యువ జట్టు.. మొదటి వరల్డ్కప్ టైటిల్ కోసం బలంగా పోరాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టు వివరాలు- విమత్ దిన్సరా (కెప్టెన్) - కవిజ గమగే (వైస్ కెప్టెన్) - దిమంత మహవితాన - విరాన్ చముదిత - దుల్నిత్ సిగేరా - చమిక హీంటిగల - ఆడమ్ హిల్మీ - చమరిందు నెత్సరా - సేత్మిక సెనేవిరత్నె - కుగథాస్ మాథులన్ - రసిత్ నిమ్సరా - విగ్నేశ్వరన్ ఆకాష్ - జీవంత శ్రీరామ్ - సెనుజ వెకునగొడ - మలింత సిల్వా -
భారత్ 5.. శ్రీలంక 0
ఫార్మాటే మారింది. కానీ జోరు ఏమాత్రం మారలేదు. తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన ఊపుమీదున్న భారత మహిళల జట్టు ఇదే ఉత్సాహంతో పొట్టి ఫార్మాట్లో శ్రీలంకను గట్టిదెబ్బ కొట్టింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత్ 5–0తో వైట్వాష్ చేసింది. ఆడినవన్నీ ఓడిన చమరి ఆటపట్టు సేన నిరాశగా వెనుదిరుగుతోంది.తిరువనంతపురం: ఆఖరి పోరులోనూ భారత అమ్మాయిలే హోరెత్తించారు. ఫలితంగా ఐదు టి20ల సిరీస్ను 5–0తో హర్మన్ సేన చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన చివరి సమరంలో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేసింది. హైదరాబాదీ ఆల్రౌండర్ అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో దంచేసింది. ప్రత్యర్థి బౌలర్లలో కవీశా దిల్హరి, రష్మిక, చమరి తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు చేసి ఓడింది. హాసిని (42 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమిషా దులాని (39 బంతుల్లో 50; 8 ఫోర్లు) రాణించారు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి 241 పరుగులు చేసిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.ఆదుకున్న హర్మన్ మొదట బ్యాటింగ్కు దిగగానే భారత్ దెబ్బమీద దెబ్బతో కుదేలైంది. షఫాలీ (5), తొలి మ్యాచ్ ఆడుతుతన్న కమలిని (12), హర్లీన్ డియోల్ (13), రిచా ఘోష్ (5), దీప్తిశర్మ (7) ఇలా ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయి 77/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో హర్మన్ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. అమన్జోత్ (21)తో కలిసి వికెట్ కాపాడుకుంటూనే పరుగుల వేగం పెంచింది. దీంతో 14.2 ఓవర్లో భారత్ స్కోరు 100కు చేరింది. హర్మన్ 35 బంతుల్లో ఫిఫ్టీని పూర్తిచేసుకుంది. సిక్స్, ఫోర్ కొట్టిన ఉత్సాహంలో ఉన్న అమన్ను రష్మిక అవుట్ చేయడంతో ఆరో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 4 పరుగుల వ్యవధిలో 142 స్కోరు వద్ద హర్మన్ ఏడో వికెట్గా వెనుదిరిగింది. హాసిని, ఇమిషా ఫిఫ్టీ–ఫిఫ్టీ లంక లక్ష్యఛేదన ఆరంభంలోనే చమరి (2) వికెట్ను కోల్పోయినప్పటికీ హాసిని, ఇమిషా రాణించడంతో 11 ఓవర్ల వరకు మరో వికెట్ను కోల్పోలేదు. 86/1 స్కోరు వద్ద శ్రీలంక గెలిచేలా కనిపించింది. కానీ అర్ధసెంచరీ పూర్తయిన వెంటనే ఇమిషా అవుటయ్యాక లంక తిరోగమించింది. నీలాక్షిక (3), కవీశా (5), హర్షిత (8), కౌశిని (1) విఫలమయ్యారు. దీంతో శ్రీలంక లక్ష్యానికి దూరమైంది. 89వ మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ హాసిని ఎట్టకేలకు ఒక ఫిఫ్టీని ఈ మ్యాచ్ ద్వారా సాధించగలిగింది. దీప్తి, అరుంధతీ, స్నేహ్, వైష్ణవి, శ్రీచరణి, అమన్జోత్లు తలా ఒక వికెట్ తీశారు. తమిళనాడుకు చెందిన గుణాలన్ కమలిని ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున టి20 మ్యాచ్లు ఆడిన 90వ క్రీడాకారిణిగా కమలిని గుర్తింపు పొందింది. 17 ఏళ్ల కమలిని ఈ ఏడాది ఆరంభంలో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. సీనియర్ మహిళల టి20 టోర్నీలో తమిళనాడు తరఫున టాప్స్కోరర్ (297 పరుగులు)గా నిలవడంతో ఆమెకు భారత జట్టులో అవకాశం లభించింది. చివరి టి20లో కమలిని, రేణుకా ఠాకూర్లను తుది జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్...స్మృతి మంధానకు విశ్రాంతినిచ్చి స్నేహ్ రాణాను తప్పించింది.20వ ఓవర్లో 20హైదరాబాదీ క్రికెటర్ అరుంధతీ డెత్ ఓవర్లలో చేసిన పరుగులే మ్యాచ్ విజయంలో కీలకమయ్యాయి. హర్మన్ అవుటయ్యే సమయానికి జట్టు స్కోరు 150ని కూడా చేరుకోలేదు. ఈ దశలో స్నేహ్ రాణా అండతో అరుంధతి ఆఖర్లో చెలరేగింది. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 155/7 కాగా... మదర వేసిన ఆఖరి ఓవర్లో అరుంధతి విరుచుకుపడింది. మొదటి 5 బంతులాడిన ఆమె వరుసగా 4, 1(వైడ్), 6, 4, 4, 1లతో 19 పరుగులు పిండుకుంది. చివరి బంతికి స్నేహ్ రాణా పరుగు చేయలేదు. వైడ్ సహా 20వ ఓవర్లో 20 పరుగులొచ్చాయి.152 భారత బౌలర్ దీప్తిశర్మ తీసిన వికెట్లు. అంతర్జాతీయ టి20లో అత్యధిక వికెట్లు (152) తీసిన బౌలర్గా రికార్డులకెక్కింది.స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) ఇమిషా (బి) నిమషా 5; కమలిని (ఎల్బీడబ్ల్యూ) (బి) కవీశా 12; హర్లీన్ (బి) రష్మిక 13; హర్మన్ప్రీత్ (బి) కవీశా 68; రిచా ఘోష్ (సి) కౌశిని (బి) చమరి 5; దీప్తిశర్మ (సి) నిమషా (బి) చమరి 7; అమన్జోత్ (సి) కవీశా (బి) రష్మిక 21; అరుంధతీ (నాటౌట్) 27; స్నేహ్ రాణా (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–5, 2–27, 3–41, 4–64, 5–77, 6–138, 7–142. బౌలింగ్: మాల్కి మదర 4–0–37–0, నిమషా మీపగె 3–0–25–1, కవీశా దిల్హరి 2–0–11–2, ఇనొక 4–0–39–0, రష్మిక 4–0–42–2, చమరి 3–0–21–2. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (బి) శ్రీచరణి 65; చమరి (సి) వైష్ణవి (బి) అరుంధతీ 2; ఇమిషా (సి) షఫాలీ (బి) అమన్జోత్ 50; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 3; కవీశా (బి) వైష్ణవి 5; హర్షిత (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 8; కౌశిని రనౌట్ 1; రష్మిక (నాటౌట్) 14; మదర (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–86, 3–100, 4–107, 5–132, 6–140, 7–140. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–28–1, అరుంధతీ 2–0–16–1, స్నేహ్ రాణా 4–0–31–1, వైష్ణవి 4–0–33–1, శ్రీచరణి 4–0–31–1, అమన్జోత్ 2–0–17–1. -
శ్రీలంక క్రికెటర్ కన్నుమూత
శ్రీలంక మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో కన్నుమూశాడు. 2018 డిసెంబర్లో జరిగిన రైల్వే ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఏడేళ్లు అపస్మారక స్థితిలో ఉండి ఇవాళ (డిసెంబర్ 30) ఉదయం తుదిశ్వాస విడిచాడు. కొలొంబోకు సమీపంలో గల మౌంట్ లవినియా బీచ్ వద్ద రక్షణలేని ట్రాక్ దాటుతుండగా ఆక్షుని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. శరీరంలో చాలా చోట్ల ఫ్రాక్చర్లు కావడంతో లైఫ్ సపోర్ట్పై ఉంచారు. ప్రమాదం జరిగిన నాటికి అక్షు వయసు 27 ఏళ్లు. ప్రమాదానికి కొన్ని రోజుల ముందు అక్షు ఓ స్థానిక టోర్నీ ఆడాడు. అందులో రగామా క్రికెట్ క్లబ్కు ప్రాతినిథ్యం వహించాడు. అక్షు మరణం శ్రీలంక క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బంగారు భవిష్యత్తు కలిగిన అక్షు దురదృష్టకర రీతిలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే బాధిస్తుంది.అక్షు న్యూజిలాండ్లో జరిగిన 2010 అండర్-19 వరల్డ్కప్లో శ్రీలంక జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలో కెనడాతో జరిగిన గ్రూప్ మ్యాచ్లో కీలక పరుగులు చేశాడు. అనంతరం దక్షిణాఫ్రికాపై క్వార్టర్ ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో 52 పరుగులు (88 బంతుల్లో) చేశాడు. ఆ టోర్నీలో అక్షు వ్యక్తిగతంగా రాణించినా, శ్రీలంక నాలుగో స్థానంలో ముగించింది. -
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి -
క్లీన్స్వీప్పై భారత్ గురి... నేడు శ్రీలంకతో ఐదో టి20 మ్యాచ్
తిరువనంతపురం: ఈ ఏడాదిని క్లీన్స్వీప్తో ముగించేందుకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టు విజయం దూరంలో ఉంది. శ్రీలంక జట్టుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి టి20 మ్యాచ్ ఈరోజు జరగనుంది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న హర్మన్ప్రీత్ కౌర్ బృందం వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదుంది. మరోవైపు క్లీన్స్వీప్ తప్పించుకోవాలని, ఒక్క విజయంతోనైనా పరువు దక్కించుకోవాలని శ్రీలంక భావిస్తోంది. అయితే అన్ని రంగాల్లో విఫలమవుతున్న చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక ఆఖరి మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో వేచి చూడాలి. వచ్చే ఏడాది జూన్–జూలైలో ఇంగ్లండ్ వేదికగా జరిగే టి20 ప్రపంచకప్ టోరీ్నకి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టిన టీమిండియా త్వరలో మరో రెండు టి20 సిరీస్లు (ఆ్రస్టేలియా, ఇంగ్లండ్లతో) ఆడనుంది. -
అదే జోరు... అదే ఫలితం
తిరువనంతపురం: బౌలింగ్ ప్రతాపం... ‘హ్యాట్రిక్’ విజయాలతో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు... తాజాగా బ్యాటింగ్ విధ్వంసంతో ఆధిక్యాన్ని 4–0కు పెంచుకుంది. ఆదివారం జరిగిన నాలుగో టి20లో హర్మన్ప్రీత్ బృందం 30 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్స్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, 1 సిక్స్)లతో పాటు ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్లు) దంచేశారు. అనంతరం కష్టమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పోరాడి ఓడింది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెమీమా రోడ్రిగ్స్ అస్వస్థత కారణంగా హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్ స్థానంలో అరుంధతి రెడ్డి తుది జట్టుకు ఆడారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి పోరు జరుగుతుంది. సెంచరీ భాగస్వామ్యం ఈ సిరీస్లో ఆశించిన దూకుడు కనబర్చలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్లో తన శైలీ ఆటతీరుతో అలరించింది. ఓ వైపు షఫాలీ, మరోవైపు మంధాన లంక బౌలర్ల భరతం పట్టారు. దీంతో పవర్ప్లేలో 61/0 స్కోరు చేసింది. దూకుడు అంతకంతకూ పెరగడంతో 10.5 ఓవర్లలోనే భారత్ స్కోరు 100కు చేరింది. షఫాలీ 30 బంతుల్లో, మంధాన 35 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి ధనాధన్ కొనసాగడంతో 14.2 ఓవర్లలోనే భారత్ 150 మార్క్ దాటింది. ఈ క్రమంలో 2019లో వెస్టిండీస్పై చేసిన 143 పరుగుల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకున్నారు. తర్వాత 162 స్కోరు వద్ద షఫాలీ, 6 పరుగుల వ్యవధిలో స్మృతి అవుటయ్యారు. తర్వాత వచ్చిన రిచా ఘోష్ భారీ సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడింది. రిచా, హర్మన్ప్రీత్ (16 నాటౌట్) అబేధ్యమైన మూడో వికెట్కు 23 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. రిచా మెరుపుల వల్లే భారత్ టి20 ఫార్మాట్లో తమ అత్యధిక స్కోరు (221/2) నమోదు చేసింది. ఈసారి పోరాడి... గత మూడు మ్యాచ్లతో పోలిస్తే లంక బ్యాటింగ్ తీరు పూర్తిగా మారింది. పెద్ద లక్ష్యం ముందు మోకరిల్లుతుందనుకుంటే ఆఖరి దాకా పోరాడి ఓడింది. కెపె్టన్ చమరి ఆటపట్టు (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు), హాసిని (33; 7 ఫోర్లు) తొలి వికెట్కు 59 పరుగులు జోడించారు. తర్వాత ఇమిషా దులాని (29; 3 ఫోర్లు), హర్షిత (20; 1 ఫోర్, 1 సిక్స్), నీలాక్షిక (11 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లంక ఓటమి అంతరాన్ని తగ్గించింది. స్కోరు వివరాలు భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) దులానీ (బి) శెహని 80; షఫాలీ (సి అండ్ బి) నిమషా 79; రిచా ఘోష్ (నాటౌట్) 40; హర్మన్ప్రీత్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–162, 2–168. బౌలింగ్: మల్షా శెహని 4–0–32–1, కావ్య 4–0–43–0, కవిషా 4–0–47–0, రష్మిక 2–0–25–0, చమరి 2–0–30–0, నిమష 4–0–40–1. శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) హర్మన్ (బి) అరుంధతి 33; చమరి (సి) స్మృతి (బి) వైష్ణవి 52; ఇమిషా (రనౌట్) 29; హర్షిత (స్టంప్డ్) రిచా (బి) వైష్ణవి 20; కవిషా (సి) సబ్–కమలిని (బి) అరుంధతి 13; నీలాక్షిక (నాటౌట్) 23; రష్మిక (బి) శ్రీచరణి 5; కౌశిని (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–59, 2–116, 3–140, 4–147, 5–170, 6–185. బౌలింగ్: రేణుక 3–0–32–0, అరుంధతి 4–0–42–2, దీప్తి 4–0–31–0, వైష్ణవి 4–0–24–2, అమన్జోత్ 1–0–10–0, శ్రీచరణి 4–0–46–1. 1 శ్రీలంక తరఫున 150 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా చమరి ఆటపట్టు నిలిచింది. నీలాక్షిక సిల్వా (107), ఉదేíÙక ప్రబోధిని (106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా మహిళల క్రికెట్లో 150 టి20లు ఎనిమిదో ప్లేయర్గా చమరి గుర్తింపు పొందింది.80 మహిళల అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత బ్యాటర్గా స్మృతి గుర్తింపు పొందింది. 78 సిక్స్లతో హర్మన్ప్రీత్ పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది.1703 ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో స్మృతి చేసిన పరుగులు. ఒకే ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా తన పేరిటే ఉన్న రికార్డును స్మృతి (2024లో 1659 పరుగులు) బద్దలు కొట్టింది.4 తొలి వికెట్కు స్మృతి, షఫాలీ 100 కంటే ఎక్కువ పరుగులు జత చేయడం ఇది నాలుగోసారి.221 టి20ల్లో భారత జట్టు తమ అత్యధిక స్కోరు సాధించింది. గత ఏడాది వెస్టిండీస్పై సాధించిన 217/4 స్కోరును భారత్ అధిగమించింది. టి20ల్లో భారత్ 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం ఇది నాలుగోసారి.162 ఓపెనర్లు స్మృతి, షఫాలీ తొలి వికెట్కు జోడించిన పరుగులు. టి20ల్లో ఏ వికెట్కైనా భారత్కిదే అతిపెద్ద భాగస్వామ్యం.4 మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల క్లబ్లో చేరిన నాలుగో బ్యాటర్ స్మృతి. ఈమె కంటే ముందు మిథాలీ, సుజీ బేట్స్ (న్యూజిలాండ్), చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) ఈ ఘనత సాధించారు. -
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్సీ అవుట్లెట్లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. -
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 28) నాలుగో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో భారత్ టాస్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్ స్థానాల్లో హర్లీన్ డియోల్, అరంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
నేడు శ్రీలంకతో భారత మహిళల జట్టు నాలుగో టి20
సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు... తిరువనంతపురం వేదికగా ఆదివారం శ్రీలంకతో నాలుగో టి20 ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి 3–0తో సిరీస్ చేజిక్కించుకున్న హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా... అదే జోరు కొనసాగిస్తూ నాలుగో మ్యాచ్లోనూ నెగ్గాలని భావిస్తోంది. గత మ్యాచ్ల్లో భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు శ్రీలంక స్వల్ప స్కోర్లకే పరిమితమైంది. టాపార్డర్ ఫుల్ ఫామ్లో ఉండటంతో... టీమిండియా సునాయాసంగా లక్ష్యాలను ఛేదించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్లో ఏపీ అమ్మాయి శ్రీచరణి నిలకడ కొనసాగిస్తుండగా... రేణుక, క్రాంతి, దీప్తి, వైష్ణవి, అమన్జ్యోత్ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే సిరీస్ దక్కడంతో ఈ మ్యాచ్లో రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్లో ప్రత్యక్షప్రసారం -
రేణుక నిప్పులు షఫాలీ మెరుపులు
121/6... 128/9... 112/7... ఇప్పటివరకు జరిగిన మూడు టి20ల్లోనూ శ్రీలంక మహిళల జట్టు స్కోర్లివి... భారత బౌలింగ్ ప్రతాపానికి మచ్చుతునకలు. ప్రతీ మ్యాచ్లోనూ మనమ్మాయిలు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. దీంతో 20 ఓవర్ల కోటా పూర్తి చేసినా... ఆలౌట్ కాకపోయినా కూడా కనీసం 130 పరుగులైనా చేయకుండా శ్రీలంకనుతమ బౌలింగ్ బంధనాలతో కట్టడి చేస్తున్నారు. దీంతో హర్మన్ప్రీత్ బృందం రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను 3–0తో వశం చేసుకుంది. తిరువనంతపురం: భారత్, శ్రీలంకల మధ్య ఈ వేదికపై ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆడిన తొలి (మూడో టి20) మ్యాచ్తోనే భారత మహిళల జట్టు ఐదు టి20ల సిరీస్ను 3–0తో కైవసం చేసుకుంది. భారత పేసర్ రేణుక సింగ్ (4/21), సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ (3/18) కోలుకోలేని దెబ్బతీయడంతో... మొదట శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 112 పరుగులే చేసింది. ఆతిథ్య బౌలింగ్ ధాటికి సింహళ బ్యాటర్లలో ఏ ఒక్కరు కనీసం 30 పరుగులైనా చేయలేకపోయారు. ఇమిషా దులానీ (32 బంతుల్లో 27; 4 ఫోర్లు) టాప్స్కోరర్! అనంతరం సులువైన లక్ష్యాన్ని హర్మన్ప్రీత్ సేన 13.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (42 బంతుల్లో 79 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో గెలిపించింది. ఆమె దూకుడు వల్లే ఇంకా 6.4 ఓవర్లకు ముందే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇదే వేదికపై రేపు నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. షఫాలీ మళ్లీ ధనాధన్ ‘షో’ తొలుత లంక ఇన్నింగ్స్ రేణుక, దీప్తి చావుదెబ్బ తీశారు. దీంతో 45/4 స్కోరు వద్దే ప్రధాన బ్యాటింగ్ బలగాన్ని కోల్పోయింది. హాసిని (25), మిడిలార్డర్లో కవిషా దిల్హరి (20), కౌషిని (19) చేసిన పరుగులతో కష్టంగా జట్టు స్కోరు వంద దాటింది. తర్వాత గత మ్యాచ్ల కంటే తక్కువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ మళ్లీ ధనాధన్ షో రెచ్చిపోయింది. చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడింది. 24 బంతుల్లోనే ఫిఫ్టీని పూర్తి చేసుకుంది. దీంతో స్మృతి మంధాన (1), జెమీమా (9)లు సింగిల్ డిజిట్లకు అవుటైనా... రవ్వంత ప్రభావం లేకుండానే లక్ష్యంవైపు భారత్ నడించింది. హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 2 ఫోర్లు), షఫాలీ అబేధ్యమైన మూడో వికెట్కు 48 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: హాసిని (సి) దీప్తి శర్మ (బి) రేణుక 25; చమరి (సి) హర్మన్ప్రీత్ (బి) దీప్తిశర్మ 3; హర్షిత (సి అండ్ బి) రేణుక 2; ఇమిషా దులానీ (సి) జెమీమా (బి) రేణుక 27; నీలాక్షిక (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 4; కవీషా (సి) అమన్జోత్ (బి) దీప్తిశర్మ 20; కౌషని (నాటౌట్) 19; శేషని (బి) దీప్తిశర్మ 5; మాల్కి మదర (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 112. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–32, 4–45, 5–85, 6–90, 7–98. బౌలింగ్: రేణుక 4–1–21–4, క్రాంతి 4–0–22–0, దీప్తిశర్మ 4–0– 18–3, వైష్ణవి 3–0–14–0, అమన్జోత్ 4–0– 23–0, శ్రీచరణి 1–0–11–0. భారత ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 79; స్మృతి (ఎల్బీడబ్ల్యూ) (బి) కవిషా 1; జెమీమా (బి) కవిషా 9; హర్మన్ప్రీత్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 5; మొత్తం (13.2 ఓవర్లలో 2 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–27, 2–67. బౌలింగ్: శేహాని 2.2–0–28–0, మాల్కి మదర 2–0–11–0, నిమష మీపగె 2–0–29–0, కవిషా దిల్హరి 3–0–18–2, ఇనోక 4–0–28–0.151 అంతర్జాతీయ మహిళల టి20ల్లో దీప్తి శర్మ తీసిన వికెట్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మేగన్ షుట్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును దీప్తి సమం చేసింది. -
సిరీస్ విజయంపై గురి
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య టి20 సమరం వేదిక మారుతూ తిరువనంతపురానికి చేరింది. తొలి రెండు మ్యాచ్లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వగా... ఇప్పుడు తర్వాతి మూడు మ్యాచ్లు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరగనున్నాయి. ఇప్పటికే 2–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ మరో మ్యాచ్ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్లలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హర్మన్ప్రీత్ బృందం ఇక్కడా అదే జోరు కొనసాగించాలని భావిస్తుండగా... ఇక్కడైనా పోటీనిచ్చి సిరీస్ను కాపాడుకోవాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది. దీప్తి శర్మ పునరాగమనం... శ్రీలంకపై ఆడిన గత 11 టి20ల్లో భారత్ 9 గెలిచింది. 2024 జులై తర్వాత మన జట్టుకు ఓటమి ఎదురు కాలేదు. బలమైన బ్యాటింగ్ లైనప్తో పాటు పదునైన బౌలింగ్తో రెండు మ్యాచ్లలో విజయం మన జట్టును వరించింది. జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ తమ బ్యాటింగ్తో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, శ్రీచరణి, వైష్ణవి ఆకట్టుకోవడంతో లంక భారీ స్కోర్లు చేయడంలో విఫలమైంది. తొలి మ్యాచ్లో 121 పరుగులకే పరిమితమైన జట్టు రెండో టి20లో 128 పరుగులే చేయగలిగింది. రెండో మ్యాచ్కు అనారోగ్యం కారణంగా దీప్తి శర్మ దూరం కాగా, ఆమె స్థానంలో వచ్చిన స్నేహ్ రాణా కూడా 4 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసింది. ఇప్పుడు కోలుకున్న దీప్తి మూడో మ్యాచ్ బరిలోకి దిగనుంది. తొలి టి20లో ఫీల్డింగ్ పేలవంగా కనిపించినా... దాని నుంచి పాఠాలు నేర్చుకున్న జట్టు గత పోరులో ఆకట్టుకుంది. మూడు రనౌట్లతో ప్రత్యరి్థని పడగొట్టింది. స్మృతి, హర్మన్, రిచాలతో భారత బ్యాటింగ్ బలంగా ఉండగా.. పేస్ బౌలింగ్లో అమన్జోత్, అరుంధతి రెడ్డి మరోసారి ప్రధాన బాధ్యత తీసుకుంటారు. ఈ మ్యాచ్లో కొత్త ప్లేయర్ కమలినితో అరంగేట్రం చేయించే అవకాశాన్ని టీమ్ మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది. సమష్టి వైఫల్యం... శ్రీలంక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. బలహీన బ్యాటింగ్తో కనిపిస్తున్న జట్టును విజయం దిశగా నడిపించడం కెపె్టన్ చమరి అటపట్టుకు కష్టంగా మారింది. కనీసం 150 పరుగులు కూడా చేయకుండా తాము గెలుపు గురించి ఆలోచించలేమని ఆమె వ్యాఖ్యానించింది. జట్టు లైనప్లో చెప్పుకోదగ్గ ప్లేయర్లు ఎవరూ లేరు. అటపట్టు రెండో టి20లో ఆకట్టుకోగా, ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ముఖ్యంగా లంక ఎన్నో ఆశలు పెట్టుకొని వరుసగా అవకాశాలు ఇస్తున్న టాపార్డర్ బ్యాటర్ హాసిని పెరీరా తన సత్తాను నిరూపించుకోవడంలో విఫలమైంది. 86 అంతర్జాతీయ టి20లు ఆడినా ఆమె కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా సాధించలేకపోయింది. అయితే మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో శ్రీలంక గత మ్యాచ్లో ఆడిన తుది జట్టునే ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించే అవకాశం ఉంది. విష్మి గుణరత్నే, హర్షిత, కవీషా బ్యాటింగ్లో రాణిస్తేనే జట్టుకు అవకాశాలు ఉంటాయి. పిచ్, వాతావరణం ఇప్పటి వరకు ఈ మైదానంలో నాలుగు పురుషుల టి20 మ్యాచ్లు జరగ్గా, ఒక్క మహిళల మ్యాచ్ కూడా జరగలేదు. అయితే 2023లో జరిగిన చివరి మ్యాచ్ను బట్టి చూస్తే బ్యాటింగ్కు అనుకూల పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. వర్షసూచన లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, రిచా, దీప్తి, అమన్జోత్, అరుంధతి, క్రాంతి, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి అటపట్టు (కెప్టెన్), విష్మి, హాసిని, హర్షిత, నీలాక్షిక, కౌశిని, కవీషా, మల్కి, ఇనోక, కావ్య, శషిణి. -
#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)
-
శ్రీలంకకు రూ. 4 వేల కోట్ల ఆర్థిక సాయం
కొలంబో: దిత్వా తుపానుతో కలావికలమైన శ్రీలంకను పునరావాసం, పునరుజ్జీవన కార్యక్రమాల కోసం రూ.4,000 కోట్ల ఆర్థికసాయంతో ఆదుకునేందుకు భారత్ ముందుకొచి్చంది. పొరుగున ఉన్న మిత్రదేశం శ్రీలంకకు భారత్సదా అండగా నిలబడుతుందని ఈ 45 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించిన సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ తరఫున ప్రత్యేక రాయబారిగా శ్రీలంకకు విచ్చేసిన మంత్రి జైశంకర్ మంగళవారం శ్రీలంక అధ్యక్షుడు అరుణకుమార దిస్సనాయకె, ఆ దేశ మహిళా ప్రధానమంత్రి హరిణి అమరసూర్యలతో విడివిడిగా భేటీ అయ్యారు.‘‘శ్రీలంక పునర్నిర్మాణానికి 45 కోట్ల డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు భారత్ ముందుకొచ్చింది. దిత్వా తుపాను నుంచి తేరుకుని పునర్నిర్మాణం దిశగా అడుగులేస్తున్న శ్రీలంకకు ఆపన్న హస్తంఅందించేందుకు మేమున్నామని భారత్ తరఫున ప్రధాని మో దీ రాసిన లేఖను అధ్యక్షుడు అరుణ కుమార దిస్స నాయకేకు అందించా’’అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజిథ హెరాత్తో కలిసి సంయుక్త మీడియా స మావేశంలో జైశంకర్ చెప్పారు. 45 కోట్ల డాలర్లలో 35 కోట్ల డాలర్లను రుణాలరూపంలో, 10 కోట్ల డా లర్లను గ్రాంట్ల రూపంలో భారత్ అందివ్వనుంది. పునర్నిర్మాణం కోసం నిధుల వినియోగం తుపాను కారణంగా దారుణంగా దెబ్బతిన్న మౌలికవసతుల పునరుద్ధరణకు ప్రధానంగా నిధులను ఖర్చుచేయనున్నారు. నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్ల పునర్నిర్మాణం, రైల్వే ట్రాక్లు, వంతెనల మరమ్మతులు, కుప్పకూలిన ఇళ్లను నిర్మించడం, ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు తోడ్పాటునందించడం, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలకు తగు ఆర్థికసాయం అందించడం వంటి కీలక పనులను నిధులను సది్వనియోగం చేయనున్నారు. ‘‘నిధుల సత్వర విడుదలతోపాటు ఆయా పనుల కోసం సమన్వయంతో పనిచేసేలా ‘ప్రభావవంత సహకార వ్యవస్థ’ఏర్పాటుకు కృషిచేస్తున్నాం’’అని జైశంకర్ చెప్పారు.అంతకుముందు స్టీల్ ప్యానెళ్లతో నిర్మించిన 120 అడుగుల పొడవైన బేలీ రకం వంతెనను తుపాను ప్రభావిత ఉత్తర ప్రావిన్స్లోని కొలినోచ్ఛి జిల్లాలో జైశంకర్ ప్రారంభించారు. 110 టన్నుల బరువైన ఈ వంతెనను విడిభాగాలుగా భారత్ నుంచి విమానంలో తీసుకొచ్చి శ్రీలంకలో బిగించారు. ఆపరేషన్ సాగర్ బంధు కార్యక్రమంలో భాగంగా బేటీ వంతెనను శ్రీలంకకు భారత్ సరఫరాచేసింది. ఆపరేషన్ సాగర్ బంధు సహాయక మిషన్లో భాగంగా భారత్ ఇప్పటికే పెద్ద ఎత్తున టెంట్లు, టార్పాలిన్లు, శుభ్రతా కిట్లు, నిత్యావసర వస్తువులు, నీటి శుద్ధి యంత్రాలను అందించింది. 14.5 టన్నుల ఔషధాలు, వైద్య ఉపకరణాలనూ ద్వీపదేశానికి సరఫరాచేసింది. -
షఫాలీ 'షో'
సాక్షి, విశాఖపట్నం: ఓపెనర్ షఫాలీ వర్మ ధనాధన్ షోతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన రెండో టి20లో హర్మన్ప్రీత్ నేతృత్వంలోని భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయఢంకా మోగించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2–0తో ఆధిక్యంలో ఉంది. మొదట శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేసింది. హర్షిత సమరవిక్రమ (32 బంతుల్లో 33; 4 ఫోర్లు), కెప్టెన్ చమరి (24 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారంతే! భారత బౌలర్లలో తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/23), కొత్త స్పిన్నర్ వైష్ణవి శర్మ (2/32) లంక బ్యాటర్లను కట్టడి చేశారు. అనంతరం భారత మహిళల జట్టు 11.5 ఓవర్లలోనే మూడే వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (34 బంతుల్లో 69 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో 8.1 ఓవర్ల ముందే లక్ష్యం మంచు ముక్కలా కరిగింది. ఆరంభం నుంచే దూకుడుగా.... చిన్న లక్ష్యాన్ని దూకుడుగా ఛేదించే క్రమంలో స్మృతి మంధాన (14) అవుటైంది. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ షఫాలీకి జెమీమా (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) జతయ్యాక స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇనోక వేసిన ఐదో ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన షఫాలీ... చమరి మరుసటి ఓవర్ మూడు బంతుల్ని 4, 6, 4గా తరలించింది. పవర్ప్లేలో 68/1 స్కోరు చేసింది. తర్వాత జెమీమా కూడా తానేం తక్కువ కాదని 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో విరుచుకుపడింది. కాసేపటికి ఆమె అవుట్కాగా, 9 ఓవర్లలోనే భారత్ స్కోరు వందకు చేరింది. షఫాలీ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.గెలుపు ముంగిట కెప్టెన్ హర్మన్ప్రీత్ (10) బౌల్డ్ కాగా, రిచా ఘోష్ (1 నాటౌట్) విన్నింగ్ రన్ తీసింది. షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడో టి20 తిరువనంతపురంలో ఈ నెల 26న జరుగనుంది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: విష్మి గుణరత్నే (సి అండ్ బి) క్రాంతి 1; చమరి (సి) అమన్జోత్ (బి) స్నేహ్ రాణా 31; హాసిని పెరీరా (సి అండ్ బి) శ్రీచరణి 22; హర్షిత (రనౌట్) 33; కవీశా (సి) అమన్జోత్ (బి) శ్రీచరణి 14; నీలాక్షిక (సి) శ్రీచరణి (బి) వైష్ణవి 2; కౌశిని (రనౌట్) 11; శాషిని (సి) స్మృతి మంధాన (బి) వైష్ణవి 0; కావ్య (రనౌట్) 1; మల్కిని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి) 128. వికెట్ల పతనం: 1–2, 2–38, 3–82, 4–104, 5–109, 6–121, 7–122, 8–126, 9–128. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–21–1, అరుంధతి రెడ్డి 3–0–22–0, స్నేహ్ రాణా 4–1–11–1, అమన్జోత్ కౌర్ 2–0–11–0, వైష్ణవి శర్మ 4–0–32–2, శ్రీచరణి 4–0–23–2. భారత ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) కావ్య (బి) దిల్హారి 14; షఫాలీ వర్మ (నాటౌట్) 69; జెమీమా రోడ్రిగ్స్ (సి) దిల్హారి (బి) కావ్య 26; హర్మన్ప్రీత్ (బి) మాల్కి మదర 10; రిచా ఘోష్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 9; మొత్తం (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1–29, 2–87, 3–128. బౌలింగ్: మాల్కి మదర 2.5–0–22–1, కావ్య 3–0– 32–1, కవీశా 2–0–15–1, ఇనోక రణవీర 2–0–31–0, చమరి 1–0–17–0, శాషిని 1–0–12–0. -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించింది. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
మరో విజయం లక్ష్యంగా...
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ గెలుచు కొచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు శ్రీలంకతో మొదలైన టి20 సిరీస్లో శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే జోరుతో వరుస విజయాలతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. తద్వారా సిరీస్లో పట్టు సాధించాలని చూస్తోంది. మరోవైపు లంక అమ్మాయిలు పటిష్టమైన భారత్కు ఎలాగైనా కళ్లెం వేయాలని, ఈ మ్యాచ్లో గెలిచి 1–1తో సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. గట్టి ప్రత్యరి్థని ఓడించేందుకు పకడ్బందీ ఎత్తుగడలను అమలు చేయాలని లంక జట్టు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలోనే జరిగే ఈ రెండో టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఫీల్డింగ్తోనే సమస్య హర్మన్ప్రీత్ బృందం మొదటి మ్యాచ్లో బాగానే ఆడింది. ప్రత్యరి్థని ఓడించింది. ఐదు టి20ల సిరీస్లో శుభారంభం చేసింది. అంతమాత్రాన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యరి్థకంటే అగ్రగామిగా ఉందనుకుంటే పొరపాటు. బౌలింగ్, బ్యాటింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. తొలి మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్తో విసుగు తెప్పించింది. సులువైన క్యాచుల్ని నేలపాలు చేసింది. అంతిమంగా విజయమే ముఖ్యమైనా... ఘోరమైన ఫీల్డింగ్ను అది మూసి పెట్టలేదు. ఇదే విషయాన్ని కెపె్టన్ హర్మన్ సైతం అంగీకరించింది. తప్పకుండా ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతామని, నెట్స్లో క్యాచింగ్పైనే అతిగా ప్రాక్టీస్ చేశామని కూడా చెప్పింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన మెరుగ్గా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ విలువైన అర్ధసెంచరీతో అజేయంగా నిలిచింది. వీరితో పాటు షఫాలీ వర్మ కూడా రాణిస్తే పరుగులకు, భారీస్కోరుకు ఏమాత్రం ఇబ్బంది వుండదు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రీచరణి ఆకట్టుకున్నారు. కొత్తమ్మాయి వైష్ణవి శర్మ అరంగేట్రంలోనే అదరగొట్టింది. వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. సమం చేసే పనిలో... సొంతగడ్డపై భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ... ఆతిథ్య జట్టులోని లోపాలను సొమ్ము చేసుకొని సిరీస్ రేసులో నిలవాలని శ్రీలంక చూస్తోంది. భారత్ ఆధిక్యాన్ని ఇక్కడే సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికల వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్లో రెండు, మూడు ఓవర్లు చాలు మ్యాచ్గతినే మార్చడానికి. అందరు ఆడాల్సిన పనిలేదు. ఏ ఇద్దరు దంచేసినా చాలు ఆతిథ్య జట్టుకు గట్టి బదులు ఇవ్వొచ్చని శ్రీలంక ఆశిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్జోత్, అరుంధతి, క్రాంతి గౌడ్, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), విష్మీ గుణరత్నే, హాసిని, హర్షిత, కవీషా, ఇమేశ దులాని, నీలాక్షిక, కౌశిని, ఇనోక రణవీర, మాల్కి మదర, కావ్య, శషిని. -
వెంటాడే గీతానికి ‘వంద’నం
‘భాయో ఔర్ బెహనో!’.. ఈ గంభీరమైన స్వరం వినిపించగానే భారతీయుల ఇళ్లలో సమయం స్తంభించిపోయేది. టీవీలు లేని కాలంలో.. ఇంటర్నెట్ ఊసే లేని రోజుల్లో.. సరిహద్దులు దాటి వచ్చి మన గుండె తలుపులు తట్టిన ఆ అద్భుతమే ’రేడియో సిలోన్’. ఆసియాలోనే మొదటి కమర్షియల్ షార్ట్–వేవ్ స్టేషన్గా వెలిగిన ఈ రేడియో, ఈ వారంతో విజయవంతంగా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒక చరిత్ర.. ఒక ప్రస్థానం డిసెంబర్ 16, 1925న అధికారికంగా ప్రారంభమైన ఈ రేడియో సర్వీస్, ఆసియాలోనే అతిపెద్ద రికార్డెడ్ సాంగ్స్ లైబ్రరీని కలిగి ఉంది. భారత్లో కూడా దొరకని అరుదైన హిందీ పాటల రికార్డులు, ప్రపంచ దేశాల నేతల గొంతులు ఇక్కడ భద్రంగా ఉండటం విశేషం. 1949లో ’రేడియో సిలోన్’గా మారి, 1967లో ’శ్రీలంక బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (ఎస్ఎల్బీసీ)గా రూపాంతరం చెందినా, శ్రోతల మనసుల్లో మాత్రం అది ఎప్పటికీ ’రేడియో సిలోన్’ మాత్రమే.. అమీన్ సయానీ మ్యాజిక్.. ప్రతి బుధవారం రాత్రి 8 గంటలవుతోందంటే చాలు.. రేడియో దగ్గర జనం గుమిగూడేవారు. అమీన్ సయానీ తన అద్భుత గళంతో హిందీ సినిమా పాటల ర్యాంకింగ్స్ను ప్రకటిస్తుంటే, ఆ ఉత్కంఠే వేరు. 1952 నుండి 1988 వరకు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ’బినాకా గీత్మాల’ భారతీయులను ఉర్రూతలూగించింది. నేటికీ శ్రీలంక రేడియోలో ’కోరా కాగజ్ థా యే మన్ మేరా’ వంటి పాత బాలీవుడ్ పాటలు వినిపిస్తుంటే, అదొక మధురమైన కాలయానమే.. పీవో బాక్స్ 574.. ఉత్తరాల వెల్లువ అప్పట్లో రేడియో సిలోన్కు వచ్చే ఉత్తరాల సంఖ్య చూసి శ్రీలంక తపాలా శాఖ ఆశ్చర్యపోయేదట. ముఖ్యంగా ’ఆల్ ఆసియా ఇంగ్లిష్ సర్వీస్’ కోసం భారత్ నుండి వేల సంఖ్యలో ఉత్తరాలు వచ్చేవి. ‘అప్పట్లో ఉత్తరాల వెల్లువను తట్టుకోవడానికి ‘పీవో బాక్స్ 574, కొలంబో’ అనే ప్రత్యేక చిరునామాను సృష్టించాల్సి వచ్చింది. చిత్రమేమిటంటే, ఆ ఉత్తరాల్లో అత్యధికం సికింద్రాబాద్ నుండే వచ్చేవి. ఆ తర్వాత ముంబై, షిల్లాంగ్ నుంచి ఉండేవి’.. అని ప్రస్తుత నిర్వాహకులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ పరిణామాలకు సాక్షి ప్రస్తుతం ఎల్బీసీ సింహళ, తమిళ, ఇంగ్లిష్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సేవలు అందిస్తోంది. 70,000కు పైగా మ్యూజిక్ రికార్డులు, 78 ఆర్పీఎం నాటి పాత కాలపు రికార్డుల నుండి నేటి డిజిటల్ యుగం వరకు ఈ రేడియో అన్నీ చూసేసింది. ఎవరెస్ట్ శిఖరారోహణ వార్త దగ్గర నుండి, మనిషి చంద్రుడిపై అడుగు పెట్టిన విశేషాల వరకు ప్రపంచ పరిణామాలన్నింటికీ సాక్షిగా నిలిచింది. తరాలు మారినా.. తరగని మమకారం ప్రైవేట్ రేడియోలు, మ్యూజిక్ యాప్లు ఎన్ని వచ్చినా.. రేడియో సిలోన్ అందించిన ఆ అనుభూతి సాటిలేనిది. క్లాసికల్ నుండి పాప్ వరకు, జాజ్ నుండి కంట్రీ మ్యూజిక్ వరకు శ్రోతలకు షడ్రసోపేతమైన విందు వడ్డించిన ఈ రేడియో సర్వీస్, మరో వందేళ్ల పాటు తన ప్రయాణాన్ని దిగి్వజయంగా కొనసాగించాలని కోరుకుందాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జెమీమా జోరు...
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీ చేజిక్కించుకున్న తర్వాత తొలిసారి మైదానంలో అడుగుపెట్టిన భారత జట్టు చాంపియన్ ఆటతీరు కనబర్చింది. శ్రీలంకతో తొలి టి20లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి ని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన హర్మన్ప్రీత్ బృందం... స్వల్ప లక్ష్యాన్ని మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి సిరీస్లో బోణీ కొట్టింది. వరల్డ్కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ విజయం సాధించిన నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగు పెట్టిన భారత మహిళల జట్టు సమష్టి ఆటతీరుతో మెరిపించింది. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. విశ్మీ గుణరత్నే (43 బంతుల్లో 39; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... హాసిని పెరీరా (20; 2 ఫోర్లు), హర్షిత (21; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, నల్లపురెడ్డి శ్రీచరణి తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత జట్టు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 69 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో దుమ్మురేపగా... వైస్ కెపె్టన్ స్మృతి మంధాన (25; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (15 నాటౌట్) ఆమెకు అండగా నిలిచారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ వికెట్ పడగొట్టకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టి20 మంగళవారం ఇక్కడే జరగనుంది. శుభారంభం లభించకున్నా... స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్లో అవుట్ కాగా.. స్మృతి, జెమీమా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. చమరి ఓవర్లో స్మృతి రెండు ఫోర్లు కొట్టగా ... శషిని ఓవర్లో జెమీమా వరుసగా రెండు ఫోర్లు బాదింది. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 55/1తో లక్ష్యం దిశగా సాగింది. కాసేపటికి స్మృతి అవుటైనా... హర్మన్ప్రీత్ అండతో జెమీమా దూసుకెళ్లింది. శషిని వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో జెమీమా నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. ఈ క్రమంలో 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న ఆమె... చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. స్మృతితో రెండో వికెట్కు 54 పరుగులు జోడించిన జెమీమా... హర్మన్తో మూడో వికెట్కు అజేయంగా 55 పరుగులు జత చేసింది. బౌలర్లు అదుర్స్... శ్రీలంక ఇన్నింగ్స్లో పెద్దగా మెరుపులు కనిపించలేదు. ఆరంభం నుంచే మన బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. మూడు ఫోర్లతో మంచి టచ్లో కనిపించిన కెపె్టన్ చమరి (15) మూడో ఓవర్లోనే వెనుదిరగగా... విశ్మీ, హాసిని, హర్షిత తలా కొన్ని పరుగులు సాధించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన టీమిండియా... లంకను భారీ స్కోరు చేయకుండా అడ్డుకుంది. ఈ మ్యాచ్లో మూడు రనౌట్లు చేసిన మన అమ్మాయిలు ఫీల్డింగ్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 15వ ఓవర్ చివరి బంతికి హర్షిత కొట్టిన బంతిని అందుకునే క్రమంలో జెమీమా అమాంతం గాల్లోకి ఎగిరిన విధానం అబ్బురపరిచింది.2 మహిళల టి20 క్రికెట్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్గా స్మృతి మంధాన (154 మ్యాచ్ల్లో 4007) నిలిచింది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (177 మ్యాచ్ల్లో 4716) అగ్రస్థానంలో... హర్మన్ప్రీత్ కౌర్ (183 మ్యాచ్ల్లో 3669) మూడో స్థానంలో ఉన్నారు.89 భారత్ తరఫున మహిళల అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన 89వ ప్లేయర్గా వైష్ణవి శర్మ గుర్తింపు పొందింది. శ్రీచరణి, క్రాంతి గౌడ్ తర్వాత టి20 ఫార్మాట్లో భారత్ నుంచి ఈ ఏడాది అరంగేట్రం చేసిన మూడో ప్లేయర్గా వైష్ణవి నిలిచింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: విశ్మీ గుణరత్నే (రనౌట్) 39; చమరి ఆటపట్టు (బి) క్రాంతి 15; హాసిని (సి) క్రాంతి (బి) దీప్తి 20; హర్షిత (బి) శ్రీచరణి 21; నీలాక్షిక (రనౌట్) 8; కవిశ (రనౌట్) 6; కౌశిని (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)121. వికెట్ల పతనం: 1–18, 2–49, 3–87, 4–103, 5–108, 6–121. బౌలింగ్: క్రాంతి గౌడ్ 3–0–23–1; అరుంధతి రెడ్డి 4–0–23–0; దీప్తి శర్మ 4–1–20–1; వైష్ణవి శర్మ 4–0–16–0; శ్రీచరణి 4–0–30–1; అమన్జ్యోత్కౌర్ 1–0–8–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) నీలాక్షిక (బి) ఇనోక 25; షఫాలీ (సి) శషిని (బి) కావ్య 9; జెమీమా (నాటౌట్) 69; హర్మన్ప్రీత్ (నాటౌట్) 15; ఎక్స్ట్రాలు 4; మొత్తం (14.4 ఓవర్లలో 2 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–13, 2–67. బౌలింగ్: మల్కి మదార 2–0–19–0; కావ్య 3–0–20–1; చమరి 2–0–16–0; శషిని 2–0–32–0; ఇనోక 3.4–0–17–1; కవిశ 2–0–18–0. -
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్ చేయనున్న టీమిండియా
వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.మరోవైపు టాస్ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
టి20 సమరానికి సై
సాక్షి, విశాఖపట్నం: వన్డే వరల్డ్కప్ నెగ్గిన అనంతరం భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మైదానంలో అడుగు పెట్టనుంది. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా ఆదివారం విశాఖ వేదికగా తొలి పోరు జరగనుంది. వచ్చే ఏడాది ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా 11 టి20 మ్యాచ్లు ఆడనుంది. గతేడాది జరిగిన టి20 వరల్డ్కప్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన భారత జట్టు... ఈసారి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది. అందుకు లంకతో సిరీస్ను ప్రాక్టీస్గా వినియోగించుకోవాలని చూస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షఫాలీ వర్మతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్ కోసం యంగ్ ప్లేయర్లు కమలిని, వైష్ణవి శర్మను ఎంపిక చేశారు. 17 ఏళ్ల కమలిని ఇప్పటికే అండర్–19 ప్రపంచకప్తో పాటు మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తాచాటింది. తమిళనాడుకు చెందిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మరోవైపు వైష్ణవి అండర్–19 ప్రపంచకప్లో 17 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి వచి్చంది. రాధ యాదవ్ గైర్హాజరీలో ఈ 19 ఏళ్ల మీడియం పేసర్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మరోసారి కీలకం కానుంది. ప్రపంచకప్ నెగ్గిన అనంతరం వ్యక్తిగత జీవితంలో పలు అడ్డంకులు ఎదుర్కొన్న స్మృతి మంధాన ఎలాంటి ప్రదర్శన చేస్తుందోచూడాలి. క్రికెట్ కన్నా తనకు ఏదీ ఎక్కువ కాదని ఇప్పటికే స్పష్టం చేసిన స్మృతిపై అందరి దృష్టి నిలవనుంది. ఇక అనూహ్యంగా వన్డే ప్రపంచకప్లో చోటు దక్కించుకొని ఫైనల్లో అదరగొట్టిన షఫాలీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టు సైతం యువ ప్లేయర్లను పరీక్షించనుంది. 17 ఏళ్ల శశి్నని, 19 ఏళ్ల రషి్మక, 23 ఏళ్ల కావ్యను ఈ మ్యాచ్లో బరిలోకి దింపే అవకాశం ఉంది. -
శ్రీలంక ట్రిప్లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
-
శ్రీలంక క్రికెట్ దిగ్గజానికి భారీ షాక్!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.అంతర్జాతీయ క్రికెట్లో అర్జున రణతుంగా శ్రీలంక తరఫున సత్తా చాటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 1996లో కెప్టెన్ హోదాలో శ్రీలంకకు వన్డే వరల్డ్కప్ అందించాడు. రణతుంగ సారథ్యంలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి లంక టైటిల్ గెలవడంతో అతడి ప్రతిష్ట మరింత పెరిగింది.ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత అర్జున రణతుంగా రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక రవాణా, విమానయాన శాఖ (2018- 19), పోర్ట్స్ అండ్ షిప్పింగ్ (2015- 17)శాఖ, పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ (2017-18) మంత్రిగా పనిచేశాడు. అయితే, పెట్రోలియమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో అతడు అవినీతికి పాల్పడినట్లు సమాచారం.రూ. 23. 5 కోట్లుఈ కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కొలంబో మెజిస్ట్రేట్ అసంగ బొడరగమా ముందు సోమవారం తమ వాదనలు వినిపించింది. మొత్తంగా 27సార్లు జరిపిన కొనుగోళ్లలో 800 మిలియన్ శ్రీలంకన్ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 23. 5 కోట్లు) అవినీతి జరిగినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది.కాగా ఈ కేసులో ఇప్పటికే అర్జున రణతుంగ అన్నయ్య, సిలోన్ పెట్రోలియమ్ చైర్మన్గా ఉన్న ధమ్మిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశాడు. అయితే, కాసేపటికే అతడు బెయిల్పై విడుదలయ్యాడు.ధమ్మికకు శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉండటం గమనార్హం. కాగా అర్జున రణతుంగ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. స్వదేశానికి తిరిగి రాగానే అతడిని అరెస్టు చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అర్జున రణతుంగ మరో సోదరుడు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ప్రసన్న కూడా గత నెలలో ఫ్రాడ్ కేసులో అరెస్టయ్యాడు. చదవండి: అక్షరాలా రూ.8 వేల కోట్లు! -
శ్రీలంక ట్రిప్లో ధనశ్రీ వర్మ (ఫొటోలు)
-
వరదల కారణంగా 1,300 మందికి పైగా మృతి
టాంగ్ టోరు: ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్లలో భారీ వర్షాలతో గత వారం సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 1,300 దాటింది. 800 మందికి పైగా గల్లంతయ్యారు. ఇండోనేషియాలో 712 మంది, శ్రీలంకలో 410 మంది, థాయ్లాండ్లో 181 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇండోనేషియాలో.. ఇండోనేషియాలోని సుమత్రా దీవులు తీవ్రంగా నష్టపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. 507 మంది గల్లంతైనట్లు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తప్పిపోయారు. ఉత్తర సుమత్రాలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల లక్షలాది క్యూబిక్ మీటర్ల కలప కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. చెట్లను అక్రమంగా నరికివేయడం విపత్తుకు కారణమై ఉంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదని, మానవ నిర్మిత సంక్షోభమని ఇండోనేషియా పర్యావరణ ఫోరం ఆరోపించింది. తక్షణ పునరుద్ధరణ, కట్టుదిట్టమైన రక్షణ లేకపోతే వరదలు సాధారణమవుతాయని హెచ్చరించింది. ప్రాణ నష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేం: శ్రీలంక అధ్యక్షుడు ఇది దేశాన్ని ముంచెత్తిన అత్యంత దారుణమైన విపత్తని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే అన్నారు. ప్రాణనష్టాన్ని ఇప్పుడే నిర్ణయించలేమన్నారు. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. వరదల్లో, కొండ చరియలు విరిగి పడటంతో చిక్కుకుపోయినవారిని చేరుకోవడానికి ప్రభుత్వ సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కొందరు మొత్తం కుటుంబాన్నే కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. థాయ్లాండ్లో పబ్లిక్ కిచెన్లు.. థాయ్లాండ్లో భారీ వరదలు 15 లక్షలకు పైగా ఇళ్లను మంచెత్తాయి. 39 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వారికి మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బాధితులకు ఆహారాన్ని అందించడానికి పబ్లిక్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని థాయ్లాండ్ ప్రభుత్వం తెలిపింది. మొదటి దశలో రూ.74 లక్షల నష్టపరిహారం 26,000 మందికి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సిరిపోంగ్ అంగ్కసకులి్కయాట్ తెలిపారు. -
ఇండియా సాయం కోరిన పాక్.. భారత్ గ్రీన్సిగ్నల్
ఢిల్లీ: శ్రీలంకకు సాయం చేసే విషయంలో దాయాది దేశం పాకిస్తాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని భారత్ ఖండించింది. దిత్వా తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీలంకకు సాయం చేసేందుకు గగనతల అనుమతి కోరినప్పటికీ.. భారత్ అనుమతించలేదని పాక్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది. అయితే, ఇది అసత్య ప్రచారమని భారత్ క్లారిటీ ఇచ్చింది.వివరాల ప్రకారం.. దిత్వా తుపాను నేపథ్యంలో శ్రీలంకకు సాయం చేయడానికి పాక్.. భారత గగనతలం నుంచి ప్రయాణించేందుకు సాయం కోరింది. సోమవారం భారత్ను సంప్రదించింది. అనంతరం, తమకు భారత్ అనుమతి ఇవ్వలేదని పాక్ మీడియా తప్పుడు ప్రచారం అందుకుంది. ఈ నేపథ్యంలో పాక్ మీడియా ప్రచారాన్ని భారత్ ఖండించింది. ఈ సందర్బంగా భారత్.. మన గగనతలంలో ప్రయాణించేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పాక్ సంప్రదించిందని, సాయంత్రం 5.30 గంటలకు భారత్ అనుమతి ఇచ్చిందని, అధికారిక ఛానల్ ద్వారా ఈ సమాచారం చేరవేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మానవతా దృక్పథంతోనే అనుమతులు ఇచ్చినట్లు భారత్ స్పష్టం చేసింది. ఇది అసత్య ప్రచారమని భారత అధికారులు పేర్కొన్నారు. ఇది తప్పుదారి పట్టించే వార్తలు అని తెలిపారు.ఇదే సమయంలో గగనతల సంబంధిత నిర్ణయాలకు సంబంధించి భారత్ ప్రామాణిక కార్యచరణ, సాంకేతిక, భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకుంటుందని, రాజకీయ కోణంలో అనుమతుల నిరాకరణ ఉండదని అధికారులు పేర్కొన్నారు. పాక్ విమానాలు భారత గగనతలం మీదుగా ప్రయాణించేందుకు వీలు లేనప్పటికీ పూర్తి మానవతా కోణంలో ఆలోచించి అనుమతులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుఅని, బాధ్యత రాహిత్యమైనవని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా.. దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలమైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందల సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయి. అలాగే, వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు. ఇటీవలి కాలంలో శ్రీలంకలో ఇంతటి పెను ముప్పు రాలేదని అధికారులు చెబుతున్నారు. దిత్వా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లినట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కొనసాగుతున్న వరద సహాయక చర్యలు..
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 708 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్రబోవోసుబియాంతో తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 504 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్ సుమత్ర, వెస్ట్ సుమత్ర, ఆసెహ్ ప్రావిన్స్లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు. అదేవిధంగా, థాయ్లాండ్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 181మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 410 మంది చనిపోగా 336 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు. సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే. -
దిత్వా తుపాను.. శ్రీలంక అతలాకుతలం
కొలంబో: దిత్వా తుపాను బీభత్సం ధాటికి శ్రీలంక అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా 334 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో మరో 370 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని శ్రీలంక జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం (డీఎంసీ) వెల్లడించింది. దాదాపు 11.18 లక్షల మందిపై విపత్తు ప్రభావం పడిందని తెలిపింది.దిత్వా తుపాను ప్రభావం శ్రీలంకపై కొనసాగుతోంది. తుపాను కారణంగా లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం వల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ఒక్క కాండీ జిల్లాలోనే 88 మంది మృతి చెందగా.. 150 మంది కనిపించకుండా పోయారు. బదుల్లాలో 71 మంది మృతి చెందారు. డీఎంసీ ప్రకారం ఈ తుపాను.. దేశవ్యాప్తంగా 3,09,607 కుటుంబాలను ప్రభావితం చేసింది. ఇక, ఇటీవలి కాలంలో శ్రీలంకలో అత్యంత తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలలో ఈ తుపాను నిలిచింది. వరదల కారణంగా పలు పట్టణాలు మునిగిపోయాయని, ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయని, మౌలిక సదుపాయాలకు ఆటంకం కలిగిందని అధికారులు చెబుతున్నారు.🚨🇱🇰 CYCLONE DITWAH just tore through Sri Lanka. Death toll hits 153, half a million flooded, 191 missing, entire tea estates buried, suburbs turned into death traps. 44,000 crammed in shelters, 15,000 homes gone, 1.75 million without power. The Air Force rescued 121 in 50mph… pic.twitter.com/fsLDducOss— TheCommonVoice (@MaxRumbleX) November 30, 2025మరోవైపు.. దిత్వా నేపథ్యంలో ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో శ్రీలంకలో భారత్ చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, రెండు చేతక్ హెలికాప్టర్లతో పాటు 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందిని శ్రీలంకకు పంపినట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. అంతకు ముందురోజు వాయుసేనకు చెందిన సీ-130జే, ఐఎల్ 76 విమానాలు 21 టన్నుల సహాయ సామగ్రిని శ్రీలంకకు తరలించాయి.Cyclone ‘Ditwah’ Batters Sri Lanka; Government Appeals for International Aid pic.twitter.com/oGwmHUb5gA— Indian News Network (@INNChannelNews) November 29, 2025కొలంబో విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 323 మంది భారతీయులను ఆదివారం రవాణా విమానాల్లో స్వదేశానికి తరలించారు. 247 మంది తిరువనంతపురానికి, 76 మంది దిల్లీకి చేరుకున్నారు. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల్లో 45 మందిని భారత వాయుసేన (ఐఏఎఫ్) హెలికాప్టర్లు కొలంబోకు తరలించాయి. ప్రభావిత ప్రాంతాలకు 57 మంది శ్రీలంక సైనికుల్ని కూడా ఐఏఎఫ్ తరలించింది. శ్రీలంకలో చిక్కుకున్న భారతీయులెవరైనా అత్యవసర హెల్ప్డెస్క్ను +94 773727832 నంబరులో సంప్రదించాలని అధికారులు సూచించారు. -
కుప్పకూలిన శ్రీలంక వైమానిక దళ హెలికాప్టర్
శ్రీలంక వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్(బెల్ 212) వెన్నప్పువ ప్రాంతంలో కూలిపోయింది. విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు కూడా ధ్రువీకరించారు. వెన్నప్పువ–లునువిలా ప్రాంతంలోని గిన్ నదిలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దిత్వా తుపాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఆదేశానికి భారత్ ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. -
విజేత పాకిస్తాన్
రావల్పిండి: సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు టి20 టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ఆతిథ్య పాకిస్తాన్... ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. శనివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కమిల్ మిశ్రా (47 బంతుల్లో 59; 2 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్ల ప్రతాపానికి శ్రీలంక బ్యాటర్లు నిలవలేకపోయారు. కమిల్ ఒక్కడే అర్ధశతకం సాధించగా... పాథుమ్ నిశాంక (11), కుషాల్ మెండిస్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. పవన్ రత్ననాయకే (8), కుషాల్ పెరెరా (1), కెపె్టన్ దసున్ షనక (2), జనిత్ లియాంగే (0), వణిండు హసరంగ (5) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. పాకిస్తాన్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది 3 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... మొహమ్మద్ నవాజ్ 4 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అబ్రార్ అహ్మద్కు 2 వికెట్లు దక్కాయి. బౌలింగ్లో క్రమశిక్షణ కనబర్చిన పాకిస్తాన్ బ్యాటింగ్లోనూ ఫర్వాలేదనిపించింది. లక్ష్యం పెద్దది కాకపోవడంతో నిదానంగా ఆడి విజయం సాధించింది. ఛేదనలో పాక్ 18.4 ఓవర్లలో 118 పరుగులు చేసి గెలిచింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సయీమ్ అయూబ్ (33 బంతుల్లో 36; 6 ఫోర్లు), సాహిబ్జాదా ఫర్హాన్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించారు. శ్రీలంక బౌలర్లలో పవన్ రత్ననాయకే 2 వికెట్లు పడగొట్టాడు. మొహమ్మద్ నవాజ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. -
Sri Lanka: భారీ తుఫాను విధ్వంసం 123 మంది మృతి
-
దూసుకొస్తున్న ‘దిత్వా’.. తమిళనాట కుండపోత వానలు
విశాఖ: దిత్వా తుపాన్ దూసుకొస్తుంది. దిత్వా తుపాను కారణంగా తమిళనాడులో కుండపోత వానలు కురుస్తున్నారు. నాగపట్టిణం, కరైకల్, రామనాధపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరొకవైపు ఏపీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక కుండపోత వానలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు సహా కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరికలు పంపింది. గాలుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. VIDEO | Tamil Nadu: With Cyclone Ditwah approaching he coastal areas, Nagapattinam has receiving continuous rainfall leading to waterlogging in several low lying areas. #CycloneDitwah (Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/I0rXDVXA3A— Press Trust of India (@PTI_News) November 29, 2025 VIDEO | Strong winds lashed several parts of Tamil Nadu on Friday, as Cyclone Ditwah which is likely to bring heavy rainfall in the state, intensified over the southwest Bay of Bengal and the Sri Lankan coast. With the storm moving towards Puducherry, north Tamil Nadu and south… pic.twitter.com/80dhP4BV4I— Press Trust of India (@PTI_News) November 28, 2025దిత్వా తుపాను కారణంగా శ్రీలంక అతలాకుతలం అవుతుంది. శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి.In Sri Lanka, flooding has wreaked havoc. So far, 47 people have been reported dead from the #floods and landslides and 21 are missing. Relief and rescue operations are underway...#SriLanka #SriLankafloods #SriLankarains #SrilankaWeather #srilankanews #FloodSL #floodrelief pic.twitter.com/PIlM4GOwO2— Galgotias Times (@galgotiastimes) November 28, 2025 శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో నదుల నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పెరగడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట తక్షణమే సాయం అందించింది.దీనిలో భాగంగా వరద-నిర్వాసితులకు అత్యవసర సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత వైమానిక దళానికి చెందిన సీ130 విమానం శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో అవసరమైన ఆహారం, శానిటరీ సామాగ్రిని తరలించారు. సముద్ర మార్గం ద్వారా కూడా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభమైంది. తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా ఇప్పటికే తరలించారు. -
దిత్వా తుఫాను.. శ్రీలంకలో 123 మృతి..
న్యూఢిల్లీ: దిత్వా తుఫాను శ్రీలంక అంతటా తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల వరదలు సంభవించగా, మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులో అధికారిక నివేదికల ప్రకారం 123 మంది మృతి చెందారు. రెండు లక్షల మందికి పైగా ప్రజలు ప్రకృతి విపత్తులకు ప్రభావితమయ్యారు. తుఫాను కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి.శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో నదుల నీటి మట్టాలు ఆందోళనకర స్థాయికి పెరగడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరిట తక్షణమే సాయం అందించింది. #OperationSagarBandhu unfolds. @IAF_MCC C-130 J plane carrying approx 12 tons of humanitarian aid including tents, tarpaulins, blankets, hygiene kits, and ready-to-eat food items lands in Colombo. 🇮🇳 🇱🇰 pic.twitter.com/btzlnZeO8x— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 29, 2025దీనిలో భాగంగా వరద-నిర్వాసితులకు అత్యవసర సహాయ సామగ్రిని తీసుకువెళుతున్న భారత వైమానిక దళానికి చెందిన సీ130 విమానం శనివారం తెల్లవారుజామున కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో అవసరమైన ఆహారం, శానిటరీ సామాగ్రిని తరలించారు. సముద్ర మార్గం ద్వారా కూడా ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభమైంది. తొలి విడత సహాయ సామగ్రిని భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా ఇప్పటికే తరలించారు. My heartfelt condolences to the people of Sri Lanka who have lost their loved ones due to Cyclone Ditwah. I pray for the safety, comfort and swift recovery of all affected families. In solidarity with our closest maritime neighbour, India has urgently dispatched relief…— Narendra Modi (@narendramodi) November 28, 2025ఇది కూడా చదవండి: శ్రీలంకలో తీవ్ర తుఫాను -
శ్రీలంకలో తీవ్ర తుఫాను
కొలంబో: శ్రీలంకను శుక్రవారం దిత్వాహ్ తుఫాను అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మతాలె, పొలన్నరువా, యువ ప్రావిన్స్లను కలిపే వంతెనలు కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కేబుళ్లు తెగిపోవడంతో రెండు పవర్ ప్లాంట్లను మూసివేశారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. రాజధాని కొలంబోతోపాటు అత్యధిక జనాభా కలిగిన గంపాహా జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెలనీ, అట్టనగలు నదులు పొంగిపొర్లాయి. మొత్తం 80 మంది చనిపోగా 34 మంది జాడ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సుమారు 14 వేల మందిని 195 అత్యవసర కేంద్రాలకు తరలించామన్నారు. ‘ఆపరేషన్ సాగర్ బంధు’భారత ప్రభుత్వం శ్రీలంకకు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి ద్వారా మొదటి విడత తుఫాను సాయంగా ఆహార పదార్థాలను పంపించింది. ఇలా ఉండగా, తుఫాను ప్రభావం గత పది రోజుల వ్యవధిలోనే 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గత 24 గంటల వ్యవధిలో కొండప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల వాన కురిసిందని వివరించింది. -
దిత్వా తుఫాన్ బీభత్సం.. 56 మంది మృతి
-
SL Vs ZIM: రాణించిన సికందర్ రజా.. కష్టాల్లో శ్రీలంక
పాకిస్తాన్ ట్రై సిరీస్లో ఇవాళ (నవంబర్ 20) జింబాబ్వే, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49), కెప్టెన్ సికందర్ రజా (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. మిగతా వారంతా విఫలమయ్యారు.మరుమణి 10, బ్రెండన్ టేలర్ 11, ర్యాన్ బర్ల్ 18, మున్యోంగ డకౌట్, ముసేకివా 11, బ్రాడ్ ఈవాన్స్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. మపోసా 5, క్రెమర్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార (3-0-30-0) మినహా అందూ పొదుపుగా బౌలింగ్ చేశారు. హసరంగ 3 వికెట్లతో సత్తా చాటగా.. ఎషాన్ మలింగ 2, తీక్షణ, చమీరా తలో వికెట్ తీశారు.52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన శ్రీలంకఅనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. నిస్సంక (0), కుసాల్ మెండిస్ (6), కుసాల్ పెరీరా (4), భానుక రాజపక్స (11), కమిందు మెండిస్ (9) ఔట్ కాగా.. షనక (17), హసరంగ క్రీజ్లో ఉన్నారు.కాగా, పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఈ సిరీస్లో ఇప్పటివరకు ఓ మ్యాచ్ జరిగింది. నవంబర్ 18న జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వేపై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది.బెన్నెట్ (49), మరుమణి (30), సికందర్ రజా (34 నాటౌట్) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి జింబాబ్వేను దెబ్బకొట్టారు.లక్ష్య ఛేదనలో పాక్ సైతం తడబడినప్పటికీ.. అంతింగా విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫకర్ జమాన్ (44), ఉస్మాన్ ఖాన్ (37 నాటౌట్) రాణించారు. బంతితో (4-0-22-2) సత్తా చాటిన మొహమ్మద్ నవాజ్ (21 నాటౌట్) బ్యాట్తోనూ రాణించి పాక్ను విజయతీరాలకు చేర్చాడు. -
భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)
-
శ్రీలంక చేరని హిడ్మా కథ!
సాక్షి, అమరావతి: మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కథ లంకకు చేరకుండానే అర్ధంతరంగా ముగిసింది. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలు చుట్టుముట్టి వందలాది మంది మావోయిస్టులను హతమారుస్తుండటంతో దండకారణ్యం ఇక తనకు ఏమాత్రం సురక్షిత స్థానం కాదని స్పష్టం కావడంతో.. అత్యంత విశ్వసనీయమైన అనుచరులతో కలసి హిడ్మా శ్రీలంకకు వెళ్లి కొంత కాలం తల దాచుకోవాలని భావించారు. కానీ ఓ కొరియర్ అరెస్టుతో హిడ్మా ప్రణాళిక బెడిసి కొట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మోస్టు వాంటెడ్ మావోయిస్టు మాడ్వీ హిడ్మా కోసం కేంద్ర బలగాలతోపాటు ఛత్తీస్గడ్, ఒడిశా, మహారాష్ట్ర బలగాలు రెండేళ్లుగా విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు కూడా మాటేసి ఉన్నాయి. ప్రధానంగా దశాబ్దం క్రితం మావోయిస్టు పార్టీ ‘జనతన సర్కారు’ (ప్రజా ప్రభుత్వం) పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిన ఛత్తీస్గఢ్లోని అభూజ్మఢ్ను కేంద్ర బలగాలు పూర్తిగా వాటి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ క్రమంలో గత రెండేళ్లలో దాదాపు 400 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. అయినా హిడ్మా మాత్రం పోలీసు బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు. అతని కోసం కొన్ని వందలసార్లు చేసిన గాలింపు చర్యలు ఫలించలేదు. దండకారణ్యం.. అందులోనూ ఛత్తీస్గఢ్–మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతాలు హిడ్మాకు కొట్టినపిండి. దాంతో ఆయన దొరికినట్టే దొరికి చాలాసార్లు తృటిలో తప్పించుకున్నాడు. హిడ్మానే ఏకైక లక్ష్యంగా పోలీసు బలగాలు దండకారణ్యం ప్రాంతాన్ని అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు అవకాశం ఉన్న గిరిజన గూడేల్లో పోలీసు బలగాలు ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశాయి. గిరిజనులతో హిడ్మాకు ఉన్న సంబంధాలను కట్ చేశాయి. ఈ నేపథ్యంలో హిడ్మా తల దాచుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్న రెండు మూడు ప్రాంతాలను కూడా పోలీసు బలగాలు ఇటీవల గుర్తించాయి. దాంతో ఇక దండకారణ్యం తనకు ఏమాత్రం సురక్షిత స్థానం కాదని హిడ్మా భావించాడు.కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలని ప్లాన్ దండకారణ్యం దాటి శ్రీలంక వెళ్లాలని హిడ్మా భావించాడు. ఆయనతోపాటు మిగిలి ఉన్న కొద్ది మంది అగ్ర నేతలకు శ్రీలంకే తమకు సురక్షిత ప్రదేశమని మావోయిస్టు పార్టీ కూడా భావించింది. అందుకే అగ్ర నేతలను గుట్టుచప్పుడు కాకుండా శ్రీలంక చేర్చాలని వ్యూహ రచన చేశాడు. ఈ నేపథ్యంలోనే దండకారణ్యం వీడి.. ఏపీ, ఛత్తస్గఢ్, ఒడిశా ఉమ్మడి సరిహద్దు ప్రాంతం ట్రై జంక్షన్ గుండా బయటకు రావాలని హిడ్మా నిర్ణయించాడు.తన భార్య మడకం రాజేతోపాటు అత్యంత విశ్వసనీయమైన నలుగురు అంగరక్షకులతో ఆయన దండకారణ్యం వీడి ట్రై జంక్షన్లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడ చేరాలన్నది ప్రణాళిక. కొన్ని రోజుల క్రితమే కొందరు మావోయిస్టులు కాకినాడ చేరుకున్నారు. హిడ్మా, ఆయన బృందాన్ని కాకినాడ పోర్టు నుంచి సముద్ర మార్గం గుండా శ్రీలంకకు పంపే ఏర్పాట్ల కోసమే వారు ముందుగా చేరుకున్నారు.కొరియర్ ఇచ్చిన సమాచారంతోనే..మావోయిస్టు అగ్రనేతలకు కొరియర్లుగా భావిస్తున్న కొందరు దండకారణ్యం దాటి బయటకు వచ్చినట్టు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో పక్కా వ్యూహంతో ఓ కొరియర్ను అదుపులోకి తీసుకున్నాయని తెలుస్తోంది. హిడ్మా సొంత జిల్లా ఛత్తీస్గడ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఆ కొరియర్ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మొత్తం విషయం తెలిసింది. దాంతో కేంద్ర నిఘా వర్గాలు ఏపీ, ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ట్రై జంక్షన్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందం పోలీసు బలగాలకు ఎదురుపడగా ఎదురు కాల్పులు సంభవించాయి. ఆ ఎన్కౌంటర్లో హిడ్మాతోపాటు ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఇందుకు కొంత భిన్నంగా మరో సమాచారం కూడా వినిపిస్తోంది. కొరియర్ ఇచ్చిన సమాచారంతో హిడ్మా, అతడి బృందాన్ని పోలీసులు ఏపీలో సోమవారం అదుపులోకి తీసుకున్నాయని.. అనంతరం మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో మరణించినట్టు ప్రకటించాయని చెబుతున్నారు. ఆ రెండింటిలో ఏది వాస్తవం అన్నది కచ్చితంగా నిర్ధారించలేకపోయినా.. శ్రీలంకకు వెళ్లిపోయే క్రమంలోనే హిడ్మా పోలీసుల ఎన్కౌంటర్లో మరణించినట్టు స్పష్టమవుతోంది. -
శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్ ఆయుధం
పాకిస్తాన్ వేదికగా ఇవాల్టి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కానున్న ముక్కోణపు టీ20 సిరీస్కు (Pakistan Tri Series) ముందు శ్రీలంక జట్టుకు వరుస షాక్లు తగులుతున్నాయి. తొలుత అనారోగ్యం కారణంగా కెప్టెన్ చరిత్ అసలంక, ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో ఈ టోర్నీకి దూరమయ్యారు. తాజాగా స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ గాయం (హామ్స్ట్రింగ్) కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అసలంక స్థానంలో దసున్ షనకకు కెప్టెన్గా నియమించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. హసరంగకు ప్రత్యామ్నాయంగా సరికొత్త స్పిన్ ఆయుధాన్ని (విజయకాంత్ వియాస్కాంత్) జట్టులోకి తీసుకుంది.23 ఏళ్ల వియాస్కాంత్ (Vijayakanth Viyaskanth) ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ టీ20నే ఆడినప్పటికీ.. ఐపీఎల్ సహా దేశవాలీ టోర్నీల్లో తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. కుడి చేతి వాటం లెగ్ స్పిన్ బౌలర్ అయిన వియాస్కాంత్ను స్వదేశంలో భవిష్యత్ హసరంగగా కీర్తిస్తుంటారు. పాక్ ట్రై సిరీస్లో వియాస్కాంత్ ప్రమాదకర బౌలర్గా మారే అవకాశముంది.కాగా, పాకిస్తాన్ ట్రై సిరీస్లో శ్రీలంకతో పాటు జింబాబ్వే పాల్గొంటుంది. ఇవాళ జరిగే టోర్నీ ఓపెనర్లో పాకిస్తాన్, జింబాబ్వే తలపడనున్నాయి. శ్రీలంక తమ తొలి మ్యాచ్ను నవంబర్ 20న జింబాబ్వేతో ఆడనుంది. పాక్ చేతిలో చిత్తుట్రై సిరీస్కు ముందు పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా ముగిసిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.పాక్ ట్రై సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, విజయ్కాంత్ వియాస్కాంత్, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.చదవండి: భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..! -
పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంకకు బిగ్ షాక్
పాకిస్తాన్లో రేపటి నుంచి (నవంబర్ 18) ప్రారంభం కాబోయే ముక్కోణపు సిరీస్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వే కూడా పాల్గొంటున్న ఈ టోర్నీకి ఆ జట్టు కెప్టెన్ చరిత్ అసలంక (Charith Asalanka) దూరమయ్యాడు (అనారోగ్యం కారణంగా). అసలంక తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ దసున్ శనక (Dasun Shanaka) సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్గా షనక నియామకాన్ని లంక క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది.అసలంకతో పాటు మరో లంక బౌలర్ కూడా పాక్ ట్రై సిరీస్కు దూరమయ్యాడు. ఫాస్ట్ బౌలర్ అసిత ఫెర్నాండో కూడా అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఈ ట్రై సిరీస్లో శ్రీలంక తమ తొలి మ్యాచ్ను నవంబర్ 20న ఆడనుంది. రావల్పిండి వేదికగా జరిగే ఆ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడనుంది.పాక్ ట్రై సిరీస్కు శ్రీలంక క్రికెట్ జట్టు (Up dated)..పతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక (కెప్టెన్), కమిందు మెండిస్, భానుక రాజపక్స, జనిత్ లియానాగే, వనిందు హసరంగ, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దుష్మంత చమీర, నువాన్ తుషార, ఎషాన్ మలింగ.షనక నాయకత్వ అనుభవంషనక లంక కెప్టెన్సీ బాధ్యతలు మోయడం కొత్తేమీ కాదు. 2019 సెప్టెంబర్లో తొలిసారి శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. అప్పటి నుంచి 2023 వరకు జట్టును ముందుండి నడిపించాడు. షనక నాయకత్వంలో శ్రీలంక 48 T20I మ్యాచ్లలో 22 విజయాలు సాధించి, 24 ఓటములను ఎదుర్కొంది. రెండు మ్యాచ్లు టై అయ్యాయి.పాక్ చేతిలో చిత్తుట్రై సిరీస్కు ముందు పాకిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్లో వన్డే సిరీస్లో శ్రీలంక చిత్తుగా ఓడింది. ఈ సిరీస్ను ఆతిథ్య పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.నిన్ననే ముగిసిన చివరి మ్యాచ్లో పాక్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: మహిళల ఐపీఎల్కు సంబంధించి బిగ్ అప్డేట్ -
పసికూనపై శ్రీలంక ప్రతాపం
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ (నవంబర్ 17) జరిగిన మ్యాచ్లో శ్రీలంక-ఏ, హాంగ్కాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన హాంగ్కాంగ్.. ట్రవీన్ మాథ్యూ (4-0-21-3), కెప్టెన్ దునిత్ వెల్లాలగే (3-0-24-2), విజయ్కాంత్ వియాస్కాంత్ (4-0-11-2), మిలన్ రత్నాయకే (3-0-19-1), గురక సంకేత్ (1-0-11-1), రమేశ్ మెండిస్ (4-0-18-0) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 117 పరుగులకే పరిమితమైంది.హాంగ్కాంగ్ ఇన్నింగ్స్లో శివ్ మథుర్ (26) టాప్ స్కోరర్గా నిలువగా.. అన్షుమన్ రథ్ (21), కెప్టెన్ యాసిమ్ ముర్తుజా (20), ఎహసాన్ ఖాన్ (17 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక ఆడుతూపాడుతూ ఛేదించింది. మిడిలార్డర్ బ్యాటర్ నువనిదు ఫెర్నాండో (47 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంకను గెలిపించాడు. ఓపెనర్ నిషాన్ మధుష్క (35) ఓ మోస్తరు ఇన్నింగ్స్తో రాణించాడు. మిగతా బ్యాటర్లలో విషెన్ హలంబగే 4, లసిత్ క్రూస్పుల్లే 13, సహాన్ అరఛ్చిగే 14 పరుగులు (నాటౌట్) చేశారు. హాంగ్కాంగ్ బౌలర్లలో ముర్తుజా, నస్రుల్లా, అన్షుమన్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇవాళ రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్తాన్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.చదవండి: ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్ -
బాబోయ్... మేమెళ్లిపోతాం!
కొలంబో: ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టును తాజా ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ హేయమైన ఉగ్రదాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దాడి లంక జట్టులో భయాందోళనలు పెంచింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం రావల్పిండిలో జరగాల్సి ఉంది. సింహళ క్రికెటర్లు స్వదేశానికి పయనమైతే నేటి వన్డే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయి. తొలి వన్డే నెగ్గిన పాక్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇది మగిశాక జింబాబ్వే మూడో జట్టుగా పాల్గొనే ముక్కోణపు టి20 సిరీస్లోనూ లంక తలపడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరుదాకా బిక్కుబిక్కుమంటూ పాక్లో ఉండలేమని లంక క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే లంక బోర్డు (ఎస్ఎల్సీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే తమ జట్టు పాక్ పర్యటనను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే 8 మంది క్రికెటర్లను రిజర్వ్ బెంచ్తోనైనా భర్తీ చేసేందుకు సిద్ధమని లంక బోర్డు సూచనప్రాయంగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అభయమిచ్చినట్లు తెలిసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం పాక్ పర్యటనకు వెళ్లిన లంక బృందంపై పాక్ ఉగ్రమూక దాడిచేసింది. ఈ ఘటనలో పలువురు లంక క్రికెటర్లు తూటా గాయాలకు గురయ్యారు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రికెట్ దిగ్గజం
శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ (Arjuna Ranatunga). సహచర, మాజీ క్రికెటర్లతో కలిసి రణతుంగ ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్తో కలిసి తమిళ యూనియన్ 125వ వార్షికోత్సంలో రణతుంగ భాగమయ్యాడు.ఎరుపు రంగు కుర్తాలోఈ కార్యక్రమంలో తాము దిగిన ఫొటోను సనత్ జయసూర్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ, ముత్తయ్య మురళీధరన్లను సులువుగానే గుర్తుపట్టిన అభిమానులు.. అర్జున రణతుంగను మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. మిగిలిన ముగ్గురు సూట్లో కనిపించగా.. రణతుంగ ఎరుపు రంగు కుర్తాలో దర్శనమిచ్చాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రికెట్ దిగ్గజంరణతుంగ జట్టు మొత్తం తెల్లబడింది. అంతేకాదు.. క్రికెట్ ఆడే రోజుల్లో బొద్దుగా ఉన్న అతడు ఇప్పుడు మాత్రం బక్కచిక్కిపోయి.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. రణతుంగా ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్పటికి.. ఇప్పటికి అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం అని కామెంట్లు చేస్తున్నారు.రణతుంగ కెప్టెన్సీలో కాగా కొలంబోలో 1963లో జన్మించిన రణతుంగ.. 1982లో శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో మొత్తంగా 93 టెస్టులు, 269 వన్డేలు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టెస్టుల్లో 5105, వన్డేల్లో 7456 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో నాలుగు టెస్టు, నాలుగు వన్డే సెంచరీలు ఉన్నాయి.ఇక రణతుంగ కెప్టెన్సీలో 1996లో వన్డే వరల్డ్కప్ గెలిచింది శ్రీలంక. కాగా 2001లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన రణతుంగ.. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక 2008లో శ్రీలంక క్రికెట్ బోర్డు చైర్మన్గా ఎన్నికైన రణతుంగను అధికారులు గద్దె దించారు. దీంతో కనీసం ఏడాది కాలం కూడా చైర్మన్గా పనిచేయకుండానే రణతుంగ శకం ముగిసిపోయింది. ఇక 61 ఏళ్ల రణతుంగకు భార్య రుక్మిణి, ఇద్దరు కుమారులు బినుర, మాహీ ఉన్నారు. కాగా రణతుంగకు నలుగురు తోబుట్టువులు కాగా.. వారంతా ఏదో ఒక దశలో క్రికెట్ ఆడిన వారే.చదవండి: ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్ -
తిరుమల కొండపై ఏడు అడుగుల మహిళ (ఫోటోలు)
-
శ్రీలంకలో పెద్ది పాట
ప్రేయసితో ప్రేమ పాట పాడుతున్నారు ‘పెద్ది’. రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.కాగా, ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీలంకలోప్రారంభమైంది. నేటి (శనివారం) నుంచి రామ్చరణ్, జాన్వీలపై అక్కడి లొకేషన్స్లో ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇందుకోసం శుక్ర వారం సాయంత్రం రామ్చరణ్, బుచ్చిబాబు, ఇతర యూనిట్ సభ్యులు శ్రీలంక వెళ్లారు. అక్కడి షెడ్యూల్ వారం రోజుల పాటు ఉంటుందట. ‘‘ఈ సినిమా కోసం రామ్చరణ్ సరి కొత్తగా మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్పై చూడని చరణ్ను ఈ సినిమాలో చూస్తారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. వచ్చే మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్. -
చెలరేగిన బంగ్లాదేశ్ బౌలర్లు.. కుదేలైన శ్రీలంక బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 20) శ్రీలంక, బంగ్లాదేశ్ (Sri Lanka Vs Bangladesh) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో ఆ జట్టు 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హాసిని పెరీరా (85) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆమెకు కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), నిలాక్షి డిసిల్వ (37) సహకరించారు. పై ముగ్గురు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షోర్నా అక్తర్ (10-4-27-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. రబేయా ఖాన్ 2, నహిదా అక్తర్, నిషిత అక్తర్, మరుఫా అక్తర్ తలో వికెట్ తీశారు.టాస్ గెలిచాక తాము తీసుకున్న నిర్ణయం సరైంది కాదని శ్రీలంకకు తొలి బంతికే తెలిసింది. ఓపెనర్ విష్మి గౌతమ్ను మరుఫా అక్తర్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔట్ చేసింది. అనంతరం కెప్టెన్ చమారీ ఆటపట్టు (46), హాసిని పెరీరా (85) లంక ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు 72 పరుగులు జోడించారు. ఆతర్వాత ఆటపట్టును రబేయా ఖాన్ ఔట్ చేసింది. 28 పరుగుల వ్యవధిలో శ్రీలంక మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హాసిని, నీలాక్షి లంకను ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్కు 74 పరుగులు జోడించారు. ఆతర్వాత లంక ఇన్నింగ్స్ ఒక్కసారిగా పతనమైంది. 28 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి ఐదు వికెట్లు కోల్పోయింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యం. ప్రస్తుతం ఈ జట్లు పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మూడు సెమీస్ బెర్త్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి.చదవండి: PAK Vs SA: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..!


