శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌ | INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్‌.. స్టార్‌ ప్లేయర్‌కు రెస్ట్‌

Dec 30 2025 6:46 PM | Updated on Dec 30 2025 8:02 PM

INDW VS SLW 5th T20I: Sri Lanka Won the Toss and choose to Bowl

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకొని, క్లీన్‌ స్వీప్‌ దిశగా అడుగులు వేస్తుంది.

ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన, రేణుక సింగ్‌కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్‌ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.

శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు..
శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషాని

భారత్‌: షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement