breaking news
India vs Sri lanka
-
'అతడొక అద్భుతం.. కచ్చితంగా లెజెండ్ అవుతాడు'
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సమయం దగ్గరపడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి కీలకమైన డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియాపై శ్రీలంక బౌలింగ్ దిగ్గజం చమింద వాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి భారత జట్టు పటిష్టంగా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ను సైతం వాస్ పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా ఈ సిరీస్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతోంది."రోహిత్, విరాట్ లేకపోయినా భారత జట్టు ఏ మాత్రం బలహీనపడలేదు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రూపంలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు,ఎంతోమంది యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ గురుంచి ఎంత పొగిడినా తక్కువే. అతడొక అద్భుతం. గిల్కు అత్యుత్తమ బ్యాటింగ్ స్కిల్స్తో పాటు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంతటి ఒత్తిడిలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో కచ్చితంగా ఒక లెజెండ్ అవుతాడు. గాలేలో జరగనున్న తొలి టెస్ట్లో మా జట్టుకు కచ్చితంగా అతడి నుంచి ముప్పు పొంచి ఉంది. శుబ్మన్ క్రీజులో సెటిల్ అయ్యాక అవుట్ చేయడం చాలా కష్టం. మా బౌలర్లు అతడిని ఎలా అడ్డుకుంటారో చూడాలి మరి" అని వాస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs SL: గంభీర్తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే? -
గంభీర్తో శ్రీలంక మైండ్ గేమ్స్.. ఏమి జరిగిందంటే?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యాటక జట్టు హెడ్కోచ్ గౌతమ్ గంభీర్తో మైండ్ గేమ్స్ ఆడటం ప్రారంభించింది.ఏమి జరిగిందంటే?తొలి టెస్టు కోసం శ్రీలంక జట్టు గాలేలో గత రెండు రోజులగా క్లోజ్డ్ డోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. అయితే బుధవారం లంక ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్తో కలిసి సడన్గా గాలే మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరూ నేరుగా తొలి టెస్టు కోసం తాయారు చేసిన ప్రధాన పిచ్ వద్దకు పరిశీలించారు.గంభీర్, కోటక్ అక్కడికి చేరుకోగానే గ్రౌండ్ సిబ్బంది పిచ్పై ఉన్న కవర్లను కొద్దిసేపు పక్కకు తొలగించారు. కాసేపు పిచ్ను పరిశీలించి వారిద్దరూ వెళ్లిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న నెట్స్లో శ్రీలంక ప్రాక్టీస్ చేస్తున్నారు.అయితే గంభీర్-కోటక్ ద్వయం వెళ్లిపోయిన వెంటనే గాలే స్టేడియం సిబ్బంది పిచ్లో కొన్ని మార్పులు చేశారు. కవర్లను పూర్తిగా తొలగించి, గ్రాస్ మోవర్తో పిచ్పై ఉన్న పచ్చికను కట్ చేశారు. ఆ తర్వాత సాఫ్ట్ రోలర్ను ఉపయోగించి చదును చేశారు.కాగా తుది జట్టును ఖరారు చేసేటప్పుడు పిచ్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. వికెట్ కండీషన్ బట్టి తుది జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ గంభీర్తో మైండ్ గేమ్స్ ఆడి కాస్త కన్ఫ్యూజ్ చేసింది. గంభీర్ అండ్ కో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలా? ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలా అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.చదవండి: 30 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్ -
సిరాజ్ చిలిపి పని.. భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్ ఖాన్
టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఓ చిలిపి పని చేశాడు. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్కు హెయిర్కట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భయపడుతూనే ఓకే చెప్పిన సర్ఫరాజ్వైరల్ అవుతున్న వీడియోలో సిరాజ్.. సర్ఫరాజ్ దగ్గరకు వెళ్లి హెయిర్కట్ చేస్తానంటూ ముందుకొచ్చాడు.అయితే సర్ఫరాజ్ మాత్రం సిరాజ్ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. పేసర్ హెయిర్కటింగ్ నైపుణ్యంపై అతడికి నమ్మకం లేనట్టుగా కనిపించాడు.The way Mohammed Siraj cuts Sarfaraz Khan’s hair like a big brother. 😂Also, look at Shubman Gill and Rishabh Pant’s new haircuts for the Ind vs Sl Test series! pic.twitter.com/RGjrXZodAo— Sonu (@Cricket_live247) August 11, 2026సిరాజ్ హెయిర్కట్ చేసేందుకు సిద్ధమవుతుండగా సర్ఫరాజ్ ముఖంలో కాస్త భయం కూడా కనిపించింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో సిరాజ్కు తన జుట్టును కత్తిరించేందుకు అనుమతించాడు.సిరాజ్ కూడా హెయిర్స్టైలిస్ట్ సహాయం తీసుకుంటూ సరదాగా ఈ పని పూర్తి చేశాడు. మరోవైపు సర్ఫరాజ్ మాత్రం వీలైతే అక్కడి నుంచి తప్పించుకోవాలన్నట్లుగా కనిపించాడు.చివరకు సిరాజ్ తన ‘సెషన్’ ముగించడంతో అసలు హెయిర్ స్టైలిస్ట్ రంగంలోకి దిగాడు. జుట్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి సర్ఫరాజ్కు కొత్త లుక్ తీసుకొచ్చాడు.అనుకోని అవకాశంశ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు సర్ఫరాజ్ అనూహ్యంగా టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. సాయి సుదర్శన్ కుడి కాలిలోని టో స్ట్రెస్ రియాక్షన్ కారణంగా సిరీస్కు దూరం కావడంతో అతని స్థానంలో సర్ఫరాజ్ను ఎంపిక చేశారు.సర్ఫరాజ్ ఇప్పటికే కొలంబోలో భారత జట్టుతో చేరాడు. ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.ఆరు టెస్టుల్లో 371 పరుగులుసర్ఫరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టెస్టులు ఆడాడు. 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 150 పరుగులు.సర్ఫరాజ్ గతంలో జట్టులో ఉన్నప్పటికీ అవకాశాలు దక్కని సందర్భాలు ఉన్నాయి. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.ఇప్పుడు సాయి సుదర్శన్ గైర్హాజరీతో మరో అవకాశం లభించింది. శ్రీలంకలో ఈ అవకాశాన్ని సర్ఫరాజ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.WTC రేసులో భారత్ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకతో జరిగే ఈ సిరీస్లో మెరుగైన ఫలితాలు సాధించడం భారత జట్టుకు కీలకం.తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలేలో జరగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరగనుంది.శ్రీలంక టెస్టు సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఔకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్. -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
శ్రీలంక టెస్టు సిరీస్కు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్లు శ్రీలంక టూర్ నుంచి తప్పుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి మరో కీలక ఆటగాడు చేరాడు. ఈ సిరీస్కు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్న సుందర్.. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు మొదటి టెస్టుకు కాకపోయినా కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టు సమయానికైనా జట్టుతో కలుస్తాడని సెలక్టర్లు భావించారు. కానీ ఇప్పుడు వాషీ కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సిరీస్ మొత్తానికే అతడు దూరం కానున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. వాషీ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని సీఓఈ భావిస్తున్నట్లు సమాచారం. లంక పర్యటనకు వెళ్లిన జట్టులో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా ఉన్నారు. వాషీ స్ధానంలో మానవ్ లేదా సారాంశ్లలో ఎవరికో ఒకరికి తుది జట్టులో చోటు దక్కనుంది. అదేవిధంగా బుమ్రా స్ధానంలో జమ్మూ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీ, సుదర్శన్ స్థానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్కు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. కాగా తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్, నబీ, సిరాజ్, ప్రసిద్ధ్, గుర్నూర్, పడిక్కల్, సరాంశ్ జైన్. -
గిల్ కాదు.. అతడితో జాగ్రత్త! శ్రీలంకకు దిగ్గజ క్రికెటర్ వార్నింగ్
శ్రీలంక క్రికెట్ జట్టు సొంత గడ్డపై టీమిండియాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వీజ్ మహరూఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకకు భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం పంత్ అంత మంచి ఫామ్లో లేడు. ఇటీవల జరిగిన శ్రీలంక ఎలెవన్తో జరిగిన వార్మాప్ మ్యాచ్లో కూడా రిషబ్ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికి తనదైన రోజున ఓంటి చేతితో జట్టును గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలోనే మహరూఫ్ తమ జట్టు హెచ్చరించాడు."నేను శ్రీలంక డ్రెస్సింగ్ రూమ్లో ఉండి ఉంటే, రిషబ్ పంత్ గురుంచి ఎక్కువగా ఆలోచించేవాడిని. అతడు జట్టుకు ఎక్స్-ఫాక్టర్. టెస్టు క్రికెట్లో కూడా టీ20 తరహా బ్యాటింగ్ చేస్తాడు. పంత్ క్రీజులో ఉంటే కేవలం అర గంటలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అతడికి టీమ్ మేనెజ్మెంట్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే ఈ సిరీస్లో శ్రీలంక జట్టు ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. ప్రభాత్ జయసూర్య వంటి అద్భుతమైన స్పిన్నర్లు జట్టులో ఉన్నప్పటికి పంత్ను కట్టడి చేయడం అంత తేలిక కాదు" అని మహరూఫ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.భారత్తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంకచదవండి: Hundred Women 2026: ఎలిమినేటర్ ముంగిట సన్రైజర్స్ విధ్వంసం -
భారత్తో తొలి టెస్ట్.. శ్రీలంక జట్టు ప్రకటన
భారత్తో తొలి టెస్టుకు శ్రీలంక జట్టును ప్రకటించారు. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఆగస్టు 15న గాలే వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.ధనంజయ డి సిల్వా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లకు చోటు లభించింది. వార్మప్ మ్యాచ్లో అదరగొట్టిన బ్యాటర్కు చోటుభారత్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన నిశాన్ మధుష్కకు సెలెక్టర్లు తగిన గుర్తింపు ఇచ్చారు. అతని మంచి ఫామ్ను పరిగణనలోకి తీసుకుని తొలి టెస్టు జట్టులో చోటు కల్పించారు.భారత్తో టెస్టుకు ముందు మధుష్క చూపించిన ఫామ్ శ్రీలంకకు సానుకూల అంశంగా మారింది. భారత బౌలింగ్ను ఎదుర్కొనే బ్యాటింగ్ విభాగంలో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది.బౌలింగ్ బాధ్యత ప్రభాత్ జయసూర్యదేశ్రీలంక బౌలింగ్ దళానికి ప్రభాత్ జయసూర్య నాయకత్వం వహించనున్నాడు. అతనితో పాటు రమేశ్ మెండిస్, అసిత ఫెర్నాండో, మిలన్ రత్నాయకే, విశ్వ ఫెర్నాండో వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.ఇక భారత్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆకట్టుకున్న కేశర నువంతకు కూడా తొలి టెస్టు జట్టులో చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక కూడా జట్టులో ఉన్నాడు.తొలి టెస్టుకు శ్రీలంక జట్టుధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఉదారా, నిశాన్ మధుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమాల్, పసిందు సూరియబండారా, సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేశ్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయకే, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక -
టీమిండియాపై సంచలన అస్త్రాలను ప్రయోగించనున్న శ్రీలంక
భారత్తో టెస్ట్ సిరీస్కు శ్రీలంక సిద్ధమవుతోంది. ఆగస్టు 15న గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. శ్రీలంక ఇంకా తుది జట్టును ప్రకటించలేదు. ఆటగాళ్ల గాయాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో తలపడేందుకు శ్రీలంక ఆటగాళ్లు ఇప్పటికే గాలేలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆతిథ్య జట్టు ఇద్దరు ఆసక్తికరమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.రోహిత్ శర్మను బోల్తా కొట్టించిన బౌలర్ మళ్లీ వస్తున్నాడా..?భారత్తో టెస్ట్ సిరీస్ కోసం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశముంది. రేవ్స్పోర్ట్జ్ నివేదిక ప్రకారం.. మధుశంకకు రీకాల్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.మధుశంకకు భారత్పై ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంది. 2023 వన్డే ప్రపంచకప్లో శ్రీలంక తరఫున అద్భుతంగా రాణించిన అతడు.. రోహిత్ శర్మను మ్యాచ్ రెండో బంతికే ఔట్ చేశాడు.ఆ మ్యాచ్లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించిన సమయంలో మధుశంక అతడిని పెవిలియన్కు పంపించాడు. ఇప్పుడు మరోసారి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. మధుశంక ఇప్పటివరకు శ్రీలంక తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 20 టీ20లు ఆడాడు.గిల్, పంత్ను పడగొట్టిన కొత్త అస్త్రంమధుశంకతో పాటు ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ కేశర నువంతకు తొలిసారి శ్రీలంక టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.ఇటీవల భారత్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నువంత తన సత్తా చూపించాడు. భారత కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు రిషభ్ పంత్ వికెట్లను పడగొట్టాడు.అంతేకాదు.. భారత్-ఏ, శ్రీలంక-ఏ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులో నువంత ఏకంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన నువంత 64 వికెట్లు పడగొట్టాడు. అతని స్ట్రైక్రేట్ 39గా ఉంది. దీంతో భారత బ్యాటర్లకు అతడు మరో సవాలుగా మారే అవకాశం ఉంది.ఇద్దరు కీలక బ్యాటర్లు దూరంమరోవైపు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పథుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.దీంతో బ్యాటింగ్ విభాగంలో శ్రీలంకకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లాను తిరిగి టెస్ట్ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిక్వెల్లా చివరిసారిగా 2023 మార్చిలో శ్రీలంక తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు.అదే సమయంలో అన్క్యాప్డ్ వికెట్ కీపర్ అంజలా బండారాను కూడా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. డిక్వెల్లా, బండారా ఇద్దరూ ప్రస్తుతం గాలేలో శ్రీలంక జట్టుతో కలిసి ఉన్నట్లు సమాచారం.WTC ఫైనల్కు వెళ్లాలంటే భారత్ను ఓడించాల్సిందే..!ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. రెండు సిరీస్ల తర్వాత 41.67 శాతం పాయింట్లతో భారత్కు వెనుకనే ఉంది. శ్రీలంక ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. WTC ఫైనల్కు చేరాలంటే భారత్పై సిరీస్ విజయం వారికి అత్యంత కీలకం. -
సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండి: మాజీ క్రికెటర్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు సమయం ఆసన్నమైంది. ఇరుజట్ల మధ్య శనివారం (ఆగష్టు 15) తొలి టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది.సుదీర్ఘ నిరీక్షణ తర్వాతముఖ్యంగా సాయి సుదర్శన్ స్థానంలో అనూహ్య రీతిలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఉంటుందా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాగా దేశీ క్రికెట్లో సత్తా చాటిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.అదే ఏడాది చివరగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ను.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టారు. ఈ క్రమంలో ఫిట్నెస్పై మరింతగా దృష్టి పెట్టిన ఈ ముంబైకర్.. భారీగా బరువు తగ్గాడు. దేశీ క్రికెట్లోనూ రాణించి టీమిండియా నుంచి పిలుపు కోసం ఓపికగా ఎదురుచూశాడు.తుదిజట్టులో కష్టమేసాయి సుదర్శన్ గాయపడటంతో ఎట్టకేలకు సర్ఫరాజ్ నిరీక్షణ ఫలించి.. శ్రీలంకతో తలపడే జట్టులో సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే, తుదిజట్టులో అతడికి చోటు దక్కడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగానే ఉంది. సాయి సుదర్శన్ ఆడే మూడోస్థానానికి దేవదత్ పడిక్కల్ సిద్ధంగా ఉన్నాడు. దీంతో సర్ఫరాజ్ ఆరో స్థానం కోసం చూస్తుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రూపంలో పోటీ ఉంది.సర్ఫరాజ్ వద్దు.. అతడినే ఆడించండిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కిరణ్ మోరే కీలక వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ కంటే ధ్రువ్ జురెల్కే తుదిజట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు.జురెల్ మంచి ఫీల్డర్ కూడా!.. సర్ఫరాజ్ రీప్లేస్మెంట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చాడు. కాబట్టి అవకాశాల కోసం అతడు ఎదురుచూడాల్సిందే’’ అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు. పరోక్షంగా సర్ఫరాజ్ను కాదని.. జురెల్నే ఆడించాలని సూచించాడు. కాగా జురెల్ కంటే సర్ఫరాజ్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. ఆరు మ్యాచ్లలో కలిపి సర్ఫరాజ్ 37 సగటుతో పరుగులు రాబట్టగా.. జురెల్ సగటు 34. అంతేకాదు గత ఐదు మ్యాచ్లలో జురెల్ బాగా ఇబ్బందిపడ్డాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్తో వార్మప్ మ్యాచ్లోనూ జురెల్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు.చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్కు షాకిచ్చిన బీసీసీఐ -
IND vs SL: టీమిండియా దిగ్గజ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కీలక సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరంఈ సిరీస్లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయారు.ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..అదే అత్యంత ముఖ్యం‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.మనోళ్లు తేలిపోతున్నారుఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. చదవండి: IND vs AFG: బంగ్లాదేశ్కు షాకిచ్చిన బీసీసీఐ -
అతడు లేకపోవడం టీమిండియాకు లోటు: శ్రీలంక మాజీ స్టార్
శ్రీలంక- టీమిండియా మధ్య టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15న తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక. కాగా భారత జట్టు శ్రీలంక గడ్డపై 2017 తర్వాత టెస్టు సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి.ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్రౌండర్ ఫర్వేజ్ మహరూఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ లేనిలోటు టీమిండియాకు తప్పక కనిపిస్తుందన్నాడు. IANSతో మాట్లాడుతూ..అశూ లేకపోవడం అతిపెద్ద లోటు‘‘ఈసారి టీమిండియా అశ్విన్ను బాగా మిస్సవుతుంది. శ్రీలంక గడ్డ మీద అతడు గతంలో అద్భుతంగా రాణించాడు. ఇక్కడి టర్నింగ్ పిచ్లు అతడికి స్వర్గధామం. శ్రీలంక పిచ్ పరిస్థితులకు అశూ సరైన బౌలర్’’ అని ఫర్వేజ్ మహరూఫ్ పేర్కొన్నాడు.కాగా 2015, 2017లో శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్లలో టీమిండియా గెలుపులో అశ్విన్దే కీలక పాత్ర. ఆరు మ్యాచ్లలో కలిపి అతడు 38 వికెట్లు కూల్చాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అంతేకాదు బ్యాట్తోనూ అశూ దుమ్ములేపాడు. రెండు అర్థ శతకాలతో సత్తా చాటాడు.అదరగొడుతున్న సుతార్ ఇదిలా ఉంటే.. శ్రీలంక పర్యటనకు వెళ్లిన తాజా భారత జట్టులో ప్రస్తుతం నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు యువ స్పిన్నర్ మానవ్ సుతార్, వెటరన్ ఆటగాడు సారాంశ్ జైన్ కూడా ఉన్నారు. మానవ్ ఇప్పటికే అరంగేట్రం చేయగా.. సారాంశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.నాకు అవకాశం ఉంటే గనుక..ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి కూడా ఫర్వేజ్ మహరూఫ్ స్పందించాడు. ‘‘కొన్ని నెలల క్రితం అఫ్గానిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా మానవ్ సుతార్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే రాణించాడు. ఇటీవల శ్రీలంక ఎలెవన్ జట్టుతో వార్మప్ మ్యాచ్లోనూ బంతి, బ్యాట్తో సత్తా చాటాడు.అయితే, తుదిజట్టులో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు కూడా చోటిస్తారా? అనేదే ప్రస్తుత ప్రశ్న. కుల్దీప్ యాదవ్ ఎలాగో తుదిజట్టులో ఉంటాడు. ఇక సారాంశ్ జైన్ ఇంకా అరంగేట్రం చేయలేదు. అయితే, అతడు డీసెంట్ బౌలర్. నాకే గనుక అవకాశం ఉంటే.. గాలె టెస్టుకు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్లను ఎంపిక చేస్తాను’’ అని ఫర్వేజ్ మహరూఫ్ చెప్పుకొచ్చాడు. కాగా శ్రీలంకతో సిరీస్ టీమిండియాకు అత్యంత ముఖ్యమైనది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో ఫైనల్ రేసులో ఉండాలంటే లంకను భారత్ 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.చదవండి: T20 WC 2028: పోర్చుగల్ కెప్టెన్గా SRH మాజీ ప్లేయర్ -
గౌతమ్ గంభీర్ రికార్డుపై కన్నేసిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు 8 నెలల తర్వాత తిరిగి జాతీయ జట్టు తరపున ఆడేందుకు సిద్దమయ్యాడు. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్కు ముందు జడేజాను పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. జడేజా ముందున్న రికార్డులు ఇవే👉ఈ మ్యాచ్లో జడేజా మరో రెండు వికెట్లు పడగొడితే టెస్టుల్లో 350 వికెట్లు మైలు రాయిని అందుకున్న ఐదో భారత బౌలర్గా నిలుస్తాడు.👉అదేవిధంగా మరో 4 వికెట్లు సాధిస్తే శ్రీలంకపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్దానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ పేరిట ఉంది. ఇషాంత్ శర్మ 12 టెస్టుల్లో 36 వికెట్లు తీయగా, జడేజా 7 టెస్టుల్లోనే 23.72 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (74 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (62), హర్భజన్ సింగ్ (53), కపిల్ దేవ్ (45) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. 👉అదేవిధంగా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ రికార్డుపై కూడా అతడు కన్నేశాడు. మరో 60 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గంభీర్(4,154)ను జడ్డూ అధిగమిస్తాడు. కాగా జడేజా మంచి టచ్లో ఉన్నాడు. శ్రీలంక ఎలెవన్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో జడేజా బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించాడు.చదవండి: వైభవ్ కాదు.. అతడి సెలక్షన్ ఒక అద్భుతం! -
‘సంగక్కర బూతులు తిట్టాడు’
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. 2005 నాటి ఢిల్లీ టెస్టు సందర్భంగా సంగక్కర బూతులు తిట్టాడని.. తాను కూడా అందుకు గట్టిగానే బదులిచ్చానని తెలిపాడు.కాగా 2005లో మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు భారత్కు వచ్చింది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టీమిండియా మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.సెంచరీ మిస్ఓపెనర్ గౌతం గంభీర్కు జోడీగా బౌలింగ్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ను పంపింది. అయితే, గంభీర్ మూడు పరుగులకే నిష్క్రమించగా.. ఊహించని రీతిలో ఇర్ఫాన్ పఠాన్ 93 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇర్ఫాన్ ఇన్నింగ్స్ కారణంగా భారత్ మెరుగైన స్కోరు సాధించింది. ఆ తర్వాత లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి జయభేరి మోగించింది.మురళీధరన్ బౌలింగ్లో సిక్సర్లునాటి సంగతులను ఇర్ఫాన్ పఠాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చీకీ సింగిల్స్లో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో టెస్టు మ్యాచ్. రెండో ఇన్నింగ్స్లో నేను ఓపెనర్గా వచ్చి 93 పరుగులు చేశాను. అపుడు శ్రీలంక ఆటగాళ్లు ఎందుకో అసంతృప్తిగా కనిపించారు.సంగక్కర బూతులు తిట్టాడుముఖ్యంగా సంగక్కర కోపంగా ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్లినపుడు అసలేం జరిగిందో తెలియలేదు. ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో నేను రెండు సిక్సర్లు బాదాను. కొత్త బంతిని ఎదుర్కొంటూ మురళీధరన్ బౌలింగ్లో షాట్లు కొట్టగానే వారి ముఖాలు మారిపోయాయి.దీనర్థం మేము వారి ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాము. ఆ వెంటనే సంగక్కర.. ‘మీరు మోసగాళ్లు. మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పారు?’ అంటూ బూతులు అందుకున్నాడు. వ్యక్తిగతంగానూ నన్ను మాటలు అన్నాడు. నేనూ ఊరుకోకుండా.. తిరిగి అతడిని తిట్టాడు. ఏదేమైనా ముందైతే అతడు మొదలుపెట్టాడు.మంచి స్నేహితులమయ్యాముఆ తర్వాత మేము ఐపీఎల్లో పంజాబ్కు కలిసి ఆడాల్సి వచ్చింది. ఇద్దరి కుటుంబాలు కలిసి కూర్చుని తినాల్సిన పరిస్థితి. అప్పుడు నేను సంగక్కర దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. అతడు కూడా క్షమాపణ కోరాడు.అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. మ్యాచ్ సమయంలో మా భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆరోజు అలా తిట్టుకున్నాము. మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అయితే, పరిణతితో వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేదే ముఖ్యం’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. కాగా ఆనాటి మూడో టెస్టులోనూ శ్రీలంకపై గెలిచి టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా -
జట్టుకు దూరమైన సర్ఫరాజ్ ఖాన్
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మేజర్ టోర్నమెంట్కు దూరమయ్యాడు. దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు అతడు అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా నుంచి అకస్మాత్తుగా పిలుపు రావడంతో.. సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ జట్టును వీడాడు.కాగా దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్కు ఉన్న రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫస్ట్క్లాస్క్రికెట్లో ఇప్పటికే ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఈ ముంబైకర్.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగపెట్టాడు.2024లో చివరిగా టీమిండియా తరఫునఇప్పటి వరకు టీమిండియా తరఫున ఆరు టెస్టు మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 371 పరుగులు సాధించాడు. అయితే, అదే ఏడాది చివరగా న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్కు తర్వాత అవకాశాలు కనుమరుగయ్యాయి. దీంతో ఫిట్నెస్పై దృష్టి సారించిన సర్పరాజ్ ఖాన్.. భారీగా బరువు తగ్గి స్లిమ్గా తయారయ్యాడు.సాయి సుదర్శన్ స్థానంలోదేశీ క్రికెట్లోనూ మరోసారి సత్తా చాటాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్కు పిలుపు రాలేదు. అయితే, శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపికైన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోకపోవడం అతడి పాలిట వరంగా మారింది. దీంతో తాజాగా సాయి స్థానాన్ని సర్ఫరాజ్తో భర్తీ చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియాతో చేరేందుకు సర్ఫరాజ్ ఖాన్ శ్రీలంకకు పయనమయ్యాడు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ జట్టుకు అతడు దూరం కాగా.. సెలక్టర్లు జై గోహిల్కు పిలుపునిచ్చారు. ఈ విషయం గురించి వెస్ట్ జోన్, ముంబై చీఫ్ సెలక్టర్ రాజేశ్ పవార్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. జై గోహిల్కు అవకాశం‘‘సర్ఫరాజ్ స్థానంలో గోహిల్ను ఎంపిక చేశాము. నిజానికి అతడు స్టాండ్ బై ప్లేయర్గా ఉండేవాడు. ఇప్పుడు ప్రధాన జట్టులోకి తీసుకున్నాము. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున అతడు అద్భుత ప్రదర్శన కనబరిచాడు’’ అని రాజేశ్ పవార్ పేర్కన్నాడు.కాగా వెస్ట్ జోన్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా.. షామ్స్ ములానీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఇక ఆగష్టు 23 నుంచి సెప్టెంబరు 10 వరకు దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. మరోవైపు.. టీమిండియా- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.దులిప్ ట్రోఫీ 2026 సీజన్కు వెస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), షామ్స్ ములాని (వైస్ కెప్టెన్), హర్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), జైమీద్ పటేల్, పృథ్వీ షా, శివాలిక్ శర్మ, సిద్దార్థ్ దేశాయ్, జై గోహిల్, ముషీర్ ఖాన్, అతీత్ షేత్, ముకుశ్ చౌదరి, తనుశ్ కొటియాన్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్పాండే.చదవండి: నా కాబోయే భర్త అలా ఉండాలి: సారా టెండుల్కర్ -
కలిసి అరంగేట్రం చేశారు.. ఇప్పుడేమో కుస్తీ పడుతున్నారు..!
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ఆసక్తికర పోటీ నెలకొంది. ఒకప్పుడు ఒకే మ్యాచ్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్.. ఇప్పుడేమో ఒకే స్థానం కోసం కుస్తీ పడుతున్నారు.2024 ఫిబ్రవరి 15న రాజ్కోట్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో ఇద్దరూ ఒకేసారి భారత టెస్ట్ క్యాప్ అందుకున్నారు. సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి జట్టులోకి రాగా.. రిషభ్ పంత్కు బ్యాకప్ వికెట్ కీపర్గా జురెల్కు అవకాశం దక్కింది.అయితే అరంగేట్రం తర్వాత ఇద్దరి ప్రయాణం పూర్తిగా మారిపోయింది. సుమారు రెండేళ్ల తర్వాత సర్ఫరాజ్ ఆరు టెస్టులకే పరిమితం కాగా.. జురెల్ 10 టెస్టులు ఆడి భారత జట్టు మేనేజ్మెంట్ నమ్మకాన్ని సంపాదించాడు.అయితే తాజాగా సమీకరణలు మారిపోయాయి. లంక టూర్కు తొలుత ఎంపికైన సాయి సుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్ ఖాన్కు అనూహ్యంగా జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇదివరకే జట్టులో ఉన్న జురెల్ వార్మప్ మ్యాచ్లో విఫలం కావడంతో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వార్మప్ మ్యాచ్లో వన్ డౌన్లో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీతో తుది జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకోగా.. సర్ఫరాజ్ రాకతో జురెల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.స్పెషలిస్ట్ వికెట్కీపర్గా రిషబ్ పంత్ జట్టులో ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జురెల్కు అవకాశం ఇస్తుందో లేక స్పెషలిస్ట్ బ్యాటర్ అన్న కోణంలో సర్ఫరాజ్కు రీఎంట్రీ అవకాశం ఇస్తుందో చూడాలి. మొత్తానికి కలిసి అరంగేట్రం చేసిన ఇద్దరు ప్లేయర్ల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొంది.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్/సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
చరిత్ర సృష్టించనున్న టీమిండియా
భారత క్రికెట్ చరిత్రలో మరో అరుదైన అధ్యాయం ఆవిష్కృతం కానుంది. 2026 ఆగస్టు 15న, దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ టీమిండియా చారిత్రక 600వ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. శ్రీలంకతో గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్తో భారత టెస్ట్ క్రికెట్లో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ ఈ చారిత్రక టెస్ట్ బరిలో దిగనుంది.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తర్వాత భారత్600 టెస్టులు ఆడిన జట్ల జాబితాలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ప్రత్యేక జాబితాలో చేరనుంది. అలాగే 600 టెస్టుల మైలురాయిని తాకిన తొలి ఆసియా దేశంగానూ భారత్ చరిత్ర సృష్టించనుంది.టెస్ట్ క్రికెట్లో భారత ప్రస్థానం 1932లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 94 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత క్రికెట్ ఎన్నో మలుపులు, మరపురాని విజయాలు, దిగ్గజ ఆటగాళ్లను చూసింది.1932లో మొదలైన ప్రయాణంభారత్ తొలి టెస్ట్ మ్యాచ్ను 1932 జూన్ 25న ఇంగ్లండ్తో లార్డ్స్లో ఆడింది. సీకే నాయుడు నాయకత్వంలో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు 600వ మ్యాచ్కు చేరుకుంది.భారత్ టెస్ట్ ప్రస్థానంలోని ముఖ్యమైన మైలురాళ్లు ఇవే:1వ టెస్ట్: 1932, ఇంగ్లండ్తో లార్డ్స్లో కెప్టెన్: సీకే నాయుడు100వ టెస్ట్: 1967, ఆస్ట్రేలియాతో కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ200వ టెస్ట్: 1982, పాకిస్థాన్తో కెప్టెన్: సునీల్ గవాస్కర్500వ టెస్ట్: 2016, న్యూజిలాండ్తో కెప్టెన్: విరాట్ కోహ్లీ600వ టెస్ట్: 2026, శ్రీలంకతో కెప్టెన్: శుభ్మన్ గిల్స్వాతంత్ర్య దినోత్సవం రోజున చారిత్రక ఘట్టంఆగస్టు 15.. భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. అదే రోజున టీమిండియా తన 600వ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఈ ఘట్టానికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తోంది.1932లో సీకే నాయుడు నాయకత్వంలో మొదలైన భారత టెస్ట్ ప్రయాణం.. పటౌడీ, గవాస్కర్, కపిల్ దేవ్, అజారుద్దీన్, సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ తరాలను దాటి ఇప్పుడు గిల్ తరం వరకు వచ్చింది.ఇదిలా ఉంటే, టీమిండియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ ఆగస్ట్ 15న ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ కొలొంబో వేదికగా ఆగస్ట్ 23న మొదలవుతుంది. -
స్పిన్నర్లతో తలనొప్పి.. కుల్దీప్ యాదవ్కు నో ఛాన్స్?!
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ను భారత జట్టు సద్వినియోగం చేసుకుంది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.ఈ నేపథ్యంలో గాలె వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది. ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా శ్రీలంకలోనూ టర్నింగ్ పిచ్లు ఉంటాయి.అదరగొట్టిన జడ్డూ, మానవ్ఇక వార్మప్ మ్యాచ్లో స్పిన్ విభాగంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అద్భుతంగా రాణించారు. లంక తొలి ఇన్నింగ్స్లో చెరో రెండు వికెట్లు తీసిన వీరిద్దరు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ రాణించారు. తొలి ఇన్నింగ్స్లో జడ్డూ 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. మానవ్ 41 పరుగులు సాధించాడు.తేలిపోయిన సారాంశ్ఇక లంక రెండో ఇన్నింగ్స్లో జడ్డూ రెండు వికెట్లు తీయగా.. మానవ్ పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీయలేకపోయాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జడ్డూ 22 పరుగులు, మానవ్ 4 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. అయితే, ఈ మ్యాచ్లో మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్ వికెట్లు తీయలేకపోయాడు. పెద్దగా పరుగులు కూడా రాబట్టలేకపోయాడు.మరోవైపు.. లంక తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీసిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బౌలింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తుదిజట్టులో ఈ నలుగురిలో ఎవరికి అవకాశం వస్తుందన్న అంశంపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులె స్పందించాడు.కుల్దీప్నకు నో ఛాన్స్?!‘‘గాలెకు చేరుకుని పిచ్ను పరిశీలించిన తర్వాతే తుదిజట్టుపై నిర్ణయం జరుగుతుంది. అయితే, మా జట్టులోని నలుగురు స్పిన్నర్లు ఎవరికి వారే ప్రత్యేకం. జడ్డూ అనుభవజ్ఞుడు. మానవ్ సుతార్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు.ఇక సారాంశ్ జైన్ దేశీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జట్టుకు ఎల్లప్పుడూ మణికట్టు స్పిన్నర్ అవసరం ఉంటుంది. మా నలుగురు స్పిన్నర్లు వైవిధ్యమైన బౌలర్లు. అయితే, పరిస్థితులకు తగ్గట్లే గాలెలో నిర్ణయం తీసుకుంటాం’’ అని సాయిరాజ్ బహుతులె తెలిపాడు.అందుకే బౌలింగ్ చేయలేదుఅదే విధంగా.. వార్మప్ మ్యాచ్లో లంక రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయకపోవడంపై సాయిరాజ్ వివరణ ఇచ్చాడు. ‘‘అతడు మెరుగ్గా ఆడాడు. వికెట్లు తీశాడు. అయితే, తనే విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. మిగిలిన వారికి కూడా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించాడు. కుల్దీప్ దాదాపు 20 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు’’ అని సాయిరాజ్ తెలిపాడు. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు మొదలుకానుండగా.. ఇందుకు గాలె వేదిక.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ కాదు.. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే! -
భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ ఫిట్నెస్పై జట్టు మేనేజ్మెంట్ కీలక అప్డేట్ ఇచ్చింది. తొలి టెస్టుకు ముందు లంకతో ఆడిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో బరిలోకి దిగిన గిల్ చేతి వేలికి చిన్న గాయమైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న గిల్.. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చి 44 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే బ్యాటింగ్ చేసే సమయంలో గిల్ చేతి వేలి గాయంతో ఏమైనా బాధపడ్డాడా లేక బాగానే ఉన్నాడా అన్నదానిపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే స్పందించాడు. 'నెట్ ప్రాక్టీస్ సందర్భంగా స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ చేతి వేలికి చిన్న గాయమైంది. అయితే అతడికి అయిన గాయం మైనర్దే అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగానే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆటకు దూరంగానే ఉన్నాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన గిల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించాడు. దీంతో అతడి చేతివేలి గాయం పూర్తిగా తగ్గిపోయినట్లే. తన బ్యాటింగ్తో తొలి టెస్టుకు దూరమవుతాడన్న సందేహాలను కూడా గిల్ పటాపంచలు చేశాడు. ఇది చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే టీమిండియాకు ఎంపికైన 13 మంది ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల బారిన పడి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో పునరావాస కేంద్రంలో గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరే ఆటగాడు గాయపడ్డా టీమిండియాకు ఎదురుదెబ్బ అవుతుందని భయపడుతున్నాం. అందుకే గిల్కు చిన్న గాయమే అయినప్పటికీ, పూర్తిగా కోలుకోవాలనే వార్మప్ మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆడించలేదు. చేతి వేలి గాయం మానడంతో చివరి రోజు బ్యాటింగ్కు దిగిన గిల్ మంచి ఈజ్తో బ్యాటింగ్ చేసి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు పరోక్షంగా సంకేతాలిచ్చాడు.' అని చెప్పుకొచ్చాడు. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన గిల్ 55 బంతుల్లో 44 పరుగులు చేశాడు. 21వ ఓవర్లో కేషారా నువంతా బౌలింగ్లో గిల్ వెనుదిరిగాడు. ఇక గిల్ గాయం మొదట మేనేజ్మెంట్ను భయపెట్టినప్పటికీ, అతడు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక 2025 నుంచి గిల్ టెస్టుల్లో నాలుగో స్థానంలో వస్తున్నాడు. అంతకముందు 2020 నుంచి 2023 వరకు గిల్ టెస్టుల్లో ఓపెనర్గా ఆడాడు. అయితే జైస్వాల్కు జతగా కేఎల్ రాహుల్ ఓపెనర్గా అదరగొట్టడంతో వీరి జోడినే శ్రీలంక టెస్టు సిరీస్లోనూ కంటిన్యూ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ లెక్కన గిల్ మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు రానున్నాడు. ఇక టెస్టుల్లో గిల్కు నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ల్లో 88.75 సగటుతో గిల్ ఆరు సెంచరీలు సాధించడం విశేషం. లంకతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది.Read: ఐదేళ్ల వయసులోనే MMA చాంపియన్.. ఎవరీ బుడ్డోడు! -
సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్.. బీసీసీఐ అధికారిక ప్రకటన
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సాయి సుదర్శన్ స్థానంలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సాయి కుడి కాలివేలికి గాయం కావడంతో శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చికిత్స తీసుకుంటున్న సాయి.. జట్టుతో చేరేందుకు అవసరమైన ఫిట్నెస్ క్లియరెన్స్ పొందలేకపోయాడు. సాయి గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, బీసీసీఐ మెడికల్ టీమ్ అతడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని బోర్డు వెల్లడించింది.శ్రీలంకకు వెళ్లనున్న సర్ఫరాజ్సర్ఫరాజ్ ఖాన్ కొలంబోలో భారత జట్టుతో కలవనున్నాడు. అక్కడి నుంచి టీమిండియా గాలేకు వెళ్లనుంది. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.సాయి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్మప్ మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ సెంచరీ చేయడంతో నంబర్ 3 స్థానం అతడికి దాదాపుగా ఖరారైపోయింది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు అప్డేటెడ్ టీమిండియా ఇదే..శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంశ్ జైన్, ఆకిబ్ నబీ, సర్ఫరాజ్ ఖాన్ఊహించని అవకాశందేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధించిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్తో రాజ్కోట్ టెస్టులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి సిరీస్లోనే అతడు ఆకట్టుకున్నాడు. మూడు అర్ధ సెంచరీల సాయంతో 200 పరుగులు చేశాడు.అదే ఏడాది బెంగళూరులో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. అయితే ఆ తర్వాతి మ్యాచ్ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో భారత టెస్టు జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. ఆ తర్వాత సర్ఫరాజ్ భారత టెస్టు జట్టు నుంచి దాదాపుగా కనుమరుగయ్యాడు.ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి టెస్టు బ్యాటింగ్ సగటు 37.1గా ఉంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే..!
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబోలో జరుగనుంది.దీనికి ముందు శ్రీలంక ఎలెవెన్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మాంచి జోరు ప్రదర్శించింది. ఈ మ్యాచ్తో భారత్కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. సాయి సుదర్శన్ గైర్హాజరీలో దేవదత్ పడిక్కల్ రూపంలో వన్ డౌన్లో మంచి ఆప్షన్ లభించింది. రెగ్యులర్ బ్యాటర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా బ్యాట్తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్పిన్నర్లు పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకొని తొలి టెస్ట్లో టీమిండియా ఎలా ఉండబోతుందో ఓ అంచనా వేద్దాం.ఓపెనర్లు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్తొలి టెస్ట్లో వీరిద్దరూ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరూ వార్మప్ మ్యాచ్లో పరుగులు సాధించడం సానుకూల అంశం. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. రాహుల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్ను నిర్మించగలడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కోవడంలో ఈ జోడీ కీలకంగా మారనుంది.నంబర్ 3లో దేవదత్ పడిక్కల్సాయి సుదర్శన్ అందుబాటులో లేకపోవడంతో నంబర్ 3 స్థానంలో దేవదత్ పడిక్కల్కు అవకాశం దక్కడం ఖాయమైపోయింది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో పడిక్కల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు.నాలుగో స్థానంలో గిల్నంబర్ 4లో కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆడనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో గాయం కారణంగా బ్యాటింగ్కు రాని గిల్.. రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగి మంచి టచ్లో కనిపించాడు.నంబర్ 5లో రిషభ్ పంత్కు చోటు దక్కే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో అతడు విఫలమైనప్పటికీ.. టెస్టుల్లో భారత్కు ఉన్న అత్యుత్తమ వికెట్ కీపర్-బ్యాటర్లలో పంత్ ఒకడు. అందువల్ల అతడికి తుది జట్టులో చోటు దక్కడం దాదాపు ఖాయమే.నంబర్ 6లో ధ్రువ్ జురెల్కు అవకాశం లభించవచ్చు. వార్మప్ మ్యాచ్లో అతడూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ టెస్టుల్లో బ్యాటింగ్ లైనప్ను మరింత లోతుగా ఉంచాలన్న భారత వ్యూహంలో భాగంగా జురెల్ను ఆడించే అవకాశం ఉంది.ఆల్రౌండర్లుగా జడేజా, సుతార్ఆల్రౌండర్ స్థానాల్లో రవీంద్ర జడేజాతో పాటు మానవ్ సుతార్కు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జడేజా టెస్టు క్రికెట్లో భారత్కు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్లో 38కు పైగా సగటుతో అతడు మిడిలార్డర్కు అదనపు బలం అందించగలడు.మరోవైపు సుతార్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో సుమారు 26 సగటు కలిగి ఉన్నాడు. నంబర్ 8 వరకు బ్యాటింగ్ను తీసుకెళ్లడంతో పాటు స్పిన్ బౌలింగ్లోనూ అతడు ఉపయోగపడనున్నాడు.స్పిన్ బాధ్యతలు కుల్దీప్వేగాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ ముగ్గురు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. జడేజా, సుతార్తో పాటు కుల్దీప్ యాదవ్ ప్రధాన స్పిన్నర్గా వ్యవహరించనున్నాడు. వార్మప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గాలేలో టర్నింగ్ పిచ్ లభిస్తే శ్రీలంక బ్యాటర్లకు అతడు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. శ్రీలంకలో ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన కుల్దీప్.. ఆ మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.పేసర్లుగా సిరాజ్, గర్నూర్ బ్రార్తొలి టెస్ట్లో భారత్ ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగాలని భావిస్తే.. సిరాజ్తో పాటు గర్నూర్ బ్రార్కు అవకాశం లభించవచ్చు. బ్రార్ వార్మప్ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు.శ్రీలంకతో తొలి టెస్ట్కు టీమిండియా (అంచనా)కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్ -
సిరాజ్ హ్యాట్రిక్ సిక్సర్స్.. టీమిండియా గెలుపు
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరిగిన మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో డకౌటైన యశస్వి జైస్వాల్ (61 రిటైర్ట్ హర్ట్) మెరుపు అర్ద సెంచరీ చేసి భారత గెలుపుకు గట్టి పునాది వేశాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగని కెప్టెన్ శుభ్మన్ గిల్ కీలక ఇన్నింగ్స్ (44) ఆడాడు. ఆఖర్లో సిరాజ్ (32 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్స్తో విరుచుకుపడి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
టీమిండియాకు గ్రేట్ న్యూస్.. టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ భారత బ్యాటింగ్ విభాగానికి బాగా ఉపయోగపడింది. ప్రతి బ్యాటర్ ఏదో ఒక ఇన్నింగ్స్లో మంచి ప్రాక్టీస్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్), రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్), కేఎల్ రాహుల్ (40).. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (61 రిటైర్డ్ హర్ట్), శుభ్మన్ గిల్ (44) పరుగులు రాబట్టారు. ఆగస్ట్ 15 నుంచి శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్ట్కు ముందు ఇది శుభపరిణామం. ఇదే జోరును బ్యాటర్లు తొలి టెస్ట్లోనూ కొనసాగిస్తే టీమిండియా గెలుపు తథ్యం.టచ్లోకి వచ్చిన జైస్వాల్, గిల్తొలి ఇన్నింగ్స్లో డకౌటై నిరాశపర్చిన యశస్వి జైస్వాల్, రెండో ఇన్నింగ్స్లో పుంజుకొని మెరుపు అర్ద సెంచరీతో చెలరేగాడు. గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దూరంగా ఉన్న కెప్టెన్ శుభ్మన్ గిల్.. రెండో ఇన్నింగ్స్లో గాయాన్ని అధిగమించడంతో పాటు ఫామ్ను కూడా చాటుకున్నాడు. జైస్వాల్, గిల్ టచ్లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. వీరికి పడిక్కల్, రాహుల్ కూడా తోడైతే తొలి టెస్ట్లో టీమిండియా గెలుపును లంక బౌలర్లు అడ్డుకోలేరు.విజయం దిశగా భారత్207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ గెలుపు దిశగా సాగుతోంది. ఆట చివరి రోజు కావడం, అందులోనూ సమయం కూడా కొద్దిగానే ఉండటంతో భారత బ్యాటర్లు వేగంగా ఆడుతున్నారు. ముఖ్యంగా జైస్వాల్ పరిమిత ఓవర్ల తరహాలో బ్యాటింగ్ చేసి భారత గెలుపుకు పునాది వేశాడు. 30 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 152-2గా ఉంది. పంత్ (28), జడేజా (0) క్రీజ్లో ఉన్నారు. మరో 55 పరుగులు చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన పంత్ ఈ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే భారత్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. జురెల్ (17) ఒక్కడే కాస్త నిరుత్సాహపరిచాడు.టార్గెట్ 207లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.పడిక్కల్ అజేయ శతకంభారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
టీమిండియా టార్గెట్ 207
శ్రీలంక క్రికెట్ ఎలెవెన్తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్లో భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. లంక ఎలెవెన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి, టీమిండియా ముందు 207 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆట ఇవాళ (మూడో రోజు) చివరి రోజు కావడంతో ఫలితం తేలే అవకాశం లేదు. ఆటలో మరో సెషన్ మాత్రమే మిగిలి ఉంది.లంక ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్లో నిషాన్ మధుష్క (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. అంజల బండార (35), నిపున్ ధనంజయ (46) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్ను 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (142 నాటౌట్) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. రవీంద్ర జడేజా (63 రిటైర్డ్ హర్ట్) అర్ద సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్ (40), మానవ్ సుతార్ (41), గుర్నూర్ బ్రార్ (36 నాటౌట్), సరాన్ష్ జైన్ (22 రిటైర్డ్ హర్ట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో అసంక మనోజ్, రమేశ్ మెండిస్ తలో 2 వికెట్లు తీయగా.. విశ్వ ఫెర్నాండో, కేశర నువంత చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. నిషాన్ మధుష్క (66), రవిందు రషాంత (71), సోనల్ దినుష (52) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలో 2 వికెట్లు తీయగా.. బ్రార్ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఈ మ్యాచ్ తర్వాత భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ మ్యాచ్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి మొదలుకానుంది. రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్ట్ 23న ప్రారంభం కానుంది. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు గుడ్ న్యూస్. ప్రాక్టీస్ సెషన్లో కుడి చేతి వేలికి గాయం కావడంతో తొలి టెస్టుకు కెప్టెన్ శుబ్మన్ గిల్ అందుబాటులో ఉంటాడా?లేదా? ఆందోళన అందరిలోనూ నెలకొంది.అయితే ఇప్పుడు గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. అతడు తిరిగి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో గిల్ సెకెండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది.ఈ చేతి వేలి గాయం కారణంగానే తొలి రెండు రోజుల ఆటకు మాత్రం అతడు దూరంగా ఉన్నాడు. మూడో రోజు ఫీల్డింగ్ రానప్పటికి బ్యాటింగ్ మాత్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. గిల్ గైర్హజరీలో భారత కెప్టెన్గా రాహుల్ వ్యహరిస్తున్నాడు.ఇప్పటికే శ్రీలంకతో సిరీస్కు ఇన్ఫామ్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లు గాయం కారణంగా దూరమయ్యారు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్ట్లో ఆడేది అనుమానమే. ఇక ఈ ప్రాక్టీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంక జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 363/8 డిక్లేర్ చేసింది.మొదటి ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఆకట్టుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్, జడేజా, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం భారత్ తమ తొలి ఇన్నింగ్స్ను 357/6 వద్ద డిక్లేర్ చేసింది. దేవ్దత్ పడిక్కల్ (164 బంతుల్లో18 ఫోర్లతో 142 ) భారీ సెంచరీతో కదం తొక్కాడు. నాలుగో స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా 63 పరుగులు సాధించాడు. ఇక మూడో రోజు లంచ్ సమయానికి శ్రీలంక 24 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. -
మరోసారి దొరికిపోయిన జైస్వాల్.. లోపం ఎక్కడుంది?
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయ్యాడు. కొలంబో వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో లంక బౌలర్ విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో.. దిలుమ్ సుదీరకు క్యాచ్ ఇచ్చి డకౌట్గా పెవిలియన్ చేరాడు.ఈ నేపథ్యంలో లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో జైసూ వైఫల్యం మరోసారి బయటపడింది. తన టెస్టు కెరీర్లో జైస్వాల్ ఇప్పటి వరకు 29 టెస్టులు ఆడి 2535 పరుగులు సాధించి మంచి రికార్డు కలిగి ఉన్నాడు. అతడి ఖాతాలో ఇప్పటికే ఏడు సెంచరీలు కూడా ఉన్నాయి.కేవలం 200 పరుగులుఅయితే, ఎడమచేతి వాటం ఉన్న ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ను ఎదుర్కోవడంలో జైస్వాల్ ముందు నుంచే ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్లో లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్లో జైసూ కేవలం 200 పరుగులు చేసి.. తొమ్మిది సందర్భాల్లో అవుటయ్యాడు. సగటు 22.2గా ఉంది. రైటార్మ్ సీమర్ల బౌలింగ్లో మాత్రం జైసూ సగటున 42 పరుగులతో ఏకంగా 1184 పరుగులు రాబట్టాడు.నిజానికి లెఫ్టార్మ్ పేసర్ల యాంగిల్ కారణంగా రైటార్మ్ బ్యాటర్లు ఇబ్బంది పడతారు. కానీ లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూ ఇలా వీరి బౌలింగ్లో ఇబ్బంది పడటం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే అని విశ్లేషకులు అంటున్నారు.వారి బౌలింగ్లో మరీ కష్టంకాగా లెఫ్టార్మ్ సీమర్లలో ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో జైసూ 133 పరుగులు చేసి.. మూడు సార్లు అవుటయ్యాడు. సగటు 44.3. అయితే, సౌతాఫ్రికా స్టార్లు మార్కో యాన్సన్, నండ్రీ బర్గర్ మాత్రం జైసూను మరింత ఇబ్బంది పెట్టారు. యాన్సెన్ బౌలింగ్లో జైసూ 42 పరుగులు చేసి మూడుసార్లు అవుట్ కాగా.. బర్గర్ బౌలింగ్లో కేవలం 21 పరుగులే చేసి మూడుసార్లు పెవిలియన్ చేరాడు.కేవలం టెస్టుల్లోనే కాదు టీ20 ఫార్మాట్లోనూ జైస్వాల్ లెఫ్టార్మ్ సీమర్లను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పటికి వారి బౌలింగ్లో 135 పరుగులు చేసి ఐదుసార్లు అవుటయ్యాడు. నెట్స్లో గంట ప్రాక్టీస్కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన జైసూకు లెఫ్టార్మ్ పేసర్ వేసే బంతి భిన్నమైన కోణంలో వస్తుంది. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన మూమెంట్ మీదే అతడు ఎలాంటి షాట్ ఆడాలన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జైస్వాల్ మరోసారి లెప్టార్మ్ పేసర్ చేతికి దొరికిపోయి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో డకౌట్ అయిన వెంటనే నెట్స్లో తిరిగి ప్రాక్టీస్కు వెళ్లిన 24 ఏళ్ల జైస్వాల్.. గంటపాటు అక్కడే శ్రమించినట్లు తెలుస్తోంది.చదవండి: పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు -
పడిక్కల్ భారీ శతకం.. జడ్డూ ఫిఫ్టీ.. బ్రార్ మెరుపులు
శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టుకు టీమిండియా ధీటుగా బదులిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్లో శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. దేవదత్ పడిక్కల్ భారీ శతకం, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ, గుర్నూర్ బ్రార్ మెరుపుల కారణంగా మంచి స్కోరు సాధించింది.శ్రీలంక 363 డిక్లేర్డ్శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా.. శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.ఫలితంగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్.. తొలిరోజు ఆటలో ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగులు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆటలో ఓవర్నైట్ స్కోరు వద్దనే తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది.జైసూ, పంత్, జురెల్ విఫలం ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగులతో రాణించాడు. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో శతకం పూర్తి చేసుకుని రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్లు రిషభ్ పంత్ (2), ధ్రువ్ జురెల్ (1) పూర్తిగా విఫలమయ్యారు.ఇలాంటి తరుణంలో నాలుగో స్థానంలో వచ్చిన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు.. మరో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ తోడయ్యాడు. జడ్డూ 117 బంతుల్లో 63 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరగా.. మానవ్ 90 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే, అసంక మనోజ్ బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా మానవ్ వెనుదిరిగాడు.గుర్నూర్ బ్రార్ మెరుపులు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి 15 బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ సారాంశ్ జైన్ 22 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగగా.. గుర్నూర్ బ్రార్ మెరుపులు మెరిపించాడు.వరుస విరామాల్లో ఆటగాళ్లు పెవిలియన్ చేరిన తర్వాత పడిక్కల్ మళ్లీ బ్యాటింగ్కు దిగాడు. 103 పరుగులతో తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టిన పడిక్కల్.. ఆట ముగిసేసరికి మొత్తంగా 164 బంతులు ఎదుర్కొని 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 18 ఫోర్లు ఉన్నాయి.ఆరు పరుగుల తేడాఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 90 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. పడిక్కల్ 142 పరుగులతో ఉండగా.. బ్రార్ 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక క్రికెట్ ఎలెవన్ కంటే కేవలం ఆరు పరుగులు వెనుకబడి ఉంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కు ఆదివారం చివరి రోజు. చదవండి: ద్రవిడ్ వద్దన్నాడు.. యువీ ఉంటే కథ వేరుగా ఉండేది -
IND vs SL: పంత్, జురెల్ ఫెయిల్.. జడ్డూ ఫిఫ్టీ
శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో వార్మప్ మ్యాచ్లో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్లలో తలపడేందుకు అక్కడికి వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఆగష్టు 15 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది.కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు.జైసూ డకౌట్.. పడిక్కల్ శతకంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (121 బంతుల్లో 103) సాధించాడు. ఆ వెంటనే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.పంత్, జురెల్ విఫలంఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చీ రాగానే వెనుదిరిగాడు. రమేశ్ మెండిస్ బౌలింగ్లో అనవసరపు షాట్కు ప్రయత్నించి.. నిశాన్ మధుష్కకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదు బంతులు ఎదుర్కొన్న పంత్.. కేవలం రెండు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జడేజా అర్ధ శతకం పూర్తిఇదిలా ఉంటే.. తొలి రోజు ఆటలో భాగంగా రెండు వికెట్లు తీసిన స్పిన్బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. 88 బంతుల్లో జడ్డూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 55 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఎలెవన్ కంటే మరో 154 పరుగులు వెనుకబడి ఉంది. మానవ్ సుతార్ ఏడు పరుగులతో ఉన్నాడు.చదవండి: విండీస్కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అప్గాన్ అర్హత -
టీమిండియాకు మరో భారీ షాక్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే సిరీస్కు దూరం కాగా.. తాజాగా యువ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.తొలుత లంక సిరీస్కు బుమ్రాతో పాటు సాయి సుదర్శన్ను కూడా ఎంపిక చేశారు. వీరిద్దరూ గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటారనుకుంటే, అది జరగలేదు. బుమ్రా ఎడమ మోకాలిలో గాయం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలికి గాయం నుంచి కోలుకునేందుకు గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిహాబిలిటేషన్లో ఉన్నారు.అయితే గాయాలు ఎంతకీ మానకపోవడంతో తొలుత బుమ్రా, తాజాగా సాయి సుదర్శన్ లంక సిరీస్ నుంచి తప్పుకున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు రెగ్యులర్ ఆటగాళ్లు వైదొలగడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బే అనుకోవాలి. ఇప్పుడు వీరిద్దరికి ప్రత్యామ్నాయాలుగా ఎవరికి ఎంపిక చేస్తారో చూడాలి. తొలి టెస్ట్ (ఆగస్ట్ 15, గాలే) ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది.లంకలో పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియా ప్రస్తుతం ఆ దేశ క్రికెట్ ఎలెవెన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎలెవెన్ జట్టు 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో భారత బౌలర్లు పెద్దగా ఆకట్టకోలేకపోయారు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ తలో 2 వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. స్పిన్నర్ సరాన్ష్ జైన్ 11 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ దక్కలేదు.అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ సెంచరీతో (103 రిటైర్డ్ హర్ట్) సత్తా చాటగా.. కేఎల్ రాహుల్ (40) రాణించాడు. యశస్వి జైస్వాల్ డకౌటై నిరాశపర్చగా.. పంత్ (2), జురెల్ (1) కూడా విఫలమయ్యారు. ప్రస్తుతం రెండో రోజు ఆట (టీ విరామం) కొనసాగుతోంది. -
IND vs SL: శ్రీలంక గడ్డపై శతక్కొట్టిన పడిక్కల్
శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా స్టార్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో మెరిశాడు. కొలంబోలో శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. రెండో రోజు ఆట సందర్భంగా 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జైసూ డకౌట్అనంతరం భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే, కేశారా నువాంత బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.అయితే, వన్డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ మాత్రం సెంచరీతో దుమ్ములేపాడు. 61 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరో 60 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న పడిక్కల్.. 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 14 ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ స్థానంలో.. రవీంద్ర జడేజాకు తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ విఫలంఅయితే, పంత్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసేసరికి జడ్డూ 23 పరుగులతో ఉండగా.. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు.చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి సీఎం గారూ: పంత్ -
IND vs SL: జైస్వాల్ విఫలం.. రాహుల్ అలా.. పడిక్కల్ ఇలా
శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతుండగా.. వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు.వర్షం వల్ల ఆటకు అంతరాయంఫలితంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భోజన విరామ సమయానికి టీమిండియా.. 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేయగలిగింది. అయితే, అంతకంటే ముందే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) తాజా ఎడిషన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది.హాఫ్ సెంచరీలతో అలరించారుఅయితే, ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని మంచి స్కోరు సాధించింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71) అర్ధ శతకాలతో మెరిశారు.మిగిలిన వారిలో పసిందు సూరియబండారా (35), పవన్ రత్ననాయకె (39), అహాన్ విక్రమసింఘే (31), రమేశ్ మెండిస్ (32) ఫర్వాలేదనిపించారు. వికెట్ కీపర్ అంజాలా బండారా (13) విఫలం కాగా.. కెప్టెన్ సోనాల్ దినుష (52) హాఫ్ సెంచరీతో అలరించాడు.మనోళ్లు తేలిపోయారుఫలితంగా శ్రీలంక ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లంతా తేలిపోయారు. గుర్నూర్ బ్రార్ ఒక్కడు మాత్రం ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో ఓవర్నైట్ స్కోరు 363-8 వద్ద రెండో రోజు శ్రీలంక ఎలెవన్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే జైస్వాల్ వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 23, పడిక్కల్ 52 బంతుల్లో 44 పరుగులతో క్రీజులో నిలిచారు. ఇద్దరూ కలిసి యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.పడిక్కల్ ఫిఫ్టీఇక భోజన విరామం తర్వాత కాసేపటికే పడి క్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు.. రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఇదిలా ఉంటే.. గాయం వల్ల రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ తొలిరోజు మైదానంలో దిగలేదు. చదవండి: మూడేళ్లుగా తిరుగుతున్నా.. సాయం చేయండి: పంత్ -
శ్రీలంకతో మ్యాచ్.. యశస్వి జైశ్వాల్ డకౌట్
కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వార్మాప్ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే జైశ్వాల్ తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యశస్వి.. విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. జైశ్వాల్ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్లోనే ఔట్ కావడం గమనార్హం. ఈ ముంబై ఆటగాడు గత కొంతకాలంగా ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు.కాగా ప్రధాన సిరీస్కు ముందు జరుగుతున్న సన్నాహక మ్యాచ్లో జైశ్వాల్ విఫలం కావడం మేనెజ్మెంట్ను నిరాశపరిచింది. డగౌట్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న హెడ్కోచ్ గౌతమ్ గంభీర్.. జైశ్వాల్ ఔటైన వెంటనే నో అంటూ తల ఊపాడు. ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది.లంక బ్యాటర్లలో రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.అయితే కొత్తగా జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ వార్మాప్ మ్యాచ్కు భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.శ్రీలంక ఎలెవన్ జట్టునిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి' -
భారత్తో టెస్టు సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం
టీమిండియాతో టెస్టు సిరీస్కు ముందు అభిమానులకు శ్రీలంక క్రికెట్ (SLC) తీపి కబురు అందించింది. గాలే, కొలంబోలలో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. టెస్టు క్రికెట్కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఎల్సీ పేర్కొంది.కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకం. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. అనంతరం రెండో టెస్టుకు(ఆగస్టు 23 నుండి 27) కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. కాగా పెద్ద సంఖ్యలో వస్తారని ప్రేక్షకులు అంచనా వేస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు.. రెండు మైదానాల్లోనూ ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసింది.సిరీస్ షెడ్యూల్ అండ్ స్టేడియం ఎంట్రీ వివరాలు:తొలి టెస్టు మ్యాచ్తేదీలు: ఆగస్టు 15 నుండి 19 వరకు వేదిక: గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంఉచిత ఎంట్రీ గేట్: గేట్ నంబర్ 4 ద్వారా మాత్రమే ప్రవేశం రెండో టెస్టు మ్యాచ్తేదీలు: ఆగస్టు 23 నుండి 27 వరకు వేదిక: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC), కొలంబో ఉచిత ఎంట్రీ గేట్లు: గేట్ నంబర్లు 3, 4, 5, 7 చదవండి: IND vs SL: విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ సాధించిన శ్రీలంక -
విఫలమైన భారత బౌలర్లు.. భారీ స్కోర్ సాధించిన శ్రీలంక
కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోయారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి లంక జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆతిథ్య జట్టు వికెట్లు పడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాన్ మధుష్క(66), రవిందు రసంత(71) అద్భుతమైన ఆరంభాన్ని వచ్చారు.వారిద్దరూ వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్య నెలకొల్పి ఇండియన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే సమన్వయ లోపం కారణంగా మధుష్క రనౌట్ కావడంతో భారత్కు తొలి వికెట్ దక్కింది. నిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా రాణించాడు. అయితే రసంత, సూరియబండారా(35)లను వరుస ఓవర్లలో ఔట్ చేసి భారత్ కాస్త కమ్బ్యాక్ ఇచ్చినట్లు కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన పవన్ రాత్నాయకే(39), అహన్ విక్రమసింఘే(31), కెప్టెన్ సోనల్ దినుష(52), రమేష్ మెండిస్(32) నిలకడగా ఆడి జట్టు స్కోర్ 350 పరుగుల మార్క్ను దాటించారు. ప్రస్తుతం క్రీజులో కేశర నువాంత(9), సుదీరా(1) ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు గుర్నూర్ బ్రార్ఘ ఓ వికెట్ తీశాడు. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ 13 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. -
అతడికి అసలైన పరీక్ష ఇక్కడే: శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక మాజీ క్రికెటర్ హషాన్ తిలకరత్నె టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్పై ప్రశంసలు కురిపించాడు. గిల్ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతమని కొనియాడాడు. అయితే, శ్రీలంక గడ్డపై మాత్రం అతడికి కఠిన సవాలు తప్పదని పేర్కొన్నాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లింది. 2017 తర్వాత లంక గడ్డ మీద భారత్ టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో శుబ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆరు శతకాలుటెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది మ్యాచ్లలో కలిపి ఏకంగా ఆరు శతకాలు బాదాడు. సగటు 82కు పైగా ఉండటం విశేషం. ఇంగ్లండ్లో అత్యుత్తమంగా రాణించాడు.అయితే, శ్రీలంకలో గిల్ రెడ్బాల్ మ్యాచ్ ఆడటం మాత్రం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో లంక మాజీ బ్యాటర్ హషాన్ తిలకరత్నె రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘గిల్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది.ఇక్కడే అసలైన పరీక్షబ్యాటింగ్ పిచ్ల మీద అందమైన షాట్లు ఆడటం అతడికే చెల్లింది. అయితే, శ్రీలంకలో టర్నింగ్ పిచ్ల మీద అతడు ఎలా ఆడతాడన్నదే ఇప్పుడు ఆసక్తికర విషయం. ఈ సిరీస్ అతడికి నిజమైన పరీక్ష. ఇక్కడ అతడికి కఠిన సవాలు ఎదురవుతుంది. శ్రీలంక వికెట్ల మీద గిల్ ఎలా ఆడతాడో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి వేలికి గాయమైంది. ఇందుకు సంబందించి బీసీసీఐ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇక గాయం కారణంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడు రోజుల వార్మప్ మ్యాచ్కు గిల్ దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో సీనియర్ బ్యాటర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానున్నాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.చదవండి: భారత్ తోమ్యాచ్.. వన్డే తరహాలో లంక ఓపెనర్ దూకుడు -
భారత్తో మ్యాచ్.. వన్డే మాదిరి లంక బ్యాటర్ల విధ్వంసం
టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్లో శ్రీలంక ఎలెవన్ ఓపెనర్ నిశాన్ మధుష్క దుమ్ములేపాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి వన్డే మాదిరి బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 52 బంతుల్లోనే నిశాన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.కాగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రనౌట్ కావడంతో....ఓపెనర్ నిశాన్ మధుష్క భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న అతడు పదకొండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది 66 పరుగులు చేశాడు. అతడిని అవుట్ చేసేందుకు భారత పేసర్లు, స్పిన్నర్లు ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు.అయితే, 21వ ఓవర్లో మానవ్ సుతార్ వేసిన బంతిని ఎదుర్కొని పరుగు తీసే క్రమంలో రవిందు రశాంతతో సమన్వయ లోపం కారణంగా.. నిశాన్ రనౌట్ అయ్యాడు. దీంతో ఎట్టకేలకు భారత్కు ఒక వికెట్ దక్కింది. ఇక మరో ఓపెనర్ రవిందు కూడా నిలకడగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 82 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు.తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యంనిశాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన వన్డౌన్ బ్యాటర్ పసిందు సూరియబండారా కూడా నిలకడగానే ఆడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భోజన విరామ సమయానికి శ్రీలంక ఎలెవన్ జట్టు 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 138 పరుగులు సాధించింది. రవిందు 50, పసిందు 16 పరుగులతో క్రీజులో నిలిచారు. నిశాన్- రవిందు కలిసి తొలి వికెట్కు ఏకంగా 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం.భారత బౌలర్లు విఫలంభారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్.. ఇలా ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. బ్రార్ నాలుగు ఓవర్లలోనే అత్యధికంగా 25 పరుగులు సమర్పించుకోగా.. సుతార్, సిరాజ్ 5 ఓవర్ల బౌలింగ్లో కేవలం 14 పరుగులే ఇచ్చి పొదుపు పాటించారు. జడ్డూ 5 ఓవర్లలో 29, కుల్దీప్ 5 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చుకున్నారు. ప్రసిద్ 5 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: టీమిండియా-శ్రీలంక ఎలెవన్ మ్యాచ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్ -
అతడి సెలక్షన్ దారుణం.. ఇప్పటికైనా సంతోషమే!
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ విషయంలో సెలక్టర్ల తీరు సరిగా లేదని విమర్శించాడు. కాగా రంజీ ట్రోఫీ టోర్నీలో గత రెండేళ్లుగా ఆకిబ్ అదరగొడుతున్న సంగతి తెలిసిందే.గత రెండు సీజన్లలో ఏకంగా వందకు పైగా వికెట్లు తీసిన ఆకిబ్ నబీ.. జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్తో స్వదేశంలో ఇటీవల జరిగిన ఏకైక టెస్టు సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు.అపుడు మొండిచేయికానీ టీమిండియా సెలక్టర్లు మాత్రం నబీకి మొండిచేయి చూపారు. సీనియర్ల గైర్హాజరీలో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అయితే, వీళ్లిద్దరికి ఈ మ్యాచ్లో ఆడే అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఇద్దరూ వైట్బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశారు.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన జట్టులోనూ ఆకిబ్ నబీకి తొలుత స్థానం దక్కలేదు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఎట్టకేలకు నబీకి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీని ఎంపిక చేశారు.అతడి సెలక్షన్ దారుణం.. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ నబీ విషయంలో సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. ‘‘నిజంగా ఇదొక గొప్ప విషయం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడిన తర్వాత ఎట్టకేలకు ఆకిబ్ నబీకి జాతీయ జట్టులో చోటు దక్కింది.ఇప్పటికైనా సంతోషమే!అయితే, అతడు రీప్లేస్మెంట్లా కాకుండా ముందుగానే జట్టులోకి రావాల్సింది. అయినా ఎప్పటికీ ఎంపిక చేయకపోవడం కంటే.. ఆలస్యంగానైనా పిలుపునివ్వడం మంచిదే. ఏదేమైనా శ్రీలంకకు ఎంపిక చేసిన జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉండేందుకు అతడు అర్హుడు. కానీ ఆలస్యమైనా అతడికి మంచే జరిగింది’’ అని వసీం జాఫర్ పేర్కొన్నాడు.కాగా నబీ ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరఫున ఆరు వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
గిల్కు గాయం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక అప్డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా కండరాల నొప్పితో గిల్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్కు సిద్ధమయ్యాడు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది.ఫైనల్ రేసులో ఉండాలంటే గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలు కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.గిల్కు గాయంకాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి పరిశీలించి బాండ్ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశాడు. అయితే, శ్రీలంక ఎలెవన్తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్కు వచ్చాడు.బీసీసీఐ అధికారిక ప్రకటనఈ నేపథ్యంలో బీసీసీఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్మన్ గిల్ గాయపడ్డాడు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమైంది.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్తో వామప్ మ్యాచ్లో తొలిరోజు గిల్ మైదానంలోకి రాడు. బీసీసీఐ వైద్యబృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తాడు’’ అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
IND vs SL: టాస్ గెలిచిన శ్రీలంక.. భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్
శ్రీలంకతో టెస్టు సిరీస్కు టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. కొలంబోలోని నాండెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ ఇందుకు వేదిక. ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక ఎలెవన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.గిల్కు గాయం.. సారథిగా రాహుల్ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వచ్చాడు. నెట్స్లో గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గిల్ కుడిచేతి వేలికి గాయమైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో శ్రీలంక ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో గిల్కు విశ్రాంతినిచ్చారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ అధికారిక అప్డేట్ అందించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గిల్ తొలి రోజు వామప్ మ్యాచ్కు అందుబాటులో ఉండడని తెలిపింది. భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.శ్రీలంక ఎలెవన్ జట్టునిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్
టీమిండియా కీలక సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడనుంది. అయితే, అంతకంటే ముందు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీలంక ఎలెవన్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా ఆతిథ్య శ్రీలంకను 2-0 తేడాతో వైట్వాష్ చేయాల్సిందే. ఇక ఈ సిరీస్ కంటే ముందు డబ్ల్యూటీసీలో భాగంగా సౌతాఫ్రికాతో స్వదేశంలో రెండు టెస్టులు ఆడిన గిల్ సేన.. ప్రొటిస్ జట్టు చేతిలో దాదాపు పాతికేళ్ల తర్వాత 2-0తో క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే.దీంతో హెడ్కోచ్ గౌతం గంభీర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఇటీవల గంభీర్ మార్గదర్శనంలో టీమిండియా వరుస టీ20 సిరీస్లలో వైట్వాష్లు ఎదుర్కొంది. ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్స్వీప్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్కు శ్రీలంక టెస్టు సిరీస్ అగ్నిపరీక్షగా నిలిచింది.ఈ నేపథ్యంలో శ్రీలంక గడ్డపై ప్రాక్టీస్ మ్యాచ్కు ముందు రోజు గంభీర్ జట్టు సభ్యులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లంతా పూర్తి స్థాయి సామర్థ్యంలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉండాలని, తమ బాధ్యత ఏమిటో అందరూ గుర్తించాలని వారికి సూచించాడు.‘మన ఎదురుగా ఎలాంటి లక్ష్యం ఉందో, ఎందుకు ఆడుతున్నామో అందరికీ తెలుసు. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగల సత్తా మనకు ఉంది. ఆగస్టు 15 ఉదయం ముందుగా బ్యాటింగ్ చేసినా, ముందుగా బౌలింగ్ చేసినా మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. మనపైకి సంధించే ప్రతీ ప్రశ్నకు మన వద్ద సమాధానం ఉండాలి. ఇక కొత్తగా జట్టులోకి వచ్చి న సారాంశ్ జైన్, ఆకిబ్ నబీలకు నా అభినందనలు. ఈ స్థాయి వరకు వచ్చేందుకు ఎంతో శ్రమించిన మీరు మీ కుటుంబ సభ్యులు, దేశం గర్వించేలా ఆడాలి’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా 33 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ సారాంశ్ జైన్, జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ శ్రీలంకతో టెస్టుల సందర్భంగా తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో సారాంశ్, జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ జట్టులోకి వచ్చారు. -
టీమిండియా ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు తొలి సవాలుకే వాతావరణం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండగా, రేపటి నుంచి (ఆగస్టు 7) కొలంబోలో శ్రీలంక ‘ఏ’తో భారత్ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తొలి రోజు ఏకంగా 97 శాతం వర్షావకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఆకాశం 99 శాతం మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీలుగా ఉండనుంది.రెండో రోజు పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 8న వర్షం పడే అవకాశం 99 శాతంగా ఉండటంతో పాటు 89 శాతం మేఘావృత వాతావరణం ఉండొచ్చని అంచనాలు చెబుతున్నాయి.మూడో రోజు కూడా వర్షం ముప్పు తప్పేలా లేదు. ఆగస్టు 9న వర్షం పడే అవకాశం 91 శాతంగా, మేఘావృతం 95 శాతంగా ఉండొచ్చని అంచనా.టీమిండియా ప్రాక్టీస్కు కీలక మ్యాచ్శ్రీలంకలో టెస్టు సిరీస్కు ముందు భారత ఆటగాళ్లకు ఈ వార్మప్ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా శ్రీలంకలోని నెమ్మదైన, స్పిన్కు అనుకూలించే పిచ్లపై బ్యాటర్లు, బౌలర్లు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం.కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మినహా ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు శ్రీలంక గడ్డపై టెస్టు అనుభవం తక్కువ. సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లకు స్థానిక పరిస్థితులపై కొంత అనుభవం ఉన్నప్పటికీ, పూర్తి స్థాయి టెస్టు సిరీస్ అనుభవం లేదు.వార్మప్ రద్దయితే ఇబ్బందే!మూడు రోజులూ వర్షం ముప్పు అధికంగా ఉండటంతో వార్మప్ మ్యాచ్ పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ పూర్తిగా రద్దయితే శ్రీలంక పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లకు మరో అవకాశం ఉండదు.గతంలోనూ వర్షం కారణంగా ప్రాక్టీస్ మ్యాచ్లు రద్దై, విదేశీ పర్యటనల్లో టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొలంబోలోనూ అదే పరిస్థితి ఎదురైతే, ఆగస్టు 15న గాలేలో ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు భారత్కు ఇది ఎదురుదెబ్బగా మారొచ్చు. -
టీమిండియాతో తొలి టెస్టు.. శ్రీలంకకు భారీ షాక్!
భారత్తో టెస్టు సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆగస్టు 15న ప్రారంభయ్యే తొలి టెస్ట్కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. 31 ఏళ్ల కుశాల్ మెండిస్ లంక ప్రీమియర్ లీగ్-2026లో తొడ కండరాల గాయం బారిన పడ్డాడు.దీంతో అతడు టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అయితే భారత్తో టెస్టు సిరీస్ సమయానికి కుశాల్ కోలుకుంటాడని లంక సెలక్టర్లు భావించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు శ్రీలంక ప్రముఖ జర్నలిస్ట్ దనుష్క అరవింద పేర్కొన్నారు.ఒకవేళ మెండిస్ దూరమైతే శ్రీలంకకు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ సొంత గడ్డపై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు శ్రీలంకలో 59 టెస్ట్ ఇన్నింగ్స్లు ఆడిన మెండిస్ 41.49 సగటుతో 2365 పరుగులు చేశాడు. ఓవరాల్గా 75 టెస్ట్ల్లో 4836 రన్స్ చేశాడు. తొలి టెస్ట్ సమయానికి మెండిస్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో నిషాన్ మదుష్క వికెట్ కీపర్గా వ్యవహరించే అవకాశముంది. మరోవైపు కుశాల్కు ప్రత్నామ్యాయంగా మరో యువ ఆటగాడు పాసిందు సూరియబండార పేరును లంక సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.గత నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక టెస్టు జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. కానీ తుది జట్టులో అతడికి అవకాశం లభించలేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి మంచి రికార్డు ఉంది. లోయర్-మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చి దూకుడుగా ఆడడం అతడి స్పెషాలిటి. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో సూరియబండార 102 ఇన్నింగ్స్లలో 4893 పరుగులు సాధించాడు. -
IND vs SL: శుబ్మన్ గిల్కు గాయం!
శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమచారం. కెప్టెన్ శుబ్మన్ గిల్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.బలంగా తాకిన బంతిఅయితే, అంతకంటే ముందు భారత్.. శ్రీలంక ఎలెవన్ జట్టుతో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ గాయపడినట్లు రెవ్స్పోర్ట్స్ వెల్లడించింది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి బొటనవేలికి బంతి బలంగా తాకిందని పేర్కొంది.ఈ క్రమంలో టీమ్ డాక్టర్ వచ్చి గిల్ గాయాన్ని పరిశీలించాడు. ట్రీట్మెంట్ తీసుకున్న గిల్.. కాసేపటి తర్వాత బ్యాటింగ్ సెషన్ కొనసాగించినట్లు పేర్కొంది. కాగా భారత్- శ్రీలంక ఎలెవన్ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్కు కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC) వేదిక.ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా శ్రీలంకలో సత్తా చాటాల్సిందే. ఆతిథ్య జట్టును 2-0తో వైట్వాష్ చేస్తేనే గిల్ సేన అవకాశాలు మెరుగుపడతాయి. చివరగా వైట్వాష్డబ్ల్యూటీసీలో భాగంగా చివరగా స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా ప్రత్యర్థి చేతిలో 2-0తో క్లీన్స్వీప్ అయింది. అనంతరం.. అఫ్గానిస్తాన్తో ఇటీవల నామమాత్రపు టెస్టులో మాత్రం విజయం సాధించింది. అయితే, ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు.ఇక ఇప్పటికే టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంకతో సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బారాముల్లా ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చాడు. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన సందర్భంగానే బుమ్రాతో పాటు గాయపడ్డ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో సెలక్టర్లు 33 ఏళ్ల సారాంశ్ జైన్ను తొలిసారి టీమిండియాకు ఎంపిక చేశారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గిల్ కండరాల నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: రూ. కోటిన్నర నజరానా!.. అస్మితకు భారీ షాక్! -
IND vs SL: బ్యాటింగ్కు అనుకూలమే.. టీమిండియాకు నచ్చలేదు!
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్లు జరుగనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. అయితే, తొలి టెస్టు కంటే ముందు భారత్ శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడనుంది.టీమిండియా అసంతృప్తి కొలంబోలోని నోండెస్ప్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ (NCC)లో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా శ్రీలంకలో పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం NCC తయారు చేసిన వికెట్ మాత్రం భారత శిబిరానికి అస్సలు నచ్చలేదని సమాచారం. పిచ్ మీద పచ్చిక ఉండటం ఏమిటని భారత బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి NCC అధికారి ఫ్రాంకీ రెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘వికెట్ మీద పచ్చిక ఎక్కువగా ఉందని భారత క్రికెట్ జట్టు చెప్పింది. నిజానికి ఇది మూడు రోజుల మ్యాచ్ కాబట్టే మేమిలా గ్రాస్ వదిలేశాము. పచ్చిక లేకుండా వికెట్ ఇవ్వడం సరికాదు. ఇదొక మంచి వికెట్.బ్యాటింగ్కు అనుకూలంఏదో ఒక జట్టుకు అనుకూలంగా ఉండేలా మేము ఇది తయారు చేయలేదు. ఆయా జట్ల సత్తాను బట్టే వాళ్లు ముందుకు వెళ్లగలరు. నిజానికి శ్రీలంక క్రికెట్ అభ్యర్థన మేరకే మేము ఇలాంటి పిచ్ తయారు చేశాము. NCC వికెట్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయి.ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయని మేము భావిస్తున్నాము. గాలె మ్యాచ్ కంటే ముందు భారత బ్యాటర్లకు ఇక్కడ మంచి ప్రాక్టీస్ లభిస్తుందని చెప్పగలను. మా వికెట్ రెండు లేదా మూడో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలిస్తుందని చెప్పగలము.ఇరుజట్లకూ కీలకంఅయితే, ఇక్కడ టాస్ గెలిచిన వాళ్లు ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచిది. మేము ఎల్లప్పుడూ మంచి వికెట్లనే రూపొందిస్తాము. పక్షపాతం ఉండదు’’ అని పేర్కొన్నారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే టీమిండియా కచ్చితంగా శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే.మరోవైపు.. శ్రీలంక సైతం సొంతగడ్డపై సత్తా చాటి తామూ పోటీలో నిలవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కాగా.. పిచ్ రూపకల్పన కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది.చదవండి: ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్? -
తొలి టెస్టులో చోటుకోసం కుల్దీప్ మాస్టర్ ప్లాన్!
శ్రీలంకతో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు కోసం మాస్టర్ప్లాన్ వేసినట్లు అనిపిస్తోంది. తొలి టెస్టుకు సంబంధించి తుది జట్టును ప్రకటించినప్పటికీ, కుల్దీప్ తొలి టెస్టులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో లంక గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా బృందం ఇప్పటికే కొలంబో మైదానంలో ప్రాక్టీస్ను ఆరంభించింది. ఈ ప్రాక్టీస్లో కుల్దీప్ తన శైలికి భిన్నంగా బంతితో కాకుండా బ్యాట్తో ప్రాక్టీస్ చేయడం విశేషం. దాదాపు 40 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ కొనసాగించిన కుల్దీప్ ఒక్కసారి కూడా బౌలింగ్ వేయలేదు. అయితే తొలి టెస్టులో కుల్దీప్కు చోటు దక్కడం అనుమానంగా ఉండడంతో జట్టులో బ్యాటర్గానైనా చాన్స్ అందుకోవాలనే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.టీమిండియాను వరుస గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవ్వగా, ఫిట్నెస్ టెస్టు పాసైనప్పటికీ బుమ్రా కూడా చివరి నిమిషంలో లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. దీంతో లంకతో సిరీస్కు కుల్దీప్ ఎంపికైనప్పటికీ, ఆప్షనల్గా కనిపించాడు. ఇప్పుడు టీమిండియాను గాయాలు వెంటాడడంతో కుల్దీప్ తొలి టెస్టు ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం జడేజాతో కలిసి కుల్దీప్ బౌలింగ్ను పంచుకోనున్నాడు. అంతేకాదు కుల్దీప్ యాదవ్కు టెస్టుల్లో బ్యాటింగ్లోనూ మంచి రికార్డే ఉంది. ఈ మణికట్టు స్పిన్నర్ ఇప్పటివరకు 18 టెస్టుల్లో 234 పరుగులు సాధించాడు. 40 పరుగులు అతడి అత్యుత్తమంగా ఉంది. అయితే తొలి టెస్టులో కుల్దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది జట్టు ప్రకటన వరకు ఎదురుచూడాల్సిందే. అయితే లంకతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు కొలంబో వేదికగా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక తొలి టెస్టు ఆగస్టు 15న గాలే వేదికగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా జరగనున్నాయి.లంకతో టెస్టు సిరీస్ భారత్కు కీలకమైంది. వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించాలంటే లంకపై సిరీస్ గెలవడం తప్పనిసరి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, లంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: శకం ముగిసింది.. డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ రెజ్లర్ గుడ్ బై -
‘ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకో.. సగం సగం వద్దు’
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచూ గాయాల బారిన పడటం ఆందోళనకరంగా పరిణమించింది. ఈ ఏడాది ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇప్పటికే అతడు ఎన్నో మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా శ్రీలంకతో కీలక టెస్టు సిరీస్కు కూడా బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు.ఆర్నెళ్లు లేదంటే ఏడాది బ్రేక్ తీసుకోగతంలో వెన్నునొప్పితో సుదీర్ఘకాలం జట్టుకు దూరమైన బుమ్రా.. ఈసారి మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ కర్సాన్ ఘవ్రీ బుమ్రాను ఉద్దేశించి కీలక సూచనలు చేశాడు. మిడ్-డేతో మాట్లాడుతూ..‘‘బుమ్రా ఐదు నుంచి ఆరు నెలలు.. లేదంటే ఓ సంవత్సరం పాటు విరామం తీసుకోవాలి. వందశాతం ఫిట్నెస్ సాధించిన తర్వాతే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అలా కాకుండా ప్రతీసారి హడావుడిగా జట్టుతో చేరి.. మధ్యలోనే గాయం వల్ల నిష్క్రమిస్తే కూర్పు దెబ్బతింటుంది.జట్టు ప్రణాళికలు అప్పటికప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది. పనిభారం తగ్గించేందుకు మధ్య మధ్యలో విశ్రాంతినివ్వాల్సి ఉంటుంది. ఇదంతా వృథా ప్రయాస. ఏదైనా సిరీస్ లేదంటే.. టోర్నీ మొత్తం పనిభారం అనే ప్రస్తావన లేకుండా జట్టుతో కొనసాగే ఆటగాడికే పెద్దపీట వేయాలి.భువీ, షమీలను పిలిపించండిబుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే అతడిని జట్టులో చేర్చాలి. నిజానికి భారత వెటరన్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్నారు. గాయాల బెడద లేకుండా వరుస టోర్నీల్లో పాల్గొంటున్నారు. వారిని తిరిగి టీమిండియాలోకి తీసుకుంటే బాగుంటుంది.సెలక్టర్లు షమీ, భువీల పేర్లు పరిగణనలోకి తీసుకోవాలి. ఫాస్ట్ బౌలర్లలకు గాయాలు సహజం. అయితే, బుమ్రా గత రెండు- మూడేళ్ల నుంచి తరచూ గాయపడుతున్నాడు. మెజారిటీ, కీలక మ్యాచ్లకు అతడు దూరమవుతున్నాడు. టీమిండియాకు ఇది ఎంతమాత్రమూ శుభసూచకం కాదు’’ అని ఘవ్రీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. బుమ్రా స్థానంలో..కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగమైన శ్రీలంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరం కాగా.. అతడి స్థానంలో జమ్మూ కశ్మీర్ పేస్ బౌలర్ ఆఖిబ్ నబీకి మొదటిసారి భారత జట్టు పిలుపు లభించింది.కాగా 29 ఏళ్ల నబీ దేశవాళీ క్రికెట్లో గత రెండేళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ రెండు వరుస సీజన్లలో కలిపి అతను ఏకంగా 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో 60 వికెట్లు తీసిన నబీ... జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చదవండి: సన్రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం -
పంత్ హవా.. ఆదాయపు పన్ను చెల్లింపులో అగ్రస్థానం!
దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్న జాబితాలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు సంపాదించాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ రికార్డులకెక్కాడు. ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేయగా.. అందులో పంత్ అత్యధిక పన్ను చెల్లించి అగ్రస్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. రూర్కీలో జన్మించిన పంత్ బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్లో ప్రస్తుతం లక్నో క్యాపిటల్స్ నుంచి అందుకున్న మొత్తం, మ్యాచ్ ఫీజులు, ఇతర వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు ఇతరత్రా ఆదాయ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు. అయితే గతేడాదితో పోలిస్తే పంత్ ఈసారి చెల్లించిన పన్ను మొత్తం రెండింతలకు పైనే ఉండడం గమనార్హం. గతేడాది పంత్ సుమారు రూ. 10.5 కోట్ల పన్ను చెల్లించాడు. ఈసారి మాత్రం అతడి పన్ను చెల్లింపు మొత్తం గణీనీయంగా పెరిగింది. రికార్డు స్థాయిలో రూ. 23.84 కోట్లు చెల్లించి రాష్ట్రంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా పంత్ నిలిచాడు. మరోవైపు జార్ఖండ్-బీహార్ రాష్ట్రాల్లో అత్యధిక పన్ను చెల్లిస్తున్న వారిలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు.ప్రస్తుతం రిషబ్ పంత్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. లంక గడ్డపై రాణించాలనే పట్టుదలతో ఉన్న పంత్ ఇటీవలే తన గురువు ఎంఎస్ ధోని వద్ద ప్రత్యేక సలహాలు, సూచనలు అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో తరఫున పంత్ 14 మ్యాచ్లో 312 పరుగులు సాధించాడు. లక్నోను క్వాలిఫయర్ చేర్చడంలో పంత్ విఫలమయ్యాడు. ఇక ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టులో ఆడిన పంత్ 81 పరుగులతో రాణించాడు. ఇక పంత్ పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడి రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టును ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఆడనుంది. PANT BECOMES THE HIGHEST TAXPAYER FROM UTTARAKHAND. 💰 - Rishabh Pant emerged as the highest individual taxpayer in Uttarakhand after paying ₹23.84cr income tax for 2025-26 financial year. (ABP). pic.twitter.com/33xkT1Ev6r— Mufaddal Vohra (@mufaddal_vohra) August 5, 2026చదవండి: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
‘జడ్డూతో జాగ్రత్త.. లంక బ్యాటర్లకు ఇదే నా హెచ్చరిక!’
జింబాబ్వేతో సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 నుంచి ఇరుజట్ల మధ్య గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో టీమిండియాకు సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక ఆయుధంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా జోస్యం చెప్పాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్లో జడేజా గతంలో పరుగులు కట్టడి చేయడంపైనే దృష్టి సారించేవాడని, కానీ కొన్నాళ్లుగా అతడు వికెట్ల కోసమే బంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తోందని తెలిపాడు. జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా మాట్లాడాడు. 'కెరీర్ ఆరంభంలో జడేజా తన బౌలింగ్లో పరుగులు ఎక్కువగా రాకూడదనే మైండ్సెట్తో ఉండేవాడు. రెడ్బాల్ క్రికెట్లో ఇది చాలా ఎక్కువగా కనిపించేది. అయితే వికెట్ కొద్దిగా సహకరించినా, అతడు వికెట్లు తీయడానికి ప్రయత్నించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం జడేజా పూర్తిగా మారిపోయాడు. తనకున్న బలాబలాలను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతడు వికెట్లు తీయడంలో నేర్పరి. ఇక జడ్డూ ప్రతి గేమ్లోనూ బంతిని స్టంప్ లైన్లో వేసి ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. గతంలో అతడి ఆలోచన కాస్త రక్షణాత్మక ధోరణిలో ఉండేది. కానీ ఇప్పుడు వికెట్ తీయాలనే ఉద్దేశంతోనే బంతులను విసురుతున్నాడు' అని పుజారా చెప్పుకొచ్చాడు.ఇక జడేజా ఆరు నెలల తర్వాత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. గతేడాది నవంబర్లో గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్లో జడేజా ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు అర్ధసెంచరీ సాధించాడు. ఇక 37 ఏళ్ల జడేజాకు శ్రీలంకపై అద్భుతమైన రికార్డు ఉంది. గతంలో లంకతో ఆడిన ఏడు టెస్టుల్లో జడేజా 65 సగటుతో 326 పరుగులు చేశాడు. లంకపైనే అతడి కెరీర్ బెస్ట్ (175 నాటౌట్) స్కోరు నమోదు చేశాడు. ఇక బౌలింగ్లో 24 సగటుతో 33 వికెట్లు తీశాడు. ఇక లంక గడ్డపై గతంలో ఆడిన రెండు టెస్టులు కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్గా జడేజా 85 టెస్టుల్లో 348 వికెట్లు తీశాడు. ఇందులో 15 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలున్నాయి. బ్యాటింగ్లో 4,095 పరుగులు సాధించిన జడేజా ఖతాలో ఆరు సెంచరీలు, 28 అర్ధసెంచరీలున్నాయి.Read: ‘రొనాల్డోనే స్ఫూర్తి.. నా తండ్రి కూడా అలానే మరణించాడు’ -
ఆకిబ్ నబీ జీవితంలో ఆసక్తికర విశేషాలు
అది జమ్మూకశ్మీర్లోని బరాముల్లా పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న షీరీ అనే గ్రామం. అక్కడ క్రికెట్ ఆడేందుకు పెద్దగా సౌకర్యాలు లేవు. నిత్యం రాజకీయ ఉద్రిక్తతలు ఉండే ఆ ప్రాంతంలో ఒక బాలుడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలని కలలు కన్నాడు. కలలు కనడమే కాకుండా పట్టుదల, కృషితో వాటిని సాకారం చేసుకున్నాడు.అతడి పేరే ఆకిబ్ నబీ. త్వరలో శ్రీలంకతో జరుగబోయే టెస్ట్ సిరీస్కు బుమ్రా ప్రత్యామ్నాయంగా ఎంపికైన ఆటగాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్ల పాలిట సింహస్వప్నమైన అతడిని క్రికెట్ సర్కిల్స్లో బారాముల్లా ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. లంకతో తొలి టెస్ట్తో టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం ఉన్న నబీ జీవిత విశేషాలు ఈ కథనంలో చూద్దాం.29 ఏళ్ల నబీ చిన్నతనంలో ఫుట్బాల్పై ఆసక్తి చూపినప్పటికీ.. ఆ తర్వాత పేస్ బౌలింగ్పై మక్కువ పెంచుకున్నాడు. అదే ఆసక్తి అతడిని దేశవాళీ క్రికెట్లో తిరుగులేని పేసర్గా మార్చి, టీమిండియాలోకి తీసుకొచ్చింది. తద్వారా భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన తొలి జమ్మూకశ్మీర్ క్రికెటర్గా చరిత్ర సృష్టించేలానూ చేసింది.డాక్టర్ కావాలని తండ్రి ఆశ..నబీకి క్రికెట్ కెరీర్ ఎంచుకోవడం అంత సులభంగా జరగలేదు. 12వ తరగతి చదువుతున్న సమయంలో అతడు బయోసైన్స్ విద్యార్థి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన అతడి తండ్రి గులాం నబీ దార్ తన కొడుకు డాక్టర్ కావాలని కోరుకున్నారు.కానీ అదే సమయంలో నబీకు బీసీసీఐ నిర్వహించిన పేస్ బౌలింగ్ క్యాంప్లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ క్యాంప్కు ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్గ్రాత్ కోచ్గా వ్యవహరించాడు.కొడుకు చదువును పక్కన పెట్టి క్రికెట్ కోసం వెళ్లడం తండ్రికి అస్సలు నచ్చలేదు. క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడం ప్రమాదకరమైన నిర్ణయమని ఆయన భావించారు.అయితే ఈ విషయంలో నబీ తొలి కెప్టెన్ జుబైర్ దార్ జోక్యం చేసుకున్నారు. మెక్గ్రాత్ వంటి దిగ్గజం దగ్గర నేర్చుకునే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని చెప్పి నబీను క్యాంప్కు పంపించేందుకు తండ్రిని ఒప్పించారు. అది నబీ క్రికెట్ జీవితాన్ని మార్చిన కీలక మలుపుల్లో ఒకటి.స్పైక్స్ కూడా తెలియని స్థాయి నుంచి ‘బరాముల్లా ఎక్స్ప్రెస్’గా..నబీ ప్రతిభను తొలిసారి గుర్తించింది కూడా జుబైర్ దారే. 14 ఏళ్ల వయసులో ప్రత్యర్థి జట్టు తరఫున ఆడుతున్న నబీను ఆయన చూశారు. ఓటమి ఎదురైనా బ్యాట్, బంతితో నబీ చూపిన తెగువ జుబైర్ను ఆకట్టుకుంది. నబీ ప్రతిభకు ముగ్ధుడైన జుబైర్.. బరాముల్లా క్లబ్లో చేరాలని ఆహ్వానించారు.అయితే అప్పట్లో నబీకు క్రికెట్లోని కనీస విషయాలు కూడా తెలీవు. శ్రీనగర్లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో తొలిసారి టర్ఫ్ వికెట్పై బౌలింగ్ చేసేందుకు దిగినప్పుడు అతడి కాళ్లు పాపింగ్ క్రీజ్ వద్ద జారిపోయాయి. పరుగెత్తుకుంటూ వచ్చి బంతి వేయాల్సిన బౌలర్.. పిచ్పై జారి పడిపోయాడు.అందుకు కారణం ఏంటంటే.. అతడు సాధారణ షూస్ వేసుకుని బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఫాస్ట్ బౌలింగ్కు స్పైక్స్ అవసరమని కూడా అతడికి తెలీదు.క్రికెట్ వ్యవస్థ గురించి అంతగా అవగాహన లేని నబీ మరోసారి తన అమాయకత్వంతో చిక్కుల్లో పడ్డాడు. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ రెండు వర్గాలుగా విడిపోయిన సమయంలో రెండు వర్గాలు నిర్వహించిన క్యాంపులకు ఒకే రోజు వెళ్లాడు. ఉదయం ఒక క్యాంప్లో బౌలింగ్ చేసిన అతడు.. అక్కడి అధికారి చెప్పడంతో మధ్యాహ్నం మరో వర్గం నిర్వహించిన క్యాంప్కు కూడా వెళ్లి బౌలింగ్ చేశాడు. దీని వల్ల అతడు కొద్ది రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతడికి అక్కడి రాజకీయాలు తెలియదు. అతడికి తెలిసింది ఒక్కటే.. బంతిని వేగంగా, సరిగ్గా వేయడం.ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో..నబీలో ఉన్న సహజమైన ప్రతిభకు సరైన మెరుగులు దిద్దింది మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ మార్గదర్శకత్వంలో నబీ బౌలింగ్లో అసలు మార్పు వచ్చింది. కేవలం వేగంతో బంతులు విసిరే పేసర్ నుంచి.. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల తెలివైన బౌలర్గా నబీ మారాడు. లైన్, లెంగ్త్పై పట్టు సాధించాడు.2018 సెప్టెంబర్లో విజయ్ హజారే ట్రోఫీతో లిస్ట్-ఏ అరంగేట్రం చేసిన నబీ.. 2020 జనవరిలో జార్ఖండ్పై ఫస్ట్క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఒడిశాపై ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఆ ప్రదర్శన జమ్మూకశ్మీర్ను క్వార్టర్ ఫైనల్స్కు చేర్చడంలో కీలకమైంది.44 వికెట్ల నుంచి డబుల్ హ్యాట్రిక్ వరకు..2024-25 రంజీ ట్రోఫీ నబీ కెరీర్లో కీలక మలుపు. ఆ సీజన్లో 44 వికెట్లతో దేశంలోనే అత్యధిక వికెట్లు తీసిన పేసర్గా నిలిచాడు. అతడి బౌలింగ్ సగటు కేవలం 13.93. అయితే అసలు సంచలనం 2025 ఆగస్టులో వచ్చింది.దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ తరఫున ఈస్ట్ జోన్పై ఆడుతున్నప్పుడు నబీ వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. అంటే డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. అప్పటికే ‘బరాముల్లా ఎక్స్ప్రెస్’ అనే పేరు దేశవ్యాప్తంగా మార్మోగడం మొదలైంది.ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 15 వికెట్లు తీసిన నబీ.. వైట్బాల్ క్రికెట్లోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు.ఐపీఎల్లో జాక్పాట్దీంతో ఐపీఎల్ వేలంలో అతడి కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు నబీను సొంతం చేసుకుంది. ఒకప్పుడు కొడుకు విమాన టికెట్ కోసం రూ.10,000 సమకూర్చేందుకు ఇబ్బంది పడిన నబీ తండ్రి, ఐపీఎల్ జాక్పాట్ చూసి మురిసిపోయాడు.జమ్మూకశ్మీర్కు తొలి రంజీ టైటిల్.. నబీదే కీలక పాత్ర2025-26 రంజీ ట్రోఫీ సీజన్ నబీ కెరీర్లోనే అత్యంత గొప్ప అధ్యాయం.జమ్మూకశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీ గెలవడంలో అతడి పేస్ బౌలింగే కీలకం. ఆ సీజన్లో అతడు కేవలం 17 ఇన్నింగ్స్ల్లో 60 వికెట్లు తీశాడు. 12.65 సగటున ఏకంగా ఎనిమిది సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు.ఇండియా-ఏ నుంచి టీమిండియా వరకు..దేశవాళీ క్రికెట్లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేయడంతో భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి.2026 మధ్యలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో నబీ చోటు దక్కించుకున్నాడు. రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీశాడు.అంతేకాదు.. భారత సీనియర్ జట్టుకు నెట్ బౌలర్గా కూడా వ్యవహరించాడు. జాతీయ సెలెక్టర్ల ముందు తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం అతడికి అక్కడే లభించింది. అయితే టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కుతుందని మాత్రం అతడు ఊహించి ఉండకపోవచ్చు.బుమ్రా గాయంతో తెరుచుకున్న తలుపుఆగస్టు 2026లో శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ముందు జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కూడా అందుబాటులో లేకపోవడంతో భారత జట్టుకు మరో పేసర్ అవసరమైంది. అప్పుడు సెలెక్టర్ల దృష్టి నబీపై పడింది.రెండు రంజీ సీజన్లలో ఏకంగా 104 వికెట్లు. 2025-26 సీజన్లో 60 వికెట్లు. రెడ్బాల్లో రెండు వైపులా బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం. అద్భుతమైన ఫామ్. ఈ గణాంకాలన్నీ నబీకు అనుకూలంగా నిలిచాయి. దీంతో అతడికి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది. -
ధోని కనుసన్నల్లో ట్రైనింగ్.. లంకను కుమ్మేస్తాడా?
శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్లో తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు వికెట్కీపర్ రిషబ్ పంత్. ఈ నేపథ్యంలోనే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కనుసన్నల్లో రాంచీలో ప్రత్యేక పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఈ సిరీస్ పంత్కు చాలా కీలకమని చెప్పొచ్చు. ఒక ఎండ్లో ధ్రువ్ జురెల్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వేళ లంక పర్యటనలో పంత్ రాణించాల్సిన అసవరముంది. అంతేకాదు మిడిలార్డర్లో బ్యాటింగ్లో పంత్ కీలకం కానున్నాడు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లంక పిచ్లపై రాణించాలని పంత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోని సూచనలు తీసుకునేందుకు పంత్ రాంచీ వెళ్లాడు. తాజాగా ధోని సలహాలు, సూచనలు తీసుకుంటున్న ఫొటోలను పంత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో ధోని, పంత్తో పాటు మాజీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ కూడా ఉన్నాడు. ట్రెయినింగ్లో భాగంగా స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి, వికెట్కీపింగ్ కండిషన్లు ఎలా ఉంటాయన్న దానిపై పంత్ ధోని నుంచి సలహాలు తీసుకున్నాడు. ఇక ధోని స్పిన్ బౌలింగ్ను అర్థం చేసుకోవడంలో మంచి నేర్పరి. ఇన్నేళ్ల తన అనుభవంలో ఉపఖండపు పిచ్లపై వికెట్ కీపింగ్ కండిషన్ను కూడా అంచనా వేయడంలో ధోని దిట్ట. మరి లంక పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ధోని ఇచ్చిన సలహాలతో పంత్ చెలరేగుతాడేమో చూడాలి. ఇటీవలే వైట్బాల్ క్రికెట్లోనూ తిరిగి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న పంత్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ను కలిసి సలహాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక గడ్డపై టీమిండియా రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనున్నాయి.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్) కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, అకీబ్ నబీ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. MS Dhoni sharing his experience with Rishabh Pant.💛 pic.twitter.com/uuvEOKfgT7— Cricket Central (@CricketCentrl) July 31, 2026Rishabh Pant taking a ride in Ranchi with Thala 🤩#Cricket #Dhoni pic.twitter.com/YtbFlCawol— CREX (@Crex_live) August 2, 2026 -
టీమిండియాకు మరో భారీ షాక్..!?
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు మరో భారీ షాక్ తగిలే అవకాశముంది. ఇప్పటికే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక టూర్కు దూరం కాగా.. ఇప్పుడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ అందుబాటుపై కూడా సందేహాలు నెలకొన్నాయి.స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ సందర్భంగా సుదర్శన్ కాలి బొటనవేలికి గాయమైంది. సుదర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్నాడు. శ్రీలంకతో సిరీస్ సమయానికి సుదర్శన్ పూర్తిగా కోలుకుంటాడని భావించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. భారత జట్టులో అతడికి చోటు కల్పించింది.అయితే సిరీస్కు ముందు అతడు తన ఫిట్నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు కండీషన్ పెట్టారు. కానీ సుదర్శన్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్ కోసం శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు మంగళవారం శ్రీలంకకు పయనం కానుంది.కానీ సుదర్శన్ మాత్రం భారత జట్టుతో కలిసి శ్రీలంకకు వెళ్లడం లేదని రేవ్స్పోర్ట్స్ తమ కథనంలో పేర్కొంది. సీవోఈ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లభించిన తర్వాతే అతడు కొలంబోలోని జట్టుతో కలిసే అవకాశం ఉందని రేవ్స్పోర్ట్స్ వెల్లడించింది. సుదర్శన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు. త్వరలోనే అతడికి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అతడు పాసైతేనే శ్రీలంక విమానం ఎక్కుతాడు. ఒకవేళ అతడు సిరీస్కు దూరమైతే తుది జట్టులో కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశం దక్కనుంది. ఇక ఈ రెండు మ్యాచ్ల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. అంతకంటే ముందు స్ధానిక జట్టుతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్లో భారత్ తలపడనుంది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
గంభీర్పై ఫిర్యాదు చేసిన సీనియర్ ప్లేయర్లు!
టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ వైఖరి పట్ల సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలకు వారు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ వైదొలిగిన సంగతి తెలిసిందే.ఘోర పరాభవాలుఈ క్రమంలో బీసీసీఐ ఏరికోరి గంభీర్తో ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసింది. అయితే, అతడి మార్గదర్శనంలో విజయాల మాట పక్కనపెడితే.. టీమిండియా ఇప్పటికే ఎన్నో ఘోర పరాభవాలు చవిచూసింది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డ మీదే న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో వైట్వాష్ అయింది.ఇటీవల టీ20 సిరీస్లో పసికూన ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ అయింది. అయితే, భారత జట్టు ఇలా అవమానకర రీతిలో పరాజయాల పాలైనప్పుడు గంభీర్.. ఆ తప్పును ఆటగాళ్లు లేదంటే సహాయక సిబ్బందిపై నెట్టేస్తున్నాడనే భావన జట్టు అంతర్గత సభ్యుల్లో నిండిపోయినట్లు సమాచారం.తప్పంతా మాపైనే నెట్టేస్తారా?ఏ ఒక్క ఓటమికి కూడా గంభీర్ జవాబుదారీగా ఉండకుండా తప్పంతా తమపైనే నెట్టేయడాన్ని కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అపెక్స్ సభ్యులకు వీరు అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు క్రిక్బ్లాగర్ పేర్కొంది.ఈ నేపథ్యంలో బీసీసీఐ పెద్దల్లో కొంతమంది గంభీర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇప్పటికీ అతడికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. టీమిండియా నాయకత్వ బృందం నిర్ణయాల్లో తలదూర్చడం సరైన పద్ధతి కాదనే యోచనలో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.అసంతృప్తి, సందేహాలుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు క్రిక్బ్లాగర్తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్ కోచింగ్ శైలి, అతడి తీరు పట్ల కొంతమంది సీనియర్ క్రికెటర్లు బీసీసీఐ అపెక్స్ మండలి వద్ద అసంతృప్తి, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, అనధికారికంగానే వారు ఈ ఫిర్యాదు చేశారు. కాబట్టి శ్రీలంక పర్యటన నేపథ్యంలో గంభీర్పై పెద్దలు దృష్టి సారించారు’’ అని పేర్కొన్నాయి.లంక టూర్లో రాణిస్తేనే..కాగా ఆగష్టు 15-28 మధ్య టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుండగా.. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయాల్సిందే. ఒకవేళ ఇక్కడ ప్రతికూల ఫలితం వస్తే గనుక గంభీర్ భవితవ్యం (టెస్టు కోచ్గా) ప్రశ్నార్థకంగా మారనుంది. గంభీర్ కోచ్గా వచ్చిన తర్వాతే తొలిసారి భారత్ కనీసం డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కూడా చేరకుండా నిష్క్రమించింది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
శ్రీలంక టూర్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్? జట్టుతో పాటు ఆ ముగ్గురు?
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్లో టీమిండియా మరో కీలక పోరుకు సన్నదమవుతోంది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత బృందం బుధవారం శ్రీలంకకు పయనం కానున్నట్లు తెలుస్తోంది.డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే గిల్ సేన ఈ సిరీస్లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. దీంతో పది రోజుల ముందే శ్రీలంకకు చేరుకుని భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. తొలుత ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మాప్ మ్యాచ్లో భారత్ తలపడనుంది.ఆ తర్వాత మన జట్టు ప్రత్యేక నెట్ సెషన్స్లో పాల్గోనుంది. ముఖ్యంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కోనేందుకు భారత బ్యాటర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించనున్నారు. లంక పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలించే అవకాశమున్నందన బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక పర్యటనకు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు తనుష్ కోటియన్,హర్ష్ దూబే, విప్రాజ్ నిగమ్లను నెట్బౌలర్లగా సెలక్టర్లు ఎంపిక చేశారు. జట్టుతో పాటు వీరు కూడా శ్రీలంకకు పయనమవుతారు. ఈ స్పిన్ త్రయం నెట్స్లో తమ సేవలను అందించనున్నారు. విదర్భకు చెందిన హర్ష్ దూబే ఇప్పటికే భారత సీనియర్ జట్టు తరపున వన్డే అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో దూబే ఆకట్టుకున్నాడు. కానీ మిగితా ఇద్దరు ఆటగాళ్లు విప్రజ్ నిగమ్, తనుష్ కోటియన్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. కానీ వారిద్దరికి రెడ్బాల్ క్రికెట్ ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది. విప్రజ్ ఈ ఏడాది జూన్లో 'ఇండియా-ఎ' తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లి అదరగొట్టాడు. ఆల్రౌండ్ షోతో ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. అదేవిధంగా ముంబైకి చెందిన తనుష్ గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు.గతేడాది ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనాధికారిక టెస్టు సిరీస్లో సైతం అతడు భారత-ఎ జట్టు తరపున అదరగొట్టాడు. దీంతో తనుష్ కూడా సెలక్టర్ల రాడార్లో ఉన్నాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రత్నామ్నాయంగా తనుష్ను జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కాగా ఈ పర్యటన వారి కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడనుంది.చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే? -
టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?
ఏషియన్ లెజెండ్స్ లీగ్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఇండియన్ రాయల్స్, శ్రీలంకన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ అసేల గుణరత్నే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.లోటస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. గుణరత్నే కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్లతో 98 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ తిషారా పెరీరా(30 బంతుల్లో 67) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో మన్ప్రీత్ గోనీ రెండు, ఈశ్వర్ పాండే, సుబోధ్ తలా వికెట్ సాధించారు. వీరు ముగ్గురు వికెట్లు సాధించినప్పటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.కాపాడిన వరుణుడుఅనంతరం 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే స్టార్ ఓపెనర్ అభిషేక్ జలోటా(0), కరణ్ గుప్తా(8) వికెట్లును భారత్ కోల్పోయింది. దీంతో ఇండియన్ రాయల్స్ జట్టు కేవలం 8 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ క్లిష్టసమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ వర్షం కురువడంతో ప్లేయర్లు డగౌట్స్కు పరిగెత్తారు. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఒకవేళ మ్యాచ్కు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరిగి ఉండంటే భారత జట్టు ఓడిపోయిండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా అంతకముందు మ్యాచ్లో పాకిస్తాన్పై భారత జట్టు ఘన విజయం సాధించింది. మొత్తంగా రెండు విజయాలతో ఇండియన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. -
బుమ్రా అవుట్.. రీప్లేస్మెంట్ ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో యాజమాన్యం అతడికి విశ్రాంతిని పొడగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ బుమ్రా స్థానంలో ఆకిబ్ నబీని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.అప్పుడు విమర్శలుజమ్మూ కశ్మీర్ ఎక్స్ప్రెస్గా పేరొందిన ఆకిబ్ నబీ.. గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గత రెండు ఎడిషన్లలో కలిపి మొత్తంగా 104 వికెట్లు కూల్చాడు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.దీంతో త్వరలోనే ఆకిబ్ నబీ టీమిండియాకు ఎంపికవుతాడని విశ్లేషకులు భావించారు. అయితే, స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టుకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. ఒకేసీజన్లో (2025-26) 60కి పైగా వికెట్లు తీసినప్పటికీ అతడిని పక్కనపెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.PC: BCCI Xబుమ్రా గాయం.. నబీకి అదృష్టంఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో భారత్-ఎ తరఫునా ఆకిబ్ నబీ సత్తా చాటాడు. మొత్తంగా ఆరు వికెట్లు కూల్చాడు. కాగా ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా ఎడమ మోకాలికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే, లంకతో టెస్టు సిరీస్ నాటికి అతడు కోలుకుంటాడని సెలక్టర్లు భావించారు.కానీ బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. దీంతో సెలక్టర్లు ఆకిబ్ నబీకి మార్గం సుగమం చేశారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భారత్ ఫైనల్ రేసులో ఉండాలంటే శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయక తప్పని పరిస్థితి. ఇలాంటి కీలక సిరీస్కు అనుభవజ్ఞుడైన బుమ్రా దూరం కాగా.. ఆకిబ్ నబీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. అయితే, తుదిజట్టులో అతడిని ఆడిస్తారో లేదో చూడాలి! కాగా ఆగష్టు 15- 28 మధ్య శ్రీలంక- టీమిండియా మధ్య రెండు టెస్టు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (ఫిట్నెస్ ఆధారంగా), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ.చదవండి: గిల్, అభిషేక్ శర్మ కీలక నిర్ణయం! -
బుమ్రా స్థానంలో సంచలన ఫాస్ట్ బౌలర్..?
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్ బౌలర్, జమ్మూ అండ్ కశ్మీర్ ఎక్స్ప్రెస్గా పేరున్న ఆకిబ్ నబీ దార్ పేరు తెరపైకి వచ్చింది.బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపుగా ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నబీకి దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2025-26 రంజీ ట్రోఫీలో అతడు 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసుకుని టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలోనూ నబీ కీలక పాత్ర పోషించాడు.ఓవరాల్గా అతడి ఫస్ట్క్లాస్ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది.* మ్యాచ్లు: 43* వికెట్లు: 162* బౌలింగ్ సగటు: 18.63* 5 వికెట్ల ప్రదర్శనలు: 16* 10 వికెట్ల ప్రదర్శనలు: 4* అత్యుత్తమ బౌలింగ్: 7/24శ్రీలంకలోనూ సత్తా నబీఇటీవల భారత్-A జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లిన నబీ, శ్రీలంక-Aతో జరిగిన రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు ఇన్నింగ్స్లలో 6 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 4/58తో ఆకట్టుకున్నాడు.ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నబీకి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టులో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో అతడి నిలకడైన ప్రదర్శన, శ్రీలంక పరిస్థితులపై ఇటీవల వచ్చిన అనుభవం అతడికి కలిసొచ్చే అవకాశముంది.ఇదిలా ఉంటే, ఎడమ మోకాలి అసౌకర్యం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తొందరపెట్టకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. బుమ్రా ప్రత్యామ్నాయాన్ని సెలెక్టర్లు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
టీమిండియాకు భారీ షాక్
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని సమాచారం.బుమ్రా ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మోకాలిలో మరోసారి అసౌకర్యం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.గాయం పూర్తిగా తగ్గకముందే బుమ్రాను బరిలోకి దింపితే సమస్య మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిని తొందరపెట్టకుండా విశ్రాంతి, పునరావాసానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.ప్రత్యామ్నాయంపై ఇంకా స్పష్టత లేదుబుమ్రా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు బుమ్రా గైర్హాజరీపై అధికారికంగా స్పందించలేదు.శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కానుండటంతో, బుమ్రా లేకపోవడం భారత పేస్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. -
WTC ఫైనల్ రేసు: గంభీర్కు మరో అగ్నిపరీక్ష!
వరుస వైట్ బాల్ సిరీస్ల అనంతరం టీమిండియా మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ (టెస్ట్ క్రికెట్)లో తలపడేందుకు సిద్ధమైంది. శబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం ఒకట్రెండు రోజుల్లో శ్రీలంకకు పయనం కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే 'వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్' ఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఈసిరీస్ చాలా కీలకం. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా ఐదవ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో ఇంకా భారత్ ఇంకా తొమ్మిది టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 7 నుంచి 8 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టీమిండియా ఫైనల్కు అర్హత సాధిస్తోంది. దీంతో శ్రీలంకతో జరగనున్న సిరీస్లో గిల్ సేన ఎలా రాణిస్తుందో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.గంభీర్కు మరో అగ్ని పరీక్షహెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ భారత్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2026 వంటి ఐసీసీ ట్రోఫీలు అందించినప్పటికి.. టెస్టు క్రికెట్లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అతడి హయంలోనే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి జట్ల చేతిలో వరుస సిరీస్లను టీమిండియా కోల్పోయింది. దీంతో అతడిని కోచ్గా తప్పించాలని చాలా మంది డిమాండ్ చేశారు. కానీ భారత క్రికెట్ బోర్డు మాత్రం అతడిపై నమ్మకం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గంభీర్ నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా కీలక వ్యాఖ్యలు చేశాడు."జట్టు సరిగ్గా రాణించనప్పుడు మేనెజ్మెంట్(కోచ్లు), కెప్టెన్పై ప్రశ్నలు రావడం సహజం. ముఖ్యంగా సొంతగడ్డపై, విదేశీ పర్యటనల్లో సిరీస్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి విపరీతంగా పెరిగింది. 2011-12 తర్వాత తొలిసారి న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయాం. అప్పటి నుంచి ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. వైట్బాల్ క్రికెట్తో పోలిస్తే టెస్టుల్లో మన జట్టు తడబడుతోంది. అయితే ఈ ఒత్తిడి నుంచి ఎలా కోలుకోవాలో గంభీర్ నేతృత్వంలోని టీమిండియాకు తెలుసు. ఏదేమైనప్పటికి శ్రీలంక టూర్లో భారత్కు కఠిన సవాల్ ఎదురయ్యే అవకాశముందని" దాస్గుప్తా పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో టెస్ట్ల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. ఈ రెండు సిరీస్లో భారత జట్టుకు కచ్చితంగా ప్రత్యర్ధి నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. -
మంచి సెలక్షన్.. సుందర్ కంటే అతడు బెటర్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంక పర్యటనలో భారత్కు కచ్చితంగా ఆఫ్ స్పిన్నర్ అవసరం ఉంటుందని.. ఈ విషయంలో సెలక్టర్లు మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించాడు.కాగా ఆగష్టు 15 నుంచి భారత్- శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచటెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్లో విజయం భారత్కు అతిముఖ్యమైనది. లంకను వైట్వాష్ చేస్తేనే టీమిండియా ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం ఈ నేపథ్యంలో ఇప్పటికే శుబ్మన్ గిల్ సారథ్యంలో టెస్టు జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు.. తొలిసారిగా 33 ఏళ్ల సారాంశ్ జైన్కు జాతీయ జట్టులో చోటిచ్చారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడగా.. అతడి స్థానంలో సారాంశ్ను ఎంపిక చేశారు.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సారాంశ్ ఎంపిక ఉత్తమమైన నిర్ణయం అని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘శ్రీలంక జట్టులో ప్రస్తుతం ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి నిఖార్సైన ఆఫ్ స్పిన్నర్ అవసరం టీమిండియాకు ఉంది.మంచి సెలక్షన్వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేడు కాబట్టి సారాంశ్ జైన్కు అవకాశం వచ్చింది. నిజానికి సుందర్ కంటే సారాంశ్ బెటర్ బౌలర్. వాషీ మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడేమోగానీ.. సారాంశ్ మాత్రం అతడి కంటే బౌలింగ్లో మెరుగ్గా రాణించగలడు.సారాంశ్లో ఆ ప్రతిభ ఉంది. ఇప్పటికైనా అతడిని సెలక్టర్లు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో గత కొన్నేళ్లుగా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెడ్బాల్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. అతడు ఓల్డ్ స్కూల్ స్పిన్నర్.అతడి బౌలింగ్లో పెద్దగా వైవిధ్యం ఉండదు. అయితే, నిలకడగా బౌలింగ్ చేస్తూ ఒకే చోట బంతులు విసురుతూ బ్యాటర్లను తికమకపెట్టగలడు. రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్ మాదిరి నైపుణ్యాలు అతడిలో ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి సెలక్షన్’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.చదవండి: గోల్డ్ మెడల్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’! -
భారత్-శ్రీలంక సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్
టీమిండియా శ్రీలంక పర్యటనకు సంబంధించి ఓ అప్డేట్ అందుతోంది. ఈ పర్యటనలో భారత్ ముందుగా ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్, ఆతర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. వార్మప్ మ్యాచ్ వ్యవధిని నాలుగు నుంచి మూడు రోజులకు తగ్గించారు. అప్డేట్ తర్వాత వార్మప్ మ్యాచ్ ఆగస్టు 7న ప్రారంభమై, ఆగస్టు 9న ముగియనుంది. ఈ మ్యాచ్ కొలంబోలోని NCC గ్రౌండ్లో జరుగనుంది. వార్మప్ మ్యాచ్ను ఒక రోజుకు కుదించడానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. ఈ మ్యాచ్కు సంబంధించి మరో కీలక విషయం ఏంటంటే, ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా, శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. మూడు రోజుల వార్మప్ మ్యాచ్ అనంతరం గాలేకు వెళ్లనుంది.తొలి టెస్టు ఆగస్టు 15న గాలేలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలోని SSC మైదానంలో జరగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లో భాగంగా జరుగనుంది.గుడ్ న్యూస్లంక సిరీస్కు ఫిట్నెస్ ఆధారంగా జట్టులోకి ఎంపికైన సాయి సుదర్శన్ కోలుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. బొటనవేలికి స్వల్ప గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్న అతను ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.అదేవిధంగా మోకాలి సమస్య కారణంగా షరతులతో ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే దిశగా ఉన్నట్లు సమాచారం. సిరీస్ ప్రారంభానికి ముందే ఇద్దరూ అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్
ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్-2026లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో యార్క్షైర్ క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్.. ప్రతీ మ్యాచ్లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా డర్హామ్తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్లో అతడు మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, డర్హామ్ లెజెండ్ బెన్ స్టోక్స్ను కుల్దీప్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఈ భారత స్టార్ స్పిన్నర్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి స్టోక్స్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్లోనే రివర్స్ స్వీప్ షాట్కు ప్రయత్నించి స్టోక్స్ ఔటయ్యాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్వర్డ్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న జార్జ్ హిల్ చేతిలోకి వెళ్లింది. స్టోక్స్ 39 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. స్టోక్స్ ఔటైన తర్వాత డర్హామ్ వికెట్ల పతనం మొదలైంది. 48.1 ఓవర్లలో కేవలం 165 పరుగులకే డర్హామ్ కుప్పకూలింది. యార్క్షైర్ బౌలర్లలో బెంజమిన్ క్లిఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్తో పాటు డొమానిక్ బీస్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఈ లక్ష్యాన్ని యార్క్షైర్ 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. జేమ్స్ వార్టన్(68 నాటౌట్), వైట్మాన్(52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ఫినిష్ చేశారు.కాగా కుల్దీప్ ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్ ఆడి అతడు తిరిగి భారత్కు పయనం కానున్నాడు. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ సభ్యునిగా ఉన్నాడు. -
టీమిండియాకు శుభవార్త
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. లంక పర్యటనకు అతడు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారి ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.పీటీఐతో సదరు అధికారి మాట్లాడుతూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాడు. శ్రీలంకతో రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. జట్టు ప్రణాళికల్లో భాగంగా అతడు రెండు మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. కీలక సిరీస్..కాగా ఆగష్టు 15 నుంచి 27 మధ్య టీమిండియా శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ప్రపంచకప్ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఈ సిరీస్ భాగం. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే.. మిగిలి ఉన్న తొమ్మిది టెస్టుల్లో కచ్చితంగా ఏడు విజయాలు సాధించాలి.ఈ నేపథ్యంలో శ్రీలంకను 2-0తో వైట్వాష్ చేయడం టీమిండియా ప్రస్తుత ప్రధాన లక్ష్యంగా మారింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో తలపడాల్సి ఉంది కాబట్టి లంక గడ్డ మీద విజయాలు సాధిస్తే ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఇలాంటి కీలక సిరీస్లో ప్రధాన బుమ్రా ఫిట్నెస్ ఆధారంగా ఆడతాడని బీసీసీఐ తొలుత తెలిపింది.గాయాల బెడదఇక ఇప్పటికే యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి గాయాల వల్ల జట్టుకు దూరం కాగా.. వాషింగ్టన్ సుందర్ ఇంకా కోలుకోని కారణంగా శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. కాగా బుమ్రా సైతం మోకాలి గాయం వల్ల ఇంగ్లండ్తో ఆఖరిదైన మూడో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకోవడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది.శ్రీలంకతో టెస్టు సిరీస్కు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్దత్ పడిక్కల్, సారాంశ్ జైన్.చదవండి: ఇదేం బ్యాటింగ్ బ్రో! -
బుమ్రాపై ఆసీస్ దిగ్గజం మెగ్రాత్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా పేస్ దళ నాయకుడిగా సేవలు అందిస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఫిట్నెస్ సమస్యలు, గాయాల వల్ల అతడు జట్టుకు తరచూ దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం సైతం బుమ్రా పనిభారాన్ని తగ్గించేక్రమంలో విశ్రాంతినిస్తూ.. అతడిని కాపాడుకుంటూ వస్తోంది.మోకాలి గాయంఇక చాన్నాళ్ల తర్వాత ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. రెండు మ్యాచ్లు ఆడగానే గాయపడ్డాడు. మోకాలి గాయం కారణంగా లార్డ్స్లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా.. సిరీస్ను ఇంగ్లండ్కు 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో ఆగష్టులో జరిగే టెస్టు సిరీస్కు బుమ్రాను ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే అతడు జట్టుతో చేరతాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెగ్రాత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.బుమ్రా వయసెంత?‘‘ప్రస్తుతం బుమ్రా వయసెంత? 31-32 సంవత్సరాల మధ్య ఉంటుంది కదా!.. అతడు ఇప్పటికీ యువకుడే. కాబట్టి తన కెరీర్లో ఎలా ఉండాలో అతడే నిర్ణయించుకోవాలి. కెరీర్ను పొడిగించుకునే మార్గాల్ని బుమ్రా స్వయంగా అన్వేషించుకోవాలి.అతడొక అద్భుతమైన నైపుణ్యాలున్న క్లాస్ బౌలర్. అయితే, దురదృష్టవశాత్తూ తరచూ గాయపడుతున్నాడు. టెస్టు క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టాలా.. లేదంటే కేవలం టీ20 ఫార్మాట్లోనే ఆడాలా? అన్న విషయంలో అతడు నిర్ణయం తీసుకోవాలి.కాలమే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుందిశరీరం సహకరించే, ప్రతిస్పందించే విధానంపైనే అతడు తనకు నప్పే ఫార్మాట్ను ఎంచుకోవాలి. బుమ్రా మాదిరి శైలి ఉన్న ఆటగాళ్లు బౌలింగ్ చేసే క్రమంలో తన జాయింట్లపై ఎక్కువగా ఒత్తిడిపెడతారు. శరీరం సహకరిస్తేనే అతడు ముందుకు సాగగలడు. కాబట్టి కాలమే అతడి భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అని మెగ్రాత్ అన్నాడు.విశ్రాంతికి బదులుఅదే విధంగా.. గాయాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఫాస్ట్బౌలర్లకే ఉంటుందన్న మెగ్రాత్.. వారికి తరచూ విశ్రాంతినివ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం చేకూరదన్నాడు. అందుకు బదులు ఫాస్ట్బౌలర్గా తమ పాత్ర ఏమిటి? అన్న అంశంపై స్పష్టతనిచ్చి.. ఒత్తిడిని జయించి శారీరంగా మరింత దృఢంగా వారిని తయారు చేయడమే ఇందుకు పరిష్కారం అని పేర్కొన్నాడు. -
IND vs SL: అతడిని ఎలా ఎంపిక చేశారు: డివిలియర్స్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంకతో టెస్టులకు రిషభ్ పంత్ను ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. కాగా ఆగష్టు 15 నుంచి 27 వరకు భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించింది. శుబ్మన్ గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తొలిసారి సారాంశ్ జైన్ చోటు దక్కించుకున్నాడు.పంత్తో పాటు జురెల్..ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టుల్లో పునరాగమనం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ పంత్ ఎంపికను ప్రశ్నించాడు.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ మేరకు.. ‘‘శ్రీలంకతో టెస్టు సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడి ఫిట్నెస్ ఎలా ఉందో తెలిసిందే. అంతేకాదు.. అతడికి జట్టు తరఫున రాణించాలన్న కోరిక కూడా ఉందో లేదో చెప్పలేము.ఐపీఎల్లో అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బాగా కుంగిపోయినట్లు అనిపించింది. అయితే, దేశం తరఫున ఆడినప్పుడు పంత్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా. శ్రీలంకలో అతడు దూకుడుగా, తనదైన శైలిలో రాణిస్తాడనే ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.జడ్డూ రీఎంట్రీ సంతోషంఅదే విధంగా.. ‘‘రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో అతడు జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంది.ఇక బుమ్రా పూర్తి ఫిట్గా మారితే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అతడు జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థులకు వణుకే. బుమ్రా ఒక క్లాస్ ప్లేయర్’’ అని డివిలియర్స్ కొనియాడాడు. కాగా టీమిండియా చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు ఆడింది.ఐపీఎల్లో పంత్ విఫలంఈ మ్యాచ్ నుంచి జడేజా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ మ్యాచ్లో రిషభ్ పంత్ 104 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో పదమూడు ఫోర్లు ఉండటం విశేషం. అయితే, అంతకుముందు ఐపీఎల్-2026లో మాత్రం పంత్ పూర్తిగా నిరాశపరిచాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, బ్యాటర్గా పంత్ విఫలమయ్యాడు. కేవలం 312 పరుగులు చేసిన పంత్ సారథ్యంలో లక్నో ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. గతేడాది 269 పరుగులు చేసిన పంత్ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ పరిణామాల నేపథ్యలో 2027 సీజన్కు ముందే పంత్ లక్నోను వీడి ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్కు 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్ను ఎంపిక చేసి సెలక్టర్లు అందరని ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్గా లేకపోవడంతో జైన్కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన సారాన్ష్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అఫ్గాన్తో ఏకైక టెస్ట్కు దూరంగా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్లను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. అన్క్యాప్డ్స్ ఆటగాడు సారాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశముందని అశ్విన్ తెలిపాడు."ప్లేయింగ్ ఎలెవన్లో రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్కు కూడా అవకాశమివ్వాలి. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. శ్రీలంక పిచ్లు ఎక్కువగా స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సారాన్ష్ జైన్ను కూడా ఆడిస్తే బెటర్. అతడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపాలి. ఎప్పటిలాగే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ ఉంటారు. మూడువ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్కు ఛాన్స్ దక్కనుంది. సాయి ఫిట్నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శుబ్మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్కు వస్తారు. ఆరో స్ధానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, మహ్మద్ సిరాజ్లను తీసుకోవాలి. బుమ్రా ఫిట్గా లేకపోతే ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని" తన య్యూటూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అశ్విన్ అంచనా వేసిన భారత తుది జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, సరాన్ష్ జైన్.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్. -
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ సారాన్ష్ జైన్ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్ల్లో మధ్యప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్కు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్బాల్ సిరీస్కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్రెడ్డి, వాషింగ్టన్ సుందర్లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్లో కోహ్లి, అశ్విన్తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్లో ఆతిథ్య లంక జట్టును వైట్వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్ను రోహిత్కు జతగా పంపాలి’ -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లంక పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా మెకాలి గాయానికి గురయ్యాడు.దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ప్రముఖ స్పోర్ట్స్ రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందంట. ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతడి ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్కు బుమ్రా దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్కు భారీ షాక్ అనే చెప్పాలి.ఎందుకంటే లంకతో టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో జరిగింది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇక ఈ సిరీస్కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడు తొలి టెస్ట్కు కాకపోయిన రెండో టెస్టులోనైన ఆడే అవకాశముంది. -
నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి బిగ్ న్యూస్..!
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు అతను దూరమయ్యే అవకాశమున్నట్లు నివేదికలు వెల్లడించాయి.నితీశ్ ప్రస్తుతం ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్ట్యా బీసీసీఐ అతడిని టెస్టు క్రికెట్లో తొందరగా బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి వన్డే సందర్భంగా బౌలింగ్ చేస్తూ నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చిన జట్టు యాజమాన్యం, మూడో వన్డేలో మళ్లీ ఆడించగా గాయం మరింత తీవ్రతరమైంది.క్రిక్బజ్ కథనం ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది మీడియా కథనాల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.కాగా, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటింనుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబో వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
టీమిండియాతో టెస్ట్ సిరీస్.. శ్రీలంకకు భారీ షాక్
స్వదేశంలో టీమిండియాతో టెస్ట్ సిరీస్కు ముందు శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్ గాయం కారణంగా భారత్తో టెస్టులకు దూరమయ్యే అవకాశముంది. లంకా ప్రీమియర్ లీగ్ 2026లో కొలంబో కాప్స్కు సారథ్యం వహిస్తున్న మెండిస్.. గాలే గాలంటట్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. పరుగు తీసే క్రమంలో అతడి కుడి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు. అనంతరం పరిగెత్తలేక రనౌట్ రూపంలో మెండిస్ ఔటయ్యాడు. తర్వాత అతడిని అస్పత్రికి తరలించి స్కాన్లు నిర్వహించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది.దీంతో కుశాల్ లంకా ప్రీమియర్ లీగ్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. అతడు తిరిగి కోలుకునేందుకు నేషనల్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్కు వెళ్లనున్నాడు. కాగా భారత్-శ్రీలంక మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ సమయానికి కుశాల్ కోలుకుంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ అతడు దూరమైతే ఇది లంకేయులకు భారీ షాక్ అనే చెప్పాలి. కుశాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడు అదరగొడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. -
అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ ప్రారంభానికి ముందు బీసీసీఐని ఒక అంశం తెగ కలవరపెడుతోంది. అదేంటంటే కండరాల గాయంతో బాధపడుతున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్కు సంబంధించి తుది జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ అతడి గాయం తీవ్రత చాలా ఎక్కువగానే ఉండడంతో ఫిట్నెస్పై స్పష్టత రావడం లేదు. అందుకే శ్రీలంకతో టెస్టు సిరీస్కు జట్టు ప్రకటనను బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టెస్టు సిరీస్ ప్రారంభానికి మరో మూడు వారాలు మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ వారం చివర్లో లేదా వచ్చే సోమవారం నాటికి జట్టును ప్రకటించాలని బీసీసీఐ భావిస్తోంది.వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. కండరాల గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 గాయంగా పరిగనణించే అవకాశాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంటుంది. దీంతో సుందర్ గాయంపై పూర్తి నివేదిక వచ్చాకే జట్టును ప్రకటించాలనుకుంటున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా సుందర్ కండరాల గాయానికి గురవ్వడంతో ఆ మ్యాచ్లో బౌలింగ్కు కూడా దూరంగా ఉన్నాడు.ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. టెస్టు సిరీస్ కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇరుజట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు రెండో టెస్టు జరగనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తున్న ఇరుజట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. తొమ్మిది మ్యాచ్ల తర్వాత భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు టాప్-2లో కొనసాగుతున్నాయి. ఇక 2017 తర్వాత శ్రీలంకలో భారత్ టెస్టు సిరీస్ ఆడడం ఇదే. 2017లో కోహ్లి కెప్టెన్సీలో లంకలో పర్యటించిన టీమిండియా 3-0 తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్రీలంక మాత్రం తాము ఆడిన చివరి టెస్టు సిరీస్ను వెస్టిండీస్కు 2-0తో కోల్పోయింది.చదవండి: ‘నిజమే సైకోలా ప్రవర్తించాడు కానీ శిక్షించొద్దు’ -
లంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి ఆ ఇద్దరు!
ఐపీఎల్ తర్వాత వరుసగా వన్డే, టీ20 సిరీస్లతో బిజీగా గడిపిన టీమిండియా వచ్చే నెలలో శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ వారంలో టెస్టు సిరీస్కు సంబంధించి భారత జట్టును ప్రకటించే అవకాశముంది. కాగా సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు టెస్టు జట్టులోకి తిరిగి రానున్నారు. వీరితో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ, కుల్దీప్ యాదవ్ పేర్లు కూడా పరిగణలో ఉన్నాయి. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ నుంచి వైదొలిగిన వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమాంగానే ఉంది. అయితే గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి లేదా సారాన్ష్ జైన్లో ఒకరు ఈ సిరీస్కు ఎంపికయ్యే అవకాశముంది. ఇక బుమ్రా, జడేజాలు తమ చివరి టెస్టు మ్యాచ్ను 2025 నవంబర్లో సౌతాఫ్రికాతో ఆడారు.గిల్ సారథ్యంలోని టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలకు టెస్టు సిరీస్లను కోల్పోయింది. ఆఫ్గన్తో జరిగిన ఏకైక టెస్టులో మాత్రం భారీ విజయం సాధించడం ఊరట కలిగించింది. అయితే సొంతగడ్డపై ఎదురైన పరాభవాలను మరిచిపోయేందుకు లంకతో టెస్టు సిరీస్లో రాణించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు శ్రీలంక-ఏ జట్టుతో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగ2ఆ, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్లో ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. 🚨 GOOD NEWS FOR TEAM INDIA 🇮🇳Jasprit Bumrah & Ravindra Jadeja set to play in the Test series vs Sri Lanka. [Sahil Malhotra from TOI]Test squad will be announced this week. pic.twitter.com/kAJ3m0tBqj— Johns. (@CricCrazyJohns) July 21, 2026Read: కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు -
IND vs SL: టెస్టు సిరీస్ నుంచి కీలక ప్లేయర్ అవుట్!
టీమిండియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ పాతుమ్ నిసాంక ఈ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. కాగా టీమిండియా వచ్చే నెల (ఆగష్టు)లో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడనుంది. గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా... 23 నుంచి కొలంబోలో రెండో మ్యాచ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రీలంక వెస్టిండీస్ పర్యటనలో ఉంది. తొలి టెస్టులో ఆతిథ్య జట్టు చేతిలో 217 పరుగులతో ఓటమిపాలైన లంక.. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్ 1-1తో సమం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.లంక ప్రీమియర్ లీగ్ నుంచి అవుట్అయితే, ఓపెనర్ పాతుమ్ నిసాంక మణికట్టు గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూలై 17 నుంచి మొదలుకానున్న లంక ప్రీమియర్ లీగ్-2026 నుంచి నిసాంక వైదొలిగాడు. ఈ లీగ్ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుంది.నిలకడగా ఆడుతూ..కాబట్టి పాతుమ్ నిసాంక టీమిండియాతో సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. గతేడాది కాలంగా నిసాంక టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 2025లో అతడు సగటు 56తో 393 పరుగులు రాబట్టాడు.ఇప్పటికి మొత్తంగా 33 ఇన్నింగ్స్లో కలిపి 1310 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు ఉన్నాయి. సొంతగడ్డపై ఆడిన 18 ఇన్నింగ్స్లో అతడు రెండు శతకాల సాయంతో 725 పరుగులు చేయడం విశేషం. ఇలా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న నిసాంక.. టీమిండియాతో సిరీస్కు దూరం కావడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బలాంటిదే. కాగా విండీస్తో తొలి టెస్టులో గాయం కారణంగా ఇబ్బంది పడిన నిసాంక రెండు ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు పరుగులే చేసి నిష్క్రమించాడు.చివరిసారి వైట్వాష్ఇదిలా ఉంటే..టీమిండియా చివరిసారి 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 3–0తో వైట్వాష్ చేసింది. ఇక 2008 నుంచి లంక గడ్డపై టెస్టు సిరీస్ ఓడని టీమిండియా... అదే ఆధిపత్యం కొనసాగిస్తుందా చూడాలి.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27లో భాగంగా ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన శుబ్మన్ గిల్ సేన... 4 విజయాలు, 4 పరాజయాలు, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చరిత్ర సృష్టించిన రొనాల్డో! -
శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ విడుదల
ఇంగ్లండ్తో టీ20, వన్డేల సిరీస్ అనంతరం భారత పురుషల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ఈ సిరీస్లోని మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదేవిధంగా రెండో టెస్టు మ్యాచ్( ఆగస్టు 23 నుండి 27)కు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగంగా జరగనుంది.లంకతో సిరీస్ భారత్కు చాలా కీలకం. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టీమిండియా ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్లు ఆడగా, కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో(48.15 పీసీటీ) ఐదవ స్ధానంలో నిలిచింది.డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను గిల్ సేన సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక గడ్డపై ఖచ్చితంగా గెలవాల్సిందే. అయితే లంకేయులను వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. శ్రీలంక జట్టు గత కొంత కాలంగా సొంత గడ్డపై అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.ఈ దశాబ్దంలో ఆడిన 21 టెస్ట్ మ్యాచ్లలో 11 విజయాలను శ్రీలంక నమోదు చేసింది. కాగా 2017 తర్వాత భారత్ టెస్టుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పట్లో విరాట్ సారథ్యంలో భారత్ 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. -
చివరి నిమిషంలో భారత టీ20 సిరీస్ రద్దు..?
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్ట్లో జరగాల్సి ఉన్న టీ20 సిరీస్పై అనిశ్చితి నెలకొంది. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సిరీస్ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్ల పనిభారం, భవిష్యత్ టోర్నీల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి భారత ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో ఈ సిరీస్ లేదు. అయితే లంక బోర్డు అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇంకా అధికారిక షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఈ లోపే బిజీ షెడ్యూల్ దృష్ట్యా బీసీసీఐ ఈ సిరీస్ను డిస్మిస్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ సిరీస్కు ఓ ప్రత్యేకత ఉంది. గతేడాది నవంబర్లో శ్రీలంకను తీవ్రంగా ప్రభావితం చేసిన ‘సైక్లోన్ డిట్వా’ బాధితుల సహాయార్థం ఈ సిరీస్ను నిర్వహించాలని అనుకున్నారు. ఈ సిరీస్కు కేవలం క్రికెట్ పరమైన ప్రాధాన్యమే కాకుండా మానవతా కోణం కూడా ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం నెరవేరేలా లేదు.టీ20 సిరీస్పై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ఆగస్ట్లోనే ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ మాత్రం యథావిధిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి 27 వరకు జరగనున్న ఈ టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2025-27)లో భాగంగా జరుగనున్నాయి. -
వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చేసిన ఇండియా 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బాస్ బేబీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ.. 10 ఫోర్లు, 8 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ(67), రుతురాజ్ గైక్వాడ్(40), అనుకుల్ రాయ్(15 బంతుల్లో 39), ప్రియాన్ష్ ఆర్య(39) రాణించారు. లంక బౌలర్లలో వనజా సహాన్, కుగదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టును భారత పేసర్ యశ్ ఠాకూర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్లో సదీర సమరవిక్రమ (52), సహన్ అరచ్చిగే(38) నిలకడగా ఆడడంతో లంక తిరిగి గేమ్లోకి వచ్చింది. రన్ రేట్ ఒత్తిడి పెరగడంతో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆఖరిలో వనుజ సహన్ (62) దూకుడుగా ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో 47.1 ఓవర్లలో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. రత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు అనుకుల్ రాయ్ రెండు, తిలక్ వర్మ, ఆశోక్ శర్మ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs IRE: టీమిండియాకు భారీ షాక్ -
IND vs SL : గ్రౌండ్లోనే కొట్టుకున్న ఇండియా, శ్రీలంక
-
భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు
శ్రీలంక పర్యటనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అండర్-19 జట్టును ప్రకటించింది. యశ్వర్దన్ సింగ్ చౌహాన్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది. కాగా ఈ పర్యటనలో భాగంగా భారత అండర్-19 జట్టు ఆతిథ్య లంకతో వన్డే, ఫోర్-డే మ్యాచ్లు ఆడనుంది.ఇక ఈ జట్టులో టీమిండియా దిగ్గజం, మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ (Anvay Dravid)కు కూడా చోటు దక్కింది. వన్డే జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లలో ఒకడిగా పదహారేళ్ల అన్వయ్కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.కొత్త జట్టుబీసీసీఐ జూనియర్ క్రికెట్ కమిటీ పంథా మార్చింది. అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఒక్క ఆటగాడిని కూడా తాజా టూర్కు ఎంపిక చేయలేదు. ఈ పర్యటనతో యశ్వర్దన్ సారథ్యంలో కొత్త జట్టును తీర్చిదిద్దే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ జట్టులో ఆల్రౌండర్లకే సెలక్టర్లు పెద్దపీట వేశారు.మరోసారి అన్వయ్కు చోటుగతేడాది నవంబరులో చివరగా అన్వయ్ ద్రవిడ్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్ అండర్-19 జట్టుతో ఆడిన భారత్- ‘బి’ జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.బెంగళూరు వేదికగా ఈ సిరీస్లో ఏకైక మ్యాచ్ ఆడిన అన్వయ్.. అఫ్గన్ బౌలర్ నజీఫుల్లా అమిరి బౌలింగ్లో తొలి బంతికే అవుటై వెనుదిరిగాడు. అయితే, దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు సెలక్టర్లు తాజాగా మరోసారి అవకాశం ఇచ్చారు.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 వన్డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్ధన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), వినీత్ వీకే, అర్జున్ రాజ్పుత్, కుషాగ్రా ఓజా, రజత్ బఘెల్ (వికెట్ కీపర్), అన్వయ్ ద్రవిడ్ (వికెట్ కీపర్), అన్మోల్జీత్ సింగ్, వూట్కూరి యశ్వీర్ గౌడ్, రోహిత్ అనిల్ యాదవ్, శవిన్ వి, కావ్యా పరేశ్ పటేల్, మోహిత్ ఉల్వా. ఇషాన్ సూద్.శ్రీలంక పర్యటనకు భారత మెన్స్ అండర్-19 మల్టీ-డే జట్టుసాగర్ విర్క్, లక్ష్య రాయచందాని (వైస్ కెప్టెన్), యశ్వర్దన్ సింగ్ చౌహాన్ (కెప్టెన్), పటేల్ కుష్, మనల్ చౌహాన్, కుషాగ్రా ఓజా, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), ఆర్యన్ సందేశ్ సక్పాల్ (వికెట్ కీపర్), హేమ్చుదేశన్ జె, బికె కిషోర్, రోహిత్ అనిల్ యాదవ్, కావ్య పరేష్ సింగ్ పటేల్, ప్రియాన్షు సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట.భారత్ అండర్-19 వర్సెస్ శ్రీలంక అండర్-19 షెడ్యూల్ (మూడు వన్డేలు, రెండు యూత్ టెస్టులు)👉హంబన్టోటా వేదికగా మూడు వన్డేలు👉జూలై 4, జూలై 6, జూలై 9 తేదీల్లో వన్డేల నిర్వహణ👉గాలే వేదికగా జూలై 13-16 మధ్య మొదటి యూత్ టెస్టు👉కొలంబో వేదికగా జూలై 20-23 మధ్య రెండో యూత్ టెస్టు.చదవండి: వైభవ్ ధనాధన్.. భారత్ భారీ స్కోరు -
భారత జట్టు ప్రకటన.. 16 ఏళ్ల యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో శ్రీలంక అండర్-19తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం భారత అండర్-19 మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. గతేడాది కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను గెలిచిన జట్టులో సభ్యురాలి ఉన్న భవిక అహిరేను కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. వన్డే, టీ20 సిరీస్ రెండింటిలోనూ భారత జట్టును ఆమె ముందుండి నడిపించనుంది. అదేవిధంగా భవికకు డిప్యూటీగా మహక్ నర్వాసే వ్యహరించనుంది. ఇక శ్రీలంకతో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో యువ సంచలనం దీయా యాదవ్కు చోటు దక్కింది. కానీ ఆమెను టీ20లకు మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో 16 ఏళ్ల దీయాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆమెకు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు భారత జెర్సీలో సత్తాచాటేందుకు దియా సిద్దమైంది. కాగా ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక అండర్-19 టీమ్ ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. చెన్నై, పుదుచ్చేరి వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్టీ20 సిరీస్ (చెన్నై): జూన్ 22, జూన్ 24, జూన్ 27 (మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రారంభం)వన్డే సిరీస్ (పుదుచ్చేరి): జూన్ 30, జూలై 3 (ఉదయం 9:00 గంటలకు), జూలై 6 (మధ్యాహ్నం 2:00 గంటలకు)భారత అండర్-19 టీ20 జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, తనిష్క శర్మ, ఈశ్వరి అవసరే, అవ్ని చౌదరి, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, మణియార్ మైత్రి, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్).భారత అండర్-19 వన్డే జట్టు:భవిక అహిరే (కెప్టెన్/వికెట్ కీపర్), ఇరా జాదవ్, దీయా యాదవ్, ఈశ్వరి అవసరే, వి.ప్రతీక్ష, మహతో నిధి, పూర్వ సివాచ్, కుమారి పాలక్, మహక్ నర్వాసే (వైస్ కెప్టెన్), కాశ్వి కందికుప్ప, విధి పర్మార్, గౌరీ గోయల్, జాన్వి వికార్, అనాది తగ్డే, కె. దీక్ష (వికెట్ కీపర్). -
టీమిండియా షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన
భారత టెస్ట్ జట్టు షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. 2017 తర్వాత టీమిండియా తొలిసారి శ్రీలంక గడ్డపై (టెస్ట్ సిరీస్ కోసం) అడుగుపెట్టనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్లో జరగనుంది.బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు శ్రీలంకలోని ప్రముఖ వేదిక అయిన గాలే అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించే అవకాశం ఉంది. రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, అది కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది.భారత్ చివరిగా లంక గడ్డపై ఆడిన టెస్ట్ సిరీస్ను విరాట్ కోహ్లి నేతృత్వంలో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత మళ్లీ భారత్ అక్కడ టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టూర్పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.టెస్ట్ సిరీస్తో పాటు లంక టూర్లో మూడు టీ20 మ్యాచ్లు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ సిరీస్ నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. టెస్ట్ సిరీస్ షెడ్యూల్పై కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. పైన అనుకున్న షెడ్యూల్ ఖరారైనట్లు బీసీసీఐకి చెందిన ఓ కీలక వ్యక్తి ప్రకటించారు. -
India A vs Sri Lanka: మొదటి మ్యాచ్ లో నిరాశపర్చిన వైభవ్ సూర్యవంశీ..
-
వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్-19, అండర్-23 జట్లు శ్రీలంక టూర్కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత యువ జట్లు శ్రీలంక అండర్-19, లయన్స్ టీమ్స్తో నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ త్వరలోనేఖరారు చేయనుంది.అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్లో ఒక ప్రత్యేక టోర్నమెంట్ను నిర్వహించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది. వీరింతా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ పొందుతున్నారు.ఈ యువ ఆటగాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్రదర్శన ఆటగాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్కనున్నారు. ఐపీఎల్-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రే కూడా సీజన్ ముగిసిన తర్వాత ఈ క్యాంప్లో చేరనున్నారు.కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ?అయితే శ్రీలంక టూర్కు ముందు భారత అండర్-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే తొడ కండరాలు (హ్యామ్స్ట్రింగ్) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్-3లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వల్ప గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వియాన్ మల్హోత్రాను ఐపీఎల్-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒకవేళ శ్రీలంక టూర్కు మాత్రే, వియాన్ ఇద్దరు అందుబాటులో లేకపోతే భారత జట్టు కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ అవకాశముంది. సూర్యవంశీ గతంలో సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్ట్రాలు వద్దు.. పాక్ బోర్డుకు ఘాటు కౌంటర్ -
బీసీసీఐ ఉదారత.. శ్రీలంక తుఫాన్ బాధితుల కోసం ప్రత్యేక సాయం
పొరుగు దేశాలను ఆదుకునే విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మరోసారి తమ ఉదారత చాటుకుంది. డిట్వా తుఫానుతో అతలాకుతలమైన శ్రీలంకకు నిధులు సమకూర్చేందుకు ప్రత్యేక సాయంతో ముందుకొచ్చింది. భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్ట్లో శ్రీలంకలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.డిట్వా తుఫాన్ బాధితుల సహాయార్థం బీసీసీఐ ఈ టూర్ను పొడిగించేందుకు నిర్ణయించింది. టెస్ట్లకు అదనంగా టీ20 మ్యాచ్లు ఆడేందుకు అంగీకరించింది. ఈ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని డిట్వా తుఫాన్ బాధితుల పునరావాసానికి వినియోగించేందుకు షెడ్యూల్లో లేని టూర్ ఎక్స్టెన్షన్ను ప్లాన్ చేసింది.ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) అధ్యక్షుడు షమ్మి సిల్వా ధృవీకరించారు. భారత్-శ్రీలంక మధ్య ఉన్న సహృదయ వాతావరణాన్ని, పెరుగుతున్న స్నేహాన్ని ప్రస్తావించారు. అదనపు టీ20ల షెడ్యూల్ను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.వాస్తవానికి తాజా పరిణామానికి ముందే భారత జట్టు డిసెంబర్లోనూ శ్రీలంకలో పర్యటించేందుకు (డిట్వా తుఫాన్ బాధితులకు నిధులు సమకూర్చేందుకు) ఒప్పుకుంది. ఆ పర్యటనలో భారత్-శ్రీలంక జట్లు రెండు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కార్యరూపం దాల్చకముందే, బీసీసీఐ ఆగస్ట్ విండో ప్రతిపాదనకు సమ్మతించింది.కాగా, గతేడాది నవంబర్ చివర్లో డిట్వా తుఫాను శ్రీలంకను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 4 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం సంభవించింది.శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యక్రమాలుడిట్వా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూరించేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. త్వరలో స్వదేశంలో పాకిస్తాన్తో జరుగబోయే టీ20 సిరీస్ను “Rebuilding Sri Lanka” కార్యక్రమానికి అంకితం చేసింది. ఈ సిరీస్లో #VisitSriLanka పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనున్నారు. -
ఉన్నదంతా కోల్పోయామంటే..: స్మృతి మంధాన పోస్ట్ వైరల్
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు గతేడాది గొప్ప అనుభూతితో పాటు.. చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 2025 సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపురానిదిగా మిగిలిపోనుంది. ఇప్పటికే మహిళల క్రికెట్లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్కు వరల్డ్కప్ను ముద్దాడాలన్న చిరకాల కోరిక నవంబరులో తీరింది.ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. కెరీర్లోని అత్యుత్తమ గెలుపు తర్వాత.. అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.అనూహ్య రీతిలో వాయిదా.. ఆపై రద్దుదాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ఏడడుగులు వేసేందుకు స్మృతి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికొన్ని గంటల్లో (నవంబరు 23) పెళ్లి తంతు మొదలుకానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా.. పలాష్ సైతం ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ గురించి పెద్ద ఎత్తు చర్చ మొదలైంది. స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా.. తనతో అతడు చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు’ సంభాషణను ఓ అమ్మాయి షేర్ చేసింది. పలాష్ స్త్రీలోలుడు అనేలా ఆ మెసేజ్లు ఉన్నాయి.అధికారికంగా ప్రకటించి..ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా.. పలాష్పై ట్రోలింగ్ ఎక్కువైంది. ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకున్నామంటూ స్మృతి- పలాష్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని.. ఇకపై క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది.అందుకు అనుగుణంగానే ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్లో పది వేల పరుగుల క్లబ్లో చేరింది. ఇక 2025లో ఓవరాల్గా 1703 పరుగులు సాధించి.. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాన్ని దిగమింగి.. టీ20 ప్రపంచకప్-2026లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.2025కు గుడ్బై.. ఉన్నదంతా కోల్పోయామంటే..ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేసిన స్మృతి మంధాన.. గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది. ‘‘ఏదైనా గొప్ప విషయం, మంచి జరిగే ముందు.. అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతాము. కాబట్టి ఓపికగా ఎదురుచూడటమే ఉత్తమం’’ అని స్మృతి పేర్కొంది. ఇక ఈ వీడియోలో తన స్నేహితులు, సహచర ఆటగాళ్లు.. అమ్మానాన్న, అన్నయ్య, మేనల్లుడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె జత చేసింది. ఈ మేరకు 2025కు గుడ్బై చెబుతూ స్మృతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది.చదవండి: 2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్ View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
భారత ఆల్రౌండర్ ప్రపంచ రికార్డు
శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళా జట్టు పరిపూర్ణ విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో పదిహేను పరుగుల తేడాతో నెగ్గి మరోసారి ఆధిపత్యం కనబరిచింది. సిరీస్ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో రాణించి 5-0తో క్లీన్స్వీప్ చేసింది.గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సాధించింది. శ్రీలంక బ్యాటర్ నీలాక్షిక సిల్వాను లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపిన ఈ రైటార్మ్ బ్రేక్ స్పిన్నర్.. అంతర్జాతీయ టీ20లలో 152వ వికెట్ను తన ఖాతాలో వేసుకుంది.𝗟𝗕𝗪 ☝️🎥 The moment Deepti Sharma became the most successful bowler in women's T20Is 😎Updates ▶️ https://t.co/E8eUdWSQXs#TeamIndia | #INDvSL | @Deepti_Sharma06 | @IDFCFIRSTBank pic.twitter.com/zelk7cRLiw— BCCI Women (@BCCIWomen) December 30, 2025 తద్వారా మహిళల ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా దీప్తి శర్మ నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ మేగన్ షట్ (151) పేరిట ఉండేది.హర్మన్, అమన్, అరుంధతి మెరుపులుకాగా లంకతో ఐదో టీ20లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (5), జి.కమలిని (12).. వన్డౌన్లో వచ్చిన హర్లిన్ డియోల్ (13) తీవ్రంగా నిరాశపరిచారు.మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (5), దీప్తి శర్మ (7) విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట దశలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (43 బంతుల్లో 68) బాధ్యతాయుతంగా ఆడింది. ఆమెకు తోడుగా అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్) రాణించారు.సమిష్టిగా రాణించిన భారత బౌలర్లుఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 175 పరుగులు స్కోరు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో శ్రీలంక 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65), వన్డౌన్ బ్యాటర్ ఇమేషా దులాని (50) అర్ధ శతకాలు వృథా అయ్యాయి.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రాణా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్జోత్ కౌర్.. తలా ఒక వికెట్ తీసి సమిష్టిగా రాణించారు.నంబర్ వన్ ర్యాంకులోనే దీప్తి శర్మఅంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా మహిళల టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్లో సమష్టిగా చెలరేగడంతో భారత ప్లేయర్ల ర్యాంకింగ్లు మెరుగయ్యాయి. 738 రేటింగ్ పాయింట్లతో దీప్తి నంబర్వన్గా కొనసాగుతుండగా, భారత పేసర్ రేణుకా సింగ్ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకుంది.705 పాయింట్లతో రేణుక...ఎంలాబా (దక్షిణాఫ్రికా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచింది. టీ20 ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ క్రీడాకారిణి హేలీ మాథ్యూస్ (505 ర్యాంకింగ్ పాయింట్లు) తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో షఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. ఇప్పటి వరకు పదో స్థానంలో ఉన్న ఆమె 736 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకుంది. ఒక స్థానం కోల్పోయిన జెమీమా రోడ్రిగ్స్ పదో ర్యాంక్కు పరిమితం అయింది. చదవండి: సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి.. ఇంకో 25 పరుగులే!5⃣ matches5⃣ victories 👏#TeamIndia complete an emphatic series sweep with a 15-run win in Trivandrum 🥳Scorecard ▶️ https://t.co/E8eUdWSQXs#INDvSL | @IDFCFIRSTBank pic.twitter.com/tV5VlXq5GB— BCCI Women (@BCCIWomen) December 30, 2025 -
టీమిండియా క్లీన్స్వీప్
శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసింది. చివరిదైన ఐదో టీ20లో గెలిచి టీమిండియా తన జైత్ర యత్రను కొనసాగించింది. ఐదో మ్యాచ్లో భారత మహిళల జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 160 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. శ్రీలంక బ్యాటర్లలో హాసిని పెరీరా(65), ఇమేషా దులాని(50)లు రాణించినా జట్టుకు విజయం చేకూర్చలేకపోయారు. భారత మహిళా బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ్ రానా, వైష్ణవి శర్మ, శ్రీచరణి, అమన్ జ్యోత్ కౌర్లు తలో వికెట్ తీసి విజయానికి సహకరించారు.ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది. -
హర్మన్ప్రీత్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే..?
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మెరుపు అర్ద సెంచరీతో (43 బంతుల్లో 68; 9 ఫోర్లు, సిక్స్) చెలరేగగా.. ఆఖర్లో అమన్జోత్ కౌర్ (18 బంతుల్లో 21; ఫోర్, సిక్స్), అరుంధతి రెడ్డి (11 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) బ్యాట్ ఝులిపించారు.మిగతా బ్యాటర్లలో షఫాలీ వర్మ 5, అరంగేట్రం ప్లేయర్ కమలిని 12, హర్లీన్ డియోల్ 13, రిచా ఘోష్ 5, దీప్తి శర్మ 7, స్నేహ్ రాణా (8 నాటౌట్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష దిల్హరి, రష్మిక సెవ్వండి, కెప్టెన్ ఆటపట్టు తలో 2 వికెట్లు తీయగా.. నిమిష మదుషని ఓ వికెట్ పడగొట్టింది.కాగా, స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. -
శ్రీలంకతో చివరి టీ20.. టీమిండియా బ్యాటింగ్.. స్టార్ ప్లేయర్కు రెస్ట్
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు పూర్తి కాగా.. నాలుగింట టీమిండియానే గెలిచింది. తద్వారా 4-0తో ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకొని, క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 30) నామమాత్రపు ఐదో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున స్టార్ ప్లేయర్ స్మృతి మంధన, రేణుక సింగ్కు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో స్నేహ్ రాణా, కమిలిని జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్తోనే కమిలిని అరంగేట్రం చేస్తుంది.శ్రీలంక విషయానికొస్తే.. మల్షా శేషని, కావ్యా కవిండి స్థానాల్లో ఇనోకా రణవీరా, మల్కి మదారా తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), ఇనోకా రణవీరా, మల్కి మదారా, రష్మిక సెవ్వంది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, కమిలిని, శ్రీ చరణి -
శుభ్మన్ గిల్ వరల్డ్ రికార్డుకు చేరువలో మంధాన
భారత మహిళ క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. చివరి పోరులో కూడా గెలిచి సిరీస్ను 5-0 క్లీన్ స్వీప్ చేయాలని మన అమ్మాయిల జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.గిల్ రికార్డుపై కన్ను..స్మృతి మంధాన మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉంది. ఈ ఏడాదిలో మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 1703 పరుగులు చేసింది. మహిళల క్రికెట్లో ఒక క్యాలెండర్ ఈయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా స్మృతి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఐదో టీ20లో ఆమె మరో 62 పరుగులు చేస్తే.. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్(మెన్స్ అండ్ ఉమెన్స్)లో ఒక ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా వరల్డ్ రికార్డు సృష్టించనుంది. ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 2025 ఏడాదిలో మూడు ఫార్మాట్లు కలిపి 1764 పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్లో గిల్ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో వేచి చూడాలి. నాలుగో టీ20లో మాత్రం మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేసింది.ఒకే ఒక వికెట్..మరోవైపు భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్లో దీప్తీ ఒక్క వికెట్ సాధిస్తే టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలుస్తోంది. దీప్తి ప్రస్తుతం 151 వికెట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగాన్ షుట్తో కలిసి జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్గా ఉంది.మహిళల టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు1 - మేగాన్ షుట్: 122 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు2 - దీప్తి శర్మ: 129 ఇన్నింగ్స్లలో 151 వికెట్లు3 - హెన్రియెట్ ఇషిమ్వే: 111 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు4 - నిదా దార్: 152 ఇన్నింగ్స్లలో 144 వికెట్లు5 - సోఫీ ఎక్లెస్టోన్: 100 ఇన్నింగ్స్లలో 142 వికెట్లు -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధన.. టీమిండియా భారీ స్కోర్
రికార్డుల రారాణి, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మరో భారీ రికార్డు నెలకొల్పింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సాధించింది. ఈ మైలురాయిని తాకేందుకు మంధనకు కేవలం 281 ఇన్నింగ్స్లే అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డు టీమిండియాకే చెందిన మిథాలీ రాజ్ పేరిట ఉండేది.మిథాలీ ఈ మైలురాయిని తన 291 ఇన్నింగ్స్లో తాకింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 28) జరుగుతున్న నాలుగో టీ20లో మంధన ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన మంధన.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 10000 పరుగుల మైలురాయిని తాకింది.చరిత్రలో కేవలం నాలుగో ప్లేయర్మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు నలుగురు మాత్రమే 10000 పరుగులు పూర్తి చేసుకున్నారు. వీరిలో మంధన నాలుగో క్రికెటర్గా నిలిచింది. ఈమెకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10868), న్యూజిలాండ్కు చెందిన సూజీ బేట్స్ (10652), ఇంగ్లండ్కు చెందిన చార్లోట్ ఎడ్వర్డ్స్ (10273) మాత్రమే ఈ ఘనత సాధించారు.టీమిండియా భారీ స్కోర్తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (48 బంతుల్లో 80; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షఫాలీ వర్మ (46 బంతుల్లో 79; 12 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (16 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడింది.సిరీస్ ఇదివరకే కైవసం కాగా, టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. -
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్ 28) నాలుగో మ్యాచ్ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో భారత్ టాస్ కోల్పోవడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్ తరఫున జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్ స్థానాల్లో హర్లీన్ డియోల్, అరంధతి రెడ్డి తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చారు.తుది జట్లు..శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషానిభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
టీమిండియా కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్గా నిలిచిన తర్వాత తమ తొలి సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై శ్రీలంకతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఈ ట్రోఫీని గెలిచింది.తిరువనంతపురం వేదికగా శుక్రవారం రాత్రి నాటి మ్యాచ్లో శ్రీలంక మహిళా జట్టును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన హర్మన్ సేన.. విజయాల పరంపరను కొనసాగించింది. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్ నమ్మకాన్ని నిలబెట్టే రీతిలో భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 112 పరుగులకే పరిమితంనిర్ణీత 20 ఓవర్లలో లంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. లంక బ్యాటర్లలో ఓపెనర్ హాసిని పెరీరా (18 బంతుల్లో 25), ఇమేషా దులాని (32 బంతుల్లో 27), కవిశా దిల్హారి (13 బంతుల్లో 20), వికెట్ కీపర్ బ్యాటర్ కౌశాని నుతయంగన (16 బంతుల్లో 19 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక బౌలర్ కవిశా దిల్హారి బౌలింగ్లో స్మృతి మంధాన (1) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (9)ను కవిశా వెనక్కి పంపింది.షఫాలీ, హర్మన్ ధనాధన్ఇలాంటి దశలో మరో ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధనాధన్ ఇన్నింగ్స్తో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. షఫాలీ 42 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్లు బాది 79 పరుగులు చేయగా.. హర్మన్ (18 బంతుల్లో 21) షఫాలీతో కలిసి అజేయంగా నిలిచింది. 13.2వ ఓవర్లో ఫోర్ బాది షఫాలీ జట్టును గెలుపు తీరాలు దాటించింది.ఇక ఇంతకుముందు విశాఖపట్నంలో తొలి రెండు టీ20లలోనూ గెలిచిన భారత్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. భారత జట్టు కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 77వ విజయం. తద్వారా అంతర్జాతీయ మహిళల పొట్టి క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టి.. ఈ జాబితాలో తొలి స్థానానికి ఎగబాకింది.మహిళల అంతర్జాతీయ టీ20లలో కెప్టెన్గా అత్యధిక విజయాలు (సూపర్ ఓవర్ సహా)👉హర్మన్ప్రీత్ కౌర్ (ఇండియా)- 130 మ్యాచ్లలో 77 విజయాలు👉మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా)- 100 మ్యాచ్లలో 76 విజయాలు👉హీదర్ నైట్ (ఇంగ్లండ్)- 96 మ్యాచ్లలో 72 విజయాలు👉చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్)- 93 మ్యాచ్లలో 68 విజయాలు👉ఎన్ చైవాయి (థాయ్లాండ్)- 79 మ్యాచ్లలో 55 విజయాలు.చదవండి: Ro-Ko: అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత? -
షెఫాలీ మెరుపులు.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఉమెన్ ఇన్ బ్లూ.. మరో రెండు మ్యాచ్ల మిగులూండగానే 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. 113 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 11 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హర్మన్ ప్రీత్ కౌర్(21) రాణించింది. అయితే స్టార్ ప్లేయర్లు స్మృతి మంధాన(1), రోడ్రిగ్స్(9) మాత్రం విఫలమయ్యారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్ను దెబ్బతీయగా.. దీప్తీ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటింది. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు. ఇక నాలుగో టీ20 ఇదే వేదికగా డిసెంబర్ 28న జరగనుంది.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
IND vs SL: 4 వికెట్లతో చెలరేగిన రేణుకా.. భారత్ టార్గెట్ ఎంతంటే?
తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో జరుగుతున్న మూడో టీ20లోనూ భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులకే పరిమితమైంది. ఇండియన్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి లంక టాపార్డర్ను దెబ్బకొట్టింది.ఆమెతో పాటు స్పిన్నర్ దీప్తీ శర్మ కూడా మూడు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసింది. అయితే మిగితా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి వికెట్ మాత్రం సాధించలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లలో ఇమేషా దులాని 27 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కవిషా దిల్హారి(20), హాసిని పెరీరా(25) ఫర్వాలేదన్పించారు.కెప్టెన్ ఆతపట్టు కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచింది. అయితే భారత బ్యాటర్లు ఉన్న జోరు ముందు ఈ స్పల్ప లక్ష్యాన్ని లంక బౌలర్లు ఎలా కాపాడుకుంటారో చూడాలి. ఇప్పటికే తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన భారత్.. మూడో మ్యాచ్లో కూడా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే భారత్ మరో రెండు టీ20ల మిగిలూండగానే 3-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(వికెట్ కీపర్), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
శ్రీలంకతో మూడో టీ20.. రీఎంట్రీ ఇచ్చిన స్టార్ ప్లేయర్లు
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు పూర్తి కాగా.. రెంటిలో టీమిండియానే గెలిచింది. విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ల్లో భారత్ ఏకపక్ష విజయాలు సాధించింది. తొలి టీ20లో 8 వికెట్లు, రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయాలు నమోదు చేసింది.సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 26) మూడో టీ20 జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లోనూ భారత జట్టే టాస్ గెలిచింది. మూడో టీ20 కోసం భారత జట్టు రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు రేణుకా సింగ్, దీప్తి శర్మ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి బెంచ్కు పరిమితమయ్యారు. మరోవైపు ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఏకంగా మూడు మార్పులు చేసింది. 0-2తో వెనుకపడిపోయిన శ్రీలంక సిరీస్లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా భారతే గెలిస్తే, మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ వశమవుతుంది.తుది జట్లు..శ్రీలంక: చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిమేషా మదుషాని, కవిషా దిల్హరి, నీలక్షికా సిల్వా, ఇమేషా దులాని, కౌషని నుత్యంగన(w), మల్షా షెహాని, ఇనోకా రణవీర, మల్కీ మదరభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి -
#INDvsSL : విశాఖలో విశ్వవిజేతల దండయాత్ర (ఫొటోలు)
-
సత్తా చాటిన భారత బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన శ్రీలంక
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంకను స్వల్ప స్కోర్కే పరిమితం చేసింది. దీప్తి శర్మ స్థానంలో జట్టులో వచ్చిన స్నేహ్ రాణా (4-1-11-1) అద్బుతంగా బౌలింగ్ చేసింది. వైష్ణవి శర్మ (4-0-32-2), శ్రీ చరణి (4-0-23-2), క్రాంతి గౌడ్ (3-02-1) కూడా రాణించారు. అరుంధతి రెడ్డి (3-0-22-0), అమన్జోత్ కౌర్ (2-0-11-0) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్డు కూడా చెలరేగిపోయారు. ఏకంగా ముగ్గురిని రనౌట్ చేశారు. అమన్జోత్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి వికెట్ కీపర్ రిచా ఘోష్కు అద్భుతమైన త్రోలు అందించి ముగ్గురిని రనౌట్ చేశారు. లంక ఇన్నింగ్స్లో హర్షిత సమరవిక్రమ (33) టాప్ స్కోరర్గా నిలిచింది. కెప్టెన్ చమారి (31), హాసిని పెరీరా (22), కవిష దిల్హరి (14), కౌషిని (11) అతి కష్టంమీద రెండంకెల స్కోర్లు చేశారు. విష్మి గౌతమ్ (1), నీలాక్షి (2), కావ్యా కవింది (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. శశిని డకౌటైంది. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఇదే విశాఖ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది.తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్లో ఆడిన జట్టునే కొనసాగించింది. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. దీప్తి స్థానంలో స్నేహ్ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. తుది జట్లు.. శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
మరో విజయం లక్ష్యంగా...
సాక్షి, విశాఖపట్నం: వన్డే ప్రపంచకప్ గెలుచు కొచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత మహిళల జట్టు శ్రీలంకతో మొదలైన టి20 సిరీస్లో శుభారంభం చేసింది. ఇప్పుడు ఇదే జోరుతో వరుస విజయాలతో ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఆశిస్తోంది. తద్వారా సిరీస్లో పట్టు సాధించాలని చూస్తోంది. మరోవైపు లంక అమ్మాయిలు పటిష్టమైన భారత్కు ఎలాగైనా కళ్లెం వేయాలని, ఈ మ్యాచ్లో గెలిచి 1–1తో సమం చేయాలని పట్టుదలతో ఉన్నారు. గట్టి ప్రత్యరి్థని ఓడించేందుకు పకడ్బందీ ఎత్తుగడలను అమలు చేయాలని లంక జట్టు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలోనే జరిగే ఈ రెండో టి20 ఆసక్తికరంగా జరిగే అవకాశముంది. ఫీల్డింగ్తోనే సమస్య హర్మన్ప్రీత్ బృందం మొదటి మ్యాచ్లో బాగానే ఆడింది. ప్రత్యరి్థని ఓడించింది. ఐదు టి20ల సిరీస్లో శుభారంభం చేసింది. అంతమాత్రాన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యరి్థకంటే అగ్రగామిగా ఉందనుకుంటే పొరపాటు. బౌలింగ్, బ్యాటింగ్ బాగున్నప్పటికీ ఫీల్డింగ్ చాలా ఘోరంగా ఉంది. తొలి మ్యాచ్లో చెత్త ఫీల్డింగ్తో విసుగు తెప్పించింది. సులువైన క్యాచుల్ని నేలపాలు చేసింది. అంతిమంగా విజయమే ముఖ్యమైనా... ఘోరమైన ఫీల్డింగ్ను అది మూసి పెట్టలేదు. ఇదే విషయాన్ని కెపె్టన్ హర్మన్ సైతం అంగీకరించింది. తప్పకుండా ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతామని, నెట్స్లో క్యాచింగ్పైనే అతిగా ప్రాక్టీస్ చేశామని కూడా చెప్పింది. బ్యాటింగ్లో స్మృతి మంధాన మెరుగ్గా ఆడింది. జెమీమా రోడ్రిగ్స్ విలువైన అర్ధసెంచరీతో అజేయంగా నిలిచింది. వీరితో పాటు షఫాలీ వర్మ కూడా రాణిస్తే పరుగులకు, భారీస్కోరుకు ఏమాత్రం ఇబ్బంది వుండదు. బౌలింగ్లో క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, దీప్తి శర్మ, శ్రీచరణి ఆకట్టుకున్నారు. కొత్తమ్మాయి వైష్ణవి శర్మ అరంగేట్రంలోనే అదరగొట్టింది. వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. సమం చేసే పనిలో... సొంతగడ్డపై భారత్ పైచేయిగా ఉన్నప్పటికీ... ఆతిథ్య జట్టులోని లోపాలను సొమ్ము చేసుకొని సిరీస్ రేసులో నిలవాలని శ్రీలంక చూస్తోంది. భారత్ ఆధిక్యాన్ని ఇక్కడే సమం చేయాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్లో కెప్టెన్ చమరి ఆటపట్టు, నీలాక్షికల వైఫల్యం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్లో రెండు, మూడు ఓవర్లు చాలు మ్యాచ్గతినే మార్చడానికి. అందరు ఆడాల్సిన పనిలేదు. ఏ ఇద్దరు దంచేసినా చాలు ఆతిథ్య జట్టుకు గట్టి బదులు ఇవ్వొచ్చని శ్రీలంక ఆశిస్తోంది. తుది జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, అమన్జోత్, అరుంధతి, క్రాంతి గౌడ్, వైష్ణవి, శ్రీచరణి. శ్రీలంక: చమరి ఆటపట్టు (కెపె్టన్), విష్మీ గుణరత్నే, హాసిని, హర్షిత, కవీషా, ఇమేశ దులాని, నీలాక్షిక, కౌశిని, ఇనోక రణవీర, మాల్కి మదర, కావ్య, శషిని. -
శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
వన్డే ప్రపంచకప్ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్ అనిపించింది. మరో బౌలర్ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్ (3-0-23-1) కూడా రాణించారు.భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్ టాప్ స్కోరర్గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్ చేశారు.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్ చేయనున్న టీమిండియా
వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.మరోవైపు టాస్ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన
డిసెంబర్ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన తర్వాత భారత్ ఆడనున్న తొలి సిరీస్ ఇదే.పలాష్ ముచ్చల్తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్కప్ స్టార్ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. అలాగే వరల్డ్కప్ సెమీఫైనల్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, వరల్డ్కప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్కప్ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.షెడ్యూల్..తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నంరెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం -
IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. షెడ్యూల్ విడుదల
భారత మహిళా క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్లు ఆడనున్నట్లు తెలిపింది.ఈ సిరీస్కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్- బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య సిరీస్ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్ను వాయిదా వేశారు.టీ20 ప్రపంచకప్-2026కి సన్నాహకంగాఈ క్రమంలో శ్రీలంకతో భారత్ (IND vs SL T20Is) మ్యాచ్లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్ లీగ్తో బిజీగా కానున్నారు.మహిళల ప్రీమియర్ లీగ్ వేదికలు ఇవేనవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్ టోర్నీ ఆడనుంది.భారత్ వర్సెస్ టీ20 సిరీస్ షెడ్యూల్👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
ఈ హెడ్కోచ్ వద్దని పట్టుబట్టిన ఆటగాళ్లు.. తొలగించిన బీసీసీఐ!
గత దశాబ్ద కాలంగా భారత క్రికెట్ జట్టు- హెడ్కోచ్ల మధ్య అనుబంధం బాగా బలపడింది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)లతో మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సత్సంబంధాలు కొనసాగించారు. ఇక ద్రవిడ్ మార్గదర్శనంలో.. రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత ద్రవిడ్ హెడ్కోచ్ పదవి నుంచి వైదొలగగా.. మరో మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత జట్టు ప్రధాన కోచ్గా నియమితుడయ్యాడు. తన వ్యూహాలకు అనుగుణంగా యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు వచ్చేలా చేస్తున్న గౌతీ.. ఇటీవలే శుబ్మన్ గిల్ టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.ప్రస్తుతానికి కోచ్కు- ఆటగాళ్లకు మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద గొడవలేమీ లేనట్లే కనిపిస్తోంది. జట్టుపై పూర్తిగా పట్టు సాధించిన గౌతీ.. అవసరమైన వేళ ఆటగాళ్లకు మద్దతుగా ఉంటూ టీమ్ను ముందుకు నడిపిస్తున్నాడు.పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదంమరి గతంలో ఓ హెడ్కోచ్కు- ఆటగాళ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా వివాదం రాజుకుందని తెలుసా?.. మీరు ఊహించినట్లుగా ఇది గ్రెగ్ చాపెల్- సౌరవ్ గంగూలీ ఎపిసోడ్ గురించి కాదు. భారత వరల్డ్కప్ విన్నింగ్ హీరోకు- దిగ్గజ ఆటగాళ్లకు మధ్య జరిగిన గొడవ.. ఇంతకీ ఏంటీ విషయం?!కపిల్ దేవ్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్కప్-1983 నెగ్గిన జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. 1996- 97 మధ్య కాలంలో టీమిండియా హెడ్కోచ్గా పనిచేశాడు. ఈ క్రమంలో భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉండగా.. మదన్ లాల్ (Madan Lal) నాడు టీమ్లో ఉన్న కొందరు ఆటగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.విఫలం అవుతావని చెప్పాది హిందూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ మాట్లాడుతూ.. టీమిండియా ఓటములకు సదరు ఆటగాళ్లే కారణం అనేలా విమర్శలు చేశాడు. అజయ్ జడేజా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు బౌలర్గా లేదంటే బ్యాటర్గా ఆడబోతున్నావా? అనేది ముందుగానే నిర్ణయించుకో అని అతడికి చెప్పాను. ఒక్క మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే తర్వాత ఐదు మ్యాచ్లలోనూ విఫలం అవుతావని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు.ఆల్రౌండర్గా రాణించలేడుమరోవైపు రాబిన్ సింగ్ను ఉద్దేశించి.. ‘‘చాలానే కష్టపడతాడు కానీ.. అంతర్జాతీయ స్థాయిలో ఆల్రౌండర్గా రాణించలేడు’’ అని మదన్ లాల్ అన్నాడు. ఇక సబా కరీం గురించి మాట్లాడుతూ.. ‘‘అతడొక సగటు వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రమే’’ అని ట్యాగ్ ఇచ్చాడు.కుంబ్లే ‘టర్న్’ కాదు.. దానిమీద దృష్టి పెట్టుఅంతేగాకుండా అప్పట్లో టీమిండియా ప్రధాన స్పిన్ అస్త్రమైన అనిల్ కుంబ్లే గురించి చెబుతూ.. ‘‘అతడి బౌలింగ్తో సంతోషంగా లేనని చెప్పా. నువ్వు బంతిని తిప్పడం కంటే లైన్ అండ్ లెంగ్త్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టమని చెప్పా’’ అని మదన్ లాల్ పేర్కొన్నాడు. ఓవరాల్గా.. ‘‘మేము గెలవలేకపోతున్నాం. కానీ నేనొక్కడినే ఏం చేయగలను?’’ అంటూ ఆటగాళ్లను టార్గెట్ చేశాడు.ఈ ఇంటర్వ్యూ తర్వాత భారత క్రికెట్ శిబిరంలో కల్లోలం చెలరేగింది. అప్పటి మేనేజర్ రత్నాకర్ శెట్టి వెంటనే జర్నలిస్టు విజయ్ను సంప్రదించి.. మదన్ లాల్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారని నిర్దారించుకున్నాడు.మాటల్లేవ్.. బాయ్కాట్ చేసేశారుఈ నేపథ్యంలో.. మదన్ లాల్ వ్యాఖ్యలతో తీవ్రంగా నొచ్చుకున్న ఆటగాళ్లు అతడితో చాలా రోజుల పాటు మాట్లాడనే లేదు. నాటి సిరీస్లో ఓ వన్డేలో అజయ్ జడేజా సెంచరీ చేసిన తర్వాత ఈ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ మ్యాచ్లో మొహమ్మద్ అజారుద్దీన్ కూడా సెంచరీ చేశాడు. వేటు వేసిన బీసీసీఐఆ తర్వాత ఈ హెడ్కోచ్ వద్దని ఆటగాళ్లు పట్టుబట్టడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మదన్ లాల్పై వేటు వేసి అన్షుమాన్ గైక్వాడ్తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది. అలా టీమిండియా హెడ్కోచ్గా మదన్ లాల్ పది నెలల పదవీ కాలం వివాదంతో ముగిసిపోయింది. అప్పటి బీసీసీఐ మేనేజర్ రత్నాకర్ శెట్టి తన ఆటోబయోగ్రఫీ.. ‘ఆన్ బోర్డ్- మై ఇయర్స్ ఇన్ బీసీసీఐ’లో ఈ విషయాలను ప్రస్తావించాడు.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) చరిత్ర సృష్టించింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో అర్ద సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025లో (ICC Women's World Cup 2025) భాగంగా నిన్న (సెప్టెంబర్ 30) శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో (India vs Sri Lanka) దీప్తి ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్లో జట్టుకు చాలా ముఖ్యమైన అర్ద సెంచరీ (53) సాధించి, అనంతరం బౌలింగ్లోనూ సత్తా చాటి 3 వికెట్లు (10-1-54-3) తీసింది. దీప్తితో పాటు అమన్జోత్ కౌర్ (57, 6-0-37-1), స్నేహ్ రాణా (28 నాటౌట్, 10-0-32-2) కూడా రాణించడంతో ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో దీప్తి వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా టెయిలెండర్లతో అమూల్యమైన భాగస్వామ్యాలు నెలకొల్పింది. అమన్జోత్తో కలిసి ఏడో వికెట్కు 103 పరుగులు, స్నేహ్ రాణాతో ఎనిమిదో వికెట్కు 42 పరుగులు జోడించి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.అనంతరం బౌలింగ్లో అతి కీలకమైన చమారీ ఆటపట్టు (43) వికెట్తో పాటు కవిష దిల్హరి (15), వికెట్కీపర్ అనుష్క సంజీవని (6) వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టింది. శ్రీలంకపై గెలుపుతో టీమిండియా 2025 ప్రపంచ కప్ను ఘనంగా ప్రారంభించింది. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబో వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..భారత్- 269/8- వర్షం కారణంగా మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారుశ్రీలంక- 211 ఆలౌట్- డక్వర్త్ లూయిస్ పద్దతిన 59 పరుగుల తేడాతో భారత్ విజయంరెండో స్థానానికి ఎగబాకిన దీప్తిఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసిన అనంతరం దీప్తి శర్మ మరో ఘనత కూడా సాధించింది. వన్డేల్లో రెండో అత్యధిక వికెట్లు సాధించిన భారత మహిళా క్రికెటర్గా నిలిచింది. ఈ క్రమంలో నీతూ డేవిడ్ను వెనక్కు నెట్టింది. ఈ జాబితాలో జులన్ గోస్వామి టాప్లో ఉంది.భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు..255 - జులన్ గోస్వామి143 - దీప్తి శర్మ141 - నీతూ డేవిడ్100 - నూషిన్ అల్ ఖదీర్99 - రాజేశ్వరి గైక్వాడ్చదవండి: IND VS AUS: విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ -
రాణించిన అమన్జ్యోత్, దీప్తి.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రపంచకప్-2025లో భాగంగా గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. వర్షం కారణంగా మ్యాచ్ను 47 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది.భారత బ్యాటర్లలో అమన్జోత్ కౌర్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(53), హర్లీన్ డియోల్(48) రాణించారు. ఒకనొక దశలో ఉమెన్ ఇన్ బ్లూ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో అమన్జోత్, దీప్తీ శర్మ ఏడో వికెట్కు 103 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ఆఖరిలో స్నేహ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28) దూకుడుగా ఆడింది. ఫలితంగా భారత్ మెరుగైన టోటల్ను సాధించగల్గింది. భారత స్టార్ బ్యాటర్లు స్మృతి మంధాన(8), రోడ్రిగ్స్(0), హర్మాన్ ప్రీత్ కౌర్(21), రిచా ఘోష్(2) తీవ్రనిరాశపరిచారు.శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రభోదని రెండు, కులసూర్య, ఆతపట్టు తలా వికెట్ సాధించారు. రణవీర ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి భారత్కు ఊహించని షాకిచ్చింది.చదవండి: ఆసియాకప్ ఫైనల్లో ఓటమి... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
శ్రీలంకతో తొలి మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! తెలుగమ్మాయికి చోటు
మహిళల టీ20 ప్రపంచకప్-2025కు తెరలేచింది. తొలి మ్యాచ్లో గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చామరి అథపట్టు తొలుత హర్మన్ సేనను బ్యాటింగ్కు ఆహ్హనించింది.తొలి పోరుకు భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ దూరమైంది. 29 ఏళ్ల రేణుకా ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ టాస్ సందర్భంగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆటగాళ్లంతా ఫిట్గా ఉన్నారని, కాంబినేషన్ పరంగా తుది జట్టును ఎంపిక చేశామని పేర్కొనడం గమనార్హం.అయితే కాలిమడమ గాయం నుంచి కోలుకున్న రేణుకా ఇటీవలే ఆస్ట్రేలియా సిరీస్తో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సిరీస్లో మొత్తం మ్యాచ్లు ఆడిన రేణుకా.. ఈ మెగా టోర్నీకి ముందు వార్మప్ మ్యాచ్లలో కూడా భాగమైంది. అయితే తొలి పోరుకు దూరమైనప్పటికి తదుపరి మ్యాచ్లలో రేణుకా ఆడే అవకాశముంది. మరోవైపు ప్లేయింగ్ ఎలెవన్లో తెలుగు అమ్మాయి శ్రీ చరణికి చోటు దక్కింది. కడపకు చెందిన చరణి ఇటీవల కాలంలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్కప్ జట్టులో ఈ యువ ఆఫ్ స్పిన్నర్ భాగమైంది. కాగా ఈ మ్యాచ్లో భారత్ కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో మాత్రమే బరిలోకి దిగింది. అమన్ జ్యోత్ కౌర్, క్రాంతి గౌడ్ పేస్ బౌలర్లగా ఉన్నారు. మొత్తం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు.శ్రీలంక మహిళల ప్లేయింగ్ XI: చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్ కీపర్), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రనవీరభారత మహిళల తుది జట్టు : ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి -
ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా?.. హర్షిత్ రాణాపై అశ్విన్ ఫైర్
టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ఆట తీరును భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) విమర్శించాడు. శ్రీలంకతో మ్యాచ్లో అతడి టెక్నిక్ సరిగ్గా లేదని.. తప్పులు సరిచేసుకోవాలని సూచించాడు. తన బౌలింగ్లో ప్రత్యర్థులు చితక్కొడుతున్నా మూస పద్ధతిలో వెళ్లడం సరికాదంటూ మండిపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఆడే భారత జట్టులో పేస్ బౌలర్ల కోటాలో.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)తో పాటు హర్షిత్ రాణా స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఈ టీ20 టోర్నీలో ఇప్పటికి టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్లలో.. అతడికి కేవలం రెండు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 26 పరుగులుతొలుత లీగ్ దశలో భాగంగా ఆఖరిగా ఒమన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో హర్షిత్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో 13 పరుగులతో అజేయంగా నిలిచిన హర్షిత్.. బౌలింగ్ పరంగానూ ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.ఎక్స్పెన్సివ్ బౌలింగ్అయితే, తాజాగా.. శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో మాత్రం హర్షిత్ తేలిపోయాడు. అతడి బౌలింగ్లో లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక చితక్కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 54 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశాడు.ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘హర్షిత్ రాణా గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అవును.. అతడికి కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వేరే వారి కోసం అతడు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది.ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా?ఇలా జట్టులోకి వస్తూ పోతూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. లయ కూడా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్లో.. ఒకటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇంకోటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇలా పరిణతి లేకుండా సాగిపోయింది అతడి బౌలింగ్.ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశూ సుతిమెత్తగానే చురకలు అంటించాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం మరింతగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించాడు. కాగా శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో గెలిచిన టీమిండియా అజేయంగా ఫైనల్లో ఆడనుంది. దుబాయ్లో దాయాది పాకిస్తాన్తో టీమిండియా టైటిల్ కోసం ఆదివారం తలపడుతుంది.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటు’ -
IND Vs SL: అతడి వల్లే ఇది సాధ్యమైంది: సెహ్వాగ్ ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma)పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో మ్యాచ్లో ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తిలక్ వర్మ వల్లే టీమిండియా భారీ స్కోరు చేసిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. సంజూ శాంసన్ ఆట తీరును కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. సూపర్-4లో చివరిగా నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.అభిషేక్తో పాటు ఆ ఇద్దరుఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ (31 బంతుల్లో 61) ఆడగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) (4) విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (2) కూడా పూర్తిగా నిరాశపరిచారు.అయితే, నాలుగో నంబర్ బ్యాటర్.. తిలక్ వర్మ, ఐదో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ బ్యాట్ ఝులిపించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తిలక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 49 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Tilak Varma showing us the art of the “𝐠𝐡𝐮𝐭𝐧𝐚 𝐭𝐞𝐤 𝐜𝐡𝐡𝐚𝐤𝐤𝐚” 🤌 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/uLCfH4YepT— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 తిలక్ వర్మ వల్లే ఇలా..ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ తిలక్ వర్మ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ కాకుండా.. ఇంకా ఎవరైనా రాణించాలని, పరుగులు రాబట్టాలని టోర్నీ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం.ఈరోజు తిలక్ వర్మ.. సంజూ శాంసన్ ఆ పని చేశారు. వారిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవచ్చు. కానీ ఇద్దరూ అద్భుతమైన, జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వల్లే టీమిండియా 200 పరుగుల మార్కు అందుకుంది.ముఖ్యంగా తిలక్ వర్మ ఆఖరి వరకు అజేయంగా ఉండటం కలిసి వచ్చింది. ఇలా ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్గా ఉన్నాడంటే.. అతడు తప్పక భారీ స్కోరు చేయగలడనే నమ్మకం వస్తుంది.ఫైనల్కు ముందు ఫామ్లో ఉండటం సానుకూలాంశంఫైనల్కు ముందు తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇలా బ్యాట్ ఝులిపించడం సానుకూలాంశం. వీరిద్దరి వల్ల టైటిల్ పోరులో భారత జట్టుకు తప్పక ప్రయోజనం చేకూరుతుంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. టీమిండియా మాదిరే ఐదు వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో భారత్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఆసియా కప్ తాజా ఎడిషన్లో లెఫ్టాండర్ బ్యాటర్ తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. మరోవైపు.. సంజూ మూడు ఇన్నింగ్స్లో 108 పరుగులు రాబట్టాడు. ఇక ఆదివారం నాటి ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా.. దాయాది పాకిస్తాన్తో తలపడనున్న విషయం తెలిసిందే.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు -
వాళ్లిద్దరు సూపర్.. అతడికే ఇది సాధ్యం.. ఫైనల్లా అనిపించింది: సూర్య
శ్రీలంకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గెలుపొందడం పట్ల టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి, పట్టుదల కారణంగానే విజయం సొంతమైందని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. ఫైనల్ మాదిరి ప్రతి ఒక్కరు పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమంటూ కొనియాడాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తొలుత పాకిస్తాన్ను... ఆ తర్వాత బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది.నువ్వా- నేనాఅయితే, ఇప్పటి వరకు పెద్దగా కష్టపడకుండానే ఈ టోర్నీలో మ్యాచ్లు గెలిచిన సూర్యకుమార్ సేనకు.. శ్రీలంక జట్టు చెమటలు పట్టించింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా పోటీనిచ్చింది. 202 పరుగుల భారీ స్కోరు సాధించినా.. ధీటుగా బదులిచ్చి లంక మ్యాచ్ను టై చేసింది.అర్ష్దీప్ సింగ్ చేతికి బంతిఈ క్రమంలో సూపర్ ఓవర్ అనివార్యం కాగా.. ఈసారి భారత్ తమ సత్తా చూపించింది. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతికి సూర్య బంతిని ఇవ్వగా.. అతడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. లంకను రెండు పరుగులకే పరిమితం చేసి.. రెండు వికెట్లు తీశాడు. అనంతరం సూర్య బ్యాట్తో రంగంలోకి దిగి తొలి బంతికే మూడు పరుగులు రాబట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో లంకపై గెలిచిన అనంతరం మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నాకైతే ఇదే ఫైనల్ మ్యాచ్లా అనిపించింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో మా వాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచి టై వరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మేము గెలిచాము.సంజూ, తిలక్ సూపర్సంజూ, తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన తీరు కనువిందు చేసింది. సంజూ ఓపెనర్గా రాగలడు. మిడిలార్డర్లోనూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగలడు. తిలక్ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది.ఇక అర్ష్దీప్ సింగ్.. గత రెండు- మూడేళ్లుగా జట్టుకు ఎంతో చేశాడు. ఈరోజు కూడా తన ప్రణాళికలకు కట్టుబడి ఉండి.. తనకు నచ్చినట్లుగానే వాటిని అమలు చేయమని చెప్పాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో (సూపర్ ఓవర్) అతడు అద్భుతం చేశాడు.అతడికే ఇది సాధ్యంగతంలో కూడా టీమిండియా తరఫున, ఐపీఎల్లోనూ ఇదే చేశాడు. అతడి ఆత్మవిశ్వాసమే బంతి రూపంలో ఇలా మాట్లాడుతుంది. అర్ష్దీప్ తప్ప ఈ సూపర్ ఓవర్ ఎవరూ ఇంత చక్కగా వేయలేరు’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.Arshdeep '𝘊𝘭𝘶𝘵𝘤𝘩' Singh 🔝🔥#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/GnOq4conhn— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 కాగా లంకతో మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి విజృంభించగా.. సంజూ శాంసన్ (23 బంతులో 39), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) రాణించాడు. ఇక పేసర్ అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు1 ball is all it took! 😎Surya Kumar Yadav seals an epic super over win for India 👏#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/H1z9GQQWDO— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
చరిత్ర సృష్టించిన నిసాంక.. ఆసియా కప్ హిస్టరీలోనే...
టీమిండియాతో ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి... 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలుఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాతుమ్ నిసాంక (Pathum Nissanka) ఆసియా కప్ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును నిసాంక బద్దలు కొట్టాడు.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. లీగ్, సూపర్-4 మ్యాచ్లలో పరాజయమే ఎరుగక ఫైనల్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో సూపర్-4 దశలో చివరిగా ఈ రెండు జట్లు (IND vs SL) నామమాత్రపు మ్యాచ్లో తలపడ్డాయి.అభిషేక్ శర్మ ధనాధన్దుబాయ్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి మెరుపులు మెరిపించగా.. తిలక్ వర్మ (49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39) రాణించారు.Beast mode Abhishek Sharma! 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/CrQW1M492m— Sony Sports Network (@SonySportsNetwk) September 27, 2025 నిసాంక మెరుపు సెంచరీఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంకకు.. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ను డకౌట్ చేశాడు. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ నిసాంకతో పాటు వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) ధనాధన్ దంచికొట్టాడు.టీమిండియా సూపర్ విజయంఆఖర్లో దసున్ శనక (11 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి శ్రీలంక కూడా ఐదు వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.అయితే, ఈసారి టీమిండియా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ఆరు బంతుల్లో లంకను రెండు పరుగులకు కట్టడి చేసి రెండు వికెట్లు తీసిన వికెట్ తీసిన భారత్.. ఆ తర్వాత తొలి బంతికే మూడు పరుగులు చేసి జయభేరి మోగించింది.ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల వీరులు వీరే🏏పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 12 ఇన్నింగ్స్లో 434* పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 ఇన్నింగ్స్లో 429 పరుగులు🏏అభిషేక్ శర్మ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 309 పరుగులు🏏బాబర్ హయత్ (హాంకాంగ్)- 8 ఇన్నింగ్స్లో 292 పరుగులు🏏మొహమ్మద్ రిజ్వాన్ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 281 పరుగులు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మPathum Nissanka anchors the chase with a six-hitting spree 💥 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jlzQgHf6Ga— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
ఆసియా కప్: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.ఒకే ఒక్క ఓవర్ వేసిదుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఫీల్డింగ్కు రాని అభిషేక్మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.అప్పుడే ఫిట్నెస్పై అంచనాకు వస్తాంఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్నెస్పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.ఇద్దరూ అత్యంత కీలకంఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక. చదవండి: సూర్యకుమార్పై ఐసీసీ చర్య -
Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 26న జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే ఫైనల్కు చేరింది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్ మెండిస్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్ తొలి బంతికి ఔట్ కావడంతో సీన్ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది. -
IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. స్టార్ ఆటగాడి రికార్డు బద్దలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్పై కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్.. 6 మ్యాచ్ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్రేట్తో, 51.50 సగటున, 3 హాఫ్ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ మరో మ్యాచ్ (ఫైనల్) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్ ఓ ఆల్టైమ్ రికార్డును సెట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్కు ముందు టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్ ఎడిషన్) చేసిన రికార్డు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (281) పేరిట ఉండేది. రోహిత్ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్ (61), శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) ఔట్ కాగా.. తిలక్ వర్మ (27), సంజూ శాంసన్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇదివరకే ఫైనల్కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా -
Asia cup 2025: శ్రీలంకపై టీమిండియా గెలుపు
శ్రీలంకపై టీమిండియా గెలుపుశ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది.స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో తేలనున్న ఫలితంభారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న శ్రీలంకశ్రీలంక టీమిండియాకు షాకిచ్చే దిశగా సాగుతోంది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 15 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టు 30 బంతుల్లో మరో 46 పరుగులు చేస్తే టీమిండియాపై సంచలన విజయం సాధిస్తుంది. నిస్సంక (93), అసలంక (5) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక12.2వ ఓవర్-వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుసాల్ పెరీరా (58) స్టంపౌటయ్యాడు. దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 114/1గా ఉంది. ఈ మ్యాచ్లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా (కుసాల్ మెండిస్ డకౌట్).. పథుమ్ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అభిషేక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.భారీ స్కోర్ దిశగా టీమిండియాటీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 179/5గా ఉంది. తిలక్ వర్మ (42), అక్షర్ పటేల్ (9) క్రీజ్లో ఉన్నారు. నిరాశపరిచిన హార్దిక్16.1వ ఓవర్- హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.3వ ఓవర్- 39 పరుగులు చేసి సంజూ శాంసన్ ఔటయ్యాడు. షనక బౌలింగ్లో అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 94/3గా ఉంది. తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (1) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా6.5వ ఓవర్- హసరంగ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్తో పాటు తిలక్ వర్మ (1) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ప్రస్తుత ఆసియా కప్లో అభిషేక్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 71/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మఆసియా కప్లో అభిషేక్ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 59/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.టీమిండియాకు ఆదిలోనే షాక్1.3వ ఓవర్- టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తీక్షణ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్ బెర్త్లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార -
ఆసియా కప్-2025: ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్లో పాక్పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్రేటుతో రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్లో నిలిచింది.టీమిండియాకు నల్లేరు మీద నడకేఇక బుధవారం నాటి మ్యాచ్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్లో బంగ్లాదేశ్ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.ఇది టీ20 ఫార్మాట్ గురూ!ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు. ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ -
పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జట్టుతో డేంజర్?
ఆసియాకప్-2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో యూఏఈను చిత్తు చేసిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్పై అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మ్రోగించింది.వరుసగా రెండు విజయాలతో గ్రూపు-ఎ నుంచి టేబుల్ టాపర్గా భారత్ నిలిచింది. భారత్కు ఇంకా ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. సెప్టెంబర్ 19న పసికూన ఒమన్తో సూర్య కుమార్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ విజయం నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి.ఇప్పటికే పాక్పై విజయంతో మెన్ ఇన్ బ్లూ సూపర్ బెర్త్ను ఖారారు చేసుకుంది. గ్రూపు-ఎ టేబుల్ టాపర్గా ఉన్న భారత్ సూపర్-4 రౌండ్ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 21న ఏ2తో తలపడనుంది. అంటే దాదాపు మళ్లీ పాక్-భారత్ జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడే అవకాశముంది. శ్రీలంకతో జాగ్రత్త.. అయితే ఈ టోర్నీలో భారత్ అద్బుతమైన విజయాలతో దూసుకెళ్లుతున్నప్పటికి డిఫిండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ ఎంతో కొంత పోటీ ఎదురయ్యే అవకాశముంది. పాక్, బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్లు పోటీపడుతున్నప్పటికి.. ఆ టీమ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి.ముఖ్యంగా శ్రీలంకను టీమిండయిఆ ఏ మాత్రం తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్లో సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో అన్ని జట్లకు భిన్నంగా శ్రీలంక ముగ్గురు పేస్ బౌలర్లతో తమ తొలి మ్యాచ్లో ఆడింది. దుష్మాంత చమీరా, మతీషా పతిరానా, నువాన్ తుషారా వంటి పేస్ త్రయం శ్రీలంక వద్ద ఉంది. పవర్ప్లేలో తుషారా తన సంచలన బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయగలడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ వనిందు హసరంగా ఉన్నాడు.ఐపీఎల్లో ఆడిన అనుభవం హసరంగా ఉండడంతో భారత బ్యాటర్ల వీక్నెస్ అతడికి బాగా తెలుసు. అంతేకాకుండా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్కు ఆడిన కమిందు మెండిస్ సైతం లంక జట్టులో భాగంగా ఉన్నాడు. అతడి కూడా బంతిని గింగరాలు తిప్పగలడు.బ్యాటింగ్ విషయానికి వస్తే కుశాల్ మెండిస్, నిస్సాంక, కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక వంటి హిట్టర్లతో శ్రీలంక పటిష్టంగా ఉంది. యువ ఆటగాడు కమిల్ మిశ్రా సైతం మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్పై మిశ్రా 46 పరగులతో సత్తాచాటగా.. నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు.శ్రీలంక కూడా టీమిండియా మాదిరిగానే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఒకవేళ శ్రీలంక గ్రూపు-బి టేబుల్ టాపర్గా కొనసాగితే.. సూపర్-4 రౌండ్లో భారత్తో సెప్టెంబర్ 26న తలపడనుంది. కాగా చివరసారిగా టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియాకప్(2022)ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.అత్యధిక ఆసియాకప్ టైటిల్స్ గెలుచుకున్న జట్టుగా భారత్ తర్వాత శ్రీలంకనే కొనసాగుతోంది. టీమిండియా అత్యధికంగా 8 సార్లు ఈ మెగా టోర్నీ విజేతగా నిలవగా.. లంక 6 సార్లు ఛాంపియన్గా నిలిచింది. -
ఆసియాకప్ పుట్టింది ఇలా.. తొలి టైటిల్ ఎవరిదంటే?
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. తొలి టైటిల్ మనదే..ఆసియాకప్ తొలి ఎడిషన్కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.ఈ మ్యాచ్లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్ను సొంతం చేసుకుంది.ఏకైక జట్టుగా శ్రీలంక..ఇప్పటివరకు 16 ఆసియాకప్లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్లు చెరో 15 సార్లు ఆసియాకప్లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్ను పాక్ బాయ్కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్లో భాగమైంది.ఐసీసీ జోక్యం..కాగా 2015లో ఆసియాకప్నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్ను తొలిసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు సన్నాహక టోర్నమెంట్గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.తిరుగులేని భారత్..1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్లో టైటిల్ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ ట్రోఫీని ముద్దాడాయి.చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం -
ICC: వన్డే వరల్డ్కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
మహిళల వన్డే ప్రపంచకప్-2025 (ICC ODI World Cup) టోర్నమెంట్కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక అప్డేట్ అందించింది. టోర్నమెంట్ ఓపెనర్లో భాగంగా ఆతిథ్య దేశాలు భారత్- శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్ వేదికను మార్చింది.తొలుత బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఈ వన్డేను నిర్వహించాలని భావించిన ఐసీసీ.. తాజాగా దీనిని గువాహటిలోని బర్సపరా స్టేడియానికి మార్చింది. అదే విధంగా.. ఈ మెగా టోర్నీలో బెంగళూరులో జరగాల్సిన మిగతా మ్యాచ్లన్నింటి వేదికను నవీ ముంబైకి తరలించింది.తొక్కిసలాటలో ప్రాణాలు పోయాయిఇటీవల ఐపీఎల్-2025 (IPL)లో విజేతగా నిలిచిన తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి.. పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న విషాదరకర ఘటన విదితమే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యంతో పాటు కర్ణాటక ప్రభుత్వం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దర్యాప్తులో తప్పంతా ఆర్సీబీదేనని తేలింది.నవీ ముంబైలో..ఇదిలా ఉంటే.. తొక్కిసలాట ఘటన తర్వాత.. చిన్నస్వామి స్టేడియంలో వరల్డ్కప్ మ్యాచ్లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్లను నవీ ముంబైలో నిర్వహించాలని నిర్ణయించింది.ఐసీసీ తాజా ప్రకటన ప్రకారం.. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఐదు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ దశలో మూడు, సెమీ ఫైనల్, ఫైనల్ కూడా ఇక్కడే జరిగే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ప్రకారం.. ఆ దేశ మహిళా జట్టు తటస్థ వేదికైన శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్లు ఆడనున్న విషయం తెలిసిందే.పాక్ జట్టు ఫైనల్ చేరితే?ఒకవేళ పాక్ జట్టు ఫైనల్ చేరితే మాత్రం నవీ ముంబై గాకుండా.. కొలంబోలో టైటిల్ పోరు జరుగుతుంది. ఇక బెంగళూరులో జరగాల్సిన భారత్ వర్సెస్ శ్రీలంక, ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లు మాత్రం నవీ ముంబైలో జరగడం ఖరారైంది.కాగా బెంగళూరు నుంచి వేదికను తరలించాల్సి వస్తే తిరువనంతపురంలో మ్యాచ్లు జరుగుతాయని వార్తలు వచ్చాయి. అయితే, నవీ ముంబై తాజాగా ఈ మ్యాచ్ల ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. కాగా సెప్టెంబరు 30న భారత్- శ్రీలంక మ్యాచ్తో గువాహటి వేదికగా వన్డే ప్రపంచకప్-2025 టోర్నీకి తెరలేవనుంది.వన్డే వరల్డ్కప్-2025లో టీమిండియా షెడ్యూల్ (అప్డేటెడ్)🏏సెప్టెంబరు 30- భారత్ వర్సెస్ శ్రీలంక- గువాహటి🏏అక్టోబరు 5- భారత్ వర్సెస్ పాకిస్తాన్- కొలంబో🏏అక్టోబరు 9- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా- విశాఖపట్నం🏏అక్టోబరు 12- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా- విశాఖపట్నం🏏అక్టోబరు 19- భారత్ వర్సెస్ ఇంగ్లండ్- ఇండోర్🏏అక్టోబరు 23- భారత్ వర్సెస్ న్యూజిలాండ్- నవీ ముంబై🏏అక్టోబరు 26- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- నవీ ముంబై.నాకౌట్ స్టేజ్ షెడ్యూల్🏏అక్టోబరు 29- సెమీ ఫైనల్ 1- కొలంబో/గువాహటి🏏అక్టోబరు 30- సెమీ ఫైనల్ 2- నవీ ముంబై🏏నవంబరు 2- ఫైనల్- కొలంబో/నవీ ముంబైవన్డే వరల్డ్కప్-2025 టోర్నీకి భారత మహిళా క్రికెట్ జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, అమన్జోత్ కౌర్, రాధ యాదవ్, రేణుక ఠాకూర్, శ్రీచరణి, స్నేహ్ రాణా. స్టాండ్బై: సయాలీ సత్ఘరే, తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మిన్ను మణి.చదవండి: సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర -
రోహిత్, కోహ్లి అభిమానులకు గుడ్ న్యూస్
దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఆగస్ట్లో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్ట్లో టీమిండియా ఖాళీగా ఉండనుంది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్లో భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు (3 వన్డేలు, 3 టీ20లు) నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది.ఇందుకు శ్రీలంక బోర్డు ఒకే చెబితే మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆగస్ట్లో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ కూడా వాయిదా పడటంతో భారత్తో సిరీస్ ఆడేందుకు శ్రీలంక బోర్డుకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆగస్ట్ చివర్లో శ్రీలంక జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఆలోపే భారత్తో సిరీస్ జరిగే ఆస్కారం ఉంది. భారత్ చివరిసారిగా 2023లో శ్రీలంకలో పర్యటించింది. ఈ ఏడాది లంకలో టీమిండియా పర్యటన షెడ్యూల్ కాలేదు. అయితే అనుకోకుండా ఈ ప్రతిపాదన వచ్చింది.ఆగస్ట్లో బరిలోకి దిగనున్న దిగ్గజాలు..?భారత్, శ్రీలంక మధ్య ఆగస్ట్లో పరిమిత ఓవర్ల సిరీస్ల ప్రస్తావనకు రావడంతో టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో తేలిపోతున్నారు. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లి ఈ వన్డే సిరీస్లో తప్పక ఆడతారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ సిరీస్ సాధాసాధ్యాలపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి పాల్గొనే దానిపై కూడా క్లారిటీ రానుంది.ఒకవేళ శ్రీలంకతో సిరీస్ సాధ్యపడకపోతే మాత్రం రోహిత్, కోహ్లి అభిమానులు వారి రాక కొరకు అక్టోబర్ వరకే వేచి చూడాల్సిందే. అక్టోబర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగనుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్లో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లి తప్పక ఆడే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లి చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో కలిసి ఆడారు. ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచి 13 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ టోర్నీ తర్వాతే రోహిత్, కోహ్లి రోజుల వ్యవధిలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందు వీరిద్దరు ఒకేసారి (2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత) టీ20 ఫార్మాట్కు గుడ్బై చెప్పారు. -
మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్
సీకే నాయుడు- సీఎస్ నాయుడు, క్రిపాల్ సింగ్- ఏజీ మిల్కా సింగ్, సుభాష్- బాలూ గుప్తే, అమర్ సింగ్- లధా రామ్జీ, మాధవ్- అరవింద్ ఆప్టే, మోహిందర్- సురీందర్ అమర్నాథ్, వజీర్ అలీ- నజీర్ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.ప్రస్తుతం ఆక్టివ్గా ఉన్న హార్దిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్ బ్రదర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) బ్యాటింగ్ ఆల్రౌండర్ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ ఆల్రౌండర్. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అన్న యూసఫ్ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.కోచ్ నాతో ఇదే అన్నాడుఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్ కోసం తనను తప్పించామని నాటి కోచ్ గ్యారీ కిర్స్టన్ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్తో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.అప్పుడు గ్యారీ కిర్స్టన్.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్ ఈ విషయాన్ని వెల్లండించాడు.బ్రదర్స్ అదుర్స్కాగా గుజరాత్కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్ పఠాన్ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025 -
IND vs SL: ఫైనల్లో శతకంతో చెలరేగిన స్మృతి.. సరికొత్త చరిత్ర
శ్రీలంకతో ఫైనల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) సంచలన శతకంతో మెరిసింది. కేవలం 92 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్లో పదకొండవ వన్డే సెంచరీ నమోదు చేసింది.శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్యతద్వారా మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు బాదిన మూడో బ్యాటర్గా రికార్డు సృష్టించింది. కాగా శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మహిళా జట్ల మధ్య త్రైపాక్షిక వన్డే సిరీస్కు లంక ఆతిథ్యమిస్తోంది. ఏప్రిల్ 27న శ్రీలంక- భారత్ మధ్య మ్యాచ్తో మొదలైన ఈ సిరీస్లో .. హర్మన్ సేన వరుస విజయాలు సాధించింది.తొలుత ఆతిథ్య లంకను, తర్వాత సౌతాఫ్రికాను ఓడించింది. మరుసటి మ్యాచ్లో లంక చేతిలో ఓడిన భారత జట్టు.. తర్వాత సౌతాఫ్రికాపై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. మరోవైపు రెండు విజయాలతో శ్రీలంక కూడా తుదిపోరుకు అర్హత సాధించింది.101 బంతులు ఎదుర్కొనిఈ క్రమంలో ఇరుజట్ల (IND vs SL) మధ్య కొలంబో వేదికగా ఆదివారం (మే 11) ఫైనల్లో టాస్ గెలిచిన భారత్.. లంకను బౌలింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు ప్రతికా రావల్ (30), స్మృతి మంధాన శుభారంభం అందించారు. ప్రతికా కాసేపటికే పెవిలియన్ చేరినా.. స్మృతి అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించింది. లంక కెప్టెన్ చమరి ఆటపట్టు బౌలింగ్లో వరుసగా నాలుగు బౌండరీలు బాది సెంచరీ మార్కును అందుకుని.. చక్కటి షాట్లతో అలరించింది.సరికొత్త చరిత్రఈ క్రమంలో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా అవతరించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (52 సిక్సర్లు) వెనక్కి నెట్టి.. మొత్తంగా 54 సిక్సర్లతో ఈ ఫీట్ నమోదు చేసింది.అదే విధంగా.. మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా- 15), సుజీ బేట్స్ (న్యూజిలాండ్- 13) తర్వాతి స్థానాల్లో నిలిచింది. ఇక మొత్తంగా ఇప్పటికి 102 వన్డేలు పూర్తి చేసుకున్న స్మృతి మంధాన ఖాతాలో 4473 పరుగులు ఉన్నాయి.ఫైనల్ క్వీన్సిరీస్ ఏదైనా ఫైనల్ అంటే ఆటగాళ్లపై సహజంగానే ఒత్తిడి ఒకింత ఎక్కువవుతుంది. అయితే, మంధాన మాత్రం ఒత్తిడిలోనే తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. గత ఐదు ఫైనల్స్లో ఆమె ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఒక్కసారి డకౌట్ కావడం మినహా మిగతా నాలుగు సందర్బాల్లో స్మృతి నమోదు చేసిన గణాంకాలు 51 నాటౌట్, 46, 60, 116.ఇక ఏదేని ఫైనల్లో ఇంత వరకు సెంచరీ బాదిన భారత ఏకైక మహిళా క్రికెటర్గా కొనసాగుతున్న మాజీ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును స్మృతి.. తాజాగా సమం చేసింది.భారత్ తరఫున గత ఐదు ఫైనల్స్లో స్మృతి మంధాన గణాంకాలు👉శ్రీలంక మీద- ట్రై సిరీస్ ఫైనల్లో 101 బంతుల్లో 116, మే, 2025👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 47 బంతుల్లో 60, జూలై 2024👉శ్రీలంక మీద- ఆసియా క్రీడల ఫైనల్లో 45 బంతుల్లో 46, సెప్టెంబరు 2023👉సౌతాఫ్రికాతో- ట్రై సిరీస్ ఫైనల్లో 0, ఫిబ్రవరి 2023👉శ్రీలంక మీద- ఆసియా కప్ ఫైనల్లో 25 బంతుల్లో 51, అక్టోబరు 2022.ఇక తాజాగా శ్రీలంక- సౌతాఫ్రికాలతో త్రైపాక్షిక సిరీస్లో ఐదు మ్యాచ్లలో కలిపి స్మృతి మంధాన 264 పరుగులు సాధించింది. లంకతో ఫైనల్లో డెమీ విహంగ బౌలింగ్లో హర్షిత మాదవికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఇక ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది.చదవండి: BCCI: ప్లీజ్ కింగ్!.. కోహ్లిని ఒప్పించేందుకు రంగంలోకి అతడు! -
IND vs SL: టీమిండియాకు చేదు అనుభవం.. లంక చేతిలో ఓటమి
Sri Lanka Women vs India Women: ముక్కోణపు వన్డే సిరీస్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో ఆదివారం నాటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా శ్రీలంక- భారత్- దక్షిణాఫ్రికా (Sri Lanka- India- South Africa) మధ్య లంక వేదికగా త్రైపాక్షిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా మూడు జట్ల మధ్య ఆరు మ్యాచ్ల తర్వాత ఫైనల్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో శ్రీలంకను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 15 పరుగుల తేడాతో గెలిచింది.తాజాగా ఆదివారం శ్రీలంకతో మ్యాచ్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది.స్మృతి మంధాన విఫలంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్లలో ప్రతికా రావల్ (35) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (18) మాత్రం విఫలమైంది.మిగతా వాళ్లలో హర్లీన్ డియోల్ 29, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 30, జెమీమా రోడ్రిగెస్ 37 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అర్ధ శతకం (48 బంతుల్లో 58)తో రాణించింది. ఆల్రౌండర్లు దీప్తి శర్మ 24, కశ్వీ గౌతమ్ 17.. టెయిలెండర్లు స్నేహ్ రాణా 10, అరుంధతి రెడ్డి 9 (నాటౌట్) పరుగులు రాబట్టారు.శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కెప్టెన్ చమరి ఆటపట్టు మూడేసి వికెట్లతో చెలరేగగా.. డెమీ విహంగ, ఇనక రణవీర ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.హర్షిత, నీలాక్షి హాఫ్ సెంచరీలుఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు హాసిని పెరీరా (22), విష్మి గుణరత్నె (33) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ హాఫ్ సెంచరీ (53)తో అదరగొట్టింది.అయితే, కెప్టెన్ చమరి ఆటపట్టు మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేక 23 పరుగులకే వెనుదిరగగా.. కవిష దిల్హారి (35)తో కలిసి నీలాక్షి డి సిల్వా (56) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుష్క సంజీవని (23), సుగందిక కుమారి (19) కుమారి కలిసి అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన శ్రీలంక.. మూడు వికెట్ల తేడాతో హర్మన్ సేనను ఓడించింది. తదుపరి బుధవారం భారత జట్టు సౌతాఫ్రికాతో వన్డే ఆడనుంది.భారత్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు👉భారత్ స్కోరు: 275/9 (50)👉శ్రీలంక స్కోరు: 278/7 (49.1)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో భారత జట్టుపై శ్రీలంక గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నీలాక్షి డి సిల్వ.చదవండి: అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా?: సహనం కోల్పోయిన ధోని -
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్లో కోడ్ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్ వెనుక పడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేట్లో ప్రతి ఓవర్కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయంఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.రాణా ఓవరాల్గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్లో భారత్, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్ టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. -
శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకలో పర్యటించనున్న మహిళా క్రికెట్ జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. శ్రీలంక- సౌతాఫ్రికాలతో జరుగనున్న త్రైపాక్షిక వన్డే సిరీస్కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును వుమెన్స్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది.హర్మన్ప్రీత్ పునరాగమనంఈ ప్రతిష్టాత్మక సిరీస్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) భారత జట్టును ముందుకు నడిపించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా కొనసాగనుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అమ్మాయి అరుంధతి రెడ్డి, ఆంధ్ర క్రికెటర్, అన్క్యాప్డ్ ప్లేయర్ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా చోటు దక్కించుకున్నారు.అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుఅంతేకాదు.. శ్రీచరణితో పాటు మరో ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు కశ్వీ గౌతమ్ (Kashvi Gautam), శుచీ ఉపాధ్యాయ్కు కూడా సెలక్టర్లు చోటివ్వడం విశేషం. మరోవైపు.. గాయాల కారణంగా రేణుకా సింగ్ ఠాకూర్, టైటస్ సాధు ఈ వన్డే సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది.చివరగా మంధాన సారథ్యంలోకాగా జనవరిలో ఐర్లాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హర్మన్కు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు ఆమె స్థానంలో మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో జనవరి 10- 15 వరకు జరిగిన ఈ సిరీస్లో మంధాన సేన ఐర్లాండ్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లో మంధానకు దీప్తి శర్మ డిప్యూటీగా వ్యవహరించింది.అన్నీ ఒకే స్టేడియంలోఇక ఏప్రిల్ 27 నుంచి శ్రీలంక- భారత్- సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా నాలుగు మ్యాచ్లకూ శ్రీలంకలోని కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ సిరీస్లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి.శ్రీలంక- సౌతాఫ్రికాలతో వన్డే సిరీస్కు భారత జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, కశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతీ రెడ్డి, తేజల్ హసాబ్నిస్, శ్రీచరణి, శుచీ ఉపాధ్యాయ్.ట్రై సిరీస్లో భారత్ షెడ్యూల్ ఇదేఏప్రిల్ 27, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29, మంగళవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికామే 4, ఆదివారం- ఇండియా వర్సెస్ శ్రీలంకమే 7, బుధవారం- ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా.చదవండి: గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు చెప్పిన కపిల్ దేవ్ -
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్తో సిరీస్లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్వాష్కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ప్రత్యర్థి చేతిలో క్లీన్స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో భాగంగా ఆసీస్తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్లో ఓ మ్యాచ్ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
U19 Asia Cup 2024: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్స్కోరర్గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్కు చోటు -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
భారత్ అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో సెమీఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన సూర్యవంశీ.. భారత్ అండర్-19 జట్టు తరఫున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున అతి చిన్న వయసులో అండర్-19 గేమ్ ఆడిన వైభవ్.. 13 సంవత్సరాల, 254 రోజుల వయసులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడి భారత జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు గాను వైభవ్ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లో భారత్.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ కాగా.. వైభవ్ రెచ్చిపోవడంతో భారత్ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.మరోవైపు ఇవాళే (డిసెంబర్ 6) జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది.వరుసగా రెండు హాఫ్ సెంచరీలు..అండర్-19 ఆసియా కప్లో వైభవ్ వరసగా రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన వైభవ్.. యూఏఈతో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద శతకం (43 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు).. తాజాగా మరో ఆర్ద శతకం సాధించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. మెగా వేలం తర్వాతే వైభవ్ ఎక్కువ వార్తల్లో ఉంటున్నాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. -
విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్ 2024లో భారత్ ఫైనల్కు చేరింది. ఇవాళ (డిసెంబర్ 6) జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చేతన్ శర్మ (3/34), కిరణ్ చోర్మలే (2/32), ఆయుశ్ మాత్రే (2/37), యుధజిత్ గుహా (1/19), హార్దిక్ రాజ్ (1/30) ధాటికి 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక ఇన్నింగ్స్లో లక్విన్ అభయ్సింఘే (69) టాప్ స్కోరర్గా నిలువగా.. షరుజన్ షణ్ముగనాథన్ (42), విహాస్ తేవ్మిక (14), కవిజ గమగే (10) రెండంకెల స్కోర్లు చేశారు.174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యంగ్ ఇండియా.. వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో 67; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 21.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో ఆయుశ్ మాత్రే (34), ఆండ్రీ సిద్దార్థ్ (22), కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (25 నాటౌట్), కేపీ కార్తికేయ (11) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లంక బౌలర్లలో విహాస్ తేవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 1.1 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం సూర్యవంశీ వయసు 13 ఏళ్లు. పాకిస్తాన్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 37 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ 22.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డిసెంబర్ 8న జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్ భారత్ను ఢీకొంటుంది. -
SL vs NZ: మెండిస్ సూపర్ ఇన్నింగ్స్.. కివీస్పై శ్రీలంక విజయం
పల్లెకలె వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో ఆతిథ్య శ్రీలంక సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45.1 ఓవర్లలో 209 పరుగులకే ఆలౌటైంది.మార్క్ చాప్మన్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్లు), మిచెల్ హే (62 బంతుల్లో 49; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక బౌలర్లలో వాండర్సే, తీక్షణ చెరో 3 వికెట్లు తీయగా, అసిత ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల సులువైన లక్ష్యాన్ని చేధించేందుకు లంకేయులు తీవ్రంగా శ్రమించారు. చివరకు 46 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుశాల్ మెండీస్ (102 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... మిగతావారిలో ఓపెనర్ నిసాంక (28; 4 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (5), కమిండు (0), కెపె్టన్ అసలంక (13), సమరవిక్రమ (8) విఫలమవడంతో లంక 163 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.83 బంతుల్లో 47 పరుగులు చేయాల్సివుండగా... కుశాల్, మహీశ్ తీక్షణ (44 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు అవసరమైన 47 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. బ్రాస్వెల్ 4, సాంట్నర్, ఫిలిప్స్, స్మిత్ తలా ఒక వికెట్ తీశారు. మంగళవారం ఇదే వేదికపై ఆఖరి వన్డే జరుగనుంది. కాగా 2012 తర్వాత కివీస్పై శ్రీలంక వన్డే సిరీస్ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి.చదవండి: రోహిత్ వచ్చినా అతడినే కెప్టెన్గా కొనసాగించండి: హర్భజన్ -
T20 World Cup 2024: రాణించిన మంధన, హర్మన్.. శ్రీలంక టార్గెట్ 173
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (అక్టోబర్ 9) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. స్మృతి మంధన (50), హర్మన్ప్రీత్ (52 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. షఫాలీ వర్మ 43 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో జెమీమా 16, రిచా ఘోష్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కాంచన తలో వికెట్ పడగొట్టగా.. మంధన రనౌటైంది. సెమీస్ రేస్లో ముందుండాలంటే టీమిండియా ఈ మ్యాచ్లో మెరుగైన రన్రేట్తో గెలవాల్సి ఉంది. -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొంది. పాక్పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
T20 World Cup 2024: లంకతో 'కీ' ఫైట్.. టీమిండియాలో కలవరం..!
మహిళల టీ20 వరల్డ్కప్ హోరాహోరీగా సాగుతోంది. గ్రూప్ ఆఫ్ డెత్గా పరిగణించబడుతున్న గ్రూప్-ఏలో మ్యాచ్లు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో ఎలాంటి సంచలనాలు నమోదు కానప్పటికీ.. ఏ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుందో ఇప్పుడో చెప్పలేని పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక దాంట్లో ఓడి (న్యూజిలాండ్), ఓ మ్యాచ్లో (పాక్పై) గెలిచింది. ప్రస్తుతం భారత్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాక్, భారత్, శ్రీలంక వరుస స్థానాల్లో ఉన్నాయి.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్లో ప్రస్తుతం ఇంగ్లండ్ టాప్లో ఉంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.లంకతో కీలక సమరం.. టీమిండియాలో కలవరంగ్రూప్-ఏలో భాగంగా రేపు (అక్టోబర్ 9) మరో కీలక సమరం జరుగనుంది. దుబాయ్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. లంకతో పోలిస్తే భారత్కు ఈ మ్యాచ్కు చాలా కీలకం. సెమీస్ రేసులో ముందుండాలంటే భారత్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. అయితే ఈ కీ ఫైట్కు ముందు టీమిండియాను ఓ అంశం తెగ కలవరపెడుతోంది.అక్టోబర్ 6న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ గాయపడింది. లంకతో మ్యాచ్కు ఆమె అందుబాటులో ఉండటంపై సందిగ్దత నెలకొంది. పరిస్థితుల దృష్ట్యా హర్మన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కీలక మ్యాచ్ కావడంతో ఆమె బరిలోకి దిగే ఛాన్స్లు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా హర్మన్ అంశం టీమిండియాను కలవరపెడుతోంది. చదవండి: T10 League: ఊతప్ప ఊచకోత.. కేవలం 27 బంతుల్లోనే! -
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యను పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచకప్-2026 వరకు అతడిని కోచ్గా కొనసాగించనున్నట్లు వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో చెత్త ప్రదర్శనతో శ్రీలంక జట్టు విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొట్టి వరల్డ్కప్ తర్వాత క్రిస్ సిల్వర్వుడ్ తన హెడ్కోచ్ పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్యను లంక బోర్డు తాత్కాలిక కోచ్గా నియమించింది.ఆదిలోనే చేదు అనుభవంటీమిండియాతో సొంతగడ్డపై టీ20 సిరీస్ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన జయసూర్యకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. సూర్యకుమార్ సేన చేతిలో లంక 3-0తో క్లీన్స్వీప్నకు గురైంది. అయితే, ఈ పరాభవాన్ని మర్చిపోయేలా వన్డే సిరీస్లో శ్రీలంక చారిత్రాత్మక విజయం సాధించింది.ఆ తర్వాత వరుస విజయాలుదాదాపు ఇరవై ఏడేళ్ల విరామం తర్వాత భారత జట్టుపై వన్డేల్లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచింది. జయసూర్య మార్గదర్శనంలో ఈ అద్వితీయ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస విజయాలతో శ్రీలంక జట్టు ముందుకు దూసుకుపోతోంది. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా పదేళ్ల తర్వాత అక్కడ టెస్టు మ్యాచ్ గెలిచిన లంక.. స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.ఈ జైత్రయాత్రకు ప్రధాన కారణం జయసూర్య గైడెన్స్ అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే లంక బోర్డు అతడిని పూర్తి స్థాయి హెడ్కోచ్గా నియమించింది. ‘‘తాత్కాలిక హెడ్ కోచ్గా ఉన్న జయసూర్య మార్గదర్శనంలో.. ఇటీవలి కాలంలో టీమిండియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లపై శ్రీలంక అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.టీ20 వరల్డ్కప్ వరకూ అతడే!ఈ విజయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జయసూర్యను హెడ్కోచ్గా కొనసాగించాలని నిర్ణయించింది. అక్టోబరు 1, 2024 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మార్చి 31, 2026 వరకు అతడు ఈ పదవిలో కొనసాగుతాడు’’ అని లంక బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా జయసూర్య గతంలో చీఫ్ సెలక్టర్గానూ పనిచేశాడు. ఇక ఫుల్టైమ్ హెడ్కోచ్గా వెస్టిండీస్తో డంబుల్లా వేదికగా మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్తో అతడి ప్రయాణం మొదలుకానుంది.చదవండి: ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్ -
రోహిత్ చెప్పినట్టు మేము వినాల్సిందే.. లేదంటే: షమీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.అవును.. నా పని నేను చేస్తా!ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు. Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024 -
చీటర్.. అలాంటి వాళ్లతో జాగ్రత్త! హార్దిక్ పాండ్యాను ఉద్దేశించేనా?
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. ఆటకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఉంటూ క్రికెట్ నుంచి దొరికిన విరామ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. సాగరతీరాన.. స్విమ్మింగ్పూల్ ఒడ్డున సేద తీరుతూ.. నీలాకాశాన్ని వీక్షిస్తున్న దృశ్యాలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ‘చీటర్’ అన్న పోస్టుకు లైక్ కొట్టడం నెట్టింట చర్చకు దారితీసింది.నటాషాపై విమర్శలుకాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా పూర్తిగా విఫలమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024 ద్వారా ఆటగాడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి అభిమానుల నీరాజనాలు అందుకున్నాడు. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ భార్య నటాషా హార్దిక్తో లేకపోవడంతో వీరి మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు రాగా.. కొన్నిరోజులు తర్వాత ఈ అంశంపై స్పష్టత వచ్చింది.తమ దారులు వేరయ్యానని.. తాము విడాకులు తీసుకున్నామని హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ సంయుక్త అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో హార్దిక్ అభిమానులు నటాషాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ పేరు, డబ్బు ఉపయోగించుకునేందుకే అతడి జీవితంలోకి వచ్చిందని.. భరణం రూపంలోనూ పెద్ద మొత్తమే తీసుకుందని ఇష్టారీతిన కామెంట్లు చేశారు.ఇక కుమారుడు అగస్త్యను తీసుకుని పుట్టినిల్లు సెర్బియాకు వెళ్లిన నటాషా.. అతడితో ట్రిప్నకు వెళ్లిన ఫొటోలు పంచుకోగా.. హార్దిక్ వాటికి హార్ట్ సింబల్ జోడిస్తూ లైక్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటాషాను మర్చిపోలేకపోతున్నాడని.. ఆమె వల్ల హార్దిక్ పాండ్యా చాలా బాధపడుతున్నాడంటూ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై నటాషా పరోక్షంగా స్పందించింది.చీటర్.. ఆ పోస్టులకు నటాషా లైక్‘‘చీటర్.. శారీరకంగా, మానసికంగా హింసించే వాళ్లతో బంధం కొనసాగిస్తే ఇలాగే ఉంటుంది.. కొంతమంది తామే సమస్యను సృష్టించి మళ్లీ వారే బాధితులుగా నటిస్తారు.. అందుకు ఇదే ఉదాహరణ... ఇతరుల ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేవాళ్లతో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ బంధాల గురించి చర్చిస్తున్న ఇన్స్టా వీడియోలకు నటాషా స్టాంకోవిక్ లైక్ కొట్టింది. ఇందుకు స్పందించిన నెటిజన్లలో మెజారిటీ మంది నటాషాకు మద్దతుగా నిలుస్తున్నారు. హార్దిక్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే వాళ్లు ఇప్పటికైనా నటాషాను వేధించడం మానాలని హితవు పలుకుతున్నారు.కాగా ప్రపంచకప్-2024 తర్వాత హార్దిక్ పాండ్యా శ్రీలంకతో టీ20 సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, వన్డే సిరీస్కు మాత్రం అతడు ఎంపికకాలేదు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ సిరీస్కు అతడు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. శ్రీలంక టూర్లో 3-0తో టీ20 సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను 0-2తో ఆతిథ్య శ్రీలంకకు కోల్పోయింది. View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
'అదొక విచిత్రమైన పిచ్.. అక్కడ ఆడటం కోహ్లి, రోహిత్కైనా కష్టమే'
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్ల్లో కోహ్లి కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు.ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్ల్లోనూ స్పిన్నర్కే కోహ్లి ఔట్ కావడం గమనార్హం. కోహ్లి ఒక్కడే కాకుండా మిగితా బ్యాటర్లు కూడా లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.తమ సొంతపిచ్లపై తప్ప స్వింగ్, స్పిన్ కండీషన్స్లో ఆడలేరని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. కొలంబోలోని వికెట్ కండీషన్స్ చూసి భారత ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారని కార్తీక్ తెలిపాడు."ఈ సిరీస్లో టీమిండియా స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. దాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ బంతి కొంచెం పాతబడ్డాక బాగా టర్న్ అవుతోంది. ముఖ్యంగా 8-30 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కొవడం ఆటగాళ్లకు చాలా కష్టమైన పని. అది విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ అయినా కావచ్చు. అందులో కొలంబో పిచ్ ఇంకా కఠినమైన పిచ్. ఈ పిచ్పై స్పిన్నర్లకు ఆడటం చాలా కష్టం. ఆటలో గెలుపు ఓటుములు సహజం. ఈ ఒక్కసిరీస్లో ఓడిపోయినంతమాత్రాన డీలా పడాల్సిన పనిలేదన్నారు.అన్ని పిచ్లు ఈ విధంగా ఉండవు. నేను ఏదో విరాట్ కోహ్లిని సపోర్ట్ చేసేందుకు ఈ వాఖ్యలు చేయడం లేదు. కొలంబో వికెట్ పరిస్థితులను మాత్రమే తెలియజేశానని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
జట్టులో చోటు ఎందుకు లేదు?.. సంజూ రిప్లై అదుర్స్
స్వప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యమని టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్ అన్నాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగటం తనకు అలవాటని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సంజూ ప్రస్తుతం స్వరాష్ట్రం కేరళలో ఉన్నాడు.ఈ క్రమంలో కేరళ క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో సంజూ శాంసన్ పాల్గొన్నాడు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడుతుండగా.. శ్రీలంక వన్డే సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో చివరిసారిగా టీమిండియాకు ఆడిన సంజూ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. లంక సిరీస్కు ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటని ఓ విలేఖరి ప్రశ్నించారు.సానుకూల దృక్పథంతో ఉంటాఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లు ఎప్పుడైతే నన్ను సెలక్ట్ చేస్తారో.. అప్పుడు వెళ్లి ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. ఏదేమైనా మన జట్టు బాగా ఆడితే అదే చాలు. లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. నా ఆధీనంలోలేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించను. వీలైనంత వరకు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలనే అనుకుంటాను. నేను ఏం చేయగలనో అది మాత్రమే చేస్తాను’’ అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం.. శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఈ టూర్ ద్వారా టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ పర్యటన సందర్భంగా టీ20 సిరీస్కు ఎంపికైన సంజూ శాంసన్ను.. వన్డే సిరీస్కు మాత్రం పక్కనపెట్టారు సెలక్టర్లు.రెండుసార్లూ డకౌట్చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత్ కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడననున్న నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను వెనక్కి పిలిపించారు. ఇదిలా ఉంటే.. టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం వచ్చినా సంజూ పూర్తిగా నిరాశపరిచాడు. రెండుసార్లూ డకౌట్గా వెనుదిరిగాడు సంజూ. ఇక ఈ టూర్లో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది సూర్యకుమార్ యాదవ్ సేన. అయితే, రోహిత్ కెప్టెన్సీలోని వన్డే జట్టు మాత్రం 0-2తో సిరీస్ను ఆతిథ్య లంకకు సమర్పించుకుంది. తద్వారా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. చదవండి: నా కోచింగ్ కెరీర్లో అదే ఘోర పరాభవం: ద్రవిడ్ The Kerala Boy at a press conference🔥#SanjuSamson pic.twitter.com/gsdv9SSHlP— Deepu (@deepu_drops) August 10, 2024 -
'భారత్లో అన్ని బ్యాటింగ్ పిచ్లే.. అందుకే ఇక్కడ ఆడలేకపోయారు'
స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది. భారత్పై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న లంకేయులు తమ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించారు. ఈ సిరీస్లో శ్రీలంక జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.ముఖ్యంగా లంక స్పిన్నర్లు భారత బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టారు. మూడు వన్డేల్లో కలిపి ఆతిథ్య జట్టు స్పిన్నర్లు ఏకంగా 27 వికెట్లు పడగొట్టారు. తొలి రెండు వన్డేల్లో కాస్త పర్వాలేదన్పంచిన టీమిండియా.. మూడో వన్డేలో మాత్రం పూర్తిగా తేలిపోయింది. కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 110 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ భారత జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్లో అన్నీ బ్యాటింగ్ పిచ్లే ఉంటాయని, తమ దేశంలో అలా ఉండవని తీక్షణ తెలిపాడు."భారత్లో దాదాపుగా అన్ని పిచ్లు ప్లాట్గా ఉండి బ్యాటింగ్కు అనుకూలిస్తాయి. అంతేకాకుండా బౌండరీలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఇటువంటి వికెట్పై భారత బ్యాటర్లు బాగా అలవాటు పడి ఉంటారు. అందుకే ఇక్కడ(శ్రీలంక)కు వచ్చి కాస్త ఇబ్బంది పడ్డారు.కొలంబోలోని ప్రేమదాస వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. మేము ఇక్కడ చాలా మ్యాచ్లు ఆడాము. కొంచెం టర్న్ ఉంటే చాలు మా జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నందున ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. దేశీవాళీ క్రికెట్లో కూడా మాకు ఇటువంటి పిచ్లే ఉంటాయి. కాబట్టి మా బ్యాటర్లకు ఇటువంటి వికెట్లపై ఎలా ఆడాలో తెలుసు అని ఓ స్పోర్ట్స్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థీక్షణ పేర్కొన్నాడు.చదవండి: #Arshad Nadeem: కూలీ కొడుకు.. ఒక్కపూట తిండిలేక పస్తులు.. ఒలింపిక్ వీరుడిగా -
కొత్త కోచ్ కోసం వెతుకున్నారు: సనత్ జయసూర్య
దాదాపు 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంక టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై స్పిన్ వల పన్ని భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి.. 2-0తో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లంక తాత్కాలిక హెడ్కోచ్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు.కుర్రాళ్లు అద్భుత ఆటతీరుతో.. ఎంతో కఠిన శ్రమకోర్చి గెలుపు రుచిని చవిచూశారని ప్రశంసించాడు. టీ20 సిరీస్లో ఎదురైన చేదు అనుభవం నుంచి కోలుకుని.. అనూహ్య విజయాన్ని అందుకున్నారని సనత్ జయసూర్య లంక వన్డే జట్టును కొనియాడాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.చేదు అనుభవంఈ టూర్తో టీమిండియా టీ20 రెగ్యులర్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, కొత్త హెడ్కోచ్గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టారు. ఆతిథ్య శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేయడంతో ఇద్దరి ఖాతాలో భారీ విజయం నమోదైంది. అయితే, వన్డేలో మాత్రం టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 2-0తో సిరీస్ను లంకకు సమర్పించుకుంది. తొలి వన్డేను టై చేసుకున్నప్పటికీ... శ్రీలంక స్పిన్నర్లు జెఫ్రె వాండర్సె, దునిత్ వెల్లలగే స్పిన్ మాయాజాలంలో చిక్కి ఆఖరి రెండు వన్డేల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య మాట్లాడుతూ.. ‘‘సుదీర్ఘకాలం పాటు ఇందుకోసం నిరీక్షించాం. 1997లో నేను జట్టులో ఉన్నపుడు టీమిండియాపై వన్డే సిరీస్ గెలిచాం. మళ్లీ ఇప్పుడు ఇలా విజయం అందుకున్నాం. 27 ఏళ్ల తర్వాత.. ఇలా దక్కిన గెలుపులో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది.ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదుశ్రీలంకలో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. వాళ్లు ఏం చేయగలరో ఈ సిరీస్ ద్వారా చేసి చూపించారు. టీ20 సిరీస్ తర్వాత అంతా స్తబ్దుగా మారిపోయింది. మేము తిరిగి పుంజుకుంటామని ఎవరూ ఊహించలేదు. అయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. అద్భుతంగా ఆడారు.వెల్లలగే, నిసాంక, అవిష్క ఫెర్నాండో, అసలంక.. ఇలా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. హసరంగ గాయం కారణంగా దూరం కాగా.. వాండర్సె అతడి స్థానంలో వచ్చి.. అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వెల్లలగే సైతం అద్బుతంగా రాణించాడు’’ అని సనత్ జయసూర్య తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.కొత్త కోచ్ కోసం వెతుకున్నారుటీమిండియా, ఇంగ్లండ్లతో సిరీస్ల నేపథ్యంలో తాను కోచ్గా బాధ్యతలు చేపట్టానని... ఈ మ్యాచ్లు ముగిసిన తర్వాత కొత్త కోచ్ వస్తాడని సనత్ జయసూర్య తెలిపాడు. ఇందుకోసం లంక బోర్డు వివిధ ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే, హై పర్ఫామెన్స్ ఇన్చార్జ్గా తాను శ్రీలంక క్రికెట్కు సేవలు అందిస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. -
క్రిస్ గేల్ రికార్డును సమం చేసిన రోహిత్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో గేల్, రోహిత్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లో ఈ ఇద్దరు చెరో 331 సిక్సర్లు బాదారు. ఈ జాబితాలో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (351) టాప్లో ఉన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ తర్వాతి స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 170 సిక్సర్లు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ గేల్ రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్లో రోహిత్ 20 బంతుల్లో ఓ సిక్సర్, 6 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. రోహిత్ ఓ మోస్తరు స్కోర్తో రాణించినా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించింది. -
అతడు లేకపోతే.. టీమిండియా బౌలింగ్ జీరో: పాక్ మాజీ క్రికెటర్
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను 0-2 తేడాతో టీమిండియా కోల్పోయింది. టీ20 సిరీస్లో సత్తాచాటిన భారత జట్టు.. వన్డేల్లో మాత్రం తేలిపోయింది. తొలి వన్డేను టై ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఘోర ఓటమి చవిచూసింది.తద్వారా 1997 తర్వాత తొలిసారి శ్రీలంకపై భారత్ వన్డే సిరీస్ ఓడిపోయింది. కాగా ఈ సిరీస్లో భారత బ్యాటర్లతో పాటు పేస్ బౌలర్లు కూడా విఫలమయ్యారు. వికెట్ల తీయడంలో సిరాజ్, అర్ష్దీప్ వంటి ఫాస్ట్ బౌలర్లు నిరాశపరిచారు.ఈ మొత్తం సిరీస్లో ఇరు జట్ల స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. భారత్తో పొలిస్తే శ్రీలంక స్పిన్నర్లు మరింత మెరుగ్గా రాణించారు. ఈ నేపథ్యంలో భారత జట్టును ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ సంచలన పోస్ట్ చేశాడు. స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం శూన్యమని జునైద్ తన అక్కసను వెల్లగక్కాడు. "బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ జీరో. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అని జునైద్ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.కాగా టీ20 వరల్డ్కప్ తర్వాత టీమిండియా పేస్ గుర్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20 వరల్డ్కప్ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగనున్న టెస్టు సిరీస్కు బుమ్రా అందుబాటులోకి రానున్నాడు. -
ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ
బుధవారం కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 110 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవి చూసింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది. కాగా శ్రీలంకపై వన్డే సిరీస్లో టీమిండియా ఓడిపోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.మొదటి వన్డేను డ్రాగా ముగించిన భారత్.. వరసుగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. మరోసారి స్పిన్ ఉచ్చులో భారత్ చిక్కుకుంది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. లంక స్పిన్నర్ల దాటికి కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. లంక బౌలర్లలో దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో సత్తాచాటగా.. థీక్షణ, జెఫ్రీ వాండర్సే తలా రెండు వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(35) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం భాతర కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సిరీస్లో శ్రీలంక తమ కంటే బాగా ఆడిందని హిట్మ్యాన్ కొనియాడాడు."స్పిన్నర్లను ఎదుర్కొవడంలో భారత బ్యాటర్ల తడబాటుపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ విషయాన్నీ మేము తీవ్రంగా పరిగణిస్తాము. వ్యక్తిగతంగా ప్రతీ ఒక్కరూ సరైన గేమ్ ప్లాన్తో ఆడాల్సిన అవసరముంది. సిరీస్లో మేము ఒత్తిడికి గురయ్యాము.తప్పు ఎక్కడ జరిగిందా అన్నది మేము చర్చించి తర్వాత మ్యాచ్ల్లో పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాము. రాబోయే మ్యాచ్ల్లో సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. అంతే తప్ప టీ20 వరల్డ్కప్ విజయంతో మేము రిలాక్స్ కాలేదు. ఇదో పెద్ద జోక్. భారత్ తరుపన ఆడుతున్నంత కాలం మేము రిలాక్స్ అవ్వము. ముఖ్యంగా నేను కెప్టెన్గా ఉన్నప్పుడు అటుంటి ఆంశాలకు అస్సలు చోటివ్వను.ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాము. కానీ ఈ సిరీస్ మొత్తం మేము చెత్తగా ఆడాం. కానీ శ్రీలంకకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. వారు మాకంటే మెరుగైన ప్రదర్శన చేశారు. అందుకే శ్రీలంక సిరీస్లో విజయం సాధించింది. మేము ఇక్కడి కండిషన్స్కు తగ్గట్లు మా జట్టు కాంబినేషన్ను మార్చాము. జట్టులో కొంత మంది యువ ఆటగాళ్లకు ఇటువంటి కండిషన్స్కు అలవాటు పడాలనే ఉద్దేశ్యంతో కొన్ని మార్పులు చేశాం. ఈ సిరీస్లో మాకు సానుకూల అంశాల కంటే ప్రతికూల ఆంశాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిపై కచ్చితంగా దృష్టి పెడతాము. ఎందుకంటే మరోసారి ఎటువంటి పరిస్థితులు ఎదురైతే బాగా ఆడాలి కాదా. ఇక ఆటలో గెలుపోటములు సహజం. సిరీస్ కోల్పోవడం వల్ల ప్రపంచం ఏమి అంతం కాదు. ఈ ఓటమి నుంచి ఎలా పుంజుకుంటామనేదే ముఖ్యమని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
India vs Sri Lanka: భారత్కు షాకిచ్చిన శ్రీలంక.. 27 ఏళ్ల తర్వాత (ఫోటోలు)
-
శ్రీలంకతో మూడో వన్డే.. చిత్తుగా ఓడిన టీమిండియా
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటై 110 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. శ్రీలంక 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ద్వైపాక్షిక సిరీస్లో భారత్పై విజయం సాధించడం విశేషం. -
మూడో వన్డేలోనూ ఓటమి.. సిరీస్ కోల్పోయిన భారత్
శ్రీలంకతో మూడో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడింది. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 138 పరుగులకే (26.1 ఓవర్లలో) ఆలౌటైంది. దునిత్ వెల్లలగే ఐదు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. తీక్షణ, వాండర్సే తలో రెండు, అషిత ఫెర్నాండో ఓ వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (35), సుందర్ (30), విరాట్ కోహ్లి (20), రియాన్ పరాగ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96), కుసాల్ మెండిస్ (59), కమిందు మెండిస్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3, సిరాజ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓటమితో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2 తేడాతో కోల్పోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండు, మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది.తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా138 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చి వాషింగ్టన్ సుందర్ (30) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా101 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో శివమ్ దూబే (9) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్100 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. వాండర్సే బౌలింగ్లో రియాన్ పరాగ్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.శివమ్ దూబే (9), వాషింగ్టన్ సుందర్ క్రీజ్లో ఉన్నారు.86 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా249 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. దునిత్ వెల్లలగే 4 వికెట్లు తీసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. రోహిత్ 35, గిల్ 6, విరాట్ 20, రిషబ్ పంత్ 6, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2 ఔట్ కాగా.. రియాన్ పరాగ్ 10, శివమ్ దూబే 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అషిత ఫెర్నాండో, తీక్షణ తలో వికెట్ పడగొట్టారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్లో శుభ్మన్ గిల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్లో రోహిత్ (13 బంతుల్లో 31; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడుతున్నాడు. రాణించిన రియాన్ పరాగ్.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంకకొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా శ్రీలంక నామమాత్రపు స్కోర్కే (248/7) పరిమితమైంది. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న రియాన్ పరాగ్ బంతితో రాణించాడు. రియాన్ 9 ఓవర్లలో 54 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబూ నాలుగు ఓవర్లు వేసి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. సిరాజ్ 9 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు సమర్పించుకున్నాడు.తృటిలో సెంచరీ చేజార్చుకున్న అవిష్కటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు పథుమ్ నిస్సంక (45), అవిష్క ఫెర్నాండో (96) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 89 పరుగులు జోడించారు. అవిష్క నాలుగు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు.రాణించిన కుసాల్ మెండిస్అవిష్క ఫెర్నాండో ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన కుసాల్ మెండిస్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన కుసాల్ ఏడో వికెట్గా వెనుదిరిగాడు. ఆఖర్లో కమిందు మెండిస్ (23 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లంక ఇన్నింగ్స్లో అసలంక 10, సధీర సమరవిక్రమ 0, లియనాగే 8, వెల్లలగే 2 పరుగులు చేసి ఔటయ్యారు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంక235 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి కుసాల్ మెండిస్ (59) ఔటయ్యాడు. మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంకశ్రీలంక మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. 196 పరుగుల వద్ద లియనాగేను (8) వాషింగ్టన్ సుందర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. 199 పరుగుల వద్ద వెల్లలగేను (2) రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 207/6గా ఉంది. కుసాల్ మెండిస్ (41), కమిందు మెండిస్ (3) క్రీజ్లో ఉన్నారు.నాలుగో వికెట్ డౌన్సధీర సమరవిక్రమ సిరాజ్ బౌలింగ్లో తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. 39 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 184/4గా ఉంది.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక183 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్.. అసలంకను (10) ఎల్బీడబ్ల్యూ చేశాడు.తృటిలో సెంచరీని చేజార్చుకున్న అవిష్కలంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. 96 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 36 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 173/2గా ఉంది. కుసాల్ మెండిస్ (28), అసలంక (2) క్రీజ్లో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక89 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి నిస్సంక (45) ఔటయ్యాడు. అవిష్క ఫెర్నాండో (43), కుసాల్ మెండిస్ క్రీజ్లో ఉన్నారు.14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 65/0ఇన్నింగ్స్ ఆరంభంలో నత్త నడకలా సాగిన శ్రీలంక బ్యాటింగ్ ప్రస్తుతం మెరుగుపడింది. ఆ జట్టు 14 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో 26, నిస్సంక 38 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. నత్త నడకన సాగుతున్న శ్రీలంక బ్యాటింగ్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిదానంగా ఆడుతుంది. వారి ఇన్నింగ్స్ నత్త నడకు తలపిస్తుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 28/0గా ఉంది. నిస్సంక 19, అవిష్క ఫెర్నాండో 8 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకొలొంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియానాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
శ్రీలంకతో మూడో వన్డే.. మళ్లీ టాస్ ఓడిన టీమిండియా..కేఎల్ రాహుల్పై వేటు
కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (ఆగస్ట్ 7) జరుగనున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయనుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో టీమిండియా టాస్ ఓడటం ఇది వరుసగా మూడోసారి. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్ స్థానాల్లో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు లంక సైతం ఓ మార్పు చేసింది. అఖిల ధనంజయ స్థానంలో మహేశ్ తీక్షణ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, ఈ సిరీస్లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో లంక విజయం సాధించింది.తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్కీపర్), శ్రేయస్ అయ్యర్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్శ్రీలంక: పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్(వికెట్కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక(కెప్టెన్), జనిత్ లియనాగే, కమిందు మెండిస్, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో -
కోహ్లి వరుస వైఫల్యాలు.. పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
శ్రీలంకతో తాజా వన్డే సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లి అవుటైన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో కలిపి కోహ్లి కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రెండుసార్లూ అతడు స్పిన్నర్ల చేతికే చిక్కాడు.అది కూడా రెండుసార్లు లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి.. దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా దూరంగా ఉండాలని భావించినప్పటికీ కొత్త హెడ్కోచ్ గౌతం గంభీర్ సంప్రదింపుల నేపథ్యంలో అందుబాటులోకి వచ్చాడు.రోహిత్ శర్మతో కలిసి వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంకలో అడుగుపెట్టాడు. ఇక ఇప్పటి వరకు రెండు వన్డేల్లో కలిపి రోహిత్ శర్మ 122 పరుగులతో ఫామ్లో ఉండగా.. కోహ్లి మాత్రం తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం కోహ్లి పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపించడం లేదని విమర్శించాడు.‘‘ప్రపంచంలోని నంబర్ వన్ బ్యాటర్.. గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లి. కానీ వరుసగా రెండుసార్లు ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ లేదంటే శివం దూబే విషయంలో ఇలా జరిగితే పర్లేదనుకోవచ్చు. కానీ విరాట్ కోహ్లి.. విరాట్ కోహ్లియే. తన స్థాయికి ఇది తగదు. దీనిని బట్టి అతడు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేయలేదని అర్థమవుతోంది’’ అని బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.ఇక రెండో వన్డేలో లంక స్పిన్నర్ జెఫ్రే వాండర్సె ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రపంచ క్రికెట్ను ఏలే బ్యాటింగ్ ఆర్డర్లా ఏమాత్రం అనిపించలేదు. శ్రేయస్ అయ్యర్, కేఎల్రాహుల్ కూడా తగినంత ప్రాక్టీస్ చేసినట్లు కనబడటం లేదు. ప్రాక్టీస్ లేకుండానే మ్యాచ్ ఆడటానికి వచ్చేసినట్లు ఉన్నారు.అసలు అయ్యర్ ఇలా ఎందుకు ఆడుతున్నాడో అర్థమే కావడం లేదు. అయ్యర్ స్థానంలో రిషభ్ పంత్ లేదంటే.. రియాన్ పరాగ్, రింకూ సింగ్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైందనిపిస్తోంది. దేశవాళీ వన్డే ఫార్మాట్(లిస్ట్-ఏ)క్రికెట్ నుంచి కొంతమందిని గంభీర్ సెలక్ట్ చేసుకోకతప్పదు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో టీ20 సిరీస్ను 3-0తో వైట్వాష్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం నిరాశపరుస్తోంది. తొలి వన్డే టై కాగా.. రెండో వన్డేలో శ్రీలంక గెలుపొంది.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. -
లంకతో మూడో వన్డే.. రాహల్పై వేటు! టీమిండియాలోకి విధ్వంసకర ఆటగాడు?
శ్రీలంకతో టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేల్లో మాత్రం తమ మార్క్ను చూపించలేకపోతుంది. తొలి వన్డేలో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా టై చేసుకున్న భారత్.. రెండో వన్డేలో 32 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో కీలకమైన మూడో వన్డేలో శ్రీలంకతో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. బుధవారం కొలంబో వేదికగా మూడో వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను 1-1తో సమం చేయాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు శ్రీలంక మాత్రం ఆఖరి మ్యాచ్లోనూ తమ జోరుని కొనసాగించి సిరీస్ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. కాగా భారత్పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచి దాదాపు 27 ఏళ్లు కావస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేల్లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయిన కేఎల్ రాహుల్, శివమ్ దూబేపై జట్టు మెనెజ్మెంట్ వేటు వేయనున్నట్లు సమాచారం. వారిద్దరి స్ధానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్లకు చోటు ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కేఎల్ రాహుల్ వికెట్ల వెనక కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో వన్డేలో ఈజీగా క్యాచ్లు విడిచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ను బరిలోకి దించాలని గంభీర్, రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. -
'గంభీర్ ఒక చిన్న పిల్లాడు.. ఓటమిని అస్సలు జీర్ణించుకోలేడు'
టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ తన ప్రయణాన్ని విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు టీ20 సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే లంకతో టీ20 సిరీస్లో అదరగొట్టిన టీమిండియా వన్డే సిరీస్లో మాత్రం తడబడుతోంది.తొలి వన్డేను టైగా ముగించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా రెండో వన్డేలో గంభీర్ తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్ పరాజయం పాలైందని అభిమానులు విమర్శిస్తున్నారు. కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఆటగాడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపడాన్ని చాలా మంది మాజీలు తప్పబడుతున్నారు.గంభీర్కు అహంకారం ఎక్కువని, తను అనుకున్నదే చేస్తాడని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ను ఉద్దేశించి తన చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఇప్పటకి చిన్నపిల్లవాడేనని, అందరని అభిమానిస్తాడని భరద్వాజ్ తెలిపాడు."గంభీర్ ఒక అహంకారి, దూకుడెక్కువని అందరూ అనుకుంటారు. నిజానికి గంభీర్ చాలా మంచివాడు. అందరని గౌరవిస్తాడు. ఎవరికైనా సహాయం చేయడానికి ముందుంటాడు. ఎంతో మంది యువ క్రికెటర్ల కెరీర్ను తీర్చిదిద్దాడు. పేసర్ నవదీప్ సైనీ వంటి వాళ్లు గంభీర్ సాయంతోనే క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. అతడు గెలవడం కోసమే కొన్నిసార్లు దూకుడుగా, సీరియస్గా ఉంటాడు. ఎందుకంటే అతడికి ఓడిపోవడం ఇష్టముండదు. చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ మ్యాచ్ల్లో అతడు రాణించలేకపోయినా ఏడ్చేవాడు. ఎవరైనా సీరియస్గా ఉన్నంత మాత్రాన వారు మంచి వారు కాదని అనుకోకూడదు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారా?ఎలా గెలవాలో అర్థం చేసుకున్న వారు.. ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసుకోవాలి. గంభీర్ ఆటగాళ్ల టెక్నికల్ అంశాల జోలికి వెళ్లడు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపి.. వారి నుంచి మెరుగైన ఫలితాలు రాబట్టడమే గంభీర్ పని. కోచ్గా గంభీర్ విజయవంతమవుతాడని నేను భావిస్తున్నాను. ఇప్పటికీ నా దృష్టిలో గంభీర్ ఒక 12 ఏళ్ల చిన్న పిల్లవాడని" భారత మాజీ క్రికెటర్ మంజోత్ కల్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజయ్ భరద్వాజ్ పేర్కొన్నాడు. -
'హార్దిక్, రాహుల్ కాదు.. రోహిత్ శర్మ తర్వాత అతడే టీమిండియా కెప్టెన్'
టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్గా గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోస్యం చెప్పాడు. కాగా గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ను కాదని మరి గిల్ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్గా అరంగేట్రం చేసిన గిల్.. తన నాయకత్వ లక్షణాలతో అందరని ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో భారత్ సొంతం చేసుకుంది. టెస్టుల్లో కూడా రోహిత్ డిప్యూటీగా గిల్ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది."యశస్వీ జైశ్వాల్, శుబ్మన్ గిల్ ఇద్దరూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. వన్డేల్లో కూడా అదరగొడుతున్నారు. ముఖ్యంగా శుబ్మన్ గిల్ ఎంత చెప్పుకున్న తక్కువే. అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అతడు ప్రస్తుతం రోహిత్ శర్మ వద్ద కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. గిల్లో కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. జింబాబ్వే టూర్లో కెప్టెన్గా గిల్ విజయవంతమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో భారత కెప్టెన్గా గిల్ ఎంపికవుతాడని" శ్రీధర్ పేర్కొన్నాడు.చదవండి: టీ20 వరల్డ్కప్-2024పై నీలినీడలు! భారత్ వేదికగా?


