IND vs SL: శ్రీలంకతో తొలి వ‌న్డే.. నల్ల బ్యాండ్​ల​తో భారత జట్టు! ఎందుకంటే? | Why Team India Are Wearing Black Armband Against Sri Lanka In The 1st ODI? | Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంకతో తొలి వ‌న్డే.. నల్ల బ్యాండ్​ల​తో భారత జట్టు! ఎందుకంటే?

Aug 2 2024 3:17 PM | Updated on Aug 2 2024 6:32 PM

Why Team India Are Wearing Black Armband Against Sri Lanka In The 1st ODI?

కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యాండ్​లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం(జూలై 31) తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఆయనకు నివాళిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్​లు ధరించారు. క్యాన్సర్‌తో పోరాడుతూ  గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరఫున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో బరోడా తరఫున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. 

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఈ మ్యాచ్‌తో శ్రీలంక త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ తిరిగి భార‌త జ‌ట్టుతో  చేరారు.
తుది జట్లు..
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌

శ్రీలంక: చరిత్‌ అసలంక (కెప్టెన్‌), పథుమ్‌ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కశాల్‌ మెండిస్‌ (వికెట్‌కీపర్‌), సధీర సమరవిక్రమ, దునిత్‌ వెల్లలగే, వనిందు హసరంగ, జనిత్‌ లియనగే, అఖిల ధనంజయ, అషిత ఫెర్నాండో, మొహ్మద్‌ సిరాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement