IND vs SL: శ్రీలంక‌తో మూడో టీ20.. గిల్ వ‌చ్చేశాడు! ఆ న‌లుగురికి రెస్ట్‌ | India vs sri lanka 3rd t20, Playing 11 | Sakshi
Sakshi News home page

IND vs SL: శ్రీలంక‌తో మూడో టీ20.. గిల్ వ‌చ్చేశాడు! ఆ న‌లుగురికి రెస్ట్‌

Jul 30 2024 8:12 PM | Updated on Jul 30 2024 8:30 PM

India vs sri lanka 3rd t20, Playing 11

ప‌ల్లెకెలె వేదిక‌గా మూడో టీ20లో భార‌త్‌-శ్రీలంక జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖ‌రి టీ20కు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఏకంగా నలుగురు ఆట‌గాళ్ల‌కు విశ్రాంతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌మ‌య్యారు. 

వారి స్ధానాల్లో శివమ్ దూబే, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ఖాలీల్ ఆహ్మ‌ద్‌, శుబ్‌మ‌న్ గిల్ తుది జ‌ట్టులోకి వ‌చ్చారు. మ‌రోవైపు శ్రీలంక కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. షనక స్థానంలో ఆల్‌రౌండ‌ర్‌ విక్రమసింఘే అరంగేట్రం చేశాడు. ఇక ఇప్ప‌టికే సిరీస్‌ను 2-0 తేడాతో భార‌త్ సొంతం చేసుకుంది.

తుది జట్లు
భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీప‌ర్‌), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక(కెప్టెన్‌), చమిందు విక్రమసింఘే, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement