శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ దూరం | INDW vs SLW 2nd T20I: India won the toss and choose to bowl, here are playing XI | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో రెండో టీ20.. టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ దూరం

Dec 23 2025 7:05 PM | Updated on Dec 23 2025 7:39 PM

INDW vs SLW 2nd T20I: India won the toss and choose to bowl, here are playing XI

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక మహిళా జట్టుతో విశాఖ వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 23) జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత్‌ ఓ మార్పు చేయగా.. శ్రీలంక తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించింది. 

స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌ ఆడటం లేదని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది.  దీప్తి స్థానంలో స్నేహ్‌ రాణా తుది జట్టులోకి వచ్చింది.కాగా, ఇదే విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధ్యింలోకి వెళ్లింది. 

తుది జట్లు.. 
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కవిషా దిల్హరి, కౌషని న్యూత్యాంగన(w), మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్‌హనై

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement