12 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన శ్రీలంక  | 12 Indian fishermen arrested in Sri Lanka | Sakshi
Sakshi News home page

12 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన శ్రీలంక 

Sep 29 2025 6:29 AM | Updated on Sep 29 2025 6:29 AM

12 Indian fishermen arrested in Sri Lanka

కొలంబో: శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని జాఫ్నా వద్ద ఆదివారం ఆ దేశ నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్ట్‌ చేయడంతోపాటు, వారి బోటును స్వాదీనం చేసుకుంది. ఆదివారం ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లో డెల్ఫ్‌ట్‌ దీవి పక్కన అక్రమంగా చేపలు పడుతుండగా పట్టుకున్నామని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది.

 కంకసేతురై హార్బర్‌కు మత్స్యకారులతోపాటు బోటును తరలించామంది. భారత్‌–శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలలో మత్స్యకారుల అంశం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక నేవీ పాక్‌ జలసంధిలో భారత మత్స్యకారులపై కాల్పులు జరిపి, వారి పడవలను స్వా«దీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement