
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. తొలిసారి దర్శకధీరుడు రాజమౌళితో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీని ఒడిశాలోని అందమైన లోకేషన్స్లో మొదటి షెడ్యూల్ను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎమ్బీ 29 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు.
అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం లభించడంతో ప్రిన్స్ విదేశాల్లో చిల్ అవుతున్నారు. మన ప్రిన్స్ తరచుగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్లకు వెళ్తుంటారు. ఇటీవల మహేశ్ బాబు శ్రీలంక ట్రిప్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోను ఏకంగా శ్రీలంక ఎయిర్లైన్స్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత సినీ స్టార్ హీరో మహేష్ బాబును ఆహ్వానించడం మాకు, మా సిబ్బందికి ఆనందంగా ఉందంటూ మహేశ్బాబుతో సెల్పీ దిగిన ఫోటోను షేర్ చేసింది. ఇంత గొప్ప అతిథిని మా విమానంలోకి ఆతిథ్యం ఇచ్చినందుకు మా సిబ్బంది ఎంతో సంతోషించారని తెలిపింది. మాతో పాటు శ్రీలంకకు ప్రయాణించినందుకు మహేశ్బాబుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో దట్ ఈజ్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
We had the pleasure of welcoming South Indian cinema icon Mahesh Babu on his journey from Hyderabad to Colombo with SriLankan Airlines!
Our crew was delighted to host such a celebrated guest onboard.
Thank you for flying with us.@urstrulyMahesh #SriLankanAirlines… pic.twitter.com/44euwfcfCB— SriLankan Airlines (@flysrilankan) July 21, 2025