breaking news
Tollywood Hero
-
భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
-
రవితేజ ఇరుముడి.. పూనకాలు తెప్పించే ఫుల్ వీడియో సాంగ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ.. కేవలం మౌత్ టాక్తో వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ల మార్క్ దాటేసింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్లలో ఆడియన్స్కు పూనకాలు తెప్పించిన మల్లెపూల పల్లకి.. మందార పల్లకి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు థియేటర్లు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ పాటకు చౌడమ్ శ్రీనివాసరావు లిరిక్స్ అందించగా.. డప్పు శ్రీను ఆలపించారు. ఈ సాంగ్ను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేశారు. -
అల్లు అర్జున్ రాకా.. ప్రముఖ నటుడి రోల్ రివీల్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ యాక్షన్ మూవీ రాకా. ఈ సినిమాకు అల్లు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ముంబయిలో పూర్తి చేసుకుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్(బబ్లూ) కీలక పాత్ర పోషిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్లో తనకు ఒక ప్రత్యేకమైన లుక్తో కూడిన కీలక పాత్ర దక్కిందని రివీల్ చేశారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టమని.. అంతేకాకుండా అల్లు అర్జున్తో కలిసి పనిచేయడంతో తన కల సాకారమైందని స్పష్టం చేశారు.కాగా.. ఈ సినిమాలో దీపిక పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నారని స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. -
నాని ది ప్యారడైజ్.. రిలీజ్ డేట్పై మరోసారి క్లారిటీ
నాని హీరోగా వస్తోన్న పాన్ ఇండియా మూవీ ది ప్యారడైజ్. ఈ మూవీకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఏషనాగుల సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినీ ప్రియులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్తో యూట్యూబ్లో దూసుకెళ్తోంది.ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ మేకర్స్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. నాని సినీ ప్రయాణం 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ తేదీపై ఎలాంటి సందేహలు అక్కర్లేదని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన తేదీ సెప్టెంబర్ 24నే థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ దీంతో సినిమా రిలీజ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేసే ఆలోచన లేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 18 years of entertaining. And this year, the stage is all set to burn with #TheParadise 🔥🔥🔥Natural Star @NameisNani as JADAL 💥#TheParadise GRAND RELEASE WORLDWIDE ON 24.09.26.Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥An @anirudhofficial musical 🎼… pic.twitter.com/sGx22f8BIK— SLV Cinemas (@SLVCinemasOffl) September 5, 2026 -
ప్రభాస్తో టాలీవుడ్ హీరో ఢీ.. పెద్ద సాహసమే..!
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 3న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ప్రభాస్తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు మరో హీరో. రెబల్ స్టార్తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఆయన హీరోగా వస్తోన్న లెగసీ మూవీ డిసెంబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఫౌజీ రిలీజైన ఒక్క రోజు గ్యాప్లోనే విశ్వక్ సేన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. దీంతో వీరిద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.మరి ఫౌజీ ముందు లెగసీ మూవీ ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాల్సిందే. అయితే విశ్వక్ సేన్ ఒక్క రోజు గ్యాప్లోనే రావడం పెద్ద సాహసమనే చెప్పాలి. లేదంటే ఈ నిర్ణయం వెనుక నిర్మాతల పక్కా వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఫౌజీ అనుకున్న టైమ్కి రాకపోతే తమ సినిమాకు తిరుగుండదనే ఉద్దేశంతోనే ఈ డేట్పై కర్చీఫ్ వేసిందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ప్రభాస్ను ఢీకొట్టబోతున్న విశ్వక్ ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. MASS KA DAS IS COMING THIS DECEMBER. 🔥🔥#LEGACY locks DECEMBER 4, 2026 for its worldwide theatrical release.Vishwak Sen in a powerful new avatar.Kay Kay Menon in a key role.Saikiran Reddy Daida returning with his second film.THE LEGACY BEGINS. ⚔️#LegacyMovie… pic.twitter.com/kWW7MuX85q— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) September 5, 2026 -
రాజ్ తరుణ్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
రాజ్తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. నీ పరిచయం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. చిన్మయి, అనూప్ రూబెన్స్, జాహ్నవి ఆలపించారు. ఈ సాంగ్ను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ సినీ ప్రియులను అలరిస్తోంది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
మై లిటిల్ ప్యారడైజ్.. కొడుకు అర్జున్తో నాని క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
-
ప్రభాస్ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్పై ఆటోగ్రాఫ్ తీసుకున్న యంగ్ హీరో (ఫోటోలు)
-
టాలీవుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
వర్ధన్, కృష్ణప్రియ జంటగా వస్తోన్న మూవీ కాగితం పడవలు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంజీఆర్ తుకారం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టీఆర్ ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా హీరో వర్ధన్ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం. కాగితం పడవలు.. ఒక కాలువలో ప్రయాణం చేయాలని అనుకున్నాం. తెలియకుండానే ఒక సముద్రంలోకి వచ్చేశాం. ఎన్నోసార్లు ఒడ్డుకు వద్దాం అనుకున్నాం. కానీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రయాణంలో మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం. డైరెక్టర్ తుకారాం చాలా అద్భుతంగా తీశారు. ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ 18న థియేటర్స్లో కలుద్దాం' అని అన్నారు.దర్శకుడు తుకారాం మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. మా సినిమాకి మా నిర్మాతలే హీరోలు. మా నిర్మాతలు లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రేమకథ ఉంటుంది. ఈ సినిమా చూస్తే మీ ప్రేమకథ మీకు గుర్తుకొస్తుంది. మీరందరూ ఈ సినిమాను థియేటర్లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు.హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ..' తెలుగులో కాగితం పడవలు నా రెండో సినిమా. మా నిర్మాతలందరికీ థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్తో ఈ సినిమా తీశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్లో నటించాను. మా హీరోకి థాంక్యూ. సెప్టెంబర్ 18న సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 18న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యశ్ టాక్సిక్.. గౌతమ్ ఘోరమైన రేటింగ్..!
యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. రిలీజైన రెండు రోజులకే బిగ్ స్క్రీన్పై నుంచి కనుమరుగైంది.ఇదంతా పక్కనపెడితే ఈ చిత్రానికి మహేశ్ బాబు తనయుడు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. లెటర్ బాక్స్ డీ అనే ఖాతాలో పలు సినిమాలకు గౌతమ్ రేటింగ్ ఇచ్చాడు. ఇందులో మహేశ్ బాబు నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే టాక్సిక్ మూవీకి ఏకంగా 0.5 రేటింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.అంతేకాకుండా తన తండ్రి మహేశ్ బాబు సినిమాలకు తక్కువ రేటింగ్స్ కనిపించడం ఫ్యాన్స్కు ఆశ్చర్యం కలిగించింది. ఇది కాస్తా నెట్టింట మరింత చర్చకు దారితీసింది. కొందరు అభిమానులు అతని రేటింగ్స్ నిజాయితీగా ఉన్నాయని చెప్పగా.. మరికొందరు వాటిని మరింత కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ లెటర్ బాక్స్ డీ ప్రొఫైల్లో దాదాపు 400కు పైగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మహేష్ బాబు 'పోకిరి', '1: నేనొక్కడినే' సినిమాలైన గౌతమ్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అదే సమయంలో 'నిజం', 'వంశీ' చిత్రాలకు 2 స్టార్ ఇవ్వగా.. 'బ్రహ్మోత్సవం' చిత్రానికి కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చాడు. టాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాదు.. 'షోలే', 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ', 'నైవ్స్ అవుట్', 'జెర్సీ' చిత్రాలకు 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' లాంటి సినిమాలకు 4.5 స్టార్ ఇచ్చాడు.అంతేకాకుండా బాహుబలి- 2 సినిమాకు 5 స్టార్.. పెళ్లి చూపులు, సీతా రామం చిత్రాలకు 4.5 స్టార్ ఇచ్చేశాడు. ఈగ మూవీకి 4 స్టార్ ఇవ్వగా.. ధురందర్-1కి 4 స్టార్, ధురందర్- 2కి 3 స్టార్ ఇచ్చాడు. రవి తేజ నటించిన ఇటీవలి తెలుగు హిట్ చిత్రం ఇరుముడికి 3 స్టార్ ఇవ్వగా.. లోకేష్ కనగరాజ్ 'డీసీ'కి 4 స్టార్ రేటింగ్ రాసుకొచ్చాడు. 'టాక్సిక్' లాగే 'లైగర్'కు కూడా 0.5 స్టార్ ఇస్తూ.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీకి 2.5 స్టార్ రేటింగ్స్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
తనయుడికి స్పెషల్ విషెస్.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తనయుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు గౌతమ్ బర్త్ డే కావడంతో కుమారుడితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని ఆకాంక్షించారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' ఘట్టమనేని గౌతమ్కు 20వ పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నప్పుడు నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో నేరవేర్చుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి రోజు నిన్ను చూసి గర్వపడుతున్నా' అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వారణాసి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️ pic.twitter.com/kn8AGpviWY— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2026 -
'ఇది మనందరి కథ'.. ఆసక్తిగా శ్రీ విష్ణు కొత్త సినిమా గ్లింప్స్
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో మూవీకి రెడీ అయిపోయారు. గతేడాది సింగిల్ మూవీతో అలరించిన హీరో.. ఈ ఏడాది సరికొత్త ప్రేమకథను ప్రకటించారు. ఇది మన అందరి కథ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ చూస్తుంటే ఓ సగటు యువకుడి కథగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, ఉద్యోగం, పెళ్లి కాన్సెప్ట్తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర హారిక నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందు, రవి సంగీతమందించనున్నారు. -
కిరణ్ అబ్బవరం మరో మూవీ.. ఆసక్తిగా టైటిల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే చెన్నై లవ్ స్టోరీతో హిట్ అందుకున్న మన హీరో.. మరో మూవీని ప్రకటించారు. ఆయన నిర్మాతగా తాజాగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ చిత్రానికి హతః అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్తోనే ఆడియన్స్లో మరింత ఆసక్తి పెంచేశారు. 'ఈ పిల్లి బతికి ఉందా.. లేక చనిపోయిందా' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకు అనుశ్ గోరఖ్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అటు హీరోగా రాణిస్తూనే.. నిర్మాతగానూ కిరణ్ అబ్బవరం దూసుకెళ్తున్నారు. HATAH - What you never saw coming 🐈⬛Teaser soon ❤️#HATAH #STAYLOST pic.twitter.com/W1qmiqkovL— Kiran Abbavaram (@Kiran_Abbavaram) August 31, 2026 -
కికు చిరంజీవి మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కికు యనమల, కశిశ్ ఖాన్ జంటగా నటించిన మూవీ కికు చిరంజీవి. దీనికి అసలు పేరు చిరంజీవి. కానీ టైటిల్ విషయంలో కొందరు అభ్యంతరాలు తెలియజేయడంతో కికు చిరంజీవిగా మార్చారు. ఈ మూవీకి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కికు ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దీప్తి నడిమింటి నిర్మించారు. ఇందులో ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్(అయ్యంగార్), వైవా రాఘవ ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ను ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..చిరంజీవి(కికు యనమల) అరకులో ఒక ఫోటోగ్రాఫర్. అతనికి ఒక ఆరోగ్య సమస్య ఉంటుంది. అందరికీ గుండె ఎడమ సైడ్ ఉంటే ఈయనకు కుడివైపు ఉంటుంది. దానివల్ల ఎక్కువ పరిగెడితే ఊపిరి ఆడదు.. ఆయన శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రకు వచ్చిన మను(కశిశ్ ఖాన్)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. అయితే మనుని ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఓ వ్యక్తి తన మనుషులతో చంపేస్తుంటాడు. ఈ విషయం మనుకి కూడా తెలియదు. ఓ సంఘటన తర్వాత మను కూడా చిరంజీవిని ఇష్టపడుతుంది. ఈ విషయం ఆ దుండగులకు తెలిసి చిరంజీవిని చంపేందుకు ప్రయత్నిస్తారు. అయితే వారి నుంచి తప్పించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు . శోభనం రోజు రాత్రి మనుకి షాకింగ్ విషయం తెలుస్తుంది. అసలు మనును చంపేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరు? వారి లక్ష్యం ఏంటి? చిరంజీవి గతం ఏంటి? ఈ కథలో ఈశ్వరి రావు పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుండె ఎడవైపు కాకుండా, కుడివైపు ఉందనే కాన్సెప్ట్తో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలొచ్చాయి. పాత కాన్సెప్ట్ అయినప్పటికీ కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. చిరంజీవి అంటే మరణం లేనివారు.. చచ్చిబతికిన వారు అని పిలుస్తుంటారు. ఇక్కడ రెండో యాంగిల్ చూపించారు. సినిమాలో హీరోని చంపాలని విలన్లు ప్రయత్నిస్తారు. కానీ అతను చనిపోడు.. అది ఎలా జరిగిందనేది ఈ కథలో అసలు ట్విస్ట్.ఈ కథ ప్రారంభంలో హీరో, హీరోయిన్ల పాత్రలని పరిచేస్తూ, టూర్ ద్వారా వీరిద్దరిని కలుపుతారు. ఈ క్రమంలోనే హీరోకి బ్రీతింగ్ సమస్య, హార్ట్ సమస్య ఉందని తెలుస్తుంది. అనంతరం ఫారెస్ట్లో కొందరు దుండగులు వెంటాడటం, ఈ క్రమంలో పారిపోవడం, చిరుని రక్షించుకునేందుకు ఆమె బ్రీతింగ్ ఇవ్వడం వంటి సీన్లు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే కథలో అసలేం ఏం జరుగుతుందనేది క్లారిటీ మిస్ అవుతుంది. బీచ్లో హీరోకి కత్తిపోట్ల తర్వాత అసలు కథ అప్పుడు మొదలవుతుంది. హీరో లైఫ్లోకి ఈశ్వరీరావు రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. వీరు కలిసిపోవడం, హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం అలా చకచకా జరిగిపోతుంది. ఫస్ట్ నైట్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్కు ముందు బిగ్ ట్విస్ట్ ఉంటుంది.కుడి వైపు ఉండాల్సిన హార్ట్ ఎడమవైపు కొట్టుకుంటే.. తాను ఫస్ట్ నైట్ చేసింది ఎవరితో అని హీరోయిన్ టెన్షన్ పడటంతో కథ ఆసక్తిగా సాగుతుంది. అసలు అతను ఎవరు? తన వాడు ఎవరనే ఆమె పడే బాధ, స్ట్రగుల్, టెన్షన్ భయటం ఎంగేజ్ చేస్తాయి. అదే సమయంలో చిరంజీవిలో అనూహ్యమైన మార్పు, సైకోలా ప్రవర్తించడం వంటి సీన్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయి.సెకండాఫ్ అంతా థ్రిల్లర్గా మారిపోతుంది. ఆ తర్వాత అంతకు ముందు ఉన్న ట్విస్ట్లు ఒక్కోటి రివీల్ అవుతాయి. చిరంజీవి పాత్రలోని ట్విస్ట్, మాస్క్ మ్యాన్ ఎవరు అనేది? తనికెళ్ల భరణి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఫస్ట్ నైట్లో చిరంజీవి ఎలా మారిపోయాడు? అసలు హీరోయిన్ లైఫ్లో ఏం జరుగుతుందనేది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కానీ క్లైమాక్స్ ఎమోషనల్గా అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ ఫర్వాలేదు అనే ఫీలింగ్ వస్తుంది.ఓవరాల్గా చూస్తే మొదటి భాగం స్లోగా ఉంటుంది. సీరియల్ని తలపిస్తుంది. సీన్లు వచ్చిపోతుంటాయి కానీ.. అందులో ఎమోషన్, ఫీల్, లవ్ కనిపించదు. రొమాన్స్ కూడా అంతగా ఆకట్టుకోదు. డ్రామా ఓవర్గా అనిపిస్తుంది. సహజత్వం మిస్సయింది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్తో ఒక్కటే కాస్తా చెప్పుకోదగ్గది. సెకండాఫ్ని బాగానే డీల్ చేశాడు. ట్విస్ట్లు, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ అంశాలు బాగానే రాసుకున్నాడు. ఫన్, రొమాన్స్, యాక్షన్ అంశాలు బాగానే ఉన్నాయి. దర్శకుడు శుభ సాయి వెంకట్ ఎంచుకున్న కథ బాగానే ఉంది. కథనం కూడా బాగుంది. కానీ తెరపై ఆవిష్కరించే విషయంలోనే తడబాటు కనిపించింది.ఎవరెలా చేశారంటే.. చిరంజీవిగా హీరో కికు యనమల ఫర్వాలేదనిపించాడు. ఫన్నీగా, సీరియస్గా కనిపించి ఆకట్టుకున్నాడు. హీరోగా మొదటి సినిమా అయినా కికు యనమల బాగానే యాక్ట్ చేశాడు. మనుగా కశిశ్ ఖాన్ ఉన్నంతలో తన పాత్రలో మెప్పించింది. ఆమె నటన కొంత అసహజంగా అనిపిస్తుంది. మిగిలిన ఈశ్వరీరావు, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, వైవా రాఘవ, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయ చేశారు. సాంకేతికంగా చూస్తే రామకృష్ణ కెమెరా వర్క్ బాగుంది.. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఫర్వాలేదు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకాస్తా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. -
'మనోజ్తో మౌనిక పెళ్లి.. మోహన్ బాబు వెంటనే ఒప్పుకోలేదు'
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరిగ్గా మూడేళ్ల క్రితం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ పొలిటిషియన్ భూమా నాగిరెడ్డి కూతురు మౌనికను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం ఈ జంట తమ లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనోజ్ సైతం సినిమాలతో కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు ఓ పెళ్లి వేడుకలోనూ సందడి చేశారు.ఇదంతా పక్కనపెడితే మంచు మనోజ్ పెళ్లి తర్వాత చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు ఫ్యామిలీలో విష్ణుకు, మనోజ్కు మధ్య గొడవలు కూడా జరిగాయి. మౌనికతో పెళ్లి తర్వాతే ఈ వివాదాలు తలెత్తాయి. మంచు మనోజ్- మౌనిక పెళ్లి మోహన్బాబుకు ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి.అయితే మంచు మనోజ్- మౌనిక పెళ్లి గురించి ఆమె సిస్టర్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె వీరిద్దరి పెళ్లికి మోహన్బాబు త్వరగా ఒప్పుకోలేదన్నారు. మంచు మనోజ్- మౌనికను పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అడిగారని చెప్పింది. అయితే తాము ఈ పెళ్లి వెంటనే జరగాలని మనోజ్తో చెప్పామని అఖిల ప్రియ వెల్లడించారు. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. కాకపోతే మా తమ్ముడు, నేను ఎఫెక్ట్ అవ్వకూడదనే త్వరగా పెళ్లి చేసుకోవాలని మాత్రమే చెప్పామని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.కాగా.. మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 మార్చి 3వ తేదీన రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్- మౌనిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. -
కింగ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వందో సినిమా అప్డేట్
టాలీవుడ్ కింగ్ నాగార్జున మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా నాగ్ వందో మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా రివీల్ చేస్తామని ఓ వీడియో పంచుకున్నారు.ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వందో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ మూవీలో టబు కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాక్స్టార్ కింగ్ సైజ్ స్కోర్ లోడింగ్ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ చిన్న వీడియోను పంచుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ బర్త్ డేకు నాగ్ ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్ తేదీ ప్రకటించే అవకాశముంది. ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Before the take over… 👑Here’s a little preview of the REIGN that awaits.Rockstar’s KING-SIZE score is loading… 💥🔥29th August ⏳#KING100King @iamnagarjuna @Rakarthik_dir @ThisIsDSP @rajamahadhevan @NavinNooli @ArtSathees #SupriyaYarlagadda @CVRao74 @TSeriesSouth… pic.twitter.com/zIUAQmeF9k— Annapurna Studios (@AnnapurnaStdios) August 27, 2026 -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోర్బ్స్ కవర్ పేజీపై ఆయన కనిపించారు. వివిధ రంగాల్లో రాణించిన 100 మంది తారల జాబితాను షో స్టాపర్స్ -2026 పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ఈ లిస్ట్లో బన్నీ కూడా స్థానం దక్కించుకున్నారు. ఇందులో అల్లు అర్జున్తో పాటు రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్, మోహన్ లాల్, రజనీకాంత్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ కూడా ఉన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మువీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని మరో టాక్. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం కనిపించనుందని లేటేస్ట్ బజ్. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 🤍@ForbesIndia #CoverStory #Showstoppers2026 pic.twitter.com/XxLExdn1Cz— Allu Arjun (@alluarjun) August 27, 2026 -
కొత్త వాళ్లతో కొత్త సినిమా.. రిలీజ్కు రెడీ
సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్లో నటిస్తోన్న మూవీ కొత్త సినిమా. ఈ చిత్రానికి అజర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా హైదరాబాద్లో 'వై ఇన్ హైదరాబాద్.. వై నాట్ ఇన్ అవర్ ప్లేస్' అనే ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు పలువురు దర్శక నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.నటుడు రాకేశ్ మాట్లాడుతూ..' నేను మా సినిమా కోసం లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మా మేనేజర్, ఇతర ఆఫీసర్స్ సహకారం అందిస్తారని కోరుకుంటున్నా. అందరం కొత్త వాళ్లం కలిసి కొత్త సినిమా చేశాం. మేము ఇక్కడ నిలదొక్కుకోవాలంటే మీ అందరి సపోర్ట్ కావాలి'అని అన్నారు.నటుడు సురేశ్ మాట్లాడుతూ ..'ఒక సినిమాలో నేను మెయిన్ రోల్ చేశానని చెప్పుకునే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అజర్ నాకు అలాంటి అవకాశం కల్పించారు. సినిమా తీయడం ఈజీ అని అనుకోవద్దు. అది చేసే వారికే తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు అజర్. మీలాంటి పెద్ద వాళ్లు అండగా నిలబడితే మాలాంటి కొత్త వాళ్లం గుర్తింపు తెచ్చుకుంటాం' అని అన్నారు.డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ..'కొత్త వాళ్లం ఎవరూ సపోర్ట్ చేయరు అనుకున్నాం. కానీ మా సినిమాను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ రోజు మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన అతిథులందరికీ కృతజ్ఞతలు. సినిమా అనేది ప్రపంచంలో బలమైన మాధ్యమం. ఇలాంటి ప్రభావవంతమైన సినిమాను నేను కూడా రూపొందించాలనే ప్రయత్నం మొదలుపెట్టా. రోజూ ఏదో ఒక పని పూర్తి చేశాననే సంతృప్తితోనే ఉండేవాడిని. నా కథతో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్లకుండా నేనే ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాను. నేను కొత్త, నాతో పాటు కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటే ఎవరూ నమ్మలేదు. కానీ మా ఊరిలోనే ఆడిషన్స్ చేసి టాలెంట్ ఉన్నవారిని తీసుకున్నాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఈ సినిమా మేకింగ్ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు దాటుకుంటూ వచ్చాం. త్వరలోనే మీ ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
రవితేజ ఇరుముడి.. వంద కోట్లు వచ్చేశాయ్
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా.. తాజాగా మరో క్రేజీ రికార్డ్ సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా సెంచరీ దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టింది. రిలీజైన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ షేర్ చేశారు.తండ్రీ, కూతురి కాన్సెప్ట్ ఆడియన్స్కు కనెక్ట్ కావడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వందమార్క్ను కేవలం ఐదు రోజుల్లోనే చేరుకుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా కనిపించారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥 100 CRORES GROSS WORLDWIDE 🔥🔥Book Your Tickets Now! 🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026 -
'పాలమ్మినా.. పూలమ్మినా అంటారు..' మా కష్టం కనిపించదా?
కికు యనమల, కశిష్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ కికు చిరంజీవి. ఈ సినిమాకు శుభ సాయివెంకట్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని దీప్తి నడిమింటి నిర్మించారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు హీరో కికు యనమల తమ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆంధ్రాలో కూడా పేరున్న కాలేజీల్లో నా మూవీ ప్రమోషన్ చేసుకున్నానని వెల్లడించారు. నా వల్ల సాధ్యమైనంత వరకు మూవీ ప్రమోషన్స్ చేస్తున్నానని తెలిపారు.కానీ హైదరాబాద్లో మాత్రం పేరు మోసిన కాలేజీ ప్రమోషన్ ఈవెంట్ కోసం అనుమతి అడిగితే కనీసం స్పందించలేదని హీరో యనమల ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పర్మిషన్ ఇస్తామని చెప్పి.. తర్వాత రెస్పాండ్ కాలేదన్నారు. ఆ పెద్దాయన ఓ పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డా అని చెప్పుకునే వ్యక్తికి మా కష్టం కనిపించలేదా? అని హీరో ప్రశ్నించారు. ఒక సినిమా కోసం 75,000 మందిని ఆర్గనైజ్ చేశారు కానీ.. నా సినిమా కోసం కూడా కనీసం 700 మందిని ఆర్గనైజ్ చేసి ఉంటే.. చాలా హెల్ప్ అయ్యేదని అన్నారు.పోస్టర్స్ తీసేశారు..అంతేకాకుండా నా మూవీ పోస్టర్స్ ఓ థియేటర్ వద్ద తొలగించారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. మా మూవీ పోస్టర్ ప్లేస్లో యశ్ టాక్సిక్ ఉందన్నారు. మన తెలుగు సినిమాలకు మనవాళ్లు సపోర్ట్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. కనీసం టాక్సిక్ పోస్టర్ పక్కనైనా నా పోస్టర్ పెట్టొచ్చు కదా... తీసి పడేయడం ఎందుకన్నారు. పేరుమోసిన ఓ కాలేజీలో మూవీ ప్రమోషన్స్ కోసం ముందుగా పర్మిషన్ ఇస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.అదే పెద్దాయన పెద్ద సినిమా కోసం స్టేజ్ మీద నిలబడి “నేను పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడ్డాను” అని చెబుతుంటే చాలా బాధ అనిపించింది.ఆ సినిమా కోసం… pic.twitter.com/KQqboSQAVf— Tupaki (@tupaki_official) August 25, 2026 -
న్యూజిలాండ్లో టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. (ఫోటోలు)
-
అల్లు అర్జున్ రాకా.. మరో భామ రాక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ను హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్ వర్క్ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నారు. -
చిరంజీవి విశ్వంభర.. ఇంకెప్పుడు మోక్షం?
మెగాస్టార్ హీరోగా ప్రస్తుతం బాబీతో ఓ మూవీ చేస్తున్నారు. ఈ నెల 22న చిరు బర్త్ డే సందర్భంగా టైటిల్ కూడా రివీల్ చేశారు. ఈ చిత్రానికి కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చారు. గ్లింప్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా వచ్చే ఏడాదికి సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.అయితే ఈ మూవీ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో నటించారు. బింబిసార ఫేమ్ వశిష్టతో విశ్వంభర మూవీ చేశారు. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ టీజర్ వీఎఫ్ఎక్స్పై విమర్శలు రావడంతో సరిదిద్దే పనిలో ఉన్నారు మేకర్స్. మెగాస్టార్ బర్త్ డే రోజైనా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ అలాంటిదేం జరగలేదు.. కేవలం ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్)తో పాటు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ సారి కూడా ఫ్యాన్స్కు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో విశ్వంభర మూవీ రిలీజ్ ఇంకెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది దసరాకైనా రిలీజ్ చేస్తారా? అని భావిస్తున్నారు. దసరాకు విడుదలైతే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. కాగా.. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత కీలక పాత్రల్లో నటించారు. -
క్రేజీ డైరెక్టర్తో మెగాస్టార్ సినిమా.. ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇవాళ స్పెషల్ డే కావడంతో మెగా158 మూవీ టైటిల్ రివీల్ చేశారు. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా విశ్వంభరకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు.అయితే ఇదంతా పక్కనపెడితే మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. గతంలో బాబీ కంటే ముందే అనౌన్స్ చేసిన మూవీకి సంబంధించిన తాజాగా అప్డేట్ ఇచ్చాడు. మెగాస్టార్కు బర్త్ డే విషెస్ చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్తో పని చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. టి-రెక్స్ సినిమా షూటింగ్ ప్రారంభించి.. మీతో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనుకున్న అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చినట్లైంది. ఈ ట్వీట్కు మెగాస్టార్ సైతం రిప్లై ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ పండుగు చేసుకుంటున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాల్సిందే. Happy Birthday, “T-REX” Megastar Chiranjeevi Sir ❤️Waiting eagerly to start our film’s shoot and create a lifetime of unforgettable memories with you, Boss Sir ❤️@KChiruTweets sir 🤗❤️ pic.twitter.com/MhxiC3DqYk— Srikanth Odela (@odela_srikanth) August 22, 2026 -
నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టం: తండ్రికి తనయుడి విషెస్
ఇవాళ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడంతో తనయుడు రామ్ చరణ్ స్పెషల్ విషెస్ తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ తన ప్రేమను చాటుకున్నారు. నా మొదటి హీరో, నా గొప్ప స్ఫూర్తి, నేను ఎల్లప్పుడూ ఆశ్రయించగలిగే వ్యక్తివి నువ్వేనంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు. నా జీవితంలోని ప్రతి సుఖదుఃఖంలో, నీ ప్రేమ, మార్గదర్శనం, నాపై నీకున్న నమ్మకమే నాకు అతిపెద్ద బలమని ట్వీట్ చేశారు.(ఇది చదవండి: ఎట్టకేలకు గుడ్న్యూస్.. విశ్వంభర అప్డేట్ వచ్చేసింది)నా జీవితంలో నువ్వు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నానని రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. నీకు మంచి ఆరోగ్యం, సంతోషం, రాబోయే కాలంలో మరెన్నో సంవత్సరాలు మీరు మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానని తండ్రిపై అప్యాయత కురిపించారు. నిన్ను మాటల్లో చెప్పలేనంతగా ప్రేమిస్తున్నా నాన్న అంటూ తనయుడిగా తన ప్రేమను పంచుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ సైతం మెగాస్టార్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Birthday Nanna ❤️ @KChiruTweets You have been my first hero, my biggest inspiration and someone I can always turn to. Through every high and low, your love, guidance and belief in me have been my greatest strength.I feel truly blessed to have you in my life. Wishing you…— Ram Charan (@AlwaysRamCharan) August 22, 2026 -
మెగాస్టార్ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. చిరు పుట్టినరోజు సందర్భంగా బన్నీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. మన ఏకైక మెగాస్టార్ చిరుకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయనకు మనకు ఎంతో సపోర్ట్గా నిలిచారని.. మనలో ప్రతి ఒక్కరినీ ఆయన స్ఫూర్తితో ముందుకు నడిపించారని కొనియాడారు. అంతేకాకుండా చిరు ఫోటోను కూడా చేశారు.ఈ సందర్భంగా బన్నీ KKAVCF అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే.. తెలుగులో కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే అంటూ మరోసారి తన అభిమానం చాటుకున్నారు. ఇది చూసిన బన్నీ అభిమానులు సైతం మెగాస్టార్కు విషెస్ చెబుతున్నారు.కాగా.. చిరు బర్త్ డే సందర్భంగా బాబీతో చేస్తోన్న మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి కాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్తో మెగాస్టార్ అభిమానులు పండుగు చేసుకుంటున్నారు. Many many happy returns of the day to our one and only Megastar @KChiruTweets garu . He is our greatest pillar of support . He inspired and uplifted each and every one of us. #KKAVCF (Iykyk) pic.twitter.com/QP1H2mX4v0— Allu Arjun (@alluarjun) August 22, 2026 -
అందుకే ఐటమ్ సాంగ్స్ చేయను: హీరో సిద్ధార్థ్
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయకపోయినా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే వెబ్ సిరీస్లో కనిపించారు. హిందీలో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన 20 ఏళ్ల గ్లామర్ ఫీల్డ్లో ఐటమ్ సాంగ్స్, నెగెటివ్ రోల్స్ చేయడం గురించి మాట్లాడారు. తనకు ఐటమ్ సాంగ్స్ చేయడం నచ్చదని సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఒక మహిళ చుట్టు 40 మందికి పైగా డ్యాన్స్ చేస్తూ అలా చేయడం తనకు ఇష్టం ఉండదన్నారు.అంతేకాకుండా ఆమెతో ఎలా పడితే అలా ప్రవర్తించేలా ఉండే ఈ స్పెషల్ సాంగ్స్కు తాను మొదటి నుంచే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇలాంటి ఐటమ్ సాంగ్ కాన్సెప్ట్స్ సమాజంలో మహిళలపై తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయని సిద్ధార్థ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్లామర్ పేరుతో మహిళలను ఓ వస్తువులా చూపించడం తనకు నచ్చదన్నారు. అందుకే ఇప్పటివరకు ఒక్క ఐటమ్ సాంగ్లో కూడా తాను భాగం కాలేదని వెల్లడించారు.అంతే కాకుండా తాను సమాజానికి చెడు సందేశం ఇచ్చే పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు. కేవలం తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మంచి మాత్రమే వెళ్లాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో విలన్ రోల్స్ చేయాల్సి వస్తే తనకేమీ అభ్యంతరం లేదని సిద్ధార్థ్ తెలిపారు. అయితే సినిమాలో చివరికీ అంతమయ్యే విలన్గా నటించడానికి మాత్రమే సిద్ధమని ప్రకటించారు. -
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
-
'నా పిల్లలు కూడా ఆ సలహా ఇస్తారు.. కానీ'
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు రవితేజ. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారాయన. తాను సోషల్ మీడియాను ఎక్కువగా వాడనని తెలిపారు. అయితే అభిమానుల్లో మరింత కనెక్ట్ అయ్యేందుకు ఫోటోలు, కంటెంట్ ఎక్కువగా పోస్ట్ చేయాలని తన పిల్లలు సలహా ఇస్తుంటారని మాస్ మహారాజా వెల్లడించారు. అయితే తాను పిల్లల సూచనలను అరుదుగా పాటిస్తానని రవితేజ అన్నారు.ప్రస్తుతమున్న ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రమోషన్ అవసరమని రవితేజ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను వాటి గురించి ఆందోళన చెందకుండా.. తనకు నచ్చినవి మాత్రమే పోస్ట్ చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. కాగా.. ఇరుముడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ సినిమాలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
బిగ్బాస్ సీజన్-10.. ఈ సారి దశవతారమే..!
తెలుగువారి బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్కు సమయం ఆసన్నమవుతోంది. ఈ షోలో పాల్గొని వారిని అగ్నిపరీక్ష పేరుతో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అగ్నిపరీక్ష నడుస్తోంది. పదో సీజన్ కావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. వచ్చేనెల ప్రారంభం కానున్న ఈ షోకు నాగార్జునే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి సరికొత్తగా.. సవాల్గా ఉండనుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్బాస్ మరో ప్రమోషన్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున విభిన్నంగా కనిపించారు. మీరు ఎంతైనా ఆశించండి. 'బిగ్బాస్ సీజన్-10 నెక్ట్స్ లెవల్, వెరైటీ, సర్ప్రైజ్, డ్రామా, ఛాలెంజ్ పదింతలు..వారం వారం సరికొత్త అవతారం.. ఈ సారి దశవతారం' అంటూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ఆడియన్స్లో మరింత ఆసక్తి క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. -
'ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్'.. శంకర్దాదా ట్రైలర్ చూశారా?
మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. 2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. -
విలన్ నుంచి రియల్ స్టార్గా.. శ్రీహరి అరుదైన (ఫోటోలు)
-
ఓటీటీకి చెన్నై లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. కేవలం మౌత్ టాక్తో వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 21 నుంచే సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.చెన్నై లవ్ స్టోరీ కథేంటంటే?..కాలేజ్ రోజుల నుంచే అజయ్ (త్రిగుణ్), నివి అలియాస్ నివేదిత (గౌరీ ప్రియ) ప్రేమించుకుంటారు. రెండేళ్ల స్నేహం, మూడేళ్ల ప్రేమతో పెళ్లికి సిద్దం అవుతారు. సరిగ్గా పెళ్లి రోజే అజయ్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోతాడు. వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాని అజయ్ చెప్పడంతో నివేదిత తట్టుకోలేకపోతుంది. ఆ బాధతో నివేదిత మందుకు బానిస అవుతుంది. ఆఫీసులో సరిగ్గా వర్క్ మీద ఫోకస్ కూడా పెట్టదు. ఇక నివేదిత రూంలోకి ఓ అతిథిగా వస్తాడు స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం). అనాథ అయిన స్టీవెన్.. ఫిల్మ్ మేకర్ అవ్వాలని, చచ్చేలోపు ఒక్కసారి అయినా తన పేరుని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. స్టీవెన్ రాకతో నివిలో వచ్చిన మార్పులు ఏంటి? నివి, స్టీవెన్ ప్రయాణం ఎంత వరకు సాగుతుంది? దర్శకుడు అవ్వాలనే స్టీవెన్ కోరిక నెరవేరుతుందా? అజయ్ మళ్లీ నివి జీవితంలోకి వస్తాడా? చివరకు ఈ ప్రేమ కథలో ఎవరెవరు ఒకటి అవుతారు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. -
చాలా అమెచ్యూరీష్గా ఉంది బాసూ!
సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య జరిగే వార్ కొత్త విషయం కాదు. తమ అభిమాన హీరో గొప్పంటే.. తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు సెటైర్లు, మీమ్స్, ట్రోల్స్తో విరుచుకుపడుతుంటారు. అయితే ఈ పోరు హద్దులు దాటినప్పుడు అది కేవలం అభిమానుల మధ్య గొడవగా మిగలకుండా.. హీరోల ఇమేజ్, వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపించే స్థాయికి చేరుతోంది. తాజాగా ఓ సీనియర్ హీరోను టార్గెట్ చేస్తూ వచ్చిన మీమ్స్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది.తాజాగా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఒకే మీమ్ టెంప్లెట్తో హడావిడి నడిచింది. సదరు సీనియర్ హీరోను ట్రోల్ చేసేలా నడిచిందా వ్యవహారం. అయితే దీనిపై వాయు వేగంతో స్పందించిన ఆయన టీం.. ఆ పోస్టులను డిలీట్ చేయిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజీలకు నోటీసులు పంపించారు. మరికొన్ని పేజీలను ఏకంగా సస్పెండ్ చేయించారు. దీంతో ఈ వ్యవహారంపై కొందరు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.‘‘ఎంత అధికారం అండ ఉన్నంత మాత్రాన.. ఇలా కట్టడి చేయడమేంటి?’’ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మీమ్స్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా అమెచ్యూరిష్ నిర్ణయమంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే స్థాయికి వెళ్లినప్పుడు చర్యలు తప్పవని సమర్థిస్తున్నారు.సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య పోటీ ఎప్పటి నుంచో ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ అభిమానుల్లో ఈ పోటీ ‘కులం కార్డు’ తెచ్చి మరీ ఒక్కోసారి తీవ్ర స్థాయికి చేరుతుంది. హీరోలపై ప్రశంసలు, విమర్శలు సాధారణమే అయినా.. కొన్నిసార్లు వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు వివాదాలకు కారణమవుతున్నాయి.ఇటీవల ఓ దిగ్గజ నటుడిని లక్ష్యంగా చేసుకుని వరుసగా మీమ్స్ రావడం చర్చనీయాంశమైంది. ఒక దశలో అది కేవలం సరదా ట్రోలింగ్ కాకుండా.. ఓ సినిమా కోసం ప్రణాళికాబద్ధమైన ప్రచారంలా మారిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే అదే వ్యవహారం తిరిగి విమర్శలు చేసిన వారిపైనే ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలోనే సదరు హీరోను టార్గెట్ చేసిన మీమ్స్పై ఆయన టీం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శకు ఇలాంటి చర్యలే పరిష్కారమా? అనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు.‘‘అవతలివారిపై రాళ్లు వేశాక.. తిరిగి మనపై పడుతున్నప్పుడు ‘విక్టిమ్ కార్డ్’ ప్లే చేయడం సరికాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ ఆ హీరోకు, ఆ కాంపౌండ్లోని హీరోలకు, వాళ్లను డిఫెండ్ చేస్తున్న అభిమానులకు కొందరు హితవు పలుకుతున్నారు. అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ.. అది వ్యక్తిగత దూషణలు, కక్షల స్థాయికి చేరకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.మీమ్స్, ట్రోల్స్ యుగంలో సెలబ్రిటీలను విమర్శించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం సహజమే అయినా.. పరిమితులు దాటినప్పుడు వచ్చే పరిణామాలపై ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. -
వెంకీమామకు 40 ఏళ్లు.. ఈ సారి దేశ రక్షకుడిగా..!
వెంకీ మామ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు పూర్తయింది. కలియుగ పాండవులు మూవీతో వెండితెరపై అడుగుపెట్టిన వెంకటేశ్.. స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. యాక్షన్, లవ్తో పాటు కామెడీ జోనర్లో నటించారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ కొట్టిన వెంకీమామ.. ఈ ఏడాది మెగాస్టార్ మూవీలో మెప్పించారు.ప్రస్తుతం అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టారు వెంకటేశ్. వీరద్దరి కాంబోలో వస్తోన్న మూవీ.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. నేటికి వెంకీ మామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని వెంకటేశ్ రోల్ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్ వెంకీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 40 Glorious Years of our Victory @VenkyMama garu in TFI 😍😍😍It’s an absolute honour to celebrate this incredible milestone with a very special look from our film 🤗Meet our Lt colonel VENKAT REDDY🔥#VenkyAnil5 #NKRAR2 #40YearsOfVictoryVenkatesh pic.twitter.com/WcvkXFEuox— Anil Ravipudi (@AnilRavipudi) August 14, 2026 -
మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
భుజానికి సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నా కోసం మీరు ప్రార్థనలు చేసినందుకు చాలా కృతజ్ఞుడిని అని అన్నారు. నా శస్త్రచికిత్స విజయవంతమైంది.. నేను క్షేమంగా ఉన్నానని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. మీ మద్దతు నాకు ప్రతిరోజూ బలాన్ని ఇస్తుంది.. త్వరలో మళ్లీ కలుద్దాం అంటూ రాసుకొచ్చారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో యంగ్ టైగర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS. To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon!…— Jr NTR (@tarak9999) August 12, 2026 -
జూనియర్ ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్.. వైద్యుల ప్రకటన
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ పూర్తి చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నోట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. డా. ఆర్ఎ పూర్ణచంద్ర తేజస్వి, డా. నితిన్ బెజ్జంకి, డా. మధుసూదన్రావు, డా. శ్రీనివాస్రావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ బృందంతో సర్జరీ నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేపట్టనున్నారు. దాదాపు 2 నుంచి 3 నెలల్లోపే సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు తెలిపారు. కాగా.. జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది. -
నేడు కిమ్స్లో జూనియర్ ఎన్టీఆర్కు సర్జరీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గాయానికి నేడు శస్త్రచికిత్స జరగనుంది. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ సర్జరీ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.జూలై 27న సాయంత్రం ఎన్టీఆర్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అప్పట్లో ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు వైద్యులు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది.తాజాగా గాయానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించడంతో కిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ చేయనున్నట్లు వెల్లడించింది. సర్జరీ అనంతరం వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకోనున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఓ భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మెగాస్టార్- బాబీ కాంబో.. టైటిల్ లీక్ చేసిన చిరు
చిరంజీవి- బాబీ కాంబోలో మరో చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. ఈ మూవీని మెగా 158 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా..గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.అయితే చిరు తన సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తుంటారు. చిరు లీక్స్ పేరుతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్లు ఇవ్వడం ఆయనకు సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్ కూడా అలాగే లీక్ చేశారు. కొరియన్ కనకరాజు ఈవెంట్కు హాజరైన మెగాస్టార్.. యాంకర్ ప్రశ్నకు అప్డేట్ ఇవ్వబోయాడు. అదే ఫ్లోలో తమన్ను అడుగుతూ.. సేమ్ టైటిల్ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్ కదిరి నరసింహుడు అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. చిరంజీవి మరోసారి చిరు లీక్స్ పేరుతో తన సినిమా టైటిల్ బయటపెట్టేశారు. -
జునియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. ఎక్కడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్కు ఇటీవల గాయపడ్డారు. జూలై 27న సాయంత్రం జూ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసిందితాజాగా ఎన్టీఆర్ గాయానికి సర్జరీ జరగనుందని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరనుందని తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలిసారి వస్తోన్న ఆ కాంబినేషన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తా: డైరెక్టర్
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్స్టా పేజికి టికెట్ పంపండి.. మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. మా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో మా మూవీ రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని చెప్పగలను. ఈ సినిమా మేకింగ్లో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.' అన్నారు. కాగా.. ఈ సినిమాకు మహేశ్ నారాయణ, బి షేక్ సంగీతమందించారు. -
జడల్ జమానా షురూ.. మోస్ట్ వయొలెంట్ టీజర్ చూశారా?
నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్'. ఈ సినిమాకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే కథ ఫుల్ వయొలెంట్గా ఉండనుందని అర్థమవుతోంది. యాక్షన్లో సీన్స్లో ఎక్కడా చూసినా రక్తపాతమే కనిపిస్తోంది. ఈ ఫుల్ వయొలెంట్ టీజర్ టాలీవుడ్ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ మూవీ మోహన్బాబు పాత్ర హైలెట్గా ఉండనుందని టీజర్లో తెలిసిపోతోంది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రదీప్ రావత్ మరణం.. అసలు టాలీవుడ్కు ఏమైంది?
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం చెందారు. గత ఐదేళ్లుగా బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ సాయంత్రం కన్నుమూశారు ముంబయిలోని గోరెగావ్లో ఇవాళ ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రకు పెద్దఎత్తున సినీతారలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అశోక్ పండిట్, అఖిలేంద్ర మిశ్రా, రాజ్ అర్జున్, కరణ్ వి గ్రోవర్, సురేంద్ర పాల్, రుహానికా ధావన్ తదితరులు ఉన్నారు. అంత్యక్రియల సమయంలో రావత్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.స్పందించని టాలీవుడ్..బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా మెప్పించిన ప్రదీప్ రావత్పై టాలీవుడ్ చిన్నచూపు చూసింది. ఆయన మరణం తర్వాత ఏ ఒక్క హీరో సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించలేదు. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకున్నారు. ప్రదీప్ రావత్ లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. మంచు విష్ణు సంతాపం.. మంచు విష్ణు తన ట్వీట్లో రాస్తూ..'ప్రదీప్ రావత్ మరణవార్త విని చాలా బాధపడ్డా. తెరపై, ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు. ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి. నేను ఆయనను ఎల్లప్పుడూ అలాగే గుర్తుంచుకుంటాను. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ఇదే నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని, ఆయన పవిత్రాత్మ శాశ్వత శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. హిందీ మూవీ బాఘితో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసిన ప్రదీప్ రావత్.. తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సై మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రావత్.. పలు సూపర్ హిట్ చిత్రాల్లో మెప్పించారు. ప్రభాస్ మూవీ ఛత్రపతిలో రాజ్ బిహారీ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నాయక్, లక్ష్మీ, భద్ర, దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్, ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించారు. ఆయన చివరిసారిగా తెలుగు చిత్రంలోనే కనిపించారు. తరుణ్ భాస్కర్ నటించిన గాయపడ్డ సింహం చిత్రంలో మెరిశారు. It is deeply saddening to hear of the passing of Pradeep Rawat garu.On screen, he brought immense power to every character he portrayed. Off screen, he was the complete opposite: humble, simple, warm, and truly down to earth. That is how I will always remember him.My…— Vishnu Manchu (@iVishnuManchu) August 5, 2026 -
మరోసారి దూకుడు.. రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ చిత్రాలు బిగ్ స్క్రీన్పై సందడి చేశాయి. తాజాగా మరో సూపర్ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. మహేశ్ బాబు హీరోగా వచ్చిన దూకుడు ఆడియన్స్ను ఆలరించింది. 2011లో కేవలం రూ.35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. మహేశ్బాబు యాక్షన్, బ్రహ్మానందం-ఎమ్మెస్ నారాయణ కామెడీ ఈ మూవీలో హైలెట్గా నిలిచాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన సమంత హీరోయిన్గా మెప్పించింది. మరోసారి వీరిద్దరిని బిగ్ స్క్రీన్పై చూసి ఎంజాయ్ చేయండి. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రంలో థియేటర్లలో సందడి చేయనుంది. -
చిరు- బాబీ కాంబో.. ఆ రూమర్స్పై క్లారిటీ..!
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో మెగా 158 వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయనున్నారని నెట్టింట చర్చ మొదలైంది. అంతేకాకుండా ఈ మూవీలో తండ్రీ, కొడుకు పాత్రలు చేయనున్నారంటూ వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ క్రేజ్ దృష్ట్యా ఈ తరహా రోల్స్ చేయడం లేదనే ఇన్సైడ్ టాక్. దీంతో ఈ రూమర్స్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో అనస్వర రంజన్.. చిరు కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. -
మ్యాచింగ్ డ్రస్సుల్లో ముచ్చటైన సినీ జంట (ఫొటోలు)
-
సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్
సుమంత్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో వీక్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ కేవలం రూ.105కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. కాగా.. ఈ సినిమాకు సింజిత్ యర్రమిల్లి సంగీతమందించారు. -
అల్లు అర్జున్ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్
సుమంత్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమంత్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రెండు బ్లాక్బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నానని వెల్లడించారు.2000లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి చిత్రం దర్శకుడు కె విజయభాస్కర్ మొదట నన్నే సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరలేదని తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు స్క్రిప్ట్ కూడా తానే మొదటి విన్నానని తెలిపారు. కానీ నేను చేసి ఉంటే అంత భారీ హిట్ కొట్టేది కాదన్నారు. అల్లు అర్జున్కే దేశముదురు సెట్ అయిందని పేర్కొన్నారు.కాగా.. న్యూటన్ థర్డ్ లా మూవీకి రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించగా.. కె.హరీశ్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ మణికట్టు సర్జరీ సక్సెస్
మెగా హీరో రామ్ చరణ్కు మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఆ తరవాత హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నెముక సమస్యకు కూడా ఈయనే చికిత్స అందించారు.ఈ ఏడాది జూన్లో పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటే తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు ఆయన భార్య ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. సర్జరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు -
దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్.. జాకీ.. క్వీన్). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
జూనియర్-నీల్ కాంబో.. మరో స్టార్ నటుడి ఎంట్రీ..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే డ్రాగన్కు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ భాజ్పేయి నటించనున్నారని లేటేస్ట్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే అతన్ని మేకర్స్ సంప్రదించారని టాక్. ఓ కీలక పాత్ర కోసం మనోజ్ను చిత్ర యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది. ఓకే అయితే వచ్చే షూటింగ్ షెడ్యూల్లోనే మనోజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. -
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ మూవీలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే ఇటీవలే నాగచైతన్య తన భార్య శోభిత ధూలిపాళ్లతో ఓ పిక్ చేశారు. పెళ్లయిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నా భార్య శోభిత తన కోసం రాత్రి భోజనం వండిందని వెల్లడిస్తూ నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బహుశా ఈ రోజు నేను ఏదో సరైన పనే చేశానేమో అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ ఫోటోలో శోభిత లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారని పోస్టులు పెడతున్నారు. ఈ ఫోటోలో శోభిత బేబీ బంప్తో కనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు చైతూ కానీ.. శోభిత కానీ స్పందించలేదు. వీళ్లిద్దరూ క్లారిటీ ఇస్తేనే రూమర్స్కు చెక్ పడనుంది. కాగా.. టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన చైతూ మాజీ భార్య సమంత.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చైతూ కూడా ఇదే ఏడాది గుడ్ న్యూస్ చెప్పనున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
నా లైఫ్లో స్పెషల్ మూవీ అదే : అఖిల్ కామెంట్స్ వైరల్
లెనిన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.లెనిన్ హిట్ కొట్టిన ఆనందంలో ఉన్న అఖిల్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మొత్తం నా నిద్ర టైమ్ ఆధారంగానే తెరకెక్కించారని తెలిపారు. నేను ఏడవాలంటే కెమెరా వెనకాల నాన్న చేతులు ఊపేవారని అన్నారు. నేను ఏడ్చాలంటే అమ్మ బై చెప్పి కారులో వెళ్లిపోయేదని అఖిల్ వెల్లడించారు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో నేను నటించానని.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందన్నారు. నా లైఫ్లో ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ సిసింద్రీ మూవీనేనని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో సిసింద్రీ మూవీ చాలా ప్రత్యేకమని తెలిపారు. -
నారా రోహిత్ బర్త్ డే.. కొత్త సినిమా అప్డేట్ ఇదే
టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇవాళ నారా రోహిత్ బర్త్ డే కావడంతో టైటిల్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈసారి నారా రోహిత్ కాస్తా డిఫరెంట్ కంటెంట్తో పలకరించబోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ సినిమాకు కపాలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు నేపథ్యంతో సాగే ఈ కథలో మైండ్-బెండింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.ఈ మూవీకి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత పట్నాయక్, లావణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1— Rohith Nara (@IamRohithNara) July 24, 2026 -
హే చికీతా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్ : హే చికీతానటీనటులు: అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అజయ్ తదితరులునిర్మాణ సంస్థలు: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి దర్శకత్వం: ధనరాజ్ లెక్కలసంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజిఎడిటర్: మధు విడుదల తేది: జులై 24, 2026ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి నిర్మాతగా మారిన బద్రి సినిమాలోని ఓ పాటలోని పదం హే చికీతా తీసుకొని టైటిల్గా పెట్టడంతో ఈ చిన్న సినిమాపై కాస్తా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ హే చికీతా సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..శివ(అభినవ్ మణికంఠ)తన ఫ్రెండ్స్ ఢిల్లీ( జబర్దస్త్ అజయ్), రాజు, కృష్ణ, సూరిలతో కలిసి అల్లరిచిల్లరిగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. శివ పక్క ఊరిలో ఉండే తన మరదలు చిట్టి(దివిజ ప్రభాకర్) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. కానీ శివ జాబ్ తెచ్చుకుంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు చిట్టి తండ్రి. ఇంకో మరదలు పొట్టి(తన్మయ్ ఖుషి) ఏమో శివని ప్రేమిస్తుంది. ఓ సినిమా రిలీజ్ రోజు శివ, తన మరదలు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లగా అక్కడ వేరే ఊరికి చెందిన కొంతమందితో గొడవ పెట్టుకుంటాడు శివ. దాంతో వాళ్ళు శివ మీద అటాక్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. తన ఊళ్ళో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఊళ్ళో పెద్ద మనుషులతో గొడవ పడి ఇంకో పందిరి పెట్టుకొని ఘనంగా చేస్తారు శివ, అతని ఫ్రెండ్స్. అయితే నిమజ్జనం రోజు థియేటర్లో శివతో గొడవపడిన వాళ్ళు శివపై అటాక్ చేయడంతో అందులో ఓ వ్యక్తిని శివ పొడుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శివ జాబ్ తెచ్చుకుంటాడా? శివ పెళ్లి ఎవరితో జరుగుతుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఓ నలుగురు ఫ్రెండ్స్, హీరో లవ్ స్టోరీ, ఊళ్ళోనే ఉండి బతకాలి అనే కథాంశాలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ హే చికీతా సినిమా కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని ఫ్రెండ్స్ ఊళ్ళో చేసే అల్లరి చిల్లరి పనులు, కామెడీ, శివ - చిట్టి లవ్ స్టోరీ, హీరో గొడవలు, హీరో ఫ్రెండ్స్ పాత్రల పరిచయాలతో సోసో గా సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో ఓ వ్యక్తిని పొడవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువగా హీరో - హీరోయిన్ లవ్ స్టోరీ మీదే నడుస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ హీరో - హీరోయిన్ కలవడం, వ్యవసాయం, రైతు గురించి కొన్ని మంచి మాటలు చెప్పడంతో ముగుస్తుంది.అక్కడక్కడా కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. బావ మరదళ్ల లవ్ స్టోరీ బాగుంటుంది. రైతుల ఎమోషన్స్ క్లైమాక్స్ తో, కొన్ని సీన్స్ లో డైలాగ్స్ తో చెప్పించారు కానీ ఆ ఎమోషన్ ఎక్కడా పండలేదు. హీరో వ్యవసాయం చేస్తున్నాడు అంటారు కానీ అసలు ఎక్కడా హీరో వ్యవసాయం చేసినట్టు చూపించరు. హీరో పాత్ర మాత్రం క్లైమాక్స్ వరకు కూడా ఇంత జరుగుతున్నా ఇంకా మారడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ తో సాగదీశారు అనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా 2000 సంవతసరంలో జరుగుతుంది. దానికి తగట్టు చూపించడానికి రైటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.ఎవరెలా చేశారంటే..అభినవ్ మణికంఠ హీరో పాత్రలో బాగానే మెప్పించాడు. దివిజ ప్రభాకర్ క్యూట్ గా కనిపిస్తూ అల్లరి చేసే అమ్మాయిలా మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించింది. తన్మయ్ ఖుషి మరో మరదలు పాత్రలో మెప్పిస్తుంది. జబర్దస్త్ అజయ్ అక్కడక్కడా నవ్విస్తాడు. దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎడిటింగ్లో కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
విజయ్ దేవరకొండ రణబాలి.. అంతలా కష్టపడ్డారా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ కాస్తా గట్టిగానే శ్రమించినట్లు తెలుస్తోంది. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. తన పాత్ర కోసం కెరీర్లోనే అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రణబాలి లుక్ కోసం నెలల తరబడి ఫిట్నెస్ వర్కవుట్స్ చేశారని ఓ నివేదికలో వెల్లడైంది.విజయ్ దేవరకొండ ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయుధాలను వాడటం, తుపాకీని ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నారని ఓ నివేదిక ద్వారా తెలిసింది. కత్తిసాము, ఆయుధాల వాడకం, తుపాకీ విన్యాసాలతో పాటు ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి కఠోర శిక్షణ తీసుకున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కొరియన్ కనకరాజు.. రిలీజ్కు ముందే బిగ్ డీల్..!
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్డెట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డీల్తో మూవీ రిలీజ్కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. -
చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
అఖిల్ లెనిన్.. లవ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. -
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్డ్రాప్లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
బర్త్డే స్పెషల్.. హీరో సూర్య రేర్ ఫోటోలు
-
రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. #MAREMMA - SEPTEMBER 10TH! Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026 -
రవితేజకు జిరాక్స్ కాపీ.. ఇలా కూడా ఉంటారా?
ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఏడుగురో ఏమో కానీ మనలా అచ్చం ఒక్కరు కనపడినా చాలని ఫీలవుతుంటాం. సడన్గా మనలాంటి వ్యక్తి ఎవరైనా ఎదురుగా వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవ్వాలని మనం కూడా కోరుకుందాం. మనకేమో గానీ.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇతన్ని రవితేజ మూవీస్లో డూప్గా వాడుకోవచ్చు కదా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా అతనెవరో వివరాలేమీ తెలియదు. ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం మనలాగే అలా ఎవరైనా ఉంటే చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదూ.As it is గా వున్నాడు,డూప్ గ వాడుకోవచ్చు కదా ఎలాగో కాండిడేట్ ఫేస్ వాడి పోయినట్టు వుంటుంది#Raviteja pic.twitter.com/jBgMjGLmDB— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 21, 2026 -
అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నా కంటి మీద కునుకే’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ ఆలపించారు. ఈ సాంగ్ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. -
'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్లో బక్క పలచని కుర్రాడిలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తోన్న మూవీ బ్లాక్మెయిల్. ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నా వైఫ్ మిస్సింగ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.ఈ నెల 21న వరుణ్ సందేశ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇండస్ట్రీలో దిల్ రాజు, అల్లరి నరేశ్ చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్లో పనిచేశా.. అంతేకాకుండా క్యాషియర్గా కూడా పని చేశానని వరుణ్ తెలిపారు.నా కెరీర్లో ఎత్తు, పల్లాలు చూశానని వరుణ్ సందేశ్ తెలిపారు. నా కెరీర్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి మూవీలో దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేనని వరుణ్ సందేశ్ తన మనసులోని మాటలు పంచుకున్నారు. -
ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్ఫుల్ రోల్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి.. ఆ తర్వాత సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరుతాడని తెలుస్తోంది. ఇది కేవలం నేతాజీ బయోపిక్ మాత్రమే కాదని.. అంతే కాకుండా ఇండియన్ ఫ్రీడమ్ కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా ఉండనుందని టాక్. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న ఫౌజీ విడుదల కానుందని తాజాగా పోస్టర్ను పంచుకుంది.ఈ పోస్టర్లో ఎప్పుడు చూడని లుక్లో ప్రభాస్ కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ప్రభాస్ ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. अज्ञातपर्व ENDS. THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026 -
'ఆయనే అలా అంటే నేను తోపే కదా'.. నిహారిక కొణిదెల
'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది. -
‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్పై విశ్వక్ సేన్ కామెంట్స్'
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కల్ట్. ఈ మూవీకి తానే సొంతంగా కథ రాసుకోవడమే కాదు..డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ మూవీని కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. హీ ఈజ్ మై దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అనేది ఇంటర్వెల్లో వస్తుందని తెలిపారు. ఈ మూవీ ద్వారా నేను 150 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్లోపు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది-2 రిలీజైన తర్వాతే కల్ట్ మూవీ వస్తుందన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. -
రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. పుష్ప రిపీట్ కానుందా?
పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తరహాలో రెండు భాగాలు తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తన్నట్లు అనిపిస్తోంది.ఈ చిత్రంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్మామెన్స్కు స్కోప్ ఉంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ మూవీ 2027 చివర్లో లేదా.. 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఫుల్ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారు. యాక్షన్తో పాటు సామాజిక కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య మూవీ టైటిల్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో సినిమా టైటిల్ టాలీవుడ్లో ఆసక్తిగా మారింది.ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ పేరును ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ టైటిల్ పెడితే సామాజిక కోణంలో కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో సోషల్ మేసేజ్తో పాటు ఫుల్ యాక్షన్ ట్రీట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.ఇక వచ్చేనెల చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్లో బాలయ్యపై భారీ యాక్షన్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ విషయంలో కొరటాల శివ భారీగానే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
వదినకి ఏ చీర కావాలి?... నాగ చైతన్య సమాధానం ఇదే
టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. చైతూ ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా శోభిత-నాగచైతన్య జంటగా వెళ్లి షాపింగ్కు వెళ్లారు. ఓ చీరల దుకాణంలో సందడి చేశారు. వదినకి ఏ చీర తీసుకుంటారని అక్కడివాళ్లు ప్రశ్నించారు. దీనికి చైతూ స్పందించారు. తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటానని నాగచైతన్య నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమాని: అన్నా... వదినకి ఏ చీర తీసుకున్నారు?నాగ చైతన్య: తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటాను.#NagaChaitanya #SobhitaDhulipala #Sobhita #ChaySo #Tollywood #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/DsADTOvzey— Tupaki (@tupaki_official) July 18, 2026 -
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
-
'నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందిరా ఈ పళ్లబురుసు'
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజైన వీడియో చూస్తుంటే పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. -
టాలీవుడ్లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆమెన్. ఈ సినిమాకు ఎస్కే బషీద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై రేగుల నీరజరాణి నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్కే బషీద్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్కు భిన్నంగా ఆమెన్ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం... గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన మూవీ. ఔట్పుట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ మూవీ ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే నన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి. -
అయ్యగారే నంబర్వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. #Lenin చూసి #AkhilAkkineni wife #Zainab కూడా ఒకే మాట...' అయ్యగారే నెంబర్ 1 '#Lenin Success Celebrations at Gunturpic.twitter.com/mVE9jJid5r— Taraq(Tarak Ram) (@tarakviews) July 15, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్తో ట్రెండింగ్లో వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. అందరికీ తెలుసు.. తాను తీసిన సినిమాలన్నీ తలెత్తుకునేవి చేశాడు. ఎవరు పిలిచినా.. ఏ ఫంక్షన్కు పిలిచినా వచ్చేస్తాడని అన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్ రావిపూడి అని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా చెప్పకపోయినా ఈవెంట్కు వచ్చేశారని అన్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన హీరోగా నటించిన వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి సైతం జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పుడూ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తున్నాను... కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కు పిచ్చెక్కించిన యాక్టర్ జగపతిబాబు అని కొనియాడారు. ఆయనతో ఒక సినిమాకు పని చేయాలని ఉందని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టారు.కాగా.. జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన అఖిల్ సక్సెస్ కొట్టేశాడు.లెనిన్పై కాపీ ట్రోల్స్..లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మేకర్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లెనిన్ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. లెనిన్లో హైలెట్గా నిలిచిన క్లైమాక్స్ సీన్ను మక్కీకి మక్కీ దించేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. 1999లో బాలయ్య నటించిన క్రిష్ణబాబు మూవీలోని సీన్ను తలపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్.. 1999లో వచ్చిన క్రిష్ణబాబు మూవీలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి.. ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి హీరోయిన్ను చంపేలా చేస్తాడు. అచ్చం అలానే ఈ చిత్రంలో విలన్ హీరో కళ్లల్లో కెమికల్ కొట్టడం.. హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కడం.. చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్ను దించేశారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఈ తరం ప్రేక్షకులకు తగినట్లుగా సీన్ రీ క్రియేట్ చేశారని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై లెనిన్ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజై ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సీన్నే.. లెనిన్ టీమ్ కాపీ చేశారని అంటున్నారు. -
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ రియాక్షన్
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం జానీ మాస్టర్ స్పందించారు. శేఖర్ మాస్టర్తో తనకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాలు అని వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. శేఖర్ మాస్టర్ ఆగ్రహంతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోవైరలయ్యాయి. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులు ఘర్షణకు దిగారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. మా యూనియన్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నేను, శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని వెల్లడించారు. మాకు చిరంజీవి ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమేనని తెలిపారు. అంతే కానీ మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీ రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. -
లెనిన్ సక్సెస్.. అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026 -
అఖిల్ ‘లెనిన్’ సక్సెస్మీట్(ఫోటోలు)
-
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. వచ్చేది ఎప్పుడంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీని హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... 😎💥Get ready for the wildest Indo-Korean horror comedy ride of the year with #KoreanKanakaraju 🐉😈#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th, 2026 ❤️🔥@IamVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/BhgLFQN73g— UV Creations (@UV_Creations) July 10, 2026 -
సమంతకు అఖిల్ ఎఫెక్ట్.. ఆ రికార్డ్ కష్టమేనా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్నసినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే గత నెల రిలీజై సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ వంద కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరో రూ.5 కోట్లు సాధిస్తే వందకోట్లు రాబట్టిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీగా ఘనత దక్కనుంది.సమంతకు లెనిన్ ఎఫెక్ట్..వందకోట్ల దిశగా దూసుకెళ్తోన్న మా ఇంటి బంగారానికి అఖిల్ లెనిన్ మూవీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం లెనిన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వేళ.. సమంత మూవీ వసూళ్లు వందకోట్లు దాటడం కష్టమేననిపిస్తోంది. లెనిన్ చిత్రం టాక్ ఆధారంగా మా ఇంటి బంగారం కలెక్షన్స్పై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు వీకెండ్ సామ్కు కలిసొస్తే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి బాక్సాఫీస్ రేసును తట్టుకుని సమంత సినిమా 100 కోట్ల క్లబ్లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
ఫౌజీ షూటింగ్లో నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న పీరియాడిల్ యాక్షన్ లవ్స్టోరీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ షూటింగ్లో ప్రముఖ నటుడు రాజేశ్ శర్మకు విషపురుగు కాటేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపించింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫౌజీ నటుడు రాజేశ్ శర్మ పీఎ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజేశ్ శర్మ పీఏ సుభాశిష్ పాండా మాట్లాడుతూ..' రాజేశ్ శర్మకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. ఆయనను ఎలాంటి విషపురుగు కాటేయలేదు. కేవలం ఆయనకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచింది. అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారు. రాజేష్ శర్మకి షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు నేను ఉంటా. కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరిన పీఏ సుభాశిష్ పాండా కోరారు. Rajesh Sharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow#fauji#rakeshsharma#prabhas#prabhasfans #actorrakeshsharma#actorrajeshsharmahealthupdate pic.twitter.com/cmFWtG8Dh7— SATISH @ SAKSHI (@SatishKottangi) July 8, 2026 -
లయ లేటేస్ట్ మూవీ.. వదలా ట్రైలర్ రిలీజ్
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వదలా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మూడో వ్యక్తి వల్ల ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనేది ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ సినిమాకు కార్తీక్ సంగీతమందించారు. -
విభిన్న కథా చిత్రంగా అంతర్యామి
ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం అంతర్యామి. ఈ సినిమాకు శివ సత్యం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానరంజన్ సాహు నిర్మిస్తుండగా.. అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రీకరణ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీజే కార్తికేయన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్ పాత సీన్స్తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన పెద్దిని స్ట్రీమింగ్కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్ఫ్లిక్స్తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్కు ముందే రికార్డ్
అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా రిలీజ్ కేవలం మూడు రోజుల సమయ మాత్రమే మిగిలింది. ఇప్పటికే లెనిన్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్పరంగా కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది. ఈ మూవీ కోసం జీ నెట్వర్క్ డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని రూ.19 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ వర్షన్కు ఏకంగా రూ.9 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇవీ కాకుండా ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్ మరో రూ.6 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో రిలీజ్కు ముందే లెనిన్ ఏకంగా రూ.34 కోట్ల వసూళ్లు సాధించినట్లే. ఈ లెక్కన చూస్తే నాన్ థియేట్రికల్ రూపంలో ఊహించని ధరలను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీలు అమ్మడమే కష్టమైన దశలో లెనిన్ భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం. అయితే ఈ డీల్స్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. -
భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు)
-
'కష్టాల్లో కాపాడేవాడే నిజమైన రాజు'.. రాజా ది రాజా ట్రైలర్ రిలీజ్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రాజా ది రాజా. ఈ చిత్రానికి అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్లో దాసరి నిహారిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే రాజు అనే కాన్సెప్ట్ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలానికి.. ప్రజెంట్కు లింక్ పెట్టి ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉండనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. ఈ మూవీలో సాయి కుమార్, నరేశ్, అవసరాల శ్రీనివాస్, విష్ణు, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
లెనిన్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
అక్కినేని అఖిల్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.లెనిన్ ట్రైలర్కు నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. తాజాగా మరో హీరో లెనిన్ కోసం తన వాయిస్ ఓవర్ అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాలు.. అందులోని మనుషులను తీరు తెన్నులను ఎన్టీఆర్ తన వాయిస్ ద్వారా చెప్పనున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనిని కూడా పూర్తి చేశారు మన యంగ్ టైగర్. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్.. జూనియర్ ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. Thank you Tiger🐅. Thanks for roaring for #Lenin. 🙏🏻🙏🏻🙏🏻Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother @tarak9999 ❤️ pic.twitter.com/D2Xd0pZDpH— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2026 -
తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ..!
రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది.ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. విజయ్తో సరసన స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఫుల్ యాక్షన్ మూవీగా వస్తోన్న రౌడీ జనార్ధనలో ఈ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ హైలెట్గా ఉండనున్నాయి. దిల్రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. -
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తా : అభిషేక్ నామా
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీతో బిజీగా ఉన్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. బ్రిటీష్ కాలం నాటి హిస్టారికల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది.ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ నామా తాజాగా నాగబంధం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించారు. మా మధ్య ఇదొక కుటుంబంలో జరిగే గొడవలాంటిదేనని అభిషేక్ నామా అన్నారు. త్వరలోనే మేమంతా కలిసిపోతామని.. కుదిరితే విజయ్తో మూవీ కూడా తీస్తానని పేర్కొన్నారు.అయితే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మూవీ భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాకు అభిషేక్ నామా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సమయంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ఆయన ఫ్యాన్స్ నామాపై ఫైర్ అయ్యారు. -
సమంతకు కంగ్రాట్స్.. ట్రైలర్ చూసి ఫిక్సయ్యా: అఖిల్
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని లేటేస్ట్ మూవీ లెనిన్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్లింది. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో యాక్షన్ స్టోరీగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అఖిల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ హిట్ కావడంపై సమంతకు విషెస్ తెలిపారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చిందన్నారు.అఖిల్ మాట్లాడుతూ..' నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ ట్రైలర్ చూడగానే చాలా నచ్చింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. ఓ మంచి కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే పాయింట్ బాగా నచ్చింది. సమంత పవర్ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి అభినందనలు' తెలిపారు. -
నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్తో వింటేజ్ హెయిర్ లుక్లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్తో కనిపించారు. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
మంచు విష్ణు సాహసం.. కన్నప్ప స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన మూవీ 'కన్నప్ప'. గతేడాది జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. అమెజాన్ ప్రైమ్లో కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సౌత్ భాషల్లో ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజాగా మంచు విష్ణు కన్నప్ప మూవీపై షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా సొంత యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 03 నుంచి అవా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన సినీ ప్రియులు మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The divine journey arrives on YouTube! 🙏#Kannappa Full Movie premieres on the AVAA YouTube Channel starting July 3.Don't miss the chance to experience this epic with the entire Family during the YouTube Premiere.#KannappaMovie #NowStreaming #YouTubePremiere #NowOnYoutube… pic.twitter.com/3caOSVSIVo— AVAA Entertainment (@avaaentofficial) July 2, 2026 -
సినిమాల్లో ఆ హీరోయిన్ అంటే క్రష్: ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఎపిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య మరోసారి ఆనంద్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. సమ్మర్ హాలీడేస్ మూవీలోని క్రష్ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆనంద్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆనంద్ దేవరకొండ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఏదైనా సినిమా చూసేటప్పుడు హీరోయిన్లపై క్రష్ ఉంటుంది.. అలా మురారి చూసినప్పుడు నాకు సోనాలి బింద్రేపై క్రష్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు.కాగా.. రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధానపాత్రల్లో, శ్రీకర్ నాయన్ తెరకెక్కిస్తోన్న చిత్రం సమ్మర్ హాలీడేస్. ఈ మూవీని బాల్యం కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అఖిల్ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్లయిందని.. సారీ బ్రదర్.. ఈ విషయంలో నన్ను క్షమించాలంటూ అభిమానులను కోరారు అఖిల్. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సారి నేను మాట్లాడను.. కేవలం నా సినిమానే మాట్లాడుతుందన్నారు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదు.. రెండు రోజులుగా నేను నిద్రపోలేదు.. కళ్లద్దాలు పెట్టుకుని వద్దామనుకున్నానని తెలిపారు. మిమల్ని చూస్తుంటే జూలై 10 వరకు పనిచేసే ఎనర్జీ వచ్చిందని అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడారు. #LENIN is ready to hit hard... and Vizag has already set the tone ❤️🔥❤️🔥 #LeninTrailer - https://t.co/04wGr6WZ2x #LeninOnJuly10th pic.twitter.com/phNA8qkUrw— Sithara Entertainments (@SitharaEnts) June 30, 2026 -
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు. -
' శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా?.. లెనిన్ ట్రైలర్ చూశారా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. -
త్రివిక్రమ్తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న ప్రత్యేక పోస్టర్ను షేర్ చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్తో మరోసారి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మూవీని పురాణాల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు.కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరిద్దరు మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబోలో మరో హిట్ కొడతారా టాలీవుడ్లో చర్చ మొదలైంది. The Son of Shiva.The Pride of Parvathi.The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu— Jr NTR (@tarak9999) June 29, 2026 -
విజయ్ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత
గత రెండు రోజులుగా హీరో విజయ్ దేవరకొండ రణబాలి మూవీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విజయ్ నిర్మాతలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. అలాంటి వార్తలు పూర్తి ఫేక్ అని కొట్టిపారేశారు. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వెల్లడించారు. విజయ్ కేవలం పని మీదే శ్రద్ధ పెడతారని రవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. రణబాలి షూట్ కోసం విజయ్ ఎక్కువగా కారవాన్లు డిమాండ్ చేయడమే కాకుండా.. అసిస్టెంట్స్ కూడా ఎక్కువమంది ఉండాలని కోరాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై విజయ్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రణబాలి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కీలక సన్నివేశాలను రాయలసీమలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగానే షూట్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ రణబాలి.. ఆ ప్రచారంపై చర్యలు తీసుకోండి..!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది.తాజాగా విజయ్ దేవరకొండ వస్తోన్న దుష్ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. రణబాలి మూవీ నిర్మాతలకు భారం పెరిగేలా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్స్ కావాలని.. మినిమం 5 లేదా ఆరు క్యారవాన్స్ అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇలాంటి వార్తలు రాసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు ఆయా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది. -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అభిమానుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కేవలం రీ రిలీజ్ల సందడి నెలకొంది.ఈ ఫ్రైడే కొత్త సినిమాల హడావుడి థియేటర్ల వద్ద లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అవతార్-3, బ్లాస్ట్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సడన్గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26 నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26 ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26 లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27జియో హాట్స్టార్ లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26 ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26అమెజాన్ ప్రైమ్ అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5 ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26 మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లే బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26హెచ్బీవో మ్యాక్స్..అండర్టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26 -
అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఆ స్టార్ హీరోను ఉద్దేశించే అన్నారా?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సూపర్ హిట్గా నిలిచింది. బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ మూవీ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్ది మూవీ రూ.420 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కదా వసూళ్ల వరద అంటే.. ఈ వరద మీద బురద చల్లాలనుకున్ దురద గాళ్ల సరదా తీర్చేసిన అభిమానులు మీరు అంటూ ప్రశంసించారు. అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా బృందం మీ దగ్గరకు వచ్చిందన్నారు. ఏదో భారీ వాహనాలను గాల్లోకి లేపితే వచ్చే చప్పట్లు కొట్టడం కాదు.. కథ మొత్తం చూసి, కళ్లలో నీళ్లు పెట్టుకుని, కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు అంటూ ఫ్యాన్స్ను కొనియాడారు.ఆ హీరో గురించేనా?అయితే వాహనాలను గాల్లోకి లేపడం లాంటి సీన్స్ ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనే ఉంటాయి. అనంత్ శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించే చేశారా? అని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఈ కామెంట్స్పై మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తక్కువ చేసేి మాటాడాలా? అంటూ అనంత్ శ్రీరామ్కు కౌంటరిస్తున్నారు. మరి అనంత్ శ్రీరామ్ తనపై వచ్చే ట్రోల్స్కు ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. ఇది చదవండి: ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్ -
'నా అసలు పేరు మర్చిపోతారేమో'.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ పెద్ది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో మేకర్స్నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన రామ్ చరణ్ ఎమోషనలయ్యారు. ఈ సినిమా నా లైఫ్ను మార్చేసిందని అన్నారు. ఇంత పెద్ది హిట్ ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీలోని పాటలకు అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోందన్నారు. క్లీంకార ఇప్పుడు నన్ను పెద్ది అని పిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా నా పేరు మరిచిపోయి పెద్ది అని అంటారేమోనని అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడలేని ఏదైనా ఉంటే డైరెక్టర్ సుకుమార్కు ఫోన్ చేస్తానని చెప్పారు.తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని రామ్ చరణ్ అన్నారు. మా పెద్ది సినిమాకు పాజిటివ్గా రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
వసుదేవసుతం ట్రైలర్ రిలీజ్
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్బో సినిమాస్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
మా క్రియేటివిటీని చంపుతున్నారు: డైరెక్టర్ శ్రీకాంత్ ఆవేదన
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు. -
సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. -
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు షాక్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.కాగా.. ఈ కేసులో ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించునుంది.అసలేం జరిగిందంటే..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రిలీజ్ ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. -
ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్ షాకింగ్ లైఫ్ స్టైల్..!
ఒకప్పుడు టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో పదేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.మూవీ రిలీజ్కు అంతా సిద్ధం కావడంతో వడ్డే నవీన్ తన సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆయన.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డైలీ రోటీన్ లైఫ్, ఆహార విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ రివీల్ చేశారు. ప్రతి రోజు ఉదయాన్నే ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తానని వడ్డే నవీన్ తెలిపారు. ఉదయాన్నే టిఫిన్ కాకుండా డైరెక్ట్గా మీల్స్ తింటానని వెల్లడించారు. ఉదయమే చికెన్, రైస్ తింటా.. లేదంటే వెజ్ కర్రీ ఏదైనా సరే రైస్తో కలిపి తీసుకుంటానని అన్నారు. అయితే తాను మధ్యాహ్నం లంచ్ చేయనని వడ్డే నవీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నైట్ డిన్నర్లో కూడా ఉదయం లాగే నాన్వెజ్తో వెజ్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే డైలీ లంచ్ చేయకపోవడం అన్నది వింటే మాత్రం కాస్తా షాకింగ్గానే అనిపిస్తోంది. రోజులో ఒక పూట తినకుండా ఉండడం అంతా ఈజీ కాదంటున్నారు. కాగా.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు కల్యాణ్ నాయక్ సంగీతమందించారు. -
విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..!
మెగా అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. వరుస వాయిదాలతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ తేదీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారంలో ఉన్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు.ఆ తర్వాత ఆగస్ట్లో విశ్వంభర రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి దాకా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఏడాది విశ్వంభర వచ్చే అవకాశముందా అనే డైలామాలో అభిమానులు ఉన్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో రాకపోతే.. విశ్వంభరకు ఉన్న ఛాన్స్ దసరా. ఆ తర్వాత డిసెంబర్, సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సింది. ఆ రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందువల్లే విశ్వంభరకు దసరా మాత్రమే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక దసరా మిస్సయిందంటే డిసెంబర్లో ఏదో ఒక వారంలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా మేకర్స్ పక్కా ప్లాన్తో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్డేట్స్ ఇస్తూ మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాల్సిన అవసరముంది. కాగా.. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
-
'పెద్ది కథ వెనక నా అసలు ఉద్దేశం అదే'.. డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు. -
'నాకు కెపాసిటీ ఉంది.. అలాంటి కథలు వస్తే చేస్తా'
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, కథల ఎంపికపై తన అభిప్రాయం పంచుకున్నారు. పెద్ది టీమ్తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం తనతో చాలాసార్లు నా సినిమాల కథల గురించి మాట్లాడారని అన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేశావని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావని అన్నారని మెగాస్టార్ తెలిపారు.నీలో ఒక కమల్ హాసన్, రజినీకాంత్, బాలచందర్ లాంటి ఉన్నారని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని అనిపించిందని చెప్పానని వెల్లడించారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అని అన్నానని చెప్పారు. దంగల్ తరహాలోనే పెద్ది సినిమా కూడా ఉందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రంలో ఆడపిల్లలతో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందన్నారు. -
మనం డైెరెక్టర్తో విజయ్ దేవరకొండ.. వర్కవుట్ అవుతుందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. Rumour Mill: Vijay Deverakonda x Vikram Kumar? 👀Reports suggest that #VijayDeverakonda may team up with Vikram Kumar for a new pan-India project, reportedly backed by Maddock Films. While there's no official confirmation yet, the prospect of the 24 director collaborating with… pic.twitter.com/kqAR9sfPoS— Movie_Reviews (@MovieReview_Hub) June 13, 2026 -
అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది. మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. Team #Lenin came to me with a request.They asked for a little more time to give their absolute 100% and create something very special.Their passion and spirit made me say yes.మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!Get ready for the #Lenin…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. తొమ్మిది రోజుల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా, రన్నర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ను మేకర్స్ తొలగించారు. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. #Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026 -
ఐశ్వర్య రాజేశ్ కొత్త సినిమా.. ఓ సుకుమారి టీజర్ చూశారా?
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క నిజం దాచి పెట్టి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న పాయింట్తో ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే... ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దానర్ధం" అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీగా ఉండనుందని తెలిసిపోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. -
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్లో జీవీ ప్రకాశ్ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026 -
తీరు మారని బాలయ్య.. బర్త్ డే రోజు కూడా అదే పని
సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కోపంతో ఊగిపోయిన బాలయ్యనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో జరిగిన ఫొటో సెషన్లో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. "వెనక్కి వెళ్లండి" అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.… pic.twitter.com/BlBT0gWpSQ— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెప్పించింది.ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/5p6FrjrmUv— PEDDI (@PeddiMovieOffl) June 11, 2026 -
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. -
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026 -
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్కు క్లీంకార సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్తో కూడిన కుకీస్ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK— saiteja (@saitejaathoti) June 6, 2026 -
'ఉప్పెన హీరో.. హిట్ కోసం తంటాలు.. నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?'
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ మహేశ్తో వైష్ణవ్ తేజ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట. మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్లతో అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్కు గురైంది. అస్సలు రామ్ చరణ్లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026 -
పెద్ది ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
టాలీవుడ్ కొత్త సినిమా.. రెండు వారాల్లోనే యూట్యూబ్లో ప్రత్యక్షం
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా ఇచ్చి ఇలా వెళ్తున్నాయి. థియేటర్ నుంచే మాయం కాగానే సడన్గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రిలీజైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలు కేవలం వారాల్లోపే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే యూట్యూబ్లోకి వచ్చేసింది. ఉచితంగానే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం అరేయ్ ఆపండ్రా. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమా కి ఎస్.ఎస్ వెంకటేశ్ సంగీతమందించారు. -
'45 రోజుల కఠిన శిక్షణ'.. నిఖిల్ స్వయంభూ వీడియో చూశారా?
నిఖిల్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.అయితే ఇవాళ నిఖిల్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీలో యోధుడిగా కనిపించేందుకు నిఖిల్ ఎంతలా కష్టపడ్డారో చూపించే వీడియోను రిలీజ్ చేశారు. యోధుడిలా మారేందుకు 45 రోజులు చాలా కఠినమైన శిక్షణ.. వియత్నాం పోరాట రోజులను పుట్టినరోజు కానుకగా చూపించినందుకు టీమ్ స్వయంభూకి ధన్యవాదాలు.. కష్టపడకుండా ఫలితం రాదు.. అంటూ నిఖిల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. త్వరలోనే స్వయంభూ థియేటర్లలోకి వస్తుందంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను మీరు కూడా చూసేయండి. Yes It was a BRUTAL 45 Days of Training. Thanks to Team Swayambhu for Showcasing those vietnam struggle days as a Birthday Gift 💥🤗🥰 No PAIN No GAIN.. #Swayambhu blasting theatres"VERY SOON " pic.twitter.com/iKKzMI2rPj— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.టికెట్ బుకింగ్స్ ఓపెన్..ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 ఉండగా.. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. -
భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
-
'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను'.. శ్రీనివాస మంగాపురం యాక్షన్ గ్లింప్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
అది చాలా కష్టం.. కానీ రామ్ చరణ్ సాధించాడు: ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్
మెగా హీరో రామ్ చరణ్పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ సైతం ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. -
'ఎల్లప్పుడు నువ్వే నా హీరో'.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణను ఆయన తనయుడు మహేశ్బాబు గుర్తు చేసుకున్నారు. ఇవాళ కృష్ణ జయంతి కావడంతో నాన్నతో దిగిన ఫోటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు. నా జీవితంలో ఎల్లప్పుడు మీరే నా హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సైతం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ చిత్రానికి వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. Forever my hero….Happy Birthday Nanna ♥️♥️♥️ pic.twitter.com/7ATfMvAEMx— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2026 -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_)


