breaking news
Tollywood Hero
-
మ్యాచింగ్ డ్రస్సుల్లో ముచ్చటైన సినీ జంట (ఫొటోలు)
-
సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా.. టిక్కెట్లపై బంపరాఫర్
సుమంత్ లీడ్ రోల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో వీక్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఒక్కో టికెట్ కేవలం రూ.105కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులు ఈ ఆఫర్ను వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. కాగా.. ఈ సినిమాకు సింజిత్ యర్రమిల్లి సంగీతమందించారు. -
అల్లు అర్జున్ మూవీ నేనే చేయాల్సింది.. కానీ: సుమంత్
సుమంత్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారాయన. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుమంత్.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రెండు బ్లాక్బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నానని వెల్లడించారు.2000లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నువ్వే కావాలి చిత్రం దర్శకుడు కె విజయభాస్కర్ మొదట నన్నే సంప్రదించారని గుర్తు చేసుకున్నారు. అప్పుడు యువకుడు, పెళ్లి సంబంధం సినిమాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ కుదరలేదని తెలిపారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు స్క్రిప్ట్ కూడా తానే మొదటి విన్నానని తెలిపారు. కానీ నేను చేసి ఉంటే అంత భారీ హిట్ కొట్టేది కాదన్నారు. అల్లు అర్జున్కే దేశముదురు సెట్ అయిందని పేర్కొన్నారు.కాగా.. న్యూటన్ థర్డ్ లా మూవీకి రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించగా.. కె.హరీశ్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, కార్తీక్ రత్నం, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రామ్ చరణ్ మణికట్టు సర్జరీ సక్సెస్
మెగా హీరో రామ్ చరణ్కు మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆయన కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ప్రత్యేక చికిత్స అందుకున్నారు. రామ్ చరణ్ కుడి చేతి మణికట్టు ఈ సర్జరీ జరిగింది. ప్రస్తుతం నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. ఆ తరవాత హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. ఆర్థోపెడిక్ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ ఈ శస్త్రచికిత్సకు నాయకత్వం వహించారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైన క్లిష్టమైన వెన్నెముక సమస్యకు కూడా ఈయనే చికిత్స అందించారు.ఈ ఏడాది జూన్లో పెద్ది మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్ ఫర్వాలేదనిపించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే చరణ్ మణికట్టుకి గాయమైంది. ప్రమోషన్లలోనూ చేతికి కట్టుతోనే కనిపించాడు. దీనికి సర్జరీ అవసరమవుతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. చివరకు ఇన్నాళ్లకు చరణ్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్తో పాటే తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు ఆయన భార్య ఉపాసన కోయంబత్తూరులోనే ఉన్నారు. సర్జరీ పూర్తి కావడంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు -
దీక్షిత్ శెట్టి కొత్త సినిమా.. ట్రైలర్ వచ్చేసింది
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో వస్తోన్న చిత్రం కేజేక్యూ(కింగ్.. జాకీ.. క్వీన్). ఈ పీరియాడికల్ క్రైమ్ కథగా రూపొందించారు. ఈ మూవీకి కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని గ్యాంగ్స్టర్ నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పూర్ణచంద్ర తేజస్వీ సంగీతమందించారు. -
జూనియర్-నీల్ కాంబో.. మరో స్టార్ నటుడి ఎంట్రీ..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో టాలీవుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలోనే డ్రాగన్కు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు మనోజ్ భాజ్పేయి నటించనున్నారని లేటేస్ట్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే అతన్ని మేకర్స్ సంప్రదించారని టాక్. ఓ కీలక పాత్ర కోసం మనోజ్ను చిత్ర యూనిట్ అడిగినట్లు తెలుస్తోంది. ఓకే అయితే వచ్చే షూటింగ్ షెడ్యూల్లోనే మనోజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. -
చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారా?
టాలీవుడ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ మూవీలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ , సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే ఇటీవలే నాగచైతన్య తన భార్య శోభిత ధూలిపాళ్లతో ఓ పిక్ చేశారు. పెళ్లయిన దాదాపు 2 సంవత్సరాల తర్వాత తొలిసారిగా నా భార్య శోభిత తన కోసం రాత్రి భోజనం వండిందని వెల్లడిస్తూ నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. బహుశా ఈ రోజు నేను ఏదో సరైన పనే చేశానేమో అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.ఈ ఫోటోలో శోభిత లుక్ చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే చైతూ-శోభిత గుడ్ న్యూస్ చెప్పనున్నారని పోస్టులు పెడతున్నారు. ఈ ఫోటోలో శోభిత బేబీ బంప్తో కనిపించిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమపై వస్తున్న రూమర్స్పై ఇప్పటి వరకు చైతూ కానీ.. శోభిత కానీ స్పందించలేదు. వీళ్లిద్దరూ క్లారిటీ ఇస్తేనే రూమర్స్కు చెక్ పడనుంది. కాగా.. టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. కాగా.. ఈ ఏడాది మా ఇంటి బంగారంతో హిట్ కొట్టిన చైతూ మాజీ భార్య సమంత.. ప్రెగ్నెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చైతూ కూడా ఇదే ఏడాది గుడ్ న్యూస్ చెప్పనున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
నా లైఫ్లో స్పెషల్ మూవీ అదే : అఖిల్ కామెంట్స్ వైరల్
లెనిన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న అక్కినేని హీరో అఖిల్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది.లెనిన్ హిట్ కొట్టిన ఆనందంలో ఉన్న అఖిల్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన చిన్నప్పుడు నటించిన సిసింద్రీ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మొత్తం నా నిద్ర టైమ్ ఆధారంగానే తెరకెక్కించారని తెలిపారు. నేను ఏడవాలంటే కెమెరా వెనకాల నాన్న చేతులు ఊపేవారని అన్నారు. నేను ఏడ్చాలంటే అమ్మ బై చెప్పి కారులో వెళ్లిపోయేదని అఖిల్ వెల్లడించారు. ఇలా చిన్న చిన్న ట్రిక్స్తో నేను నటించానని.. అందుకే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందన్నారు. నా లైఫ్లో ది మోస్ట్ యూనిక్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ సిసింద్రీ మూవీనేనని అఖిల్ ఆనందం వ్యక్తం చేశారు. నా జీవితంలో సిసింద్రీ మూవీ చాలా ప్రత్యేకమని తెలిపారు. -
నారా రోహిత్ బర్త్ డే.. కొత్త సినిమా అప్డేట్ ఇదే
టాలీవుడ్ హీరో నారా రోహిత్ మరో సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇవాళ నారా రోహిత్ బర్త్ డే కావడంతో టైటిల్తో పాటు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఈసారి నారా రోహిత్ కాస్తా డిఫరెంట్ కంటెంట్తో పలకరించబోతున్నట్లు తెలిసిపోతోంది. ఈ సినిమాకు కపాలి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సైకలాజికల్ హార్రర్ థ్రిల్లర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు నేపథ్యంతో సాగే ఈ కథలో మైండ్-బెండింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు అర్థమవుతోంది. ఇవాళ రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.ఈ మూవీకి రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక, ప్రణీత పట్నాయక్, లావణ్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంతెన, భాను కిరణ్ ప్రతాప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. A journey into the UNKOWN begins here…My next #Kapaali. Written & Directed by @GanniRaam @VijayKrishnaLin @Kalyan_manthina @bhanu_pratapa @SAMWoffl pic.twitter.com/0KiSyP6WB1— Rohith Nara (@IamRohithNara) July 24, 2026 -
హే చికీతా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్ : హే చికీతానటీనటులు: అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, అజయ్ తదితరులునిర్మాణ సంస్థలు: అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, గరుడవేగ అంజి దర్శకత్వం: ధనరాజ్ లెక్కలసంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజిఎడిటర్: మధు విడుదల తేది: జులై 24, 2026ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి నిర్మాతగా మారిన బద్రి సినిమాలోని ఓ పాటలోని పదం హే చికీతా తీసుకొని టైటిల్గా పెట్టడంతో ఈ చిన్న సినిమాపై కాస్తా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ హే చికీతా సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..శివ(అభినవ్ మణికంఠ)తన ఫ్రెండ్స్ ఢిల్లీ( జబర్దస్త్ అజయ్), రాజు, కృష్ణ, సూరిలతో కలిసి అల్లరిచిల్లరిగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. శివ పక్క ఊరిలో ఉండే తన మరదలు చిట్టి(దివిజ ప్రభాకర్) చిన్నప్పట్నుంచి ప్రేమించుకుంటారు. కానీ శివ జాబ్ తెచ్చుకుంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు చిట్టి తండ్రి. ఇంకో మరదలు పొట్టి(తన్మయ్ ఖుషి) ఏమో శివని ప్రేమిస్తుంది. ఓ సినిమా రిలీజ్ రోజు శివ, తన మరదలు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లగా అక్కడ వేరే ఊరికి చెందిన కొంతమందితో గొడవ పెట్టుకుంటాడు శివ. దాంతో వాళ్ళు శివ మీద అటాక్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. తన ఊళ్ళో గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం ఊళ్ళో పెద్ద మనుషులతో గొడవ పడి ఇంకో పందిరి పెట్టుకొని ఘనంగా చేస్తారు శివ, అతని ఫ్రెండ్స్. అయితే నిమజ్జనం రోజు థియేటర్లో శివతో గొడవపడిన వాళ్ళు శివపై అటాక్ చేయడంతో అందులో ఓ వ్యక్తిని శివ పొడుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? శివ జాబ్ తెచ్చుకుంటాడా? శివ పెళ్లి ఎవరితో జరుగుతుంది.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఓ నలుగురు ఫ్రెండ్స్, హీరో లవ్ స్టోరీ, ఊళ్ళోనే ఉండి బతకాలి అనే కథాంశాలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ హే చికీతా సినిమా కూడా అదే కోవలోకి చెందింది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, అతని ఫ్రెండ్స్ ఊళ్ళో చేసే అల్లరి చిల్లరి పనులు, కామెడీ, శివ - చిట్టి లవ్ స్టోరీ, హీరో గొడవలు, హీరో ఫ్రెండ్స్ పాత్రల పరిచయాలతో సోసో గా సాగుతుంది. ఇంటర్వెల్ కి హీరో ఓ వ్యక్తిని పొడవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ ఎక్కువగా హీరో - హీరోయిన్ లవ్ స్టోరీ మీదే నడుస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ హీరో - హీరోయిన్ కలవడం, వ్యవసాయం, రైతు గురించి కొన్ని మంచి మాటలు చెప్పడంతో ముగుస్తుంది.అక్కడక్కడా కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. బావ మరదళ్ల లవ్ స్టోరీ బాగుంటుంది. రైతుల ఎమోషన్స్ క్లైమాక్స్ తో, కొన్ని సీన్స్ లో డైలాగ్స్ తో చెప్పించారు కానీ ఆ ఎమోషన్ ఎక్కడా పండలేదు. హీరో వ్యవసాయం చేస్తున్నాడు అంటారు కానీ అసలు ఎక్కడా హీరో వ్యవసాయం చేసినట్టు చూపించరు. హీరో పాత్ర మాత్రం క్లైమాక్స్ వరకు కూడా ఇంత జరుగుతున్నా ఇంకా మారడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని అక్కర్లేని కామెడీ సీన్స్ తో సాగదీశారు అనిపిస్తుంది. ఇక ఈ కథ అంతా 2000 సంవతసరంలో జరుగుతుంది. దానికి తగట్టు చూపించడానికి రైటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది.ఎవరెలా చేశారంటే..అభినవ్ మణికంఠ హీరో పాత్రలో బాగానే మెప్పించాడు. దివిజ ప్రభాకర్ క్యూట్ గా కనిపిస్తూ అల్లరి చేసే అమ్మాయిలా మెప్పించింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా పర్వాలేదనిపించింది. తన్మయ్ ఖుషి మరో మరదలు పాత్రలో మెప్పిస్తుంది. జబర్దస్త్ అజయ్ అక్కడక్కడా నవ్విస్తాడు. దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్, ఫ్రెండ్స్ పాత్రల్లో నటించిన నటులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదు అనిపించారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎడిటింగ్లో కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
విజయ్ దేవరకొండ రణబాలి.. అంతలా కష్టపడ్డారా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా వస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది.అయితే ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ కాస్తా గట్టిగానే శ్రమించినట్లు తెలుస్తోంది. కథకు తగినట్లుగా యాక్షన్ సన్నివేశాల్లో సహజంగా కనిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. తన పాత్ర కోసం కెరీర్లోనే అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. రణబాలి లుక్ కోసం నెలల తరబడి ఫిట్నెస్ వర్కవుట్స్ చేశారని ఓ నివేదికలో వెల్లడైంది.విజయ్ దేవరకొండ ముఖ్యంగా గుర్రపు స్వారీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయుధాలను వాడటం, తుపాకీని ఆపరేట్ చేయడం కూడా నేర్చుకున్నారని ఓ నివేదిక ద్వారా తెలిసింది. కత్తిసాము, ఆయుధాల వాడకం, తుపాకీ విన్యాసాలతో పాటు ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి కఠోర శిక్షణ తీసుకున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కొరియన్ కనకరాజు.. రిలీజ్కు ముందే బిగ్ డీల్..!
దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తోన్న సినిమా 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్కు భారీ ధర దక్కినట్లు సమాచారం. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.26 కోట్ల వరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కేవలం రూ.38 కోట్ల బడ్డెట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ డీల్తో మూవీ రిలీజ్కు ముందే బిజినెస్ పరంగా కొరియన్ కనకరాజు దూసుకెళ్తున్నాడు. దీంతో వరుణ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమాగా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. -
చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్, శ్రీ గౌరి చేయాల్సింది కాదు..!
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రవి నంబూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది.ఇక సినిమా సంగతి అటుంచితే ఈ మూవీకి మొదటి అనుకున్నది కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ కాదని తెలుస్తోంది. ఈ లవ్ స్టోరీకి బేబి జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చేయాల్సింది. కానీ పలు కారణాలు చేత వారిద్దరూ ఈ కల్ట్ బొమ్మ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సమాచారం. అలా ఈ ఛాన్స్ కిరణ్, శ్రీగౌరి ప్రియకు దక్కింది. గతంలో సాయి రాజేశ్ డైరెక్షన్లో వచ్చిన కల్ట్ ప్రేమకాథా చిత్రం బేబీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. -
అఖిల్ లెనిన్.. లవ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. -
మూడు వారాల్లోనే ఓటీటీకి నాగబంధం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరో హీరోయిన్లుగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ నాగబంధం. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్డ్రాప్లో సోషియో ఫాంటసీ కథగా వచ్చిన ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంది. అయితే కంటెంట్ పరంగా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకరపోయింది. ఈ సినిమాలో ఫైట్స్తో పాటు కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే జూలై 3న రిలీజైన ఈ మూవీ అప్పుడే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఈ చిత్రం జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. అసలు కథేంటంటే..ఈ సినిమా కథంతా 1756-1962 నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ సాగుతుంది. ఇండియన్ ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్(జగపతి బాబు) తన 30 ఏళ్ల కెరీర్లో ఎన్నో రహస్యాలను ఛేదించినా.. నాగబంధం రహస్యాన్ని మాత్రం కనిపెట్టలేకపోతాడు. దీనిపై తన శిష్యులు టెస్లా, అలీ(రిషబ్ సాహ్నీ) పరిశోధన చేస్తూ హిమాలయాలకు వెళ్తారు . అక్కడ ఎన్నో ఏళ్లుగా బంధించబడి ఉన్న బైరాగి(గరుడ రామ్) తన మంత్ర శక్తితో అలీ గతాన్ని గుర్తు చేసి తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలంటే నాగ బంధాన్ని విడిపించాలని అందుకోసం బ్రహ్మ కమలం తీసుకురావాలని ఆలీని ఆదేశిస్తాడు. అలీ తన అనుచరులతో బ్రహ్మకమలం వెతుకుతూ.. అడ్డుకున్న వాళ్లను, దానికి సంబంధించిన వివరాలు తెలిసి చెప్పని వాళ్లను క్రూరంగా చంపుతుంటాడు. చివరకు ఆ బ్రహ్మకమలం శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిలో ఉండే పద్మంలో ఉందని తెలిసి.. ఓ ప్లాన్ ప్రకారం ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. ఓ కారణంగా అది భైరవకోన సమీపంలోని సముద్రంలో పడిపోతుంది. దాన్ని తీసుకొచ్చింది అలీ మనుషులు తులసీవనం గ్రామానికి వెళ్తారు. అక్కడ డబ్బు ఆశ చూపి రుద్ర(విరాట్ కర్ణ) సహాయంతో పడవలో భైరవకోనకు బయలుదేరుతారు. మరి ఆ స్వర్ణ కమలం అలీ మనుషులకు దొరికిందా లేదా? రుద్ర వాళ్లకు సహాయం చేశాడా లేదా? ఆ బ్రహ్మకమలానికి రుద్రకు ఉన్న సంబంధం ఏంటి? అతను ప్రాణంగా ప్రేమించే చెల్లి మాసస(సోనియా సింగ్) చావుకు కారణం ఎవరు? పార్వతి(నభా నటేష్) ఎవరు? రుద్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? 1956లో ఏం జరిగింది? ముస్లిం రాజుతో కలిసి భైరాగి పన్నిన కుట్ర ఏంటి? అసలు నాగబంధం నేపథ్యం ఏంటి?చివరకు బైరాగి నాగబంధాన్ని విడిపించాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
బర్త్డే స్పెషల్.. హీరో సూర్య రేర్ ఫోటోలు
-
రవితేజ తమ్ముడి కుమారుడి సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
మహారాజా రవి తేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న మూవీ మారెమ్మ. ఈ చిత్రంతోనే మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మారెమ్మ చిత్రం రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ ఏడాది వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. #MAREMMA - SEPTEMBER 10TH! Best wishes to @maadhav_9999 and team 🤗 pic.twitter.com/p84lQanTvR— Ravi Teja (@RaviTeja_offl) July 22, 2026 -
రవితేజకు జిరాక్స్ కాపీ.. ఇలా కూడా ఉంటారా?
ఈ భూమి మీద మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెప్పడం వింటుంటాం. ఏడుగురో ఏమో కానీ మనలా అచ్చం ఒక్కరు కనపడినా చాలని ఫీలవుతుంటాం. సడన్గా మనలాంటి వ్యక్తి ఎవరైనా ఎదురుగా వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇలాంటి అనుభవం ఒక్కసారైనా ఎదురవ్వాలని మనం కూడా కోరుకుందాం. మనకేమో గానీ.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్న ఓ వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇతన్ని రవితేజ మూవీస్లో డూప్గా వాడుకోవచ్చు కదా కామెంట్స్ పెడుతున్నారు. అయితే రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా అతనెవరో వివరాలేమీ తెలియదు. ఈ వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం మనలాగే అలా ఎవరైనా ఉంటే చూడాలని మీకు కూడా అనిపిస్తోంది కదూ.As it is గా వున్నాడు,డూప్ గ వాడుకోవచ్చు కదా ఎలాగో కాండిడేట్ ఫేస్ వాడి పోయినట్టు వుంటుంది#Raviteja pic.twitter.com/jBgMjGLmDB— TVR Media 🚩🚩🚩 (@Tvr_Media7) July 21, 2026 -
అల్లరి నరేశ్ రంభ ఊర్వశి మేనక.. క్రేజీ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ నటించిన లేటేస్ట్ మూవీ రంభ ఊర్వశి మేనక. ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సురభి హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నా కంటి మీద కునుకే’అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. ధనుంజయ్ ఆలపించారు. ఈ సాంగ్ను చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హస్య మూవీస్ బ్యానర్లో రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. -
'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్లో బక్క పలచని కుర్రాడిలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా మెప్పించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ నటిస్తోన్న మూవీ బ్లాక్మెయిల్. ఈ చిత్రానికి శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నా వైఫ్ మిస్సింగ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.ఈ నెల 21న వరుణ్ సందేశ్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇండస్ట్రీలో దిల్ రాజు, అల్లరి నరేశ్ చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్లో పనిచేశా.. అంతేకాకుండా క్యాషియర్గా కూడా పని చేశానని వరుణ్ తెలిపారు.నా కెరీర్లో ఎత్తు, పల్లాలు చూశానని వరుణ్ సందేశ్ తెలిపారు. నా కెరీర్ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి మూవీలో దిల్ రాజు ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేనని వరుణ్ సందేశ్ తన మనసులోని మాటలు పంచుకున్నారు. -
ప్రభాస్ ఫౌజీ.. రెబల్ స్టార్ పవర్ఫుల్ రోల్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఫౌజీ. ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. నేతాజీ సుభాశ్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యం కోసం ఆయన చేసే పోరాటమే ప్రధానంగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ముందుగా బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో సైనికుడిగా పనిచేసి.. ఆ తర్వాత సుభాశ్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరుతాడని తెలుస్తోంది. ఇది కేవలం నేతాజీ బయోపిక్ మాత్రమే కాదని.. అంతే కాకుండా ఇండియన్ ఫ్రీడమ్ కోసం పోరాడిన సైనికుల కథను చూపించే చిత్రంగా ఉండనుందని టాక్. ఈ మూవీలో ప్రభాస్ పాత్ర ధైర్య సాహసాలు, త్యాగం, దేశభక్తితో నిండి ఉంటుందని సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ చిత్రాన్ని డిసెంబరు 3న ఫౌజీ విడుదల కానుందని తాజాగా పోస్టర్ను పంచుకుంది.ఈ పోస్టర్లో ఎప్పుడు చూడని లుక్లో ప్రభాస్ కనిపించారు. దీంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీ డిసెంబర్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ప్రభాస్ ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2, కల్కి 2898 ఏడీ: పార్ట్ 2 సినిమాలు చేస్తున్నారు. अज्ञातपर्व ENDS. THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y— Fauzi (@FauziTheMovie) July 16, 2026 -
'ఆయనే అలా అంటే నేను తోపే కదా'.. నిహారిక కొణిదెల
'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నిర్మాత నిహారిక కొణిదెల స్పందించారు. నా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో రుద్రవీణకు నాగబాబు అవార్డు అందుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా తన సినిమాకు అవార్డ్ రావడంపై చిరంజీవి, సురేఖ ప్రశంసించారని నిహారిక ఆనందం వ్యక్తం చేసింది.నన్ను చూస్తుంటే గర్వంగా ఉందని పెదనాన్న చిరంజీవి అనడంపై నిహారిక ఆనందం వ్యక్తం చేసింది. మన ఇండస్ట్రీకి ఇది గొప్ప గర్వకారణమన్నారు. ఆయనే మన ఇండస్ట్రీకి ప్రైడ్ అని ఫీలవుతుంటానని తెలిపింది. ఆయన నన్ను తోపు అంటుంటే.. నేను కూడా నిజంగానే తోపు అని ఫీలవుతా కదా అని సరదాగా మాట్లాడింది.కాగా.. నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి జాతీయ అవార్డ్ దక్కింది. -
‘నా క్యారెక్టర్ వచ్చేది అప్పుడే.. కల్ట్పై విశ్వక్ సేన్ కామెంట్స్'
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కల్ట్. ఈ మూవీకి తానే సొంతంగా కథ రాసుకోవడమే కాదు..డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ మూవీని కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. హీ ఈజ్ మై దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ అనేది ఇంటర్వెల్లో వస్తుందని తెలిపారు. ఈ మూవీ ద్వారా నేను 150 మందికి పైగా కొత్తవారిని పరిచయం చేస్తున్నానని విశ్వక్ వెల్లడించారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్లోపు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వక్ సేన్ తెలిపారు. ఈ నగరానికి ఏమైంది-2 రిలీజైన తర్వాతే కల్ట్ మూవీ వస్తుందన్నారు. కాగా.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా న్యూ ఏజ్ పార్టీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేయనున్నారు. -
రామ్ చరణ్- సుకుమార్ కాంబో.. పుష్ప రిపీట్ కానుందా?
పెద్ది తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో నటించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఈ మూవీని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలుస్తోంది. పక్కా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పుష్ప తరహాలో రెండు భాగాలు తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తన్నట్లు అనిపిస్తోంది.ఈ చిత్రంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తన మార్క్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు కోరుకునే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. రంగస్థలం, పెద్ది చిత్రాల కంటే ఎక్కువ ఫర్మామెన్స్కు స్కోప్ ఉంటుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నారని సమాచారం. ఈ మూవీ 2027 చివర్లో లేదా.. 2028 మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
బాలయ్య- కొరటాల కాంబో.. ఊహించని టైటిల్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఫుల్ యాక్షన్ మూవీని తెరకెక్కించనున్నారు. యాక్షన్తో పాటు సామాజిక కోణంలో కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య మూవీ టైటిల్పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. దీంతో సినిమా టైటిల్ టాలీవుడ్లో ఆసక్తిగా మారింది.ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ పేరును ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ టైటిల్ పెడితే సామాజిక కోణంలో కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచనలో ఉన్నారట. ఈ మూవీలో సోషల్ మేసేజ్తో పాటు ఫుల్ యాక్షన్ ట్రీట్ కూడా ఉండనుందని తెలుస్తోంది.ఇక వచ్చేనెల చివరి వారంలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఆ షెడ్యూల్లో బాలయ్యపై భారీ యాక్షన్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ యాక్షన్ సీక్వెన్స్ల కోసమే దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ కొనసాగనుందని సమాచారం. యాక్షన్ సీన్స్ విషయంలో కొరటాల శివ భారీగానే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన తీసిన ప్రతి సినిమాలో బలమైన నేపథ్యం ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా.. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
వదినకి ఏ చీర కావాలి?... నాగ చైతన్య సమాధానం ఇదే
టాలీవుడ్ హీరో నాగచైతన్య- శోభిత ధూలిపాళ్ల 2024 డిసెంబర్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు తమ కెరీర్లో బిజీగా ఉన్నారు. చైతూ ప్రస్తుతం వృషకర్మ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా శోభిత-నాగచైతన్య జంటగా వెళ్లి షాపింగ్కు వెళ్లారు. ఓ చీరల దుకాణంలో సందడి చేశారు. వదినకి ఏ చీర తీసుకుంటారని అక్కడివాళ్లు ప్రశ్నించారు. దీనికి చైతూ స్పందించారు. తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటానని నాగచైతన్య నవ్వుతూ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమాని: అన్నా... వదినకి ఏ చీర తీసుకున్నారు?నాగ చైతన్య: తను ఏది ఎంచుకుంటే... అదే తీసుకుంటాను.#NagaChaitanya #SobhitaDhulipala #Sobhita #ChaySo #Tollywood #TupakiFollow 👉 @tupaki_official pic.twitter.com/DsADTOvzey— Tupaki (@tupaki_official) July 18, 2026 -
కామాఖ్య ఆలయంలో నిక్కీ గల్రానీ దంపతుల పూజలు..ఫోటోలు
-
'నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందిరా ఈ పళ్లబురుసు'
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రిలీజైన వీడియో చూస్తుంటే పక్కా విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రూరల్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
తెలుగు సినిమాలపై కామెంట్స్.. చాలా బాధేసింది: కిరణ్ అబ్బవరం
ప్రియ జంటగా నటించగా లేటేస్ట్ ప్రేమకథా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో హీరో కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు.తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కిరణ్ అబ్బవరం ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కోలీవుడ్లో తెలుగు సినిమాలను చూసే విధానంపై మాట్లాడారు. తన చిత్రం క తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని తాను ఎంతగానో ప్రయత్నించానని తెలిపారు. కానీ అక్కడ వరుస తమిళ సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్లు దొరక్క అది సాధ్యపడలేదన్నారు.తమిళనాడులో మన సినిమాలపై వివక్ష ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష చిత్రాలను మనవాళ్లు ఆదరిస్తారని గుర్తు చేసుకున్నారు. కానీ తమిళనాడులో మన సినిమాలకు సరైన ప్రోత్సాహం.. ఆదరణ దక్కడం లేదన్నారు. అఖిల్ అన్న నటించిన లెనిన్ అక్కడ కూడా ఒకేసారి విడుదలై ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని తెలిపారు.మన సినిమాలు కూడా తమిళంలో మంచి విజయాలు సాధించాలనేది తన కోరికని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఒకసారి నేను కొందరు తమిళ డిస్ట్రిబ్యూటర్లను థియేటర్ల కేటాయింపు గురించి అడగ్గా.. థియేటర్లు ఇచ్చినా తమిళులు తెలుగు సినిమాలు చూడరని తెగేసి చెప్పారని వెల్లడించారు. వారి సమాధానం నన్ను తీవ్రంగా కలిచివేసిందని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు. -
టాలీవుడ్లో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నుంచి వస్తోన్న మరో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఆమెన్. ఈ సినిమాకు ఎస్కే బషీద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్పై రేగుల నీరజరాణి నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్కే బషీద్ మాట్లాడుతూ..'ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్కు భిన్నంగా ఆమెన్ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం... గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన మూవీ. ఔట్పుట్పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు. ఈ మూవీ ట్రైలర్ను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే నన్ చిత్రాన్ని తలపించేలా ఉన్నాయి. -
అయ్యగారే నంబర్వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. #Lenin చూసి #AkhilAkkineni wife #Zainab కూడా ఒకే మాట...' అయ్యగారే నెంబర్ 1 '#Lenin Success Celebrations at Gunturpic.twitter.com/mVE9jJid5r— Taraq(Tarak Ram) (@tarakviews) July 15, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. ఓటీటీలోనూ ట్రెండింగ్..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. దక్షిణాది భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రంలో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్తో ట్రెండింగ్లో వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.ఈ మూవీని శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివరాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
తలెత్తుకునే సినిమాలు చేశారాయన: జగపతి బాబు
టాలీవుడ్ నటుడు జగపతిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. అందరికీ తెలుసు.. తాను తీసిన సినిమాలన్నీ తలెత్తుకునేవి చేశాడు. ఎవరు పిలిచినా.. ఏ ఫంక్షన్కు పిలిచినా వచ్చేస్తాడని అన్నారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్ రావిపూడి అని కొనియాడారు. నేను వ్యక్తిగతంగా చెప్పకపోయినా ఈవెంట్కు వచ్చేశారని అన్నారు. నా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీరోగా చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆయన హీరోగా నటించిన వదలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అనిల్ రావిపూడి సైతం జగపతిబాబుపై ప్రశంసలు కురిపించారు. నేను ఇప్పుడూ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేస్తున్నాను... కానీ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కు పిచ్చెక్కించిన యాక్టర్ జగపతిబాబు అని కొనియాడారు. ఆయనతో ఒక సినిమాకు పని చేయాలని ఉందని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టారు.కాగా.. జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. -
లెనిన్తో అఖిల్ హిట్.. అప్పుడే మొదలైన ట్రోల్స్..!
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాతో అఖిల్ హిట్ అందుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత వచ్చిన అఖిల్ సక్సెస్ కొట్టేశాడు.లెనిన్పై కాపీ ట్రోల్స్..లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మేకర్స్పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లెనిన్ చిత్రంలోని క్లైమాక్స్ సీన్ కాపీ చేశారంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. లెనిన్లో హైలెట్గా నిలిచిన క్లైమాక్స్ సీన్ను మక్కీకి మక్కీ దించేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది. 1999లో బాలయ్య నటించిన క్రిష్ణబాబు మూవీలోని సీన్ను తలపిస్తోందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సేమ్ టూ సేమ్.. 1999లో వచ్చిన క్రిష్ణబాబు మూవీలో విలన్ పగతో హీరో కళ్లల్లో కారం కొట్టి కంటిచూపు కనిపించకుండా చేస్తాడు. అదే సమయంలో హీరోయిన్ మీనా నోట్లో గుడ్డలు కుక్కి.. ఆమె అరవకుండా చేసి.. హీరో బాలకృష్ణ చేతికే కత్తి ఇచ్చి హీరోయిన్ను చంపేలా చేస్తాడు. అచ్చం అలానే ఈ చిత్రంలో విలన్ హీరో కళ్లల్లో కెమికల్ కొట్టడం.. హీరోయిన్ నోట్లో గుడ్డలు కుక్కడం.. చివరకు లెనిన్ చేత్తోనే భారతి ప్రాణాలు కోల్పోయేలా చేయడం.. అచ్చు గుద్దినట్లు కృష్ణబాబు సీన్ను దించేశారని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మరికొందరేమో ఈ తరం ప్రేక్షకులకు తగినట్లుగా సీన్ రీ క్రియేట్ చేశారని మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై లెనిన్ మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా.. నందమూరి బాలకృష్ణ, మీనా, రాశి నటించిన చిత్రం క్రిష్ణబాబు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999లో రిలీజై ఓ మాదిరి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని సీన్నే.. లెనిన్ టీమ్ కాపీ చేశారని అంటున్నారు. -
డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. జానీ మాస్టర్ రియాక్షన్
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం జానీ మాస్టర్ స్పందించారు. శేఖర్ మాస్టర్తో తనకు ఎలాంటి గొడవలు లేవని అన్నారు. మా ఇద్దరి మధ్య విభేదాలు అని వస్తోన్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఆదివారం డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలిసింది. శేఖర్ మాస్టర్ ఆగ్రహంతో మాట్లాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలోవైరలయ్యాయి. దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్లో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ గ్రూపులు ఘర్షణకు దిగారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.ఈ నేపథ్యంలోనే తాజాగా జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. మా యూనియన్లో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. నేను, శేఖర్ మాస్టర్ ఈ రోజు మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవితో కలిసి భోజనం కూడా చేశామని వెల్లడించారు. మాకు చిరంజీవి ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తారని అన్నారు. ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్య మాత్రమేనని తెలిపారు. అంతే కానీ మా డ్యాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కేవలం చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయభేదాలు మాత్రమే వచ్చాయని క్లారిటీ ఇచ్చారు. -
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. టీజర్ వచ్చేసింది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ను ఇటీవలే మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఈ చిత్రాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మా ఊరు పెనుకొండ అంటూ వరుణ్ తేజ్ డైలాగ్స్తో టీజర్ ప్రారంభమైంది. కొరియన్ దెయ్యం కాన్సెప్ట్తో ఈ మూవీ రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కమెడియన్ సత్యతో కామెడీ సీన్స్ ఆకట్టకుంటున్నాయి. ఈ హారర్ కామెడీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. -
లెనిన్ సక్సెస్.. అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026 -
అఖిల్ ‘లెనిన్’ సక్సెస్మీట్(ఫోటోలు)
-
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు.. వచ్చేది ఎప్పుడంటే?
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటేస్ట్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ అంటూ ట్వీట్ చేసింది. ఈ మూవీని హారర్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ... 😎💥Get ready for the wildest Indo-Korean horror comedy ride of the year with #KoreanKanakaraju 🐉😈#KOKA GRAND RELEASE WORLDWIDE IN CINEMAS ON AUGUST 7th, 2026 ❤️🔥@IamVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy… pic.twitter.com/BhgLFQN73g— UV Creations (@UV_Creations) July 10, 2026 -
సమంతకు అఖిల్ ఎఫెక్ట్.. ఆ రికార్డ్ కష్టమేనా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్నసినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే గత నెల రిలీజై సక్సెస్ఫుల్గా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ వంద కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరో రూ.5 కోట్లు సాధిస్తే వందకోట్లు రాబట్టిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీగా ఘనత దక్కనుంది.సమంతకు లెనిన్ ఎఫెక్ట్..వందకోట్ల దిశగా దూసుకెళ్తోన్న మా ఇంటి బంగారానికి అఖిల్ లెనిన్ మూవీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం లెనిన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వేళ.. సమంత మూవీ వసూళ్లు వందకోట్లు దాటడం కష్టమేననిపిస్తోంది. లెనిన్ చిత్రం టాక్ ఆధారంగా మా ఇంటి బంగారం కలెక్షన్స్పై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు వీకెండ్ సామ్కు కలిసొస్తే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి బాక్సాఫీస్ రేసును తట్టుకుని సమంత సినిమా 100 కోట్ల క్లబ్లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
ఫౌజీ షూటింగ్లో నటుడికి ప్రమాదం.. పీఏ క్లారిటీ..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న పీరియాడిల్ యాక్షన్ లవ్స్టోరీ ఫౌజీ. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే ఈ కథలో బ్రిటిష్ సోల్జర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ కూడా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ షూటింగ్లో ప్రముఖ నటుడు రాజేశ్ శర్మకు విషపురుగు కాటేసిందని ప్రచారం జరుగుతోంది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారని టాక్ వినిపించింది. ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫౌజీ నటుడు రాజేశ్ శర్మ పీఎ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. రాజేశ్ శర్మ పీఏ సుభాశిష్ పాండా మాట్లాడుతూ..' రాజేశ్ శర్మకి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. ఆయనను ఎలాంటి విషపురుగు కాటేయలేదు. కేవలం ఆయనకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచింది. అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారు. రాజేష్ శర్మకి షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధం. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు నేను ఉంటా. కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు' అని అన్నారు. దయచేసి నిజా నిజాలు తెలుసుకోకుండా అసత్య వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని కోరిన పీఏ సుభాశిష్ పాండా కోరారు. Rajesh Sharma Asst saying all social media is fake and that he got admitted due to Diabetes and doctors have said he will be discharged tomorrow#fauji#rakeshsharma#prabhas#prabhasfans #actorrakeshsharma#actorrajeshsharmahealthupdate pic.twitter.com/cmFWtG8Dh7— SATISH @ SAKSHI (@SatishKottangi) July 8, 2026 -
లయ లేటేస్ట్ మూవీ.. వదలా ట్రైలర్ రిలీజ్
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా వదలా. ఈ చిత్రానికి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో వదలా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మూడో వ్యక్తి వల్ల ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడిందనేది ట్రైలర్లో చూపించారు. కాగా.. ఈ సినిమాకు కార్తీక్ సంగీతమందించారు. -
విభిన్న కథా చిత్రంగా అంతర్యామి
ఒడిషా సూపర్ స్టార్ బాబుషాన్ మొహంతి, అందాల నటి వేద్విక సోని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం అంతర్యామి. ఈ సినిమాకు శివ సత్యం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నిర్మాత జ్ఞానరంజన్ సాహు నిర్మిస్తుండగా.. అమృత్ నిషాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రీకరణ అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో కస్తూరి, ఆమని, రవికుమార్, శ్రీతం దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీజే కార్తికేయన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. -
ఓటీటీలో పెద్ది.. ఆ విషయంలో నో క్లారిటీ..!
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 9 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రేక్షకులు పెద్ది ఓటీటీ వర్షన్పై క్లారీటీ కోరుకుంటున్నారు. ఈ మూవీలోని జాన్వీ కపూర్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు రావడంతో కొన్ని సీన్స్ తొలగించారు. ఆ తర్వాత మరిన్ని యాడ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేశారు.ఇదే విషయంపై ఓటీటీ ప్రియులు క్లారిటీ కోరుతున్నారు. ఓటీటీలో జాన్వీ కపూర్ పాత సీన్స్తోనే పెద్దిని స్ట్రీమింగ్ చేస్తారా అనే సందేహం ఆడియన్స్లో నెలకొంది. లేదంటే కొత్త సీన్స్ యాడ్ చేసిన పెద్దిని స్ట్రీమింగ్కు తీసుకొస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయంలో నెట్ఫ్లిక్స్తో పాటు మేకర్స్ కూడా ఎలాంటి అనౌన్స్ చేయలేదు. ఈ విషయంలో సినీ ప్రియులకు పెద్ది ఓటీటీ వర్షన్పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.కాగా.. గతంలో రామ్ చరణ్ నటించిన గత సినిమా గేమ్ ఛేంజర్ కూడా ఇలాంటి పరిస్థితే చూసింది. థియేటర్స్ లో మొదట వచ్చినా వర్షన్ తర్వాత కొన్ని సీన్స్ తీసేసి నానా హైరానా సాంగ్ పెట్టి తగ్గించేశారు. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చాక ఆ సీన్స్ ఏవీ కూడా అందులో లేవు. అలాగే పెద్ది సినిమాకి కూడా ఇలానే జరుగుతుందా? అని ప్రేక్షకులు భావిస్తున్నారు. -
అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్కు ముందే రికార్డ్
అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా రిలీజ్ కేవలం మూడు రోజుల సమయ మాత్రమే మిగిలింది. ఇప్పటికే లెనిన్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్పరంగా కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది. ఈ మూవీ కోసం జీ నెట్వర్క్ డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని రూ.19 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ వర్షన్కు ఏకంగా రూ.9 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇవీ కాకుండా ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్ మరో రూ.6 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో రిలీజ్కు ముందే లెనిన్ ఏకంగా రూ.34 కోట్ల వసూళ్లు సాధించినట్లే. ఈ లెక్కన చూస్తే నాన్ థియేట్రికల్ రూపంలో ఊహించని ధరలను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీలు అమ్మడమే కష్టమైన దశలో లెనిన్ భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం. అయితే ఈ డీల్స్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. -
భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు)
-
'కష్టాల్లో కాపాడేవాడే నిజమైన రాజు'.. రాజా ది రాజా ట్రైలర్ రిలీజ్
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రాజా ది రాజా. ఈ చిత్రానికి అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్లో దాసరి నిహారిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చూస్తుంటే రాజు అనే కాన్సెప్ట్ ప్రధానంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రాజుల కాలానికి.. ప్రజెంట్కు లింక్ పెట్టి ఈ కథను రూపొందించినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఈ కథలో ఉండనున్నాయని ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతమందించారు. ఈ మూవీలో సాయి కుమార్, నరేశ్, అవసరాల శ్రీనివాస్, విష్ణు, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ మీరు కూడా చూసేయండి. -
లెనిన్ కోసం టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
అక్కినేని అఖిల్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.లెనిన్ ట్రైలర్కు నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. తాజాగా మరో హీరో లెనిన్ కోసం తన వాయిస్ ఓవర్ అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన వాయిస్ ఓవర్ ఇచ్చారు. శ్రీరామాపురం, భారతంమిట్ట గ్రామాలు.. అందులోని మనుషులను తీరు తెన్నులను ఎన్టీఆర్ తన వాయిస్ ద్వారా చెప్పనున్నారు. దీనికి సంబంధించిన డబ్బింగ్ పనిని కూడా పూర్తి చేశారు మన యంగ్ టైగర్. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్.. జూనియర్ ఎన్టీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. Thank you Tiger🐅. Thanks for roaring for #Lenin. 🙏🏻🙏🏻🙏🏻Eppatiki marichipolenantha Prema ichhavu. Love you brother @tarak9999 ❤️ pic.twitter.com/D2Xd0pZDpH— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2026 -
తిరుపతిలో ఘనంగా 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విజయ్ దేవరకొండ సరసన లైగర్ బ్యూటీ..!
రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా రష్మిక మందన్నా కనిపించనుంది.ఈ మూవీతో పాటు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన అనే మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఈ సినిమాకు రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ పాట కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. విజయ్తో సరసన స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ, లైగర్ బ్యూటీ అనన్య పాండేను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.ఫుల్ యాక్షన్ మూవీగా వస్తోన్న రౌడీ జనార్ధనలో ఈ స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ హైలెట్గా ఉండనున్నాయి. దిల్రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. -
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తా : అభిషేక్ నామా
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీతో బిజీగా ఉన్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. బ్రిటీష్ కాలం నాటి హిస్టారికల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది.ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ నామా తాజాగా నాగబంధం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించారు. మా మధ్య ఇదొక కుటుంబంలో జరిగే గొడవలాంటిదేనని అభిషేక్ నామా అన్నారు. త్వరలోనే మేమంతా కలిసిపోతామని.. కుదిరితే విజయ్తో మూవీ కూడా తీస్తానని పేర్కొన్నారు.అయితే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మూవీ భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాకు అభిషేక్ నామా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే సమయంలో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయగా.. ఆయన ఫ్యాన్స్ నామాపై ఫైర్ అయ్యారు. -
సమంతకు కంగ్రాట్స్.. ట్రైలర్ చూసి ఫిక్సయ్యా: అఖిల్
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని లేటేస్ట్ మూవీ లెనిన్ రిలీజ్కు అంతా సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్లో రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్లింది. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో యాక్షన్ స్టోరీగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అఖిల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ హిట్ కావడంపై సమంతకు విషెస్ తెలిపారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్తో వచ్చిందన్నారు.అఖిల్ మాట్లాడుతూ..' నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ ట్రైలర్ చూడగానే చాలా నచ్చింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. ఓ మంచి కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే పాయింట్ బాగా నచ్చింది. సమంత పవర్ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి అభినందనలు' తెలిపారు. -
నాని చేతికి గాయం.. తగ్గేదేలే అంటోన్న హీరో!
నేచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం ప్యారడైజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి దసరాతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరోసారి వస్తోన్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 1940-1970 బ్యాక్డ్రాప్లో సాగే ఒక పవర్ఫుల్ అండర్వరల్డ్ మాఫియా స్టోరీగా రూపొందిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే షూట్కు ప్యాకప్ చెప్పనున్నారు. ఇదిలా ఉండగా హీరో నాని సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ ఫోటోల్లో వింటేజ్ లుక్తో వింటేజ్ హెయిర్ లుక్లో సరికొత్త అవతారంలో కనిపించాడు. అయితే ఈ ఫోటోల్లో నాని ఎడమచేతికి బ్యాండేజ్తో కనిపించారు. అదే ఇప్పుడు చర్చకు దారితీసింది.తన ఫోటోలకు హిందీలో క్యాప్షన్ రాసుకొచ్చారు. 'నేను గాయపడ్డా… అందుకే మరింత ప్రమాదకరంగా మారా' అంటూ ధురందర్ డైలాగ్తో క్లారిటీ ఇచ్చారు. అయితే ప్యారడైజ్ మూవీ షూట్లోనే నానికి గాయమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం నాని డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడం వల్లే ఈ గాయాలైనట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తనకు దెబ్బ తగిలినప్పటికీ.. రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారని టాక్. ఈ ఫోటోలు చూస్తుంటే త్వరలోనే షూటింగ్ పూర్తి చేయాలనే కసి నానిలో కనిపిస్తోందని.. ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంతలా ప్రాణం పెట్టి నటిస్తున్నారో అర్థమవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
మంచు విష్ణు సాహసం.. కన్నప్ప స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా వచ్చిన మూవీ 'కన్నప్ప'. గతేడాది జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ మూవీ కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. గతంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్ 4న ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి స్ట్రీమింగ్కు రాలేదు. అమెజాన్ ప్రైమ్లో కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే సౌత్ భాషల్లో ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కాలేదు.తాజాగా మంచు విష్ణు కన్నప్ప మూవీపై షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని నేరుగా సొంత యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 03 నుంచి అవా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన సినీ ప్రియులు మంచు విష్ణు డేరింగ్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కన్నప్ప కథేంటంటే..'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. The divine journey arrives on YouTube! 🙏#Kannappa Full Movie premieres on the AVAA YouTube Channel starting July 3.Don't miss the chance to experience this epic with the entire Family during the YouTube Premiere.#KannappaMovie #NowStreaming #YouTubePremiere #NowOnYoutube… pic.twitter.com/3caOSVSIVo— AVAA Entertainment (@avaaentofficial) July 2, 2026 -
సినిమాల్లో ఆ హీరోయిన్ అంటే క్రష్: ఆనంద్ దేవరకొండ
టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం ఎపిక్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య మరోసారి ఆనంద్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఆనంద్ దేవరకొండ తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. సమ్మర్ హాలీడేస్ మూవీలోని క్రష్ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ఆనంద్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆనంద్ దేవరకొండ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఏదైనా సినిమా చూసేటప్పుడు హీరోయిన్లపై క్రష్ ఉంటుంది.. అలా మురారి చూసినప్పుడు నాకు సోనాలి బింద్రేపై క్రష్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు.కాగా.. రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ప్రధానపాత్రల్లో, శ్రీకర్ నాయన్ తెరకెక్కిస్తోన్న చిత్రం సమ్మర్ హాలీడేస్. ఈ మూవీని బాల్యం కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
'అందుకు నన్ను క్షమించండి.. ఈ సారి నేను మాట్లాడను'
టాలీవుడ్ అక్కినేని అఖిల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అఖిల్ ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సినిమా వచ్చి ఇప్పటికీ మూడేళ్లయిందని.. సారీ బ్రదర్.. ఈ విషయంలో నన్ను క్షమించాలంటూ అభిమానులను కోరారు అఖిల్. నా గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా.. ఈ సారి నేను మాట్లాడను.. కేవలం నా సినిమానే మాట్లాడుతుందన్నారు. ఇంతకుమించి నేనేం చెప్పకూడదు.. రెండు రోజులుగా నేను నిద్రపోలేదు.. కళ్లద్దాలు పెట్టుకుని వద్దామనుకున్నానని తెలిపారు. మిమల్ని చూస్తుంటే జూలై 10 వరకు పనిచేసే ఎనర్జీ వచ్చిందని అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడారు. #LENIN is ready to hit hard... and Vizag has already set the tone ❤️🔥❤️🔥 #LeninTrailer - https://t.co/04wGr6WZ2x #LeninOnJuly10th pic.twitter.com/phNA8qkUrw— Sithara Entertainments (@SitharaEnts) June 30, 2026 -
రావు బహదూర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్. ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహంచారు. ఈ మూవీలో దీపా థామస్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ మహేశ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మునుపెన్నడు చూడని తెలుగు సినిమా రావు బహదూర్ అంటూ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మహేశ్ బాబు. కాగా.. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు స్మరణ్ సాయి సంగీతమందించారు. -
' శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా?.. లెనిన్ ట్రైలర్ చూశారా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. -
త్రివిక్రమ్తో మరోసారి.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అరుదైన కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ టైగర్ జూనయిర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా ప్రకటించారు. త్రిశూలంతో ఉన్న ప్రత్యేక పోస్టర్ను షేర్ చేశారు. ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్.. త్రివిక్రమ్తో మరోసారి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మూవీని పురాణాల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించనున్నారు.కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత వీరరాఘవ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. తాజాగా వీరిద్దరు మరోసారి జతకట్టడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ అరుదైన కాంబోలో మరో హిట్ కొడతారా టాలీవుడ్లో చర్చ మొదలైంది. The Son of Shiva.The Pride of Parvathi.The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu— Jr NTR (@tarak9999) June 29, 2026 -
విజయ్ దేవరకొండపై రూమర్స్.. స్పందించిన మైత్రి నిర్మాత
గత రెండు రోజులుగా హీరో విజయ్ దేవరకొండ రణబాలి మూవీపై రూమర్స్ వినిపిస్తున్నాయి. హీరో విజయ్ నిర్మాతలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా ఈ రూమర్స్పై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి స్పందించారు. అలాంటి వార్తలు పూర్తి ఫేక్ అని కొట్టిపారేశారు. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వెల్లడించారు. విజయ్ కేవలం పని మీదే శ్రద్ధ పెడతారని రవి క్లారిటీ ఇచ్చారు.కాగా.. రణబాలి షూట్ కోసం విజయ్ ఎక్కువగా కారవాన్లు డిమాండ్ చేయడమే కాకుండా.. అసిస్టెంట్స్ కూడా ఎక్కువమంది ఉండాలని కోరాడని వార్తలొచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై విజయ్ టీమ్ కూడా స్పందించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ రాసేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రకటన విడుదల చేశారు.కాగా.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రణబాలి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కీలక సన్నివేశాలను రాయలసీమలోని చారిత్రక ప్రాంతాల్లో తెరకెక్కించారు. బ్రిటిష్ కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగ్గట్టుగానే షూట్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ రణబాలి.. ఆ ప్రచారంపై చర్యలు తీసుకోండి..!
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఈ మూవీని రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ సినిమాపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం జరుగుతోంది.తాజాగా విజయ్ దేవరకొండ వస్తోన్న దుష్ప్రచారంపై ఆయన టీమ్ స్పందించింది. రణబాలి మూవీ నిర్మాతలకు భారం పెరిగేలా వ్యవహరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. విజయ్ 50 నుంచి 60 మంది అసిస్టెంట్స్ కావాలని.. మినిమం 5 లేదా ఆరు క్యారవాన్స్ అడుగుతున్నారని డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. కొన్ని సంస్థలు ఇలాంటి వార్తలు రాసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు ఆయా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది. -
శుక్రవారం ఓటీటీల్లో సందడి.. ఒక్క రోజే 16 సినిమాలు స్ట్రీమింగ్..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఇక ఈ వారంలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. ప్రస్తుతం థియేటర్లో పెద్దితో పాటు మా ఇంటి బంగారం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రెండు మాత్రమే బాక్సాఫీస్ వద్ద అభిమానుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ శుక్రవారం కేవలం రీ రిలీజ్ల సందడి నెలకొంది.ఈ ఫ్రైడే కొత్త సినిమాల హడావుడి థియేటర్ల వద్ద లేకపోవడంతో సినీ ప్రియులు ఓటీటీల వైపు చూస్తున్నారు. ఈ శుక్రవారం బాహుబలి ద టార్చ్ బేరర్ డాక్యుమెంటరీతో పాటు లింగం లాంటి డబ్బింగ్ సిరీస్లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అవతార్-3, బ్లాస్ట్ లాంటి సినిమాలు ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సడన్గా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్ క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 బాహుబలి ద టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ) - జూన్ 26 నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26 ఎజెంట్ కిమ్ రియాక్టివేటేడ్(కొరియన్ సిరీస్)- జూన్ 26 లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూన్ 27జియో హాట్స్టార్ లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 26 ది బేర్ సీజన్-5(హాలీవుడ్ సిరీస్)- జూన్ 26అమెజాన్ ప్రైమ్ అలియన్స్ (హిందీ సిరీస్) - జూన్ 26జీ5 ప్రేమలా కండీషన్స్ అప్లై (మరాఠీ సిరీస్) - జూన్ 26 మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్) - జూన్ 26 ముతస్సీ (మలయాళ సిరీస్) - జూన్ 26సోనీ లివ్ ఫెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్) - జూన్ 26లయన్స్ గేట్ ప్లే బ్లూ జాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 26 ద యెతి (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 26 దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 26హెచ్బీవో మ్యాక్స్..అండర్టోన్(ఇంగ్లీష్ సినిమా)- జూన్ 26 -
అనంత్ శ్రీరామ్ కామెంట్స్.. ఆ స్టార్ హీరోను ఉద్దేశించే అన్నారా?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సూపర్ హిట్గా నిలిచింది. బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ మూవీ సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్లోని శిల్పాకళా వేదికలో సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ ఈవెంట్కు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్ది మూవీ రూ.420 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కదా వసూళ్ల వరద అంటే.. ఈ వరద మీద బురద చల్లాలనుకున్ దురద గాళ్ల సరదా తీర్చేసిన అభిమానులు మీరు అంటూ ప్రశంసించారు. అందుకు మీకు చప్పట్లు కొట్టడానికి మా బృందం మీ దగ్గరకు వచ్చిందన్నారు. ఏదో భారీ వాహనాలను గాల్లోకి లేపితే వచ్చే చప్పట్లు కొట్టడం కాదు.. కథ మొత్తం చూసి, కళ్లలో నీళ్లు పెట్టుకుని, కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన అభిమానులు మీరు అంటూ ఫ్యాన్స్ను కొనియాడారు.ఆ హీరో గురించేనా?అయితే వాహనాలను గాల్లోకి లేపడం లాంటి సీన్స్ ఎక్కువగా బాలయ్య సినిమాల్లోనే ఉంటాయి. అనంత్ శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించే చేశారా? అని నెట్టింట చర్చ మొదలైంది. అయితే ఈ కామెంట్స్పై మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒకరిని పొగడాలంటే ఇంకొకరిని తక్కువ చేసేి మాటాడాలా? అంటూ అనంత్ శ్రీరామ్కు కౌంటరిస్తున్నారు. మరి అనంత్ శ్రీరామ్ తనపై వచ్చే ట్రోల్స్కు ఎలా స్పందిస్తాడో చూడాల్సిందే. ఇది చదవండి: ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది: మెగాస్టార్ -
'నా అసలు పేరు మర్చిపోతారేమో'.. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన మూవీ పెద్ది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో మేకర్స్నిర్వహించారు.ఈ ఈవెంట్కు హాజరైన రామ్ చరణ్ ఎమోషనలయ్యారు. ఈ సినిమా నా లైఫ్ను మార్చేసిందని అన్నారు. ఇంత పెద్ది హిట్ ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మూవీలోని పాటలకు అందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తోందన్నారు. క్లీంకార ఇప్పుడు నన్ను పెద్ది అని పిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా నా పేరు మరిచిపోయి పెద్ది అని అంటారేమోనని అన్నారు. మా నాన్నతో నేను మాట్లాడలేని ఏదైనా ఉంటే డైరెక్టర్ సుకుమార్కు ఫోన్ చేస్తానని చెప్పారు.తెలుగు ప్రజలు ఎవరినీ అంత ఈజీగా ఇష్టపడరు.. ఒక్కసారి ఇష్టపడితే గుండెల్లో పెట్టుకుంటారని రామ్ చరణ్ అన్నారు. మా పెద్ది సినిమాకు పాజిటివ్గా రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతటి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు మీ రామ్ చరణ్ ఎప్పటికీ రుణపడి ఉంటారంటూ ఎమోషనల్గా మాట్లాడారు. -
వసుదేవసుతం ట్రైలర్ రిలీజ్
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించిన లేటేస్ట్ మూవీ 'వసుదేవసుతం'. ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. ఈ మూవీని రెయిన్బో సినిమాస్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఒరిస్సాలోని వాసుదేవుని ఆలయం చుట్టూ ఈ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆలయంలోని బ్రహ్మ పదార్థం కోసం శత్రు మూకలు చేసే విన్యాసాన్ని అడ్డుకునే పాత్రలో హీరో మహేంద్రన్ అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆయుధం వస్తోంది.. దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్వడికీ భూమ్మీద బతికే హక్కు లేదు.. అనే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తోంది. ట్రైలర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ .. 'వసుదేవసుతం’ కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. కథ నమ్మి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. దర్శకుడు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఈ మూవీని పూర్తి చేశారు. కృష్ణుడి మీద తీసిన ఈ కంటెంట్ జనాలకు నచ్చాలని బాగా తెరకెక్కించారు. ఇందులో అద్భుతమైన కంటెంట్ ఉంది. ఇలాంటి ఓ పాత్ర, సినిమా దొరకడం నా అదృష్టం. నిర్మాత మీదున్న నమ్మకంతోనే అడ్వాన్స్లాంటివి అడగలేదు. ఏ నటుడి నుంచి ఎంత రాబట్టుకోవాలనేది దర్శకుడు వైకుంఠ్కి చాలా బాగా తెలుసు. అంబికా వాణి చక్కగా నటించారు. జూలై 10న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా సినిమాని చూసి ఆశీర్వదించండి' అని అన్నారు.దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ .. 'నిర్మాతకు ముందు ఓ రెండు కథలు చెప్పా. మళ్లీ ఒరిస్సాలోని ఫేమస్ టెంపుల్ బ్యాక్ డ్రాప్లో ఓ కథను రాసుకున్నా. ఆ కథ చెప్తే.. అంతకు ముందు చెప్పిన వాటిని పక్కన పెట్టేయండని నిర్మాత అన్నారు. మహేంద్రన్కు కథ చెప్పిన వెంటనే ఓకే. మణిశర్మ గారికి కథ చెప్పా. నచ్చితేనే చేయండని ఆయనతో అన్నా. కథ నచ్చడంతో వెంటనే పని ప్రారంభించారు. మూవీ చూసిన తర్వాత మణిశర్మ పాటలు, ఆర్ఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారు. డైలాగ్స్ బాగుంటాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగా వచ్చింది. నా మూవీ ఎవ్వరినీ నిరాశపర్చదు. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ కీలక పాత్రల్లో నటించారు. -
మా క్రియేటివిటీని చంపుతున్నారు: డైరెక్టర్ శ్రీకాంత్ ఆవేదన
హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ మూవీతోనే పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ..' తెలుగు ఆడియెన్స్ అభిరుచి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. దీవాన సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మా సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే ఆడియెన్స్ రెస్పాన్స్ మూవీలో చిన్న చిన్న డైలాగ్స్కు కూడా వస్తోంది. తెలుగు సినిమా మరే భాష చిత్రానికీ తక్కువ కాదు, మిగతా వాటికంటే గొప్పగా ఉంటుందని నేను దీవాన చిత్రాన్ని రూపొందించాను. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. కన్నీరు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని వారు కొందరు మా సినిమాలోని ఎస్సెన్స్ పోగొట్టేలా సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. ఇంకొందరు బాంబే నుంచి మన తెలుగు సినిమా గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు. ఎవరేం చేసినా ఇది నా సినిమా అని గర్వంగా చెప్పగలను. తెలుగులో గత పదేళ్లలో ఇలాంటి సినిమా రాలేదు' అని అన్నారు.హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'మేము గొప్ప చిత్రం చేశామని గర్వంగా చెబుతున్నా. మేము ఒక రియల్ లైఫ్ మా సినిమాలో చూపించాం. సినిమా చూసి చాలా మంది మెసేజేస్ పంపుతున్నారు. మీరు థియేటర్ కు రండి, మా సినిమా మీకు లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ వాళ్లను గౌరవిస్తా కానీ ఈ సినిమాకు మాత్రం వాళ్లు ఇంకా మంచి డెసిషన్ తీసుకోవాల్సింది. అయితే సెన్సార్ వారు చెప్పిన కట్స్ చేసి, మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్ చేయించి సర్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ ప్రాసెస్ లో ప్రీమియర్స్ వేయలేకపోయాం. సింగిల్ స్క్రీన్స్లో వంద రూపాయలే టికెట్ నటుడిగా నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రమిది' అని అన్నారు. ఈ చిత్రంలో వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ కీలక పాత్రలు పోషించారు. -
సంధ్య థియేటర్ కేసు.. అల్లు అర్జున్ హాజరు
సంధ్య థియేటర్ ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఇవాళ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వర్చువల్గా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ కోర్టుకు హాజరుకావాలని 19 మంది నిందితులకు ఇటీవల నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఇవాళ విచారణకు హాజరైన నిందితులంతా న్యాయమూర్తి ఎదుట బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం ఈ కేసు విచారణ జులై 6కి వాయిదా వేశారు. కాగా.. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 23 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కాగా.. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. -
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
-
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు షాక్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.కాగా.. ఈ కేసులో ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించునుంది.అసలేం జరిగిందంటే..అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రిలీజ్ ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు. -
ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్ షాకింగ్ లైఫ్ స్టైల్..!
ఒకప్పుడు టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ గురించి తెలియనివారు ఉండరు. ఆయన హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో పదేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.మూవీ రిలీజ్కు అంతా సిద్ధం కావడంతో వడ్డే నవీన్ తన సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్తో మాట్లాడిన ఆయన.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డైలీ రోటీన్ లైఫ్, ఆహార విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ రివీల్ చేశారు. ప్రతి రోజు ఉదయాన్నే ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తానని వడ్డే నవీన్ తెలిపారు. ఉదయాన్నే టిఫిన్ కాకుండా డైరెక్ట్గా మీల్స్ తింటానని వెల్లడించారు. ఉదయమే చికెన్, రైస్ తింటా.. లేదంటే వెజ్ కర్రీ ఏదైనా సరే రైస్తో కలిపి తీసుకుంటానని అన్నారు. అయితే తాను మధ్యాహ్నం లంచ్ చేయనని వడ్డే నవీన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నైట్ డిన్నర్లో కూడా ఉదయం లాగే నాన్వెజ్తో వెజ్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే డైలీ లంచ్ చేయకపోవడం అన్నది వింటే మాత్రం కాస్తా షాకింగ్గానే అనిపిస్తోంది. రోజులో ఒక పూట తినకుండా ఉండడం అంతా ఈజీ కాదంటున్నారు. కాగా.. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో రాశీ సింగ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు కల్యాణ్ నాయక్ సంగీతమందించారు. -
విశ్వంభరకు దారేది?.. అదొక్కటే కనిపిస్తోంది..!
మెగా అభిమానలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్కు నోచుకోలేదు. వరుస వాయిదాలతో టాలీవుడ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిలీజ్ తేదీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికే ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారంలో ఉన్నా.. అదేం జరిగేలా కనిపించడం లేదు.ఆ తర్వాత ఆగస్ట్లో విశ్వంభర రిలీజ్ కావొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి దాకా మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను మరిచిపోయే పరిస్థితి వచ్చింది. అసలు ఈ ఏడాది విశ్వంభర వచ్చే అవకాశముందా అనే డైలామాలో అభిమానులు ఉన్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో రాకపోతే.. విశ్వంభరకు ఉన్న ఛాన్స్ దసరా. ఆ తర్వాత డిసెంబర్, సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు రిలీజ్ కావాల్సింది. ఆ రెండు నెలల్లో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అందువల్లే విశ్వంభరకు దసరా మాత్రమే కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక దసరా మిస్సయిందంటే డిసెంబర్లో ఏదో ఒక వారంలో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇకనైనా మేకర్స్ పక్కా ప్లాన్తో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్డేట్స్ ఇస్తూ మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాల్సిన అవసరముంది. కాగా.. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ మూవీ షూటింగ్ గతేడాదే పూర్తయింది. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
అఖిల్ లెనిన్ వాయిదా.. ఆ సినిమా కోసమేనా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ముందే ప్రకటించారు. కానీ ఊహించని విధంగా మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా ట్వీట్ చేశారు. ప్రేక్షకుడికి మరింత అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేశామని నాగార్జున తెలిపారు.అయితే ఈ మూవీని పెద్ది కోసమే లెనిన్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న పెద్ది కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. రామ్ చరణ్ సినిమాకు మరిన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేందుకే లెనిన్ విడుదల వాయిదా వేయడమే సరైన నిర్ణయమని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. దీంతో లెనిన్ వాయిదాకు పెద్దినే కారణమని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఓటీటీకి టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్కు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ రివీల్ చేశారు. ఓ వీడియోను రిలీజ్ చేస్తూ డేట్ ప్రకటించారు. ఓ అమాయక యువకుడు.. అత్యంత సంప్రదాయ గ్రామం.. అసాధ్యమైన ఓ ఉద్యోగం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఈ తెలుగు వెబ్ సిరీస్ జూలై 2 నుంచే నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇండియా వీడియో రిలీజ్ చేస్తూ అఫీషియల్గా వెల్లడించింది. తన జాబ్ పర్మినెంట్ కావడం కోసం ఓ గ్రామానికెళ్లిన హీరో.. అక్కడ ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడన్న కథాంశంతో ఈ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్లో మురళీశర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేశ్బాబు కీలక పాత్రలు పోషించారు. Chemistry raani vadu oka ooriki chemistry nerpisthe ela untundhi? 🤭😁 pic.twitter.com/ZCX4U6ZWJD— Netflix India South (@Netflix_INSouth) June 15, 2026 -
పెద్ది సక్సెస్.. బుచ్చి బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ హీరో అతడేనా?
పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలతో తన ఆనందాన్ని పంచుకుంటున్నారు. పెద్ది కథకు కారణం గ్రామీణ క్రీడాకారులను బయటి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవితో పంచుకున్నారు. రామ్ చరణ్తో సినిమా తీశా.. భవిష్యత్తులో మీరు కూడా అవకాశమిస్తే చేస్తానని చిరుతో బుచ్చిబాబు సరదాగా అన్నారు.అయితే పెద్ది హిట్ తర్వాత బుచ్చిబాబు ప్లాన్ నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎలా ముందుకెళ్తున్నారన్న ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుచ్చికి సంబంధించి ఓ టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సక్సెస్ ఈవెంట్లో మహేశ్బాబుతో నెక్ట్స్ సినిమా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి బుచ్చిబాబు రియాక్ట్ కాలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు.మహేశ్ బాబుతో పౌరాణిక చిత్రం ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని బుచ్చిబాబును మరోసారి అడిగారు. దీనికి స్పందిస్చూ సరైన సమయం కోసం వేచి చూద్దాం. పెద్దలు ఇక్కడ ఉన్నారు. కాలమే ఏదైనా నిర్ణయిస్తుందని హింట్ ఇచ్చారు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేశ్బాబుతోనే అని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ అరుదైన కాంబోపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో 'వారణాసి' మూవీ రానుంది.ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తన తదుపరి ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లాంటి దర్శకుల పేర్లు తరచుగా వినిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఆ జాబితాలో బుచ్చి బాబు కూడా చేరారు. మరి ఎవరికీ ఓకే చెబుతాజో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
-
'పెద్ది కథ వెనక నా అసలు ఉద్దేశం అదే'.. డైరెక్టర్ బుచ్చిబాబు
పెద్ది మూవీ కథపై డైరెక్టర్ బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకున్న ఉదేశం అదేనని వెల్లడించారు. చిరంజీవితో చిట్ చాట్ సందర్భంగా పెద్ది కథ చెప్పడం వెనక ఉన్న ఉద్దేశమేంటో తెలిపారు. ఈ జనరేషన్కు ఆదర్శంగా నిలవాలనే ఈ కథ చేశానని బుచ్చిబాబు చెప్పారు. పిల్లలకు స్కూల్లో కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు.. వెనక గ్రౌండ్ కూడా ఉండాలన్నదే నా ఉద్దేశమన్నారు.దీనిపై మెగాస్టార్ కూడా మాట్లాడారు. కార్పొరేట్ విద్యావ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఎంతసేపు మార్కులు, మార్కులు అంటున్నారని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయాయన్నారు. ఇక నుంచైనా పిల్లలకు క్రీడల కోసం సరైన వసతులు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ ఆటగాళ్లను బయటకు తీయడానికి ప్రభుత్వాలు సహకరించాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. పెద్ది సినిమాలో ఇదే మెసేజ్ ఇచ్చారని.. ఈ విషయంలో నాకు చాలా సంతృప్తిగా ఉందని చిరు తెలిపారు. -
'నాకు కెపాసిటీ ఉంది.. అలాంటి కథలు వస్తే చేస్తా'
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు, కథల ఎంపికపై తన అభిప్రాయం పంచుకున్నారు. పెద్ది టీమ్తో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం తనతో చాలాసార్లు నా సినిమాల కథల గురించి మాట్లాడారని అన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన, పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేశావని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావని అన్నారని మెగాస్టార్ తెలిపారు.నీలో ఒక కమల్ హాసన్, రజినీకాంత్, బాలచందర్ లాంటి ఉన్నారని నాతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని అనిపించిందని చెప్పానని వెల్లడించారు. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అని అన్నానని చెప్పారు. దంగల్ తరహాలోనే పెద్ది సినిమా కూడా ఉందని మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఆ చిత్రంలో ఆడపిల్లలతో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందన్నారు. -
మనం డైెరెక్టర్తో విజయ్ దేవరకొండ.. వర్కవుట్ అవుతుందా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ గండకోటలో జరిగింది. ఈ షెడ్యూల్లో దాదాపు వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో వస్తున్న కథ కావడంతో ఎక్కువ శాతం అక్కడే షూట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ వినిపిస్తోంది. విజయ్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 24 మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో మన టాలీవుడ్ హీరో జత కట్టనున్నారని లేటేస్ట్ టాక్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ను మడాక్ ఫిల్మ్స్ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అరుదైన కాంబోగా నిలవనుంది. కాగా.. విక్రమ్ కుమార్ తెలుగులో మనం, ఇష్క్ థ్యాంక్ యూ, హలో, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలను తెరకెక్కించారు. Rumour Mill: Vijay Deverakonda x Vikram Kumar? 👀Reports suggest that #VijayDeverakonda may team up with Vikram Kumar for a new pan-India project, reportedly backed by Maddock Films. While there's no official confirmation yet, the prospect of the 24 director collaborating with… pic.twitter.com/kqAR9sfPoS— Movie_Reviews (@MovieReview_Hub) June 13, 2026 -
అఖిల్ లెనిన్ వాయిదా.. కొత్త తేదీ ఇదే
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓ సారి వాయిదా పడింది. మే 1న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు.తాజాగా మరోసారి అఖిల్ ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడించారు. లెనిన్ టీమ్ అభ్యర్థనతో నా దగ్గరికి వచ్చారని.. ప్రేక్షకుడికి వందశాతం అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు మరింత సమయం కావాలని అడిగారని ట్వీట్ చేశారు. వారి అభిరుచి, స్ఫూర్తిని చూసి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చారు. లెనిన్ జూలై 10న విడుదల కానుందని.. మీరు ఒక కొత్త అఖిల్ను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని అభిమానులకు నాగార్జున సూచించారు. కాగా.. ఇప్పటికే రిలీజైన సాంగ్స్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే మూడో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్ను తమన్ కంపోజ్ చేశారు. Team #Lenin came to me with a request.They asked for a little more time to give their absolute 100% and create something very special.Their passion and spirit made me say yes.మనోడు 10th July వస్తున్నాడు. I say again you will see a new Akhil!!Get ready for the #Lenin…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 13, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. తొమ్మిది రోజుల్లోనే రికార్డ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది మూవీ థియేటర్లో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూళ్లుతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్ సాధించింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రిలీజైన 9 రోజుల్లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల మార్కును దాటింది. ఈ వసూళ్లతో ఈ ఏడాదిలోనే దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా, రన్నర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించింది. అయితే జాన్వీ రోల్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని సీన్స్ను మేకర్స్ తొలగించారు. కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. #Peddi is SOUTH INDIA'S NO.1 GROSSER OF 2026 🔥🔥Collects a gross of over 366 CRORES WORLDWIDE in 9 days ❤🔥🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/hVo5QJIBaQ— PEDDI (@PeddiMovieOffl) June 13, 2026 -
ఐశ్వర్య రాజేశ్ కొత్త సినిమా.. ఓ సుకుమారి టీజర్ చూశారా?
తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క నిజం దాచి పెట్టి పెళ్లి చేస్తే ఏం జరిగిందన్న పాయింట్తో ఈ మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. "దేవుడు మన దగ్గర నుండి ఏదైనా తీసుకున్నాడంటే... ఇంకేదో గొప్పది ఇవ్వబోతున్నాడని దానర్ధం" అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీగా ఉండనుందని తెలిసిపోతోంది. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు. -
సత్యదేవ్ సాహసం.. రావు బహదూర్ టీజర్ రిలీజ్
సత్యదేవ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ రావు బహదూర్. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన డైరెక్ట్ చేసిన 'కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. మహేశ్బాబు, నమ్రాతా శిరోద్కర్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటైర్టెన్మెంట్స్ సమర్పణలో నిర్మిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ రానుంది.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సత్యదేవ్ రోల్ చూస్తుంటే విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. డిఫరెంట్ లుక్స్లో సత్యదేవ్ అదరగొట్టేశారని అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్లో సత్యదేవ్ పాత్ర సరికొత్తగా ఉండనుందని టీజర్తోనే స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
గోపిచంద్ యాక్షన్ మూవీ.. టైటిల్ ఇదే
టాలీవుడ్ హీరో, మాచో స్టార్ గోపిచంద్ ప్రస్తుతం వెంకట్ డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇవాళ గోపీచంద్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సింగ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియోలో సుత్తి చేతిలో పట్టుకుని గోపిచంద్ కనిపించారు. ఈ చిత్రంలో గోపిచంద్ సరసన అనార్కలి నాజర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతమందిస్తున్నారు. -
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్లో క్రేజీ అప్డేట్
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్ను తీసుకుని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్కుమార్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్లో జీవీ ప్రకాశ్ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్పైకి వెళ్లకముందే అప్డేట్స్తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗And we had a blast pulling off this fun concept...A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026 -
తీరు మారని బాలయ్య.. బర్త్ డే రోజు కూడా అదే పని
సందర్భం ఏదైనా సరే తన తీరు ఇంతే అనే హీరోల్లో బాలయ్య ముందుంటారు. గతంలో చాలాసార్లు తన కోపంతో ఎంతోమంది అభిమానులపై చేయి చేసుకున్నారు. అలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. తాజాగా మరోసారి తన దురుసు ప్రవర్తన చూపించారు. బాలయ్య బర్త్ డే వేడుకలకు వచ్చిన అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులంతా సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అదే సమయంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ అభిమానులపై దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ బాలయ్య ఇక మారడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. కోపంతో ఊగిపోయిన బాలయ్యనందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రిలో జరిగిన ఫొటో సెషన్లో స్వల్ప తోపులాట జరిగింది. కొందరు అభిమానులు ఒక్కసారిగా ముందుకు రావడంతో బాలకృష్ణ తీవ్ర అసహనానికి లోనయ్యారు. "వెనక్కి వెళ్లండి" అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.… pic.twitter.com/BlBT0gWpSQ— ChotaNews App (@ChotaNewsApp) June 11, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. వారం రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ మెప్పించింది.ఈ మూవీ రిలీజై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే రూ.345 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో 400 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు, శివరాజ్కుమార్, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో మెప్పించారు. BOX OFFICE CHAMPION 💥💥#Peddi collects a gross of over 345 CRORES WORLDWIDE in 7 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/5p6FrjrmUv— PEDDI (@PeddiMovieOffl) June 11, 2026 -
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సిద్ధుగాడి లవ్ స్టోరీ
మనోజ్ కుమార్, మోహన సిద్ధి, , శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా వస్తోన్న సినిమా సిద్ధుగాడి లవ్ స్టోరీ. ఈ మూవీకి రమేష్ చెరుకూరు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్లోజరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి. గోపాల్, దామోదర ప్రసాద్, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, దర్శకులు వి. సముద్ర, రామ్ ప్రసాద్, నిర్మాత అశోక్ కుమార్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, రాజేందర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..'పవన్ కల్యాణ్ డైలాగ్లో వచ్చిన సిద్ధు.. సిద్ధార్థ్ రాయ్ ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందో.. అదే విధంగా ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నా. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిత్ర బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డల్లాస్ నుంచి వచ్చి ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రమేశ్ భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నా' అన్నారు.తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ..'ఈ చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సినీ పెద్దలందరికీ ధన్యవాదాలు. రమేశ్ నన్ను సంప్రదించినప్పుడు ఆయనలో ఉన్న సినిమా పట్ల అభిరుచి, పట్టుదల నాకు అర్థమైంది. అందుకే ఆయనకు పూర్తి సహకారం అందించాను. మా దర్శకుల సంఘ సభ్యుల సినిమాల విడుదలకు సహకరించాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ సినిమా చిత్ర బృందాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, నిర్మాతకు మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటున్నా' అన్నారు.ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..'కొత్తవారితో మంచి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయం. టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ అంతా ఎంతో కష్టపడి పని చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. దర్శకుడు రమేష్ భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. -
రామ్ చరణ్ పెద్ది వసూళ్లు.. ఐదు రోజుల్లోనే క్రేజీ మార్క్
రామ్ చరణ్ పెద్ది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రీమయర్స్తో మొదలైన పెద్ది ప్రభంజనం ఇంకా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన ఐదు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఓవరాల్గా ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు.రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో జగపతిబాబు అప్పలసూరి పాత్రలో మెప్పించారు. జూన్ 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. BOX OFFICE CHAMPION #PEDDI continues his dominance 🔥🔥#Peddi collects a gross of over 315 CRORES + GROSS WORLDWIDE in 5 days ❤🔥#PEDDI Now In Cinemas 💥https://t.co/EMhY3eMGKq pic.twitter.com/e5fZ2thleb— PEDDI (@PeddiMovieOffl) June 9, 2026 -
'వీడి అనుమానంలో మనం విడిపోయేలా ఉన్నాం'.. ఫుల్ కామెడీగా టీజర్
యంగ్ హీరో రాగ్ మయూర్ నటించిన లేటేస్ట్ సైకాలాజికల్ కామెడీ ఎంటర్టైనర్ అనుమాన పక్షి. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మించారు. ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ప్రతి విషయానికి అనుమానపడే వ్యక్తిగా హీరో రాగ్ మయూర్ కనిపించారు. ప్రతిదాన్ని అనుమానించే హీరో పెళ్లి విషయంలో ఏం చేశారనే నేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో ప్రిన్స్, అనన్య, చరిత్, బ్రహ్మజీ, రాశి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్కు క్లీంకార సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలి రోజే హిట్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లపరంగానూ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ క్రికెటర్గా, రెజ్లర్గా అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహించారు.పెద్ది సూపర్ హిట్ వేళ ప్రతి ఒక్క అభిమాని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార.. డాడీకి క్యూట్ సర్ప్రైజ్ ఇచ్చింది. నాన్న.. దిస్ ఈజ్ ఫర్ యూ.. క్లీంకార లవ్ యూ సో మచ్ అంటూ చరణ్ ఇంట్లో పనిచేసే సిబ్బందితో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో వారంతా చికిరి చికిరి సాంగ్కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. -
అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్తో కూడిన కుకీస్ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. Thank you so very much @tarak9999 Mama 🤗🤗 with love Smaran and Stharaka 😘What started as a casual comment actually turned into the sweetest surprise. Today, the cookies reached home. The kids are happy, i am on cloud nine with the autograph, and we are all just smiling at… pic.twitter.com/DkRU7PEMJK— saiteja (@saitejaathoti) June 6, 2026 -
'ఉప్పెన హీరో.. హిట్ కోసం తంటాలు.. నెక్ట్స్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?'
ఉప్పెనతో హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా ఆకట్టుకుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఈ మూవీ హిట్ తర్వాత వైష్ణవ్కు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ పెద్దగా రాణించలేకపోయాయి.దీంతో సక్సెస్ కోసం మెగా హీరో తంటాలు పడుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను మెగా హీరో తిరస్కరించినట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఓకే చెప్పలేదని తెలుస్తోంది. కానీ ఇటీవలే ఓ కథకు వైష్ణవ్ ఓకే చెప్పారని లేటేస్ట్ టాలీవుడ్ టాక్. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం.టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట్ మూవీ తెరకెక్కించిన డైరెక్టర్ మహేశ్తో వైష్ణవ్ తేజ్ జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో సినిమా చేసేందుకు వైష్ణవ్ ఓకే చెప్పారట. మహేశ్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు రెడీ అవుతున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. -
రామ్ చరణ్ పెద్ది.. పూనకంతో స్టెప్పులేసిన మహిళ అభిమాని..!
రామ్ చరణ్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 3న ప్రీమియర్స్తో మొదలైన పెద్ది హవా.. మొదటి రోజే ఫ్యాన్స్ను ఊపేస్తోంది. అభిమానులు సూపర్ హిట్ అంటూ పండుగ చేసుకుంటున్నారు. ఓ మహిళ అభిమాని ఏకంగా థియేటర్లోనే డ్యాన్స్ చేస్తూ అలరించింది. రైరై రారా అంటూ సాగే పాటకు పూనకం వచ్చినట్లు స్టెప్పులతో అదరగొట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ అద్భుతంగా డాన్స్ చేోశావంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కాగా.. రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. రెండుసార్లు వాయిదా పడినా ఈ చిత్రం టాక్సిక్ తప్పుకోవడంతో జూన్ 4న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. కోలీవుడ్ భామ శృతిహాసన్ సైతం ప్రత్యేక సాంగ్లో మెరిసింది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.‘పెద్ది’ రిలీజ్.. థియేటర్లో డాన్సులతో రచ్చ చేసిన లేడీ ఫ్యాన్.మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ప్రీమియర్లతోనే అభిమానుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో పేపర్ల వర్షం, ఈలలు, డ్యాన్స్లతో అభిమానులు ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.అయితే అందరి దృష్టిని… pic.twitter.com/eMWVbzWkvN— Tupaki (@tupaki_official) June 4, 2026 -
థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహం.. సోషల్ మీడియాలో ట్రోల్స్..!
పెద్ది మూవీ రిలీజ్ వేళ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఇప్పటికే భారీస్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. రిలీజ్కు ఒక్క రోజు ముందే థియేటర్లలో పెద్ది పండుగ వాతావరణం నెలకొంది. దీంతో హైదరాబాద్లో నగరంలో ప్రముఖ థియేటర్ల వద్ద అభిమాన హీరో రామ్ చరణ్ కటౌట్స్తో పాటు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.అయితే రామ్ చరణ్ విగ్రహం కాస్తా ట్రోలింగ్కు గురైంది. అస్సలు రామ్ చరణ్లా లేదంటూ నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామ్ చరణ్లా లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ సైతం విమర్శించారు. విగ్రహంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏర్పాటు చేసిన అభిమాన సంఘం తమ పొరపాటుకు క్షమాపణలు చెప్పింది. మేము ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం.. రామ్ చరణ్ విగ్రహంతో మా ప్రేమ, అభిమానం, భక్తిని ప్రత్యేకమైన రీతిలో వ్యక్తపరచాలనుకున్నాం.. కానీ దురదృష్టవశాత్తు అంచనాలను అందుకోలేక విఫలమయ్యాం అని క్లారిటీ ఇచ్చారు.ఆ విగ్రహం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు జోజు జార్జ్లా ఉందని కొందరు ట్రోల్స్ చేశారు. మరికొందరు నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. సూపర్ అన్నా.. ఇంతకీ అది ఎవరి విగ్రహం? అని రాసుకొచ్చారు. రామ్ చరణ్ విగ్రహం చేయడానికి ప్రయత్నించి.. రాహుల్ రామకృష్ణ విగ్రహం తయారు చేశారంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లో వస్తోన్న మూవీ ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. We sincerely apologize to everyone. Our intention with the Ram Charan statue was to express our love, admiration, and devotion towards @AlwaysRamCharan in a unique way. Unfortunately, the execution did not meet expectations and turned out to be a misfire.— KUKATPALLYRCFC (@KukatpallyRCFC) June 2, 2026 -
పెద్ది ఫ్యాన్స్కు తీవ్ర నిరాశ.. ఆ విషయంలో బిగ్ ట్విస్ట్..!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ రోజు రాత్రి నుంచే పెద్ది మూవీ ప్రీమియర్స్ షురూ కానున్నాయి. ఈ రోజు 8 గంటల నుంచే థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కొద్ది గంటల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీని పలు ఫార్మాట్లలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఐమ్యాక్స్, డాల్బీతో పాటు 4డీఎక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. ఆడియన్స్ ఎక్కువగా 4డీఎక్స్ ఫార్మాట్లో చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను ఈ ఫార్మాట్లో చూస్తే వచ్చే కిక్ వేరే లెవెల్లో ఉంటుంది.అయితే 4డీఎక్స్ ఫార్మాట్లో పెద్దిని రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. ఇప్పటి వరకు ఈ వర్షన్లో టికెట్ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేయలేదు. హైదరాబాద్తో సహా బార్కో లేజర్, ఎపిక్, డాల్బీ సినిమా ఫార్మాట్లతో మాత్రమే టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో 4డీఎక్స్ వర్షన్లో చూడాలనుకున్న ఫ్యాన్స్కు నిరాశే మిగలనుంది. ఈ విషయంలో మాత్రం పెద్ది మేకర్స్ ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారనే చెప్పుకోవాలి. -
టాలీవుడ్ కొత్త సినిమా.. రెండు వారాల్లోనే యూట్యూబ్లో ప్రత్యక్షం
ఓటీటీలు వచ్చాక సినిమాలు అలా ఇచ్చి ఇలా వెళ్తున్నాయి. థియేటర్ నుంచే మాయం కాగానే సడన్గా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. రిలీజైన నెల రోజుల్లోపే కొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. మరికొన్ని చిన్న చిత్రాలు కేవలం వారాల్లోపే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే యూట్యూబ్లోకి వచ్చేసింది. ఉచితంగానే ఈ మూవీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ వివరాలేంటో మీరు కూడా ఓ లుక్కేయండి. సుదర్శన్, భద్రం, సాయి కృష్ణ తల్లాడ ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రం అరేయ్ ఆపండ్రా. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాకు తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ టాలీవుడ్ టైమ్స్ అనే యూట్యూబ్ ఛానెల్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని వెల్లడించారు. ఈ సినిమా కి ఎస్.ఎస్ వెంకటేశ్ సంగీతమందించారు. -
'45 రోజుల కఠిన శిక్షణ'.. నిఖిల్ స్వయంభూ వీడియో చూశారా?
నిఖిల్ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.అయితే ఇవాళ నిఖిల్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీలో యోధుడిగా కనిపించేందుకు నిఖిల్ ఎంతలా కష్టపడ్డారో చూపించే వీడియోను రిలీజ్ చేశారు. యోధుడిలా మారేందుకు 45 రోజులు చాలా కఠినమైన శిక్షణ.. వియత్నాం పోరాట రోజులను పుట్టినరోజు కానుకగా చూపించినందుకు టీమ్ స్వయంభూకి ధన్యవాదాలు.. కష్టపడకుండా ఫలితం రాదు.. అంటూ నిఖిల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. త్వరలోనే స్వయంభూ థియేటర్లలోకి వస్తుందంటూ ఫ్యాన్స్లో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను మీరు కూడా చూసేయండి. Yes It was a BRUTAL 45 Days of Training. Thanks to Team Swayambhu for Showcasing those vietnam struggle days as a Birthday Gift 💥🤗🥰 No PAIN No GAIN.. #Swayambhu blasting theatres"VERY SOON " pic.twitter.com/iKKzMI2rPj— Nikhil Siddhartha (@actor_Nikhil) June 1, 2026 -
రామ్ చరణ్ పెద్ది.. టికెట్ బుకింగ్స్ షురూ.. ఒక్కో టికెట్ ఎంతంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్ రిలీజ్ కాగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సూపర్ కాదు.. ఏకంగా బ్లాక్బస్టర్ కానుందని ఫిక్సయిపోయారు. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.టికెట్ బుకింగ్స్ ఓపెన్..ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే కేవలం ఏపీలో మాత్రమే ధరల పెంపునకు అనుమతి లభించింది. ప్రీమియర్ షోలతో ఫస్ట్ డే టికెట్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 ఉండగా.. జూన్ 4 నుంచి 10వ తేదీ వరకు టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు కూడా అనుమతిచ్చారు. అంతేకాకుండా రోజుకు 5 షోలు వేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. -
భర్తతో కలిసి జపాన్ ట్రిప్లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
-
'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను'.. శ్రీనివాస మంగాపురం యాక్షన్ గ్లింప్స్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్ సీన్స్లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు. -
అది చాలా కష్టం.. కానీ రామ్ చరణ్ సాధించాడు: ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్
మెగా హీరో రామ్ చరణ్పై పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చెన్నైలో జరిగిన ఈవెంట్కు హాజరైన చెర్రీపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనయుడిగా వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదన్నారు. కానీ రామ్ చరణ్ అది సాధించి చూపించాడని రెహమాన్ అన్నారు. తండ్రి పేరును నిలబెట్టే కొడుకులా రామ్ చరణ్ నిలిచాడని కొనియాడారు. చరణ్లాగే నా కుమారుడు కూడా సంగీతంలో ఇలానే ఎదగాలని కోరుకుంటున్నానని తెలిపారు.ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్కు సిద్ధమైంది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే పెద్ది ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్ సైతం ఫ్యాన్స్ను ఓ ఊపు ఊపేసింది. జూన్ 3 వ తేదీనే ఈ సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్. -
'ఎల్లప్పుడు నువ్వే నా హీరో'.. మహేశ్ బాబు ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణను ఆయన తనయుడు మహేశ్బాబు గుర్తు చేసుకున్నారు. ఇవాళ కృష్ణ జయంతి కావడంతో నాన్నతో దిగిన ఫోటోను మహేశ్ బాబు పోస్ట్ చేశారు. నా జీవితంలో ఎల్లప్పుడు మీరే నా హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న అంటూ ట్వీట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సైతం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న ఈ చిత్రానికి వారణాసి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ అడ్వెంచరస్గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. Forever my hero….Happy Birthday Nanna ♥️♥️♥️ pic.twitter.com/7ATfMvAEMx— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2026 -
దళపతికి రామ్ చరణ్ అభినందనలు.. వీడియో వైరల్
తమిళనాడు సీఎం విజయ్కు మెగా హీరో రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. పెద్ది ప్రమోషన్లతో బిజీగా ఉన్న చెర్రీ ఇవాళ చెన్నైలో నిర్వహించిన ఈవెంట్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా దళపతి విజయ్పై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో నిమగ్నమైన విజయ్కు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ రామ్ చరణ్ కొనియాడారు. విజయ్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రజా సేవలోకి ప్రవేశించారని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన సీఎం కావడం పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజలకు సైతం రామ్ చరణ్ అభినందనలు తెలిపారు.రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందిందించారు. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) -
టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్ట్లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలంటూ పిటిషన్ వేయగా.. చైతుకు అనుకూలంగా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం..నాగచైతన్యకు అనుకూలంగా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కాగా.. పలు అశ్లీల వెబ్సైట్లు, కొన్ని డిజిటల్ ప్లాట్ఫారమ్లలో నాగచైతన్య పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ-జనరేటెడ్ కంటెంట్ను ఆన్లైన్లో విచ్చలవిడిగా వాడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న పోస్టులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, వాయిస్, ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. -
సందిగ్ధం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నిహాల్, ప్రియా దేశ్పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సందిగ్ధం. ఈ మూవీలో తెరచాప ఫేమ్ నవీన్ సంకరపు విలన్ పాత్రలో కనిపించారు. పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో తెరకెక్కించారు.తీర్థ క్రియేషన్స్ బ్యానర్పై సంధ్య తిరువీధుల నిర్మించారు. మే 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్ ఎలా మెప్పించిందో చూద్దాం.కథేంటంటే..క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ దేవ్ (నిహాల్) మేఘన (ప్రియా దేశ్ పాగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఊర్లో హాస్పిటల్ కట్టిస్తాడు. ఊహించని విధంగా దేవ్కి సత్య (అర్జున్), కల్యాణి (కాజల్ తివారి) ఎదురు పడతారు. ఆ ఊర్లో వారికి దేవ్ ఆశ్రయం ఇస్తాడు. అయితే ఆశ్చర్యకరంగా సత్య, కల్యాణి గ్రామంలోని ఇతరులకు కనిపించకుండా కేవలం దేవ్కి మాత్రమే కనిపిస్తుంటారు. అసలు ఆ ఇద్దరు ఎవరు? వారి గతమేంటి? దేవ్ జీవితంతో వారికి ఉన్న సంబంధం ఏంటి? వీర (నవీన్ సంకరపు), కోటయ్య, రామరాజు పాత్రల వెనుక ఉన్న అసలు కథేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫస్ట్ హాఫ్ గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. కథ చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. దేవ్ క్యారెక్టర్ పరిచయం.. మేఘనతో ప్రేమ కథ, గ్రామ జీవితం లాంటి సాధారణ సీన్లతో రోటీన్గా అనిపిస్తుంది. అయితే సత్య, కళ్యాణి పాత్రలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందిసెకండాఫ్లో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచే ప్రేక్షకుడికి కాస్తా థ్రిల్లింగ్ ఫీలింగ్ వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ పెరుగుచుంది. అక్కడక్కడా సస్పెన్స్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని అంశాలను మాత్రం దర్శకుడు కాస్తా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఫర్వాలేదనిపించాడు. ఓవరాల్గా ఓ థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు తాను రాసుకున్న కథను అనవసర కమర్షియల్ హంగులు లేకుండా నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టపడేవారు సందిగ్ధం ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..దేవ్ పాత్రలో నిహాల్ బాగానే ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. మేఘన పాత్రలో ప్రియా దేశ్పాగ్ అందంతో పాటు పాత్రకు తగ్గట్టుగా నటించింది. అర్జున్, కాజల్ తివారి తమ పాత్రల్లో మెప్పించారు. విలన్గా నవీన్ సంకరపు ఫర్వాలేదనిపించారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ ప్రధాన బలంగా నిలిచింది. విజువల్స్ సహజంగా కనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా అనిపించాయి. -
కర్నాటకలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
-
'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్బంప్స్ స్పీచ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Reiterates... "Ee Cinema Raasi Pettukondi" 🔥#PEDDI @AlwaysRamCharan pic.twitter.com/OOAdD59WHI— Trends RamCharan ™ (@TweetRamCharan) May 25, 2026 -
పెద్ది ఐటమ్ సాంగ్.. సోషల్ మీడియాను ఊపేస్తోంది..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ను కూడా విడుదల చేశారు.హల్లల్లలో అంటూ సాగే ఈ సాంగ్లో రామ్ చరణ్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ ప్రత్యేక పాటలో కోలీవుడ్ భామ శృతిహాసన్ తన డ్యాన్స్తో ఫ్యాన్స్ను అలరించింది. తాజాగా ఈ సాంగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటిదాకా 50 మిలియన్లకు (5 కోట్లకు) పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. మరోవైపు ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
అప్పట్లో స్టార్ హీరో.. పదేళ్ల గ్యాప్.. హిట్ పడుతుందా?
వడ్డే నవీన్.. ఇప్పటి సినీ ప్రియులకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90స్ కిడ్స్కి బాగా పరిచయమున్న హీరో. అప్పట్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో వడ్డే నవీన్ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.1996లో వచ్చిన క్రాంతి చిత్రంతో నవీన్ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మరో ప్రయత్నం చేశారు. 1997లో కోరుకున్న ప్రియుడు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు , నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, మా బాలాజీ, చాలా బాగుంది, బాగున్నారా, మా ఆవిడమీదొట్టు.. మీ ఆవిడ చాలా మంచిది, చెప్పాలని ఉంది, అయోధ్య , ఆదిలక్ష్మి, నా ఊపిరి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఏమైందో తెలియదు కానీ 2010 తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు అంటే 2016లో ఆర్జీవీ తెరకెక్కించిన ఎటాక్ సినిమాలో చివరిసారిగా కనిపించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా.. వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ కొడతాడా?దాదాపు పదేళ్ల విరామం తర్వాత నటిస్తోన్న మూవీ కావడంతో వడ్డే నవీన్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ హిట్ అయితే తనకు కూడా మంచి కమ్బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల కొందరు స్టార్స్ రీ ఎంట్రీ సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది హీరో రాజశేఖర్ సైతం బైకర్ మూవీతో మరోసారి వెండితెరపై మెరిశారు. ఈ చిత్రం ఆయనకు బాగానే కలిసొచ్చింది. ఇప్పుడు వడ్డే నవీన్ కూడా కమ్ బ్యాక్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ మూవీతో హిట్ పడితే వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమేనంటున్నాడు మన 90స్ హీరో. నవీన్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని కోరుకుందాం. -
డ్రాగన్ కష్టాలు.. ఆ లుక్ కోసం ఇంత చేశారా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 20న యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్ల్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి భారీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా ఎన్టీఆర్కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ మూవీలో తన లుక్ కోసం తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని సమాచారం. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే బరువు తగ్గాల్సి ఉంటుందని ఎన్టీఆర్తో చెప్పానని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ మరింత బలహీనంగా, పాలిపోయినట్లుగా కనిపించారని నీల్ అన్నారు. ఈ శారీరక మార్పు చూసి ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారని దర్శకుడు వెల్లడించారు.ఏడాదిన్నర క్రితమే ప్లాన్..దాదాపు ఏడాదిన్నర క్రితం 'డ్రాగన్' లుక్ టెస్టుల సమయంలోనే ఈ మార్పు మొదలైందని దర్శుకుడు వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ పోషించిన లూగర్ పాత్ర గురించి చర్చిస్తున్నప్పుడు కండలు తిరిగిన యాక్షన్ హీరో లుక్ కంటే.. సన్నని శరీరాకృతి ఆ పాత్రకు బాగా సరిపోతుందని డైరెక్టర్ అన్నారు. అందువల్లే ఈ రోల్ కోసం కొంచెం బరువు తగ్గమని మాత్రమే తాను సూచించానని.. కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి అంకితభావంతో ఆ సవాలును స్వీకరించారని ప్రశాంత్ నీల్ చెప్పారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ పూర్తిగా దృష్టి పెట్టడానికి దాదాపు నాలుగు నెలల పాటు అన్ని షూటింగ్ కార్యక్రమాలకు విరామం ఇచ్చినట్లు సమాచారం. కఠినమైన ఆహార ప్రణాళిక, తీవ్రమైన వర్కౌట్ సెషన్లు, నిశితమైన వైద్య పర్యవేక్షణ వల్లే ఇది సాధ్యమైందని డైరెక్టర్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బలహీనంగా.. పాలిపోయినట్లు కనిపించడంతో చాలాసార్లు ఆపేయమని చెప్పానని.. అయినా కూడా అతను వినలేదని దర్శకుడు పేర్కొన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్ లుక్పై చాలా రూమర్స్ వచ్చాయి. ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల వాడారని వార్తలొచ్చాయి. కానీ వీటన్నింటినీ టీమ్ ఖండించింది. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పోషణతోనే ఇది సాధ్యమైందని క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా, రుక్మిణి వసంత్, బిజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 2027లో థియేటర్లలో విడుదల కానుంది. -
'పదేళ్లలో 55 ట్రాన్స్ఫర్స్'.. త్రిమూర్తులు టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అప్పట్లో పెళ్లి, మనసిచ్చి చూడు లాంటి సూపర్ హిట్స్ అందుకున్న వడ్డే నవీన్ కొన్నేళ్ల తర్వాత కనుమరుగైపోయాడు. మళ్లీ గ్రాండ్గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల విరామం హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు కమల్తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాశీసింగ్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఓ కానిస్టేబుల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాట వినని రెబల్ కానిస్టేబుల్గా పాత్రలో వడ్డే నవీన్ కనిపించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అభిమాని కల నిజం చేసిన హీరో రామ్..!
aటాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన అభిమాని కలను నిజం చేశారు. ఎప్పటికైనా తనను కలవాలని ఆరాటపడుతున్న వీరాభిమాని కోరికను నెరవేర్చాడు. 18 ఏళ్లుగా 'ఫ్రీడ్రిచ్ అటాక్సియా' అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న అమ్మాయి ఇంటికి వెళ్లి కలిశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానితో మాట్లాడిన రామ్ తనకు ధైర్యం చెప్పారు. అప్యాయంగా పలకరించిన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో రామ్ చేసిన పనిపై టాలీవుడ్ సినీ ప్రియులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాల విషయానికొస్తే ఆయన తొలిసారి మెగా ఫోన్ పట్టనున్నారు. రామ్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సినిమాను ఆయన సోదరుడు కృష్ణ పోతినేని నిర్మించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో రామ్ వీర పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకోసం స్పెషల్గా మేకోవర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.Tollywood actor Ram Pothineni showed his kind-hearted nature Fulfilling the dream of a die-hard fan battling the rare disease ‘Friedreich’s Ataxia’ for 18 years, Ram personally visited her home, spent time with her, and offered emotional support. #RamPothineni #Tollywood pic.twitter.com/7Fge86Xk58— Telangana Ahead (@telanganaahead) May 21, 2026 -
'మా పాపను కూడా ఎత్తుకోలేకపోయా..': రామ్ చరణ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. ఈ మూవీ రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రీడ ఆడాలన్నా పెద్దినే అనే స్పోర్ట్స్ కాన్సెప్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ మూవీని స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ తన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో సీన్ల గురించి వివరించారు. ఇసుకలో, ఎండలో షూటింగ్ చాలా కష్టంగా అనిపించలేదా అని బుచ్చిబాబ.. చెర్రీని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానని అన్నారు. కష్టమైన పనిని ఇష్టంగా చేస్తే ఎలాంటి అలసట రాదన్నారు. అయితే కుస్తీలో చేయి పట్టి అదురు రావడంతో మా పాపను కూడా ఎత్తుకోలేకపోయానని తెలిపారు.మీరు నిజమైన పహిల్వాన్లను పెట్టారని రామ్ చరణ్ అన్నారు. వాళ్లు నటించమంటే.. రియల్గా ఆడేస్తున్నారని రామ్ చరణ్ గుర్తు చేశారు. తర్వాత మళ్లీ సారీ చెబుతున్నారని తెలిపారు. ఎందుకంటే వాళ్లలో నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది వాళ్లలో ఉంటుందని చెర్రీ వివరించారు. యాక్టింగ్ చేయమంటే వారికి అది రాదని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో శృతిహాసన్ స్పెషల్ సాంగ్లో మెప్పించనుంది. -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. ఫ్యాన్స్కు మరో గుడ్ న్యూస్..!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ నెల 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.తాజాగా యంగ్ టైగర్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19న రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ థియేటర్లతో పాటు డిజిటల్గా ప్రదర్శించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్రామ్, నవీన్ యేర్నెని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. Before the clock strikes May 20…the celebrations begin across India ⚡#NTRNeel First Glimpse arrives at 11:52 PM IST on May 19th in selected theatres & digitally 🔥— NTR Arts (@NTRArtsOfficial) May 18, 2026 -
బాబీతో మరో మెగా ప్రాజెక్ట్.. 70 ఏళ్ల వయసులో చిరు కష్టం చూశారా?
వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టారు. వీరిద్దరి కాంబోలో ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్తో వచ్చే సెట్స్పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్ట్కు సంబంధించిన టైటిల్ సోషల్మీడియాలో వైరలవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్ సీన్స్తో నిండిన కథతో రానుందని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమైంది.అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ అఫీషియల్గా లాంఛ్ కానుంది. ఈనె 21 నుంచి పూజా కార్యక్రమాలతో క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పరిమితులను అధిగమించడానికి ప్రతి రోజూ మరో అవకాశం…నా ప్రియమైన డైరెక్టర్ బాబీ గారితో మెగా 158 కోసం మరో చిరస్మరణీయ ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను.. ప్రారంభోత్సవం మే 21న అంటూ జిమ్లో వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తున్నారు. ఇది చూసిన అభిమానులు 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ వర్కవుట్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ కాదు.. ఎవరంటే?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ టాక్ నెట్టింట వైరల్గా మారింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఎంపిక చేయలేదట. ఈ చిత్రంలో మొదట జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ను అనుకున్నారట. ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికీ మళ్లీ జాన్వీ కపూర్ వైపే మొగ్గుచూపారు. ఒక వేళ్ల జాన్వీ కపూర్ ప్లేస్లో ఖుషి కపూర్ చేసి ఉంటే తనకిది బిగ్గెస్ట్ టాలీవుడ్ డెబ్యూ అయ్యి ఉండేదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ఈ చిత్ర ట్రైలర్ను ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'ఎంత పని చేశావయ్యా?'.. పెద్ది డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..!
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ హీరోగా వస్తోన్న చిత్రం పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. ఎట్టకేలకు జూన్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం చరణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఈ మూవీ ట్రైలర్ జూన్ 18న రిలీజ్ కానుంది.అయితే ట్రైలర్ రిలీజ్కు ముందే మెగాస్టార్ ట్రైలర్ వీక్షించారు. మూడు నిమిషాల పాటు ఉన్న ట్రైలర్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఫుల్ ఫైర్పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ప్రశంసలు కురిపించారు. చరణ్… బుచ్చి… రెహమాన్… ఇలా ఒక్కొక్కరు తమ బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.. ఎమోషన్.. ఎలివేషన్.. మ్యాడ్నెస్ అన్ని నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయన్నారు. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి.."మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు... నేను పోరాడాను సారు..." అంటూ పెద్ది డైలాగ్ లీక్ చేశారు. నన్ను క్షమించు బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పాను అంటూ చిరు ట్వీట్ చేశారు. #PeddiTrailer చూసాను!! 🔥Just… WOW 🤗🤗🤗3 నిమిషాలు…PURE FIREPOWER PACKED TRAILER!! ✨చరణ్… బుచ్చి… రెహమాన్…ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు… కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! 🫡ఎంత ఊహించుకున్నా… దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్.Emotion… Elevation… Madness… అన్నీ next…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 16, 2026 -
పెద్ది మూవీ హీరోయిన్.. అందుకే దూరంగా ఉందా?
ప్రస్తుతం టాలీవుడ్లో అందరి చూపులు పెద్ది సినిమా వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ హీరోగా వస్తోన్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ నెల 18న పెద్ది ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సనా సైతం పెద్ది ప్రమోషన్స్లో ఫుల్ యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పెద్ది మూవీ గురించి మరో చర్చ మొదలైంది. ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మూవీ ప్రమోషన్స్ వీడియోల్లోనూ జాన్వీ పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ పెద్ది ప్రమోషన్స్కు దూరంగా ఉండడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.కారణం అదేనా??అయితే జాన్వీ కపూర్ కేవలం భారీ రెమ్యూనరేషన్ కోసమే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వల్లే ప్రమోషన్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఓ కథనంలో వెల్లడైంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్కు వేడుకలోనైనా జాన్వీ కపూర్ కనిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముంబయిలో ట్రైలర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఒకవేళ ప్రమోషన్ల విషయంలో జాన్వీ వెనక్కి తగ్గితే అది ఆమె కెరీర్పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ‘పెద్ది’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశాన్ని బాలీవుడ్ బ్యూటీ మిస్ చేసుకున్నట్లే. -
నాని ది ప్యారడైజ్పై రూమర్స్.. మేకర్స్ రియాక్షన్..!
దసరా బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్తో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్, ఆయా షేర్ పాట ఫ్యాన్స్ను అలరించాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. సుబ్బలక్ష్మి పాత్రలో అభిమానులను మెప్పించనుంది. ఈ మూవీలో జడల్ పాత్రలో హీరో నాని అలరించనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ చిత్రంపై ఇటీవల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలోని కొన్ని సీన్స్కు హీరో నాని రీ షూట్ కోరాడని సోషల్ మీడియాలో వైరలైంది. కొన్ని సన్నివేశాలతో నాని పూర్తిగా సంతృప్తి చెందలేదని.. అందుకే దర్శకుడు ఓదెలను రీ షూట్ చేయాలని కోరినట్లు పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ది ప్యారడైజ్ మేకర్స్ స్పందించారు.రీ షూట్ వార్తలపై టీమ్ క్లారిటీ..ది ప్యారడైజ్ మూవీని ఎలాంటి రీ షూట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా మా సినిమాకు సంబంధించి నిరాధారమైన, బాధ్యతారహితమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతా మేము అనుకున్న విధంగానే ముందుకు సాగుతోందని తెలిపారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. మిగిలిన షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.దయచేసి సోషల్ మీడియాలో వచ్చే రీ షూట్ లాంటి వార్తలు ఎవరు నమ్మవద్దని మూవీ టీమ్ కోరింది. మా అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. ఏదైనా ఉంటే మేమే నేరుగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. అవాస్తవ కథనాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో విలన్ శికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 21న థియేటర్లలో సందడి చేయనుంది.Over the past few days, we’ve noticed several baseless rumors and irresponsible speculations being circulated about #TheParadise.For clarity:• #TheParadise was planned with absolute clarity from day one, and the film is progressing exactly as intended. Over 100 shooting days… https://t.co/kjP8VpgV9x— THE PARADISE (@TheParadiseOffl) May 12, 2026 -
'అందుకే జనాలు థియేటర్లకు రావడం లేదు'.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు రామకృష్ణ మనందరికీ సుపరిచితమైన పేరు. జాతిరత్నాలు మూవీలో తన నటన, డైలాగ్స్తో అందరినీ నవ్వించేశాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో కమెడియన్గా మెప్పించారు. అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కంటెంట్పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు. జనాలు థియేటర్లకు రావాలంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయానని తెలిపారు. సినిమా టికెట్ కంటే ఎక్కువగా పార్కింగ్, పాప్కార్న్, పెట్రోల్ ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇవన్నీ దాటుకుని ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలు గొప్పగా ఉండాలని అన్నారు. బలహీనమైన కంటెంట్ కారణంగానే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. 'థియేటర్లు ఖాళీగా ఉండటం చాలా బాధాకరరం. ఇది మన సినిమాలకు ప్రేక్షకులు ఇస్తున్న నిజమైన తీర్పు. మనం తీస్తున్న సినిమాల స్థాయి ఎలా ఉందో పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ రోజుల్లో ప్రేక్షకుడు థియేటర్కి రావడం అంత ఈజీ కాదు. బయటకు రావాలంటే ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులు, పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు, పార్కింగ్ ఛార్జీలు, థియేటర్లలో స్నాక్స్ రేట్లు వంటి చాలా విషయాలు ప్రేక్షకుడిని ప్రభావితం చేస్తున్నాయని' అన్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్కి రావాలంటే కథలో కొత్తదనం ఉండాలని రాహుల్ అన్నారు. కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే తప్ప జనాలు వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీల్లోనే చూసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోటీన్ కథలకు కాలం చెల్లిందని.. కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటేనే ఆడియన్స్ ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. ఈ కామెంట్స్ టాలీవుడ్ సినిమా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇకనైనా టాలీవుడ్ కంటెంట్పై దృష్టి పెడితే బాగుంటుందని సగటు అభిమాని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రామ్ చరణ్ పెద్ది.. నార్త్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలోని రామ్ చరణ్ పహిల్వాన్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినా ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. పెద్ది ట్రైలర్ను మే 18న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.తాజాగా ఈ మూవీ నార్త్ ఇండియా రైట్స్ను ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు. హీందీతో పాటు తెలుగు హక్కులను కూడా జియో స్టూడియోస్ సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. పెద్ది మూవీ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ స్టెప్పులు వేయనుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. Excited to bring Peddi to theatres across North India in Hindi & Telugu.Peddi in cinemas worldwide on 4th June.#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/TvSYP8hRzt— Jio Studios (@jiostudios) May 12, 2026 -
చిరంజీవి 'విశ్వంభర'.. జూలై కాదు.. ఆ తేదీ ఫిక్స్?
మెగాస్టార్ హీరోగా వస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వీఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల మరింత ఆలస్యమవుతూ వస్తోంది. సుమారు రెండేళ్లుగా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. టీజర్పై విమర్శలు రావడంతో చిత్ర నిర్మాతలు విఎఫ్ఎక్స్పై ఎక్కువ సమయం కేటాయించడంతో విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ సినిమా సమ్మర్లోనే విడుదలవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్ వినిపించింది.అయితే విశ్వంభరకు రిలీజ్ తేదీకి సంబంధించిన మరో న్యూస్ వైరలవుతోంది. ఈ మూవీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని టాక్ వినిపిస్తోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తాజా సమాచారం. ఆ సమయంలో పెద్దగా సినిమాల పోటీ లేకపోవడం విశ్వంభరకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇదే నిజమైతే స్వాతంత్ర్య దినోత్సవం రోజున విశ్వంభర రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఇప్పటికే విశ్వంభర్ రెండు పార్టులుగా వస్తుందన్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట స్పందించారు. అలాంటిదేమీ లేదని దర్శకుడు కొట్టిపారేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ డీల్ను క్లోజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్గా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసే అవకాశముంది. కాగా.. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. -
రాజ్ తరుణ్ థ్రిల్లర్ మూవీ.. బర్త్ డే స్పెషల్ పోస్టర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టార్టాయిస్. ఈ సినిమాకు రిత్విక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఇవాళ హీరో రాజ్ తరుణ్ బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విషెస్ తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ సందర్బంగా టార్టాయిస్ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. టార్టాయిస్ కథ చాలా కొత్తగా.. డిఫరెంట్గా ఉంటుందని మేకర్స్ వివరించారు. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది.. నిద్రలో నడుచుకుంటూ వెళ్లి మర్డర్స్ చేస్తూ ఉంటాడు..ఆ తర్వాత ఏమి జరుగుతుందనే కోణంలో ఈ కథను తెరకెక్కించినట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. -
వెయిటింగ్ ఈజ్ ఓవర్.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు.ఈనెల 18న పెద్ది మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సనా ప్రకటించారు. ఈ మేరకు పెద్ది మూవీ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ బిగ్ ఈవెంట్ ఎక్కడనేది అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ సారి పుష్ప-2 తరహాలో నార్త్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే వేదికపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.#PEDDI will stay in your hearts❤️TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli @bomanirani… pic.twitter.com/4Ub5AiwEGH— BuchiBabuSana (@BuchiBabuSana) May 11, 2026 -
'కనిపించే దైవం కూడా మాతృమూర్తి తర్వాతే'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్!
ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్ తెలిపారు. అమ్మ గొప్పతనం, త్యాగం గురించి ప్రస్తావించారు. అమ్మ… మన మొదటి గురువు.. మన మొదటి ధైర్యం.. కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే అంటూ అమ్మపై ప్రేమ చాటుకున్నారు. మన విజయాల వెనక త్యాగం… మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మదేనన్నారు. మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు. ఈ సందర్భంగా తన మాతృమూర్తితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను షేర్ చేశారు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాబీతో జతకట్టారు. వీరిద్దరు కాంబోలో గతంలో వాల్తేరు వీరయ్య మూవీ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘మన శంకర వరప్రసాద్గారు’తో భారీ హిట్ అందుకున్న చిరు.. బాబీతో కలిసి పనిచేయనున్నారు. ఈ మూవీని మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్ పెడతారని ప్రచారం నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అమ్మ…మన మొదటి గురువు,మన మొదటి ధైర్యం,కనిపించే దైవం కూడా “కని పెంచిన” మాతృమూర్తి తర్వాతే…!మన విజయాల వెనక త్యాగం…మన ప్రతి అడుగులోనూ నిశ్శబ్దంగా నిలిచే ఆశీర్వాదం అమ్మది.మనకంటే మనల్ని ఎక్కువగా ప్రేమించే ప్రతి మాతృమూర్తికి హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.Happy… pic.twitter.com/SJ1AchhEPz— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2026 -
బెల్లంకొండ సతీమణి ఆదాయం నెలకు రూ.90 లక్షలా.. ఏం చేస్తారంటే?
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్యా రెడ్డిని పెళ్లాడారు. తిరుమలలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సతీమణి కావ్య హైదరాబాద్కు చెందిన అమ్మాయేనని మనందరికీ తెలుసు. ఆమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్ అని తెలుస్తోంది. అంతకుమించి ఆమె వ్యక్తిగత వివరాలు పెద్దగా తెలియదు. కానీ తాజాగా కావ్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.బిజినెస్తో రూ.90 లక్షలు..ఆమె బిజినెస్ ద్వారానే నెలకు ఏకంగా రూ.90 లక్షలు రూపాయలు సంపాదిస్తుందని సమాచారం. అరటి మొక్కల నుంచి వచ్చే నారతో శారీలు తయారు చేసే బిజినెస్ చేస్తున్నారట. వీటికి విదేశాల్లో అధిక డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిజినెస్ ద్వారా కావ్య రెడ్డి నెలకు దాదాపు రూ.90 లక్షలు సంపాదిస్తున్నారని లేటేస్ట్ టాక్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. మార్చిలో కావ్యాతో నిశ్చితార్థం చేసుకోగా.. ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో సింపుల్గా పెళ్లి పీటలెక్కారు. -
ఇంకా ట్రైలర్ రాలేదు.. అప్పుడే పెద్ది రికార్డ్..!
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. గురువారం నుంచే ఓవర్సీస్ ఆడియన్స్కు టికెట్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చేశాయి.ఓవర్సీస్లో తొలి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన 24 గంటల్లోపే లక్ష టికెట్స్ బుకింగ్స్ పూర్తయ్యాయి. నార్త్ అమెరికాలో అభిమానులు టికెట్ల కోసం ఎగబడ్డారు. జూన్ 3వ తేదీన ప్రీమియర్ షోల టికెట్స్ ఓపెన్ అవ్వగా కేవలం కొన్ని గంటల్లోనే కొనేశారు. దీంతో ఉత్తర అమెరికాలో అత్యంత వేగంగా లక్షకు పైగా టికెట్స్ అమ్ముడైన చిత్రంగా పెద్ది నిలిచింది. ఇటీవలే ఈ మూవీ ఫైనల్ కాపీ కూడా రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు.ట్రైలర్ రిలీజ్ కాకపోయినా పెద్దికి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, రామ్ చరణ్ లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో బుచ్చిబాబు సనా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ALL TIME RECORD 💥#PEDDI - FASTEST $100K+ Pre-Sales for North America Premieres🔥🔥🔥#PEDDITakeOver 🧨⚡️MEGA POWERSTAR #RamCharan's MASS HYSTERIA 💥💥MASSIVE Release by @PrathyangiraUS, Premieres On JUNE 3rd 🔥@AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/NkA8VDFKwi— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 8, 2026 -
ఫ్యామిలీతో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. స్పెషల్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ పెద్ది.. ఫైనల్ కాపీ రెడీ.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి కావడంతో మేకర్స్ ఫైనల్ కాపీని రెడీ చేస్తున్నారు. తాజాగా పెద్ది ఫైనల్ కాపీ కూడా పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. ఎడిటింగ్ పూర్తి కావడంతో ఎడిటర్తో కలిసి దర్శకుడు బుచ్చిబాబు దిగిన ఫోటోను షేర్ చేశారు.పెద్ది ఫైనల్ కాపీ సిద్ధం కావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ ఉన్నాయని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ప్రకటించింది. జూన్ 3న సాయంత్రం నుంచే పెద్ది ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ప్రత్యేక సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ సందడి చేయనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. The #PEDDI Edit has been locked🔒All set and ready for massive premieres from JUNE 3rd 2026💥💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON June 4th ❤🔥#GetReadyForPeddi 💥💥Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman… pic.twitter.com/e240haEItl— Vriddhi Cinemas (@vriddhicinemas) May 7, 2026 -
విజయ్ విన్.. మెగాస్టార్, మహేశ్ బాబు ప్రశంసలు
విజయ్ గెలుపుతో కోలీవుడ్లో సంబురాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని కోలీవుడ్ నటీనటులు చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నటుడు జీవా విజిల్స్ వేస్తూ కనిపించారు. ఆయనతో మరో కమెడియన్ సైతం విజిల్స్తో సందడి చేశారు. తమిళనాడు వ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు విజయ్కు అభినందనలు చెబుతున్నారు. అంతేకాకుండా తమిళ హీరో, నిర్మాత విశాల్, నటి ఖుష్బు సుందర్, కమల్ హాసన్, జీవీ ప్రకాశ్ కుమార్ విజయ్ను అభినందించారు. టాలీవుడ్ హీరోల ప్రశంసలు..దళపతి విజయ్కు టాలీవుడ్ స్టార్స్ సైతం అభినందనలు చెబుతున్నారు. విజయ్ గెలుపుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మొదటి ఎన్నికలోనే అద్భుతమైన విజయం సాధించారని కొనియాడారు. మీ లక్ష్యం, నాయకత్వంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.తమిళనాడు ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. ప్రజలు మీపై ఉంచిన అపారమైన నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని ప్రశంసించారు. ఈ పాలనలో తమిళనాడు మరింత పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహేశ్బాబుతో పాటు టాలీవుడ్ హీరోలు రవితేజ, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాని, శర్వానంద్, సాయితేజ్, శ్రీవిష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం విజయ్ విజయంపై ట్వీట్ చేశారు.కాజల్ అగర్వాల్ ట్వీట్..తమిళనాడులో విజయ్ గెలుపుపై హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ అద్భుతమైన విజయంపై హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్ట్ చేసింది. మీ దార్శనికతకు, మీ పట్టుదలకు, మీపై ప్రజలకు ఉన్న అచంచలమైన ప్రేమకు నిజమైన నిదర్శనమని కొనియాడింది. తమిళనాడు ప్రజలు తమ తీర్పునుస్పష్టంగా చెప్పారని ప్రశంసించింది. ఇది కేవలం ఒక విజయం కాదు.. లక్షలాది మందితో అనుబంధానికి జరుపుకునే వేడుకని అభినందించారు. కాగా.. తుపాకీ, మెర్సల్, జిల్లా చిత్రాల్లో విజయ్ సరసన కాజల్ నటించారు. தங்களுடைய முதல் தேர்தலிலேயே மக்களுடைய நம்பிக்கையைப் பெற்று பெருவெற்றி பெற்றிருக்கும் தமிழக வெற்றிக் கழகத்தின் தலைவர் திரு. விஜய் @TVKVijayHQ அவர்களுக்கும், அவரது கட்சியினருக்கும் என்னுடைய பாராட்டுகள். மக்கள் பணி சிறக்க என்னுடைய வாழ்த்துகள்.— Kamal Haasan (@ikamalhaasan) May 4, 2026 Heartiest congratulations to @actorvijay on this spectacular and resounding victory! This moment is a true testament to your vision, your perseverance, and the unwavering love people have for you.The people of Tamil Nadu have spoken—loud, clear, and with immense pride. This… pic.twitter.com/XVhg0aYt1r— Kajal Aggarwal (@MsKajalAggarwal) May 4, 2026 Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️— Mahesh Babu (@urstrulyMahesh) May 4, 2026 Dear @actorvijay,Hearty congratulations on this outstanding and well-deserved victory in your first election 💐💐💐May you continue to inspire, lead, and serve with unwavering passion and purpose. My best wishes to you for your public service to the state of Tamil Nadu and…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2026 -
'ఆ విషయంలో నన్ను క్షమించండి.. పెద్ది తీసేయడం అంత ఈజీ కాదు'
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మేకర్స్ రిలీజ్ తేదీని ముందుకు తీసుకొచ్చారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన పెద్ది డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.బుచ్చిబాబు మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 30న మేం రానందుకు నన్ను క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ది మీ అందరికీ కనెక్ట్ అవుతుంది. పెద్దిని మీ హృదయాల్లోంచి తీసేయడం అంత ఈజీ కాదు. జూన్ 4న చరణ్ సార్పై ఉన్న నా ప్రేమను చూస్తారు. ఈ అవకాశమిచ్చిన చరణ్ సార్కు ధన్యవాదాలు' తెలిపారు. ఈ ప్రెస్మీట్కు దర్శకుడు సుకుమార్, నిర్మాత సతీశ్ కిలారు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా హాజరయ్యారు. -
మెగా ఫ్యాన్స్కు పండగే.. కాస్తా ముందుగానే పెద్ది రిలీజ్
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పెద్ది మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీని జూన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఇవాళ విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని జూన్ 4న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్గా వెల్లడించారు. దీంతో కాస్తా ముందుగానే పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని ఐటమ్ సాంగ్లో కోలీవుడ్ భామ శృతిహాసన్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూట్ కూడా పూర్తయింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన పెద్దిని ఎట్టకేలకు జూన్ 4న బిగ్ స్క్రీన్పైకి తీసుకొస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. -
రామ్ చరణ్ పెద్ది.. రిలీజ్ డేట్ మారనుందా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామి బుచ్చిబాబు ఇటీవలే ఓ ఈవెంట్లో ప్రకటించారు. ఓ ఐటమ్ సాంగ్ షూట్ పెండింగ్లో ఉండగా.. దాదాపు అది కూడా ఈ రోజుతో పూర్తయింది. దీంతో మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.రిలీజ్ డేట్ మారే ఛాన్స్..?అయితే పెద్ది మూవీ కాస్తా త్వరగానే ప్రేక్షకుల ముందుకు రానుందని నెట్టంట టాక్ వినిపిస్తోంది. జూన్ 4 రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు విడుదల కావాల్సిన యశ్ టాక్సిక్ ఊహించినట్లే వాయిదా పడింది. దీంతో పెద్దిని 4 వ తేదీని రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మెగా ఫ్యాన్స్కు పండగే. అనుకున్న టైమ్ కంటే ముందుగానే పెద్దిని బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం రానుంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
మెగాస్టార్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఇదే..!
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్య’ తర్వాత డైరెక్టర్ బాబీతో మరోసారి జతకట్టారు. వీరిద్దిరి కాంబినేషన్లో వస్తోన్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీపై రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి నెగెటివ్ రోల్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కూడా సమాచారం. అయితే మేకర్స్ ఇంకా టైటిల్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల సంగతి పక్కనపెడితే.. నెట్టింట ఓ న్యూస్ హల్చల్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్బస్టర్ మూవీ భాషా చిరంజీవి మిస్ చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ చిరంజీవిని కలిసి కథను వివరించారట. చిరంజీవికి.. నిర్మాత అల్లు అరవింద్ కు 'బాషా' కథ విపరీతంగా నచ్చిందట. వెంటనే ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం చర్చలు మొదలుపెట్టారట.కానీ అప్పట్లోనే బాషా నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దాదాపు రూ.40 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేశారట. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు ఇవ్వాలని నిర్మాతలను కోరారని సమాచారం. దీంతో 15 లక్షల తేడా రావడంతో ఈ డీల్ కుదరలేదట. అలా మెగాస్టార్ ఈ బ్లాక్బస్టర్ మూవీని మిస్సైనట్లు తెలుస్తోంది. కాగా.. భాషా తమిళంలో విడుదలై ఊహించని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత రీమేక్ కంటే డబ్బింగ్ చేయడమే ఉత్తమమని భావించి 1995 ఏప్రిల్లో తెలుగులోనూ విడుదల చేశారు. -
'తిరుమలలో పెళ్లి జరగడం నా అదృష్టం..' బెల్లంకొండ
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కనున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆయన పెళ్లి వేడుక జరగనుంది. కావ్య రెడ్డి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరిద్దరు పెళ్లి ఈ రోజు రాత్రి 11: 13 గంటలకు సాయి శ్రీవారి సాక్షిగా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో జరగనుంది.ఈ సందర్భంగా హీరో సాయి శ్రీనివాస్ ఆసక్తకర కామెంట్స్ చేశారు. తిరుమలలో పెళ్లి చేసుకోవాలంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అదృష్టం, ఆశీర్వాదం ఉండాలని అన్నారు. మా అమ్మ, నాన్నలు నాకు ఆ స్వామి పేరునే పెట్టారని తెలిపారు. తిరుమలలో పెళ్లి చేసుకునే అదృష్టం దొరకడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని రోజుగా మిగిలిపోతుందన్నారు. నా చిన్నప్పటి నుంచి తిరుమలలో శ్రీనివాస కల్యాణం చూస్తూ పెరిగానని తెలిపారు. నా ఫియాన్నీ వచ్చాక శ్రీనివాసకావ్యాణం అని పేరు పెట్టారు. నా లైఫ్లో స్వామివారి పాదాల చెంత పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. -
రెండోసారి పెద్ది వాయిదా.. అసలు కారణం ఇదే..!
రామ్ చరణ్- బుచ్చిబాబు సనా కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడడంతో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓ ఐటమ్ సాంగ్ మినహా ఈ మూవీ షూట్ మొత్తం దాదాపు పూర్తయింది. ఈ స్పెషల్ సాంగ్లో కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. అయితే పెద్ది మూవీ జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ రెండుసార్లు వాయిదా పడడంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అసలు కారణాలేంటని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్ వల్లే వాయిదా వేశారని కొందరు భావిస్తున్నారు. కానీ ఇతర కారణాల వల్లే రెండోసారి వాయిదా వేశారని అంటున్నారు. అసలు ప్రధాన కారణం ఇదేనని సోషల్ మీడియాలో వైరలవుతోంది.పెద్ది మూవీ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో చరణ్ గెటప్కు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం. అందువల్లే ఏప్రిల్ 30 నుంచి జూన్కు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. పీరియాడిక్ నేపథ్యానికి తగ్గనట్లుగా ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అభిమానులకు మరింత అనుభూతి ఇచ్చేందుకే ఈ మూవీని వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ చేయనున్నారు. -
అడివి శేష్ డెకాయిట్.. చిచ్చుబుడ్డి ఫుల్ వీడియో వచ్చేసింది..!
టాలీవుడ్ హీరో అడివి శేష్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ డెకాయిట్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 10న రిలీజైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. మొదటిరోజు అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో సింగర్ జోనితా గాంధీ ఆకట్టుకుంది. ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా.. రామ్ మిరియాల, జోనితా గాంధీ ఆలపించారు. ఈ సాంగ్ భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
వారణాసి గ్లోబల్ ఈవెంట్.. టైమింగ్స్ ఇవే..!
మహేశ్బాబు హీరోగా తెరకెక్కిస్తోన్న వారణాసి మూవీని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టైటిల్ ప్రకటనతోనే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న ఈ మూవీ కోసం పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారు దర్శకధీరుడు. అందుకే వారణాసి సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఏడాది ముందు నుంచే ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ను మెక్సికోలో జరగనున్న కామిక్ కాన్ ఎక్స్పీరియెన్స్లో ప్రదర్శించనున్నారు. ఇండియన్ టైమ్ ప్రకారం రేపు ఉదయం 5.15 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. ఈ సినిమాపై ఏప్రిల్ 24న ప్రతిష్టాత్మక థండర్ స్టేజ్లో ప్రత్యేక ప్యానెల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ ‘వారణాసి టు ది వరల్డ్’ అనే సెగ్మెంట్ను హోస్ట్ చేయనున్నారు. ఈవెంట్లో వారణాసి మేకింగ్ వీడియోలు ప్రదర్శించునున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజమౌళి నుంచి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల కాని బిహైండ్-ది-సీన్స్ ఫుటేజ్ ఫ్యాన్స్కు పరిచయం చేయనున్నారు. దీంతో పాన్ వరల్డ్ రేంజ్లో వారణాసి ప్రమోషన్స్ షురూ కానుంది. -
రామ్ చరణ్ పెద్ది రిలీజ్.. ఆ డేట్నే ఫిక్స్ చేశారా?
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఓ ఐటమ్ సాంగ్ మినహా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రెండోసారి కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన పెద్దిని జూన్కు షిఫ్ట్ చేశారు.అయితే రిలీజ్ తేదీని మాత్రం అఫీషియల్గా ప్రకటించలేదు. దీంతో పెద్ది విడుదల తేదీపై నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెద్దిని జూన్ 25న విడుదల చేస్తారని లేటేస్ట్ టాక్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందన్న వార్త హల్చల్ చేస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు పెద్ది మేకర్స్ స్పందించలేదు. రాబోయే రోజుల్లో పెద్ది రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. -
అల్లు అర్జున్ షిఫ్ట్.. ముంబైకి కాదు.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్లో ఇప్పుడంతా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. -
అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు బిగ్ రిలీఫ్ లభించింది. బన్నీ వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏఐ, డీప్ఫేక్ టెక్నాలజీతో వీడియోలు, ఫోటోలు ప్రసారం చేయవద్దని స్పష్టం చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ గొంతు, హావభావాలను అనుమతి లేకుండా అనధికార వాణిజ్య ప్రకటనల్లో వాడటకూడదని నిషేధం విధించింది. ఎవరైనా సరే సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.కాగా.. గతంలో చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ వ్యక్తగత హక్కులు కాపాడాలంటూ కోర్టుకు వెళ్లారు. తమ అనుమతి లేకుండా ఇష్టమొచ్చినట్లుగా ఫోటోలు వాడుతున్నారని సినీతారలు పిటిషన్స్ దాఖలు చేశారు. వీరందరి హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా అల్లు అర్జున్కు ఢిల్లీ హైకోర్ట్ ఊరట కల్పించింది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అంతే కాకుండా రష్మికతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ కూడా రాకాలో కనిపించనున్నట్లు సమాచారం. -
కుమారుడి పేరు రివీల్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో తీరువీర్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. చిన్న పాత్రలతో కెరీర్ని ప్రారంభించిన తీరువీర్.. ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు. కొత్త కొత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇటీవలే ఆయన పాపం ప్రతాప్ మూవీతో ఆడియన్స్ను పలకరించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.సినిమాల సంగతి పక్కన పెడితే తిరువీర్ గతేడాది డిసెంబర్లో తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు కుమారుడు జన్మించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తమ కుమారుడికి నామకరణం చేశారు. వీరిద్దరి రెండో పెళ్లి రోజు సందర్భంగా కొడుకు పేరు రివీల్ చేశారు. అథర్వ్ రెడ్డిగా తమ ముద్దుల కుమారుడికి పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. తిరువీర్ తెలుగు సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు.. 'మసూద' మూవీతో మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. 2016 నుంచి మల్లేశం, జార్జ్ రెడ్డి, పలాస, టక్ జగదీష్, మసూద, పరేషాన్, మోక్షపటం సినిమాలు చేశాడు. తిరువీర్ 2024లో కల్పన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. Actor Thiruveer named their son - ATHARV REDDY on their second wedding anniversary. pic.twitter.com/73GFRItOPX— CineAura (@CineAuraX) April 21, 2026 -
ట్రంప్కే ఝలక్ ఇచ్చిన తరుణ్ భాస్కర్.. వీడియో చూశారా?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన గాయపడ్డ సింహం చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు తరుణ్ భాస్కర్. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లను సరికొత్త పంథాలో తీసుకెళ్తున్నారు. ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్నే రంగంలోకి దించేశాడు తరుణ్ భాస్కర్. ఏఐతో రూపొందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్ టీ తాగుతూ ఇండియన్ టీ వెరీ నైస్ అంటూ ప్రశంసించారు. దీనికి తరుణ్ భాస్కర్.. ఇండియన్ టీ ఎప్పడు బాగుంటుంది.. కానీ మీకిచ్చింది ఇరానీ టీ అంటూ షాకిచ్చారు.దీనికి డొనాల్డ్ ట్రంప్ షాకయ్యారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉంది. ఈ మూవీని ఇరాన్లో మాత్రమే రిలీజ్ చేయడం లేదని.. ఓవర్సీస్లో ఎస్వీసీ, ప్రత్యుంగిరా సినిమాస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో ఫుల్ ఫన్నీగా ఉండడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Dear NRI Simhalu… ❤️🔥#GaayaPaddaSimham Roaring Overseas Release by @SVCRelease @PrathyangiraUS 🦁🔥TRUMP’ING PREMIERES on APRIL 30 💥#GPS #TharunBhascker @JDmaxmode @fariaabdullah2 @Maanasa_chou @kasyapcineverse @pavansadineni @SAMWoffl @POVStoriesOffl @zeestudiossouth pic.twitter.com/7kqGeFXVl2— Prathyangira Cinemas (@PrathyangiraUS) April 21, 2026 -
విజయ్ దేవరకొండ క్రేజీ ప్రాజెక్ట్.. అఫీషియల్గా ప్రారంభం
రౌడీ విజయ్ దేవరకొండ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం అఫీషియల్గా ప్రారంభమైంది. ఈ మూవీకి ముఖ్య అతిథిగా హాజరైన నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ మూవీకి వీడీ శౌర్యువ్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. తొలిసారి వస్తోన్న ఈ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రానికి పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండటం మూవీపై అంచనాలు మరింత పెంచేసింది. ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా రివీల్ చేయలేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రౌడీ జనార్ధన అనే చిత్రాల్లో నటిస్తున్నారు. Antha Easy ga Ela Pulloff chesthaav @TheDeverakonda AnnA outfits Anni 🥵❤️💥!...#VDShouryuvpic.twitter.com/rkzc9UR5Qz— Therajamohan (@therajamohan) April 20, 2026 -
నాన్న గొప్పతనాన్ని ఆవిష్కరించే ఓ తండ్రి కథ.. రిలీజ్ ఎప్పుడంటే?
వైఎస్కే, నిహారిక చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఓ తండ్రి కథ. ఈ చిత్రానికి నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎల్వీ క్రియేషన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ఆడియో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వి సముద్ర, సంజీవ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. 'ప్రతి తరం మధ్య పిల్లలు–తల్లిదండ్రుల మధ్య భావోద్వేగ సంఘర్షణలు సహజం. మంచి సందేశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. తక్కువ బడ్జెట్లోనూ మాట నిలబెట్టుకుని సినిమా పూర్తి చేయడం వెంకట్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనం' అని అన్నారు.దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ…'తండ్రి విలువను చూపించే ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా సాహసం. ఈ సినిమాలో అశోక్ రెడ్డి తండ్రి పాత్రలో జీవించారు. పాటలు కూడా ఎంతో హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. వెంకట్ రెడ్డి కొద్ది సంవత్సరాల్లోనే 17 సినిమాలు పూర్తి చేయడం అభినందనీయం' అని అన్నారు. ఈ చిత్రంలో అశోక్ రెడ్డి లెంకల, తోట సుబ్బారావు, వి. కరుణాకర్, తన్నీరు నాగేశ్వరరావు, విజయలక్ష్మీ , వరేణ్య ఆగ్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కుటుంబ కథాచిత్రంం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తెరచాప మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రల్లో వచ్చిన చిత్రం తెరచాప. ఈ మూవీకి జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్య క్రియేషన్స్ బ్యానర్పై కైలాశ్ దుర్గం నిర్మించారు. ఈ రోజు ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది.అసలు కథేంటంటే..సమాజంలో తన ప్రజల కోసం పోరాడే నాయకుడైన కాశీ బాబు (నాగ మహేష్) అనుకోని పరిస్థితుల్లో మరణిస్తాడు. తనను ఎంతో ప్రేమించే తండ్రి కొడుకు నిర్లక్ష్య స్వభావం వల్ల చనిపోయాడని అందరూ అంటారు. అయితే తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ఈశ్వర్ (నవీన్ రాజ్) ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో సీత (శ్రీలు), గాయత్రి (పూజా సుహాసిని) పాత్ర ఏంటి? ఆనంద్ రాజు (రాజీవీ కనకాల), పుష్ప ఫేమ్ కేశవ పాత్ర ఎలా ఉంటుంది? అన్నదే మిగతా కథ.ఎలా ఉందంటే..సముద్ర బ్యాక్డ్రాప్లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. మత్స్యకారుల నేపథ్యం ఉన్న కథ అని ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయితే ఈ కథలో తండ్రి-కొడుకు మధ్య ఉన్న భావోద్వేగాన్ని పరిచయం చేశాడు డైరెక్టర్ జోయెల్ జార్జ్. తాను అనుకున్న కథను ఎక్కడా మిస్సవకుండా తెరపై ఆవిష్కరించాడు.సెకండాఫ్లో యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారేమో అనిపిస్తాయి. దర్శకుడు తీసుకున్న కథనం బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేపై మరింత దృష్టి పెట్టాల్సింది. మధ్య మధ్యలో కనిపించే రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కాస్తా చిరాకు తెప్పిస్తాయి. మొత్తానికి స్క్రీన్ప్లేలో లోపాలు ఈ కథకు పెద్ద మైనస్. ఓవరాల్గా ఓ ఆకట్టుకునే వాస్తవిక డ్రామాగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. . ఈ వీకెండ్కు తెరచాపను ఓసారి ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..గ్రామీణ యువకుడి పాత్రలో నవీన్ రాజ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మత్స్యకారుడిగా ఆయన లుక్ చాలా సహజంగా.. పాత్రకు తగినట్లుగా ఉంది. శ్రీలు, పూజా సుహాసిని తమ పాత్రల్లో మెప్పించారు. రాజీవ్ కనకాల, నాగ మహేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేశవ బాగానే నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికంగా చూస్తే ప్రజల్ కృష్ణ అందించిన సంగీతం బాగుంది.. ఎంఎల్ రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించింది. అజీమ్, వెంకట్ అందించిన సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. రాజు బోదాసింగి ఎడిటింగ్పై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నాయి.రేటింగ్: 2.5/5 -
'సెట్లో నేను ఏడ్చిన సందర్భం అదొక్కటే'.. హన్సిక కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ దేశముదురు మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అమాయకపు మాటలతో అభిమానులను కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తోంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలోని సహజ గుణమని ప్రశంసలు కురిపించింది. తాను ఓ మూవీ సెట్లో ఏడ్చిన సందర్భం నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముదురు సెట్లో టీమ్తో సెండాఫ్ టైమ్లో ఏడ్చేశానని హన్సిక తెలిపింది. ఆ తర్వాత ఏ మూవీ సెట్లోనూ తాను ఏడ్వలేదని చెప్పింది. కాగా.. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన దేశముదురు చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్కు జంటగా హన్సిక హీరోయిన్గా నటించింది. Hansika Motwani says, “The only time I CRIED ON SET was ‘DesaMuduru’.”“#AlluArjun is an amazing person and very respectful. He has a Natural Charm of being a friend. I remember I cried on set for a Crew during #DesaMuduru, After that, I never cried for leaving any film set.” pic.twitter.com/Xx3dxdta4D— Whynot Cinemas (@whynotcinemass_) April 17, 2026 -
'అదే నాన్నలో చాలా ప్రత్యేకం'.. మెగాస్టార్పై తనయుడి ప్రశంసలు
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మరోసారి వాయిదా వేశారు. జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఒక పాట మినహాయిస్తే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. మరింత థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వాయిదా వేస్తున్నామని నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేసింది.అయితే ఇటీవలే గ్లోబల్ స్టార్ మరో అరుదైన ఘనత సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచాడు. ప్రముఖ ఈ స్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై రామ్ చరణ్ ఫోటోను ముద్రించారు. అంతకుముందు కేవలం ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఈ మ్యాగజైన్లో ప్రచురించారు. తాజాగా ఈ ఘనతను మన రామ్ చరణ్ అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. నాన్న ఎంతో మందిపై ప్రభావం చూపారని అన్నారు. ప్రతిరోజు ఆయనను చూస్తూ పెరగడం వల్ల నాపై ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్నారు. నా జీవితంలో రియల్ హీరో నాన్నే అని వెల్లడించారు. కుటుంబంతో పాటు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే.. ముందు స్పందించే వ్యక్తి ఆయనేనని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడం నాన్న నైజమన్నారు.నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగానే అందిపుచ్చుకున్నామని రామ్ చరణ్ తెలిపారు. ఎంత స్టార్డమ్ ఉన్నా ఇంటి దగ్గర అందరి తండ్రుల్లాగే సింపుల్గా ఉండేవారని.. అదే ఆయనతో చాలా ప్రత్యేకమైన విషయమన్నారు. ఇక సినిమా కోసం రోజులో కేవలం నాలుగు గంటలే నిద్రపోయిన సందర్భాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అదే సమయంలో వరుస షూటింగ్ల నుంచి మూడు రోజులు విరామం తీసుకుని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారని అన్నారు. ఆయన అటు పని.. ఇటు ఫ్యామిలీని సమన్వయం చేసేవారని చెర్రీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను కూడా నాన్ననే ఫాలో అవుతున్నానని రామ్ చరణ్ స్పష్టం చేశారు.


