breaking news
Tollywood Hero
-
ఊహించని కాంబో.. స్టార్ డైరెక్టర్తో రానా దగ్గుబాటి..!
సినీ ఇండస్ట్రీలో ఒక రేర్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైవిద్య భరితమై కథా చిత్రం తెరకెక్కింది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరువాత ఈయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం రానా కేవలం నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా రాణిస్తున్నారు. ఈయన 2005లోనే స్పిరిట్ మీడియా పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే దుల్కర్ సల్మాన్తో కలిసి కాంత చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.అయితే కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ గురించి తెలియని వారు ఉండరు. పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా నటుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా.. కార్తీక్ సుబ్బరాజ్కు చెందిన స్టోన్బెంట్ సంస్థ కలిసి నీళిరా అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మించాయి. దీనికి శ్రీలంక తమిళుడు సోమిధరన్ దర్శకత్వం వహించారు. ఇందులో నటుడు నవీన్ చంద్ర, విదూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్న ట్లు యూనిట్ వర్గాలు ఎక్స్ మీడియాలో పేర్కొ న్నారు. ఆ చిత్ర టైటిల్తో కూడిన పోస్టర్ను పోస్ట్ చేశారు. -
తమ్ముడి బర్త్ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్
ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. Happy Birthday to my fav boy ❤️May this year be EPICCCC for all of you 🤗😘#EPIC ~ First Semester#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @HeshamAWMusic @Iamvaishnavi04 pic.twitter.com/kY9OfDRDhn— Vijay Deverakonda (@TheDeverakonda) March 15, 2026 -
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన భామ కృతి శెట్టి.. హీరోయిన్ రెజీనా లేటేస్ట్ లుక్..!
బ్లాక్ డ్రెస్లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హోయలు..టాలీవుడ్ భామ విష్ణు ప్రియ స్టన్నింగ్ లుక్స్..నగలతో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ త్రిష..శారీలో దిల్ రాజు సతీమణి అందాలు..బ్లూ డ్రెస్లో హీరోయిన్ రెజీనా అందాలు.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Vundavalli (@tejaswini_vygha) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by RegenaCassandrra (@regenacassandrra) -
పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ట్రైలర్ రిలీజ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్సింగ్. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించారు. అయితే, ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. అదేరోజున ధరంధర్-2 కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. -
హీరో రాజశేఖర్కు గోటీల బిజినెస్.. ఆయన ఏమన్నారంటే?
టాలీవుడ్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తోన్న బైకర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి అభిలాశ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజైన సాంగ్ ఆడియన్స్ను మెప్పించింది.అయితే ఈ సినిమా సంగతి పక్కనపెడితే హీరో రాజశేఖర్పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. గతంలో ఆయన గోటీల బిజినెస్ ప్రారంభించారని నెట్టింట మీమ్స్ వైరలయ్యాయి. ఈ వ్యాపారంలో ఆయన కోట్లు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. కొందరైతే ఏకంగా రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు వచ్చాయంటూ మరీ హాస్యంగా పోస్టులు పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ ఇదంతా నిజమేనా అని ఆరా తీయడం మొదలెట్టారు.తాజాగా తనపై వచ్చిన మీమ్స్పై హీరో రాజశేకర్ స్పందించారు. ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి వ్యాపారాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తనకు గోటీల ఫ్యాక్టరీ ఉందని అందరు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. కొందరు అది నిజమే అనుకుని నాకు కాల్ చేసి అడిగారని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో చూడగానే నాకు ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? నేనెక్కడ రూ.3 కోట్లు సంపాదిస్తున్నా? అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. -
భాగ్యనగరంలో భలే జోరు
వేసవి మొదలైపోయింది. ఎండలు కూడా అప్పుడే మండుతున్నాయ్. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్లతో బిబీ బిజీగా ఉంటున్నారు నటీనటులు. కొన్ని సినిమాలు ఇండోర్లో (స్టూడియోల్లో) షూటింగ్స్ జరుపుకుంటుండగా... మరికొన్ని మూవీస్ షూటింగ్స్ కోసం హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్స్ వేసి చిత్రీకరణలు జరుపుతున్నారు మేకర్స్.ప్రస్తుతం భాగ్యనగరంతో (హైదరాబాద్) పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు భలే జోరుగా సాగుతున్నాయి. నాగార్జున, వెంకటేశ్, రవితేజ, ప్రభాస్, రామ్చరణ్, నాని, గోపీచంద్, శర్వానంద్, అఖిల్ వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం...మూసరంబాగ్లో... నాగార్జున కెరీర్లో వందో చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆయన ప్రయాణంలో ఓ మైలురాయిగా నిలవనున్న ఈ సినిమాని తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్పై నాగార్జున భారీ బడ్జెట్తో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్’ వంటి టైటిల్స్ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల కర్నాటకలోని మైసూర్ షెడ్యూల్ని పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చింది యూనిట్.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లోని మూసరాంబాగ్లో జరుగుతోంది. నాగార్జునపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు కార్తీక్. నాగార్జున కెరీర్లో ఓ మైలురాయిగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అన్ని వాణిజ్య అంశాలతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ మూవీలో సీనియర్ నటి టబు–నాగార్జున కలిసి నటిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నాగార్జున తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో మెరవనున్నారని టాక్. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (గెస్ట్ అప్పీయరెన్స్) కలిసి ‘మనం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరోసారి తండ్రీ కొడుకులు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగార్జున నటిస్తున్న ఈ వందో చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. అన్నపూర్ణలో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’. ఈ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. వెంకటేశ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.వెంకటేశ్ ఇమేజ్కి తగ్గట్టు అద్భుతమైన కుటుంబ కథాంశం నేపథ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారని తెలిసింది. ‘కేజీఎఫ్’ మూవీ ఫేమ్ శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రానికి ‘యానిమల్’ మూవీ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత వెంకటేశ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. శంకర్పల్లిలో ఇరుముడి... వరుస సినిమాలతో బిజీగా దూసుకెళుతున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకుడు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, రవితేజ కుమార్తె పాత్రను బేబీ నక్షత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంకర్పల్లిలో జరుపుకుంటోంది.ఆధ్యాత్మిక ప్రాముఖ్యత నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో అయ్యప్ప మాలధారిగా కనిపించనున్నారు రవితేజ. దర్శకుడు శివ నిర్వాణ పవర్ఫుల్ స్క్రిప్ట్ను రూపొందించారట. ‘‘రవితేజ మునుపెన్నడూ చేయని భిన్నమైన పాత్రని ‘ఇరుముడి’లో చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ మూవీకి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. ఆర్ఎఫ్సీలో... వరుస పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకెళుతున్న ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొంటున్నారట. ఆయనపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ఫుల్ పాత్రలో చూపించనున్నారట హను రాఘవపూడి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దసరా పండగకి ‘ఫౌజీ’ని గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. శంకర్పల్లిలో కల్కి... ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్గా ‘కల్కి 2898 ఏడీ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది.‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్ పాత్ర చేసిన కమల్హాసన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. తొలి భాగంలో అమితాబ్, కమల్కి ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవు. కానీ, ‘కల్కి 2898 ఏడీ 2’లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా కీలకం అట. ఈ నేపథ్యంలోనే శంకర్పల్లిలో వేసిన ప్రత్యేక సెట్లో ప్రస్తుతం అమితాబ్, కమల్ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. అజీజ్ నగర్లో... రామ్చరణ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్చరణ్కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రెండు చోట్ల జరుగుతోంది.హైదరాబాద్లో సమీపంలోని అజీజ్ నగర్లో, అదే విధంగా గచ్చిబౌలి సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు యూనిట్లతో ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నారు మేకర్స్. అజీజ్ నగర్లో రామ్చరణ్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అదే విధంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాలోని ముఖ్య తారాగణంపైనా పలు సీన్స్ తీస్తున్నారట. మార్చి 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి వాయిదా పడి ఏప్రిల్ 30కి ఫిక్స్ అయింది. ఈ మూవీకి సంగీతం: ఏఆర్ రెహమాన్. ముచ్చింతల్లో... నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దసరా’. ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 2023 మార్చి 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్ అందుకుంది. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మంచు మోహన్బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో నానీతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో జడల్ అనే మాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు యూనిట్ తొలుత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్. అజీజ్ నగర్లో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోపీచంద్ 33’ (వర్కింగ్ టైటిల్). సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో గోపీచంద్, రీతూ వర్మ, ఇతర నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకస్తున్నారట. ‘‘హిస్టారికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘గోపీచంద్ 33’.ఈ సినిమాలో గోపీచంద్ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయ్యారు. గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో సత్యవతిగా రీతూ వర్మ అద్భుతంగా నటిస్తున్నారు. భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని ఈ మూవీ ద్వారా ఆవిష్కరించబోతున్నారు సంకల్ప్ రెడ్డి. ఈ చిత్రం విజువల్ వండర్గా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.అన్నపూర్ణలో లెనిన్... అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అన్నపూర్ణ 7ఎకర్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది.అఖిల్, భాగ్యశ్రీ బోర్సేలతో పాటు చిత్రంలోని ప్రధాన తారగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట మురళీ కిశోర్. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం కోసం పొడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. అదే విధంగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘వారెవా వారెవా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కింది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ‘లెనిన్’ ఈ వేసవిలో విడుదల కానుంది. ముచ్చింతల్లో భోగి శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘ఎ బ్లడ్ ఫెస్ట్’ అన్నది ట్యాగ్లైన్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ పీడియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో శర్వానంద్పై ముఖ్యమైన సన్నివేశాలను రూపొందిస్తున్నారట సంపత్ నంది.ఫిబ్రవరి 6న శర్వానంద్ బర్త్డే సందర్భంగా ‘భోగి’ నుంచి విడుదల చేసిన ఆయన బర్త్ డే పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ‘‘భారీ పాన్–ఇండియన్ పీరియాడిక్ మూవీగా ‘భోగి’ని రూపొందిస్తున్నాం. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఒకటిగా ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు కనిపించని రస్టిక్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. తుక్కుగూడలో... ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో సాయిదుర్గా తేజ్తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సీన్స్ తీస్తున్నారు రోహిత్. ఈ సినిమా 2025 సెప్టెంబరు 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది. అయితే కొత్త రిలీజ్ డేట్ని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. పైన పేర్కొన్నటువంటి సినిమాలే కాదు. మరికొన్ని సినిమాలు కూడా హైదరాబాద్లో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
రష్మికకు గద్దర్ అవార్డ్.. ఆమె భర్త ఏమని పొగిడారంటే?
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్పూర్ వేదికగా జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించారు.అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్స్ అవార్డ్స్లో తన భార్య రష్మికకు ఉత్తమ నటిగా ఎంపికైంది. ది గర్ల్ఫ్రెండ్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు అవార్డ్ రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటూ తన ఇన్స్టాలో స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది చూసిన రష్మిక భర్త పోస్ట్కు రిప్లై ఇచ్చింది. విజ్జు.. నీకు గర్వంగా ఉందని చెప్పడాన్ని ప్రేమిస్తా అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరి పెళ్లి తర్వాత తొలిసారి ఒకరినొకరు అభినందించుకోవడం విశేషం. -
నేను చెప్పేది అదొక్కటే.. మా కుటుంబంలా మీకు జరగ్గకూడదు: ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఓ ఆస్పత్రి కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. నా కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా నాకు ప్రేమ అందించిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే జోర్డాన్లో పూర్తి చేశారు. ఈ షూట్లో ఎన్టీఆర్పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. అమెరికా- ఇరాన్ యుద్ధానికి ముందే డ్రాగన్ టీమ్ ఇండియాకు చేరుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ డ్రాగన్ లుక్లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అభిమానుల గురించి #NTR ❤️ ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం రుణపడి ఉంటా! 🙏నా అభిమానులందరికీ చెప్పేది ఒక్కటే...జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి...😊Follow 👉 @tupaki_official#JrNTR #PES #KIMSHospitals #NTRInBengaluru #LatestNews #Tupaki pic.twitter.com/93Ts08a971— Tupaki (@tupaki_official) March 8, 2026 -
'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. This Women’s Day is about accepting and embracing myself — in all the many shapes & sizes in different phases of my life. It isn’t always easy, but I’m motivated to make my health a priority, for my own wellbeing & for my family. 💛 pic.twitter.com/9NBdRIiQsH— Upasana Konidela (@upasanakonidela) March 8, 2026 -
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు.. వీడియో వైరల్
టాలీవుడ్ దంపతులు నాగచైతన్య, శోభిత ధూలిపాల ప్రముఖ ఆలయంలో పూజలు చేశారు. ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ జంట స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే వృషకర్మ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. #WATCH | Actor Naga Chaitanya, along with his wife Sobhita Dhulipala, visited the Shree Jagannath Temple at Puri, in Odisha, to seek the blessings of Lord Jagannath.Actor Naga Chaitanya says, "Jai Jagannath" (06.03) pic.twitter.com/VAhPmVmCpw— ANI (@ANI) March 6, 2026 Puri, Odisha : Actor Naga Chaitanyaprays at Shree Jagannath Temple. pic.twitter.com/utech7CQVF— News Arena India (@NewsArenaIndia) March 6, 2026 -
'నీ కొత్త ప్రయాణం చూస్తుంటే ఆనందంగా ఉంది'.. రామ్ చరణ్ స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్- నయనిక జంటకు మెగా హీరో రామ్ చరణ్ విషెస్ చెప్పారు. పెళ్లి వేడుకలో పాల్గొన్న చెర్రీ నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. అల్లు శిరీష్-నయనిక జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నయనికతో ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు శిరీష్ను అభినందించారు. మీ వైవాహిక జీవితం ఇద్దరికీ అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని రామ్ చరణ్ ఆకాంక్షించారు.కాగా.. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ వెడ్డింగ్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లోని కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్లో ఈ పెళ్లి వేడుక నిర్వహించారు. ఈ వెడ్డింగ్కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెళ్లికి హాజరైన రామ్ చరణ్ నూతన జంటను ఆశీర్వదించారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. So happy to see @AlluSirish begin this wonderful new journey with #Nayanika Wishing the both of you endless happiness, love and a blessed married life ❤️Congratulations ✨ pic.twitter.com/2FYRvGcNXX— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2026 -
శర్వానంద్ బైకర్ మూవీ.. మరో క్రేజీ సాంగ్ రిలీజ్
శర్వానంద్ హీరోగా వస్తోన్న రేసింగ్ చిత్రం బైకర్. ఈ సినిమాకు అభిలాష్ కంకర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్పై వంశీ–ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, ఈపీఐక్యూ, 4డీఎక్స్, పీసీఎక్స్ వంటి ప్రీమియం ఫార్మాట్లలోనూ విడుదల కానుంది.ఇప్పటికే ఓ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మరో లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. జిద్దీ జిద్దీ అంటూ సాగే ఈ పాట ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఈ పాటను కంపోజ్ చేసిన జిబ్రాన్ తానే ఆలపించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు. -
ఓ ఇంటివాడైన అల్లు శిరీష్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు నయనిక మెడలో మూడుముళ్లు వేశారు. వీరిద్దరి పెళ్లి వేడుక హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అల్లు శిరీష్- నయనిక కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. హీరో నితిన్ భార్య షాలినికి నయనిక బెస్ట్ ఫ్రెండ్ కావడం మరో విశేషం. వరుణ్తేజ్- లావణ్య తమ పెళ్లిలో నయనికతో శిరీష్కు పరిచయం ఏర్పడింది. అలా వీరిద్దరు డేటింగ్ కొనసాగించారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. అల్లు శిరీశ్ కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, బడ్డీ, ఊర్వశివో రాక్షసివో లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. -
ఫ్రైడే ఓటీటీ సినిమాల సందడి.. ఒక్క రోజే ఏకంగా 12 చిత్రాలు..!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో శ్రీ విష్ణు మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్కుమార్ సరస్వతి లాంటి సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి లాంటి చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయితే వీటిపై పెద్దగా బజ్ లేదు.ఇక ఓటీటీల విషయానికొస్తే విత్ లవ్, గాంధీ టాక్స్ అనే డబ్బింగ్ మూవీస్ సందడి చేయనున్నాయి. వీటితో పలు వెబ్ సిరీస్లు, చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయిపోయాయి. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు సడన్గా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఫ్రైడే ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.నెట్ఫ్లిక్స్ విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 హలో బచ్చోన్ (హిందీ సిరీస్) - మార్చి 06 వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 06బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06 స్టిల్ షైనింగ్(కొరియన్ వెబ్ సిరీస్)- మార్చి 06జియో హాట్స్టార్ విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) - మార్చి 06 టెడ్ సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- మార్చి 06సోనీ లివ్ లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ మూవీ) - మార్చి 06సన్ నెక్స్ట్ డియర్ రథి (తమిళ సినిమా) - మార్చి 06 గ్రానీ (తమిళ మూవీ) - మార్చి 06జీ5 గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 06 జబ్ కూలీ కితాబ్ (హిందీ మూవీ) - మార్చి 06 -
విరోష్ జంట రిసెప్షన్లో కనిపించని ఆ టాలీవుడ్ స్టార్స్.. అదే కారణమా?
విజయ్- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ ప్రేమజంట ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సందడి చేశారు. ఆ తర్వాత పెళ్లి ఫోటోలను విజయ్, రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే పెళ్లి తర్వాత విరోష్ జోడీ టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ వేడుక నిర్వహించింది. హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు యంగ్ హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.స్టార్స్ డుమ్మా..అయితే కొందరు స్టార్స్ ఈ రిసెప్షన్ వేడుకకు డుమ్మా కొట్టడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ, రామ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, నితిన్, కిరణ్ అబ్బవరం ఈ రిసెప్షన్లో ఎక్కడా కూడా కనిపించలేదు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు పెద్దగా బాండింగ్ లేకపోవడం వల్లే రాదని తెలుస్తోంది. మరోవైపు హీరో నితిన్ అందుబాటులో లేనని కొత్త జంటకు ముందే చెప్పినట్లు సమాచారం.అదే కారణమా?కొందరు టాలీవుడ్ స్టార్స్ విరోష్ రిసెప్షన్కు హాజరు కాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మిక స్వయంగా వెళ్లి ఆహ్వానించకోవపోవడమే కారణమని తెలుస్తోంది. పీఆర్ ఎజెన్సీ ద్వారా ఆహ్వానాలు పంపడం వల్లే కొందరు రాలేదని టాక్ వినిపిస్తోంది. పర్సనల్గా ఆహ్వానించలేదనే అసంతృప్తితోనే ఈ వేడుకలో పాల్గొనలేదని తెలుస్తోంది. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ ఈ రిసెప్షన్కు రాకపోవడం సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. -
మృత్యుంజయ్ సినిమా స్టోరీ లైన్ ఇదే: శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటో విష్ణు రివీల్ చేశారు. ఓ పాప కోసమే ఈ సినిమా అంతా కొనసాగుతుందని అన్నారు. ఆ పాప ఫాదర్ ప్లేస్లో నన్ను తీసుకుని జస్టిస్ కావాలనుకుందో.. ఆ ప్లేస్లో నేను పాపకు హీరో అని తెలిపారు. చైల్డ్ సెంటిమెంట్తో ఈ మూవీని తెరకెక్కించారు. గతంలో ఇదే సెంటిమెంట్లో డాడీ, బింబిసార, హాయ్నాన్న సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. #Daddy, #Bimbisara, #HiNanna సినిమాలు చైల్డ్ సెంటిమెంట్తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్బస్టర్స్గా నిలిచాయి.ఇప్పుడు అదే ఎమోషనల్ టచ్తో #Mrithyunjay కూడా వస్తోంది. - #VenkyAtluri - #SreeVishnu pic.twitter.com/05Ygjzrcva— CHITRAMBHALARE (@chitrambhalareI) March 4, 2026 -
'ప్రతి ఒక్కరికీ అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్పై ట్వీట్ చేశారు. తన తమ్ముడు అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందమైన జంటకు తమ ఆశీస్సులు కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు రావడం మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయానని అల్లు అర్జున్ రాసుకొచ్చారు.కాగా.. అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్ ఈ నెల 6న జరగనుంది. అంతకుముందే టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈనెల 2న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అల్లు స్టూడియోస్లో జరిగిన ఈ ఈవెంట్లో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. We would like to thank everyone who attended the pre-wedding reception and showered their blessings on the lovely couple. To all those sending their wishes from across the world, our hearts are filled with gratitude.Thank you for all the love and warmth. ALLU FAMILY. pic.twitter.com/0AtL6oCYIu— Allu Arjun (@alluarjun) March 4, 2026 -
మనశంకర వరప్రసాద్గారు మరో రికార్డ్.. అదేంటంటే?
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్గారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అభిమానులను మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.375 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది.తాజాగా మనశంకర వరప్రసాద్గారు మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ సినిమా 109 థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లు నిర్మాణం సంస్థ షైన్ స్క్రీన్స్ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జీ5 వేదికగా అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. హీరో వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో అలరించారు. ఈ మూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. 50 DAYS. 109 CENTRES. 🔥Thousands of celebrations 🥳Lakhs of whistles 😍Countless goosebumps ❤️🔥Megastar @KChiruTweets’s ALL-TIME REGIONAL INDUSTRY BLOCKBUSTER #ManaShankaraVaraPrasadGaru completes a sensational 50-day theatrical run, rewriting box office history 💥💥💥#MSG… pic.twitter.com/qFr1Pazn3k— Shine Screens (@Shine_Screens) March 2, 2026 -
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
దుబాయ్లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్లోనే ఉండిపోయింది. To everyone concerned about our safety, thank you. 🙏 We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026 -
రైరై రారా అంటోన్న రామ్ చరణ్.. పెద్ది సాంగ్ రిలీజ్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ను ఓ ఊపు ఊపేసింది.తాజాగా ఈ సినిమా నుంచి రైరై రారా అంటూ సాగే మరో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్ పాడారు. ఈ మోటివేషనల్ సాంగ్ను రెహమాన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.When grit finds its voice 🔥When grace finds its moves 🤩#Peddi Second Single #RaiRaiRaaRaa (Telugu) Out Now❤️🔥▶️https://t.co/yrdKeTtKJ9#PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026 pic.twitter.com/dHIWPRp8hR— PEDDI (@PeddiMovieOffl) March 2, 2026 -
ముందుగానే అంచనా వేశారు.. ఎస్కేప్ అయ్యారు.!
ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా జోర్డాన్ దేశంలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్,మాస్ యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు.తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ టీమ్ గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ మూవీ షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లిన టీమ్ ముందుగానే ఇండియాకొచ్చేసింది. వాస్తవానికి ఈ షెడ్యూల్ మార్చి మొదటి వరకు కొనసాగాల్సి ఉంది. కానీ కాస్తా తొందరగానే అక్కడి పరిస్థితులు అంచనా వేసిన డ్రాగన్ టీమ్ ఫిబ్రవరి 22 నాటికే షూటింగ్ పూర్తి చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. దీంతో ఈ దాడుల నుంచి ఎన్టీఆర్- నీల్ టీమ్ తృటిలో తప్పించుకుంది. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవేళ షూటింగ్ షెడ్యూల్ మరికొన్ని రోజులు పొడిగించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్తో పాటు యూనిట్ సభ్యులు చిక్కుకుపోయే ప్రమాదం ఉండేదని టాలీవుడ్ సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. -
దుబాయ్లో మంచు విష్ణు.. యుద్ధంపై మనోజ్ ట్వీట్
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. యుద్ధం అనేది మానవత్వాన్ని ఎప్పటికీ చూపదని అన్నారు. ఈ దాడుల్లో ఎంతోమంది అమాయకుల జీవితాలు నాశమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎవరూ కూడా సరిదిద్దలేరని పోస్ట్ చేశారు. ఇలాంటి హింసాత్మక పరిస్థితుల్లో దుబాయ్లో చిక్కుకుపోయిన అమాయక ప్రజలం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు మంచు మనోజ్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. ప్రపంచమంతా శాంతించాలని కోరుకుంటున్నట్లు ఫోటోను షేర్ చేశారు.కాగా.. ఇరాన్పై దాడి తర్వాత దుబాయ్ మిస్సైల్స్ వర్షం కురుస్తోంది. ప్రతీకార దాడుల్లో భాగంగా ఇరాన్ మిస్సైల్స్తో దుబాయ్పై దాడులు మొదలెట్టింది. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దుబాయ్లో పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. మంచు మనోజ్ సోదరుడు మంచు విష్ణు సైతం దుబాయ్లో ఉన్నానని మిస్సైల్స్ పడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సైతం దుబాయ్లో ఉన్నారు. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఆడేందుకు వెళ్లి ఆక్కడే చిక్కుకున్నారు. War has never elevated our humanity.When innocent lives suffer and fear replaces normalcy, no justification can make it right.Praying for the safety of innocent people in Dubai and everywhere affected by violence.#WorldWar3#Peace #humanity#Dubai #dubaiattack pic.twitter.com/nCBfkptaSy— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 1, 2026 -
నిర్మాతగా రామ్ చరణ్.. స్వయంగా ప్రకటించిన టాలీవుడ్ హీరో
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ స్వయంభు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన విజువల్స్తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ విజువల్స్ బాహుబలి రేంజ్లో ఉన్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన హీరో తన కొత్త సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తాను మూడు చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వయంభుతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు. స్వయంభు తర్వాత ఇండియా హౌస్ అనే సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీకి గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారని నిఖిల్ స్వయంగా ప్రకటించారు. ఆ తర్వా కార్తికేయ-3 కూడా వస్తుందని నిఖిల్ ఫ్యాన్స్కు గూస్ బంప్స్ తెప్పించేలా మాట్లాడారు. కాగా..స్వయంభు చిత్రంలో సంయుక్తమీనన్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ సుబ్బరాజు, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగాయ.. రవి బస్రూర్ సంగీతమందించారు. గ్లోబల్ స్టార్ మెగా పవర్ రామ్ చరణ్ - ఇండియా హౌస్ మూవీ ప్రొడ్యూసర్ #RamCharan #Nikhil #Swayambhu #Peddi pic.twitter.com/R9Q4rjvKkn— NAVEEN CHERRY 😎🤏 (@naveenpari2) February 28, 2026 -
ఫ్యాన్స్ అన్నదానం.. విజయ్- రష్మికపై వెల్లువిరిసిన అభిమానం
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026 -
తండ్రీ, కొడుకుల ఎమోషనల్ కథ.. సన్ ఆఫ్ మూవీ రివ్యూ
టైటిల్: సన్ ఆఫ్దర్శకుడు.. బత్తుల సతీష్ నిర్మాణ సంస్థ.. సైన్మా బ్యానర్విడుదల తేదీ.. ఫిబ్రవరి 27, 2026సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్. ఈ మూవీని బత్తుల సతీష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో వినోద్ కుమార్, మీరా రాజ్ కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజైంది. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ని ఆకట్టుకుందో లేదో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వెంకట్రావు (వినోద్ కుమార్) తన భార్య చనిపోవడంతో అన్నీ తానై తన కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రిని చూసుకుంటాడు. అయితే కొడుకు మాత్రం ఎప్పుడూ కూడా తండ్రీ ఆశలకు భిన్నంగా ప్రతీ సారి చదువుల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ఊర్లోనే అను (మీరా రాజ్)తో అతనికి చిన్నతనం నుంచి లవ్ ఉంటుంది. అను, ఆనంద్ ఆ ప్రేమకు అందరూ ఒప్పుకుంటారు. కానీ ఎంగేజ్మెంట్ టైమ్కి వెంకట్రావు అడ్డం తిరుగుతాడు. పనీ పాట లేని గాలికి తిరిగే తన కొడుకు ఎలా నచ్చాడు? అసలు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? అంటూ అందరి ముందు వెంకట్రావ్ పరువు తీస్తాడు. దీంతో వారసత్వంగా రావాల్సిన ఆస్తిని, ఇంటిని తనకు ఇప్పించండి అంటూ కన్న తండ్రి మీదే ఆనంద్ కేసు వేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఆస్తిని ఇచ్చేందుకు తండ్రి పెట్టిన కండీషన్ ఏంటి? చివరకు జీవితం విలువ, బరువు, బాధ్యతల గురించి ఆ కొడుకు తెలుసుకుంటాడా? తన ప్రేమను గెలిపించుకుంటాడా? అన్నదే స్టోరీ.ఎలా ఉందంటే..తండ్రీ కొడుకుల నేపథ్యంలో గతంలో చాలా కథలు వచ్చాయి. సన్ ఆఫ్ కథ కూడా ప్రేక్షకులకు కొత్తగా చూసిన ఫీలింగ్ కలగదు. కానీ ప్రస్తుతం ఉన్న యువతరానికి మేసేజ్ ఇచ్చేలా ఉంటుంది. ఎలాంటి బాధ్యత లేకుండా గాలికి తిరిగితే యువకుడి జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాల్ని చక్కగా ఈ కథలో చూపించాడు. జీవితంలో ప్రేమ, బంధాలు,బరువు,బాధ్యతల గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరముందనే కాన్సెప్ట్తో తీసిన సన్ ఆఫ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రీకొడుకుల మధ్య ఉండే దూరం.. హీరో గాలి తిరుగుడు, హీరోయిన్తో ప్రేమ ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. కథలో అసలు సంఘర్షణ, టర్నింగ్ పాయింట్ అంతా కూడా ఇంటర్వెల్ బ్లాక్కి వస్తుంది.కోర్ట్లో వినిపించే వాదనలు, తండ్రీ పెట్టే కండీషన్తో కథలో ఆసక్తి పెరుగుతుంది. ఆ తరువాత సెకండాఫ్లో బిడ్డను పెంచేందుకు ఆనంద్ పడే కష్టాలు, ఎమోషనల్ ట్రాక్తో కంటతడి పెట్టిస్తాయి. కథ చివర్లో వచ్చే ట్విస్ట్ అందరినీ షాక్కు గురి చేస్తుంది. అయితే చివరకు ఓ పూర్తి సంతృప్తికరమైన సినిమాని చూశామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగేలా చేస్తుంది.ఎవరెలా చేశారంటే..సాయి సింహాద్రి ఆనంద్ అనే పాత్రలో ఒదిగిపోయాడు. తొలి సినిమా అన్న ఫీలింగ్ లేకుండా అన్ని రకాల ఎమోషన్స్ పండించాడు. ఇక తండ్రి పాత్రలో వినోద్ కుమార్ మెప్పించారు. కొత్త హీరోయిన్ మీరా రాజ్.. అను అనే పాత్రలో అద్భుతంగా నటించింది. మిగిలిన పాత్రల్లో అందరు కూడా తమ పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూసుకుంటే సంగీతం, విజువల్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఫీల్ గుడ్ మ్యూజిక్తో సాగే పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. గ్రామీణ వాతావరణాన్ని తెరపై మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ.. ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్ రిలీజ్
పవన్ కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతోన్న లేటేస్ట్ మూవీ పురుషః. ఈ చిత్రంలో అనైరా గుప్తా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్లో భాగంగా రిలీజైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్ను మెప్పించాయి.తాజాగా ఈ చిత్రం నుంచి దేవ నాయకి అంటూ సాగే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. ఈ మూవీకి షూటింగ్ ఇప్పిటికే పూర్తి కాగా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ , వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. -
హైదరాబాద్లో అడుగుపెట్టిన విరోష్ జంట.. వీడియో వైరల్
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత భాగ్యనగరంలో అడుగుపెట్టారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరిద్దరి వివాహ వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట.అంతకుముందు ఇవాళ ఉదయం ఈ జంట ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఈ కొత్త ఈ జోడిని చూసిన వారందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో విజయ్, రష్మికలు అక్కడ ఉన్న ప్రేక్షకులకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026 -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. అందరి ఫోకస్ వాటిపైనే..!
విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఉదయ్పూర్ వేదికగా ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉదయం పదిగంటల పది నిమిషాలకు విజయ్ దేవరకొండ.. రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విరోష్ జంట.ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్స్ వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పెళ్లిలో వీరిద్దరు ధరించిన నగలపై పడింది. రాయల్ లుక్లో కనిపించిన ఈ నగలే వీరు షేర్ చేసిన ఫోటోలు హైలెట్గా నిలిచాయి. దీంతో నెట్టింట వాటి గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ఉదయ్పూర్లో జరిగిన ఈ వేడుకలో విరోష్ జంట ధరించిన నగలు హైలెట్గా నిలిచాయి. రష్మిక నక్షీ వర్క్ నగలు రాజసం ఉట్టిపడేలా కనిపించాయి. విజయ్ దేవరకొండ ధరించిన క్లాసిక్ గోల్డ్ జ్యూవెలరీ కూడా అచ్చం రాజులు ధరించినట్లుగా మెరిసిపోయింది. అలా గ్రాండ్ రాయల్ లుక్తో వీరిద్దరు తమ వెడ్డింగ్ను సెలబ్రేట్ చేసుకున్నారు. -
కిరణ్ అబ్బవరం కుమారుడి కేశఖండన వేడుక.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది తండ్రిగా ప్రమోషన్ పొందారు. హీరోయిన్ రహస్య గోరఖ్ను పెళ్లాడగా.. వీరిద్దరికి పండంటి బాబు పుట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఈ జంట తమ ముద్దుల కుమారుడికి కేశఖండన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కిరణ్, రహస్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటించిన ‘రాజావారు రాణిగారు’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో 2024 ఆగస్ట్ 22న వీరిద్దరి వివాహం జరిగింది. గతేడాది జనవరిలో ప్రెగ్నెన్నీ విషయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.ఇక సినిమాల విషయానికొస్తే కిరణ్ అబ్బవరం గతేడాది క, కె-ర్యాంప్ చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా , జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథతో, అద్భుతమైన విజువల్స్తో మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు.కిరణ్ అబ్బవరం తన కుమారుడు హనుఅబ్బవరం పుట్టి వెంట్రుకలు కార్యక్రమంలో తన గ్రామ సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, తన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దనే అందమైన సందేశం ఇచ్చారు.👌@Kiran_Abbavaram #chennailovestory ♥️ pic.twitter.com/4rpBfu9d8w— Kakinada Talkies (@Kkdtalkies) February 26, 2026 -
అల్లు వారి పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మరో పెళ్లి సంబురం మొదలు కానుంది. రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి అయిపోయిన వెంటనే మరో టాలీవుడ్ హీరో పెళ్లికి అంతా సిద్ధమైంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల దుబాయ్లో శిరీష్- నయనిక గ్రాండ్గా బ్యాచిలర్ పార్టీ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన పెళ్లి వేడుకకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మార్చి 2న తెలుగు చిత్ర పరిశ్రమ సభ్యులతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు చేసుకోబోతున్నట్లు ట్వీట్ చేశారు. అల్లు స్టూడియోస్లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతాయని వెల్లడించారు. మా ప్రీ వెడ్డింగ్ వేడుకలను ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి సంతోషిస్తున్నామని అల్లు శిరీష్ పోస్ట్ చేశారు.కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనికకు అందరి సమక్షంలో ఉంగరం తొడిగాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. శిరీష్- నయనికల వివాహం మార్చి 6న జరగనుంది. Nayanika & I are having an intimate wedding with family & friends on 6th March. We are excited to celebrate our Pre Wedding Celebrations with the Telugu film industry prestigiously at Allu Studios on the 2nd March.— Allu Sirish (@AlluSirish) February 26, 2026 -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. సెకండ్ సింగిల్ అప్డేట్
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీని ఉత్తరాంధ్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మార్చి రెండో తేదీన ఈ మాస్ సాంగ్ను విడుదల చేస్తామని డైరెక్టర్ ట్వీట్ చేశారు. నీ అయ్య వడ్డీ... నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే.. రై రై రారా రై రై రారా అంటూ సాగే పాట ఆడియన్స్ను అలరించనుంది.కాగా.. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. ఈ పాటకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఆడియన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. కాగా.. ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. నీ అయ్య వడ్డీ...నీ బిడ్డ కడితే… నువ్వేమి పొడిచావనే!! రై రై రారా రై రై రారా… 🔥🔥🔥COMING SOON… Nee Ayya Vaddee… Nee Bidda Kadithe…Nuvvemi Podichaavanee… RAI RAI RAA RAA🔥🔥🔥This is the anthem of GRIT, GUTS & GLORY 🔥🔥🔥#Peddi second single #RaiRaiRaaRaa out… pic.twitter.com/Xzruw0SZPh— BuchiBabuSana (@BuchiBabuSana) February 26, 2026 -
రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..!
స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్మెన్ థియేటర్లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. “First Telugu movie I watched was #Businessman. I went to theatre with my father” - #RashmikaMandanna 🔥#MaheshBabu | #Varanasi pic.twitter.com/4d1xb3PWK2— VardhanDHFM (@_VardhanDHFM_) February 26, 2026 -
గ్రాండ్గా విజయ్-రష్మిక పెళ్లి.. అతిథుల నోరూరించే స్పెషల్ వంటకాలు ఇవే.. !
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్కు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.అయితే ఇంతలా గ్రాండ్ వెడ్డింగ్ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్ వెడ్డింగ్లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్, మైసూర్ పాక్ అతిథులకు రుచి చూపించారు. -
అక్కినేని నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న లేటేస్ట్ మూవీ వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విరూపాక్ష గ్లింప్ల్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. వచ్చేనెల ఐదో తేదీన వృషకర్మ గ్లింప్స్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు నాగచైతన్య ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేశారు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. When sinister energy awakens, A warrior is chosen. #VrushakarmaGlimpse on MARCH 5th, 2026 ❤️🔥The much anticipated world of #VRUSHAKARMA opens in all its fury, fire, and fear 💥💥💥Yuvasamrat @Chay_akkineni like never before in @karthikdandu86’s vision 🔥 @Meenakshiioffl… pic.twitter.com/k7Rk4uoVEx— Annapurna Studios (@AnnapurnaStdios) February 25, 2026 -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ జిందగీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజైంది. ఈ సందర్భంగా మృత్యుంజయ్ టీమ్కు రామ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ పాటకు అభినవ కవి, కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. ఆదిత్య అయ్యంగారు పాడారు. ఈ పాటను కాల భైరవ కంపోజ్ చేశారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం మార్చి 6న థియేటర్లలో సందడి చేయనుంది. Happy to launch the first single of #Mrithyunjay - #EeZindagi ❤️🔥The trailer also looked intriguing..Looking forward to seeing @sreevishnuoffl in @hussainshakiran ‘s thriller. Wishing them all the very best for Mrithyunjay coming on March 6th! ❤️Check the song out now!… pic.twitter.com/uSjXSaPIfY— RAm POthineni (@ramsayz) February 25, 2026 -
విజయ్- రష్మిక పెళ్లి వేడుక.. తాళికట్టు శుభవేళ ఇదే
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట రష్మిక- విజయ్ దేవరకొండ మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. విజయ్- రష్మిక ఈనెల 26న మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఆన్ స్క్రీన్లో ఇప్పటికే పెళ్లి పీటలెక్కిన ఈ జంట.. రియల్ లైఫ్లోనూ వివాహం చేసుకోబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.ముహుర్తం ఫిక్స్..ఫిబ్రవరి 26న అంటే గురువారం విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుంది. ఉదయం ఏడున్నర గంటలకు బరాత్ కార్యక్రమం ఉంటుందని సన్నిహితులు తెలిపారు. రేపు ఉదయం 10.10 నిమిషాలకి తెలుగు సాంప్రదాయం ప్రకారం వివాహ ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే అదే సమయానికి రష్మిక మెడలో మూడు ముళ్లు వేయనున్నారు విజయే దేవరకొండ. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నడలో కొడవ సాంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ కార్యక్రమం జరగనుంది. అంటే రెండు పద్ధతుల్లో వీరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరగనుంది. ఈ క్షణం కోసమే విజయ్- రష్మిక ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. -
విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్..!
టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్ జంట మరికొన్ని గంటల్లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఉదయ్పూర్లో ఫుల్గా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. కొన్నేళ్లుగా ఎక్కడా బయటపడుకుండా రిలేషన్లోన్న విజయ్- రష్మిక ఈనెల 26న పెళ్లిబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్తాన్లోని ఉదయ్పూర్లో ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది.అయితే సెలబ్రిటీల పెళ్లి సందడి మామూలుగా ఉండదు. ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతారు. గతంలో విరాట్- అనుష్క, దీపిక-రణ్వీర్ సింగ్ సైతం తమ పెళ్లికి అత్యంత సీక్రెట్గా జరుపుకున్నారు. దీనికోసం నో మొబైల్ పాలసీని అత్యంత కఠినంగా అమలు చేశారు. ఇప్పుడదే బాటలో రష్మిక- విజయ్ జంట కూడా పెళ్లి వేడుకను జరుపుకుంటోంది. స్టార్ కపుల్ ఫాలో అవుతోన్న ఈ పద్ధతి ఓ అందమైన పేరు కూడా ఉంది. ఈ నో మొబైల్ పాలసీ సంప్రదాయాన్ని అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తారు.అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే..?అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అంటే పెళ్లికి వచ్చిన అతిథులందరూ కూడా తమ మొబైల్స్ స్విచ్ఛాఫ్ చేసి అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించాలి. ఎవరు కూడా ఫోటోలు తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టడానికి వీలుండదు. అంతే కాకుండా ముందువరుసలో కూర్చొని ఫోన్లలో పెళ్లి ఫోటోలు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు. పెళ్లికి సంబంధిచిన ఫోటోలు, వీడియోలు ఆ జంట షేర్ చేసేవరకు సోషల్ మీడియాలో కనిపించవు. ఈ పద్ధతినే అన్ప్లగ్డ్ వెడ్డింగ్స్ అని పిలుస్తున్నారు. లైఫ్లో చాలా ముఖ్యమైన ఈ క్షణాలను అత్యంత ప్రైవసీగా నిర్వహించాలనేది సెలబ్రిటీ వధూవరుల కోరిక. వారు మాత్రమే ఫస్ట్ ఈ వేడుక పిక్స్ పంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే. దీంతో స్టార్ కపుల్ వివాహ వేడుకల్లో ఇదొక ట్రెండ్గా మారిపోయింది.ఈ వెడ్డింగ్ ప్రైవసీ అన్ప్లగ్డ్ ట్రెండ్ అనుష్క-విరాట్ కోహ్లీ పెళ్లి సమయంలో మొదటిసారి వైరలైంది. ఆ తర్వాత 2018లో ఇటలీలో పెళ్లి చేసుకున్న దీపిక-రణ్వీర్ సింగ్ కూడా నో ఫోన్ పాలసీని అమలు చేశారు. అంతేకాకుడా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్, కత్రినాకైఫ్-విక్కీ కౌశల్, ఆలియా భట్-రణ్బీర్ కపూర్ సైతం ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. తాజాగా విరోష్ పెళ్లిలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. -
పెళ్లిలో అల్లు అర్జున్ సతీమణి సందడి.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఓ పెళ్లి వేడుకలో సందడి చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బంధువుల పెళ్లికి ఆమె హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డితో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. కాగా.. బన్నీని స్నేహారెడ్డి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణె కనిపించనుంది. ఈ మూవీ షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో పెళ్లికి వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి pic.twitter.com/fKmHCFaLYs— Telangana365 (@Telangana365) February 25, 2026 -
రియల్ క్రైమ్ స్టోరీగా వస్తోన్న కాక్రోచ్.. రిలీజ్ డేట్ ఫిక్స్
అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం కాక్రోచ్. ఈ సినిమాకు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ..' సునీల్ కుమార్ రెడ్డితో మా కాంబినేషన్లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణ సమయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. మార్చి 6వ తేదీన మా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. రొటీన్ సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు మా మూవీ కొత్తదనం ఇస్తుందని' అన్నారు.డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. - 'నేను జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశా. పాత్రికేయుడిగా నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో దర్శకుడిగా మారా. ఆ క్రమంలోనే ఈ కాక్రోచ్ అనే చిత్రాన్ని రూపొందించా. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్ మెంట్ వారి సపోర్ట్ నా సహచర పాత్రికేయ మిత్రుల సహకారం తీసుకున్నా. అనేక కేసులను స్టడీ చేశాను. నేరస్థులతో కూడా చాలా విషయాలు అడిగి ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకున్నాను. విశాఖ, గాజువాక ప్రాంతంలో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించా. రోడ్డు మీద ఉండే వేశ్యకు, ఒక క్రిమినల్కు మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించా. డార్క్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రం రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది' అని. అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి, రామన్, బుగత, అంజి, ప్రదీప్, సముద్రం వెంకటేశ్, మల్లిక, ఎఫ్.ఎమ్. బాబాయ్, తాటికొండ ప్రసాద్, సునీత, రాజు, బాలాజీ, ఎల్ బీ రమణ కీలక పాత్రల్లో నటించారు. -
రాధిక శరత్కుమార్ డిఫరెంట్ రోల్ మూవీ.. ఆసక్తిగా ట్రైలర్
సీనియర్ నటి రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం తాయ్ కిజవి. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడు కనిపించని లుక్లో రాధికా కనిపించనుంది. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని హీరో శివ కార్తికేయన్ నిర్మించారు. ఈ చిత్రంలో రాధిక శరత్కుమార్ వృద్ధురాలిగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ప్రస్తుతానికి కేవలం తమిళంలోనే రిలీజ్ కానుంది. తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేసే విషయంపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రంలో సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
గోవాలో నాగచైతన్య సందడి.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్కు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో తన మోటార్స్పోర్ట్స్ టీమ్ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్కు మద్దతుగా పాల్గొన్నారు. రౌండ్-4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్లో తమ డ్రైవర్లను ఉత్సాహపరుస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. తండేల్ సూపర్ హిట్ తర్వాత సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. Yuvasamrat @chay_akkineni Cheering for his team #HyderabadBlackBirds at the #GoaStreetRace2026 🔥💨#IndianRacingLeague pic.twitter.com/BB4EZZ4wCa— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 22, 2026 -
ఈ అవార్డ్ వారికే అంకితమిస్తున్నా: అల్లు అర్జున్
పుష్ప-2 మూవీకి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఇంత అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు ఫిల్మ్ఫేర్కు ధన్యవాదాలు తెలిపారు. నన్ను ఇంతలా ప్రేమించే దేశంలో అవార్డ్ స్వీకరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు తానెప్పుడు విధేయుడినని ట్వీట్ చేశారు. ఈ అవార్డ్ను హద్దుల్లేని నా అభిమానుల ప్రేమకు అంకితం చేస్తున్నట్లు బన్నీ ప్రకటించారు.కాగా..కేరళలోని కొచ్చిన్లో జరిగిన 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో ఐకాన్స్టార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. 2024లో విడుదలైన పుష్ప-2 చిత్రానికి ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, బెస్ట్ మ్యూజిల్ ఆల్బమ్కు దేవీశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో రామకృష్ణ అండ్ మోనిక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2024లో ఉత్తమ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఐదు విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కొల్లగొట్టింది. Thank you, Filmfare, for this wonderful honour. It’s my absolute pleasure to receive it in a land where I am loved in such a unique way. I’m humbled by everyone’s blessings, and I dedicate this award to all my fans for their infinite love. 🖤 pic.twitter.com/EYPdC9BJl9— Allu Arjun (@alluarjun) February 22, 2026 -
ప్రభాస్ ఆల్టైమ్ ఫేవరేట్ మూవీ ఏంటో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫౌజీ తర్వాత స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఇటీవల కపుర్ ఫ్రెండ్లీ టీమ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ప్రభాస్.కపుల్ ఫ్రెండ్లీ టీమ్కు ఇచ్చిన ఇంటర్వ్వూలో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ గురించి మాట్లాడారు. నాగార్జున, గిరిజా షెట్టర్ జంటగా నటించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి అని తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రం ఎన్నిసార్లు చూసినా.. మళ్లీ చూడాలనిపించే చిత్రమన్నారు.తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రేమకథా చిత్రాల్లో 'గీతాంజలి' ఒకటి. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. 1989లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా మణిరత్నం దర్శకత్వం వహించిన ఒకే ఒక్కతెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా హీరో, హీరోయిన్లుగా ఇద్దరికీ ఫేమ్ తీసుకొచ్చింది. -
శ్రీ విష్ణు మృత్యుంజయ్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. ఇటీవలే మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.అయితే అదే రోజు విష్ణు హీరోగా నటించిన విష్ణు విన్యాసం కూడా రిలీజ్ కానుంది. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేయడమేంటని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంలో ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా శ్రీవిష్ణు తన ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు సినిమాలు ఓకే రోజు రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. మృత్యుంజయ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ను రివీల్ చేశారు. ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుందని పోస్టర్ను పంచుకున్నారు. దీంతో శ్రీ విష్ణు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. Release date marindhi, thrillu kaadhu🔥Meet #MrithyuNjay in cinemas from March 6th❤️🔥 pic.twitter.com/vrKKwW0Ijo— Sree Vishnu (@sreevishnuoffl) February 20, 2026 -
ప్రశాంత్ వర్మ- ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?.. అసలు నిజమేంటి?
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడితో ఫౌజీ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, కల్కి-2, సలార్-2 చిత్రాలు చేయనున్నారు. తన చేతిలో ఏకంగా నాలుగు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి రెండేళ్లకు పైగానే సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవీ కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ మూవీకి రెబల్ స్టార్ ఓకే చెప్పిన సంగతి తెలిసింది.ఇన్నీ భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రభాస్ చేతిలో ఉండగా.. ప్రశంతా వర్మతో సినిమా చేసేందుకు టైమ్ కేటాయిస్తారా అన్న సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్తో ప్రాజెక్ట్ రద్దైనట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సిన మూవీ ఆగిపోయిందని టాక్ వినిపించింది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ గురించి తెగ ఆరా తీస్తున్నారు. నిజంగానే ఈ సినిమా ఆగిపోయిందా అని షాకవుతున్నారు.ప్రశాంత్ వర్మ క్లారిటీ..ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందన్న వార్తలపై డైరెక్టర్ స్వయంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇలాంటివీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తాయని అన్నారు. ప్రభాస్తో ప్రాజెక్ట్ రద్దు కాలేదని.. ఆయన సినిమాలతో బిజీగా ఉండడం వల్లే ఆలస్యం కానుందని తెలిపారు. స్పిరిట్, కల్కి 2 వంటి భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతే తప్ప తమ ప్రాజెక్ట్ రద్దు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్, కల్కి-2 సినిమాలు చేయనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాత, అతను ప్రశాంత్ వర్మతో కలిసి పని చేసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్-ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అర్థమవుతోంది. ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ చిల్ అవుతూ అప్డేట్స్ కోసం వేచి చూడటమే. జై హనుమాన్తో బిజీగా ప్రశాంత్ వర్మమరోవైపు ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ సీక్వెల్తో బిజీగా ఉన్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో జై హనుమాన్ తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ నెల 22న హంపిలో ప్రారంభం కానుందని సమాచారం. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యంగ్ హీరోకు ఫోన్ నంబర్.. స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్..!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే కపుల్ ఫ్రెండ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ చూసిన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.ప్రభాస్ అన్న ప్రశంసలు తమ చిత్రానికి రావడంపై సంతోశ్ శోభన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్న రివ్యూతో మా మూవీ సక్సెస్ అయినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ టీమ్తో రెబల్ స్టార్ ప్రభాస్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంతోశ్ శోభన్కు ప్రభాస్ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అన్న ఫోన్ నంబర్ నా వద్ద లేదని.. నీకు నేను అభిమానిని మాత్రమేనని శోభన్ చెప్పగా.. ప్రభాస్ తన నంబర్ ఇచ్చాడు. ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కాల్ చెయ్.. అనవసరంగా చేస్తే తంతా అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్..ఈ చిట్ చాట్లో ప్రభాస్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ షూటింగ్ ముంబయిలో జరుగుతున్న సమయంలో జరిగిన సంఘటనను వివరించారు. ఆ రోజు ఓం రౌత్కు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తానని చెప్పానన్నారు. చెన్నై నుంచి ఆహారం ఆర్డర్ చేసి ముంబయికి ఫ్లైట్లో తెప్పించినట్లు వెల్లడించారు. మన హైదరాబాద్ బిర్యానీ ఓకే కానీ.. చెన్నై ఫ్లేవర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని ప్రభాస్ అన్నారు. ఇది విన్న ఔం రౌత్ నీలాంటోడిని ఎక్కడా చూడలేదని అన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ అన్న ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు...#Prabhas: "దా నా నెంబర్ ఇస్తా...Important అయితేనే Call చెయ్..ఊరికే చేసావ్ అనుకో తంతా 🤣👌🏻" pic.twitter.com/ldbMr8hnIS— Movies4u Official (@Movies4u_Officl) February 20, 2026 -
'రామ్ చరణ్కు అది చాలా ఇష్టం.. వద్దన్నా వినేవాడు కాదు': సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ బర్త్ డే కావడంతో చిరు స్పెషల్ విషెస్ తెలిపారు. ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు.. అలాగే తన విజయం వెనక కూడా భార్య సురేఖ ఉందన్నారు మెగాస్టార్. ఈ సందర్భంగా భార్యపై ప్రేమతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా పెళ్లి జరిగిందని.. అప్పటినుంచి తనే నాకు ప్రధాన బలంగా మారందని చిరంజీవి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. సురేఖ బర్త్ డే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్దఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేఖ..తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడని తెలిపింది. అస్సలు అల్లరి చేసేవాడు కాదని.. టీనేజ్ వచ్చాక కొంచెం అల్లరి చేసేవాడని వెల్లడించింది. చరణ్కు కిల్లీ అంటే చాలా ఇష్టమని తెలిపింది. కిల్లీ చిన్నపిల్లలు వేసుకోవద్దని చెబితే.. పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్గా అక్కడే నిల్చుని తినేవాడని సురేఖ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. Wishing you a Very Happy Birthday Surekha Amma Garu ❤️❤️@AlwaysRamCharan https://t.co/e7nZ2cjUqf pic.twitter.com/cCdfuUUY73— Team Charanism (@TeamCharanism) February 18, 2026 -
ఎవరైనా అబ్బాయితో నాకు పెళ్లి చేస్తావా?.. విష్ణు విన్యాసం టీజర్ చూశారా?
శ్రీ విష్ణు హీరోగా వస్తోన్న లేటేస్ మూవీ విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా విష్ణు విన్యాసం మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విష్ణు.. నీకు తెలిసిన అబ్బాయిల్లో ఎవరినైనా ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? అనే డైలాగ్ ఈ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రాధన్ సంగీతమందించారు. -
ఈ రోజుల్లో నిర్మాతకు విలువే లేదు: దిల్ రాజు ఆవేదన
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేకుండా పోయిందన్నారు. నిర్మాత అంటే ఇచ్చేవాడని... అందరూ తీసుకునేవాళ్లేనని అన్నారు. ఈ రోజుల్లో తీసుకునేవాళ్లే.. ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ఉందని వెల్లడించారు. ప్రముఖ నిర్మాత అంటే అట్లూరి పూర్ణచంద్రరావు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న దిల్ రాజు మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ రోజుల్లో నిర్మాతలకు విలువ లేదు. రజినీకాంత్ చెప్పినట్లు నిర్మాత అంటే ఇచ్చేవాడు.. అందరూ తీసుకునేవాళ్లే. అప్పట్లో అట్లూరి పూర్ణచంద్రరావు లాంటి నిర్మాతలు ఉన్నారు. నా దిల్ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటే రైట్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పా' అని అన్నారు. నిర్మాతకు ఈరోజు విలువ లేదు...నిర్మాత అంటే ఇచ్చేవాడు... అందరూ తీసుకునేవాళ్లు...తీసుకునేవాళ్లే ఈరోజు ఇచ్చేవాళ్లను శాసించే లెవెల్లో సినిమా ఇండస్ట్రీ ఉంది.-#DilRaju pic.twitter.com/RZ0Ophb5tn— M9 NEWS (@M9News_) February 18, 2026 -
'45 ఏళ్ల ప్రేమాభిషేకం.. లక్షలాది హృదయాల్లో జీవించే ఉంటారు'
తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో రిలీజైన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు అక్కనేని వెంకట్, అక్కినేని నాగార్జున నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఐకానిక్ మూవీలో శ్రీదేవి హీరోయిన్గా నటించింది..నేటితో ఈ మూవీ రిలీజై నేటికి 45 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 'ప్రేమకు నిర్వచనం… త్యాగానికి ప్రతీక… సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ చారిత్రాత్మక బ్లాక్బస్టర్ మూవీ 45 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామని తెలిపింది. ఈ సినిమా రికార్డులు, భావోద్వేగాలు, ప్రభావం నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని ట్వీట్ చేసింది. లక్షలాది హృదయాల్లో ఏఎన్నార్ ఎప్పటికీ జీవించే ఉంటారని ట్వీట్లో వెల్లడించింది.ప్రేమకు నిర్వచనం…త్యాగానికి ప్రతీక…సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨A timeless legacy of the legendary #ANR garu that… pic.twitter.com/Ifcorr71DG— Annapurna Studios (@AnnapurnaStdios) February 18, 2026 -
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్గా నిలిచిందని టీమ్ను అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్తో సైలెంట్ హిట్గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్ హిట్గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్లో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్తోనే సక్సెస్ వచ్చింది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్సంగీతమందించారు. -
సొంతిల్లు లేదు.. అకౌంట్లో రూ.50 వేలు చూడటం నా కల: విశ్వక్ సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలే రోటిన్ భిన్నంగా కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో వచ్చి ఫంకీ లవర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. కేవలం ఫన్ కోసమే ఈ మూవీ తీశామని నిర్మాత నాగవంశీ కూడా సక్సెస్ మీట్లో ప్రకటించారు. ఈ మూవీతో సూపర్ హిట్ కొట్టకపోయినా.. ఓకేలా అనిపించేశాడు విశ్వక్ సేన్. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి ఈ మూవీతో విశ్వక్ సేన్ అలరించిన తీరు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మా నాన్న మొదట్లో పిల్లలకు కరాటే నేర్పించేవారని తెలిపారు. దానివల్ల ఎక్కువ డబ్బులు రావడం లేదని కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. నా హైయర్ ఎడ్యుకేషన్కు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని డిగ్రీతో సరిపెట్టుకున్నారని వెల్లడించారు.నేను పుట్టినప్పుడు మాకు సొంతిల్లు కూడా లేదని విశ్వస్ సేన్ తెలిపారు. ఒకానొక సమయంలో నా అకౌంట్లో రూ.50 వేలు చూడడం ఓ కల అన్నారు. హిట్ సినిమాకు అడ్వాన్స్ బ్యాంక్లో పడే వరకూ తన అకౌంట్లో అంత డబ్బు ఎప్పుడూ చూడలేదని గుర్తుచేసుకున్నారు. ఫలక్నుమా దాస్ రిలీజ్ అయిన తర్వాతనే మొదటిసారి నా అకౌంట్లో లక్ష రూపాయలు చూశానని గుర్తు చేసుకున్నారు. అంతకుముందే హిట్ సినిమాకు అడ్వాన్స్ రూ.50 వేలు బ్యాంక్ ఖాతాలో చూసి చాలా సంతోషించానని తెలిపారు. -
మెగాస్టార్ చేతికి పట్టీ.. అసలు విషయం ఇదే
తనకు సర్జరీ జరిగిందని చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అల్లు శిరీశ్ నుంచి వెడ్డింగ్ కార్డ్ అందుకునే సమయంలో చేతికి పట్టీ వేసుకుని మెగాస్టార్ కనిపించారు. దీంతో చిరు ఏమైందని ఫ్యాన్స్తో పాటు పలువురు ఆరా తీశారు. తాజాగా సర్జరీ జరిగిన విషయాన్ని మెగాస్టార్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ..' నా చేయి పట్టీ గమనించిన తర్వాత చాలా మంది శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇది కేవలం ఒక చిన్న భుజం కీ హోల్ సర్జరీ. నేను బాగా కోలుకుంటున్నా. ఇప్పటికే నా దినచర్య తిరిగి ప్రారంభించా. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన డాక్టర్ నితిన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడంలో ఆయన శ్రద్ధ, నైపుణ్యం అద్భుతం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. Several well-wishers have enquired about my health after noticing the arm sling.It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026 -
'డబ్బులు రాలేదని శనగలు తిందామన్నారు'.. వీకే నరేశ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. సంక్రాంతికి వచ్చిన నారీ నారీ నడుమ మురారితో హిట్ కొట్టిన నరేశ్.. ప్రస్తుతం సుహాస్ హీరోగా వస్తోన్ హే బల్వంత్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్మీట్కు హాజరైన వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన మాట్లాడారు. ఓ సినిమా షూటింగ్కు ఊటి వెళ్లిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అమ్మగారు, కృష్ణగారు ఇద్దరు కూడా పదిమందిని కలుపుకుపోయే తత్వమని చెప్పారు. సాంగ్స్ షూటింగ్ కోసం ఊటికి వెళ్లగా.. కృష్ణ గారు చేసిన పని నాకు ఎప్పటికీ గుర్తుండిపోయిందని అన్నారు. అప్పట్లో మనీ ట్రాన్స్ఫర్ లాంటివేవి ఉండేవి కావని నరేశ్ తెలిపారు.ఆ షూటింగ్కు వెళ్లిన సమయంలో నిర్మాతకు డబ్బులు రావడం ఆలస్యమైందని నరేశ్ తెలిపారు. అప్పట్లో కేవలం క్యాష్ మాత్రమే చెలామణిలో ఉండేదని..టైమ్కు డబ్బులు అందలేదని అన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు స్నాక్స్ తినాలంటే నిర్మాత దగ్గర డబ్బులు లేవు.. అప్పుడు కృష్ణగారు ఓ మాట అన్నారని తెలిపారు. అందరం ఈ రోజు శనగలు తిందాం.. డబ్బులు నేను ఇస్తాను అని షూటింగ్ ఆగనివ్వకుండా చేశారని నరేశ్ గుర్తు చేసుకున్నారు. నిర్మాత బాగుంటేనే మనందరం బాగుంటామని చెప్పారని అన్నారు. విజయ్- కృష్ణ అంటే ఒకటేనని.. రెండు కాదని నరేశ్ ప్రశంసించారు.నిర్మాత దగ్గర డబ్బులు లేకపోతె ట్రైన్లో సెనగలు తిందాం అంటూ షూటింగ్ ఆగనివ్వకుండా చేసారు.సింప్లిసిటీ కి మారో పేరు కృష్ణ గారు...- Actor #Naresh !#HeyBhalwanth pic.twitter.com/wMgWkQpYed— Karthikuuu (@Anchor_Karthik_) February 16, 2026 -
ఎర్రబస్సు ఎక్కా.. ఒక్కరు గుర్తుపట్టలేదు : జగపతి బాబు
సింపుల్ లైఫ్ని లీడ్ చేసే అదికొద్ది మంది నటుల్లో ఒకరు జగపతి బాబు. ఒప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. అలాగే పలు చిత్రాల్లో సహయ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే హీరోగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. షూటింగ్ అయితేపోతే చాలు.. సాధారణ వ్యక్తిలాగే జీవిస్తాడు. సమయం దొరికితే ఒక్కడే రోడ్డుపై నడచుకుంటూ వెళ్తాడు. చుట్టూ ఉన్నవాళ్లతో సరదాగా మాట్లాడతాడు. అంతేకాదు సెట్లో కూడా చాలా అల్లరి చేస్తాడని తోటి నటీనటులు చెబుతుంటారు. మెమోరీస్గా ఉండాలంటూ కొన్ని అల్లరి పనులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చేసిన అల్లరి పనుల గురించి చెప్పాడు జగపతి బాబు. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక అల్లరి పని చేసి పోలీసు స్టేషన్కి వెళ్లి వచ్చేవారట. సెట్లో ఉన్నవాళ్లకు కచ్చితంగా మద్యం అందించేవాడట. అలా ఓసారి అమెరికాకి వెళ్లి.. మద్యం మత్తులో గ్యాంబ్లింగ్ ఆడారట. అక్కడ డబ్బులు వచ్చిన ప్రతిసారి గట్టిగా అరుస్తూ డాన్స్ చేస్తే.. చివరకు పొగపెట్టి గదిలో నుంచి బయటకు పంపేశారని, అది తనకో స్వీట్ మెమోరీ అని అంటున్నాడు జగపతి బాబు.బస్సు ఎక్కితే గుర్తుపట్టలేదుసాధారణ మనిషిలాగానే బతకడం నాకు ఇష్టం. అందుకే వీలు దొరికనప్పుడల్లా సరదాగా బయటకు వెళ్తుంటాను. ‘కబడ్డీ కబడ్డీ’సినిమా షూటింగ్ సమయంలో ఓ రోజు ఎర్రబస్సు ఎక్కితే..ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. రాజోలులో షూటింగ్ జరుగుతున్న సమయంలో.. నా షూట్ అయిపోగానే నడుచుకుంటూ వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కా. నా వెనక సిబ్బంది కూడా ఎక్కింది. నన్ను ఎవరూ గుర్తు పట్టలేదు. కాసేపయ్యాక గుసగుసలు మొదలయ్యాయి. జగపతి బానేనా.. జగపతి బానేనా అని ఒకరినొకరు అడుక్కుంటున్నారు. నేను మాత్రం సైలెంట్గా ఉన్నా. ఒకరు చూసి.. ‘నువ్వు జగపతి బాబువే కదా’ అని అన్నారు. నేను వెంటనే కాదని చెప్పా. వాళ్లు సైలెంట్ అయిపోయారు. మా హోటల్ దగ్గర బస్సు ఆగగానే.. దిగేసి ‘నేను జగపతి బాబునే’ అంటూ గట్టిగా నవ్వుకుంటూ హోటల్లోకి వెళ్లిపోయా. ఇలాంటి అల్లరి పనులు చాలానే చేశా’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. -
రవితేజ ఇరుముడి.. మహా శివరాత్రి అప్డేట్
మాస్ మహారాజా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఇరుముడి(Irumudi). ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ పోస్టర్లో అయ్యప్పమాల ధరించిన రవితేజ.. చేతిలో మరో చిన్నారిని ఎత్తుకుని చాలా కొత్తగా కనిపించారు.ఇవాళ మహాశివరాత్రిని పురస్కరించుకుని మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఫస్ట్ లుక్ను రివీల్ చేశారు. ఈ సినిమాలో కావేరి అనే పాత్రలో ప్రియా భవాని శంకర్ కనిపించనుందని వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ భార్యగా అభిమానులను మెప్పించనుంది. తాజాగా రిలీజైన ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనున్నట్లు తెలుస్తోంది. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దర్శకుడు శివ నిర్వాణ నిన్ను కోరి (2017), మజిలీ (2019), ఖుషి (2023) వంటి ప్రేమకథా చిత్రాలతో హిట్స్ కొట్టారు. రవితేజతో తీస్తోన్న పాన్ ఇండియా రేంజ్ మూవీ 2026లోనే ఈ విడుదల కానుంది. Presenting the talented @priya_Bshankar as 'Kaveri' from #IRUMUDI / #ఇరుముడి - a caring wife and a doting mother ❤️Starring MASS MAHARAJA @RaviTeja_offl 🤩A @gvprakash musical 🎺🎼@ShivaNirvana @MythriOfficial @saikumaractor #BabyNakshathra #VishnuSharma @sahisuresh… pic.twitter.com/e9puiTkwrS— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2026 -
'మరిన్ని మ్యాజికల్ చేద్దాం'.. పెద్ది కెప్టెన్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్
రామ్ చరణ్ హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్.. ఇటీవలే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా రామ్ చరణ్ తన డైరెక్టర్కు విషెస్ తెలిపారు. ఈ రోజు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో పెద్ది మూవీ షూటింగ్లో ఉన్న ఫోటోను షేర్ చేశారు. పెద్ది కెప్టెన్ బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సెట్లో మీ అభిరుచి, వివరణాత్మక కథనం, పాతుకుపోయిన కథ చెప్పడం ప్రతిరోజూ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని రాసుకొచ్చారు. మనిద్దరం కలిసి మరిన్ని మాయా కథలను సృష్టిద్దామని చెర్రీ తన టీట్లో రాసుకొచ్చారు. ఈ సంవత్సరం మీ కృషికి తగిన గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ కూడా బుచ్చిబాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. Wishing my #Peddi captain @BuchiBabuSana Garu a very happy birthday! ❤️ ❤️ Your passion, detailing and rooted storytelling are inspiring every single day on set. Let’s create many more magical stories together.May this year bring you all the recognition your hard work truly… pic.twitter.com/NokRPm2HXV— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2026 -
అల్లు అర్జున్- అట్లీ కాంబో.. మరో హీరోయిన్గా క్రేజీ బ్యూటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం బిగ్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా షూటింగ్కు సంబంధించిన సింగిల్ వీడియో కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇది చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలుస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొణెను ఇప్పటికే ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. లేటేస్ట్గా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బిగ్ ప్రాజెక్ట్లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ను మరో హీరోయిన్గా ఎంపిక చేయనున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ- అట్లీ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను ఏఏ22 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. -
మెగాస్టార్ కొత్త సినిమా.. ఛాంపియన్ బ్యూటీకే ఆ ఛాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన మనశంకర వరప్రసాద్గారు సూపర్ హిట్గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మెగా అభిమానులను మెప్పించింది. అయితే మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హీరోయిన్స్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన టాలీవుడ్లో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా కాదు.. చిరంజీవి కూతురిగా కనిపించనుందని సమాచారం. ఈ కథలో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలకు ప్రధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని ఇండస్ట్రీ లేటేస్ట్ టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా వస్తోన్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. ఈ మూవీలో నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాకు యదునాథ్ మారుతిరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో జి సుమంత్ నాయుడు నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజైంది. మొదలే మొదలే అంటూ సెకండ్ సింగిల్ను మేకర్స్ విడుదల చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ క్రేజీ సాంగ్ లవర్స్ను అలరిస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ అందించగా..నరేశ్ అయ్యర్, మధుశ్రీ ఆలపించారు. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. -
వరుస ఫ్లాఫ్స్.. మాస్ మహారాజా రిస్క్ తీసుకుంటున్నారా?
టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరున్న రవితేజ కొన్నేళ్లుగా హిట్ కొట్టలేకపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మాస్ హీరో సక్సెస్ అందుకోలేకపోయారు. మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ వచ్చిన రవితేజకు కొత్త ఏడాది కూడా కలిసిరాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా.. సూపర్ హిట్ కాకపోవడం మాస్ మహారాజా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.రవితేజ కీలక నిర్ణయం..సినిమా బడ్జెట్ విషయంలో రిస్క్ తగ్గించడం కోసం రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. పారితోషికం తగ్గించుకుని మూవీకి వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల వరకు ఉంటోంది. దీంతో మూవీ బడ్జెట్ రూ.40 నుంచి 50 కోట్లను దాటిపోతోంది. అదే నిర్మాతలకు భారంగా మారింది. అందువల్లే రవితేజ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రిస్క్లో షేర్..మరోవైపు ఓటీటీ రైట్స్ విలువ తగ్గడంతో నిర్మాతలు సైతం జాగ్రత్త పడుతున్నారు. ఇలా నిర్మాతలతో కలిసి రిస్క్ షేర్ చేసుకునే విధానం వైపే రవితేజ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో నాని, సాయి ధరమ్ తేజ్, నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు సైతం ఇదే ఆలోచనలో ఉన్నారని టాక్. అయితే ఈ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఈ నిర్ణయం ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాల్సిందే. రవితేజ కొత్త సినిమా..రవితేజ- శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ ఇరుముడి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ అంతా తండ్రీకూతుళ్ల బంధం గురించి ఉండనుందిని టాక్.. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే ఒక తండ్రిగా రవితేజ కనిపిస్తారని తెలుస్తోంది. -
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు. I don’t want to rush. I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026 -
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్గా కనిపించనుంది. గోపి డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. -
రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్కు నో..!
టాలీవుడ్లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్లో మోస్ట్ వైరల్ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
యూఫోరియా మూవీకి మహేశ్ బాబు రివ్యూ.. ఏమన్నారంటే?
టాలీవుడ్ మూవీ యూఫోరియాపై ప్రిన్స్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది తప్పక చూడాల్సిన సినిమా అని అన్నారు. గుణశేఖర్ తన కథలను ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన నమూనా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. సినిమా బాగా నచ్చిందని మహేశ్ ట్వీట్ చేశారు. గుణశేఖర్, భూమికతో పాటు మొత్తం చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ సినిమాను గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో భూమిక ప్రధాన పాత్రలో నటించగా.. సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. There’s always a distinct pattern in how Gunasekhar garu presents his stories…Enjoyed the film especially the way the climax unfolds…👏🏻👏🏻👏🏻A must watch! Congratulations to Guna Sekhar garu, @bhumikachawlat and the entire team of #Euphoria 🤗🤗🤗@neelima_guna #YukthaGuna…— Mahesh Babu (@urstrulyMahesh) February 11, 2026 -
శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. ఆసక్తిగా టీజర్
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు. -
అర్జున్ సర్జాకు గిఫ్ట్ ఇచ్చిన ట్యాంక్ బండ్ శివ.. వీడియో వైరల్
హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటేస్ట్ మూవీ సీతా పయనం. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రకాశ్రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు అర్జున్, ఆయన కూతురు ఐశ్వర్య. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మనందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ట్యాంక్ బండ్ శివను ఘనంగా సత్కరించారు.ఈవెంట్కు హాజరైన ట్యాంక్ బండ్ శివ.. వేదికపై ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. తన భార్య వల్లే జీవితానికి అర్థం తెలిసొచ్చిందని అన్నారు. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా అర్జున్ సర్జాకు ఓ అరుదైన బహుమతి ఇచ్చారు. ఆయన సినిమాల్లోని ఫోటోలతో ఓ ఫ్రేమ్ను అర్జున్కు బహుకరించారు ట్యాంక్ బండ్ శివ దంపతులు. దీంతో అర్జున్ సర్జా ఆనందం వ్యక్తం చేశారు. సమాజం కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ట్యాంక్ బండ్ శివకు లక్ష రూపాయల చెక్ను అర్జున్ సర్జా అందజేశారు."నా భార్య శాంతే నా జీవిత ప్రయాణానికి అర్థం.. ఒక దొంగలా కాకుండా దొరలా బ్రతకాలని తన దగ్గరే నేర్చుకున్నా.."-నిష్కల్మషమైన తన స్పీచ్ తో సభికుల మనసులను గెలుచుకున్న ట్యాంక్ బండ్ శివ..#SeethaPayanam pic.twitter.com/VJvjFyXpYN— Mega Abhimani (@megaabhimani3) February 10, 2026 -
'ఆమె వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు.. అల్లు అర్జున్ టీమ్ అధికారిక ప్రకటన'
అల్లు అర్జున్ లాంటి హీరోతో యాడ్ షూటింగ్ చేయాలంటే కఠినమైన రూల్స్ ఉన్నాయంటూ ప్రముఖ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఐకాన్ స్టార్తో షూట్ చేసేందుకు వెళ్లినప్పుడు ఆయన మేనేజర్స్ దాదాపు 42 నిబంధనలతో ఓ నోట్ ఇచ్చారని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్పై వస్తున్న ఈ కథనంపై ఆయన టీమ్ రియాక్ట్ అయింది. ఆమె చెబుతున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలను ఎవరూ కూడా నమ్మొద్దని ఐకాన్ స్టార్ టీమ్ కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడమని స్పష్టం చేసింది. ఈ మేరకుఅల్లు అర్జున్ కార్యాలయం నుంచి అధికారిక నోట్ విడుదల చేసింది.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయకుండా ఉండాలని సూచించింది. కాగా.. గతంలో ఆమె అల్లు అర్జున్తో ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. Unbelievable rules of Allu Arjun.A media professional reveals some of the shocking "do's and don'ts" when meeting megastar Allu Arjun.From strictly following a list of 42 rules to being told "don't look in sir's eyes" and "don't shake hands,"Why someone can't look in your… pic.twitter.com/pGv9UmhhBP— lakshman (@rebel_notout) February 10, 2026 -
'ఐకాన్ స్టార్తో షూట్.. ఈ రూల్స్ పాటించాల్సిందేనట'.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 తర్వాత మరో స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. జవాన్ డైరెక్టర్ అట్లీతో బన్నీ మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంచితే అల్లు అర్జున్పై ప్రముఖ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగం మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరైన ఆమె.. అల్లు అర్జున్ను కలవాలంటే కఠిన నిబంధనలు ఉంటాయని తెలిపింది. దాదాపు 42 రూల్స్ పాటించాలని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అల్లు అర్జున్ కళ్లలోకి చూడకూడదని.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని వెల్లడించింది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.కావేరి బారువా పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. "నా మరో ఆసక్తికరమైన ఇంటర్వ్యూ హైదరాబాద్ మెగా స్టార్ అల్లు అర్జున్తో జరిగింది. ఈ సౌత్ స్టార్ను కలవడానికి ముందు మాకు దాదాపు 42 రూల్స్కు సంబంధించిన నోట్ ఇచ్చారు. మీరు సార్ కళ్లలోకి చూడకూడదు.. అలాగే షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వకూడదని మేనేజర్లు సూచించారని" ఆమె అన్నారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కావేరి బారువా చేసిన వాదనలు నిజమో కాదో తెలియాలంటే.. అల్లు అర్జున్ బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.Yeh hai Pushpa ka rule : Massive respect to @alluarjun Sir for setting strict rules before meeting any media person! North has always treated their stars like gods with endless protocols, but when South's Icon sets his own in Bombay? Suddenly it's 'too much' and shocking?… pic.twitter.com/FALbtiv1Dn— AnandTanniru (@ceoyktv) February 10, 2026 -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఉపాసన తన పోస్ట్లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం. తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOUMy family is truly blessed.Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026 -
బుల్లిరాజు కొత్త సినిమా.. పవర్పుల్గా టీజర్
అనన్య శర్మ, ఎస్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ మూవీ హై. ఈ సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇమేజ్స్పార్క్ ఎంటర్టైన్మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ, శేఖర్ దివ్వెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా ఈ టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే యూత్ఫుల్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు క్రైమ్ స్టోరీని తలపించేలా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు(రేవంత్) ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్గా కనిపించాడు. కాగా.. ఈ సినిమాలో రేవంత్ (బుల్లిరాజు), పల్లవి దొర, కృష్ణ కమల్, సాయికృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస బాదిసా సంగీతమందిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్తున్నారా?.. తరుణ్ భాస్కర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇటీవలే హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఓం శాంతి శాంతి శాంతిః. అనే మలయాళ రీమేక్తో పలకరించారు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. అంతలోనే మరో సినిమాకు రెడీ అయిపోయారు తరుణ్ భాస్కర్. ఆయన హీరోగా వస్తోన్న. కొత్త సినిమా ‘గాయపడ్డ సింహం. తాజాగా ఈ మూవీ టీజర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ఈవెంట్కు హాజరైన తరుణ్ భాస్కర్కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు హీరోగా చేసిన సినిమా హిట్ కొట్టలేదు కదా.. మీతో సినిమా చేయడానికి నిర్మాత ఎలా ధైర్య చేశారని ఓ మీడియా ప్రతినిధి అడిగారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి.. ఆ సినిమాతో హిట్ కొడదామన్నారు. అయితే లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన ఏదీ ఆపొద్దు.. ది అందరికీ చెబుతున్నా. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలని అన్నారు. అయినా ఎందుకు సార్ నేను ఫెయిల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారని ఫన్నీగా చమత్కరించారు.ఇదే ఈవెంట్లో తరుణ్ భాస్కర్కు మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ మ్యారేజ్కి మీరు కూడా వెళ్తున్నారా? అని అడిగారు. ఇది విన్న తరుణ్.. నాకైతే ఇప్పటి వరకు ఆహ్వానం లేదు.. ఒక వేళ ఇన్విటేషన్ వస్తే మీకు వెంటనే వాట్సాఫ్లో ఫార్వార్డ్ చేస్తాను.. మనిద్దరం కలిసి విజయ్ దేవరకొండ పెళ్లికి వెళ్దామని తరుణ్ భాస్కర్ ఫన్నీగా పంచ్లు వేశారు.కాగా.. గాయపడ్డ సింహం చిత్రానికి ‘డోన్ట్ లాఫ్... ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ (నవ్వొద్దు... ఇది సీరియస్ మేటర్) అనేది క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని కల్యాణ చక్రవర్తి మంతెన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మిస్తున్నారు. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. -
మైక్ తీసుకోగానే బూతులు.. కానీ ఇప్పుడు: హీరోపై నాగవంశీ కామెంట్స్
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్ను చూస్తుంటే అనుదీప్ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు. Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు. - @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026 -
రూరల్ బ్యాక్డ్రాప్ ప్రేమకథ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
జయమ్మ పంచాయతీ మూవీ ఫేమ్ దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ఈ సినిమాను డైరెక్టర్ సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే లవ్స్టోరీతో పాటు ఫాదర్ సెంటిమెంట్తో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. టైటిల్ చాలా బాగుందని.. సినిమా కూడా బాగుంటుందని సురేష్ బాబు అన్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ..'సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కుటుంబమంతా కలిసి ఆహ్లాదంగా చూడదగ్గ మూవీ. శతమానం భవతి, బలగం, ఆ నలుగురు లాంచి మంచి కంటెంట్ ఉన్న కథ. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను కూడా చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.ఈ సందర్భంగా సీనియర్ నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ..'మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మంచి కుటుంబ కథా చిత్రంగా వస్తోంది. సెంటిమెంట్ పరంగా, అన్నిరకాలుగా మూవీ బాగుంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ను సురేష్ బాబు లాంఛ్ చేశారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది. అది సినిమాకు బాగా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతూముంజెటి, హాసిని యామిని కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. -
విశ్వక్ సేన్ ఫంకీ.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఫంకీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ నెల 7న మూసాపేట్లోని శ్రీరాములు థియేటర్లో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.The Key for FUN with #FUNKY unlocks tomorrow 🔓💥 Trailer drops on 7th Feb from 4 PM onwards. #FunkyTrailer Launch Event at Sree Ramulu 70MM, Hyderabad. Join us for pure FUNKY MADNESS 😎🔥 In cinemas from FEB 13 #FunkyFrom13thFeb Mass Ka Das @VishwakSenActor @11Lohar… pic.twitter.com/g2UyiUjsLL— Sithara Entertainments (@SitharaEnts) February 6, 2026 -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
'నన్ను ఛీ కొట్టిన సందర్భాలే ఎక్కువ'.. బిగ్బాస్ అమర్దీప్
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్.ఈ ఈవెంట్లో పాల్గొన్న హీరో అమర్ దీప్ తన కెరీర్ గురించి మాట్లాడారు. ఒక యూట్యూబర్గా తన జీవితం ప్రారంభించానని తెలిపారు. దాదాపు 13 ఏళ్ల పాటు అక్కడక్కడ చిన్న సినిమాలు చేస్తూ వచ్చానని వెల్లడించారు. ఆడిషన్స్కు వెళ్లినప్పుడు నన్ను ఛీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఇవన్నీ చెప్పి నాపై సంపతీ క్రియేట్ చేయాలనే ఉద్దేశం లేదన్నారు. నా కష్టమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని అమర్దీప్ వెల్లడించారు. కాగా.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు.అవకాశాల కోసం తిరుగుతూ ఛీ కొట్టించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.. ఇదేదో సింపతీ కోసం చెప్పడం లేదు#AmardeepChowdary #SaylimChaudhari #SumathiSathakam pic.twitter.com/WmxM6pwUdO— Filmy Focus (@FilmyFocus) February 5, 2026 -
బూతు పాటపై కాంట్రవర్సీ.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రియాక్షన్
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు పాటలో ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చకు తెరతీశాడు. ఈ కార్యక్రమానికి నటుడు జేడీ చక్రవర్తి కూడా హాజరయ్యారు. ఆ పాట పాడుతున్నప్పుడు అక్కడి వెళ్లిపోవాలనిపించిందని జేడీ అన్నారు. తాజాగా ఈ వివాదానికి కారణమైన హీరో చంద్రహాస్ రియాక్ట్ అయ్యారు. ఆ పాట పాడినందుకు తనకెలాంటి బాధ లేదన్నారు. నేను ఎవరికీ సారీ చెప్పాల్సిన పనిలేదని చంద్రహాస్ అన్నారు. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదని తెలిపారు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకన్స్ కట్ చేసి బూతు పురాణం అంటున్నారని చంద్రహాస్ చెప్పారు. నేను చాలామందితో పనిచేశానని.. ఎవరితోనూ తప్పుగా వ్యవహరించలేదని యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ వెల్లడించారు.(ఇది చదవండి: యాటిట్యూడ్ స్టార్ బూతు పాట.. లేచి వెళిపోదామనుకున్నా: జేడీ)అంతేకాకుండా ఓ మీడియా ప్రతినిధిపై చంద్రహాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మా ఇంట్లో మహిళలను కించపరిచేలా మాట్లాడారని చంద్రహాస్ ఆరోపించారు. లాయర్లతో మాట్లాడుతున్నానని నిన్ను మాత్రం వదిలిపెట్టనని చంద్రహాస్ అన్నారు. నీకు కేవలం 24 గంటలు మాత్రమే టైమ్ ఇస్తున్నానని చంద్రహాస్ డెడ్లైన్ విధించారు. క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చంద్రహాస్ వెల్లడించారు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదునేను ఎవరికీ సారి చెప్పనుఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదుమూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారుఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు?- Attitude Star Chandrahas https://t.co/L4wWEoG8US pic.twitter.com/dIggklzmj4— cinee worldd (@Cinee_Worldd) February 4, 2026 -
ఓ టార్చర్ ప్రేమ కథా చిత్రం.. ఫస్ట్ లుక్ విడుదల
సన్నీ మాదాల, మౌనిక జంటగా నటిస్తోన్న చిత్రం ఓ టార్చర్ ప్రేమ. ఈ మూవీకి శ్రీకర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా మాదాల రంగారావు మనవడు మాదాల రవి తనయుడు సన్నీ మాదాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మౌనిక సైతం ఈ చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ప్రముఖ రచయిత, దర్శకుడు డాక్టర్ పరచూరి గోపాల కృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. ' మాదాల రవి కుమారుడు సన్నీ మాదాల మూడోతరం హీరో పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం ప్రేమ మార్గంని ఎన్నుకున్నాడు. ఓ టార్చర్ ప్రేమ అనే అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ప్రేమకథా చిత్రం. ఈ చిత్రంలో నవ్వులు చిందించే సన్నివేశాలతో పాటు ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు. ఈ మూవీలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్ వర్మ, విష్ణు ప్రియా, యాదమ్మ రాజు కీలక పాత్రలు పోషించారు. -
రవితేజ సోదరుడి తనయుడి చిత్రం.. టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న తాజా చిత్రం మారెమ్మ. ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ యధార్థ సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనున్నారు.తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే రియల్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరికి శాపం చుట్టుకోవడంతో గ్రామ దేవత మారెమ్మకు పూజలు చేయడం టీజర్లో చూపించారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. ఈ సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. -
శర్వానంద్ బైకర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు.ఈ సమ్మర్ కానుకగా బైకర్ థియేటర్లలో సందడి చేయనుందని నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. The engine's revved up 🏍️The track is ready 🛣️Now, THERE IS NO STOPPING HIM ❤️🔥#BIKER grand release worldwide on April 3rd, 2026 💥💥#BIKERMovie #GoAllTheWay 🏁#BikerOnApril3rdCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha… pic.twitter.com/HhIsmshA7i— UV Creations (@UV_Creations) February 3, 2026 -
దేవగుడి సక్సెస్.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు. -
రామ్ చరణ్ దంపతులకు బన్నీ విషెస్.. చిరంజీవి ఫేస్ చూస్తుంటే?
రామ్ చరణ్ దంపతులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆనందం మరింత రెట్టింపైదన్నారు. ట్విన్స్ రాకతో చిరంజీవి ముఖంలో ఆ గర్వం, సంతోషం కనిపిస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులందరి చిరునవ్వుల ముఖాలను చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అందమైన కొత్త ప్రారంభానికి రెట్టింపు ప్రేమ, ఆనందం కలుగుతోందన్నారు.కాగా.. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విన్స్కు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసనకు ఓ బాబు, పాప పుట్టారని అన్నారు. బిడ్డలతో పాటు తల్లి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. కవలల రాకతో తమ కుటుంబంతో పాటు అభిమానులు సంతోషంలో మునిగిపోయారని అన్నారు. మాపై మీరందరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఉపాసన- చెర్రీ దంపతులకు ఇప్పటికే క్లీంకార అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. Congratulations to @AlwaysRamCharan & @upasanakonidela on being wonderful parents once again. Immense joy and celebration all around. The pride and happiness are radiating on @KChiruTweets garu’s face and Chittika’s as well. So happy to see them and the entire family’s smiling…— Allu Arjun (@alluarjun) February 2, 2026 -
తండ్రి బాటలో రామ్ చరణ్.. మాట నిలబెట్టుకున్న గ్లోబల్ స్టార్
మెగా ఫ్యామిలీ ఇంట సంబురం నెలకొంది. మెగా కోడలు ఉపాసనకు కవలలు జన్మించారు. అర్ధరాత్రి ఉపాసన ఓ బిడ్డ, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా.. ఇప్పటికే రామ్ చరణ్- ఉపాసనకు ఓ కూతురు ఉన్న సంగతి తెలిసిందే. తమ ముద్దుల కూతురి క్లీంకార అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్....గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి చేసిన ప్రతిపాదనను తాజాగా ఆమోదించారు. సినిమా షూటింగ్లలో ఎంతో శ్రమించే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు.ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా అందనుంది. ఇందుకోసం ఆయన సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను రామ్ చరణ్ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తన భార్య ఉపాసనతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సినీ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై డ్యాన్సర్ సంఘాలు, పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం 500 కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించనుంది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బిగ్బాస్ అమర్దీప్ సుమతీ శతకం.. ట్రైలర్ వచ్చేసింది
బిగ్బాస్ అమర్దీప్, సైలీ జంటగా నటించిన తాజా చిత్రం ‘సుమతీ శతకం’. ఈ మూవీకి ఎమ్ఎమ్ నాయుడు దర్శకత్వం వహించరు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ నిర్మించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి 'నా కుట్టీ కుట్టీ సుమతీ.. నా చిట్టీ చిట్టీ సుమతీ' అంటూ సాగే లవ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్కూల్ టీచర్లో ప్రేమాయణం నడిపించిన యువకుడి స్టోరీలా ట్రైలర్లో కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ద్వారా ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో టేస్టీ తేజ, మహేష్ విట్టా, జెడివి ప్రసాద్, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. -
అందరినీ మెప్పించే ప్రేమ కడలి.. రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ మూవీ ప్రేమ కడలి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుబ్బారెడ్డి, సుజాత, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ నాని పిల్లిబోయిన మాట్లాడుతూ..'గల్ఫ్లో ఉంటూ సినిమా తీయాలనే ప్యాషన్తో ఎంతో కష్టపడి తీశాం. ఈ సినిమా తీయడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది.నాకు ఎంతో సపోర్ట్ చేసిన నా భార్య అయినా రాధకి,తన మిత్రులకి ధన్యవాదాలు. ఈ మూవీకి అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే ఈ సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు లలిత్ కిరణ్ మాట్లాడుతూ..'ఈ సినిమాకి మంచి సంగీతం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు అందించినందుకు చాలా ఆనందంగా ఉందని లిరిక్స్ అందించిన జయసూర్య అన్నారు. -
క్యాస్టింగ్ కౌచ్పై మెగాస్టార్ కామెంట్స్.. అది సాధ్యమేనా?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా అదే హాట్ టాపిక్. నటీమణుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్నామని అంటుంటారు. ఎక్కడా చూసినా అదంతా సాధారణమే అన్నంతగా సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. తాజాగా మరోసారి తెరపై తీసుకొచ్చింది. ఇంతకీ అదేంటి అనుకుంటన్నారా? అదేనండి క్యాస్టింగ్ కౌచ్. మన మెగాస్టార్ నోటా ఆ మాట వినిపించడం ఇప్పుడు మరింత చర్చకు దారితీసింది.మెగాస్టార్ నోటా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం రావడంతో టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఇప్పుడు దీనివైపే చూస్తోంది. మనం కఠినంగా ఉంటే ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉండదని చిరంజీవి అంటున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ తప్పనిసరి చిన్మయి లాంటి వాదిస్తున్నారు. సినీరంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బల్లగుద్ది చెబుతోంది సింగర్ చిన్మయి. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చాలాసార్లు తన ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మెగాస్టార్ చేసిన కామెంట్స్పై సైతం చిన్మయి తనదైన శైలిలో స్పందించింది. మెగాస్టార్ను గౌరవిస్తూనే క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయని అంటోంది సింగర్.మెగాస్టార్ కామెంట్స్ కరెక్టేనా?మెగాస్టార్ చెప్పిన ప్రకారం మనం కరెక్ట్గా ఉంటే ఎవరూ అవకాశం తీసుకోరని అంటున్నారు. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుందని చెబుతున్నారు. చిరంజీవి చెప్పిన విషయాన్ని కొంత వరకు అంగీకరించాల్సిందే. మన ప్రవర్తన ఎలా ఉంటే అలానే జరుగుతుంది అనేది వాస్తవమే. కానీ మెగాస్టార్ చెప్పిన మాటలు వంద శాతం నిజమని చెప్పలేం. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్నా.. అలాంటి బుద్ధి ఉన్నవారు ఏదో ఒక రూపంలో మనల్ని టార్గెట్ చేస్తారు. పని చేసే చోట ఇబ్బందులు కలిగిస్తారు. అలా మనం కరెక్ట్గా ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులను కూడా క్యాష్ చేసుకునే వారు కూడా ఉంటారు. ఒకవేళ మెగాస్టార్ చెప్పింది పాటిస్తే.. ఇండస్ట్రీలో అవకాశాలు టాలెంట్ను చూసి ఇచ్చేస్తారా? లేదా? అన్నదే ఇక్కడ ప్రశ్న. మనం ఎంత కరెక్ట్గా ఉన్నప్పటికీ.. ఛాన్స్ అనే పేరుతో ఛాన్స్ తీసుకోరని గ్యారెంటీ ఏంటని పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మారాలంటే సినీ ఇండస్ట్రీ నుంచే మార్పు వస్తే బాగుంటుందని అందరి అభిప్రాయం.చిన్మయికే కామెంట్స్కే మద్దతు..ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై పోరాటం చేసేవాళ్లలో చిన్మయిని మించిన వారు ఉండరు. కేవల సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా మహిళలకు అన్యాయం జరిగినా సరే తన గొంతు వినిపిస్తూనే ఉంటోంది. అందుకే మెగాస్టార్ కామెంట్స్పై కూడా సింగర్ స్పందించింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని బల్లగుద్ది చెబుతోంది. ఎందుకంటే తాను కూడా బాధితురాలిననే ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. ఎందుకంటే ఎవరికైనా తాము అనుభవిస్తేనే అందులోని బాధ వారికే ఎక్కువగా తెలుస్తుంది. మెగాస్టార్ వ్యాఖ్యలు కొంతవరకు నిజమే అయినా.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ను అరికట్టాలంటే ముందు అలాంటి వాళ్ల మైండ్ సెట్ మారాలి. అంతే తప్ప క్యాస్టింగ్ కౌచ్ లేదనడం కరెక్ట్ కాదనిపిస్తోంది. చిన్మయి రియాక్షన్..చిరంజీవి కామెంట్స్పై చిన్మయి స్పందిస్తూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అనేది పూర్తిగా అబద్ధం. ఇంగ్లీష్లో ‘కమిట్మెంట్’ అంటే వృత్తి పట్ల నిబద్ధత అని అర్థం వస్తుంది.. కానీ, ఇండస్ట్రీలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరు ఉంటుంది. మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు. ఇక్కడ చాలామంది మగవారు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం సర్వసాధారణం. లెజెండరీ చిరంజీవి గారి తరం వేరు.. ఇప్పుడు జరుగుతున్నది వేరు. చిరంజీవి జనరేషన్లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు… ప్రస్తుతం పరిశ్రమలో అలాంటి వాతావరణం లేదు. చిరు తరంలో మహిళా కళాకారులతో స్నేహితులుగా తమ కుటుంబ సభ్యులుగా ఉండేవారు. ఒకరినొకరు గౌరవించుకునేవారు. లెజెండ్లతో పనిచేసిన వారందరూ లెజెండ్లే. చిరు నాటి రోజులు ఇప్పుడు లేవు' అని మెగాస్టార్ వ్యాఖ్యలకు రియాక్ట్ అయింది. -
ఓ యువకుడి ప్రేమకథా చిత్రం.. ఆసక్తిగా ట్రైలర్
వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ఠ జంటగా నటించిన తాజా చిత్రం శ్రీ చిదంబరం గారు. ఈ సినిమాకు వినయ్రత్నం దర్శకత్వం వహించారు. ఈ మూవీకి చింతా వినీషారెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు.తాజా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే ఓ మధ్య తరగతి యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఊరు వదిలి విదేశాలకు వెళ్లాలనుకున్న యువకుడికి ఓ యువతి పరిచయం కావడంతో ఏం చేశాడనే ఆసక్తికర కథనంతో ఈ మూవీ తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. 'తల దించుకుని నడిచి నడిచి మెడ లాగేస్తోందమ్మా.. ఇప్పుడన్నా నన్ను తలెత్తుకొనీయమ్మా' అనే డైలాగ్ ఎమోషనల్ వింటే ఎమోషనల్గా స్టోరీగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఎవరో కూడా తెలియని టైమ్లో నా కోసం నిలబడ్డాడు: విశ్వక్ సేన్ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్పై ప్రశంసల వర్షం కురిపించారు. నేను ఎవరో కూడా తెలియని సమయంలో తరుణ్ నా కోసం నిలబడ్డాడని కొనియాడారు. తరుణ్ భాస్కర్ నటించిన ఓ శాంతి శాంతి శాంతిః మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ఈ కామెంట్స్ చేశారు.తరుణ్ నాకు పరిచయం లేకపోయినా కూడా నాకోసం నిలబడ్డారని విశ్వక్ సేన్ అన్నారు. నాకు ఫోన్ చేయగానే ఈవెంట్కు వచ్చానని తెలిపారు. ఈరోజు నన్ను గెస్ట్ అని అంటున్నారని.. ఎందుకంటే ఇది నా కుటుంబ ఫంక్షన్ అని అన్నారు. కాగా.. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. మలయాళంలో తెరకెక్కించిన జయ జయ జయహే మూవీకి రీమేక్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. -
'వామ్మో.. వాయ్యో..' ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి
రవితేజ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో డింపుల్ హయాతి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.అయితే ఈ సినిమాలో ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వామ్మో వాయ్యో అనే పాట అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేసింది. తాజాగా ఈ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట మాస్ మహారాజా ఫ్యాన్స్ను తెగ అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. -
ఆ హీరోలా స్టంట్ చేయబోయి.. నవ్వుల పాలైన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ అప్పుడప్పుడు స్టంట్స్ చేస్తుంటారు. అంతేకాకుండా తన కోపంతో అభిమానులపై చేయి కూడా చేసుకుంటారు. అలా చాలాసార్లు వేదికలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమాల్లో లాగా ఓ స్టంట్ చేయబోయి నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంతమ స్టైల్లో అద్దాలను గాల్లోకి ఎగరేశాడు బాలయ్య. కానీ అది వర్కవుట్ కాలేదు. అద్దాలు కాస్తా కింద పడిపోవడంతో వెంటనే తీసుకుని జేబులో వేసుకోవడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారుఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే గతేడాది అఖండ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీని అఖండకు సీక్వెల్గా తెరకెక్కించారు. పాపం బాలయ్య..!మరో స్టంట్ చేయబోయి.. అవమానంపాలైన నటుడు రజినీకాంత్ స్టైల్ లో అద్దాలను గాల్లో ఎగరేసి, జేబులో వేసుకోవడానికి ప్రయత్నం కానీ, అది కిందపడిపోవడంతో దిక్కులు చూస్తూ మౌనం pic.twitter.com/NdITjxsFay— PulseNewsBreaking (@pulsenewsbreak) January 27, 2026 -
హీరోయిన్ ఈషాతో రూమర్స్.. తరుణ్ భాస్కర్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రస్తుతం హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఓ శాంతి శాంతి శాంతిః. ఈ సినిమాలో హీరోయిన్గా ఈషా రెబ్బా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా..తరుణ్ సైతం మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరయ్యారు తరుణ్ భాస్కర్. ఈ సందర్భంగా హీరోయిన్ ఈషాతో రిలేషన్పై ఆయనకు ప్రశ్న ఎదురైంది. మీపై వస్తున్న రూమర్స్పై ఏమంటారు? అని ప్రశ్నించారు. దీనికి తరుణ్ భాస్కర్ స్పందించారు. తాను ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువని తెలిపారు. ఇది నా పర్సనల్ కాబట్టి.. టైమ్ వచ్చినప్పుడు అన్ని చెప్తా అన్నారు. నేను ఏదైనా చెప్తే.. దాని వల్ల ఎవరైనా ఇబ్బంది పడడం తనకు ఇష్టం లేదన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ప్రస్తుతం వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాలో నటించారు. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 30న విడుదల కానుంది. ఇది మలయాళ మూవీ జయ జయ జయహేకి రీమేక్గా తెరకెక్కించారు.(ఇది చదవండి: తరుణ్తో డేటింగ్? తొలిసారి స్పందించిన హీరోయిన్)తర్వాత చెప్తా: ఈషా రెబ్బాఇటీవల సినిమా ప్రమోషన్స్కు హాజరైన ఈషా రెబ్బాకు సైతం తరుణ్తో డేటింగ్పై ప్రశ్న ఎదురైంది. తెరపై జంటగా నటించిన తరుణ్- ఈషా.. రియల్ లైఫ్లోనూ జోడీయేనా? అన్న ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. 'ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటం మంచిదే! అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉంటే నేనే అందరికీ చెప్తాను' అని బదులిచ్చింది. వీరిద్దరి రిలేషన్పై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. -
20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన 20 ఏళ్ల నాటి మూవీని గుర్తు చేసుకున్నారు. నా సినీ ప్రయాణంలో అత్యంత ఆనందాన్నిచ్చిన చిత్రాలలో ఇది ఒకటని ట్వీట్ చేశారు. హ్యపీ చిత్రానికి నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన కరుణాకర్ గారికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు.నా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన హీరోయిన్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్పాయ్.. నాతో పాటు ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులందరూ కలిసి ఈ ప్రయాణాన్ని మర్చిపోలేనిదిగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం అందించినందుకు యువన్ రాజాకు, సాంకేతిక నిపుణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్కు అండగా నిలిచినందుకు మా నాన్న అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 20 years of #Happy. 🖤One of the most enjoyable films of my journey.Grateful to #AKarunakar garu for the beautiful vision.My wonderful co-star dear @geneliad, the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride.@thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR— Allu Arjun (@alluarjun) January 27, 2026 -
'లగ్జరీ కారు వదిలేశా.. ఆ లైఫ్ స్టైల్ నుంచి పూర్తిగా బయటికొచ్చా'
బిగ్బాస్ రియాలిటీ షో మరింత ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ అమర్దీప్ చౌదరి. తన అగ్రెసివ్ మాటలతో హౌస్లో తన ఆటతో మెప్పించాడు. బుల్లితెరపై అలరించిన అమర్దీప్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా చేస్తోన్న చిత్రం సుమతి శతకం. ఈ సినిమాతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీలో సైలీ చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమర్ దీప్ చౌదరి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. టీవీ ఇండస్ట్రీ నుంచి బయటకొచ్చి సినిమాలు చేద్దామని ఎప్పటి నుంచో ఉందని అన్నారు. తన లైఫ్ స్టైల్ను మార్చుకుని బతకాల్సి వచ్చిందని తెలిపారు. అన్ని లగ్జరీ వసతులు ఉన్న కారును వదిలిపెట్టి.. నార్మల్ కారు వాడుతున్నానని అమర్ దీప్ వెల్లడించారు. కానీ ఏదో ఒక రోజు మళ్లీ ఆ రోజు వస్తుందని అన్నారు.తనకు హీరో రవితేజ అంటే చాలా ఇష్టమని అమర్దీప్ అన్నారు. ఆయనకు తాను అభిమానినని.. ఇండస్ట్రీలో తనకు ఆదర్శమని తెలిపారు. ఆయనే నాకు గురువు.. రవితేజను చూసే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని వెల్లడించారు. సింధూరం సినిమాలో రవి తేజలో కనిపించిన ఆ స్పార్క్ను నేను పట్టుకుని.. అదే స్పార్క్ను ఈ సినిమాలో చూపించానని అమర్ దీప్ తెలిపారు. లగ్జరీ కార్ నుంచి నార్మల్ కార్కు మారినా నేను సంతోషంగానే ఉన్నాను. మెయింటెనెన్స్ భారం లేకపోవడమే కారణం. ఏదో ఒక రోజు ఈ రెండింటికీ మించి ఇంకొక్కటి తీసుకోగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను.- Amardeep Chowdary #SumathiSathakamFull interview youtube link :… https://t.co/mxoFvqHGz2 pic.twitter.com/9Ti5Wmopbq— idlebrain.com (@idlebraindotcom) January 23, 2026 -
అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి?
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. అప్పుడు క్యూట్ క్యూట్గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ హలో సినిమాలో జున్ను ఎలా మారిపోయిందో చూడండి..#Hellomovie #AkhilAkkineni pic.twitter.com/s86NsIfAt8— 𝐊𝐢𝐧𝐠𝐕𝐞𝐧𝐤𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐥𝐨𝐫𝐞 (@KingVenkyBAF) January 23, 2026 #Hello Movie ni Endhuku ra Hit Chailedhu 😈💔#HelloMovie 😻🗿 pic.twitter.com/CuA4LcgZSJ— sId 𝕏 (@IntrovertSidX) October 27, 2024 -
'బాక్స్ కోసం వేట'.. ఫుల్ కామెడీగా బాబా బ్లాక్షీప్ టీజర్
టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాబా బ్లాక్ షీప్.. ఈ సినిమాకు గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియో బ్యానర్పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో శర్వానంద్ చేతుల మీదుగా టీజర్ను విడుదల చేశారు.తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అంతా ఓ బాక్స్ చుట్టే తిరుగుతున్నట్లు టీజర్లో అర్థమవుతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్లో ఉపేంద్ర కామెడీ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, కార్తికేయ దేవ్, సమ్రీధీ ఆర్యల్, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆయన నమ్మకమే ఇక్కడి వరకు నడిపించింది: అనిల్ రావిపూడి ఎమోషనల్ పోస్ట్
ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించాడు. ఈ జనవరి 12న రిలీజైన మనశంకర వరప్రసాద్గారు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెప్పించారు.ఇప్పటివరకు తాను 9 సినిమాలతో హిట్ కొట్టిన ఏకైక టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్తో మొదలైన అనిల్ ప్రయాణం టాలీవుడ్లో సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2,ఎఫ్3 చిత్రాలతో తన మార్క్ చూపించారు. సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన పదో సినిమాకు కూడా రెడీ అయిపోయారు అనిల్ రావిపూడి.అయితే తన మొదటి సినిమా పటాస్ రిలీజై సరిగ్గా నేటికి 11 ఏళ్లు పూర్తి కావడంతో అనిల్ రావిపూడి ఎమోషనల్ ట్వీట్ చేశారు. పటాస్ను గుర్తు చేసుకుంటూ పోస్టర్ను షేర్ చేశారు. తాను ప్రేక్షకుల హృదయాల్లోకి అడుగుపెట్టి నేటికి 11 ఏళ్లు పూర్తయిందన్నారు. ఇంత కీలకమైన బాధ్యతను నాపై నమ్మకంతో, అపారమైన విశ్వాసంతో నాకు అండగా నిలిచిన నా మొదటి హీరో శ్రీ నందమూరి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని ట్వీట్ చేశారు. ఆ నమ్మకమే నాకు నిర్భయంగా ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సినిమా నా జీవితంలోకి తీసుకువచ్చిన జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాలు, భావోద్వేగాలు, ఆనందం వెలకట్టలేనివని.. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఈ ప్రయాణం నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుందని ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. It all started here 🙏🏻🙏🏻🙏🏻1️⃣1️⃣ years since I first made my way into the audiences hearts ❤️I will always remain indebted to my first hero, @NANDAMURIKALYAN garu, for trusting me with such a crucial responsibility and for standing by me with immense confidence. That belief… pic.twitter.com/BzUrzsvfXV— Anil Ravipudi (@AnilRavipudi) January 23, 2026 -
ఇది ప్రారంభం మాత్రమే.. మేనకోడలిపై మెగాస్టార్ ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి తన మేనకోడలిపై ప్రశంసలు కురిపించారు. మనశంకర వరప్రసాద్గారు చిత్రంలోని పాటపాడిన తన మేనకోడలు నైరాను కొనియాడారు. నా చిన్న మేనకోడలు నైరా ఫ్లై.. హై పాట పాడటం చూసి.. నా హృదయం ఆనందంతో నిండిపోయిందని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. నీ మార్గంలో నువ్వు మరింత అంతులేని అవకాశాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నట్లు తన ట్వీట్లో రాసుకొచ్చారు.కాగా.. ఇటీవల మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రిలీజైన 8 రోజుల్లోనే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించిన సంగతి తెలిసిందే. Watching my little niece #Naira sing the #FlyingHigh song from my film #ManaShankaraVaraPrasadGaru filled my heart with indescribable joy ❤️https://t.co/Ghbnf7gQtXThis is just the beginning, my dear. May your path always be bright, joyful, and filled with endless… pic.twitter.com/hxcaTwLiWw— Chiranjeevi Konidela (@KChiruTweets) January 21, 2026 -
టాలీవుడ్ మూవీ అరుదైన ఘనత.. ఇండియాలోనే తొలి చిత్రంగా..!
నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మరొక్కసారి. ఈ మూవీకి నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో జరుగుతోంది. గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ఘనత సాధించింది. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా నిలిచింది.కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్ను కంప్లీట్ చేసే సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తి చేశారు. ఈ మూవీని దక్షిణాది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి కీలక పాత్రల్లో నటించారు. -
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్.. భయపెడుతోన్న టీజర్
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర హీరోగా వస్తోన్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ. ఈ చిత్రంలో దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించింది. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.హనీ టీజర్ చూస్తుంటే క్షుద్రపూజలు, చేతబడులు అనే కాన్సెప్ట్తోనే ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ అనే ఎలిమెంట్స్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందించారు. Silence carries the loudest fear.Some secrets demand silence.Some demand sacrifice.This Year’s Most Devastating Ritual Starts From NOW 🔥Watch Teaser Now 👇https://t.co/rvG68XlA3GHoney Movie - Worldwide Grand Release In Theaters From Feb 6th 🐈⬛ 🔴 @Naveenc212… pic.twitter.com/o9toWlbEqq— Actor Naveen Chandra (@Naveenc212) January 20, 2026 -
మనశంకర వరప్రసాద్గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్గారు. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.300 కోట్లు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ సినిమాలో 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట అభిమానులను విపరీతంగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పాట పాడింది స్వయానా చిరంజీవి మేనకోడలు నైరా అని డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. మెగాస్టార్ సోదరి మాధవి గారి కుమార్తె అని వెల్లడించారు. మనశంకర వరప్రసాద్గారు సినిమాలోని ఈ పాటను అద్భుతంగా పాడిందని కొనియాడారు. ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. #Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026 -
బలగం వేణు ఎల్లమ్మ మూవీ.. దేవీశ్రీతో సుదీర్ఘ చర్చ.!
బలగం మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు మరో చిత్రానికి రెడీ అయిపోయారు. తన రెండో సినిమా టైటిల్ను ప్రకటించిన వేణు.. హీరోను కూడా పరిచయం చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవలే ఎల్లమ్మ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా టాలీవుడ్ సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమాతోనే సంగీత దర్శకుడు డీఎస్పీ హీరోగా అరంగేట్రం చేయనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో వేణు మరో హిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవీశ్రీ ప్రసాద్కు హీరోగా మొదటి సినిమా కావడంతో కథపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథపై ఏకంగా 8 గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.తాజాగా డైరెక్టర్ వేణు యెల్దండి తన ట్వీట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. డీఎస్పీతో ఫస్ట్ మీటింగ్.. ఇది 8 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చ అంటూ పోస్ట్ చేశారు. ఎల్లమ్మ కథపై వీరిద్దరి మధ్య ఏకంగా 8 గంటల పాటు చర్చ సాగిందని దర్శకుడే స్వయంగా వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమాపై వీరిద్దరు ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో డీఎస్పీ పర్శీ అనే పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తన సినిమాకు డీఎస్పీనే సంగీతం అందిస్తున్నారు. The first meeting with @ThisIsDSP Sir….it was 8hours long discussion👌🤗🥰🙏🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼#YellammaGlimpse #Yellamma pic.twitter.com/K7S1VH5g2W— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 19, 2026 -
మనశంకర వరప్రసాద్గారు.. ఆ విషయంలో ఆల్ టైమ్ రికార్డ్..!
మెగాస్టార్ హీరోగా వచ్చిన సంక్రాంతి సినిమా మనశంకర్ వరప్రసాద్గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా రూ.300 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది.ఈ విషయాన్ని నిర్మాత సుస్మిత కొణిదెల ట్విటర్ వేదికగా షేర్ చేసింది. మనశంకర వరప్రసాద్గారు బాక్సాఫీస్ బద్దలైపోయింది అంటూ ట్వీట్ చేసింది. మెగాస్టార్ తన స్వాగ్, స్టైల్తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేసింది. మెగా సంక్రాంతి బ్లాక్బస్టర్.. రెండో వారంలోనూ మెగా విధ్వంసం ప్రారంభమైందంటూ సుస్మిత తన ట్వీట్లో రాసుకొచ్చింది. కేవలం రిలీజైన ఎనిమిది రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. బాక్సాఫీస్ బద్దలైపోయింది💥💥💥Megastar @KChiruTweets garu is breaking box office records with his SWAG and STYLE 😎🔥#ManaShankaraVaraPrasadGaru grosses ₹300+ crores worldwide and becomes an ALL-TIME INDUSTRY RECORD as the FASTEST regional film ❤️🔥… pic.twitter.com/9wmeDz9lKR— Sushmita Konidela (@sushkonidela) January 19, 2026 -
ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్
దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడే దండోరా సినిమా చూశానని.. చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్ ప్రశంసించారు.ఇంత బలమైన కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్ అనే పేరు టైటిల్ పెట్టనున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారని అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. Just watched #Dhandoraa. Deeply thought-provoking and powerful. Outstanding performances by Sivaji garu, Navdeep, Nandu, Ravi Krishna and Bindu Madhavi throughout… Hats off to director Murali Kanth garu for the strong writing and for executing such a rooted story so well.…— Jr NTR (@tarak9999) January 19, 2026 -
అభినవ్ గోమటం లేటేస్ట్ మూవీ.. అమెరికాలో టైటిల్ రివీల్
అభినవ్ గోమఠం, స్వాతి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు వేణు నక్షత్రం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్పై అవంతిక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి సినిమా టైటిల్ ఆవిష్కరించగా.. టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు హాజరై.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ… 'ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జయంత్ చల్లా, నాగేశ్వర్ రావు పూజారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ మెట్రో ప్రాంత ప్రేక్షకులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియా మిత్రులు, మాకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రేమతో వందనాలు. ఇలాగే మీ ప్రేమను, ఆశీర్వాదాలను మా మీద కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం' అని అన్నారు.నిర్మాత అవంతిక మాట్లాడుతూ… 'మా మీద నమ్మకం ఉంచి అండగా నిలిచిన 'ఆటాడిన పాట' చిత్రం టీమ్కు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే మా ప్రయాణానికి బలం. త్వరలోనే ‘ఆటాడిన పాట’ మీ ముందుకు వచ్చి, మీ హృదయాలను తాకుతుంది. ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ ఈ సినిమా నిలబెడుతుంది. సోషియో- ఫ్యాంటసీ కోవలోని ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని' వెల్లడించారు. -
వచ్చేనెలలో విజయ్తో పెళ్లి.. రష్మిక ఏమన్నారంటే?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ అయిపోయింది. గతేడాది ది గర్ల్ఫ్రెండ్తో హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. కొత్త ఏడాదిలోనూ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ.. తనపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నానని తెలిపింది. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దాని కోసమే తాను కూడా ఎదురుచూస్తున్నానంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతానని తెలిపింది. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తానంటూ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాకుండా కెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్లో ఈ విషయం గురించి మాట్లాడతానని రష్మిక సమాధానం దాటవేసింది.కాగా.. విజయ్ దేవరకొండతో ఫిబ్రవరి 26న రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వైరలవుతోంది. రాజస్థాన్లోని ఉదయపూర్లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్. గతేడాది అక్టోబర్లో వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని వార్తలొచ్చాయి. కానీ దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తాజాగా పెళ్లి విషయంలోనూ అదే ఫాలో అవుతూ సర్ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే. Q: There’s been a lot of buzz that #VijayDeverakonda and Rashmika are engaged and getting married on FEB 26th in Udaipur. What’s the truth?#RashmikaMandanna : pic.twitter.com/x6vD2jSIZB— Whynot Cinemas (@whynotcinemass_) January 19, 2026 -
ప్రతి రోజు ఏడ్చేవాడిని.. వదిలేద్దామనుకున్నా: నవీన్ పొలిశెట్టి ఎమోషనల్
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనగనగా ఒక రాజు. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ సినిమా రిలీజైన ఐదు రోజుల్లో వంద కోట్ల మార్క్ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో నవీన్ పొలిశెట్టి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయిందని నవీన్ రాసుకొచ్చారపు. ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులను ధన్యవాదాలు తెలిపాడు. ఈ క్షణం కోసం చాలా సంవత్సరాలు పట్టిందని ఎమోషనల్ ట్వీట్ చేశారు.నవీన్ పొలిశెట్టి తన ట్వీట్లో రాస్తూ..'ముంబైలో నేను ఇచ్చిన ఆడిషన్లన్నింటి గురించి ఆలోచిస్తున్నా. ఎన్నోసార్లు వదిలేయాలనిపించింది. నా ప్రమాదం తర్వాత ఈ సినిమాలో ఎలా నటిస్తాను అని ప్రతిరోజూ ఏడ్చేవాడిని. కానీ ఈ రోజు అనగనగా ఒకరాజు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. నా కళ్లలో ఆనంద భాష్పాలు తిరుగుతున్నాయి. ఈ క్షణం కోసం చాలా ఏళ్లు పట్టింది. నన్ను నమ్మి టికెట్ కొన్నందుకు ధన్యవాదాలు. థియేటర్లలో మేము చూస్తున్న మీ ప్రేమకు, ఉత్సాహానికి ధన్యవాదాలు. ఈ బ్లాక్బస్టర్ అందించిన మా నిర్మాతలకు నా హృదయపూర్వక అభినందనలు. మా లాంటి వారికి మీ మద్దతు, ప్రోత్సాహం ప్రాణం లాంటిది. ఈ విజయం మనందరిది. మీ ప్రేమ, మద్దతు ఇలాగే అందిస్తూ ఉండండి. మీకు మరింత వినోదాత్మక చిత్రాలను అందించడానికి నేను మరింత కష్టపడతా' అంటూ రాసుకొచ్చారు Thinking about all the auditions in Mumbai. Enno saarlu give up cheseyali anipinchindi. Even with this film I used to cry everyday after my accident wondering how I will write and act. Today #AnaganagaOkaRaju has grossed 100 crores worldwide. 🙏🏻🙏🏻🙏🏻My heart is filled with… pic.twitter.com/2GN9Kxl4FI— Naveen Polishetty (@NaveenPolishety) January 19, 2026 -
ప్రముఖ ఆలయంలో బన్నీ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం జపాన్ ట్రిప్లో ఉన్నారు. ఇటీవల పుష్ప-2 మూవీని జపాన్లోనూ రిలీజ్ చేశారు. అంతకుముందు మూవీ ప్రమోషన్స్తో పాల్గొన్న బన్నీ.. ఇప్పుడు కుటుంబంతో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా టోక్యోలోని ప్రముఖ సెన్సోజి ఆలయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం జవాన్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి తొలిసారి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవలే ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇటీవలే బన్నీకి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో చేయనున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్, బన్నీ వాసు వర్క్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) -
ది రాజాసాబ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆదిపురుష్ కంటే తక్కువే..!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. జనవరి 9న రిలీజైంది. తొలి రోజే మిక్స్డ్ టాక్ అందుకున్న రాజాసాబ్ వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కానీ రెండో రోజు నుంచి కలెక్షన్స్ ఆశించినస్థాయిలో రాబట్టలేకపోయింది.ఈ మూవీ రిలీజై వారం రోజులు పూర్తి కావడంతో వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు చూస్తే ది రాజాసాబ్ దేశవ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ.130 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఏడో రోజు ఇండియాలో కేవలం రూ.5.65 కోట్ల నికర వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొదటి వారంలో రూ.200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్ను ది రాజాసాబ్ చేరుకోలేకపోయింది. ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే రూ.156 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించిన ది రాజా సాబ్.. నాలుగు రోజుల్లో రూ.200 కోట్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవరాల్గా చూస్తే ఏడు రోజుల్లో రూ.250 కోట్లకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సాహో చిత్రాలు మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఈ రెండు సినిమాల కంటే ది రాజా సాబ్ వెనకే ఉంది. గతంలో రిలీజైన కల్కి మూవీ వారం రోజుల్లోనే రూ.399 కోట్లు వసూళ్లు సాధించింది. కాగా.. ది రాజాసాబ్ మూవీని రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. -
జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్.. యానిమల్ నటుడి ఎంట్రీ ఫిక్స్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం డ్రాగన్(రూమర్ టైటిల్). టైటిల్ ఇంకా ఖరారు చేయనప్పటికీ ఈ పేరే ఫైనల్ కావొచ్చని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఓ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది.కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ధృవీకరించారు. ఈ మూవీలో కీలక పాత్రలో పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. డ్రాగన్ పోస్టర్ను పంచుకున్న ఆయన.. మరో రెండు లైనప్లో ఉన్నాయని తెలిపారు. అయితే అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. డ్రాగన్లో ఆసక్తికర రోల్లో మెప్పించనున్నారని అర్థమవుతోంది.కాగా.. జూనియక్ ఎన్టీఆర్తో అనిల్ కపూర్ నటిస్తోన్న రెండో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరూ వార్-2లో నటించారు. సందీప్ రెడ్డి వంగా యానిమల్ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడితో మూవీలో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా కనిపించనుంది.One has landed 🐉 The rest two are lining up...#Dragon @AnilKapoor garu via insta story ❤️🔥. #NTRNeel @tarak9999 pic.twitter.com/yWTdgUoFfJ— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) January 16, 2026 -
సత్యతో వరుణ్ తేజ్ కామెడీ.. సంక్రాంతి ఫన్నీ అప్డేట్
వరుణ్ తేజ్ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు.తాజాగా కమెడియన్ సత్యతో ఓ ఫన్నీ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. ఏంటి ఇన్నీ డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారుపడుతూ కనిపించారు. ఇందులో కొరియా భాషల్లో ఉన్న డైలాగ్ను చూసి కొరియన్స్కు వీడియో కాల్ చేసిన ఫన్నీ ఆడియన్స్కు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఫోన్ చేసి ఆ డైలాగ్ గురించి ఆరా తీస్తాడు. ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతోంది.Team #VT15 wishes everyone a #HappySankranthi ❤️Let the celebrations begin with a fun Sankranthi surprise and a twist 😅WHAT IS THIS KOKA??? 😉#VT15TitleGlimpse out on on 19th January ❤️🔥@IAmVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy @DirKrish #Vamsi… pic.twitter.com/VADDlJvdAf— UV Creations (@UV_Creations) January 15, 2026 -
బలగం డైరెక్టర్ రెండో సినిమా..ఆసక్తిగా గ్లింప్స్
బలగం ఫేమ్ వేణు యెల్దండి తెరకెక్కిస్తోన్న మరో చిత్రం ఎల్లమ్మ. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి కానుకగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోగా సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడు పర్షి క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన గ్లింప్స్ చూస్తుంటే సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో కొమ్ములు తిరిగిన పొట్టేలు మరింత ఆసక్తిని పెంచుతోంది. నది ఒడ్డున వర్షంలో దేవీశ్రీ ప్రసాద్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. -
ఓటీటీకి టాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ఆది సాయి కుమార్ హీరోగా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల. డిసెంబర్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆది సాయికుమార్ గ్రాండ్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఇటీవలే జనవరి 9న ఈ మూవీ హిందీలో కూడా విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. జనవరి 22 నుంచే ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ను పంచుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకుంది.శంబాల చిత్రాన్ని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. ఇందులో అర్చన అయ్యర్ హీరోయిన్గా కనిపించింది.ఈ చిత్రంలో స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది.కథేంటంటే... ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు.ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే శంబాల(Shambhala Review) చూడాల్సిందే. Step into a mystical world where myths come alive and destiny roars.#AadiShambhala Premieres 22nd Jan only on #aha(24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana #RajasekharAnnabhimoju #MahidharReddy @ugandharmuni pic.twitter.com/bHke5Hmu5b— ahavideoin (@ahavideoIN) January 15, 2026 -
టాలీవుడ్ యాక్షన్ మూవీ.. సంక్రాంతి అప్డేట్ వచ్చేసింది
రణధీర్ భీసు హీరోగా నటిస్తోన్న చిత్రం మిరాకిల్. ఈ మూవీలో హెబ్బా పటేల్, ఆకాంక్ష హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మంట్ బ్యానర్పై రమేష్ ఏగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈనెల 16న ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ నాయుడు, జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము) బెజవాడ మస్తాన్, ధీరజ అప్పాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
క్రేజీ కాంబో ఫిక్స్.. స్టార్ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ బాటపట్టారు. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే అట్లీతో జతకట్టిన బన్నీ.. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో మూవీకి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాకు ఏఏ23 వర్కింగ్ టైటిల్ను ప్రకటించింది. అల్లు అర్జున్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించనున్నారు. తొలిసారి వీరిద్దరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్లో 23వ చిత్రంగా రానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. A Collaboration that will be Eternal in Indian Cinema 🤘🏻🔥💥Icon Star @alluarjun X @Dir_Lokesh X @MythriOfficial X @anirudhofficialSTRIVE FOR GREATNESS🔥 ▶️ https://t.co/AGCi8q89x2Shoot begins in 2026 💥#AALoki #AA23 #LK7 pic.twitter.com/op2vnureqp— Mythri Movie Makers (@MythriOfficial) January 14, 2026 -
మంచు మనోజ్ దంపతుల భోగి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు భోగి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలతో ఈ పండుగను ఆనందగా జరుపుకున్నారు. ఇంటిముందు భోగి మంటలు వేసి భోగి వైబ్స్ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. మంచు మనోజ్ గతేడాది మిరాయ్ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో అభిమానులను మెప్పించారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాకుండా గతేడాది రిలీజైన భైరవం మూవీలోనూ మంచు మనోజ్ కనిపించారు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
గోల్డెన్ మెమొరీస్.. పాడిపంటలు @ 50 ఇయర్స్
సంక్రాంతి పండుగ అంటే... అందరిలో సంతోషం నింపుతుంది. తెలుగునాట ప్రతి ఇంటా సంబరాలు తెస్తుంది. ధనుర్మాసంలో వేసే సంప్రదాయ, రంగుల ముగ్గులైన నెలవాక ముగ్గులతో, సాతాని జియ్యరుల కీర్తనలతో ఊరంతా సందడి చేస్తుంది. పల్లెపడుచుల సొబగులతో, పిండివంటల ఘుమఘుమలతో, కోడిపందాలతో, ఎడ్ల బండ్ల పోటీలతో నూతనోత్సాహాన్ని అందిస్తుంది. జీవితాలను చైతన్యవంతం చేస్తూ, క్రాంతిని అందించే సంక్రాంతి సరిగ్గా 50 ఏళ్ళ క్రితం... 1976 జనవరి 14న తెలుగు తెరకు ‘పాడిపంటలు’ అందించింది. పి. చంద్రశేఖర రెడ్డి (పి.సి. రెడ్డి) దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ, విజయనిర్మల నటించిన ఆ సూపర్ హిట్ చిత్రం అడుగడుగునా తెలుగుదనం కనబరిచింది. సహజ గ్రామీణ వాతావరణానికి ప్రతిబింబమై నిలిచింది. పల్లెపట్టుల్లోని సిరిసంపదలను కళ్ళకు కట్టినట్లు చూపి, అప్పటికి వరుస వైఫల్యాలతో ఉన్న హీరో కృష్ణ కెరీర్ను మళ్ళీ ఘన విజయాల బాట పట్టించింది. ఆ మరపురాని మ్యూజికల్ హిట్కు నేటితో (2026 జనవరి 14తో) 50 ఏళ్ళు. అది 1974 నాటి సంగతి. మే 1వ తేదీ. సొంత సంస్థ ‘పద్మాలయా’ బ్యానర్పై హీరో కృష్ణ చేసిన అపూర్వ సాహసం ‘అల్లూరి సీతారామరాజు’ రిలీజైంది. అఖండ విజయం సాధించింది. మన్యం వీరుడు, మన తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి పాత్రధారణతో కృష్ణ ఇమేజ్ అమాంతం ఆకాశాన్ని అంటింది. సాక్షాత్తూ ఆ అల్లూరినే చూసిన భావనతో జనం నీరాజనాలు పట్టారు. అపారమైన ఆ కీర్తి ప్రతిష్ఠలు ఆయనకు కొన్ని చిక్కులూ తెచ్చాయి. ఆ తరువాత నుంచి ఆయన ఏ సినిమా చేసినా, జనం ఆ పాత్రతో పోల్చుకొని పెదవి విరవడం మొదలుపెట్టారు. అంతే... ‘దేవదాసు’, ‘చీకటివెలుగులు’, ‘దేవుడు లాంటి మనిషి’... ఇలా వరుసగా ఫ్లాపులే. 1966లో ‘గూఢచారి 116’ రిలీజైనప్పటి నుంచి 1975 వరకు దాదాపు పదేళ్ళు రోజుకు మూడు షిఫ్టులు, ఏడాదికి పది – పన్నెండు సినిమాలు చేసిన ఆ నిర్మాతల హీరోకు ఒక్కసారిగా చిత్రమైన పరిస్థితి. ఇరవై నెలల కాలంలో 15కు పైగా ఫ్లాపులు. వెరసి, 1975 ద్వితీయార్ధంలో కృష్ణ కెరీర్ క్లిష్టదశలో ఉంది. అదిగో... అలాంటి సమయంలో స్వీయ నిర్మాణంలో హీరో కృష్ణ చేసిన మరో సాహసం... ‘పాడిపంటలు’.ఫ్లాపుల్లో అక్కరకొచ్చిన ఆ పాత కథ నిజం చెప్పాలంటే, ‘పాడిపంటలు’ చిత్రకథ అంతకు ముందెప్పుడో దర్శకుడు పి.సి. రెడ్డి మదిలో రూపుదిద్దుకున్న కథ. కృష్ణ, వాణిశ్రీ జంటగా నందినీ ఫిలిమ్స్ పతాకంపై ఆయన డైరెక్ట్ చేసిన ‘ఇల్లు – ఇల్లాలు’ 1972 డిసెంబర్లో రిలీజైంది. అది పెద్ద హిట్. మళ్ళీ అదే సంస్థలో, అదే హీరో హీరోయిన్లతో మరో సినిమా చేసేందుకు అప్పట్లోనే ఆయన అనుకున్న స్టోరీ లైన్... ఈ ‘పాడిపంటలు’. అందరూ ఓకే అనుకున్నా... అనివార్య కారణాల వల్ల ఆ కథ తెరకెక్కలేదు. మూడేళ్ళ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణ బృందంతో మాటల సందర్భంలో ఆ పాత కథ ప్రస్తావన వచ్చింది. కథాంశం విన్న కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు ఈ గ్రామీణ నేపథ్యకథను వెంటనే తెరకెక్కిద్దామన్నారు. అదిగో... అలా ‘పాడిపంటలు’ కథ పట్టాలెక్కింది. ఆకట్టుకున్న గ్రామాభ్యుదయ కథాంశం పల్లెల్లో పెద్దయెత్తున జరుపుకొనే పెద్ద పండుగ సంక్రాంతి. ఆ పండుగ కానుకగా రిలీజైన ‘పాడిపంటలు’ చిత్ర కథాంశం కూడా గ్రామీణ, వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. భారతదేశంలో అధికశాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తుండగా, ఆ గ్రామసీమలే దేశానికి జీవనాడి అన్నారు గాంధీజీ. మహాత్ముని మాటలను ఆదర్శంగా తీసుకొని, గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తీసుకొని తీసిన సినిమా ఇది. దర్శక – కథారచయిత పి.సి. రెడ్డి మన పల్లెల్లోని సహజ వాతావరణాన్నీ, మమతలు – మంచితనాన్నీ ప్రేక్షక జనరంజకంగా రంగుల్లో తెరపైకి తెచ్చారు. నలుగురూ కలసి పనిచేస్తే తమ రామాపురం గ్రామం పురోగమిస్తుందని నమ్మి, ఆ లక్ష్యసాధన కోసం పాటుపడే ఆదర్శ భావాలున్న యువ రైతు గోపాలం (కృష్ణ). కానీ, గ్రామంలోని కొందరు స్వార్థపరుల దుశ్చర్యల వల్ల అనేక కష్టాల పాలైన గోపాలం చివరకు నదిపై ప్రాజెక్ట్ నిర్మాణం సహా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు. హీరోకు మేనమామ (గుమ్మడి) కూతురుగా విజయనిర్మల, నవనాగరిక యువతిగా లత, హీరో తల్లిగా అంజలీదేవి, తమ్ముడిగా చంద్రమోహన్, విధిని ప్రాణంగా భావించే ఇంజనీరుగా జగ్గయ్య, కాంతారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు.గురుభక్తిలో... దటీజ్ హీరో కృష్ణ! ‘పాడిపంటలు’ షూటింగ్ ఆరంభానికి సరిగ్గా వారం ముందే సెప్టెంబర్ 24న కృష్ణకు సినీ జీవితంలో శ్రేయోభిలాషి, మార్గదర్శకులైన నిర్మాత ‘విజయా’ చక్రపాణి దూరమయ్యారు. ఆ బాధ నుంచి తేరుకోక ముందే... సినిమా షూటింగ్ ఆంధ్రాలో అవుట్డోర్లో దూరంగా మొదలైన రోజే రాత్రే... కృష్ణను హీరోగా సినీ రంగానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు మరణించారు. ఒకవైపు భారీ షూటింగ్... మరోవైపు తొలి అవకాశమిచ్చి, తీర్చిదిద్దిన గురుతుల్యుడైన ఆదుర్తి అంత్యక్రియలు! సమయానికి మద్రాసుకు వెళ్ళి నివాళులు అర్పించి రావాలంటే... దూరాభారం, సమయాభావం!! ఆ రోజుల్లో మద్రాసు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూ’ కాపీలు ప్రత్యేకంగా వచ్చేవి. అప్పటికప్పుడు ‘హిందూ’ యాజమాన్యంతో మాట్లాడారు. ఆ రోజుకు షూటింగ్ మానుకొని, విజయవాడ నుంచి తిరిగెళ్ళే విమానంలో కృష్ణ, విజయనిర్మల ప్రత్యేకంగా మద్రాసు వెళ్ళారు. ఆదుర్తి భౌతికకాయాన్ని దర్శించి వచ్చి, మర్నాడు షూటింగ్లో పాల్గొన్నారు. అదీ హీరో కృష్ణకున్న కృతజ్ఞత, గురుభక్తి.అలా... ఆ ముగ్గురూ మారారు! పి.సి. రెడ్డి అనుకున్న ఈ చిత్ర ఇతివృత్తానికి మొదట రచయితగా పనిచేయాల్సింది – ఆచార్య ఆత్రేయ. అందరూ కలసి పూర్తిస్థాయి స్క్రిప్టు వండసాగారు. దాదాపు నెల రోజుల దాకా స్క్రిప్టుపై పని చేసిన ఆత్రేయ ‘అసలు ఈ కథలో పాడి లేదు... పంట లేదు’ అని చీకాకు పడుతూ, పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో రచయిత మహారథి ప్రవేశించారు. ఆయన, దర్శకుడు, హీరో కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు, తదితరులు కలసి మొత్తం స్క్రిప్టు సిద్ధం చేశారు. నవరసాల ఆ స్క్రిప్టుకు హనుమంతరావు స్క్రీన్ప్లే చేస్తే, మహారథి అద్భుతంగా మాటలు రాశారు. అలాగే, ముందుగా ఈ సినిమాకు ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి పనిచేసిన ఆదినారాయణరావుతో సంగీతం చేయిద్దామనుకున్నారు. అయితే, ఆయన అప్పటికే అక్కినేనితో నిర్మిస్తున్న సొంతచిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’తో బిజీగా ఉన్నారు. మరోపక్క దర్శకుడు పి.సి. రెడ్డి సైతం తనకు అలవాటైన మ్యూజిక్ డైరెక్టర్ కె.వి. మహదేవన్ వైపు మొగ్గడంతో, ఆయనను సంగీతానికి ఎంచుకున్నారు. ‘పద్మాలయా’ సంస్థకు సన్నిహితులైన వి.ఎస్.ఆర్. స్వామి ఎప్పటిలానే ‘పాడిపంటలు’కు కూడా ఛాయాగ్రాహణం అందించాలి. ఈస్ట్మన్కలర్లో తీసిన ఈ చిత్రం షూటింగ్ మానికొండలో మొదలయ్యాక ఓ వారం పాటు ఆయనే కెమెరా వర్క్ చేశారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఆయన స్థానంలో ఆయన సహాయకుడు పుష్పాల గోపీకృష్ణ కెమెరా బాధ్యతలు స్వీకరించి, సినిమా మొత్తం ఆయనే పూర్తి చేశారు. నిర్మాత జి. ఆదిశేషగిరిరావు మాటల్లో చెప్పాలంటే, ‘‘ఆ సమయంలోనే వి.ఎస్.ఆర్. స్వామికి బాపు – రమణల ‘భక్త కన్నప్ప’ చిత్రం ఉంది. మళ్ళీ డేట్ల ఇబ్బంది వస్తుందని, పరస్పర అంగీకారంతోనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అప్పటికే ‘పద్మాలయా’ సంస్థలో ‘దేవుడు చేసిన మనుషులు’ (1973), ‘అల్లూరి సీతారామరాజు’ (1974) లాంటి చిత్రాలకు పనిచేసిన పుష్పాల గోపీకృష్ణ అలా ఈ ‘పాడిపంటలు’కు పూర్తిస్థాయి ఛాయాగ్రాహకుడయ్యారు.’’ సినిమా క్లైమాక్స్లో విలన్లు లాంచీపై వెళుతూ ఉంటే, దానికి సమాంతరంగా రోడ్డు మీద ఎడ్లబండిపై వాళ్ళను తరుముతూ వెళతాడు. జలపాతాల నడుమ లాంచీలో ఫైటింగ్ జరుగుతుంది. మరోపక్క ఆనకట్టను బాంబులతో కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఇలా ఉత్కంఠభరితంగా మూడు వేర్వేరు ఘట్టాలతో పతాక సన్నివేశాలు సాగుతాయి. గోపీకృష్ణ కెమెరా పనితనం, కోటగిరి గోపాలరావు (నేటి ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు అన్నయ్య) ఎడిటింగ్ ఆ దృశ్యాలను ఆసక్తిగా తెరపైకి తెచ్చాయి. ఇక, జలపాతం నడుమ లాంచీని కాపాడడం, హీరో బండిని ఎడ్లు వరద గోదావరిని దాటించే సన్నివేశాల లాంటి వాటిని మాత్రం మినియేచర్లతో మద్రాసు వాహినీ స్టూడియోలో ట్రిక్ ఫొటోగ్రఫీతో ప్రముఖ ఛాయాగ్రహణ మాంత్రికుడు రవికాంత్ నగాయిచ్ చిత్రీకరించారు. అంతా అవుట్డోర్లోనే... రైతు కుటుంబాల కథగా సాగిన ‘పాడిపంటలు’లో విశేషం ఏమిటంటే, ఆ సినిమా మొత్తం అవుట్డోర్లోనే చిత్రీకరణ జరుపుకొంది. ‘‘అంతకు ముందు ‘మూగమనసులు’ లాంటివి గోదావరి దగ్గర లంకల్లో ఆ పక్కన తీశారు కానీ గోదావరికి ఇటు కొవ్వూరు వైపు మొత్తం షూటింగ్ చేసిన మొదటి సినిమా మా ‘పాడిపంటలే’. కృష్ణాజిల్లాలోని విజయవాడ, గుడివాడ మధ్యలో ఉన్న మానికొండ గ్రామంలో 1975 అక్టోబర్ 1న షూటింగ్ మొదలుపెట్టాం. వీధులు, ఇళ్ళు వగైరా ఉన్న ప్రధాన సన్నివేశాలన్నీ మానికొండలో తీస్తే, రాజమండ్రి పరిసరాల్లో 15 రోజులు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమా కోసం తూర్పు గోదావరి జిల్లా డొంకరాయి, చింతపల్లి, అలాగే ప్రసిద్ధమైన పట్టిసీమ గుడి, ధవళేశ్వరం ఆర్థర్ కాటన్ గెస్ట్హౌస్, కడియం గ్రామం, ఆత్రేయపురం ప్రాంతంలోని లొల్ల లాకులు, షూటింగులతో ‘సినిమా చెట్టు’గా ప్రసిద్ధమై ఇటీవల పడిపోయిన కుమారదేవం దగ్గరి భారీ వృక్షం దగ్గర, సీలేరు ప్రాజెక్టు... ఇలా అనేకచోట్ల చిత్రీకరణ జరిపాం. షూటింగ్ మొదలైనప్పటి నుంచి మూడే మూడు నెలల్లో ఇంత భారీ చిత్ర నిర్మాణం పూర్తి చేసి, డిసెంబర్ ఆఖరికే సెన్సార్ కూడా జరిపించేశాం. ముందు అనుకున్నట్టే సంక్రాంతి పండుగకు రిలీజ్ చేశాం’’ అని నిర్మాత జి. ఆదిశేషగిరిరావు ‘సాక్షి’కి వివరించారు.‘బెన్హర్’ ప్రేరణతో... గుంటూరులో! సినిమా మొదట్లో వచ్చే ఎడ్ల బండ్ల పందాల దృశ్యాలను చివరలో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియమ్లో భారీయెత్తున తీశారు. హీరో కృష్ణ, విలన్ ప్రభాకరరెడ్డి పాల్గొనే ఎడ్ల బండ్ల పోటీని భారీ జనసందోహం మధ్య ఎంతో వ్యయప్రయాసలతో ఉత్కంఠభరితంగా చిత్రీకరించారు. ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ‘బెన్హర్’లోని రథాల పోటీ సన్నివేశం ఈ ఎడ్ల బండ్ల పోటీకి స్ఫూర్తి. విలన్ బండి చక్రాలకు అమర్చిన ఇనుపముళ్ళు కాస్తా హీరో ఎడ్ల బండి చక్రం ఆకులను కోసివేస్తాయి. దాంతో హీరో బండి చక్రం ఒకటి ఊడిపోతుంది. మిగిలిన ఒకే చక్రంతో ఎడ్ల బండిని పరుగులు తీయించి, హీరో గెలిచే ఆ ఘట్టాన్ని కెమెరామన్ పుష్పాల గోపీకృష్ణ ఉత్కంఠరేపేలా సెల్యులాయిడ్పైకి ఎక్కించారు. కృష్ణ సోదరుడు హనుమంతరావు ఆ చిత్రీకరణ సజావుగా సాగేలా కృషి చేశారు.శ్రేయోభిలాషులు వద్దన్నా... సంక్రాంతి బరిలోనే! ‘పాడిపంటలు’ రిలీజ్ కూడా సంచలనమే. అప్పట్లో కృష్ణ చిత్రాలను ప్రసిద్ధ పంపిణీదారులు ‘తారకరామా ఫిలిమ్స్’ వారు వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ‘పాడిపంటలు’ డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళే. సంక్రాంతికి సినిమా రిలీజని కృష్ణ ముందే ప్రకటన రిలీజ్ చేసేశారు. సరిగ్గా ఆ ఏడాది అదే సమయానికి ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్బాబుల సినిమాలున్నాయి. అప్పటికే వరుస ఫ్లాపులతో ఉన్నందున ఎన్టీఆర్, శోభన్బాబు లాంటి వాళ్ళతో ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీ ఎందుకని శ్రేయోభిలాషులు వారించారు. ప్రసిద్ధ పంపిణీదారు – ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేత చంద్రశేఖరరావు అయితే స్నేహంకొద్దీ స్వయంగా వచ్చి కలసి, కృష్ణకు చెప్పి చూశారు. అయితే, సినిమా మీద నమ్మకం, కెరీర్లో తాడో పేడో తేల్చుకోవాలన్న తెగింపుతో ఉన్న డేరింగ్ హీరో కృష్ణ వెనక్కి తగ్గలేదు. సంక్రాంతి బరికే సై అన్నారు. ఆదుర్తి మరణంతో అక్కినేని ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్ పూర్తి కాలేదు. ఆ సంక్రాంతికి అది జనం ముందుకు రాలేదు. కానీ, ఎన్టీఆర్ సొంత సినిమా ‘వేములవాడ భీమకవి’ (జనవరి 8న రిలీజ్), అలాగే ‘జీవనజ్యోతి’, ‘సోగ్గాడు’ లాంటి వరుస హిట్ల జోరు మీద ఉన్న శోభన్బాబు హీరోగా వి.బి. రాజేంద్రప్రసాద్ తీసిన ‘పిచ్చిమారాజు’ (జనవరి 9న రిలీజ్) రిలీజయ్యాయి. ‘పాడిపంటలు’ రిలీజ్ తేదీకి అవి వచ్చి వారమే అయింది. ఇక, ‘పాడిపంటలు’ రిలీజ్ రోజునే హీరో రామకృష్ణ సమర్పణలో జానపదబ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో జానపద చిత్రం ‘కోటలో పాగా’ కూడా వచ్చింది. అయితే, చివరకు కృష్ణ సాహసమే నెగ్గింది. మిగతా పెద్ద సినిమాలన్నీ ఫ్లాపయితే, అప్పటి దాకా వరుస ఫ్లాపుల్లో ఉన్న కృష్ణను విజయలక్ష్మి వరించింది. కథతో పాటు మహారథి మాటలు, ప్రముఖ గీత రచయితల పాటలు కూడా పెద్ద హిట్టవడంతో ‘పాడిపంటలు’ విపరీతంగా ప్రేక్షకుల్ని ఆకర్షించింది. పక్కనే ఇతర హీరోల చిత్రాలున్నా, బాక్సాఫీస్ వద్ద ‘పాడిపంటలు’ ఊపు తగ్గలేదు. ఆ సంక్రాంతికి కలెక్షన్ల మొనగాడుగా కీర్తి ఆయనకే దక్కింది. మరో విశేషమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్ సమయానికి బాపు– రమణల ‘ముత్యాలముగ్గు’ (1975) సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. అంతకు ముందు ఏడాదైన 1975లో రిలీజై, ఆ ఏటి మేటి చిత్రంగా ప్రేక్షకుల గౌరవాదరణలు పొందిన ‘ముత్యాలముగ్గు’ ఆ సంక్రాంతి నాటికి 5 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుంది.జనం మెచ్చిన జంతువుల యాక్షన్! ‘పాడిపంటలు’కు మరో ఆకర్షణ ఆ సినిమాలో హీరో పోషించే ఎడ్ల జత. బలిష్ఠమైన ఆ ఎడ్లు సినిమాలో చేసే రకరకాల విన్యాసాలు, పాల్గొనే పందాలు, లాగే బరువులు నాటి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఏ పని అయినా చేసేలా శిక్షణ పొందిన ఆ ఎడ్లను ప్రత్యేకంగా కొని, ఈ సినిమా కోసం వాడడం గమనార్హం. హీరో కృష్ణ తండ్రి గారైన వీరరాఘవయ్య చౌదరి ప్రత్యేకంగా ఒంగోలు దగ్గర పరుచూరు దగ్గర నుంచి ఈ ఎడ్ల జతను కొని, తీసుకొచ్చారు. విశేషం ఏమిటంటే, సినిమా అయిపోయినా సెంటిమెంటుగా వాటిని ఆప్యాయంగా తమ దగ్గరే స్వగ్రామంలో ఉంచుకొని సాకారు. పొలం పనులకు సైతం వాడేవారు కాదు. పశువులను సైతం వాటి జీవితాంతం అలా ప్రాణంగా చూసుకోవడం నాటి పల్లె సంస్కృతిలోని ప్రత్యేకత. ఇక, ‘పాడిపంటలు’లోనే హీరో హీరోయిన్ల వెంట హనుమాన్ అనే ఓ పొట్టేలు ఉంటుంది. అది చేసే విన్యాసాలను తెరపై చూసి, జనం ఆస్వాదించారు. అప్పటికే రకరకాల జంతువులతో సినిమాలు తీయడంలో దక్షిణాది చిత్రసీమలో ‘దేవర్ ఫిలిమ్స్’ అధినేత – నిర్మాత ‘శాండో’ ఎం.ఎం.ఎ. చిన్నప్ప దేవర్ ఫేమస్. ‘పాడిపంటలు’ చూసిన ఆయన ‘నేను రకరకాల జంతువులను పెట్టి, సినిమాలు తీశాను కానీ, పొట్టేలుతో కూడా సినిమా చేయొచ్చని ఈ సినిమా చూశాక తెలిసింది’ అన్నారట. అలా ఆ తర్వాత ‘పాడిపంటలు’ పొట్టేలు దృశ్యాల ప్రేరణతోనే శ్రీప్రియ, మురళీమోహన్లతో సూపర్ హిట్ ‘పొట్టేలు పున్నమ్మ’ (1978) నిర్మించారు.విజయవాడ మిస్సయిన పద్మాలయా స్టూడియో! ‘పాడిపంటలు’ షూటింగ్ ఆరంభమయ్యే సమయానికే తెలుగు చిత్రసీమను హైదరాబాద్కు ఆకర్షించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. 1975 ఆగస్టులోనే టాప్ హీరోలు ఏయన్నార్, ఎన్టీఆర్లు హైదరాబాద్లో సొంత సినిమా స్టూడియోల నిర్మాణానికి శంకుస్థాపనలు కూడా చేసేశారు. జూబ్లీహిల్స్లో 15 ఎకరాల్లో ఏయన్నార్ అన్నపూర్ణా స్టూడియోస్, ముషీరాబాద్లో మూడున్నర ఎకరాల్లో ఎన్టీఆర్ రామకృష్ణా స్టూడియో... రెండింటి నిర్మాణం జోరుగా సాగుతోంది. అప్పటికే, ఆంధ్రాలో తానూ సొంతంగా స్టూడియో పెట్టాలనే బలమైన ఆలోచనతో కృష్ణ ముందుకు సాగుతున్నారు. ‘పాడిపంటలు’ నిర్మాణ సమయానికే ‘పద్మాలయా స్టూడియో’ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు విజయవాడ – గుంటూరు మధ్య చినకాకాని వద్ద స్థలం కేటాయించింది. ‘సినిమా విడుదల తర్వాత స్టూడియో నిర్మాణ కార్యక్రమాలు ఆరంభిస్తాం’ అని కృష్ణే స్వయంగా చెప్పారు. అప్పట్లో విజయవాడలోని హనుమాన్పేటలో అందుకోసం కార్యాలయం కూడా ఏర్పాటుచేశారు. చిత్రమేమంటే, సరిగ్గా ‘పాడిపంటలు’ రిలీజ్ రోజునే హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు సొంత స్టూడియో ‘అన్నపూర్ణా స్టూడియోస్’ ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత అనేక కారణాల వల్ల చివరకు పద్మాలయా స్టూడియో అక్కడ కాకుండా హైదరాబాద్లో స్థాపితమైంది.కర్ణార్జునులుగా... కృష్ణ ‘కురుక్షేత్రం’ కల! ‘పాడిపంటలు’ షూటింగ్ సమయానికే కృష్ణ మనసులో భారీ పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’ కల ఉంది. ఆ మహాభారత కథలో కర్ణుడు, అర్జునుడు... రెండు పాత్రలూ తానే ధరించాలన్నది ఆయన ఆలోచన. అయితే, అలాంటి భారీ ఇతివృత్తాన్ని సినిమాగా తీయాలంటే నిర్మాణానికి చాలా వ్యయం అవుతుందనీ, పెట్టే పెట్టుబడికీ – వచ్చే వసూళ్ళకూ సరైన పొంతన కనిపించడం లేదనీ వెనకాడారు. ఆనాటి తెలుగు చిత్రాలకు ఉన్న పరిమితుల దృష్ట్యా... పరిస్థితులు ‘కురుక్షేత్రం’ లాంటి భారీ చిత్ర నిర్మాణానికి అనువైనవి కావనీ, పరిస్థితులు అనుకూలించినప్పుడు, వీలుంటే రష్యా లాంటి దేశాల సహ భాగస్వామ్యంతో ఆ చిత్రాన్ని నిర్మించాలని కృష్ణ భావించారు. అయితే, చాలామందికి తెలియనిదేమిటంటే... ‘పాడిపంటలు’ రిలీజైన కొన్నాళ్ళకే 1976 మొదట్లోనే ఎన్టీఆర్ మాత్రం తన ‘దానవీరశూర కర్ణ’ చిత్ర నిర్మాణం మొదలుపెట్టేశారు. సినారె రచించిన ‘జయీభవ... విజయీభవ...’ అన్న సుయోధనుడి స్వాగత గీతం రికార్డింగ్ కూడా అప్పట్లోనే చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు అటు ఎన్టీఆర్ ‘కర్ణ’, ఇటు కృష్ణ ‘కురుక్షేత్రం’ పోటాపోటీగా నిర్మాణం సాగడం, సరిగ్గా ఏడాది తర్వాత 1977 సంక్రాంతికి వాటి మధ్య కనివిని ఎరుగని బాక్సాఫీస్ యుద్ధం జరగడం మరో పెద్ద కథ!ఎమ్జీఆర్ రీమేక్ చేయాలనుకున్నా... ‘పాడిపంటలు’ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించడంతో ఆ కథను ఇతర భాషల్లోకి రీమేక్ చేయాలనే ఆలోచన అప్పట్లో బలంగా కలిగింది. తమిళంలో అప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉండి, డీఎంకె పార్టీ నుంచి బయటకొచ్చేసి, అన్నా డీఎంకె పేరిట కొత్త పార్టీ పెట్టి, రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు తమిళ అగ్రహీరో ఎం.జి. రామచంద్రన్. ఆయన ‘పాడిపంటలు’ తమిళంలో చేయాలని ముచ్చటపడ్డారు. అప్పటికే ఆయన ఊరూరా పార్టీ సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. అయినా సరే, ఓ రోజు రాత్రి వేళ మద్రాసులో ఆయన కోసం ‘పాడిపంటలు’ స్పెషల్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. వేరే ఊళ్ళో సభలో ఉన్న ఎమ్జీఆర్ అది ముగించుకొని మద్రాసుకు రావడానికి రైలు మిస్సయింది. కారులో బయలుదేరారు. తీరా మద్రాసులో ప్రొజెక్షన్ థియేటర్ వద్దకు చేరేసరికి, అర్ధరాత్రి దాటేసింది. అలసిసొలసిన ఆయన ఇంకేం సినిమా చూస్తారని దర్శకుడు పి.సి. రెడ్డి తదితరులు అనుకుంటే, ఎమ్జీఆర్ మాత్రం ఆసక్తిగా ఆసాంతం సినిమా చూసి, సినిమా చాలా బాగుందని దర్శకుడిని అభినందించారు. హీరోగా తన ఆఖరు సినిమాగా, హీరోయిన్ లత జోడీగా, పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే తమిళంలో ‘పాడిపంటలు’ చేద్దామన్నారు. ఆ రీమేక్ ప్రయత్నాలు జరుగుతుండగానే, 1977 ఎన్నికల్లో ఎమ్జీఆర్ ఘన విజయం సాధించి, తమిళనాడు సీఎం అయ్యారు. దాంతో, పూర్తిగా పట్టాలెక్కకుండానే ఆ తమిళ రీమేక్ ఆగిపోయింది. ఇక, తన కెరీర్కు కీలకమైన బ్రేక్ ఇచ్చిన ‘పాడిపంటలు’ చిత్రాన్ని పి.సి. రెడ్డి దర్శకత్వంలోనే హిందీలో జితేంద్ర హీరోగా రీమేక్ చేయాలని కృష్ణకు అప్పట్లో బలంగా కోరిక. కానీ, ఎందుకనో అదీ తీరనే లేదు.మారుమోగిన మ్యూజికల్ హిట్! ‘పాడిపంటలు’ పాటలు అప్పట్లో జనంలో తెగ వినిపించాయి. ప్రసిద్ధ నాటక – సినీ రచయిత మోదుకూరి జాన్సన్ రాసిన ‘మన జన్మభూమి బంగారుభూమి... పాడిపంటలతో పసిడిరాశులతో... కళకళలాడే జననీ... మన జన్మభూమీ...’ పాట ఆల్టైమ్ హిట్. కె.వి. మహదేవన్ సంగీతం, అలాగే ‘రైతు లేనిదే రాజ్యంలేదని...’ రైతు గొప్పదనాన్నీ, రైతు రాజ్యం ఘనతనూ అవిస్మరణీయంగా చెప్పి, భరతమాతకు నీరాజనాలిచ్చే జాన్సన్ సాహిత్యం ఆ పాటను ఇవాళ్టికీ గొప్పగా నిలిపాయి. అలాగే, ఆనకట్ట నిర్మాణ సందర్భానికి తగ్గట్టు శ్రీశ్రీ రాసిన ‘పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా... రండోయ్ రారండోయ్ మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్...’ ఆకట్టుకుంది. కృష్ణ – విజయనిర్మలపై వచ్చే ‘ఇరుసు లేని బండి... ఈశ్వరుని బండి... చిరతలే లేనిది చిన్నోడి బండి...’ పాట (ఆత్రేయ రచన) పెద్ద హిట్. ‘ఆడుతూ పాడుతూ జోరుగా వసంతమాడాలి...’ అనే ఊరి సంబరాల పాట, ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్... ముద్దపప్పోయ్ మూడట్లోయ్... ముద్దుగుమ్మ పట్నం బొమ్మకు వడ్డిద్దాం వేడట్లోయ్...’ లాంటివీ అలరించాయి. అలా పాటలన్నీ సూపర్హిట్. అక్కడ నుంచి ‘సూపర్స్టార్’ సెకండ్ ఇన్నింగ్స్! అప్పట్లో ‘పాడిపంటలు’ చిత్రం 33 కేంద్రాల్లో 50 థియేటర్లలో రిలీజైంది. సంక్రాంతి సీజన్ కావడం... పండగకు రిలీజ్ అవడం... సినిమాలో సెంటిమెంట్, వినోదం పుష్కలంగా ఉండడం... పైగా సినిమా మ్యూజికల్ హిట్ కావడం... ఇవన్నీ ‘పాడిపంటలు’కు కలిసొచ్చాయి. ముఖ్యంగా, గ్రామీణ నేపథ్యంలోని ఈ చిత్రాన్ని పట్నాలతో పాటు పల్లెల్లోనూ బాగా ఆదరించారు. మహిళా ప్రేక్షకులు పెద్దయెత్తున నీరాజనాలు పట్టారు. ‘‘అందుకే, ఆ సినిమాకు ఊహించని రెవెన్యూ వచ్చింది. ఫస్ట్ డే ఎంత షేర్ వచ్చిందో, అయిదో రోజు కూడా అంత షేర్ వచ్చింది. మా సంస్థ నిర్మించిన సినిమాల్లో అధిక వసూళ్ళు తెచ్చినవాటిలో ఒకటిగా నిలిచింది. రిపీట్ రన్స్లో కూడా బాగా ఆడి, మా సంస్థకు చిరస్మరణీయ చిత్రంగా మిగిలింది’’ అని ఆదిశేషగిరిరావు వివరించారు. అప్పట్లో ‘పాడిపంటలు’ 27 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ పైన 6 (విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, తిరుపతి) కేంద్రాల్లో డైరెక్ట్గా, ఒక కేంద్రం (కాకినాడ)లో షిఫ్టులతో... మొత్తం 7 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. తర్వాత హైదరాబాద్లో షిఫ్టింగులతో 175 రోజులు పూర్తి చేసుకొని, సిల్వర్ జూబ్లీ జరుపుకొంది. అంతే... ‘అల్లూరి సీతారామరాజు’ ఇమేజ్ క్రీనీడలో చిక్కుకొని, వరుస ఫ్లాపులు చవిచూస్తున్న కృష్ణను ఒక్కసారిగా పరాజయాల గ్రహణం వీడింది. ఆ నీడలో నుంచి బయటపడ్డ ఆయన కెరీర్ మళ్ళీ పట్టాలెక్కింది. అలా అక్కడ నుంచి కృష్ణ రెండో ఇన్నింగ్స్ మొదలైంది. ఆ తర్వాత అనేక ఏళ్ళ పాటు సిల్వర్స్క్రీన్పై ‘సూపర్స్టార్’ కృష్ణ మ్యాజిక్ కొనసాగింది. అదీ ‘పాడిపంటలు’ ఘనత!రచన – రెంటాల జయదేవ -
చిరంజీవి కుమారుడిగా చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో తెలుసా?
మెగాస్టార్-చిరంజీవి కాంబోలో వచ్చిన సంక్రాంతి సినిమా 'మనశంకర వరప్రసాద్గారు'. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుంటోంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. వెంకటేశ్ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.అయితే ఈ చిత్రంలో అబ్బాయిగా నటించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది చిన్నారి గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఎవరీ బుజ్జాయి అంటూ తెగ వెతికేస్తున్నారు. ఆమె చిన్నారి పేరు ఊహ కాగా.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బుజ్జితల్లి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలపై ఇష్టంతో ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా విడుదలైన మన శంకరవరప్రసాద్ గారులో చిరంజీవికి కుమారుడిగా నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటూ తెగ మురిసిపోతోంది. షూటింగ్ సెట్లో చిరంజీవి తనను ఎంత ప్రేమగా చూసుకునేవారని అంటోంది. -
'అసలు నీవల్ల ఏంటి ఉపయోగం అనేవారు'.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబో అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వెంకీ మామ కూడా ఈ మూవీలో కనిపించడంతో క్రేజ్ మరింత పెరిగిపోయింది. మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా బ్లాక్బస్టర్ థ్యాంక్యూ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిన్నప్పుడు మా నాన్న నన్ను తిట్టేవాడని భీమ్స్ సిసిరోలియో అన్నారు. నువ్వు దేనికి రావు రా.. నీవల్ల ఏంటి ఉపయోగం అని అనేవారని గుర్తు చేసుకున్నారు. నాన్న ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను.. నా ముందు అనిల్ రావిపూడి ఉన్నారు.. నా వెనుక చిరంజీవి గారు ఉన్నారని ఎమోషనలయ్యారు. ఇది ఒక మాటతోనో.. చేసిన పాటలతోనో చెప్పుకునేది కాదు.. మీరు నన్ను ఎందుకు నమ్ముతారో తెలియదు.. నన్ను తోడబుట్టిన తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారంటూ అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించారు. ఈ వేదిక నుంచి చెబుతున్నా.. నీ తల్లిదండ్రులకు, నీకు నా పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.భీమ్స్ మాట్లాడుతూ..' చిన్నప్పుడు నీ వల్ల ఏంటిరా ఉపయోగం అని నాన్న తిట్టేవారు. నాన్నా.. ఇప్పుడు ఇక్కడున్న.. నా ముందు అనిల్గారు.. నా వెనుక చిరంజీవిగారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చెప్పినా భీమ్స్ ఉంటే బాగుంటుందని నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. నా కష్టానికి మీరు చూపించిన ప్రేమకు రుణపడి ఉంటా. సినిమా మొదలైనప్పటి నుంచి నాకు ఒక్కటే అనిపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు. ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొడుకు గొప్ప దర్శకుడు అయ్యాడు. ఒక సాధారణ రైతు కొడుకునైన నేను వాళ్లతో కలిసి పనిచేశాను. కర్షకుడు, కార్మికుడు, రక్షకుడు.. ఇలా ముగ్గురు కలిసిన త్రివేణి సంగమంలా అనిపిస్తోంది' అని అన్నారు. -
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అండర్వేర్తో రోడ్డుపై నడుస్తా: టాలీవుడ్ నటుడు
శర్వానంద్ హీరోగా వస్తోన్న సంక్రాంతి సినిమా నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు.ఈ మూవీ రిలీజ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు మేకర్స్. ఈ ప్రెస్ మీట్కు హాజరైన టాలీవుడ్ నటుడు వీకే నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఏ క్యారెక్టర్ అయినా నేను ఎలాంటి లిమిట్స్ పెట్టుకోనని వీకే నరేశ్ అన్నారు. క్యారెక్టర్కు గౌరవం ఇస్తానని.. అందరికీ నచ్చేలా చేయడమే నా పని అన్నారు. గుంటూరు టాకీస్లో బాత్రూమ్లో సీన్ పెట్టారు.. అందులో చాలా ఎమోషన్ ఉంది అందుకే ఆ క్యారెక్టర్ చేశానని తెలిపారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆండర్ వేర్తో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తానని వీకే నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా.. వీకే నరేశ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.ఒక నటుడిగా ఎలాంటి లిమిటేషన్స్ పెట్టుకోను.. పాత్ర కోసం కావాలంటే ఆండర్ వేర్ తో రోడ్డు మీద నిల్చోమన్నా నేను రెడీ - నరేష్#Sharwanand #Samyuktha #SakshiVaidya #NariNariNadumaMurari #AnilSunkara pic.twitter.com/PAvkfJHXVf— Filmy Focus (@FilmyFocus) January 12, 2026 -
కంగ్రాట్స్ మామయ్య.. చిరుకు మెగా కోడలు స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంబురాల్లో మునిగిపోయారు. పలువురు టాలీవుడ్ సినీతారలు మూవీ టీమ్ను అభినందిస్తున్నారు.తాజాగా మెగా కోడలు ఉపాసన కొణిదెల సైతం మనశంకర వరప్రసాద్కు అభినందనలు తెలిపింగి. 'ఇది మెగా సంక్రాంతి.. హృదయపూర్వక అభినందనలు మామయ్య' అంటూ ఈ సినిమాలోని ఓ వీడియో క్లిప్ను షేర్ చేసింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రానికి మొదటి షో నుంచే సూపర్ హిట్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఈ సినిమాను ఏఎంబీ సినిమాస్లో రామ్ చరణ్ వీక్షించారు. It’s a MEGA SANKRANTHI hearty congratulations Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela ❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026 -
కాంబో సూపర్ హిట్.. డైరెక్టర్కు మెగాస్టార్ అభినందనలు
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.మనశంకర వరప్రసాద్ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో అనిల్ రావిపూడిని మెగాస్టార్ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు. Cherishing moments with Megastar @KChiruTweets garu for team #ManaShankaraVaraPrasadGaru ❤️🔥✨Experience the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥#MegaBlockbusterMSG IN CINEMAS NOW ❤️ pic.twitter.com/dhcbC4L7pL— Shine Screens (@Shine_Screens) January 12, 2026 Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026 -
సంక్రాంతి సినిమాకు బంపరాఫర్.. ఎమ్మార్పీకే టికెట్స్..!
ఈ సంక్రాంతి టాలీవుడ్ సినిమాలు పెద్దఎత్తున సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ది రాజాసాబ్, మనశంకర వరప్రసాద్గారు రిలీజై థియేటర్లలో అలరిస్తున్నాయి. వీటితో రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు చిత్రాలు అలరించేందుకు రెడీ అయిపోయాయి. ఈ నెల 14న శర్వానంద్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఆడియన్స్కు బంపరాఫర్ ప్రకటించింది. నారీ నారీ నడుమ మురారి మూవీ టికెట్ ధరలపై క్రేజీ ఆఫర్ అనౌన్స్ చేసింది. కేవలం ఎమ్మార్పీ ధరలకే ఈ మూవీ టికెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని.. ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా.. శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, రామబ్రహ్మ సుంకర నిర్మించారు. ఈ సంక్రాంతికి అసలైన పండుగ ఆఫర్! 🔥 MRP ధరలకే టికెట్లు 🎟️Catch #NariNariNadumaMurari at no extra charges! 🙌𝐎𝐧𝐥𝐲 𝐄𝐱𝐭𝐫𝐚 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭! 😎🤩💥Watch Trailer here 🔗 https://t.co/iZRE43vZzlLets Celebrate in theatres from Jan 14 | 5:49 PM onwards… pic.twitter.com/cDfrEBhL8e— AK Entertainments (@AKentsOfficial) January 12, 2026 -
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రవితేజ మాట్లాడారు.రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026 -
మనశంకర వరప్రసాద్ గారు.. ప్రీమియర్స్ బుకింగ్స్ టైమ్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ నయనతార హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ రిలీజ్కు ముందు రోజు ప్రీమియర్స్ వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. తెలంగాణలోనూ అనుమతులు రావడంతో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు నైజాం ప్రీమియర్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.కాగా.. చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జీఓ విడుదల చేసిన విషయం తెలిసిందే. 11వ తేదీన వేసే ప్రీమియర్ల ఒక్కో టికెట్ రూ.600గా నిర్ణయించారు. అలానే 12వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఒక్కో టికెట్పై సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్స్ల్లో రూ.100 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. The stage is set for the Mega Victory Mass Entertainer 🥳❤️🔥#ManaShankaraVaraPrasadGaru NIZAM PREMIERES BOOKINGS Open TOMORROW 9AM🔥Grab your tickets for #MSG exclusively on @district_india 🎫— https://t.co/4IW3XsgR2Z#MSGonJan12th pic.twitter.com/JAlhRdrtOQ— SVC Release (@SVCRelease) January 10, 2026 -
ది రాజాసాబ్ మేకర్స్కు బిగ్ షాక్..!
ది రాజాసాబ్ మూవీ మేకర్స్కు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపు కోరుతూ నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో సాధారణ ధరలకే తెలంగాణలో ది రాజాసాబ్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ నిర్ణయంతో ది రాజాసాబ్ నిర్మాతలకు పెద్ద షాక్ తగిలింది. కాగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కించిన హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో రిద్ధికుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. -
ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత..!
ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ వేళ.. హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకొచ్చారు. తెలంగాణలో ప్రీమియర్ షోస్కు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మీడియా కోసం విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్న సమాచారంతో ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకు రావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనతో విమల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా.. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజవుతోంది. ఈనెల 8న ఫ్యాన్స్ కోసం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. కానీ ఏపీలో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడగా.. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో కేవలం మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.విమల్ థియేటర్ లోకి దూసుకొచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేకపోయినా... థియేటర్ కి వచ్చిన అభిమానులుమీడియా కోసం విమల్ లో ప్రత్యేక షో ఏర్పాటుఅభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం తో మీడియా షో తాత్కాలికంగా నిలిపివేత#TheRajasaaab #Prabhas #RajaSaab pic.twitter.com/9Eg9nu8BLF— Anji Shette (@AnjiShette) January 8, 2026 -
మెగా హీరో స్పెషల్ బిర్యానీ పార్టీ.. అట్రాక్షన్గా ఉపాసన..!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తోన్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన చికిరి చికిరి సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరికింది. దీంతో మన మెగా హీరో చెర్రీ ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతున్నారు.తాజాగా హైదరాబాద్లోని తన నివాసంలో మెగా హీరో రామ్ చరణ్ స్పెషల్గా పార్టీ చేసుకున్నారు. జపాన్ నుంచి వచ్చిన ప్రముఖ చెఫ్ ఒసావా టకమసా తయారు చేసిన బిర్యానీ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ఈ పార్టీలో కనిపించారు. ఇంట్లోనే జపాన్ చెఫ్ వండిన బిర్యానీ తింటూ కనిపించారు. ఈ పార్టీలో ఉపాసన స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. రెండోసారి ప్రెగ్నెన్సీ ధరించిన ఉపాసన.. బేబీ బంప్తో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.@ #RamCharan 🏦 pic.twitter.com/0AsYvJiJwm— Trends RamCharan ™ (@TweetRamCharan) January 5, 2026 -
సంక్రాంతికి సినిమాల సందడి.. ప్రతి ఏటా అదే సమస్య..!
సంక్రాంతి సినిమాల సందడికి అంతా సిద్ధమైంది. పొంగల్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు.. సినీ ఇండస్ట్రీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్. సంక్రాంతికి వచ్చే చిత్రాలు ఏడాది ముందే కర్ఛీఫ్ వేసుకోవాల్సిందే. ముఖ్యంగా ఈ పండుగకు స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే పెద్ద హీరోల మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ పోటీని తట్టుకోవడం కష్టం. టాలీవుడ్లో మన సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంటుంది. డేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది.సినిమా రిలీజ్ డేట్స్ కోసమే పోటీ ఉండే సంక్రాంతి మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం విడుదల తేదీల కోసమే ఇంత పోటీ ఉంటే థియేటర్ల సంగతేంటి? అన్ని చిత్రాలకు సమానంగా స్క్రీన్స్ దొరుకుతాయా? ఈ విషయంలో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. మన టాలీవుడ్ సినిమాల డేట్స్, థియేటర్స్ కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. అలాంటి ఈ సమయంలో డబ్బింగ్ చిత్రాలు సైతం క్యూలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి పరశక్తి, జన నాయగణ్ లాంటి స్టార్స్ సైతం పొంగల్ బరిలో ఉన్నారు. ఇక్కడే మన తెలుగు ఆడియన్స్తో పాటు నెటిజన్స్ నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.సంక్రాంతికి థియేటర్ల కొరత..ఈ ఏడాది సంక్రాంతికి మన టాలీవుడ్ నుంచి ఏకంగా ఐదు సినిమాలు వస్తున్నాయి. వాటిలో ప్రభాస్ ది రాజాసాబ్ జనవరి 9న రానుంది. ఆ తర్వాత జనవరి 10న డబ్బింగ్ మూవీ పరాశక్తి రిలీజవుతోంది. ఆ తర్వాత వరుసగా , మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. ఇంత పోటీ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలు కూడా రావడం థియేటర్ల సమస్యకు కారణమవుతోంది.డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు?సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉన్న సమయంలో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్ సినీ ప్రియులు మండిపడుతున్నారు. పరాశక్తి, జననాయగణ్ చిత్రాలకు ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నస్తున్నారు. మన చిత్రాలకు కోలీవుడ్లో పెద్దగా ఆదరించరని అంటున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తమిళనాడులో తెలుగు సినిమాలకు ప్రేక్షకుల్లో అంతగా ఆదరణ ఉండదని అన్నారు. ఈ విషయంపై టాలీవుడ్ సినీ పెద్దలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. బిగ్ కాంపీటీషన్ ఉండే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాల రిలీజ్పై మరోసారి ఆలోచిస్తే మంచిదని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం. లేదంటే ఈ థియేటర్ల సమస్య ప్రతి ఏటా రిపీట్ అవుతూనే ఉంటుంది. సంక్రాంతికి కాకుండా ఓ వారం రోజుల తర్వాత డబ్బింగ్ చిత్రాలు వస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభాస్ ది రాజా సాబ్.. ఫుల్ గ్లామరస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్కు ఇంకా కొన్ని రోజులు సమయం ఉండడంతో మరో క్రేజీ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నచ్చేనచ్చే అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఈ ఫుల్ సాంగ్ను జనవరి 5న రిలీజ్ చేయనున్నారు. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో మీరు కూడా చూసేయండి. Gear up for the MOST GROOVING MADNESS in theatres this Sankranthi 💥💥💥#NacheNache song promo is out now ❤️🔥❤️🔥❤️🔥Full song from Jan 5th 😎🙌🏼A @MusicThaman Musical Vibe 🎧 #TheRajaSaabOnJan9th #TheRajaSaab #Prabhas pic.twitter.com/WgwCLbXaF9— People Media Factory (@peoplemediafcy) January 3, 2026 -
'ఆ 15 నిమిషాల పాత్ర.. మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది'.. ది రాజాసాబ్ డైరెక్టర్
ప్రభాస్ ది రాజా సాబ్ రిలీజ్కు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే శుక్రవారమే రెబల్ స్టార్ థియేటర్లలో సందడి చేయనున్నాడు రాజాసాబ్. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్కు సమయం తక్కువగా ఉండడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు మేకర్స్. ఈ మూవీకి సంబంధించిన విశేషాలను డైరెక్టర్ మారుతి పంచుకున్నారు. ఈ మూవీ క్రేజీ రోల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ మూవీలో అత్తారింటికి దారేది నటుడు బోమన్ ఇరానీ పాత్రలో రివీల్ చేశారు మారుతి. ఆయన వచ్చాక మూవీ టోన్ మారుతుందని అన్నారు. ట్రైలర్లో చూస్తే ఆయన మేకప్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని.. ఆయన రోల్ ఎక్కువగా లైబ్రరీలో షూట్ చేశామని తెలిపారు. ఇందులో ఆయన ఒక సైక్రియాటిస్ట్గా కనిపిస్తారని వెల్లడించారు. బోమన్ ఇరానీ ఎంట్రీ ఇచ్చాకే హారర్ కామెడీ నుంచి అస్సలు ఎవరూ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుందన్నారు. ఆడియన్స్ను మెస్మరైజ్ చేసే యాక్టర్స్లో బోమన్ ఇరానీ ఒకరు.. 3 ఇడియట్స్లో వైరస్ అనే క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ చిత్రంలో బోమన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారని తెలిపారు. ఆయన ఉన్నంత సేపు అలా ఒక స్పెషల్ జోన్లో వెళ్లిపోతామన్నారు. నేను చెప్పడం కంటే.. మీరు తెరపై చూసినప్పుడే ఈ విషయం అర్థమవుతుందని మారుతి అన్నారు. ఈ వీడియోను ది రాజాసాబ్ టీమ్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. 𝐓𝐡𝐞 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐓𝐡𝐞𝐑𝐚𝐣𝐚𝐒𝐚𝐚𝐛 - 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝟒 ❤️🔥This one’s all about the impact @BomanIrani is going to create 🔥#TheRajaSaab#TheRajaSaabOnJan9th #Prabhas pic.twitter.com/3kWJddv1qd— The RajaSaab (@rajasaabmovie) January 2, 2026 -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
వెంకటేశ్ పట్నాలా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ఆల్పా రిడంప్షన్. తానే హీరోగా నటిస్తూ పట్నాలా ఫిల్మ్స్ బ్యానర్లో ఈ మూవీని నిర్మించారు. విభిన్న కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జనవరి 3న థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మూవీ కథేంటో అర్థమవుతోంది. రెగ్యులర్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించారు. మనిషిలోని భావోద్వేగాలను, ప్రాయశ్చిత్తాన్ని చూపే సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు భువన్, మార్టిన్ సంగీతమందించారు. -
ప్రభాస్ ది రాజాసాబ్.. ఎవరికెంత రెమ్యునరేషన్..!
ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ను అలరిస్తున్నాయి. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ మూవీ రిలీజ్కు కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవలే హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఈ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డామని స్టేజీపైనే భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభాస్పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి.అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో.. తాజాగా ఈ మూవీ స్టార్స్ రెమ్యునరేషన్పై కూడా చర్చ మొదలైంది. ఈ సినిమాకు ప్రభాస్తో పాటు సంజయ్ దత్, హీరోయిన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ రూ.100 కోట్లు తీసుకున్నారని టాక్.ఎవరికి ఎంతంటే?మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజాసాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్నారని టాక్. హీరోయిన్ల విషయానికొస్తే కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ రూ.2 కోట్లు, నిధి అగర్వాల్ రూ.1.5 కోట్లు, రిద్ధి కుమార్ రూ.3 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీరితో పాటు బ్రహ్మనందం రూ.80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు రూ.18 కోట్ల పారితోషికం అందుకోనున్నారని తెలుస్తోంది. ఈ మూవీని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. -
భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్..!
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి వచ్చేశారు. గతేడాది హిట్ రాకపోవడంతో ఈ సారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా వస్తోన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వామ్మో..వాయో అంటూ సాగే ఫుల్ రొమాంటిక్ పాట ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్ ఈ పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ సాంగ్రకు దేవ్ పావేర్ లిరిక్స్ అందించగా.. స్వాతిరెడ్డి ఆలపించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. -
మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు.. ఫ్యాన్స్కు బిగ్ అప్డేట్
మెగాస్టార్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు. తొలిసారి అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిలీజ్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్తో ఫుల్ బిజీ అయిపోయారు.ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈనెల 4న విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అఫీషియల్గా వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేస్తూ పోస్టర్ను పంచుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి.. మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. ఈ చిత్రంలో వెంకీమామ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి వస్తోన్న మనశంకర వరప్రసాద్లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది.The much-awaited announcement everyone has been waiting for is finally here💥#ManaShankaraVaraPrasadGaru TRAILER ON JANUARY 4th ❤️🔥#MSG GRAND RELEASE WORLDWIDE IN THEATERS ON 12th JANUARY.#MSGonJan12thMegastar @KChiruTweets Victory @VenkyMama @AnilRavipudi #Nayanthara… pic.twitter.com/5yW8TkN9ut— Shine Screens (@Shine_Screens) January 2, 2026 -
సఃకుటుంబానాం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: సఃకుటుంబానాంనటీనటులు..: రామ్ కిరణ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్ తదితరులుదర్శకుడు..: ఉదయ్ శర్మనిర్మాతలు..: మహదేవ్ గౌడ్, నాగరత్నవిడుదల తేదీ..: జనవరి 01, 2026రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించిన తాజా చిత్రం సకుటుంబానాం. ఉదయ్ శర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సాధారణ మధ్యతరగతి కుటుంబంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి (రామ్ కిరణ్) తన కుటుంబంపై అపారమైన ప్రేమ చూపిస్తాడు. అతనిది ప్రశాంతమైన జీవితం.. మంచి జీతం. అయితే ఒక అమ్మాయి తన టీమ్లో చేరడంతో ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. అలా ఆమెను తన కుటుంబానికి పరిచయం చేస్తాడు. కానీ ఆమె రాకతో కుటుంబంలో వచ్చే పరిణామాలు ఏంటి? ఆ తర్వాత బయటపడే రహస్యాలు.. అతని జీవితంలో వచ్చే పరివర్తనలు ఏంటి? చివరికి కుటుంబం మొత్తం ఐక్యంగా ఉంటుందా? అసలు అతనికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? విలన్ వారి జీవితాల్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..కుటుంబ విలువలను, విభేదాలను ఎలా సమతుల్యం చేయాలో దర్శకుడు చూపించాడు. అవీ కుటుంబ బంధాలను ఎంత బలోపేతం చేస్తాయో ఈ కథలో మేసేజ్ ఇచ్చాడు. కుటుంబ విలువల నేపథ్యంలో వచ్చిన సకుటుంబానాం టైటిల్ తగ్గట్టుగానే కథను ఎంచుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ఉద్యోగం, ప్రేమ చుట్టే కథ తిరుగుతుంది.ఇక సెకండాఫ్లోనే అసలు కథ మొదలవుతుంది. కుటుంబంలో జరిగే పరిణామాల చుట్టే స్టోరీని నడిపించాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ రోటీన్గా అనిపిస్తాయి. ప్రేక్షకుడి బోర్ కొట్టించేలా కూడా ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. కథ పరంగా డైరెక్టర్ తన విజన్కు తగినట్లుగానే తెరకెక్కించాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్ను ప్రేక్షకుడికి వివరించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సరికొత్త కథాంశంతో వెండితెరను అలరించడంలో దర్శకుడు ఉదయ్ శర్మ విజయవంతమయ్యాడు. ఓవరాల్గా చూస్తే కుటుంబ సమేతంగా చూడదగిన అద్భుత చిత్రమే సకుటుంబానాం.ఎవరెలా చేశారంటే..హీరోగా పరిచయమైన రామ్ కిరణ్ తన డ్యాన్స్, నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మేఘ ఆకాష్ తనదైన నటనతో అదరగొట్టేసింది. రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలో జీవించేశాడు. బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, భద్రం, నిత్య, రచ్చ రవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ మధు దాసరి పనితీరు బాగుంది. మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, నృత్యాలు సినిమాకు పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. శశాంక్ మలి తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది.రేటింగ్ : 2.5 /5 -
విశ్వక్ సేన్ లేటేస్ట్ మూవీ.. ఆసక్తిగా టైటిల్ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్కు లెగసీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పాలిటిక్స్ ఈజ్ పర్సనల్ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రానికి సాయికిరణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి గోవింద్ వసంత సంగీతమందిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి టైటిల్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో 'రాజకీయమంటే పులిమీద సవారిలాంటిదంటారు. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా? ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా?' అనే విశ్వక్ సేన్ డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఏక్తా రాథోడ్ హీరోయిన్గా నటిస్తోంది. రావు రమేశ్, సచిన్ ఖేడ్కర్, మురళీ మోహన్, కేకే మేనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
టాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర గతేడాది వరుస సినిమాలతో అభిమానులను అలరించాడు. ఇటీవలే కన్నడ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన మార్క్ చిత్రంలో కనిపించారు. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నవీన్ చంద్ర మరో సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది.నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం హనీ. ఈ సైకలాజికల్ హారర్ మూవీకి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు.ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా హనీ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో దివి, రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి అజయ్ అరసాడ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
ప్రభాస్ -మారుతి డైరెక్షన్లో వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన డైరెక్టర్ మారుతి ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ప్రభాస్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూడేళ్లుగా ది రాజాసాబ్ కోసం పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రెబల్ స్టార్ను తీసుకొచ్చిన ఆయన రేంజ్కు తగినట్లుగానే ఈ సినిమాను తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమా కోసం ప్రభాస్ తన లైఫ్ పెట్టేశారని కొనియాడారు. సినిమాతోనే ఏకమైపోయిన తీరును మాటల్లో చెప్పలేనన్నారు. ఆ ప్రతి రూపమే ఈ రోజు మన ఎదురుగా కూర్చుందని డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టిన ప్రభాస్ను చూస్తుంటే నా కన్నీళ్లు ఆగడం లేదంటూ వేదికపైనే ఏడ్చేశారు. ఈ సందర్భంగా వేదికపైనే చిన్నపిల్లాడిలా దర్శకుడు మారుతి ఏడ్చిన తీరు ఆడియన్స్ను సైతం కన్నీళ్లు పెట్టించింది.మారుతి కూతురు ఎమోషనల్ఈ వీడియో చూసిన ఆయన కూతురు ఈవెంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంది. తండ్రి కష్టాన్ని చూసిన కూతురు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కంటే ఎక్కువగా ఎమోషనలైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఒక తండ్రి కష్టం విలువ.. కుమార్తెకే తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు..@DirectorMaruthi Emotional avvadam tho valla Daughter of kuda challa Emotional ayindhi 🥲❤️#TheRajaSaab pic.twitter.com/ZkGVGBp4bU— Rebel Star (@Pranay___Varma) December 28, 2025 -
చిన్న సినిమాకు టాలీవుడ్ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..!
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా చిన్న సినిమాలన్నీ సందడి చేశాయి. శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల చిత్రాలపై కాస్తా బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. వీటితో బ్యాడ్ గాళ్స్, ఈషా, దండోరా లాంటి చిత్రాలొచ్చాయి. వీటి గురించి ప్రమోషన్స్ చేయడంఅయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో మూవీ పతంగ్. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. కేవలం మౌత్ టాక్తోనే పతంగ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీ చూసే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ ఆఫర్తో పతంగ్ చూసే అభిమానుల సంఖ్య మరింత పెరగనుంది. చిన్న సినిమా కోసం సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. Giving away 500 tickets for #Patang the film,with love for this Adorable/Passionate Team 🧿@PranavKaushikk @VPujit @Preethipagadal @praneethdirects Hearing Fab Things about the film..Please go check it out in Theatres now ♥️For tickets : pls contact @adithyamerugu pic.twitter.com/EbmBbRbAtI— Sundeep Kishan (@sundeepkishan) December 27, 2025 -
స్పిరిట్ డైరెక్టర్కు క్రేజీ ట్యాగ్ ఇచ్చిన రెబల్ స్టార్.. రాజమౌళికి కూడా!
రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్లోని కైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్కు బ్యూటీఫుల్ పర్సన్గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్ను జీనియస్గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ది రాజాసాబ్ హీరోయిన్కు ప్రభాస్ గిఫ్ట్.. అంతా నీవల్లే అంటూ ఎమోషనల్..!
ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ సంక్రాంతి పోటీలో నిలిచింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ రిద్ది కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించింది. నీ వల్లే నేను ది రాజాసాబ్లో మూవీ నటిస్తున్నానని తెలిపింది. నాకు ఈ అద్భుతమైన అవకాశమిచ్చిన ప్రభాస్కు రుణపడి ఉంటానని తెలిపింది. ఈ రోజు ఈవెంట్కు మీరు నాకిచ్చిన శారీనే ధరించానని సంతోషం వ్యక్తం చేసింది. ఈ రోజు కోసం మూడేళ్లుగా ఈ శారీని కట్టుకోలేదని భావోద్వేగానికి గురైంది. నా లైఫ్లో నీలాంటి పర్సన్ పరిచయం కావడం నా అదృష్టమని రిద్ధికుమార్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కాగా.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది. Riddhi కి Saree ఇచ్చిన ప్రభాస్.. She reveals it on stage! I'm wearing the saree that you gave me I saved it for 3 years Just to wear it tonightGrateful to have you in my life.#Prabhas #RiddhiKumar pic.twitter.com/8BXLXdj16Z— M9 NEWS (@M9News_) December 27, 2025 Thank you #riddhikumar gaaru 3 years wait chesi Ee day kosam ah saree wear chesaru 🫡🫡🫡🫡🫡🫡#TheRajaSaab pic.twitter.com/QSIQiF510G— PrabhasPandu (@Dreamer_998) December 27, 2025 -
ఆది సాయికుమార్ శంబాల.. తొలి రోజే ఊహించని వసూళ్లు
ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జోడీగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా అభిమానుల అంచనాల మధ్య క్రిస్మస్ కానుకగా 25న థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే రూ.3.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ఆది సాయికుమార్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మరిన్ని థియేటర్స్ యాడ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతమందించారు. Thanks for your love and support plz do watch #Shambhala in Theatres 🙏❤️ pic.twitter.com/NPe07O79Us— Aadi Saikumar (@iamaadisaikumar) December 26, 2025 -
శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఛాంపియన్'. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.(Champion Movie Box Office Collections)తొలిరోజే ఛాంపియన్ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.4.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అఫీషియల్గా ప్రకటించింది. ఈ మేరకు ఛాంపియన్ మూవీ పోస్టర్ను పంచుకుంది. కాగా.. బ్రిటీష్ కాలంలో జరిగిన బైరాన్పల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. ఈ మూవీని వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు.A HOUSEFULL festive day at the cinemas ❤️🔥People’s #CHAMPION opens big with 4.5 CRORE+ worldwide GROSS on Day 1 💥Experience the historic journey on the big screen now.@IamRoshanMeka @PradeepAdvaitam #AnaswaraRajan @ActorSanthosh @madhie1 @MickeyJMeyer @AshwiniDuttCh… pic.twitter.com/jL0uSEGcjm— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 26, 2025 -
టాలీవుడ్ లవ్ బర్డ్స్.. న్యూ ఇయర్ పార్టీకి రెడీ..!
టాలీవుడ్ ప్రేమ జంటల్లో విజయ్- రష్మిక జోడీ గురించి మనందరికీ సుపరిచితమే. చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాదిలోనే నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. పరోక్షంగానైతే హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాదిలో వీరిద్దరు పెళ్లి పీటలెక్కబోతున్నారని టాక్ కూడా వినిపిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరలైంది.ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన, రష్మిక మందన్నా మైసా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా క్రిస్మస్, న్యూ ఇయర్ ఉండడంతో ఈ జంట వేకేషన్ ప్లాన్ చేశారు. నూతన ఏడాది వేడుకల కోసం ఫారిన్ ట్రిప్కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. వెకేషన్ ట్రిప్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అయితే విజయ్, రష్మిక హైదరాబాద్ విమానాశ్రయంలో విడివిడిగా కనిపించారు. దీంతో వీరిద్దరు కలిసే వేకేషన్కు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది.పెళ్లి గురించి ఇటీవల రష్మికతో ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తానే అందరికీ చెప్తానని తెలిపింది. నిశ్చితార్థ వార్తలను కొట్టిపారేయలేదు.. అలాగని డైరెక్ట్గా చెప్పలేదు నేషనల్ క్రష్. ఇటీవలే ది గర్ల్ఫ్రెండ్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక.. ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తోంది. గతంలో విజయ్, రష్మిక గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించారు. -
'అనసూయ నీ రుణం తీర్చుకుంటా'.. శివాజీ మరోసారి వ్యంగ్య కామెంట్స్..!
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్ తీవ్ర దుమారానికి దారితీశాయి. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్లు డ్రెస్సులను ఉద్దేశించి మాట్లాడారు. మీ బాడీ అంతా బయటికి కనపడేలా డ్రెస్సులు వేసుకోవద్దని కామెంట్స్ చేశారు. అదే సమయంలో హీరోయిన్లను ఉద్దేశించి అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో శివాజీ కామెంట్స్పై టాలీవుడ్ సినీతారలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.టాలీవుడ్ నటి అనసూయ సైతం శివాజీ కామెంట్స్పై స్పందించింది. ఈ బాడీ నీది కాదు.. మాది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో శివాజీ అభద్రతా భావంతో ఉన్నారంటూ మరో ట్వీట్ చేసింది. మిమ్మల్ని చూస్తుంటే జాలీగా ఉందని కూడా రాసుకొచ్చింది.అయితే ఇవాళ దండోరా టీమ్ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో శివాజీ ఈ అంశంపై మాట్లాడారు. తాను ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. ఆ రెండు పదాలు వాడడం నా తప్పేనని.. నా ఉద్దేశంలో మాత్రం కరెక్ట్ అని సమర్థించుకున్నారు. అదే సమయంలో యాంకర్ అనసూయకు కౌంటరిచ్చారు. అసలు ఈ వివాదంలోకి అనసూయ ఎందుకు వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా మిమ్మల్ని అన్నానా అండి? మీ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. వాస్తవానికి ఆమె పేరునే కాదు.. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. హీరోయిన్లు అంటూ మాత్రమే మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. నేను చేసిన కామెంట్స్పై ఆడపడచులందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరుగుతుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉంది. మీరు నామీద జాలి చూపించారు కదా. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.అసలు శివాజీ ఏమన్నారంటే.. ?శివాజీ ప్రధాన పాత్రలో నటించిన దండోరా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. 'హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనో, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనిపించే దానిలో ఏం ఉండదు. చూసినప్పుడు నవ్వుతారు గానీ దరిద్రపు ము**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని లోపల అనుకుంటారు. కానీ బయటకు చెప్పరు. గ్లామర్ అనేది ఒకదశ వరకే ఉండాలి. స్వేచ్ఛ అనేది అదృష్టం. దాన్ని కోల్పోవద్దు'అన్నాడు.అసలు మీరెందుకు వచ్చారు అనసూయ గారు ? నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ? - Actor Sivaji pic.twitter.com/urw4aUrniQ— Telugu Chitraalu (@CineChitraalu) December 24, 2025 -
ఆ సంఘటన చూశాకే మాట్లాడా.. అదే నేను చేసిన తప్పు: శివాజీ
దండోరా మూవీ ఈవెంట్లో తాను కామెంట్స్పై నటుడు శివాజీ మాట్లాడారు. మహిళల దుస్తులపై మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. ఆ రెండు పదాలు తాను వాడకుండా ఉండాల్సిందని తెలిపారు. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయలేదన్నారు. నా కంటే ఎంతోమంది నోరు జారారని.. కానీ వాళ్లెవరినీ ఇంతలా అడగడం లేదన్నారు. అనసూయ, చిన్మయి లాంటి వాళ్లు రియాక్ట్ కావడంలో తప్పేం లేదన్నారు.శివాజీ మాట్లాడుతూ..' అందరికీ నమస్కారం.. టీవీలు చూస్తున్న ఆడపడచులందరికీ నమస్కారం. దండోరా ఈవెంట్లో నేను మాట్లాడిన రెండు పదాల వల్ల సారీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదు. నా 30 ఏళ్ల కెరీర్లో ఎలా జరిగిందో జరిగిపోయింది. దానికి మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నా. ఆ రెండు పదాలు మాత్రమే నేను వాడకుండా ఉండాల్సింది. నా ఉద్దేశం కరెక్టే.. ఇందులో నేను ఏ తప్పు చేయలేదు. నేను ఎదురుదాడి చేసే వ్యక్తిని కాదు. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా నాకు ఉంది. మా హీరోయిన్లకు ఏదైనా జరిగితుందనే ఇన్సెక్యూరిటీ నాలో ఉందమ్మా. మీరు నామీద జాలి చూపించారు. మీ చాలా థ్యాంక్స్. మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.మహిళల కట్టుబాట్లపై ఎంతోమంది ప్రవచనకారులు ఇప్పటికే ఎంతోమంది వెల్లడించారు. ఇటీవల లులు మాల్లో నిధి అగర్వాల్ను చూశాకే ఇలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. నేను ఎవరినీ ఇలాంటి డ్రెస్సులు వేసుకోండని ఎవరికీ చెప్పలేదని అన్నారు. సినిమా వల్లే యువత పాడవుతున్నారనే మాట రాకూడదనే అలా చెప్పానని తెలిపారు. సమాజంలో ఏది జరిగినా సినిమాల వైపే వేలు చూపిస్తున్నారని అన్నారు. నేను వాడినా ఆ రెండు పదాలు తప్ప.. నా ఉద్దేశం అది కాదన్నారు. ఈ వివాదం తర్వాత తనకు నిద్ర పట్టలేదన్నారు. దండోరా మూవీ రిలీజ్ అవుతున్నందుకు మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలనే ప్రెస్మీట్కు వచ్చానని శివాజీ తెలిపారు. ఈ సినిమా ఒక మంచి స్టోరీ అని.. కులాలు, అసమానతలపై వస్తోన్న ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు. -
సందీప్ కిషన్ కోలీవుడ్ మూవీ.. తెలుగు టీజర్ వచ్చేసింది.!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న లేటేస్ట్ కోలీవుడ్ మూవీ సిగ్మా. ఈ చిత్రంతో దళపతి తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని యాక్షన్ కామెడీ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కామెడీ యాక్షన్తో పాటు అడ్వెంచరస్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ఫైట్ సీన్స్, విజువల్స్ ఈ సినిమాపై అంచనాలు మరించ పెంచుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు థాసన్, యోగ్ జాపీ, మగలక్ష్మి, షీలా రాజ్కుమార్, కమలేష్, కిరణ్ కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోయిన్లపై శివాజీ చిల్లర వ్యాఖ్యలు.. సారీ చెప్పిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల డ్రెస్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో శివాజీపై మహిళ నటీమణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిన్మయి శ్రీపాద, అనసూయ శివాజీ కామెంట్స్పై తమదైన శైలిలో స్పందించారు. సినీతారలతో పాటు నెటిజన్స్ సైతం శివాజీపై మండిపడుతున్నారు. ఈ టాపిక్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులను ఉద్దేశించి అసభ్యకర రీతిలో శివాజీ మాట్లాడిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. శివాజీ పేరును ప్రసావించకుండానే ఆయన తరఫున క్షమాపణలు కోరుతూ నోట్ రిలీజ్ చేశారు. నిన్న రాత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయని తెలిపారు. ప్రస్తుత ఈ నాగరిక సమాజం మహిళల నిర్ణయాల, ఇష్టాలు, వారి హక్కులను పరిరక్షిస్తుందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.మంచు మనోజ్ తన నోట్లో ప్రస్తావిస్తూ.. 'హీరోయిన్ల దుస్తులపై ఇలాంటి ప్రకటన చేయడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మహిళలు ఇలాంటి దుస్తులే మాత్రమే వేసుకోవాలి అని చెప్పడం ఏ మాత్రం సహించేది కాదు. వారి గౌరవం, జవాబుదారీతనం వ్యక్తిగత ప్రవర్తన ద్వారా మాత్రమే తెలుస్తుంది. దుస్తుల ఆధారంగా కాదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో చర్చలకు తావులేదు. ప్రజల అభిప్రాయం కోసం ఎవరు కూడా దుస్తులు ధరించరు. మహిళలను అగౌరవ పరిచేలా సీనియర్ నటుడు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ కోరుతున్నా. మహిళలను వస్తువుల్లా చూడొద్దు. ఇలాంటి కామెంట్స్ వాళ్లను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మహిళలకు గౌరవం, హోదా, సమానత్వం మనందరం ఇవ్వాలి. ఇలాంటి విషయాల్లో జవాబుదారీతనం అవసరం' అని రాసుకొచ్చారు. Came across some deeply disappointing comments last night. A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025 -
ఫుల్ వయొలెంట్గా విజయ్ దేవరకొండ.. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూశారా?
కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న పుల్ యాక్షన్ మూవీ రౌడీ జనార్ధన. ఈ సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీనివ రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ జనార్ధన గ్లింప్స్ చూస్తే ఈ చిత్రంలో ఫుల్ వయొలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.ఈ గ్లింప్స్లో ఫైట్ సీన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. 'ఈ కళింగపట్నంలో ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. రౌడీ జానార్ధన' అనే డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. కాగా.. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు- శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి విలన్గా కనిపించనున్నారని టాక్.


