breaking news
Tollywood Hero
-
బాలయ్య అఖండ-2.. హైందవం సాంగ్ వచ్చేసింది
బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2. గతంలో రిలీజై సూపర్ హిట్గా నిలిచిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ నుంచి హైందవం సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. నాగ గురునాథ శర్మ లిరిక్స్ రాసిన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్గా గుర్తింపు పొందిన సింగర్స్ శ్రేయ, రాజ్యలక్ష్మి పాడారు. ఈ పాట బాలయ్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సాంగ్కు తమన్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన సాయితేజ్ హీరోగా నటిస్తున్నారు. కేఏప్రోడక్షన్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. చిన్ని చిన్ని అంటూ సాగే ఫస్ట్ సింగిల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ పాటకు సనారే లిరిక్స్ అందించగా.. హరిణి ఇవటూరి, పవన్ కల్యాణ్ పాడారు. ఈ సాంగ్కు వంశీకాంత్ రేఖన సంగీతమందించారు.కాగా.. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీలో ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బాలయ్య అఖండ-2.. ఒక్క టికెట్ కోసం లక్ష..!
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ చిత్రం అఖండ-2. ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ ఆదరణ వస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అఖండ-2 మూవీ ఫస్ట్ టికెట్ కోసం ఓ అభిమాని ఏకంగా లక్ష రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చాడు. ఈ టికెట్ కోసం జర్మనీలో నిర్వహించిన వేలంపాటలో రాజశేఖర్ పార్నపల్లి అనే అభిమాని పోటీపడ్డారు. లక్ష రూపాయలు చెల్లించి సూపర్ ఫ్యాన్ టికెట్ను సొంతం చేసుకున్నారు. దీనికి సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Balayya Craze Peaks Worldwide! 🔥💥🔥💥‘Akhanda 2’ mania hits Germany too, the first fan ticket was auctioned for a whopping ₹1 lakh (1000 Euros)!Rajasekhar Parnapalli proudly grabbed it, proving once again… Balayya’s mass has no borders! 🌍🔥#Akhanda2 #Balayya pic.twitter.com/YZpACnTpTh— Balayya Philadelphia Fans (@NBKPhillyFans) November 29, 2025 -
ఆంధ్ర కింగ్ తాలూకా.. మూడో రోజులైనా అంతేనా?
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. అభిమానుల భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే మిక్స్డ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా నిరాశపర్చింది. తొలి రోజు కేవలం రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.ఇక వీకెండ్ కలిసి రావడంతో వసూళ్లు కాస్తా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.16.5 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.5 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ.10 కోట్ల మార్క్ను దాటేసింది.అయితే మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా వసూళ్ల రాబట్టడంలో ఆంధ్ర కింగ్ సక్సెస్ కాలేకపోయాడు. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కానీ మూడు రోజులైనా ఆ మార్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ మూవీ వసూళ్లపై మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించగా.. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కించారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే చాలు..!
రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాకు పి. మహేశ్ బాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంపై రామ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆంధ్ర కింగ్ తాలూకా వీడియోను పంచుకున్నారు. ఇందులో సముద్రంలో సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో వీడియో చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రన్ టైమ్ ఎంతంటే.!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా(యాడ్స్, టైటిల్స్తో సహా) ఉండనుంది. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. రామ్ పోతినేని ఎనర్జిటిక్ ఫర్మామెన్స్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ఎమోషనల్గా అభిమానులను అలరించనున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో ఎమోషనల్ ఫర్మామెన్స్తో ఆకట్టుకోనున్నారు. ఈ మూవీలో రామ్ పాత్ర సినీ ప్రియులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది. It is a U/A for #AndhraKingTaluka ❤🔥A film for all, a film relatable to all 💥GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.BOOKINGS NOW OPEN!🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27 Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025 -
టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. సెన్సార్ పూర్తి
రవి, శ్రీయ తివారి జంటగా నటిస్తోన్న చిత్రం విచిత్ర. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు. సిస్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్బంగా దర్శక, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ..' “విచిత్ర మూవీ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందించిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసేలా హృదయాన్ని తాకే కథ. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తూ చూసేలా తీశాం. ఫ్యామిలీ డ్రామాగా విచిత్ర నిలుస్తుందనే నమ్మకముంది. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త కోణంలో చూపించబోతున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు నిజాని సంగీతమందించారు. -
'మీరు పెట్టిన ఆ పేరుతోనే'.. స్మరించుకున్న విజయ్ దేవరకొండ!
సత్యసాయి వందో జయంతి సందర్భంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆయనను స్మరించుకున్నారు. నాకు చిన్నప్పుడు మీరు పెట్టిన విజయ్ సాయి అనే పేరుతోనే ప్రతి రోజు జీవిస్తున్నానని పోస్ట్ చేశారు. ఈ ప్రపంచానికి దూరంగా మాకు విద్యను, ఎన్నో జ్ఞాపకాలను అందించిన వాతావరణాన్ని కల్పించారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.విజయ్ తన ట్వీట్లో రాస్తూ.. 'మేమందరం ప్రతిరోజూ మీ గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా మంచి, చెడు సమయాల్లో. మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా జీవితాల్లో వచ్చిన మార్పును తెలుసుకున్నాం. ప్రపంచానికి ఇవ్వడానికి మేము చేయగలిగిన విధంగా మాలో శక్తిని నింపారు. మీకు 100వ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మాతో పాటే ఎప్పటికీ జీవించే ఉంటారు' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.Happy Birthday Swami ❤️You gave me my name “Vijay Sai” when i was months old - a name that i work to live upto everyday.You gave us a safe environment, away from the world, where we got our education and made so many memories.We all always think about you everyday, more so… pic.twitter.com/gTnAltkHiO— Vijay Deverakonda (@TheDeverakonda) November 23, 2025 -
నాగచైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. టైటిల్తోనే భారీ హైప్!
తండేల్ సూపర్ హిట్ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య(akkineni Naga Chaitanya).. డైరెక్టర్ కార్తీక్ దండుతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం చైతూ కెరీర్లో 24వ మూవీ కాగా.. ప్రస్తుతం ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది.అయితే ఇవాళ చైతూ బర్త్ డే కావడంతో మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. చైతూ మూవీ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు వృషకర్మ(VrushaKarma) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు నాగచైతన్య పోస్టర్ను కూడా పంచుకున్నారు. ఈ పోస్టర్ చైతూ ఫ్యాన్స్న విపరీతంగా ఆకట్టుకుంటోంది. #VRUSHAKARMA it is for #Nc24 .@karthikdandu86 has something special coming your way for sure ! @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @Vrushakarma @Tseries @TseriesSouth pic.twitter.com/fwZbl0qxtO— chaitanya akkineni (@chay_akkineni) November 23, 2025 -
బాలయ్య అఖండ-2.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మరో చిత్రం అఖండ-2 (Akhanda 2 Trailer). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే ది తాండవం, జాజికాయ లాంటి లిరికల్ సాంగ్స్ను రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను (Akhanda 2 Trailer) మేకర్స్ రిలీజ్ చేశారు. బెంగళూరు వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అఖండ-2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైలర్ చూస్తుంటే బాలయ్య డైలాగ్స్, మంచు కొండల్లో ఫైట్ సీన్స్ విపరీతంగా ఆకట్టుంటున్నాయి. కష్టమొస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి.. కష్టమొచ్చనా దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే సనాతన ధర్మం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
అల్లు అర్హ బర్త్ డే.. ఐకాన్ స్టార్ స్పెషల్ పోస్ట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురి అల్లు అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అర్హ పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే టూ మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు కూడా అర్హకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. పుష్ప -2 లాంటి బ్లాక్బస్టర్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మూవీని భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోందని తెలిసింది. కాగా సూపర్ హీరో కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందుతోందని.. భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుందని, ఈ కారణాల వల్ల ఈ సినిమా విడుదల 2027లో ఉండొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తయ్యే అవకాశం ఉందని.. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ను అట్లీ పక్కాగా ప్లాన్ చేయడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ప్రచారంలో ఉన్నట్లు ఈ చిత్రం 2027లో కాకుండా ఒక ఏడాది ముందే తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Happy birthday to my little princess #AlluArha 💖 pic.twitter.com/pRnMDIOlTe— Allu Arjun (@alluarjun) November 21, 2025 Wishing our sweetest and adorable little princess #AlluArha a very Happy Birthday! 🤩May this year bring you endless happiness and beautiful memories. ❤️#HBDAlluArha #HappyBirthdayAlluArha pic.twitter.com/ZSWgFi8Tl7— Geetha Arts (@GeethaArts) November 21, 2025 -
నాగ చైతన్య మైథలాజికల్ థ్రిల్లర్.. లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది!
తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్య సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ కెరీర్లో 24వ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎన్సీ24 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చైతూ సరసన సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గాల కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ని ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో నాగచైతన్య అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. -
'ప్లీజ్ అన్నా.. సినిమాలు ఆపేయ్'.. నెటిజన్కు ప్రియదర్శి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ప్రియదర్శి సరసన ఆనంది హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో యాంకర్ సుమ.. కానిస్టేబుల్ పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.మూవీ రిలీజ్కు ముందు ప్రియదర్శి నెటిజన్లతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు నెటిజన్స్. అయితే ఓ నెటిజన్ చాలా ఆసక్తికర ప్రశ్న వేశాడు. అన్న నువ్వు సినిమాలు చేయడం అపు అన్న.. ప్లీజ్ అన్నా అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన ప్రియదర్శి తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా? అంటూ ప్రశ్నించాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమంటే కథేంటంటే..?మధుసూధన్(ప్రియదర్శి) అనే కుర్రాడు.. రమ్య (ఆనంది) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు. అలాంటి మధుసూదన్ జీవితంలో పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేదే స్టోరీలా అనిపిస్తుంది. స్వతహాగా యాంకర్ అయిన సుమ.. గతంలో 'జయమ్మ పంచాయతీ' అనే మూవీలో లీడ్ రోల్ చేసింది. Mari em cheyyamantavGaddi Peekalna?😅 https://t.co/HFnQJk2ujL— Priyadarshi Pulikonda (@Preyadarshe) November 20, 2025 -
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్.. స్పందించిన ఉపాసన!
ఇటీవల మెగా కోడలు ఉపాసన చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ఇంటరాక్షన్ సందర్భంగా ఉపాసన యువతకు కెరీర్పై సలహాలిచ్చింది. అదే క్రమంలో అమ్మాయిలకు కెరీర్పై దృష్టి పెట్టాలని సూచించింది. పెళ్లి, పిల్లలు తర్వాతే అని ఉపాసన యువతను ఉద్దేశించి మాట్లాడింది. అంతేకాకుండా 30 అమ్మాయిలు తమ అండాలను భద్రపరచుకోవాలంటూ కామెంట్స్ చేసింది.దీంతో ఉపాసన చేసిన వ్యాఖ్యలను కొందర సమర్థించగా.. మరికొందరు తప్పుబట్టారు. అందరి పరిస్థితి మీలా ఉండదని ఫైరయ్యారు. ఇలాంటి వాటితో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. ఉపాసన షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కామెంట్స్ చేశారు. ఉపాసన కామెంట్స్తో నెగెటివిటీ పెరగడంతో తాజాగా ఆమె స్పందించింది. ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది.నేను చేసిన కామెంట్స్పై ఆరోగ్యకరమైన చర్చ జరిగినందుకు సంతోషంగా ఉన్నా.. మీ గౌరవప్రదమైన స్పందనలకు ధన్యావాదాలు అంటూ ఉపాసన ట్వీట్ చేసింది. మీరందరూ మాట్లాడుతున్న ప్రత్యేక హక్కులు/ఒత్తిళ్లపై నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తున్నప్పుడు వేచి ఉండండి.. ఇక్కడ నా ఫోటోలు చూడటం మర్చిపోవద్దు.. సరైన వ్యాఖ్యలు చేయడానికి మీకు సహాయపడే చాలా ముఖ్యమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి.. ఇక్కడ ఉన్న యజమానుల కోసం ఎక్కువ మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పని చేద్దామంటూ ట్విటర్లో రాసుకొచ్చింది.అంతేకాకుండా సరైన భాగస్వామి ఎదురయ్యే వరకూ అమ్మాయి వేచి చూడటం తప్పా?.. పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలన్నది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్పా?’ అంటూ తనపై వచ్చిన విమర్శలపై పలు ప్రశ్నలను సంధించింది ఉపాసన. అంతేకాకుండా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ నోట్ను కూడా ఉపాసన షేర్ చేసింది. నాకు 27 ఏళ్ల వయసులో పెళ్లయిందని తెలిపింది. నా 29 ఏళ్ల వయసులో ఆరోగ్య కారణాలతో ఎగ్స్ను ఫ్రీజ్ చేసుకున్నట్లు తెలిపింది. నాకు 36 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టిందని.. ఇప్పుడు 39 ఏళ్లకు ట్విన్స్ పుట్టబోతున్నారని వెల్లడించింది. నా జర్నీలో కెరీర్.. పెళ్లి సమానంగా మేనేజ్ చేశానని ఉపాసన తెలిపింది. I’m happy to have sparked a healthy debate & thank your for your respectful responses. Stay tuned as I voice my opinions on the pleasures/pressures of privilege - that u all have been talking about. Don’t forget to check out my images ! It has very important facts that will… pic.twitter.com/rE8mkbnUPW— Upasana Konidela (@upasanakonidela) November 19, 2025 -
వారణాసిలో తెలుగు డబ్బింగ్.. ప్రియాంక చోప్రా ఏమన్నారంటే?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో తొలిసారి వస్తోన్న భారీ బడ్జెట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇటీవలే ఈ మూవీ టైటిల్ను దర్శకధీరుడు రివీల్ చేశారు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే భారీ ఈవెంట్ ప్లాన్ చేసి మరి టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన గ్రాండ్ గ్లోబ్ట్రాటర్ ఈవెంట్కు మహేశ్ బాబు ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ప్రతిష్టాత్మక గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లోనూ మెరిసింది బాలీవుడ్ బ్యూటీ. తన డ్రెస్తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే అంతకుముందే ప్రియాంక ట్విటర్ వేదికగా నెటిజన్లతో చిట్ చాట్ నిర్వహించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మీరు తెలుగులో మాట్లాడతారా? ఈ సినిమాలో మీ పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్తారా? అంటూ ప్రియాంకను కొందరు నెటిజన్స్ ప్రశ్నించారు.దీనిపై ప్రియాంక చోప్రా తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. 'వారణాసి' కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించింది. అవును నేనే డబ్బింగ్ చెప్తా.. తెలుగు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపింది. తెలుగు నా ప్రాథమిక భాష కాదని.. అందుకే రాజమౌళి సార్ నాకు హెల్ప్ చేస్తున్నారని వెల్లడించింది. అంతకుముందు వారణాసి ఈవెంట్లో ఏదైనా తప్పులు దొర్లితే నన్ను క్షమించాలని అభిమానులను కోరింది. ఇటీవల జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో తగలబెట్టేద్దామా, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్లిపోతా అంటూ డైలాగ్స్తో ప్రియాంక చోప్రా అభిమానులను అలరించింది.కాగా.. వారణాసి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హేశ్బాబు రుద్రగా కనిపించనుండగా.. మందాకిని పాత్రలో ప్రియాంక మెప్పించనుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను 2027 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. -
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్.. అబ్బురపరిచిన డ్రోన్ షో
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఇవాళ ఆంధ్ర కింగ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్నూలులోని ఔట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ నుంచి ఇటీవలే ది తాండవం పేరుతో ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు.తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. జాజికాయ.. జాజికాయ అంటూ సాగే పాటను విడుదల చేశారు. వైజాగ్ వేదికగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ పాటను లాంఛ్ చేశారు. ఈ సాంగ్కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. బ్రిజేశ్ శాండిల్య, శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు తమన్ సంగీతమందించారు.ఇటీవలే ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2డీతో పాటు త్రీడీ వర్షన్లోనూ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సినీ ప్రియులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని 2021లో వచ్చిన అఖండకు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
వారణాసి టైటిల్.. రాజమౌళికి బిగ్ షాక్!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ రేంజ్లో ఈవెంట్ను నిర్వహించారు. తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళిని మించినవారు ఎవరూ ఉండరు. అత్యంత భారీ బడ్జెట్తో తీయడమే కాదు.. ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడంలో మన దర్శకధీరుడే దిట్ట అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేశ్బాబుతో సినిమా చేస్తున్న ఆయన టైటిల్ రివీల్ కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారు.కానీ ఈ వేదికపై రాజమౌళి చేసిన కామెంట్స్తో చిక్కుల్లో పడ్డారు. తాను దేవుళ్లను నమ్మనంటూ ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి. దీంతో రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్స్టేషన్లో రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక సంగతి అటుంచితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్పై మరో వివాదం నెలకొంది. వారణాసి అనే టైటిల్ పేరును రాజమౌళి గ్లింప్స్ రిలీజ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మూవీ టైటిల్పైనే వివాదం మొదలైంది. ఇప్పటికే హనుమంతునిపై వ్యాఖ్యలతో గ్లోబ్ట్రాటర్ ఈవెంట్పై విమర్శలు వస్తుండగా.. ఇప్పుడు అది కాస్తా వారణాసి టైటిల్వైపు మళ్లింది. ఈ మూవీ టైటిల్ తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్లో తన కంప్లైంట్ను సమర్పించింది. ఒకవైపు తన కామెంట్స్తో వివాదం ఎదుర్కొంటున్న రాజమౌళికి టైటిల్ రూపంలో మరోసారి చిక్కుల్లోపడ్డారు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి సాంగ్ క్రేజీ రికార్డ్!
రామ్చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది(Peddi Movie). ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. చికిరి చికిరి(chikiri chikiri song) అంటూ సాగే పాటను విడుదల చేయగా కుర్రకారుతో పాటు ప్రతి ఒక్కరినీ ఊపేస్తోంది. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్తోంది. తొలిరోజే వ్యూస్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ పాట మరో క్రేజీ రికార్డ్ సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఏకంగా 80 మిలియన్లకు పైగా వ్యూస్తో రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. #ChikiriChikiri hits 80M+ VIEWS on YouTube ❤🔥Everyone is grooving to the Chikiri Vibe 💥🕺💃🔗 https://t.co/Fd9ALDmIcs#PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026.Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop… pic.twitter.com/TZwUAdY8is— Vriddhi Cinemas (@vriddhicinemas) November 16, 2025 -
ఆంధ్ర కింగ్ తాలూకా.. రిలీజ్ డేట్ ఛేంజ్!
మాస్ హీరో రామ్ పోతినేని(ram pothineni), భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కర్నూలులో ఈనెల 18న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనెల 28న గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదలపై చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. ఒక రోజు ముందుగానే ఆంధ్రకింగ్ వచ్చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 27నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించారు. దీంతో రామ్ పోతినేని ఫ్యాన్స్కు అడ్వాన్స్గా పండుగ రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్కు రామ్ ధన్యవాదాలు తెలిపారు. ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనుడగా.. రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. THANKS @filmymahesh for GIVING the content one day in advance! #AndhraKingTaluka is coming to you on #Thanksgiving #AKTonNOV27 #AndhraKingTaluka pic.twitter.com/55WgsZTvhN— RAm POthineni (@ramsayz) November 16, 2025 -
శివ రీ రిలీజ్.. రెండు రోజుల్లోనే ఆల్టైమ్ వసూళ్లు!
నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన కల్ట్ మూవీ శివ. తెలుగు సినీ ఇండస్ట్రీ గతిని మార్చేసిన ఈ చిత్రమిది. 1989లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీతోనే రాం గోపాల్ వర్మ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. ఈ కల్ట్ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు.ఈ మూవీని తాజాగా 4కె వర్షన్లో రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 14న వచ్చిన ఈ చిత్రం కోసం నాగ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో తొలిరోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. సరికొత్త 4కె వర్షన్లో రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అప్పట్లోనే రూ.4 కోట్లు రాబట్టిన శివ.. రీ రిలీజ్లోనూ సత్తా చాటడం చూస్తుంటే ఈ సినిమా క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మరి ఈ వీకెండ్ అయ్యేసరికి 'శివ' ఇంకెన్ని కోట్లు కలెక్షన్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే.#SHIVA THANDAVAM at the box office 👊🔥#Shiva4K grosses 3.95Crore worldwide in 2 days 💥💥💥Enjoy the weekend with cult in cinemas now!— https://t.co/vdUYG2JnoqExperience it in 4K DOLBY ATMOS with Music engineered by Artificial Intelligence. #50YearsOfAnnapurna… pic.twitter.com/xMV6otcgk3— Annapurna Studios (@AnnapurnaStdios) November 16, 2025 -
రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా.. ట్రైలర్ ముహుర్తం ఫిక్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'. ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా ట్రైలర్ రిలీజ్కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ను ఈనెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించారు.IT’S TIME!! 💥Get ready to witness Sagar’s Life Story soon.BIOPIC OF A FAN - #AndhraKingTalukaTrailer arrives on 18th November ❤️🔥#Andhrakingtaluka pic.twitter.com/ih8HqokJ7H— RAm POthineni (@ramsayz) November 16, 2025 -
హీరోగా టాలీవుడ్ కమెడియన్.. టైటిల్తోనే హైప్!
టాలీవుడ్కు ఆణిముత్యంలా దొరికిన కమెడియన్ సత్య. అతని కామెడీ టైమింగ్ చూసి మరో బ్రహ్మనందం దొరికాడంటూ ఇప్పటికే ప్రశంసలొచ్చాయి. అటు నటుడిగా.. ఇటు కమెడియన్గా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నారు. మత్తు వదలరా మూవీలతో సత్య తానేంటో నిరూపించుకున్నాడు. తెలుగు సినిమా కామెడీకి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు.తాజాగా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే చిత్రాలను తెరెకెక్కించిన రితేశ్ రాణానే సత్యను హీరోగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు సత్య ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. ఈ చిత్రాకి జెట్లీ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా సత్య ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ టాలీవుడ్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. #RR4 is #JETLEE ❤🔥̶C̶o̶m̶e̶d̶i̶a̶n̶ ̶S̶a̶t̶y̶a̶ ̶ HERO #Satya in and not as #JETLEE ❤🔥A @RiteshRana's turbulence 🛫Entertainment takes off. Shoot begins 💥💥Starring #Satya, #RheaSingha, @vennelakishoreMusic by @kaalabhairava7Produced by @ClapEntrtmntPresented… pic.twitter.com/X99IRAAEVt— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2025 -
శర్వానంద్ బైకర్.. రిలీజ్కు ముందే ఫుల్ వీడియో సాంగ్
చాలా రోజుల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరో శర్వానంద్(Sharwanand) నటిస్తోన్న తాజా చిత్రం బైకర్. రేసింగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బైకర్ మూవీ ఫస్ట్ వీడియో సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రెట్టి బేబీ అంటూ సాగే ఫుల్ వీడియో పాటను విడుదల చేశారు.కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను జిబ్రాన్, యాజిన్ నైజర్, సుభ్లాషిణి ఆలపించారు. ఈ లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ శర్వా ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. అభిలాశ్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతమందిస్తున్నారు. -
విలేజ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి.. ట్రైలర్ వచ్చేసిింది
అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీకి సాయిలు దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్)ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అబ్బాయికి.. కుటుంబానికి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి అని ట్రైలర్లోనే తెలిసిపోతుంది. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. Their hearts beat as one, their love faces every storm ❤️🔥Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️▶️ https://t.co/lrlbW9zT95Launched by The Star of New Age Films @AdiviSesh garu💫#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/RufYYOLkvA— Dolamukhi Subaltern Films (@dsfofficial_) November 13, 2025 -
'మగాడిగా పుట్టడమే పెద్ద దరిద్రం రా'.. మోగ్లీ టీజర్ అదుర్స్
యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా వస్తోన్న తాజా చిత్రం మోగ్లీ 2025(Mowgli Teaser). ఈ సినిమాకు కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. బబుల్ గమ్ మూవీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ఈ సినిమాతో హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాక్షి సాగర్ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.ఈ టీజర్ను జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తే ఈ కథ అంతా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో సన్నివేశాలు, డైలాగ్స్ చూస్తే ఈ కథేంటో ప్రేక్షకులకు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన డిసెంబరు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి కాలభైరవ సంగీతమందించారు. -
'నా కెరీర్లో ఇలా చేయడం తొలిసారి'.. అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేశ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అల్లరి నరేశ్ మాట్లాడుతూ..'ఇప్పటివరకూ కామెడీ ఎంటర్టైనర్ మూవీస్ చేశా. మధ్యలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా ప్రయత్నించా. నా కెరీర్లో సస్పెన్స్ థ్రిల్లర్ చేయడం ఇదే తొలిసారి. ఇదొక మల్టీ లేయర్ సబ్జెక్ట్. స్క్రీన్ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చాలా మంది కొత్త డైరెక్టర్స్తో చేశా. కాసరగడ్డ నానికి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది. త్వరలో జరగనున్న నాని పెళ్లి గిఫ్ట్గా ఈ సినిమా సక్సెస్ అందిస్తాం. ఈ చిత్రాన్ని సినిమాటోగ్రాఫర్ రమేశ్ కేవలం 41 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఎక్కువ భాగం ఒకే ఇంట్లో షూట్ చేశాం. ఈ సినిమాలో ఎవరు విలన్ అనేది చివరి వరకు కనిపెట్టలేరు' అని అన్నారు. కాగా.. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన అల్లు అర్జున్
ఢిల్లీ పేలుడు ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషాద సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశారు. ఇలాంటి సమయంలో బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పోస్ట్ చేశారు. మళ్లీ ఎప్పటిలాగే శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాని ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. కాగా..ఈ కారు పేలుడు ఘటనలో దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద చోటు చేసుకుంది.కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. Deeply saddened by the tragic incident near Delhi's Red Fort. My heartfelt prayers are with the victims and their families, and I wish for peace to prevail once again. 🙏🏼 🇮🇳— Allu Arjun (@alluarjun) November 11, 2025 -
అల్లరి నరేశ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది
కామెడీ సినిమాలతో అభిమానులను అలరించిన హీరో అల్లరి నరేశ్. అయితే గత కొంతకాలంగా తన ట్రెండ్కు భిన్నంగా మాస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో తన ట్రాక్ మార్చాడు. అయితే ఈ చిత్రాలేవీ ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అయినా మళ్లీ అదే ట్రాక్లో వెళ్తున్నారు. ఈ సారి మాస్కు భిన్నంగా క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.తాజాగా అల్లరి నరేశ్ నటించిన క్రైమ్ అండ్ హారర్ థ్రిల్లర 12ఏ రైల్వే కాలనీ(12A Railway Colony Trailer). ఈ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కించారు. పొలిమేర చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. ఈ చిత్రంలో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే కథ మొత్తం మర్డర్ కేసు చుట్టే తిరగనున్నట్లు తెలుస్తోంది. ఓ హత్య కేసు ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. -
వరుస ఫ్లాప్స్.. రవితేజ షాకింగ్ డెసిషన్!
మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇటీవలే రిలీజైన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశ పరించింది. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు.మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ.. రవితేజ ఫ్యాన్స్కు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్గా ప్రకటించారు. ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో. అయితే ఈ సారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది. ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్లో ఓ టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాఫ్లు ఎదురవుతున్న తరుణంలో చేస్తోన్న ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం. నిర్మాతలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేటేస్ట్ టాక్. అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. -
'సినిమా తీయడం గొప్ప కాదు'.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప! - #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025 -
పిల్లల కోసం ఆ మాత్రం చేయలేరా?. సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చూశారా?
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu Trailer). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే లవ్, పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చెప్పినమాట విననివాడే కొడుకు.. చెప్పినమాట విన్నట్లు నటించేవాళ్లే కూతురు.. అంతే పెద్దా తేడా లేదు... అనే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రేమ పెళ్లి తర్వాత పిల్లల కోసం మన హీరో ఎన్ని కష్టాలు పడ్డారనేదే సంతాన ప్రాప్తిరస్తు. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. ఈ చిత్రాన్ని పిల్లల దినోత్సవం కానుకగా నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందించారు. -
రష్మిక - విజయ్ పెళ్లి.. డేట్, వేదిక ఫిక్స్ చేశారుగా!
టాలీవుడ్లో మోస్ట్ క్రేజ్ ఉన్న జంటల్లో వీరిద్దరు ముందు వరుసలో ఉంటారు. వీళ్లు ఎక్కడా కనిపించినా సరే డేటింగ్ వార్తలు పుట్టుకొస్తాయి. చాలాసార్లు ఈ జంటపై రూమర్స్ వినిపించినా అస్సలు పట్టించుకోలేదు. అంతేకాదు ఎప్పుడు వాటిపై స్పందించలేదు కూడా. అలాంటిది ఇటీవలే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్లు వార్చలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. రష్మిక, విజయ్ చేతులకు ఉన్న రింగ్స్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఎంగేజ్మెంట్ అయినట్లు ఫిక్సయిపోయారు.అయితే నిశ్చితార్థం గురించి ఇంకా అధికారిక ప్రకటనే రాలేదు. కానీ రష్మిక- విజయ్ పెళ్లిపై అప్పుడే చర్చ మొదలైంది. వీరిద్దరు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు? సింపుల్గానా?..డెస్టినేషన్ వెడ్డింగా? అని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. కొందరైతే పెళ్లి వేదికను కూడా ప్రకటించేశారు. అంతే కాదండోయ్ తేదీ, ముహుర్తం కూడా ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట ఒక్కనున్నారని నెట్టింట పోస్ట్ వైరలవుతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లోని కోట ఈ గ్రాండ్ వెడ్డింగ్కు వేదిక కానుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమనే మాట పక్కనపెడితే రష్మిక- విజయ్ పెళ్లి విషయంలో వారికంటే ఆడియన్సే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా రష్మిక- విజయ్ దేవరకొండ పెళ్లి కోసం టాలీవుడ్ ప్రియులే కాదు.. దక్షిణాది ఫ్యాన్స్ సైతం ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇటీవల ఓ టాక్ షోకు హాజరైన రష్మిక తన చేతికి ఉన్న ఉంగరాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వాటిలో ఒకటి చాలా స్పెషల్ అని తెలిపింది. ఆడియన్స్ ఏమనుకున్నా అది నాకు సంతోషమేనని తెలిపింది. దీంతో పరోక్షంగా ఆమె నిశ్చితార్థం అయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం రష్మిక నటించిన మూవీ ది గర్ల్ఫ్రెండ్ విడుదలకు సిద్దమైంది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by The Cine Gossips (@thecinegossips) -
'మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి'.. జటాధర రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా వస్తోన్న డివోషనల్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం 'జటాధర'(JATADHARA Release Trailer). ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మరో ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి అనే డైలాగ్లో ట్రైలర్ ప్రారంభమైంది. దెయ్యాలు, భూతాలు అనే కాన్సెప్ట్తోనే ఈ మూవీని తీసినట్లు క్లియర్ కట్ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ అభిమానులను అలరిస్తుందా? ఎప్పటిలాగే అలా వచ్చి ఇలా వెళ్లిపోతుందా? తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం రిలీజ్ ట్రైలర్ చూసేయండి.ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ మూవీ ద్వారానే బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో మెప్పించనుంది. -
హీరో మంచు మనోజ్ సతీమణి ఎమోషనల్.. ఆ ఒక్క పాటతో కన్నీళ్లు!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం, మిరాయ్ చిత్రాలతో వెండితెరపై సందడి చేశారు. ఇటీవలే విడుదలైన మిరాయ్తో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో విలన్ పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. తేజ సజ్జా కీలక పాత్రలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది.అయితే హీరో మంచు మనోజ్ తాజాగా ఓ మూవీ ఈవెంట్కు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా సాంగ్ను లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమానికి సతీమణి భూమా మౌనికతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మంచు మనోజ్ అన్నారు. అంతేకాకుడా మౌనికతో తన ప్రేమ విషయాన్ని కూడా పంచుకున్నారు. రాజ్యాలేమీ లేకపోయినా.. రాణిలా చూసుకుంటానని మాటిచ్చానని తెలిపారు.అయితే ఈవెంట్కు హాజరైన మిట్టపల్లి సురేందర్ ఓ సాంగ్ను ఆలపించారు. 'రాజ్యమేదీ లేదుగానీ.. రాణిలాగా చూసుకుంటా.. కోట కట్టేలేనుకానీ.. కళ్లలో నిన్నే దాచుకుంటా' అంటూ మంచు మనోజ్, మౌనికలను ఉద్దేశించి రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలోని పాట పాడారు. భర్తను ప్రేమించే ప్రతి అమ్మాయి కోరుకునేది ఇదేనంటూ మాట్లాడారు. ఈ పాట విన్న భూమా మౌనిక తీవ్ర భావోద్వేగానికి గురైంది. వేదికపైనే కన్నీళ్లు ఆపులేకపోయింది. ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Celebrities Tollywood (@celebrities_tollywood_) -
ప్రభాస్తో రష్మిక సినిమా.. నా చావుకు కారణం అదేనన్న నెటిజన్!
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గర్ల్ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి శెట్టి హీరోగా నటించారు. ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. రష్మిక సైతం ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది. ఇటీవలే బిగ్బాస్ షోలోనూ సందడి చేసింది.తాజాగా ది గర్ల్ఫ్రెండ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా నెటిజన్స్తో చిట్చాట్ నిర్వహించింది. రష్అవర్ పేరుతో ట్విటర్ వేదికగా ప్రశ్నలు అడగాలని అభిమానులను కోరింది. దీంతో ఓ నెటిజన్ కాస్తా విభిన్నమైన ప్రశ్న వేశాడు. వీలైతే మీరు ప్రభాస్తో కలిసి నటిస్తారా? అలా జరిగితే మీ కాంబో హైప్ దెబ్బకు థియేటర్ నా శవాన్ని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా అడిగాడు. దీనికి స్పందించిన రష్మిక.. ప్రభాస్తో నటించడం నాకు కూడా ఇష్టమే.. ఒకవేళ ప్రభాస్ ఈ మేసేజ్ చూస్తారని ఆశిస్తున్నా.. మేమిద్దరం కలిసి భవిష్యత్తులో నటిస్తే నా కెరీర్లో చాలా ప్రత్యేకంగా నిలవనుంది అంటూ రిప్లై ఇచ్చింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. గతంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న సినిమాలో రష్మికను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ చివరికీ బాలీవుడ్ భామ, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ఆ ఛాన్స్ కొట్టేసింది. యానిమల్ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ది గర్ల్ఫ్రెండ్ చిత్రంతో మరోసారి అలరించేందుకు వస్తోంది.😆😆😆😆🩷 I love it.. I hope Prabhas sir see’s this message and I hope we really do work together on something special soon! 🩷— Rashmika Mandanna (@iamRashmika) November 3, 2025 -
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
నా అభిమానులకు అంకితమిస్తున్నా.. ఐకాన్ స్టార్ ట్వీట్
ప్రతిష్టాత్మక అవార్డ్ను తన అభిమానులకు అంకితమిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి అరుదైన గౌరవమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది అవార్డులు పొందిన వారికి హృదయపూర్వక అభినందనలు చెబుతూ ఐకాన్ స్టార్ ట్వీట్ చేశారు. 2024 ఏడాదిగానూ ప్రకటించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను తాజాగా ప్రకటించారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. అంతేకాకుండా పుష్ప-2 మూవీకి గానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్స్లో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా సత్తా చాటింది. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ -2025లో ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది. గతేడాది విడుదలై ప్రేక్షకుల్ని భయంతో పరుగులు పెట్టించిన శ్రద్దాకపూర్ మూవీ స్త్రీ- 2 ఉత్తమ చిత్రంగా అవార్డును దక్కించుకుంది.దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటీనటులుగా కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ నిలిచారు. చందు ఛాంపియన్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా కబీర్ ఖాన్, ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్గా దినేశ్ విజన్ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా లాపత్తా లేడీస్, ఉత్తమ నటీనటులుగా విక్రాంత్ మాస్సే, నితాన్షీ గోయెల్ అవార్డులు దక్కించుకున్నారు. ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఏఆర్ రెహమాన్ నిలిచారు. Thanks to the Dadasaheb Phalke International Film Awards for the incredible honour. Truly humbled. @Dpiff_official My warm congratulations to all the winners across categories this year.A sincere thank you to my audience for your continued love and support… I humbly dedicate…— Allu Arjun (@alluarjun) November 2, 2025 -
యూత్ఫుల్ ఎంటర్టైనర్.. ఇట్లు మీ ఎదవ ట్రైలర్ చూశారా?
త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'ఇట్లు మీ ఎదవ'. ఈ మూవీని యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సాహితీ అవంచ హీరోయిన్గా నటిస్తున్నారు. వెయేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. ఇప్పటికే రిలీజైన టైటిల్ గ్లింప్స్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ వేడుకలో విడుదల చేశారు. ఈ సినిమాను సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ యూత్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ కీలక పాత్రల్లో నటించారు. -
గ్రాండ్గా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు త్వరలోనే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదిక పంచుకున్నారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ విత్ లవ్ ఆఫ్ మై లైఫ్ నయనిక అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు అభినందనలు చెబుతున్నారు. కాగా ఇటీవలే వర్షం కారణంగా ఎంగేజ్మెంట్కు అటంకం కలిగిందని అల్లు శిరీష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఇవాళ వాతావరణం అనుకూలించడంతో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. కాగా.. అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) -
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. -
దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. సతీసమేతంగా హాజరైన నిర్మాత
ప్రస్తుతం ఎక్కడా చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా దిల్ రాజు ఇంట కూడా శుభకార్యం జరిగింది. ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు సోదరి కుమార్తె పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు, రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లికి హాజరైన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుక ఫోటోలను దిల్ రాజు సతీమణి తేజస్విని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. పెళ్లిలో దిల్ రాజుతో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. అక్క పెళ్లిలో కష్టపడుతున్న తమ్ముడు అంటూ దిల్ రాజు కుమారుడిని వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. దిల్ రాజు అన్న కుమార్తె కీర్తన పెళ్లి హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. -
టాలీవుడ్ స్పై డ్రామాగా 'చైనా పీస్'.. జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కిస్తోన్న స్పై డ్రామా చైనా పీస్. ఈ మూవీని అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో హర్షిత, శ్రీషా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జేమ్స్ బాండ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు దినేష్ కక్కర్ల లిరిక్స్ అందించగా.. స్పూర్తి జితేందర్, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ పాటకు కార్తీక్ రోడ్రిగ్స్ సంగీతమందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. -
స్పిరిట్ మూవీ.. ప్రభాస్ను అలా చూపించనున్నారా?
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పిరిట్’. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డేను పురస్కరించుకుని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగా బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్తో బోల్డ్ డైరెక్టర్గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి.. ప్రభాస్ స్పిరిట్లోనూ అదే పంథాను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతోంది. అందుకే స్పిరిట్లోనూ బోల్డ్ సన్నివేశాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలొస్తున్నాయి.గ్లింప్స్ డైలాగ్ వల్లే రూమర్స్..ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగ్.. ఈ వార్తకు బలం చేకూరుతోంది. ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి అనే చెప్పిన డైలాగ్తోనే టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్లో రణ్బీర్ కపూర్ ఓ సీన్లో న్యూడ్గా కనిపించారు. అదే పంథాను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమని చెప్పొచ్చు. కాగా.. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. -
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో మరోసారి ఆడియన్స్ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
అల్లు అర్జున్-అట్లీ కాంబో.. ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్!
పుష్ప -2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) మరో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఆయన జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొన్ని నెలలుగా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అంతే కాకుండా మరో ముగ్గురు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారని టాక్ నడిచింది.ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్కు సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్లో సీతారామం బ్యూటీ హీరోయిన్గా కన్ఫామ్ అయినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మృణాల్ షూట్లో కూడా పాల్గొన్నారని లేటేస్ట్ అప్డేట్. అంతేకాకుండా అల్లు అర్జున్తో కీలక సన్నివేశాలు షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబోలో మృణాల్ ఎంట్రీలో మూవీపై మరింత బజ్ ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమాను AA22xA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మూవీలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ సైతం నటిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మరికొందరిని హాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులను ఈ మూవీ కోసం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సినిమాను దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్తో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.Buzz is that actress Mrunal Thakur has joined Allu Arjun in Atlee’s upcoming sci-fi action spectacle “AA22xA6”. Backed by Sun Pictures, the film is said to be a high-octane futuristic thriller packed with massive action sequences, time-travel elements, and cutting-edge VFX. The… pic.twitter.com/xqnzdR7DlJ— SIIMA (@siima) October 28, 2025 -
'ఈ సారి మామూలుగా ఉండదు'.. డకాయిట్ కొత్త రిలీజ్ డేట్
టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ఇంటెన్స్ యాక్షన్ ప్రేమకథా చిత్రం డకాయిట్(Dacoit). ఇప్పటికే రిలీజ్ తేదీ ప్రకటించినా అనివార్య కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్ నుంచి కోలీవుడ్ భామ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకుంది. ఇది కూడా సినిమా ఆలస్యానికి కారణం కావొచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్గా చేస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.కానీ వారు అనుకున్న తేదీ ప్రకారం కుదరకపోవడంతో తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు డకాయిట్ మేకర్స్. వచ్చే ఏడాది ఉగాది కానుకగా డకాయిట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఈ సారి మామూలుగా ఉండదు.. వెనక్కి తిరిగి చూసేదే లేదు' అంటూ అడివి శేష్ మూవీ పోస్టర్ను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో డకాయిట్ సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (ఇది చదవండి: 'డకాయిట్' ఫైర్ గ్లింప్స్ విడుదల)ఈ మూవీని షానీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అడివి శేష్ నటించిన ‘క్షణం’, గూఢచారితో సహా పలు తెలుగు సినిమాలకు కెమెరామేన్గా చేసిన షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను ఆకట్టుకుంది. Ee Saari Mamulga undadhu ❤️🔥There’s NO LOOKING BACK#DACOIT This UGADI MARCH 19th 2026in Theaters WORLDWIDE pic.twitter.com/KaxruBidTN— Adivi Sesh (@AdiviSesh) October 28, 2025 -
ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ.. గ్లింప్స్ రిలీజ్
లక్ష్మణ్ టేకుముడి , రాధికా జోషి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం 'ప్రేమ లేదని'. ఈ మూవీకి జీడీ నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని జీడీఆర్ మోషన్ పిక్చర్ బ్యానర్లో శ్రీని ఇన్ఫ్రా నిర్మిస్తున్నారు. హార్ట్ ఫుల్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.తాజాగా ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని రూపొందించినట్లు గ్లింప్స్లో సీన్స్ చూస్తేనే అర్థమవుతోంది. మందు, సిగరెట్ కాదు.. అబ్బాయిలకు హానికరం అమ్మాయిలు అనే చివర్లో వచ్చే డైలాగ్ యూత్కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ రోజుల్లో ట్రెండ్కు తగినట్లుగానే ప్రేమలేదని మూవీని ప్రేక్షకుల ముందుకొస్తున్నట్లు గ్లింప్స్లో చూపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ సుహాస్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సురేశ్ గురు, గాయత్రి కీలక పాత్రల్లో నటించారు. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
శర్వానంద్ లేటేస్ట్ లుక్.. ఇంతలా మారిపోయాడేంటి?
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవలే తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ దీపావళి టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నారు. బైకర్ అనే మూవీలో శర్వానంద్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది.అయితే తాజాగా శర్వానంద్ సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారు. షర్ట్ లెస్తో ఉన్న ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాకింగ్కు గురవుతున్నారు. ఇవీ చూసిన అభిమానులు.. శర్వానంద్ ఇలా మారిపోయాడేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే బైకర్ మూవీ కోసమే ఇలా పూర్తిగా తన బాడీని మార్చుకున్నారని తెలుస్తోంది. నిజమైన బైక్ రేసర్గా కనిపించేందుకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిజిక్ కోసం కొన్ని నెలల పాటు వర్కవుట్స్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అతుల్ కుల్కర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Sharwanand (@imsharwanand) -
నాగార్జున 'శివ' రీ రిలీజ్.. బన్నీ పోస్టర్ రిలీజ్..!
అక్కినేని నాగార్జున నటించిన కల్ట్ బ్లాక్బస్టర్ మూవీ 'శివ'. ఈ మూవీ నాగ్ కెరీర్లోనే చాలా ప్రత్యేకం. ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో రామ్గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యారు. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజైంది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్గానూ నిలిచింది. ఈ సినిమాని శివ(1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు.ఈ సినిమా 4కె వర్షన్, డాల్బీ అట్మాస్లో ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది. తెలుగులో మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ఈ మూవీ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. టాలీవుడ్ సినిమా శివ మూవీ తెచ్చిన మార్పు గురించి ప్రస్తావించనున్నారు. ఈ శుక్రవారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మాట్లాడనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. దీంతో బన్నీ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శివ మూవీ గురించి ఏం మాట్లాతారనే విషయంపై అభిమానులతో పాటు అందరిలోనూ ఆతృత నెలకొంది. కాగా.. ఈ సినిమాను నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. కాగా.. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్ని సృష్టించారు వర్మ. ICON STAR of Indian Cinema 🔥🔥🔥× ICONIC FILM of Indian Cinema ❤️🔥❤️🔥❤️🔥Watch India's Favourite Star, @alluarjun talks about the Impact of SHIVA, Tomorrow at 11:07 AM💥💥💥#SHIVA4K with Dolby Atmos Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025. #50YearsOfAnnapurna… pic.twitter.com/b2sB6nLIk5— Annapurna Studios (@AnnapurnaStdios) October 24, 2025 -
బాలయ్య అఖండ-2.. బ్లాస్టింగ్ రోర్ వచ్చేసింది!
బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో వస్తోన్న యాక్షన్ మూవీ అఖండ 2 తాండవ. 2021లో విడుదలైన అఖండ చిత్రానికి సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా.. ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.తాజాగా అఖండ-2 నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. బ్లాస్టింగ్ రోర్ అనే పేరు ఈ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఈ చిత్రంలోని ఫైట్ సీన్, డైలాగ్ బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ మూవీని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.WHEN HE ROARS..THE WORLD TREMBLES💥💥💥#Akhanda2 BLASTING ROAR out now❤🔥Telugu - https://t.co/S6tFj0DKz3 Hindi - https://t.co/k0jOLGVJPITamil - https://t.co/HOylJFE0TSKannada - https://t.co/WNySTgpaPdMalayalam - https://t.co/XC4HA7vqrA IN CINEMAS WORLDWIDE FROM… pic.twitter.com/l6fQ0sux4I— 14 Reels Plus (@14ReelsPlus) October 24, 2025 -
సుమ తనయుడి కొత్త సినిమా.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
యాంకర్ సుమ తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా వస్తోన్న తాజా చిత్రం 'మోగ్లీ' (Mowgli). ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రోషన్.. ప్రస్తుతం సందీప్ రాజ్తో జతకట్టారు. ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా కనిపించనుంది.తాజాగా ఈ మూవీ నుంచి లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. సయ్యారే అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కాల భైరవ, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలు పోషించారు. కాగా.. మోగ్లీ డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
నాపై చేతబడి చేశారు.. ఎవరూ తప్పించుకోలేరు : హీరో సుమన్
సుమన్(Suman)..ఒకప్పుడు స్టార్ హీరో. చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన నటుల్లో ఆయన ఒకరు. అనుకోకుండా ఆయన జైలుకు వెళ్లడం.. ఆరు నెలల పాటు అక్కడే ఉండడంతో ఆయన కెరీర్కి పెద్ద దెబ్బ తగిలింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా హీరోగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూనే..మరోవైపు టీవీ సీరియల్స్లోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించాడు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో ఆయనకు చేతబడి చేశారట. కేరళకు వెళ్లి విరుగుడు పూజ చేయింకున్నాని సుమన్ చెప్పారు.‘నాపై చేతబడి జరిగిన మాట వాస్తవం. అయితే ఎవరు చేయించారనేది తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. బిజినెస్ రంగంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ చేతబడి అనేది కేరళలో చాలా ఫేమస్. అక్కడ చోటనికరే అనే ప్లేస్ ఉంది. అక్కడ చేతబడి జరిగిన వాళ్లకి విరుగుడు పూజ చేస్తుంటారు. ఇందులో రకరకాలుగా ఉంటుంది. ఎందుకు? ఎవరు చేయించారనేది తెలియదు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేరళ వాళ్లకి దీని గురించి బాగా తెలుసు చేతబడి ఎలా ప్రయోగిస్తారు? దాన్ని తగ్గించడం.. మనస్పర్థలు తీసుకుని రావడం లాంటి విద్యలు చేస్తుంటారు. అది ఇప్పటికీ ఉంది.అప్పట్లో నాకు వరుసగా ఎదురుదెబ్బలే తగులుతుండడంతో కొంతమంది చెబితే అక్కడకు వెళ్లాను. విరుగుడు పూజ ఏదో చేయించారు. అది తప్పు ఒప్పు... ఉంది లేదని నేనేం చెప్పను. కానీ నేను టైమ్ని బాగా నమ్ముతా. ఈరోజు ఇది.. ఈ నెల ఇది.. ఈ సంవత్సరం ఇది అంటే అది జరిగితీరుతుంది. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా.. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు. వాడు తొక్కేశాడు.. వీడు నొక్కేశాడు.. ఎక్కేశాడు. వీడి వల్ల అలా జరిగింది.. ఇలా జరిగిందని. బట్.. ఆ టైమ్ అలా జరిపిస్తుంది. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకి అలా చేయాలనే ఉద్దేశం ఉండదు. కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది. అది కూడా వాళ్ల రాతే. దాన్నే కర్మ అని అంటారు. కర్మను నేను బాగా నమ్ముతాను. రోగాలు రావడం కూడా కర్మే. టైమ్ని బట్టి రోగాలు వస్తుంటాయి. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని సుమన్ చెపుకొచ్చారు. -
దీపావళి వెలుగుల్లో మెరిసిపోతున్న పూనమ్ బజ్వా.. డిఫరెంట్గా శ్వేతాబసు ప్రసాద్!
ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ పూనమ్ బజ్వా..దీపావళి సెలబ్రేషన్స్లో బాలీవుడ్ బ్యూటీ శివాంగి జోషి..ఎల్లో శారీలో బుల్లితెర నటి మంజుల అందాలు..హీరోయిన్ కావ్య థాపర్ స్మైలీ లుక్స్..ఢిఫరెంట్ అవుట్ఫిట్లో శ్వేతాబసు ప్రసాద్.. View this post on Instagram A post shared by Sahithi Dasari (@sahithi_dasari7) View this post on Instagram A post shared by C Sharp (@c___sharp) View this post on Instagram A post shared by Sai Praseedha Uppalapati (@praseedhauppalapati) View this post on Instagram A post shared by Nandiniii🕊 (@nandiniguptaa13) View this post on Instagram A post shared by Aishwarya Ragupathi (@aishwarya_ragupathi) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Manjula Paritala (@paritala_manjula_official) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) -
రెబల్ స్టార్ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేశారు. అందరూ ఉహించినట్లుగానే ఈ మూవీకి ఫౌజీ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్కు పలువురు టాలీవుడ్ సినీతారలు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రభాస్తో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. తాజాగా హీరోయిన్ ఛార్మి సైతం డార్లింగ్కు పుట్టినరోజు విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత ప్రభాస్తో నటించిన పౌర్ణమి రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసింది.(ఇది చదవండి: ప్రభాస్, హను రాఘవపూడి కొత్త సినిమా టైటిల్ ప్రకటన)ఈ సినిమాలో ప్రతి సీన్ ఇప్పటికీ గుర్తుందని రాసుకొచ్చింది. పౌర్ణమి మూవీతో నాకున్న ఉత్తమ జ్ఞాపకాలలో ఒకటని ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమాతో మొదలైన ప్రభుదేవా, త్రిషతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతోందని వెల్లడించింది. మా అభిమాన రెబెల్స్టార్ ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఛార్మి విష్ చేసింది. కాగా..2006లో ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఛార్మి, త్రిష హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. After 20years,#Pournami a film which is very very close to all of us is re-releasing today on our darling #Prabhas’s birthday. I still remember each and every moment so strong and so beautiful, one of my best memories i have with pournami and even after 20years,… pic.twitter.com/kbGKXmhlmI— Charmme Kaur (@Charmmeofficial) October 23, 2025 -
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee) -
మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!
మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్ ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్కమ్ టూ మన శంకర వరప్రసాద్ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్ను చిరంజీవి మై బ్రదర్ అని పిలవగా.. చిరుసర్.. మై బాస్ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Welcoming my dear friend, Victory @VenkyMama to our #ManaShankaraVaraPrasadGaru Family 💐💐💐Let’s celebrate the joy this Sankranthi 2026 in theatres 🤗 pic.twitter.com/3kITC2RlBU— Chiranjeevi Konidela (@KChiruTweets) October 23, 2025 -
సజ్జనార్కు ఎన్టీఆర్ అభిమాని ఫిర్యాదు.. ఎందుకంటే?
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు ప్రైవసీ అనేది లేకుండా పోతోంది. వారి ఫోటోలను ఎలా పడితే అలా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినీ స్టార్స్ ఇలాంటి వాటి బారిన పడుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీపీ సజ్జనార్కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి సీపీని కలిసి ఫిర్యాదును సమర్పించారు.తమ హీరో ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఎన్టీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేలా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలను వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. We sincerely thank Hyderabad Commissioner of Police Mr. V.C. Sajjanar, IPS garu, and the entire Hyderabad Police Department for their prompt response and assurance to take swift and appropriate action against those responsible for morphing and posting objectionable content… pic.twitter.com/Pg4dX2k4in— NandipaTi muRali (@NtrMurali9999) October 22, 2025 -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ ఆగిపోయిందా?.. అసలు నిజమెంత?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాను ఎన్టీఆర్నీల్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కాంతార బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ పాన్ ఇండియా చిత్రంపై నెట్టింట కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ఇలాంటి బ్యాడ్ న్యూస్ రావడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మధ్య కంటెంట్ సృజనాత్మక విషయంలో విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతోనే ఈ మూవీ ఆగిపోయిందని నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కానీ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై మేకర్స్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని ఇప్పటికే వెల్లడించారు. Who’s the culprit behind spreading fake news on #NTRNeel ?Some Paid Agenda working behind.... https://t.co/q16nhnWksa— prashanth Neel (@Prashant_neell) October 21, 2025 -
పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన ప్రియురాలు శిరీష మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవలే శిరీష సోషల్ మీడియా వేదికగా పసుపు దంచే కార్యక్రమం అంటూ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి.తాజాగా నారా రోహిత్- శిరీషల పెళ్లి వేడుకకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు వీరి గ్రాండ్ వెడ్డింగ్ వేడుక జరగనున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్లోనే గ్రాండ్గా జరగనుంది.(ఇది చదవండి: నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్)ఆ సినిమాతో శిరీషతో పరిచయం..నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.రోహిత్ కెరీర్..బాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు.Two hearts. One destiny. Infinite memories ahead ❤️The beautiful journey of #NaraRohith & Sireesha begins with a celebration as grand as their love story 💍A 4-Day grand wedding festivities to be held in Hyderabad with the Muhurtham on 30-10-25 ❤️Here’s to forever filled… pic.twitter.com/AqGedliw78— Ramesh Bala (@rameshlaus) October 22, 2025 -
వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో.. హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!
విక్టరీ వెంకటేశ్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టైటిల్పై టాలీవుడ్లో చర్చ మొదలైంది. అంతేకాకుండా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ సరసన కనిపించనున్న హీరోయిన్ పేరును రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ హీరోయిన్ పేరును వెల్లడించింది. కేజీఎఫ్తో స్టార్డమ్ దక్కించుకున్న శ్రీనిధిశెట్టి ఈ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో మేకర్స్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి పోస్టర్ను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్లో నాని హిట్- 3, ఇటీవలే విడుదలైన సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా సినిమాలతో మెప్పించింది. కాగా..ఈ చిత్రం వెంకీ మామ కెరీర్లో 77వ సినిమాగా రానుంది. అయితే ఈ మూవీ టైటిల్ ఇంకా ప్రకటించలేదు.Here’s wishing the gorgeous and graceful @SrinidhiShetty7 a fantastic Birthday! ❤️#HBDSrinidhiShetty 💫Excited to have you join the journey of our Production No.8 | #Venky77 | #VenkateshXTrivikram | 🎬Victory @VenkyMama #Trivikram #SRadhaKrishna @haarikahassine pic.twitter.com/AALKT17vZ4— Haarika & Hassine Creations (@haarikahassine) October 21, 2025 -
దీపావళి మరింత స్పెషల్.. వారసుడితో వరుణ్ తేజ్ సెలబ్రేషన్స్!
దీపావళి వచ్చిందంటే చాలు.. సినీతారల సందడి మామూలుగా ఉండదు. కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ దీపావళిని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పండుగ టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ దంపతులకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. తమ ముద్దుల వారసుడితో కలిసి దీపావళిని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.కాగా.. మెగా హీరో వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితమే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 10న ఈ జంటకు బాబు పుట్టాడు. ఇటీవలే బారశాల వేడుక కూడా నిర్వహించారు. వరుణ్-లావణ్య దంపతులు తమ వారసుడి పేరుని బయటపెట్టారు. హనుమంతుడి పేర్లలో ఒకటైన వాయుపుత్రని స్పూర్తిగా తీసుకుని 'వాయువ్ తేజ్' అని నామకరణం చేశారు.కాగా.. నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'ముకుంద' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఫిదా, కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో తనతో పాటు కలిసి నటించిన లావణ్య త్రిపాఠితో దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. 2023లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) -
దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేశ్ కూడా పాల్గొన్నారు. కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
శర్వానంద్ కొత్త సినిమా.. టైటిల్ రివీల్ చేసిన మేకర్స్
టాలీవుడ్ హీరో శర్వానంద్ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ దిపావళీకి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. తన లేటేస్ట్ మూవీ టైటిల్ను రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను ప్రకటించారు. బైక్పై శర్వానంద్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు బైకర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో బైక్ రేసర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించునున్నారు. ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో 36వ సినిమాగా రానుంది. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. #Sharwa36 is #BIKER 🏍️🏁May you conquer every corner, every jump and every obstacle in life and aim for glory 🏁Wishing you a Happy Diwali 🪔✨#GoAllTheWay #BikerMovieCharming Star @ImSharwanand #MalvikaNair @abhilashkankara @rajeevan69 @ghibranvaibodha @dopyuvraj… pic.twitter.com/zKUND8GQwL— UV Creations (@UV_Creations) October 20, 2025 -
ఎలన్ మస్క్ ఎరికేనా మీకు.. ఆ రాకెట్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న లేటేస్ట్ ప్రోమో!
టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్నప్పటికీ ఛాన్స్ వస్తే చాలు ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది.తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్ను కూడా విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్మెన్ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. JaaneJigars. First song from #AnaganagaOkaRaju BLASTING SOON 🔥🔥 Mee andariki Deepavali Subhakankshalu. Love you guys. Can’t wait for Sankranthi😍🔥Here is the DIWALI BLAST promo 💣▶️ https://t.co/YI94w3Q97c @Meenakshiioffl #Maari @MickeyJMeyer @dopyuvraj @vamsi84… pic.twitter.com/5jHE399ZXg— Naveen Polishetty (@NaveenPolishety) October 20, 2025 -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
డీజీపీని కలిసిన మంచు మనోజ్ దంపతులు
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉందని ట్వీట్లో రాసుకొచ్చారు.మంచు మనోజ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ..'నేను, నా భార్య మౌనిక గౌరవనీయులైన డీజీపీ శివధర్రెడ్డిని కలిశాం. సమగ్రత, దార్శనికత కలిగిన నాయకుడు బాధ్యతలు స్వీకరించడం చూసి ఆనందంగా ఉంది. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన ప్రయాణం క్రమశిక్షణ, ధైర్యం, నైతిక పోలీసింగ్ పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.Me and my wife @BhumaMounika met Shri B. #ShivadharReddy Garu, the new @TelanganaDGP 💐Delighted to see a leader of integrity and vision take charge. His journey from the grassroots to the top reflects discipline, courage, and an unshakable commitment to ethical policing.… pic.twitter.com/0f4g3YS7FP— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 17, 2025 -
సుధీర్ బాబు జటాధర.. ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'జటాధర'. డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజైంది. కాగా.. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్- అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్-ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. 'పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవాడు' అనే డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తే.. ఈ కథను ధనపిశాచి అనే కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సోనాక్షి సిన్హా ధనపిశాచి పాత్రలో విశ్వరూపం చూపించింది. నమ్రతా సిస్టర్ శిల్పా శిరోద్కర్ సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా కథేంటో ట్రైలర్ చూస్తేనే ప్రేక్షకులను తెలిసిపోతోంది. -
మీ ఫేవరేట్ హీరో ఎవరు?.. సిద్ధు జొన్నలగడ్డ ఏమన్నారంటే?
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుసుకదా. ఇప్పటికే ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీప్రసాద్ నిర్మించారు.రిలీజ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో సిద్ధు సరదాగా నెటిజన్లతో ముచ్చటించారు. ట్విట్టర్ వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధనాలిచ్చారు సిద్ధు. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ గురించి సైతం పలువురు అడిగారు. అంతేకాకుండా మీ ఫెవరేట్ హీరో ఎవరని కూడా ప్రశ్నించారు. దీనికి సిద్ధు తన నచ్చిన హీరో రణ్బీర్ కపూర్ అంటూ ఆన్సరిచ్చారు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ త్వరలోనే జరగనుందని రిప్లై ఇచ్చాడు. Ranbir kapoor ! Fan boy moment Yet to happen— Siddhu Jonnalagadda (@Siddubuoyoffl) October 16, 2025 -
ఆసియా కప్ హీరోకు మెగా సన్మానం.. కేక్ కట్ చేయించిన చిరు
ఆసియా కప్ హీరో తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సన్మానించారు. ప్రస్తుతం మనశంకరవరప్రసాద్గారు మూవీలో నటిస్తోన్న చిరు.. ఈ టీమిండియా క్రికెటర్ను సత్కరించారు. ఈ సందర్భంగా మూవీ సెట్లో కేక్ కట్ చేసిన తిలక్ వర్మకు.. ఆసియా కప్ ఫైనల్ నాటి ఫోటోను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో నయనతార, అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.కాగా..ఇటీవల దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ విజయం కీలకమైన సమయంలో రాణించాడు. దీంతో తిలక్ వర్మపై పలువురు క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల మీసాల పిల్ల అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Megastar #Chiranjeevi Garu met young cricket sensation #TilakVarma on the sets of #ManaShankaraVaraPrasadGaru and felicitated him for his stellar contribution to India’s glorious win against Pakistan. 🏏💫A proud moment as the Megastar appreciated the Hyderabad boy’s talent,… pic.twitter.com/9HVOg2ZRy4— Team Megastar (@MegaStaroffl) October 16, 2025 -
మెగాస్టార్ సంక్రాంతి సినిమా.. రొమాంటిక్ ఫుల్ సాంగ్ అవుట్!
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం మన శంకరవరప్రసాద్గారు (Mana Shankara Vara Prasad Garu Movie). ఈ మూవీతో బ్లాక్బస్టర్ కొట్టేందుకు అనిల్ రావిపూడి సిద్ధమైపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్కు ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రమోషన్స్తో ఫుల్ స్వింగ్లో దూసుకెళ్తున్నారు.ఇటీవల దసరా సందర్భంగా క్రేజీ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా మీసాల పిల్లా అంటూ సాగే రొమాంటిక్ ఫుల్ లిరికల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ సాంగ్కు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. డేరింగ్ సీన్ లీక్!
మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం చెర్రీ సరసన బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఓ బ్యూటీఫుల్ సాంగ్ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పర్వత ప్రాంతంలో రామ్ చరణ్ స్టెప్పులు వేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. చెర్రీ ఓ రాయిపై నిలబడి డ్యాన్స్ చేయడంపై డేరింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రామ్ చరణ్ డేరింగ్ డ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సాంగ్ షూట్ సీన్ లీక్ కావడం టాలీవుడ్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ పాట విజువల్ ట్రీట్గా ఉంటుందని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే పర్వత ప్రాంతాల్లోనే షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. View this post on Instagram A post shared by IWMBuzz (@iwmbuzz) -
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్.. రిలీజ్లో ట్విస్ట్!
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం తెలుసు కదా (Telusu Kada). ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఈనెల 12 వైజాగ్ ఈవెంట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ట్రైలర్ రిలీజ్ తేదీపై బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని పోస్టర్ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 13న ఉదయం 11 గంటల 34 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో సిద్ధు ఫ్యాన్స్ కాస్తా డిస్సాపాయింట్ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.UNAPOLOGETICALLY RADICAL 💥💥#TelusuKadaTrailer out tomorrow at 11.34 AM. Love will be unhinged ❤🔥#LoveU2#TelusuKada in cinemas worldwide from October 17th!STAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu @vishwaprasadtg… pic.twitter.com/EwAIC1yWyI— People Media Factory (@peoplemediafcy) October 12, 2025 -
గ్రాండ్గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
అట్లీ మూవీ షూటింగ్ గ్యాప్.. విదేశాల్లో వాలిపోయిన బన్నీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఏఏ22 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ముంబయిలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు వెల్లడించారు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించనున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఐకాన్ స్టార్ వెకేషన్లో చిల్ అవుతున్నారు. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి విదేశాల్లో చిల్ అవుతున్నారు. తాజాగా ఈ ఫోటోలను బన్నీ భార్య సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
సర్వస్వం నువ్వే.. నా జీవితంలో ఆదర్శం నువ్వే.. మంచు మనోజ్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ నటి మంచు లక్ష్మికి తమ్ముడు, హీరో మంచు మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో నువ్వే నాకు ఎల్లప్పుడు ఆదర్శం అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఒక తల్లిగా, నటుడిగా, నిర్మాతగా నువ్వు జీవిస్తున్న విధానం అద్భుతం అంటూ కొనియాడారు. నువ్వు అడుగుపెట్టే ప్రతి ఇంటికి వెలుగునిచ్చి.. నీ దయ, బలంతో ఎన్నో జీవితాలను మార్చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.ఎల్లప్పుడూ నువ్వు ఇలాగే ఉండి.. నువ్వు వెళ్లే ప్రతిచోటా నీ వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మంచు మనోజ్ ఎమోషనలయ్యారు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అక్కా ప్రేమను వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం మంచు లక్ష్మీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది భైరవం, మిరాయ్ చిత్రాలతో అలరించాడు. ఇటీవలే విడుదలైన మిరాయ్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.Wishing my sister and my everything, @LakshmiManchu akka, a very happy birthday ❤️You’ve always been my biggest inspiration, akka. The way you handle life as a mother, actor, producer, and a person with such a big heart is just incredible.You light up every room you walk into… pic.twitter.com/aKNF6Qme5n— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 8, 2025 -
20 నెలల తర్వాత మళ్లీ.. వెంకీమామ మూవీపై అప్డేట్ ఇచ్చిన నిర్మాత!
ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మామ.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇటీవలే ప్రకటించారు. అనిల్ రావిపూడితో కలిసి బ్లాక్బస్టర్ విక్టరీ కొట్టిన వెంకటేశ్ నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో చేయనున్నట్లు తెలిసింది. ఈ మూవీని కుటుంబ కథాచిత్రంగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వెంకటేశ్ కెరీర్లో 77వ చిత్రంగా నిలవనుంది. వెంకటేశ్ నెక్స్ట్ మూవీకి సంబంధించి తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. దాదాపు 20 నెలల తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు రాధాకృష్ణ(చినబాబు) నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు పోస్ట్ చేశారు. వీరిద్దరి కలిసి మరోసారి మ్యాజిక్ను సృష్టించడానికి సెట్స్పైకి వెళ్లనున్నారని రాసుకొచ్చారు. వెంకీతో త్రివిక్రమ్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.After 20 long months, the wizard of words #Trivikram garu is back behind the camera, joining hands with everyone’s favourite, Victory @VenkyMama garu! 🙌❤️The OGs of entertainment are back on sets to recreate the magic once again! ❤️😉🎬Produced by #SRadhaKrishna (Chinababu)… pic.twitter.com/781uxgmQ5P— Naga Vamsi (@vamsi84) October 8, 2025 -
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్ వీడియో వైరల్!
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025 -
కారు ప్రమాదంపై విజయ్ దేవరకొండ ట్వీట్!
కారు ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా బాగానే ఉందని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో తన కారు దెబ్బతిందని.. కానీ మాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ఇప్పుడే వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చానని పోస్ట్ చేశారు. నా గురించి ఆరా తీసిన మీ అందరికీ లవ్ యూ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ప్రమాదం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కావొద్దని అభిమానులకు సూచించారు.టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారును.. బొలెరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ మరో కారులో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కాగా.. ఇటీవల రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిశ్చితార్థం తర్వాత విజయ్ దేవరకొండ పుట్టిపర్తిలోని సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లారు. తన స్నేహితులతో కలిసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. All is well ❤️Car took a hit, but we are all fine. Went and did a strength workout as well and just got back home. My head hurts but nothing a biryani and sleep will not fix. So biggest hugs and my love to all of you. Don’t let the news stress you 🤗❤️— Vijay Deverakonda (@TheDeverakonda) October 6, 2025 -
ప్రభాస్ ది రాజా సాబ్ షూటింగ్.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్లో ఉన్న పిక్ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్కు పయనమయ్యారు. కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
నా డ్రీమ్ అదే.. నాన్నలాగే అలాంటి సినిమాలు చేయాలని!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
రష్మికతో ఎంగేజ్మెంట్ వార్తలు.. ఆయన సన్నిదిలో విజయ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో రూమర్స్ వస్తోన్న రష్మికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని విజయ్ సృగృహంలో రెండు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరూ కూడా అధికారికంగా ప్రకటించలేదు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ ప్రముఖ ఆలయంలో కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ విజయ్ పుట్టిపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శాంతి భవన్ అతిథి గృహం వద్ద ట్రస్ట్ వర్గాలు అతనికి ఘన స్వాగతం పలికాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకి పుట్టపర్తితో ఉన్న అనుబంధం తెలిసిందే. అక్కడే శ్రీ సత్యసాయి పాఠశాలలో ఆయన చదువుకున్నారు. Puttaparthi ❤️🙏Sensational @TheDeverakonda visits Bhagwan Satya Sai Baba's Maha Samadhi and seeks blessings ✨#VijayDeverakonda has a special connection with this place from childhood❤️ pic.twitter.com/pOq8fY02Hy— Pavan Kumar (@pavankumar__123) October 5, 2025 -
రాయలసీమ బిడ్డగా ఎంతోమందికి స్ఫూర్తి: సతీమణిపై మంచు మనోజ్ ప్రశంసలు
టాలీవుడ్ హీరో మంచు మనజ్ ఇటీవలే మిరాయ్ మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్గా అభిమానులను అలరించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ ఏడాది గట్టిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు మంచు మనోజ్. భైరవం తర్వాత మిరాయ్ మూవీతో ఆకట్టుకున్నారు.ఇదిలా ఉంచితే మంచు మనోజ్ 2023లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. తాజాగా అక్టోబర్ 4న తన సతీమణి మౌనిక పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మనోజ్. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన భూమా మౌనిక.. ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుంచి పూర్తిగా మారిపోయింది. టెన్షన్లో ఉన్నప్పుడు నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, ప్రజల పట్ల, నిన్ను బాధపెట్టే వారి పట్ల కూడా నీ అచంచలమైన కరుణ మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం, స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి ఎప్పటికీ. నా భార్యగా ప్రేమను పంచావు. ధైరవ్, దేవసేన.. లిటిల్ జోయాకు తల్లిగా.. నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావ్. మా ఇంటిని నవ్వులతో నింపేశావ్. నమస్తే వరల్డ్ సీఈవో, వ్యవస్థాపకురాలిగా ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. రాయలసీమ బిడ్డగా.. ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా నిలుస్తుందని' కొనియాడారు.నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు.. ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు.. నీ ఆత్మగౌరవం నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసిందని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. నీ వల్లే నేను ఈ రోజు మెరుగైన వ్యక్తిగా మారాను.. నాపై అలాగే రాబోయే మన అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నీ సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.. నీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉందంటూ మనోజ్ రాసుకొచ్చాడు. నా జీవితాన్నే మార్చేసిన నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ వల్లే ఈ ప్రపంచం, పిల్లలు నా లైఫ్లో దక్కిన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. Dear @BhumaMounika thalli, You are the very meaning of Adhi Parashakti. From the day you entered my life, I have seen the magic of your silence in chaos, your grace even in hardship, and your unshakable compassion for people, even those who hurt you. That strength and purity… pic.twitter.com/LgjNwgCENv— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 4, 2025 -
టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. కంచు కనకమాలక్ష్మి అప్డేట్!
మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్ను గ్రాండ్గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు. -
ఓజీ డైరెక్టర్ కొత్త సినిమా.. ఆ టాలీవుడ్ స్టార్తోనే!
ఓజీ డైరెక్టర్ సుజిత్ అప్పుడే మరో సినిమాకు సిద్ధమైపోయారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ ఇటీవలే థియేటర్లో రిలీజైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఓజీ డైరెక్టర్ సుజిత్ మరో టాలీవుడ్ స్టార్తో జతకట్టారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ హీరో నానితో మూవీకి సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. SKY IS THE LIMIT…🔥#NaniXSujeeth @NameisNani @Sujeethsign pic.twitter.com/lIylWc2taZ— Niharika Entertainment (@NiharikaEnt) October 2, 2025 With @NameIsNani anna 🤗❤️#NaniXSujeeth pic.twitter.com/gDBYKZtoD4— Sujeeth (@Sujeethsign) October 2, 2025 -
డైరెక్టర్గా జబర్దస్త్ కమెడియన్.. హీరోగా రాజ్ తరుణ్.. టీజర్ చూశారా?
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న తాజా చిత్రం చిరంజీవ(). ఈ సినిమాకు జబర్దస్త్ కమెడియన్.. అదిరే అభి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు.ఇవాళ దసరా సందర్భంగా చిరంజీవ టీజర్ను విడుదల చేశారు. తాజాగా రిలీజైన టీజర్ చూస్తుంటే..మైథలాజికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివ అనే పాత్రలో హీరో రాజ్ తరుణ్ కనిపించనున్నారు. నీ స్పీడుకు నువ్వు చేయాల్సిన జాబ్ ఏంటో తెలుసా?.. ఆంబులెన్స్ డ్రైవర్.. అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాలో కుషిత హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం ఆహా వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. Chiranjeeva Meter lo chala Matter undhi 🧭#Chiranjeeva Premieres 7th Nov only on #aha#ChiranjeevaOnAha #AnAhaOriginalFilm pic.twitter.com/yknNbBuTGT— ahavideoin (@ahavideoIN) October 2, 2025 -
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
బాలయ్య కామెంట్స్పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా చేయొద్దన్న చిరంజీవి
మెగా అభిమాన సంఘాలకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న ఫ్యాన్స్కు వద్దని వారించారు. అది మన సంస్కారం కాదంటూ అఖిల భారత చిరంజీవి యువతకు సూచించారు. మెగాస్టార్ విజ్ఞప్తితో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తున్న అభిమానులు విరమించుకున్నారు. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఫ్యాన్స్.. బాలయ్యపై పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.మెగాస్టార్ వద్దని వారించడంతో తమ ఆలోచనను విరమించుకున్నారు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. అభిమాన సంఘాల విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే అప్రమత్తమై వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. -
ప్రభాస్ డార్లింగ్స్.. 'ది రాజా సాబ్' ట్రైలర్ వచ్చేసింది
ప్రభాస్ ఫ్యాన్స్ మోస్ట్ అవైటేడ్ ఫిల్మ్ 'ది రాజాసాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ది రాజాసాబ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ అదిరిపోయే ట్వీట్ ఇచ్చారు. ఎన్నో రోజుల వెయింటింగ్కు ఎండ్ కార్డ్ పడేశారు. తాజాగా ది రాజాసాబ్ ట్రైలర్ను రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ది రాజాసాబ్ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. హారర్ సీన్స్, మొసళ్లతో ఫైట్ రెబల్ స్టార్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏందిరా మీ బాధ.. పుట్టలో చేయి పెడితే కుట్టడానికి నేనేమన్నా చీమనా? అనే డైలాగ్ ట్రైలర్లో హైలెట్గా నిలిచింది. సంజయ్ దత్ విలన్ రోల్ మరింత అగ్రెసివ్గా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు 3 నిమిషాల 34 సెకన్ల నిడివితో ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కాగా.. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్గా నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సతీమణికి అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణికి స్పెషల్ విషెస్ చెప్పారు. ఇవాళ ఆమె బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ తనతో ఉన్న ఫోటోలు పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో అభిమానులు సైతం స్నేహ రెడ్డికి విషెస్ చెబుతున్నారు.ఇక సినిమాల బన్నీ సినిమాల విషయానికొస్తే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో రానున్న చిత్రం కావడంతో అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కబోతుంది. ప్రస్తుతం AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను కేవలం ఇండియాకే పరిమితం కాకుండా హాలీవుడ్ రేంజ్కు తీసుకెళ్లనున్నారు. Happy Birthday Cutie 🖤#AlluSnehaReddy pic.twitter.com/yNlsg72J0x— Allu Arjun (@alluarjun) September 29, 2025 -
పాన్ ఇండియా హీరోగా టాలీవుడ్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
జబర్దస్త్ కామెడీ షో ఫేమ్ తెచ్చుకున్న సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు లాంటి చిత్రాలతో మెప్పించాడు. తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో వస్తోన్న ఐదో చిత్రానికి హైలెస్సో అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్తో పాటు పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ మూవీకి కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ నాలుగు భాషల్లోనూ రిలీజ్ చేసిన మూవీ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో సుడిగాలి సుధీర్ పాన్ ఇండియా హీరోగా మారనున్నారు. With the divine blessings of Gangalamma Thalli, we humbly begin our journey🙏Here's #HaiLesso Motion Poster🔥In Telugu, Tamil, Malayalam & Kannada✨ @Iamnatashasingh @naksha_saran #AksharaGowda @actorsivaji @sivacherry9 #Ravikiran @iamkumarkota @anudeepdev @ChotaKPrasad… pic.twitter.com/1I7DyDkBRI— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 An arrival of our holy diety in her fierce avatar ❤️🔥@sudheeranand's next #SS5 titled as #HaiLesso 🔥A divine & rooted tale of our culture is coming to thrill you all 🙏💥Shoot begins soon⌛️In Telugu, Tamil, Malayalam & Kannada✨ Directed by @iamkumarkotaProduced by… pic.twitter.com/KtYZR7LyD0— Sudigali Sudheer (@sudheeranand) September 29, 2025 -
తండ్రిగా ఎప్పుడు గర్వపడుతుంటా.. మెగాస్టార్ ట్వీట్
ఒక తండ్రిగా నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటానని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయని అభినందించారు. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు చిరు ట్వీట్ చేశారు. రామ్ చరణ్ సినీ ప్రయాణం నేటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తనయుడికి విషెస్ తెలిపారు.మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'చరణ్ బాబు.. 18 ఏళ్ల క్రితం చిరుతతో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు' అంటూ పోస్ట్ చేశారు.రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత రిలీజై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. మరోవైపు చెర్రీ ప్రస్తుతం పెద్ది అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు.చరణ్ బాబు,18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
మిరాయ్ టీమ్పై ఐకాన్ స్టార్ ప్రశంసలు
మిరాయ్ (Mirai Movie) మూవీ టీమ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. తేజ సజ్జా హార్డ్ వర్క్, డెడికేషన్ అద్భుతమని కొనియాడారు. మై బ్రదర్ మంచు మనోజ్ తన ప్రదర్శనతో అదరగొట్టేశాడని అన్నారు. రితికా నాయక్ తన ఫర్మామెన్స్తో అదరగొట్టేసిందని.. శ్రియా, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్లో మెప్పించారని ప్రశంసించారు. మిరాయ్ మూవీ టెక్నికల్గా అద్భుతంగా ఉందన్నారు. ముఖ్యంగా సీజీ, ఆర్ట్, మిక్సింగ్ టీమ్ వర్క్ గొప్పగా ఉందన్నారు.డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని సినిమాటిక్ విజన్.. కొత్త కమర్షియల్ డైరెక్టర్ను అందించిందని అల్లు అర్జున్ ప్రస్తావించారు. అలాగే ఈ సినిమా నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అభినందనలు తెలిపారు. గ్రేట్ సక్సెస్ సాధించినందుకు మిరాయ్ టీమ్ను ఐకాన్ స్టార్ అభినందించారు.కాగా.. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. తొలి రోజు నుంచే హిట్ టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.Congratulations to the #MIRAI team! Brilliantly crafted with passion and conviction.Brother @tejasajja123, respect for your hard work and dedication. Huge credit for mounting a film like this.My brother @HeroManoj1, you killed it! Sweet presence by @RitikaNayak_ & powerful… pic.twitter.com/Pt1v02be6r— Allu Arjun (@alluarjun) September 23, 2025 -
మొన్న ట్రైలర్.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్కు మరో బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్ను బ్యాడ్న్యూస్. ఓవర్సీస్ అభిమానులకు ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్ నార్త్ అమెరికాలో రిలీజ్ చేయడం లేదని వెల్లడించింది. కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.కంటెంట్ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ట్రైలర్ అనుకున్న టైమ్కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్ అందించలేకపోయినా ఓజీ మేకర్స్ ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.Due to unavoidable content delays, the Tamil version of #TheyCallHimOG will not be releasing in North America. However, the Telugu and Hindi versions will be screened across the region as planned. We sincerely regret the inconvenience and thank you for your understanding and…— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 23, 2025 -
ఇప్పటికే టికెట్ రూ.1000.. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పవన్ కల్యాణ్ ఓజీ మూవీకి ఏపీ ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఈ సినిమా కోసం ప్రత్యేక జీవోను జారీ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ వేసుకోవచ్చని జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రిలీజ్కు ముందు రోజే రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలకు ప్రత్యేకంగా అనుమతులు ఇస్తూ జీవోను విడుదల చేసింది.ఒక్కో టికెట్ రూ.1000..ఇప్పటికే బెనిఫిట్ షో టికెట్ ధరను భారీగా పెంచారు. ఏకంగా ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా విడుదల రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలను భారీగా పెంచుకునే అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.125, మల్టీప్లెక్స్ల్లో రూ.150 వసూలు చేసుకోవచ్చని దోపీడికి అవకాశమిచ్చారు. ఓజీ ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం కరెక్ట్ కాదని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఖండించారు.కాగా.. తెలంగాణలోనూ ఓజీ మూవీకి ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. అంతేకాకుండా ఈ నెల 25 నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్ల్లో రూ.150 పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులిచ్చింది. -
'అసలు పాసులు ఎందుకిచ్చావ్'.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఘోర అవమానం!
పవన్ కల్యాణ్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ నెల 21 భారీస్థాయిలో హైదరాబాద్లోని ఎల్బీ స్డేడియంలో ఓజీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దఎత్తున హాజరయ్యారు.అయితే ఎంతో ఆశతో ఈవెంట్కు వచ్చిన పవన్ కల్యాణ్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పాసులు ఉన్న తమను లోపలికి పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర గంటల పాటు స్టేడియం గేటు బయటే వేచి చూశామని అభిమానులు వాపోయారు. మాకు పాసులు ఇచ్చిన లోపలికి పంపకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం అంతా ఖాళీగానే ఉందని.. తమను ఎందుకు పంపరని పోలీసులపై మండిపడ్డారు.ఇది బైట ఉన్న Fans పరిస్థితి !🙏🏻What a management of Telangana Police services truly excellent with this worst…#TheyCallHimOG #PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/ixIFG1Z1Dr— Karthikuuu (@Anchor_Karthik_) September 21, 2025 -
'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను..!
సినీ రంగంలో స్టార్ అనే హోదా చాలామందికి వస్తుంది. కానీ ఆ గుర్తింపును కెరీర్ మొత్తం కొనసాగించాలంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇక ఇండస్ట్రీలో మెగాస్టార్ అనిపించుకునే అదృష్టం కొందరికే ఉంటుంది. మన తెలుగు సినీరంగంలో అలాంటి ఘనత సొంతం చేసుకున్న హీరో ఆయనొక్కరే. మన టాలీవుడ్లో ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయనే మెగాస్టార్. ఆయనే మన కొణిదెల శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.చిరంజీవి తన కెరీర్ మొదలుపెట్టి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. 22 సెప్టెంబర్ 1978న ప్రాణం ఖరీదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యానని ట్వీట్ చేశారు. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి మీ ముందు మెగాస్టార్గా నిలబెట్టిందన్నారు. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటానని పోస్ట్ చేశారు.(ఇది చదవండి: హౌస్లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్బాంబ్ వేసిన మనీష్)చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..'22 సెప్టెంబర్ 1978 'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను.. ప్రాణం ఖరీదు.. చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.. మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే... అందుకు కారణం నిస్వార్ధమైన మీ ప్రేమే కారణం. ఈ 47 ఏళ్లలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావీ కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ... కృతజ్ఞతలతో మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. మెగాస్టార్గా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరంజీవి.. ప్రస్తుతం విశ్వంభర, మనశివశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలు చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో తన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా రాణిస్తున్నారు. ఇవాళ తన తొలి సినిమా పూర్తై 47 ఏళ్లు కావడంతో ఆ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.22 సెప్టెంబర్ 1978'కొణిదెల శివ శంకర వరప్రసాద్' అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా 'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025 -
'మీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'.. ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాగే మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ..' మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీపై మా ప్రేమ ఎల్లప్పుడు ఉండాలి. ఈ ప్రత్యేక రోజున మీకు ఆనందం, ప్రేమ, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నా. మీరు దర్శకత్వంలో రానున్న సినిమాటిక్ మ్యాజిక్ను అందరూ ఆస్వాదించే వరకు వేచి ఉండలేకపోతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. తొలిసారి అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి వర్కింగ్ టైటిల్ ఏఏ22 పేరును ఖరారు చేశారు. ఇటీవలే ఈ చిత్రం ముంబైలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని దర్శకుడు అట్లీ ఇప్పటికే వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు.Happy Birthday to my dearest director @Atlee_dir garu. May abundance shower upon you. Wishing you all the joy, love, and prosperity. Can’t wait for everyone to experience the cinematic magic you’re creating 🖤 pic.twitter.com/Sb7S8Bfpmp— Allu Arjun (@alluarjun) September 21, 2025 -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్కు వెళ్లారు. ప్రశాంత్ నీల్తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్కు విచ్చేసిన ఎన్టీఆర్ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025 -
రవితేజ వారసుడి కొత్త సినిమా.. మాస్ గ్లింప్స్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా వస్తోన్న చిత్రం మారెమ్మ. ఈ మూవీలో దీపా బాలు హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఇవాళ మాధవ్ భూపతిరాజు పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్.తాజా గ్లింప్స్ చూస్తే మాధవ్ మాస్ లుక్లో కనిపించాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ యాక్షన్ హీరో లుక్లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందిస్తున్నారు. కాగా.. మాధవ్ ఇప్పటికే మిస్టర్ ఇడియన్ అనే చిత్రంలో కనిపించారు. -
ఈ లవ్ స్టోరీ చూసి ఫుల్ ఎంటర్టైన్ అయ్యా: అల్లు అర్జున్ ప్రశంసలు
టాలీవుడ్లో ఇటీవలే విడుదలైన చిన్న సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. లిటిల్ హార్ట్స్ తన మనసును దోచుకుందని ట్వీట్ చేశారు. చాలా సరదాగా నవ్వులు పూయించారని అల్లు అర్జున్ కొనియాడారు. ఈ యంగ్ లవ్ స్టోరీ చాలా కొత్తగా, వినోదంగా అనిపించిందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందానికి తన అభినందనలు తెలియజేశారు ఐకాన్ స్టార్. డైరెక్టర్ సాయి మార్తాండ్ పనితీరు తనకు నచ్చిందని.. మ్యూజిక్ రిఫ్రెసింగ్గా అనిపించిందని పోస్ట్ చేశారు. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు నిర్మాత బన్నీ వాసుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg— Allu Arjun (@alluarjun) September 11, 2025 -
వరుణ్ తేజ్కు పోలాండ్ యువకుడు అభినందనలు.. సోషల్ మీడియాలో వైరల్!
మెగా హీరో వరుణ్ తేజ్ తండ్రయ్యారు. ఆయన సతీమణి, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్తో పాటు అభిమానులంతా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత రామ్ చరణ్ సైతం వరుణ్ తేజ్కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు.తాజాగా వరుణ్ తేజ్కు పోలాండ్కు చెందిన జాక్ అభినందనలు తెలిపారు. వరుణ్ తేజ్తో కలిసి మిస్టర్ చిత్రంలో నటించానని జాక్ వెల్లడించారు. నా సహనటుడు మిస్టర్ వరుణ్ తేజ్ తండ్రి కావడం గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. మెగా కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మిస్టర్ షూటింగ్లో వరుణ్ తేజ్తో ఉన్న ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. పోలాండ్ యువకుడు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్గా లావణ్య త్రిపాఠి కనిపించింది. ఈ చిత్రం 2017లో థియేటర్లలో విడుదలైంది.Congrats to my costar of the Film #Mister @IAmVarunTej on being a proud Father to a baby Boy.May the new Born follow the Legacy and be a product of the iconic Mega family and follow the foot steps of @KChiruTweets, @NagaBabuOffl and #powerstar @pawankalyan and be successful in… pic.twitter.com/eG1KK9VeXl— Zbigniew A C (@ZbigsZach) September 10, 2025 -
జూనియర్ ఎన్టీఆర్తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో శర్వానంద్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పటి వరకు హీరోగా అభిమానులను మెప్పించిన ఆయన.. నిర్మాణరంగంలో అడుగుపెట్టారు. తన డ్రీమ్ను ఇవాళ నేరవేర్చుకున్నారు. సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఓఎంఐ అనే సంస్థను లాంఛ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.శర్వానంద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ..' ఈరోజు నా హృదయానికి దగ్గరైన కల.. ఓఎంఐకి నాంది పలికింది. ఈ దార్శనికతను ప్రారంభించినందుకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కృతజ్ఞతలు. ఓఎంఐ అనేది సృజనాత్మకత, స్థిరత్వం, మానవ సంబంధాన్ని పెంపొందించడానికి మొదలెట్టిన ఒక వాగ్దానం' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారుఇక సినిమాల విషయానికొస్తే శర్వానంద్ భోగి చిత్రంలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ రూరల్ బ్యాక్డ్రాప్ పీరియాడికల్ యాక్షన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్ డింపుల్ హయతి లీడ్ రోల్ చేస్తున్నారు.Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz— Sharwanand (@ImSharwanand) September 9, 2025 -
కిరణ్ అబ్బవరం కె ర్యాంప్.. రొమాంటిక్ లవ్ సాంగ్ వచ్చేసింది!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ విడుదలైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ను కపిల్ కపిలన్ ఆలపించారు. -
డిజే టిల్లు దర్శకుడి కొత్త సినిమా.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో రాగ్ మయూర్ మరో సినిమాకు రెడీ అయిపోయారు. డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ డైరెక్షన్లో పని చేయనున్నారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్లో వస్తోన్న నాలుగో చిత్రం కావడం విశేషం. ఇవాళ నిర్వహించిన పూజా వేడుకలో హీరో రాగ్ మయూర్ పాల్గొన్నారు.మేఘ చిలక స్నేహ, జగ్తియాని క్లాప్ కొట్టగా.. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విమల్ కృష్ణ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి నటీనటులంతా హాజరయ్యారు. ఈ చిత్రానికి సునీల్ కుమార్ నామా సినిమాటోగ్రఫీని అందిస్తుంఽగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్, నవీన్ చంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
సింగర్గా రామ్ పోతినేని.. ఆంధ్ర కింగ్ తాలూకా సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka). ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే.. రామ్కు జంటగా నటిస్తోంది. ఈ మూవీకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ పి. మహేశ్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 28న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని పప్పీ షేమ్ అనే పాటను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ను రామ్నే ఆలపించడం విశేషం. ఆ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించహా.. వివేక్, మెర్విన్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో ఉపేంద్ర, రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. -
అభిమానులకు ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.Heartfelt Onam wishes to all Malayalis!May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025 -
దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్.. రికార్డ్ ధరకు అమ్ముడైన ఫోటో!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్గా క్రేజ్ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.History made! NTR ART ATR 🔥Feeling absolutely speechless… Never in my dreams did I imagine my pencil art would create history. Today, My pencil art of our man of masses @tarak9999 is now the most expensive pencil art of a Telugu actor ever sold !! #JRNTR𓃵 Grateful and… pic.twitter.com/qStUDcw3kT— Buelah Ruby (@buela_ruby) September 2, 2025 -
మళ్లీ తెరపైకి రాజ్ తరుణ్ ఎపిసోడ్.. పోలీసులకు లావణ్య ఫిర్యాదు!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి పీఎస్లో అతనిపై మరో కేసు నమోదైంది. కోకాపేట విల్లాలో ఉండగా రాజ్తరుణ్ అతని అనుచరులతో దాడి చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్తరుణ్తో పాటు అతని అనుచరులైన మణికంఠ, రాజశేఖర్, సుశి, అంకిత్ గౌడ్, రవితేజపై కేసు నమోదు చేశారు. తనపై మూడు సార్లు దాడి చేశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసుతో లావణ్య- రాజ్ తరుణ్ ఎపిసోడ్ టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది.కాగా.. 2016లో రాజ్ తరుణ్తో కలిసి కోకాపేట్లోని విల్లా కొనుగోలు చేసిన విషయాన్ని కూడా లావణ్య పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా 2024 మార్చిలో రాజ్ తరుణ్ ఆ ఇంటిని ఖాళీ చేశాడని తెలిపారు. అయితే విల్లాలో తాను నివసిస్తున్న సమయంలో రాజ్ తరుణ్ అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేశారని బంగారు ఆభరణాలను కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. అంతేకాకుండా ఆ ఇంటికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్లో ఉండగానే ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
చెఫ్గా మారిన శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్య కామెంట్ చూశారా?
హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది. వీరిద్దరి వివాహా వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు పాల్గొన్నారు. పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత.. సెట్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇందులో శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమని క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఇది చూసిన నాగచైతన్య.. తన సతీమణి పోస్ట్కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ భార్య పోస్ట్కు కామెంట్ చేశాడు చైతూ. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అక్కా.. మీకు వంట కూడా వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
కదల్లేని స్థితిలో టాలీవుడ్ కమెడియన్.. పరామర్శించిన మంచు మనోజ్
'వెంకీ' సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'నిన్ను చూడాలని' సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆనందం, సొంతం, వెంకీ, కింగ్, దుబాయి శీను, లౌక్యం తదితర చిత్రాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ కెరీర్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు.అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తన తమ్ముడే బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర వెల్లడించారు.ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రామచంద్రను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతని పరిస్థితిని చూసిన మనోజ్ చలించిపోయారు. సినీ ఇండస్ట్రీ తరఫున తన సాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.#ManchuManoj met comedian Ramachandra, who is going through health issues related to paralysis.pic.twitter.com/M84yGNvZoM— Filmy Bowl (@FilmyBowl) September 1, 2025 -
ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ హీరో సిస్టర్.. ఎవరో తెలుసా?
మన చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. ఈ రోజుల్లో అయితే మన పిల్లల్ని మొబైల్ ఫోన్ బంధిస్తున్నాం కానీ.. 1990ల్లో మాత్రం సెల్ఫోన్ అందుబాటులో లేదు. బాల్యంలో దిగిన ఫోటోలను పెద్దయ్యాక చూసుకుంటే ఎంత బాగుంటుందో. ఆ ఆనందం వేరే లెవెల్. అలా మన చిన్నప్పటి ఫోటోలు ఎవరైనా పంపిస్తే చూసి తెగ మురిసిపోతాం కూడా. అలాగే మనకు ఇష్టమైన వాళ్ల బర్త్డే రోజు చిన్నప్పటి ఫోటోలు పంపితే కలిగే సంతోషమే వేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.టాలీవుడ్ హీరో సుశాంత్ అనుమోలు.. తాజాగా తన సిస్టర్కు సంగీత అనుమోలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ బర్త్ డే సిస్టర్ అంటూ ఆమెతో దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇందులో బాల్యంలో అమ్మా, నాన్నతో తన సిస్టర్ దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. చాలా అరుదైన చిన్నప్పటి ఫోటోలో సుశాంత్ సిస్టర్ క్యూట్ క్యూట్గా కనిపించింది. ఈ పిక్ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సుశాంత్ సిస్టర్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సుశాంత్ పోస్ట్కు సంగీత కూడా రిప్లై ఇచ్చింది. ఇక హీరో సుశాంత్ విషయానికొస్తే..ఆయన హీరోగా పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 18 సుశాంత్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు . ఇందులో ఎక్సార్సిస్ట్ (భూత వైద్యుడు)గా సుశాంత్ కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) -
విడాకులపై క్లారిటీ ఇచ్చిన గౌతమీ.. టాలీవుడ్ హీరోపై భార్య సంచలన ఆరోపణలు..!
-
'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. తనయుడికి టాలీవుడ్ ప్రిన్స్ విషెస్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్లో రాసుకొచ్చారు. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్.. ఎప్పటికీ ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ గౌతమ్లో చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ తనయుడిపై ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు సైతం గౌతమ్కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.మహేశ్ తన ట్వీట్లో రాస్తూ.. '19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్... ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా యాక్షన్ అడ్వెంచరస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుంది. ఈ మూవీ కోసం మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Happy 19 my son!! Each year you amaze me a little more… ♥️♥️♥️ Missing your birthday this year, the only one i have ever missed… my love is with you every step of the way….😘😘😘 Always your biggest cheerleader in whatever you do… keep shining and keep growing…🤗🤗🤗 pic.twitter.com/0bV51ZRR8S— Mahesh Babu (@urstrulyMahesh) August 31, 2025 -
బాలయ్యను చూస్తే ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా అఖండ-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా బాలయ్య ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ టీజర్లో బాలయ్య మాస్ యాక్షన్ సీన్స్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ దసరాకు రిలీజ్ కావాల్సిన అఖండను మేకర్స్ వాయిదా వేశారు. కొత్త రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.(ఇది చదవండి: అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?)అయితే బాలకృష్ణ సినీ ప్రస్తానం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆయనను సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్యపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనను చూస్తే మాటలు రావని.. ఏదో ఒకటి తీసి కొట్టాలని అనిపిస్తుందని అన్నారు. మ్యూజికల్ పరంగా నా చేతుల్లో కొత్తగా కత్తులు, కర్రలు వచ్చేస్తాయి.. ఈ విషయం నాకు కూడా అర్థం కాదన్నారు. అలా ఎందుకు జరుగుతుందో డాక్టర్స్ నా డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆసక్తికర కామెంట్స్ చేశారు. త్వరలో అఖండ 2 రికార్డులు కొడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అఖండ -2 సినిమాకు తమన్ సంగీతమందిస్తున్న సంగతి తెలిసిందే. -
టాలీవుడ్ కింగ్.. 65 ఏళ్లు దాటినా యువకుడే.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ కింగ్ అంటే ఠక్కున ఆయన పేరే గుర్తుకొస్తుంది. ఆయనకు 65 ఏళ్లు దాటినా ఇంకా యువకుడిలానే కనిపించే తెలుగు హీరోల్లో ఓకే ఒక్కడు. హీరోయిన్లకు మన్మధుడిలా గుర్తుండిపోయిన స్టార్ అతనే. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో నవ, యువ మన్మధుడు నాగార్జున అక్కినేని. ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.ఆగస్టు 29న నాగార్జున పుట్టనరోజు కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేసింది. కింగ్ నాగ్ నటించిన చిత్రాల్లోని సన్నివేశాలను ఓకే వీడియోలో రూపొందించి రిలీజ్ చేసింది. ఈ వీడియో అక్కినేని ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన అభిమానులు టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటూ కామెంట్స్ చేస్తున్నారు.నాగార్జున ఇటీవలే రజినీకాంత్ మూవీ కూలీలో కనిపించారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. లోకేశ్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అంతకుముందు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర మూవీలో కీలక పాత్రలో నటించారు. He broke the norms with his versatility, ruled hearts with his aura, and redefined style with his unmatched swag. Wishing our timeless King @iamnagarjuna garu, a very Happy Birthday 👑✨-https://t.co/YcYp7fvh5w#HBDKingNagarjuna ❤️🔥 pic.twitter.com/CmVkQmKDrl— Annapurna Studios (@AnnapurnaStdios) August 28, 2025 -
నేరుగా ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
రోహన్, రిదా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం "గప్ చుప్ గణేశా". ఈ సినిమాకు సూరి ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై కేఎస్ హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "ఈ చిత్రం టైటిల్ చాలా బాగుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. గతంలో కూడా కేఎస్ ఫిలిం వర్క్స్ బ్యానర్పై రిచ్చిగాడి పెళ్లి అనే చిత్రం హేమ్రాజ్ దర్శకత్వంలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు హేమ్రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి చిన్న సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటూ ఈ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్" అని అన్నారు.చిత్ర నిర్మాత హేమ్రాజ్ మాట్లాడుతూ.. "మా చిత్ర ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంఛ్ చేసిన ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ సార్కు కృతజ్ఞతలు. ఆయన ఎంతో బిజీగా ఉన్న మా కోసం ఆయన సమయాన్ని కేటాయించి మా చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చినందుకు థాంక్స్" అన్నారు. దర్శకుడు సూరి ఎస్ మాట్లాడుతూ... "మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఆయన సమయాన్ని కేటాయించి మాకు అండగా నిలబడిన ఛాంబర్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ సార్కు మా చిత్ర బంధం తరఫున ధన్యవాదాలు" అన్నారు.ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఒక వ్యక్తి మొహమాటంతో తన ఉద్యోగాన్ని.. అలాగే తన జీవితంలోకి వచ్చిన ఉన్నత అధికారితో ఎలా మసులుకుంటాడు అనేది ఎంతో ఫన్నీగా ఉండనుందని అర్థమవుతోంది. అతని క్యారెక్టర్ చూస్తే ఎంతోమంది ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి, కిషోర్ మారిశెట్టి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీ తరుణ్ సంగీతాన్ని అందించగా.. అంగత్ కుమార్ సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. -
రామ్ చరణ్ పెద్ది.. వెయ్యిమందికి పైగా డ్యాన్సర్స్తో స్పెషల్ సాంగ్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఇప్పటికే పెద్ది షాట్ పేరుతో గ్లింప్స్ విడుదల చేయగా మెగా ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ కొట్టిన షాట్ అద్భుతమైన క్రేజ్ను దక్కించుకుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా ఈ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ప్రస్తుతం పెద్ది షూటింగ్ కర్ణాటకలోని మైసూర్లో జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్ను జానీమాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో ఈ స్పెషల్ సాంగ్ను షూట్ చేస్తున్నారు. ఇవాళ వినాయక చవితి సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. వెయ్యిమందితో చిత్రీకరిస్తోన్న ఈ ప్రత్యేక సాంగ్ పెద్ది మూవీలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో కన్నడ సూపర్స్టార్ శివ రాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా మార్చి 27, 2026న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. May Lord Ganesha bring peace, success and positivity into your lives.అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ✨@PeddiMovieOffl pic.twitter.com/DmGpC7wbuZ— Ram Charan (@AlwaysRamCharan) August 27, 2025 -
పుష్ప స్టైల్లో వినాయకుడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయి నుంచి వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యారు. ఈ మూవీతో పాన్ వరల్డ్ హీరోగా బన్నీ గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప-2 బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక పుష్పరాజ్ మేనరిజంకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.తాజాగా వినాయక చవితి వేడుకల్లో పుష్పరాజ్ స్టైల్లో గణేశున్ని అలంకరించారు. ఎర్రచందనం దుంగల తరహాలో గణేశుని మండపాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మీ అభిమానం సల్లగుండా అంటూ ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పుష్ప స్టైల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి తమిళనాడులోని హోసురుకు చెందిన ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ దట్ ఈజ్ పుష్ప క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో జతకట్టారు. జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అట్లీ.. బన్నీతో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
కాబోయే భార్యతో ఈవెంట్కు టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్లో సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నారా రోహిత్, మంచు మనోజ్ సందడి చేశారు. మొదటిసారిగా నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి ఈవెంట్కు హాజరయ్యారు. తొలిసారి ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ ఏడాది భైరవం మూవీతో అలరించిన నారా రోహిత్ తనపెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. అయితే నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
మెగాస్టార్-బాలయ్య కాంబోలో సినిమా.. అనిల్ రావిపూడి ఏం చెప్పారంటే?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చారు. మెగా 157 టైటిల్ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు. వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారని అనిల్ తెలిపారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్ ఇమేజ్ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్ అయితే తప్పకుండా చేస్తానన్నారు. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుందని అనిల్ రావిపూడి అన్నారు. -
'అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబో.. మీ ఊహకు మించి ఉంటుంది'
ఈ రోజు మెగాస్టార్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల అప్డేట్స్ రావడంతో డబుల్ ఎనర్జీతో పుట్టినరోజును ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి- మెగాస్టార్ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ను కూడా రివీల్ చేశారు. టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరు గురించి మాట్లాడారు.చిరంజీవి సినిమాల్లో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. రీ ఎంట్రీలో చిరంజీవి స్వాగ్ను చూపించాలకున్నట్లు తెలిపారు. చివరగా నాకు ఆ అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మెగాస్టార్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకుమించి ఉంటుందని అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మీకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తానని అన్నారు.కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటిస్తోంది. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్పై ఆధారంగా ఉంటుందని అనిల్ రావిపూడి గతంలో అన్నారు. దీనిలో 70 శాతం కామెడీ, 30 శాతం ఎమోషనల్ డ్రామా ఉంటుందన్నారు. చిరంజీవిని ఇటీవలి కాలంలో ఎవరూ చూపించని కొత్త లుక్లో ప్రజెంట్ చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. -
మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
సాఫ్ట్వేర్ అమ్మాయి.. రైతుగా అబ్బాయి.. ఈ ప్రేమకథ ట్రైలర్ చూశారా?
శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా నటించిన చిత్రం కన్యాకుమారి. ఈ సినిమాకు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు.ట్రైలర్ చూస్తే బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ అవ్వాలనుకుంటున్న అమ్మాయి, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథే ఈ కన్యాకుమారి. ట్రైలర్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి. పక్కా గ్రామీణ ప్రేమకథ కావడంతో ప్రేమికులకు ఫుల్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రైలర్ చూసేయండి. -
విజయ్ దేవరకొండ కింగ్డమ్.. మాస్ సాంగ్ వచ్చేసింది!
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు. రగిలే రగిలే అంటూ సాగే మాస్ సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట విజయ్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. -
'మా సినిమాకు ఏ అవార్డులు వద్దు.. ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్'
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్ రోల్లో నటింంచిన తాజా చిత్రం పరదా. ఈ మూవీకి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్తో బిజీ అయిపోయారు అనుపమ. తాజాగా ఓ మాల్లో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడియన్స్ను ఉద్దేశించి ఎమోషనల్గా మాట్లాడారు.మా సినిమా అవార్డులు అక్కర్లేదని.. డబ్బులు వస్తే చాలని అన్నారు. మలయాళ సినిమాలు ఇక్కడ హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ కావాలన్నారు. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయాలని డైరెక్టర్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. మీరు ట్వీట్ చేస్తే కనీసం కొంతమంది ప్రేక్షకులైనా మా మూవీ చూస్తారని దర్శకుడు అన్నారు.ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ..'ప్రతి కథ హీరో చుట్టే తిరగాలని లేదు. అనుపమ కూడా పెద్ద స్టార్. నా సినిమాలో ముగ్గురు స్టార్స్ ఉన్నారు. మా సినిమాకు అవార్డులు వద్దు. డబ్బులు కావాలి. కచ్చితంగా ఈ చిత్రంపై నాకు నమ్మకముంది. ఇక్కడ లేడీ ఓరియంటెడ్ కాదు.. మెన్ ఓరియంటెండ్ కాదు.. ఇది కేవలం సినిమా అంతే. మన దగ్గర మలయాళ చిత్రాలు హిట్ అవ్వడం కాదు.. మన తెలుగు సినిమాలు అక్కడ బ్లాక్బస్టర్ కొట్టాలి. అందుకే మలయాళ నటులను పెట్టాను. సినిమా బాగుంటేనే చూడండి. మా సినిమా బాగుంటే పెద్ద పెద్ద స్టార్స్ ఒక్క ట్వీట్ చేయండి ప్లీజ్. మీవల్ల ఎంతోమంది మా చిత్రం చూస్తారు.' అని ఆడియన్స్ను కోరారు. కాగా.. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది. -
హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?.. చేయి కోసుకుని మరి..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు.కాగా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది.ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. -
రవితేజ 'మాస్ జాతర'.. టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ థ్రిల్లర్కు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా కనిపించనుది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.(ఇది చదవండి: Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్)కొద్ది రోజుల క్రితమే ఓలే ఓలే అనే మాస్ సాంగ్ను విడుదల చేసిన మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. మాస్ జాతర టీజర్ను ఈనెల 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఉదయం 11 గంటల 8 నిమిషాలకు రిలీజ్ చేస్తామని సితార ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాతో అభిమానులకు మరోసారి మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. A full meal of MASS 🔥A full heart of ENTERTAINMENT 🤩All served together with #MassJatharaTeaser tomorrow at 11:08 AM ❤️🔥#MassJathara #MassJatharaOnAug27th Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna… pic.twitter.com/9QIbjkvgF0— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2025 -
అల్లు అర్జున్ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. అసలేం జరిగిందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గుర్తు పడతారు. పుష్ప తర్వాత బన్నీ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. మనదేశంతో పాటు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. పుష్ప-2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందిప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో బిజీ అయిపోయారు ఐకాన్ స్టార్. ఇటీవలే ముంబయి ట్రిప్కు వెళ్లారు. తన కుటుంబంతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.అయితే ముంబయి ఎయిర్పోర్ట్లో బన్నీకి చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ముఖానికి మాస్క్, అద్దాలు తీసి ఫేస్ చూపించాలని అడిగారు. పక్కనే ఉన్న వ్యక్తిగత సిబ్బంది అల్లు అర్జున్ అని చెప్పినా కూడా వినలేదు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల ప్రకారం మొహం చూపించాల్సిందేనని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడిగారు. దీంతో బన్నీ వెంటనే మాస్క్, కళ్లద్దాలు తొలగించి ఫేస్ చూపించి లోపలికి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. స్టార్ హీరోలను చూస్తే సెల్ఫీల కోసం జనాలు ఎగబడతారని గుర్తు పట్టకుండా మాస్క్ ధరించి వెళ్లడం సాధారణమే.. అయినప్పటికీ విమానాశ్రయాల్లో రూల్స్ ఎవరికైనా ఒక్కటే కదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.Good & Responsible Gesture From #AlluArjun👏At the airport security check yesterday, Allu Arjun was requested by an officer for a standard face and ID verification. Without a hint of hesitation, he obliged — removing his face covering, presenting his ID, and cooperating fully… pic.twitter.com/8TvJqGt3Zs— cinee worldd (@Cinee_Worldd) August 10, 2025 -
కూలీ సినిమా రిలీజ్.. అక్కినేని ఫ్యాన్స్కు నాగార్జున బిగ్ సర్ప్రైజ్!
అక్కినేని నాగార్జున- ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో రిలీజైన ఈ చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో తన పేరును లిఖించుకుంది. ఈ మూవీ రిలీజై ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున సైతం శివ రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్స్లో ఒకటిగా నిలుస్తుందని నాన్న చెప్పారని అన్నారు.4కెలో శివ ..అయితే అప్పట్లో సినీ ప్రియులను ఓ రేంజ్లో అలరించిన ఈ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజైతే ఎలా ఉంటుంది. శివ సినిమాను ఇప్పుడున్న టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తే మీ ఫీలింగ్ ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే మీ కోసమే నాగార్జున బిగ్ ప్లాన్తో వస్తున్నారు. సరికొత్త టెక్నాలజీతో శివ మూవీ చూసే అవకాశం త్వరలోనే రానుంది. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్తో ఈ చిత్రాన్ని వీక్షించే ఛాన్స్ అభిమానులకు దక్కనుంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నాగార్జున వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులకు నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు.కూలీ థియేటర్లలో ట్రైలర్..అంతే కాకుండా రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ మూవీ రిలీజ్ రోజే నాగార్జున్ ఈ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే రోజు థియేటర్లలో శివ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దీంతో కూలీ సినిమా చూసే నాగ్ ఫ్యాన్స్కు డబుల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. శివ రీ రిలీజ్ డేట్ను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. ఇది చూసిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కంగ్రాట్స్ టూ శివ టీమ్ అంటూ పోస్ట్ చేశారు.Hey @iamnagarjuna CONGRATS to #ShivaTeam ,and all your FANS #Shiva4KDolbyAtmos https://t.co/6zfsam7uvr— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2025 -
జపాన్ భాషలో మాట్లాడిన నాగార్జున, చైతూ.. ఏం చెప్పారంటే?
టాలీవుడ్ సినిమాలకు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటు మనదేశంలోనూ క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. మనదేశంలో అత్యంత ఆదరణ దక్కించుకుంటోన్న ఇండస్ట్రీలో మన సినిమాలే ముందుంటాయి. ఇక విదేశాల్లోనూ మన చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇక జపాన్ ప్రజలైతే ఇండియన్ సినిమాలంటే పడి చచ్చిపోతారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే పలు టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలు జపాన్లో విడుదల చేశారు. జపాన్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే మరో టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని జపాన్లో విడుదలైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ నటించిన మనం సినిమా జపాన్ థియేటర్లలో సందడి చేస్తోంది.ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున, నాగచైతన్య ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జపాన్ ప్రజలను వారి భాషలోనే పలకరిస్తూ మాట్లాడారు. ఈ సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని అన్నారు. మీకు కూడా ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నామంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో నాగ్, చైతూ జపాన్ భాషలో మాట్లాడడం విశేషం.కాగా.. అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం 'మనం'. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత, శ్రియా శరణ్ హీరోయిన్లుగా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.The evergreen classic #Manam releasing in Japan on August 8th ❤️🔥Here's the special video byte by King @iamnagarjuna & Yuvasamrat @chay_akkineni to all the audience of Japan #ANRLivesOn pic.twitter.com/Fu5gxBRhx4— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) August 7, 2025 -
క్రికెట్ టీమ్కు రామ్ చరణ్ స్పెషల్ విషెస్.. వైరలవుతోన్న పెద్ది షాట్!
ఏపీలో క్రికెట్ క్రీడా సమరానికి అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఏపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ నేటి నుంచే క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనుంది. ఈ సందర్భంగా మెగా హీరో ఆ టీమ్కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. విజయవాడ సన్ షైనర్స్ టీమ్కు అల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో పాటు పెద్ది మూవీలోని క్రికెట్ షాట్ను రీ క్రియేట్ చేసిన వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యంలో విజయవాడ సన్ షైనర్స్ టీమ్ లీగ్లో పాల్గొంటొంది. ఈ సీజన్లో మొత్తం ఏడు జట్లు ఆడనున్నాయి.మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్లో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి పెద్ది అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. రూరల్ క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కాగా.. ఈ ఏడాది ఏప్రిల్లో పెద్ది మూవీ గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయగా.. రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్లో డిఫరెంట్ షాట్ను అభిమానులకు పరిచయం చేశారు. ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.#APL2025 begins today in the beautiful city of Visakhapatnam.All the best to the teams participating. Sending special wishes to @vjasunshiners owned by the dearest @MythriOfficial Hoping for a cracking tournament.@theacatweets pic.twitter.com/4wtDtvmtXl— Ram Charan (@AlwaysRamCharan) August 8, 2025 -
'ఉండిపోవే నా తోనే బంగారం'.. అలరిస్తోన్న కిష్కింధపురి సాంగ్!
బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కిష్కింధపురి. ఈ మూవీలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ ఏడాది భైరవం తర్వాత బెల్లంకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీకి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. ఉండిపోవే నాతోనే బంగారం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ బెల్లంకొండ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. జావెద్ అలీ ఆలపించారు. ఈ సాంగ్ను చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. కాగా.. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. -
నువ్వు హీరో ఏంట్రా బాబు అన్నారు: 90s కిడ్స్ ఫేమ్
90s మిడిల్ క్లాస్ బయోపిక్తో ఫేమ్ తెచ్చుకున్న యువకుడు మౌళి తనూజ్ ప్రశాంత్(Mouli Tanuj Prasanth). ప్రస్తుతం ఆ యువకుడే ఏకంగా లీడ్ రోల్తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. తాను హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే నెల 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగారం ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించనుంది.తాజాగా ఈ సినిమా నుంచి రాజగాడికి అనే సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మౌళి తనూజ్ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మీరు హీరోనా అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అన్న ప్రశ్న ఎదురైంది.మౌళీ తనూజ్ మాట్లాడుతూ..' నువ్వు హీరోనా అని అన్నారు. నేను లీడ్ రోల్లో చేస్తున్నా అని రెండేళ్ల క్రితం మా అమ్మకు చెప్తేనే నవ్వింది. మూడేళ్ల క్రితం వీడు హీరోగా చేస్తాడా అనుకుంటారు. ఎందుకు ఒక్కోసారి నేను అనుకుంటా. ఇంటర్ చదివేటప్పుడు విష్ణు, నేను కలిసి మీమ్స్ చేసేవాళ్లం. మూవీ ప్రమోషన్స్ వస్తే వారానికి వంద రూపాయలు వచ్చేవి. అవే మాకు చాలా ఎక్కువ. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, మీమ్స్, రీల్స్ చేస్తూ ఈరోజు ఇక్కడి వచ్చా. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్' అని అన్నారు.కాగా.. ఈ సినిమాను బన్నీవాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో ఎస్.ఎస్.కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సింజిత్ యెర్రమల్లి సంగీతమందిస్తున్నారు. -
కింగ్డమ్ మూవీపై వివాదం.. స్పందించిన నిర్మాణ సంస్థ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం వంద కోట్ల మార్క్కు చేరువలో ఉంది. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది.అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోన్న ఈ సినిమాపై వివాదం మొదలైంది. ఈ చిత్రంలో కొన్ని సీన్స్ శ్రీలంక తమిళులను కించపరిచేలా ఉన్నాయని తమిళ అనుకూల పార్టీ అయిన నామ్ తమిజర్ కట్చి (NTK) కార్యకర్తలు ఆరోపించారు. దీంతో తమిళనాడులోని మధురై, తిరుచ్చిలోని థియేటర్ల వద్ద కింగ్డమ్ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ చిత్రం ప్రదర్శనను నిషేధించాలని వారు పిలుపునిచ్చారు.అయితే తాజాగా ఈ వివాదంపై కింగ్డమ్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది. ఈ సినిమాలో శ్రీలంక తమిళులను కించపరచలేదని.. తమపై వస్తున్న కథనాలను ఖండించింది. ఈ కథ అంతా కల్పితమని.. నిజ జీవిత సంఘటనలకు సంబంధించినది కాదని నిర్మాతలు తెలిపారు."తమిళ ప్రజల మనోభావాలను మేము గౌరవిస్తున్నాము. పక్క రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాలో ఎలాంటి సన్నివేశాలు లేవని మేము హామీ ఇస్తున్నాం. ఈ కథ పూర్తిగా కల్పితం. అంతా ఊహజనితమే. ఇదంతా సినిమా డిస్క్లైమర్లోనే ప్రస్తావించాం' సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఈ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటే చింతిస్తున్నామని తెలిపింది. మీరు మా సినిమాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమిళనాడులోని సినిమా పంపిణీదారులు పోలీసు రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. శ్రీలంక నేపథ్యంలోనే కింగ్డమ్ మూవీని తెరకెక్కించారు.Official statement from Sitara Entertainment about the #Kingdom issue in Tamil Nadu !! pic.twitter.com/Cbx9U5hffV— AmuthaBharathi (@CinemaWithAB) August 6, 2025#Kingdom - banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025திருப்பூர் ஸ்ரீ திரையரங்கில் ஈழத்தமிழர்களை தவறாக சித்தரிக்கும் கிங்டம் படம் திரையிடக்கூடாதென்று கடிதம் வழங்கப்பட்டது #BanKingdomMovie #Kingdom pic.twitter.com/4hLg8eATAc— NTK IT Wing (@_ITWingNTK) August 6, 2025 -
నాకు మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిందే ఆయనే: ఉదయ భాను
టాలీవుడ్ యాంకర్ ఉదయభాను కేవలం యాంకరింగ్ మాత్రమే కాదు.. నటిగానూ అభిమానులను మెప్పించింది. పలు చిత్రాల్లో కనిపించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉదయభాను నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్ కీలక పాత్రలో వస్తోన్న ఈ మూవీలో ఉదయభాను ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. మెగాస్టార్ బర్త్ డే రోజున అంటే ఆగస్ట్ 22న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రెస్మీట్కు హాజరైన ఉదయభాను పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే మెగాస్టార్ గురించి కూడా మాట్లాడారు. చిరంజీవికి తానంటే చాలా ఇష్టమని తెలిపారు. నన్ను అభినందించి మొదటి ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది చిరంజీవినే అని ఉదయభాను వెల్లడించారు. ఈ విషయాన్ని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. మా సినిమా మెగాస్టార్ బర్త్ డే రోజు విడుదలవ్వడం ఆనందంగా ఉందని ఉదయభాను సంతోషం వ్యక్తం చేశారు.ఇటీవల యాంకర్గా మిమ్మల్ని తొక్కేస్తున్నారని చేసిన కామెంట్స్పై ఉదయభానుకు ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ నేనెప్పుడు నిజాలే మాట్లాడతానని ఉదయభాను అన్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడానికి ఇది సందర్భంగా కాదని తెలిపారు. ఈ విషయంపై ఎవరిని అడిగినా నిజాలే మాట్లాతారని ఉదయభాను అన్నారు.కాగా.. సత్యరాజ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్.సింహ, సాంచి రాయ్ కీలకపాత్రల్లో నటించారు. -
అమెరికాలో పుష్ప క్రేజ్.. అల్లు అర్జున్ ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పుష్ప మేనరిజానికి టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. డేవిడ్ వార్నర్ లాంటి ఓవర్సీస్ అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా పుష్ప సినిమాను సాంగ్ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. అమెరికా గాట్ టాలెంట్ డ్యాన్స్ షోలో ఇండియాకు చెందిన బీ యూనిక్ క్రూ పుష్ప సాంగ్కు ఒళ్లు గగుర్పొడ్చేలా ప్రదర్శన ఇచ్చారు. ఇది చూసిన ఆడియన్స్ చూస్తున్నంతసేపు ఆందోళనతో పాటు భయానికి గురయ్యారు.బీ యూనిక్ క్రూ టీమ్ చేసిన సర్ప్రైజ్ ప్రదర్శనకు అక్కడ న్యాయ నిర్ణేతలు సైతం షాకయ్యారు. ఈ వీడియోను పుష్ప టీమ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసి అల్లు అర్జున్ సైతం ఫిదా అయ్యారు. వావ్.. మైండ్ బ్లోయింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన ప్రదర్శనను మీరు కూడా చూసేయండి. Wow … Mind Blowing . 🖤 https://t.co/pwVRkSpbqD— Allu Arjun (@alluarjun) August 4, 2025 -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్.. స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...!
స్నేహం అనే భావన మనసులను తాకే అంశం. తెలుగు, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్హిట్ స్నేహగీతాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయమయ్యాయి. ఆ పాటలు కేవలం సంగీతానికే కాకుండా, స్నేహ బంధం విలువను గుర్తు చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ సినిమాల్లోని హిట్ పాటలు వింటూ మన చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులను గుర్తు చేసుకోకుండా ఉండలేం. అలాంటి కొన్ని పాటల్ని, మన స్నేహితుల్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా...గుర్తు చేసుకుంటూ...స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...సాక్షాత్తూ అల్లా దిగివచ్చి వరమిస్తా కోరుకో అంటే.. కూడా ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్కనేస్తం చాలంటాను... అంటూ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నవాడు ఎంత సంపన్నుడో వివరిస్తుందీ పాట. 1974లో విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమాలోని ‘‘స్నేహమేరా జీవితం’’. పాట ఫరెవర్ ఫ్రెండ్ షిప్ సాంగ్ అని చెప్పాలి. మాధవపెద్ది సత్యం సంగీత దర్శకత్వంలో గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో పాటు గాయకుడు జి. ఆనంద్ కూడా తన గాత్రం జత చేశారు. రచయిత : సి.నా.రె. అక్షరాద్భుతాలు ఆవిష్కరించగా సంగీతదర్శకుడు: రోహిణీ చంద్ర. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు.. అంటూ స్నేహితుడి బాధను పంచుకోవడానికి కులమతాల అడ్డులేదంటూ చాటుతుందీ పాట. సినిమాలో స్నేహితుడైన ఎన్టీయార్ ను ఉద్ధేశిస్తూ లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఆవిష్కరించిన పాటాభినయం మరచిపోలేనిది.స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...ప్రాణ స్నేహితులు (1988) చిత్రంలోని ఈ పాట స్నేహ బంధానికి సాటిలేని విలువను అందిస్తుంది. తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా... . బంధువులెందరు ఉన్నా, నిజమైన స్నేహానికి సాటిరారనే భావాన్ని పల్లవి – చరణాలలో గొప్పగా ఆవిష్కరిస్తుంది. ‘త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం స్నేహం ... అంటూ స్పష్టం చేస్తుంది. స్నేహం గొప్పతనాన్ని చాటడానికి బహుశా ఇంత కన్నా మంచి పాటను ఎంచుకోలేమేమో...భువన చంద్ర పదాలు, రాజ్కోటి స్వరాలు కూర్చిన ఈ పాటకు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో జీవం పోశారు. కృష్ణంరాజు, శరత్బాబు, మురళీమోహన్ లు స్నేహితులుగా నటించారు.మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ...స్నేహం అంటే యుక్త వయస్కుల మధ్యే కాదు నడి వయస్కుల మధ్య కూడా ఉంటుంది. వయసుతో పాటే పరిణితి చెందిన ఆ స్నేహ బంధపు గొప్ప తనాన్ని చాటి చెబుతుంది. 1999లో విడుదలైన స్నేహం కోసం చిత్రంలోని మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ పాట. మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్కుమార్ లు స్నేహితులుగా జీవించిన పాట ఇది. ప్రతీ ఒక్కరికీ అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించేలా ఈ పాటలోని సాహిత్యాన్ని లెజండరీ రైటర్ కీ.శే.సిరివెన్నల సీతారామశాస్త్రి రాయగా గాయకుడు రాజేష్ అద్భుతంగా ఆలపించారు. ఒక్క పాటలో స్నేహం అంటే ఆటలు, పాటలతో పాటు పరస్పర బాధ్యత కూడా అంటూ చూపించడం జరిగింది. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నీను వీడ అంటూ సాగే ఆ పాటలో..ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు తల్లీ తండ్రినైనా ప్రేమ పంచినా తీరులోన నే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేసానో నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా? వంటి పదాలు స్నేహ పరిపూర్ణతను చాటుతాయి. ‘ముస్తఫా ముస్తఫా‘ (ప్రేమ దేశం – 1996)..ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట బాధ్యతలెరుగని స్నేహ బంధాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. స్నేహితుల మధ్య ఉన్న సరదాలను, చిలిపి బంధాన్ని వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ పాట వినపడని ఫ్రెండ్షిప్ డే వేడుక అరుదే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే... అంటూ సాగే ఈ పాట నాటి యువ హీరోలు అబ్బాస్, వినీత్ల సాక్షిగా కోడె వయసు కుర్రకారు ఫ్రెండ్ షిప్కి ఇచ్చే విలువను కళ్లకు కడుతుంది.చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో...1989లో విడుదలైన చిన్నారి స్నేహం అనే సినిమాలోని ఈ పాట చదువు ముగించుకుని కెరీర్లు వెదుక్కుంటూ సాగిపోయే దశలో..వీడ్కోలు పలుకుతున్న స్నేహితుల భారమైన హృదయాలకు అద్దం పడుతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో.మనసైతే మళ్లీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏ నాటికి ఏదవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో.. అంటూ ఎవరెక్కడ ఉన్నా చిన్నారి స్నేహాన్ని మాత్రం చిర కాలం నిలుపుకోవాలని కాంక్షిస్తూ సాగే ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి హృద్యంగా రాయగా చక్రవర్తి అంతే హాౖయెన స్వరాలు సమకూర్చారు. చంద్రమోహన్, రఘు, సీత తదితరులు చిన్నారి స్నేహితులుగా మెప్పిస్తారు. -
సమంత-చైతూ పెళ్లి పీటలెక్కిన సినిమా.. థియేటర్లలో రిలీజ్
అక్కినేని ఫ్యామిలీ మూడు జనరేషన్స్ను కవర్ చేస్తూ వచ్చిన చిత్రం మనం. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సైతం నటించారు. సమంత హీరోయిన్గా మెప్పించిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. గతేడాది పదేళ్లు పూర్తి కావడంతో ఈ సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. దీంతో సమంత-నాగ చైతన్యను బిగ్ స్క్రీన్పై మరోసారి చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.తాజాగా అభిమానులకు సామ్-నాగ్ జంటను మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం వచ్చింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జపాన్లో విడుదల చేయనున్నట్లు నాగచైతన్య ట్వీట్ చేశారు. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రం మనం.. ఈ సినిమా జపాన్ ప్రజలకు చేరువవుతుండటం చాలా ఆనందంగా ఉందంటూ పోస్ట్ చేశారు. మనం ఆగస్టు 8న థియేటర్లలో విడుదల కానుందని చైతూ వెల్లడించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడియన్స్కు మరోసారి సామ్- చైతన్యను బిగ్ స్క్రీన్పై చూసే అవకాశం దక్కనుంది.అక్కినేని ఫ్యామిలీ నటించిన ఈ చిత్రం 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంలో అనుప్ రూబెన్స్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమాలోని పాటలు అప్పట్లో సూపర్ హిట్గా నిలిచాయి. ఎక్కడ చూసిన ‘మనం’ పాటలే వినిపించేవి. ఆ మెలోడీ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మార్మోగిపోతూనే ఉంటాయి.అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన సమంత- నాగ చైతన్య రియల్ లైఫ్లోనూ పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. గతేడాది డిసెంబర్లో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు. ప్రస్తుతం సమంత ఇప్పటి వరకు సింగిల్గానే ఉంటోంది. అయితే బాలీవుడ్ డైరెక్టర్తో రిలేషన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.Thrilled that #Manam a film very close to my heart is making its way to the people of Japan . The film will be releasing on the 8th August in theaters . #Anrliveson #50YearsOfAnnapurnastudios pic.twitter.com/3x6u3XlRVV— chaitanya akkineni (@chay_akkineni) August 3, 2025 -
బబ్లూ పృథ్వీరాజ్ సెకండ్ ఇన్నింగ్స్.. 60 ఏళ్ల వయసులోనూ ఫిట్గానే (ఫోటోలు)
-
తండేల్ సినిమాను తలపించేలా తెలుగు వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా?
తాజాగా కింగ్డమ్ మూవీతో అలరించిన సత్యదేవ్ మరో ఆసక్తికర కంటెంట్తో అభిమానుల ముందుకొస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్కు వీవీ సూర్యకుమార్ దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందిస్తోన్న ఈ సిరీస్ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఈ నేపథ్యంలోనే అరేబియా కడలి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య నటించిన తండేల్ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్ డ్రాప్లోనే ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్కు బందీలుగా దొరికిపోవడం.. ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్లో చూపించనున్నారు. ఈ సిరీస్లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు.ఇది కేవలం బ్రతకడం గురించి కాదు. మనుషులు కష్టాల్లో ఎలా ఒకరికొకరు అండగా నిలబడతారో చూపిస్తుందని దర్శకుడు సూర్య కుమార్ అన్నారు. సత్యదేవ్ కూడా తన కెరీర్లోనే ఇదొక ఛాలెంజింగ్ రోల్ అని పేర్కొన్నారు. నా కెరీర్లో అత్యంత సంతృప్తినిచ్చిన ప్రయాణాలలో ఒకటని సత్యదేవ్ అన్నారు. కష్టాలు, త్యాగాల మధ్య చిక్కుకున్న ఒక పాత్రను పోషించడం చాలా సవాల్తో కూడుకున్నదని చెప్పారు. ఇందులో చాలా ఎమోషన్స్ ఉన్నాయని,.. అన్యాయంపై పోరాడే మహిళగా నటించడం సంతృప్తినిచ్చిందని హీరోయిన్ ఆనంది తెలిపారు. -
'ఉదయం నుంచి నన్ను ఏడిపించేశారు'.. విజయ్ దేవరకొండ ఎమోషనల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యూఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కింగ్డమ్ మూవీ అంతా సక్సెస్ సంబురాల్లో మునిగిపోయింది. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు.మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే ఇదంతా సాధ్యమైందని విజయ్ దేవరకొండ అన్నారు. మీ సపోర్ట్తో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని తెలిపారు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేసి అన్నా... మనం కొట్టినాం అని ఎంతోమంది నన్ను ఏడిపించేశారని ఎమోషనలయ్యారు. మా మేనేజర్ అనురాగ్ సైతం ఏడ్చేశారు. ఈ సినిమా విజయంతో నాకు బిగ్ రిలీఫ్ దక్కింది. నా వెనుక మీరు ఎంతమంది ఉన్నారో చూస్తూనే ఉన్నా.. నా ఫ్యాన్స్ అందరి ప్రేమ, ఆదరణ వెలకట్టలేనిది అన్నారు. యూఎస్ ఫ్యాన్స్ను తప్పకుండా కలుస్తా.. ఆగస్టులో అమెరికాకు వస్తా అని విజయ్ దేవరకొండ వెల్లడించారు. -
నాతో ఒక్క సినిమా చేయమని డైరెక్టర్ను రిక్వెస్ట్ చేశా: సాయి ధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) విరూపాక్ష, బ్రో చిత్రాల తర్వాత గతేడాది మరో మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతోనే మెగా హీరో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాం సాయి ధరమ్ తేజ్ కెరీర్లో 18వ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రం ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.ఇక సినిమా సంగతి పక్కనపెడితే సాయి ధరమ్ తేజ్(సాయి దుర్గ తేజ్) తాజాగా ఓ ఈవెంట్కు హాజరయ్యారు. మయసభ పేరుతో వస్తోన్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో ఒక సినిమా చేయాలని మయసభ డైరెక్టర్ దేవా కట్టను రిక్వెస్ట్ చేశానని మెగా హీరో అన్నారు. తన బ్యాడ్ టైమ్లో నాతో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దేవాకట్టా మాత్రమేనని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. 'దాదాపు 10 ఏళ్ల క్రితమే నా జర్నీ దేవాకట్టాతో స్టార్ట్ అయింది. మేమిద్దరం జిమ్లో కలిసేవాళ్లం. సార్ నాతో ఒక సినిమా చేయండని రిక్వెస్ట్ చేసేవాడిని. అలా చేస్తే చివరికీ రిపబ్లిక్ మూవీతో జతకట్టాం. నా బ్యాడ్ టైమ్లో నాకు వెలుగునిచ్చిన వ్యక్తి దేవాగారు. రిపబ్లిక్ సినిమా టైమ్లో నేను ఏదైతే క్లైమాక్స్ కోరుకున్నానో అదే ముందుకు తీసుకెళ్లారు దేవా కట్టా' అని తెలిపారు.కాగా.. దేవా కట్ట డైరెక్షన్లో వస్తోన్న పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో కృష్ణమ నాయుడు, ఎంఎస్ రామిరెడ్డి పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది.A friendship tested by ambition.A rivalry that redefined leadership.A story that changed the fate of a state.#Mayasabha Trailer out now.#Mayasabha – A gripping political saga – Starts streaming from August 7th on @sonyliv@devakatta @AadhiOfficial @IamChaitanyarao pic.twitter.com/ZKMWVxqpei— Sony LIV (@SonyLIV) July 31, 2025


